The Supreme Court
-
‘ఆధార్ తప్పనిసరి’పై స్టే ఇవ్వలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేష న్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్ గుర్తింపు లేదన్న కారణంతో ప్రజలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతారంటూ పిటిషనర్ వ్యక్తం చేసిన సందేహం ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై జడ్జీలు జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘కేవలం మీ సందేహాలపైనే ఉత్తర్వులు జారీ చేయలేం. పథకాల ప్రయోజనాలు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే కోర్టు ముందుకు తీసుకురండి. సమస్య ఏంటో చెప్పండి’ అని పిటిషనర్లకు సూచించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఆధార్ లేకున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తదితర గుర్తింపు కార్డులతో పథకాల లబ్ధి పొందవచ్చని విన్నవించారు. ఆధార్ లేకుండా పథకాల లబ్ధి పొందేందుకు గడువును సెప్టెంబర్ 30కి పొడిగించినట్లు వివరించారు. -
తలాక్పై సుప్రీంకోర్టులో రెండోరోజూ విచారణ
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
-
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం
సుప్రీం కోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ చట్టబద్ధమేనని కొన్ని ఇస్లాం మత శాఖలు చెబుతున్నప్పటికీ అతి చెత్త విధానమని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం రెండో రోజు విచారణలో పేర్కొంది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ తలాక్ విధానంపై నిషేధం ఉన్న ఇస్లామిక్, ఇస్లామిక్యేతర దేశాల జాబితాను రూపొందించాలని ఆయనను కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ట్రిపుల్ తలాక్కు అనుమతి లేదని ఖుర్షీద్ తెలిపారు. తలాక్ బాధితుల తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తూ.. ఈ విధానం సమానత్వ హక్కుతోపాటు పలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. ‘ట్రిపుల్ తలాక్ చెప్పే అవకాశం భర్తకే ఉంది కానీ భార్యకు లేదు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించడమే. కాగా, ట్రిపుల్ తలాక్ మహిళల హక్కుల అంశమైనప్పటికీ.. సుప్రీం బెంచ్లో మహిళా జడ్జి లేకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం ప్రశ్నించారు. -
తగని నిర్ణయం తీసుకుంటే ‘సుప్రీం’కు
సీఓఏ నిర్ణయం న్యూఢిల్లీ: ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎమ్)లో బీసీసీఐ భారత క్రికెట్ భవిష్యత్తుకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంటే సుప్రీం కోర్టుకు వెళదామని పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దేశ క్రికెట్ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని... అలా కాకుండా ప్రతిష్టకు పోయి ఏకపక్షంగా మొండివైఖరి అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో సీఓఏ హెచ్చరించింది. ‘బిగ్–3’ ఫార్ములాకు వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరించడంతో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐలోని కొందరు పెద్దలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ముందే తెలపాలని సీఓఏ సూచించిన సంగతి తెలిసిందే. ఐసీసీతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిపోలేదని ఏదేమైనా చర్చల ద్వారా సాధించుకోవాలని సీఓఏ భావిస్తోంది. దీనిపై ఆ లేఖలో పాయింట్ల వారిగా పలు అంశాలను ప్రస్తావించింది. లేఖలోని 13వ పాయింట్లో ‘మొత్తం భారత క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలకు సీఓఏ మద్దతిస్తుంది’ అని స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం తమ ప్రతిష్టకు పోతే సహించమని... తప్పకుండా సుప్రీమ్ కోర్టును ఆశ్రయిస్తామని సీఓఏ హెచ్చరించింది. ఇందులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను కోరతామని చెప్పింది. ఆదాయ పంపిణీపై ఐసీసీతో వైరం కాకుండా ముందుగా చర్చల ద్వారా పరిష్కారానికే ప్రాధాన్యమివ్వాలని 10వ పాయింట్లో ఉదహరించింది. మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని సీఓఏ ఆ లేఖలో పేర్కొంది. ఎస్జీఎమ్లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా లోతైన కసరత్తు చేయాలని రాష్ట్ర సంఘాలకు సూచించింది. -
'రైతు ఆత్మహత్యలపై ఏం చేస్తారో చెప్పండి'
న్యూఢిల్లీ: అత్యంత తీవ్రమైన అంశంగా మారిన రైతు ఆత్మహత్యల నిరోధానికి ఏం చేస్తారో చెప్పాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా ఈ నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. రైతులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి, వాటిని నిరోధించడానికి ఒక పాలసీని తీసుకురావాలని సూచించారు. గుజరాత్లో రైతుల దీనిస్థితిపై ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన పాలసీని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే, కేవలం గుజరాత్ అనే కాకుండా ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం కావడంతో ఈ పిటిషన్ పరిధిని ధర్మాసనం విస్తరించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, అలాగే రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు వివరించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని తెలిపారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, కేంద్రం వాటికి తగిన సహకారం అందించాలని సూచించారు. అలాగే రైతు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను పరిష్కరించే విధానాలతో ముందుకు రావాలని ఆదేశించారు. -
స్పాన్సర్షిప్ కొనసాగించేది లేదు
స్టార్ ఇండియా గ్రూప్ స్పష్టీకరణ ముంబై: బీసీసీఐకి ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు.. ఐసీసీలో ఆధిపత్యం కోల్పోవడంతో పాటు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి సేన దారుణ పరాజయం తెలిసిందే. దీనికి జతగా ఇప్పుడు టీమిండియా జెర్సీ హక్కుల కోసం తాము బరిలో ఉండడం లేదని ప్రస్తుత స్పాన్సరర్ స్టార్ గ్రూప్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం బీసీసీఐ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, స్పష్టత కనిపించడం లేదని స్టార్ ఇండియా చైర్మన్ అండ్ సీఈవో ఉదయ్ శంకర్ అన్నారు. దేశవాళీ, గ్లోబల్ ప్రసార హక్కుల కోసం కూడా స్టార్ గ్రూప్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సహారా 12 ఏళ్ల ఒప్పందం తర్వాత 2013, డిసెంబర్లో భారత క్రికెట్ అధికారిక స్పాన్సరర్గా స్టార్ ఇండియా బిడ్ గెలుచుకుంది. దీంతో అప్పటి నుంచి ఆటగాళ్ల దుస్తులపై స్టార్ లోగో దర్శనమిస్తోంది. ఇందుకుగాను ద్వైపాక్షిక సిరీస్లో జరిగే మ్యాచ్కు దాదాపు రూ. 2 కోట్లు, ఐసీసీ టోర్నీల్లో రూ.61 లక్షలు బీసీసీఐకి ఇస్తోంది. ఈ నాలుగేళ్ల ఒప్పందం వచ్చే నెల మార్చి 31తో ముగుస్తుంది. కానీ మరోసారి టీమ్ స్పాన్సరర్ హక్కుల కోసం మాత్రం బరిలో ఉండే అవకాశం లేదని స్టార్ స్పష్టం చేసింది. ఈ దశలో టీమిండియాతో ముందుకెళ్లలేమని వివరించింది. -
ఇకపై చెల్లదు..
‘ప్రీయాక్టివేషన్’ దందాకు బ్రేక్! సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు సిమ్కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి ‘ప్రీ పెయిడ్’ పక్కాగా అమలుకు ఆదేశాలు కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన న్యాయస్థానం నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పోలీసు రికార్డుల్లోకి కొన్నే ఎక్కుతున్నా... బయటపడని ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. నేరగాళ్ళతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ఈ దందాకు ఇకపై చెక్ పడనుంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. – సాక్షి, సిటీబ్యూరో సినిమాపై మోజుతో సాయి, రవి, మోహన్ అనే యువకులు టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ఆ కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ఈ సిమ్కార్డులూ ఓ కారణమే. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. ఈ ముష్కరులు తమ కుట్రలు అమలు చేయడంలో భాగంగా సంప్రదింపులు జరుపుకునేందుకు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్నే ఆశ్రయించారు. ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్కార్డుల్ని చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్లెట్లో ఖరీదు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఫీల్డ్ వెరిఫికేషన్నూ పక్కాగా చేయాల్సిందే.. కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది పోలీసుల మాట. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చని చెప్తున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు వినియోగదారుడు అందించిన ఆధార్ కార్డ్ వివరాలు, పూర్వాపరాల ను తనిఖీ చేసే మెకానిజం ఆయా సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పా టు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్.. సెల్ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సిమ్కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్కార్డు విక్రయిస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద దాదాపు 100 నుంచి 150 సిమ్కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. నామ్కే వాస్తే చర్యలతో హడావుడి.. దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్డ్రైవ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగి, సెల్ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్లెట్స్లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రైవ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని మర్చిపోవడంతో అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనారోగ్యకర పోటీ నేపథ్యంలో.. సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో ఈ ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల దందా మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోకపోవడమేగాక, టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ–యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్త మవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏడాది గడువిచ్చిన సుప్రీం కోర్టు.. దేశంలో సిమ్కార్డుల దుర్వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మొబైల్ వినియోగదారులు గుర్తింపును కచ్చితంగా రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది. పోస్ట్ పెయిడ్తో పాటు ప్రధానంగా ప్రీ–పెయిడ్ కనెక్షన్లు ఇచ్చేందుకు, అవి కలిగి ఉన్న వారికి ఆధార్ నమోదు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. దుర్వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రీ–పెయిడ్ కనెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈలోపు తమ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ప్రీ–యాక్టివేషన్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. -
ఆటగాళ్ల ఖర్చులకు డబ్బులివ్వని బోర్డు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు... కానీ ప్రస్తుతం ఆటగాళ్ల రోజు ఖర్చులకు కూడా డబ్బులివ్వలేకపోతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీంకోర్టు తప్పించడంతో చెక్లపై సంతకాలు చేసేవారు లేకపోవడం... నోట్ల రద్దు వల్ల పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేయలేకపోవడం. దీంతో కుర్రాళ్లు తమ సొంత ఖర్చులతో మ్యాచ్లాడారు. ఈ జూనియర్ జట్టుకు కోచ్ అయిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సహా సహాయక సిబ్బంది అంతా వారివారి ఖర్చులతో సిరీస్ను నెట్టుకొచ్చారు. చివరకు నెగ్గుకొచ్చారు. నగదు, చెక్ చెల్లింపుల సమస్య నిజమేనని బీసీసీఐ అధికారులు అంగీకరించారు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఇక ఫాస్ట్ట్రాక్ విచారణ
సీజేఐ జేఎస్ ఖేహర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న దాదాపు 61వేల కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ మోడ్లో పనిచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. పలు అంశాలపై వేసిన వ్యాజ్యాలను తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు. ‘మేం ఫాస్ట్ట్రాక్లో పనిచేస్తాం. ఆందోళన వద్దు. ఏ వ్యాజ్యాన్నీ రద్దుచేసే ప్రసక్తే లేదు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల వాదనలు వినే ధర్మాసనాన్ని జస్టిస్ ఖేహర్ పునరుద్ధరించారు. ఈ సామాజిక న్యాయ బెంచ్ను మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2014లో స్థాపించారు. కాగా, ఈ ధర్మాసనానికి జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వం వహిస్తారు. ఈ బెంచ్ ప్రతి శుక్రవారం రెండు గంటలపాటు కూర్చుని.. ప్రజాపంపిణీ వ్యవస్థ మొదలుకుని కరువు పరిస్థితులు, కబేళాలు, రాత్రి ఆవాసాలు, ఆరోగ్యం, శుభ్రత, పిల్లల అక్రమ రవాణా వంటి కేసులను విచారించనుంది. -
మాకు సంబంధం లేని విషయం: విజయ్ గోయెల్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను సుప్రీం కోర్టు తొలగించడంపై స్పందించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ నిరాకరించారు. ఈ కేసులో తమకెలాంటి పాత్ర లేదని తేల్చారు. ‘సుప్రీం కోర్టు, బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్ అంశంలో క్రీడా శాఖ పాత్ర ఏమీ లేదు. ఈకేసులో మా భాగస్వామ్యం లేదు. లోధా కమిటీ నిర్ణయాలతోనూ మాకు సంబంధం లేదు. ఇక స్పందించడానికి ఏముంటుంది’ అని తేల్చారు. మరోవైపు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్ను మరింత మెరుగుపర్చేందుకు క్రీడా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. -
వెళ్లగొట్టారు...
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు ఠాకూర్, షిర్కేలను తప్పిస్తూ ఉత్తర్వులు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని ఫలితం అనర్హులైన ఇతర ఆఫీస్ బేరర్లూ ఇదే జాబితాలోకి! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీసీఐకి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన వాదప్రతివాదాలు, వాయిదాల అనంతరం సుప్రీం తన తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంతా హామీ పత్రం దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. చీఫ్ జస్టిస్ తీరథ్ సింగ్ (టీఎస్) ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పరిపాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటిస్తుంది. ఇందులో సభ్యుల కాగల అర్హత ఉన్నవారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్ నారిమన్లకు కోర్టు సూచించింది. అప్పటి వరకు మాత్రం బోర్డులో సీనియర్ ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే సీఈఓ హోదాలో రాహుల్ జోహ్రి ఇప్పటి కే రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల తర్వాత... 2013 ఐపీఎల్ సందర్భంగా బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్ రాజేంద్ర మల్ (ఆర్ఎం) లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది. ఏడాది తర్వాత 2016 జనవరిలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. చర్చోపచర్చలు, వాదనల తర్వాత గత ఏడాది జులై 18న లోధా సూచించిన వాటిలో ఎక్కువ భాగం ప్రతిపాదలను ఆమోదించిన సుప్రీం కోర్టు వీటిని పాటించాల్సిందంటూ బోర్డును ఆదేశించింది. అయితే ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ సమయం ఇచ్చినా కూడా బీసీసీఐ దీనిని పట్టించుకోలేదు. పైగా తమ రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోధా కమిటీకి తగిన విధంగా సహకరించలేదు. అధ్యక్షుడు ఠాకూర్ అయితే తన మాటలు, చేతల్లో లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. చివరకు ఈ పరిణామాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసేందుకు దారి తీశాయి. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమపై ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఠాకూర్, షిర్కేలను సుప్రీం ఆదేశించింది. నాకు ఇబ్బంది లేదు: షిర్కే సుప్రీం ఇచ్చిన తీర్పుతో కార్యదర్శి పదవిని కోల్పోవడాన్ని అజయ్ షిర్కే తేలిగ్గా తీసుకున్నారు. ‘దీనిపై ఏమని స్పందిస్తాం. నన్ను తప్పిస్తున్నట్లు సుప్రీం చెప్పింది కాబట్టి బోర్డులో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగత అనుబంధం లేదు. సభ్యులకు మద్దతుగా నిలబడాలి కాబట్టి సిఫారసులు అంగీకరించలేకపోయాం. అప్పట్లో పదవి ఖాళీగా ఉండి నా అవసరం ఉండటంతో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడానికి ఎలాంటి బాధా లేదు. నేను చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల వల్ల మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పరువు పోకూడదని కోరుకుంటున్నా’ అని షిర్కే అన్నారు. రిటైర్డ్ జడ్జీలకు బెస్టాఫ్ లక్! వ్యంగ్యంగా స్పందించిన ఠాకూర్ సుప్రీం కోర్టుతో నేరుగా తలపడే సాహసం చేసి తన పదవిని పోగొట్టుకున్న అనురాగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. తీర్పుపై స్పందిస్తూ ఆయన వ్యంగ్య రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ‘ఇది నా వ్యక్తిగత పోరు కాదు. ఒక క్రీడా సంఘం స్వతంత్రతకు సంబంధించిన అంశం. అందరు పౌరుల్లానే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. ఒకవేళ రిటైర్డ్ జడ్జీలు బీసీసీఐని సమర్థంగా నడిపిస్తారని సుప్రీం కోర్టు భావిస్తే వారికి బెస్టాఫ్ లక్ చెబుతున్నా. వారి నేతృత్వంలో భారత క్రికెట్ ఇంకా బాగుంటుందని నమ్ముతున్నా. సౌకర్యాలు, స్థాయి, క్రికెటర్లపరంగా చూసినా కూడా ప్రపంచంలోనే బీసీసీఐ అత్యుత్తమంగా నిర్వహించబడుతున్న సంస్థ’ అని ఠాకూర్ చెప్పారు. ► ‘నేను ఉత్తర్వుల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇకపై బోర్డు మళ్లీ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నా’ – బిషన్ సింగ్ బేడి ► ‘సుప్రీం ఉత్తర్వులను బోర్డు అమలు చేయని ఫలితాన్ని ఇప్పుడు ఠాకూర్, షిర్కే అనుభవిస్తున్నారు’ – జస్టిస్ ముకుల్ ముద్గల్ ►‘ముంబై క్రికెట్కు ఇదో విషాదకరమైన రోజు. ముంబై ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. 41 సార్లు రంజీ చాంపియన్గా నిలిచింది. ఇప్పుడు ఓటింగ్ హక్కు లేదనడం బాధాకరం’ – శరద్ పవార్ ► ‘సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. మేం పాటిం చాల్సిందే’ – నిరంజన్ షా -
బెల్టు మాటేంటి?!
గుడుంబా నిర్మూలనకు రంగంలోకి దిగిన అధికారులు అది జరిగినా బెల్టు దుకాణాలు ఉంటే ఫలితం సున్నా.. జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు వెయ్యికి పైగానే ఉన్నట్లు అంచనా హన్మకొండ : గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే మద్యం బెల్టు దుకాణాలు వరంగల్ రూరల్ జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జిల్లాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన అధికారులు బెల్టు షాపుల మాటెత్తకపోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దినా బెల్టు షాపులు కొనసాగితే అధికారుల కృషికి ఫలితం ఉండకపోవచ్చు. అధికారికంగా 57 వైన్స్.. మూడు బార్లు వరంగల్ రూరల్ జిల్లాలోని 15మండలాల్లో 57 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. అయితే, వీటికి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు మద్యం అమ్మే బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ప్రధాన దుకాణాలకు సమానంగా ‘బెల్టు’ వ్యాపారం కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని గ్రామాల్లోనైతే బెల్టు దుకాణం నడపడం కొందరికి ఉపాధిగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం మత్తు కారణంగా, గుడుంబా ప్రభావంతో వందలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. వివిధ గ్రామాల్లో మత్తుకు చిత్తై అనేక మంది మృతి చెందగా 80శాతం మంది వితంతువులే కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుడుంబా నిర్మూలనకు కమిటీలు మత్తు అనేక కుటుంబాలను చిత్తు చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో గుడుంబా, నల్లబెల్లాన్ని సమూలంగా నిర్మూలించి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24న జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్తో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న గుగుంబా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా తయారీ, రవాణా, అమ్మకందారులపై నిఘా పెట్టాలని ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. అలాగే, నల్లబెల్లం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, మహిళాసంఘాలు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లతో గ్రామాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. గుడుంబా, నల్లబెల్లం దొరికితే పీడీ చట్టం కింద కేసులు పెట్టడంతో పాటు, రూ.లక్ష వరకు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా గుడుంబాపై ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబరుతో పాటు ప్రత్యేక వాట్సాప్ నంబరును నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశంలో తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా... మద్యం షాపులకు సమాంతంగా నడుస్తున్న బెల్టు షాపుల నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యం దుకాణాల తరలింపు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు, బార్లను వచ్చే మార్చి 30లోగా 500మీటర్ల లోపలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించారు. దీంతో రహదారుల వెంట ఉన్న షాపుల యజమానులకు ఆబ్కారీ అధికారులు తాజాగా జిల్లాలోని 21దుకాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రహదారుల పక్కన ఉన్న ఈ దుకాణాలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్ ఆబ్కారీ సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే, ఎనిమిది కల్లు దుకాణాలను సైతం హైవేల పక్క నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా గుడుంబా రహిత జిల్లాగా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం బెల్టు షాపుల నిర్మూలన విషయమై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, దీనికి కూడా న్యాయస్థానాలే ఆదేశాలు జారీ చేయాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
రాజ్యాంగ బెంచ్కు నోట్ల రద్దు
► 9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం ► పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని తెలి పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత బెంచ్కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది. ‘24 వేల విత్డ్రా’ను నెరవేర్చండి బ్యాంకుల్లో వారానికి విత్డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది. హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే నోట్ల రద్దును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు
ఆదిలాబాద్ టౌన్ : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కా ర్యాయలం ఎదుట ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ట్రెడ్ యూ నియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెఎల్ఎం, జెపీఏ, జూని యర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని తెలిపారు. ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని అన్నారు. గతంలో కాంట్రాక్టు కార్మికులతో విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలని అన్నారు. సంఘం కన్వీనర్ గోపాల్రావు, డివిజన్ చైర్మన్ రాజేశ్వర్, డివిజన్ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో నర్సింగరావు, చంద్రశేఖర్, ప్రేమ్కుమార్, ప్రసాద్, బాపురావు, సుభాష్, అజయ్, రామకృష్ణ, రవి, నిశ్కాంత్ ఉన్నారు. వీరికి పలువురు సంఘీభావం ప్రకటించారు. -
‘సుప్రీం’ ఆదేశించినా స్పందించలేదు: సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందిచకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈనెల 8లోపు చెప్పాలని సుప్రీంకోర్టు.. శాసనసభ స్పీకర్ను ఆదేశించినట్లు తెలిపారు. అరుుతే ప్రభుత్వం మాత్రం సుప్రీం ఆదేశాలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు. రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఇది తెలియజేస్తోందని ఆరోపించారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
పైసా కూడా ఇవ్వొద్దు
రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నిధుల నిలిపివేత మ్యాచ్ల నిర్వహణకూ ఇవ్వరాదు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు ‘లోధా’ సిఫారసులు అమలు చేసే వరకు ఇదే పరిస్థితి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక స్వేచ్ఛకు దేశ అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. గతంలో రెండు పెద్ద అకౌంట్ల కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు... ఇప్పుడు నేరుగా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇచ్చే నిధులకే బ్రేక్ వేసింది. లోధా కమిటీ సిఫారసులు అమలు చేసే వరకు బీసీసీఐ ముందుకు వెళ్లలేని పరిస్థితి సృష్టించింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్న అత్యున్నత న్యాయ స్థానం ముందు ‘బలమైన’ బోర్డు ఇంకా ఎంత కాలం నిలవగలదో! న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం లోధా కమిటీ తమ రెండు అకౌంట్లను నిలిపివేసిన సమయంలో బీసీసీఐ తీవ్రంగా గగ్గోలు పెట్టింది. డబ్బులు లేకపోతే క్రికెట్ ఎలా, కివీస్తో సిరీస్ రద్దు చేస్తాం అంటూ బోర్డు బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. అరుుతే తాము రాష్ట్ర సంఘాల నిధులను ఆపలేదని చివరకు లోధా కమిటీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు దానిని నిజం చేసింది. లోధా కమిటీ సిఫారసుల అమలు అంగీకరించే వరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా బీసీసీఐ నిధులు ఇవ్వరాదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. బోర్డు అకౌంట్ల నుంచి రాష్ట్ర సంఘాలకు డబ్బులు బదిలీ కాకుండా నిలిపివేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న వాదోపవాదనల అనంతరం తమ తీర్పును రిజర్వ్లో ఉంచిన కోర్టు శుక్రవారం దానిని ప్రకటించింది. మ్యాచ్లు నిర్వహించడం కోసం కూడా నిధులు అందించరాదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. తాము లోధా కమిటీ సిఫారసలు అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అప్పటి వరకు నిధుల బదిలీకి అవకాశం ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను నవంబర్ 3లోగా లోధా కమిటీ ముందు హాజరై సిఫారసులు అమలు చేసేందుకు తమకు ఎంత సమయం కావాలో చెబుతూ హామీ పత్రం దాఖలు చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ అంశంలో డిసెంబర్ 5న తదుపరి విచారణ జరుగుతుంది. ఆ నిధులు వాడరాదు... లోధా సిఫారసుల చర్చలో భాగంగా రాష్ట్ర సంఘాలను తాము నియంత్రించలేమని, వారు ముందుకు రాకపోవడం వల్లే తామూ నిర్ణయం తీసుకోలేకపోతున్నామంటూ బీసీసీఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు అదే వాదనపై సుప్రీం దెబ్బ కొట్టింది. బోర్డు నుంచి నిధులు ఆపేయడం ద్వారా నేరుగా ఆయా సంఘాల ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. లోధా ప్రతిపాదనలు అమలు చేస్తేనే డబ్బులు వస్తారుు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర క్రికెట్ సంఘాలు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో నిలిచారుు. ఆయా సంఘాలు తాము సిఫారసులు అమలు చేస్తున్నామంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. మరోవైపు త్వరలో మ్యాచ్లు నిర్వహించాల్సి ఉన్న 13 సంఘాలకు ఇప్పటికే బోర్డు నిధులు చేరారుు. అరుుతే దీనిపై కూడా సుప్రీం ఆంక్షలు విధించింది. సంస్కరణల అమలుపై హామీ ఇచ్చే వరకు ఆ డబ్బును ఖర్చు చేయరాదని కూడా ఆదేశించింది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో మన జట్టు మ్యాచ్లు ఆడనుంది. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. స్వతంత్ర ఆడిటర్ నియామకం... మరోవైపు బీసీసీఐ వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలు, కాంట్రాక్ట్ల విషయంలో లోధా కమిటీకి సుప్రీం తగు సూచనలిచ్చింది. బోర్డు చేసుకునే కాంట్రాక్ట్ మొత్తాల విషయంలో ఏదైనా ఒక పరిమితి విధించాలని కోరింది. అంతకుమించి చేసే ఏ ఒప్పందమైనా కమిటీ ద్వారా మాత్రమే ఖరారు కావాలని చెప్పింది. ఈ నెల 25న ఐపీఎల్ ప్రసార హక్కులను బీసీసీఐ కేటారుుంచనుంది. ఈ నేపథ్యంలో ఆ భారీ ఒప్పందం విషయంలో బోర్డు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు అకౌంట్లను పర్యవేక్షించేందుకు కమిటీ స్వతంత్ర ఆడిటర్ను నియమించాలని కూడా సుప్రీం ఆదేశించింది. ‘జులై 18నాటి తమ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏమేం చేయాలో సుప్రీం కోర్టు అదంతా చేస్తోంది. దీనిని బీసీసీఐ ఎంత వరకు పాటిస్తుందో చూడాలి. అనురాగ్ ఠాకూర్ వచ్చి చర్చిస్తానంటే మేం అందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలోనూ ఆయనను ఆహ్వానించాం’ అని తాజా పరిణామాలపై జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం ఉత్తర్వుల వల్ల క్రికెట్పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేను. తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తాం. రాష్ట్ర సంఘాలతో ఈ అంశంపై చర్చించడం అన్నింటికంటే ముఖ్యం. సిఫారసుల అమలులో కొన్ని సమస్యలు ఉన్నారుు. వాటిని గతంలోనే కోర్టు ముందు ఉంచాం. -అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ అధ్యక్షుడు -
అమలు చేస్తారా? తప్పించమంటారా?
-
అమలు చేస్తారా? తప్పించమంటారా?
లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిందే లేదంటే బోర్డులో అందరినీ మార్చేస్తాం బీసీసీఐకి నేటి వరకు గడువు నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా ప్రతిపాదనల అమలులో జాప్యం చేస్తున్న బీసీసీఐపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర స్థారుులో విరుచుకుపడింది. ‘సంస్కరణలను అమలు చేస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా?’ అంటూ ప్రశ్నించింది. బేషరతుగా అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనంటూ బోర్డుకు నేటి (శుక్రవారం) వరకు గడువునిచ్చింది. ఎటూ తేల్చుకోకుంటే తామే తుది తీర్పునిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ వైఖరేమిటో కనుక్కోవాలని వారి కౌన్సిల్ కపిల్ సిబల్ను కోర్టు అడిగింది. అరుుతే వీటి అమలు కోసం ఆయన మరికొంత సమయం గడువు కోరినా కోర్టు తిరస్కరించింది. ‘అసలేం కావాలి మీకు? ప్రతిపాదనలు ఆమోదిస్తామని రేపటి కల్లా(శుక్రవారం) లిఖితపూర్వకంగా సమాధానమివ్వండి. లేకపోతే మేమే తుది తీర్పు ఇచ్చేస్తాం’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా హెచ్చరించారు. బీసీసీఐ నిర్లక్ష్య వైఖరిపై గత వారం లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై గురువారం కోర్టులో ఈ విచారణ జరిగింది. అందరినీ తొలగిస్తాం.. బోర్డు ప్రక్షాళన కోసం లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని బీసీసీఐకి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అందుకే తమ అభ్యంతరాలపై కోర్టులో మరోసారి వాదనలను వినిపించింది. అరుుతే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది. ఎట్టిపరిస్థితిల్లోనూ సంస్కరణలను నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గాన్ని, అధికారులందరినీ మార్చి బోర్డు నిర్వహణకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కానీ తమిళనాడు సొసైటీల చట్టం ప్రకారం బీసీసీఐ నమోదైందని, దీని ప్రకారం వీటిని అమలు చేయాలంటే అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుందని సిబల్ వాదించారు. దీనికి జస్టిస్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ‘అసలు అన్ని సంఘాలను బీసీసీఐయే నడిపిస్తోంది. అదే ఇప్పుడు లోధా ప్రతిపాదనలకు అడ్డంకులను సృష్టిస్తోంది. వ్యతిరేకించే సంఘాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపేయండి లేదా నిషేధించండి. అంతేకానీ మా సమయాన్ని వృథా చేయకండి. మెజారిటీయే అవసరమని మీరు భావిస్తే అమలు కోసం మేం ఆదేశాలు జారీ చేస్తాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనూ కెప్టెన్నే... బీసీసీఐ ఆఫీస్ బేరర్ల అర్హత గురించి వచ్చిన చర్చ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ క్రికెటర్ అరుుతే తాను కూడా క్రికెటర్నే అన్నారు. ‘బోర్డుకు ఎన్నికయ్యే ఆఫీస్ బేరర్లకు ఏమైనా ప్రత్యేక అర్హత ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడు రాజకీయ నాయకుడు కదా?’ అని కపిల్ సిబల్ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అరుుతే అనురాగ్ ఠాకూర్ సీరియస్ క్రికెటర్ అని కపిల్ రెట్టించి చెప్పడంతో తానూ సుప్రీం కోర్టు జడ్జిల జట్టుకు కెప్టెన్నే అని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. -
న్యాయమూర్తులకు ఆమాత్రం తెలియదా..!
బెంగళూరు : ‘కర్ణాటకలో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఏడాదికి మూడు పంటలు పండించుకునే పరిస్థితుల్లో ఉన్న తమిళనాడుకు తాగడానికి నీరు లేదని చెబుతున్నారంటే న్యాయమూర్తులకు అసలే మాత్రమైనా తెలుసా అన్న అనుమానం కలుగుతోంది’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి న దీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు అన్యాయం జరిగింది. అయితే ఆవేశపూరితంగా, హింసాత్మకంగా నిరసనను తెలియజేయడం సరికాదు. నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కర్ణాటక తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్ను ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడం వల్ల వచ్చే లాభం ఏదీ ఉండదు. ఫాలి నారిమన్కు కావేరి వివాదానికి సంబంధించిన పూర్తి విషయాలపై అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను కాదని మరో వ్యక్తిని నియమిస్తే సమస్య మరింత ఆలస్యమవుతుంది’ అని దేవెగౌడ వివ రించారు. కార్యక్రమంలో జేడీఎస్ ఎంపీ సి.ఎస్.పుట్టరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే
⇒భగ్గుమన్న కర్ణాటక ⇒మండ్య బంద్ విజయవంతం ⇒కేఆర్ఎస్ వద్ద నిషేధాజ్ఞలు ⇒ బెంగళూరు-మైసూరు, ⇒బెంగళూరు-చెన్నై బస్ సర్వీసులు నిలిపివేత = 9న కర్ణాటక బంద్కు పిలుపు బెంగళూరు: కావేరి నదీ జలాల వివాదం మరో సారి రాష్ట్రంలో భగ్గుమంది. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య పీఠం విచారణను జరిపింది. ఇక సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలను విన్న ధర్మాసనం రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడులో తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అందువల్ల, కావేరి నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మండ్య, మైసూరు, హాసన్, హుబ్లీ, తుమకూరు, చామరాజన గర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు కర్ణాటకలోని రైతుల పాలిట మరణశాసన మంటూ మండిపడ్డాయి. ఇక మండ్య ప్రాంతంలోని వివిధ కన్నడ సంఘాలు మంగళవారం మండ్య బంద్ నిర్వహించాయి. ఈ బంద్లో కన్నడ సంఘాలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన డంతో బంద్ విజయవంతమైంది. మంగళవారం ఉదయం నుంచే మండ్య నగరంలోని రోడ్ల పైకి చేరుకున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండ్య ప్రాంతంలో ఎమ్మెల్యే అంబరీష్ కటౌట్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇదే సందర్భంలో మండ్య మాజీ ఎంపీ రమ్యపై సైతం నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మండ్య రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం శోచనీయమంటూ నిరసనకారులు నినదించారు. ఇక ఇదే సందర్భంలో మండ్యలో నిరసనలు తీవ్రమవడంతో పాటు బంద్ పాటించిన నేపథ్యంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాల్సిన బస్ సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఇదే సందర్భంలో బెంగళూరు-చెన్నై సర్వీసులను కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఎస్ఆర్టీసీ రద్దు చేసింది. అంతేకాక తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చే సర్వీసులను తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ రద్దు చేయడంతో బెంగళూరు నుంచి చెన్నైతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రత... ఇక బెంగళూరులోని వివిధ కన్నడ సంఘాలు విధానసౌధ వద్ద నిరసన కార్యక్రమాలకు దిగుతున్న నేపథ్యంలో విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విధానసౌధ వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 80 మంది కానిస్టేబుళ్లతో పాటు అదనపు బలగాలను విధానసౌధ భద్రత కోసం మోహరించారు. ఇక సీఎం అధికారిక నివాసం ‘కావేరి’ని సైతం కర్ణాటక రక్షణా వేదిక (కరవే) మహిళా కార్యకర్తలు ముట్టడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయరాదంటూ నినదించారు. సీఎం నివాసం ఎదుట ధర్నాకు దిగిన వారికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న కర్ణాటక బంద్... సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కన్నడ సంఘాలన్నీ బంద్ నిర్వహించ తలపెట్టాయి. ఈనెల 9న కర్ణాటక బంద్కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్నడ ఒక్కూటతో పాటు దాదాపు 800కు పైగా కన్నడ సంఘాలు బంద్లో పాల్గొననున్నాయి. ఇక ఈ బంద్కు రాష్ట్రంలోని వివిధ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఈ బంద్కు మద్దతు తెలపనున్నాయి. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో తమిళ చిత్రాల ప్రదర్శనను సైతం రద్దు చేశారు. కేఆర్ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు... కావేరి నదీ జలాల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృష్ణరాజసాగర రిజర్వాయర్ (కేఆర్ఎస్) వద్ద నిషేధాజ్ఞలను జారీ చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే కేఆర్ఎస్ను ముట్టడిస్తామంటూ కన్నడ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో మండ్య జిల్లా అధికారులు కేఆర్ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
‘వేలూరు కోట’పై కోర్టుకు వెళ్తాం: ఒవైసీ
వేలూరు (తమిళనాడు): వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. వేలూరులో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కోటలో ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ముస్లింలకు 7 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో పోటీ చేసి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
సుప్రీం కోర్టుకు వెళతాం: అసదుద్దీన్
తమిళనాడు వేలూరు కోటలోని మసీదులో ప్రార్థనలు చేసే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ తెలిపారు. వేలూరులోని మండీ వీధిలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వేలూరు కోటలో పలు సంవత్సరాలుగా ముస్లింలు ప్రార్థన చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని వీటిపై సుప్రీంకోర్టులో కేసు వేసి ముస్లింలకు న్యాయం చేస్తామన్నారు. ముస్లింలు రాజకీయ అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఏకమై పోరాటాలు చేస్తే రిజర్వేషన్ను తప్పక సాధించవచ్చన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు ఎంఐఎం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోను పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు లేక పోవడంతో అన్ని విభాగాల్లో వెనుకబడి పోతున్నారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్పై మసూదా ఇచ్చామని అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ మాట్లాడుతూ డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో నేటికి కాలయాపన జరుగుతోందని వీటిపై ముగింపు చర్యలు చేపట్టాలన్నారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ కార్యదర్శులు సయ్యద్ సవాలుద్దీన్, ఇంతియాస్, ముహమద్ షరీఫ్, కోశాధికారి మసుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ముహ్మద్ అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు. -
వీసీ సాంబయ్యకు మరో నెల ఊరట
తెయూ(డిచ్పల్లి) : సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యకు మరో నెల ఊరట లభించినట్లయింది. గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వీసీ లను నియమించింది. ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అదే నెల 27న హైకోర్టు వీసీ ల నియామకాన్ని కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వ వినతి మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం తెలంగాణలో వీసీ ల నియామకంలో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు తీర్పును మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఒక వేళ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినట్లయితే తెయూ వీసీ సాంబయ్యతో పాటు మిగిలిన యూనివర్సిటీల వీసీ తమ పదవులను కోల్పోయేవారు. -
చెన్నమనేని పౌరసత్వంపై తేల్చండి: సుప్రీం
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు నిర్ధారిస్తూ హైకోర్టుకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఈ కేసును విచారణ చేపడుతుందని పేర్కొంది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్తో కూడిన ధర్మాసనం ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారించింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో మళ్లీ వేములవాడ నుంచి గెలుపొందారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ను తొలగించాలని ఆది శ్రీనివాస్ను దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. గురువారం తుది విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్రం చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై మూడు నెలల్లో తేల్చాలని, ఆ నివేదికన హైకోర్టుకు సమర్పించాలని, హైకోర్టు విచారణ చేపడుతుందని ఆదేశాలు జారీచేసింది. -
'జీవో 123పై అప్పీల్ చేస్తే మేమూ ఇంప్లీడ్'
రాష్ర్టప్రభుత్వం జీవో 123 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూసేకరణ జీవోను కొట్టేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఆ తీర్పుపై అప్పీల్ చేస్తామని మంత్రి హరీష్రావు చెబుతున్నారన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రి హరీష్రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించడం, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. అయినా పేదలకు తాము వ్యతిరేకమన్న విధంగా ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదన్నారు. -
బహిష్కరించినా విప్కు కట్టుబడాల్సిందే
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తన తీర్పు పునస్సమీక్షకు నో అమర్సింగ్, జయప్రదల పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ విప్కు కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పటికీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2010 ఫిబ్రవరి 2న రాజ్యసభ సభ్యుడైన అమర్సింగ్ను, లోక్సభ ఎంపీ అయిన జయప్రదను సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. 2012లో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి ప్యారీమోహన్ మహాపాత్ర బహిష్కరణకు గురయ్యారు. వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996 నాటి తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్.. పిటిషనర్ల పదవీకాలం ముగిసిందని, దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నామని, ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబివ్వకపోవడమే సరైనదని పేర్కొంది. ఆ పిటిషన్లు ఇప్పుడు వ్యర్థమంటూ తోసిపుచ్చింది. అంతకుముందు జయప్రద, అమర్ల లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 1996 నాటి జి.విశ్వనాథన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని, తాము పార్టీకి రాజీనామా చేయలేదని, సొంత పార్టీ పెట్టుకోలేదని తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన వారికి లేదా పార్టీలో ఉండి విప్ను ధిక్కరించిన వారికే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పార్టీయే తమను బహిష్కరించింది కనుక ఏ పార్టీకీ చెందని సభ్యులుగా ఉంటామని, అందువల్ల పార్టీ విప్కు కట్టుబడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు కేంద్రం ఒక పార్టీ నుంచి ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ నియంత్రణలోనే ఉంటారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఢిల్లీలో అమల్లోకి డీజిల్ క్యాబ్ల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీలో డీజిల్ క్యాబ్లపై ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి రావడంతో 27 వేల వాహనాలు రోడ్డెక్కలేదు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదివారం కావడంతో నిషేధం వల్ల ప్రజా రవాణాకు పెద్ద ఇబ్బంది లేకపోయినా... నేటి నుంచి క్యాబ్ల కొరత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా ఉబర్ క్యాబ్స్ చార్జీల్ని ఒక్కసారిగా పెంచేసింది. డీజిల్తో నడిచే క్యాబ్లను సీఎన్జీకి మార్చేందుకు గడువు పెంచాలన్న విజ్ఞప్తిని శనివారం సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో 2 వేల ట్యాక్సీల్ని డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చారు. -
యడ్డి కేసులపై ‘సుప్రీం’కు వెళ్తాం
బెంగళూరు: బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల విషయమై న్యాయవాది జోసెఫ్ అరిస్టాటిల్ వాదించనున్నారన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని యడ్యూరప్పపై ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జయచంద్ర తెలిపారు. -
‘దారి’లో ‘దేవుడు’!
నగరంలో నడిరోడ్డుపై పలు ప్రార్థనా స్థలాలు అత్యధికం అనధికారికంగానే నిర్మితం తొలగింపులో అడుగడుగునా అడ్డంకులు సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు ‘బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థనా మందిరాలను తొలగిం చడమో... మరో ప్రదేశానికి తరలించడమో చేయాలి. రెండు వారాల్లో చర్యలు తీసుకోని పక్షంలో స్వయం గా కోర్టుకు హాజరుకావాల్సిదిగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది.’ - జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం చేసిన వ్యాఖ్యలివి. సిటీబ్యూరో: రాజధాని సైతం ఈ తరహా ప్రార్థనామందిరాలకు ఏమాత్రం అతీతం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి అడుగడుగునా ట్రాఫిక్ అడ్డంకుల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ‘మెట్రో’ పనులతో పలు కీలక ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. సమస్య పరిష్కారానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా, పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. నగర ట్రాఫిక్ విభాగం గణాంకాల ప్రకారం నగరంలో ఈ తర హా ప్రార్థనా స్థలాలు 253 వరకు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో స్మశానాలు అడ్డంకులుగా మారుతున్నాయి. ఫలక్నుమలో అత్యధికం ట్రాఫిక్ కమిషనరేట్లోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 253 ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలు ఉండగా వాటిలో అత్యధికం ఫలక్నుమలోనే ఉన్నాయి. ఇక్కడ గరిష్టంగా 43 కొలువైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. చార్మినార్ పరిధిలో అతి తక్కువ ప్రార్థనాస్థలాలు ఉన్నాయి. కాగా ఇక్కడ కేవలం ఒకే ప్రార్థనా స్థలం ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఉంది. ఈ అక్రమ ప్రార్థనాస్థలాల్లో మసీదులు, చిల్లాలు, దర్గాలు 129, దేవాలయాలు 117, చర్చీలు 7 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు తొలగింపు ప్రహసనమే... అనేక సందర్భాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రార్థనా స్థలాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలోని పరిస్థితుల నేపథ్యంలో దీనిని అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సి వస్తోంది. గతంలో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దర్గాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫలితంగా వీటి విషయంపై మాట్లాడటానికే సంబంధిత అధికారులు పలుమార్లు ఆలోచించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఈ కోణంలో అడుగు వేయాలని ప్రయత్నించినా... అనేక రాజకీయాలు అడ్డం తగులుతున్నాయి. అంతా కలిసి ముందువెళితేనే... ఎన్నో ఏళ్లుగా నగరాన్ని వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, అరుణాచల్ప్రదేశ్ తరహాలో భాగ్యనగరాన్నీ తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, శాఖల అధికారులతో పాటు రాజకీయ వర్గాలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయంలో తరచూ ఎదురవుతున్న వాదన ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాధారణ సమయాల్లో కంటే పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ‘మెట్రో’ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది. ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘పీస్’ కమిటీల తరహా లోనే వివిధ వర్గాల పెద్దలతో కూడిన ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారుల, భిన్న వర్గాలకు చెందిన పెద్దలు, వ్యాపార యూనియన్ లీడర్లతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పా టు చేసుకుని సదరు ప్రార్థనా స్థలం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూ ర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు మార్చేందుకు అందరినీ ఒప్పించగలిగితే ఈ సమస్య తీరుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. -
మా వాటా పోస్టుల భర్తీకి మేం సిద్ధం
గ్రూప్-1 పెండింగ్ కేసుపై ఏపీ నిర్ణయం తెలిపేందుకు రెండు వారాల గడువు కోరిన తెలంగాణ మే 3కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించడంపై తమ వైఖరిని తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు తమకు రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించగా అందుకు సమ్మతిస్తూ మే మూడో తేదీకి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించడం లేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను, ఇదివరకే మౌఖిక పరీక్షలు కూడా పూర్తయినందున ఫలితాలు ప్రకటించాలని దాఖలైన ఇతర పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కూడా విచారించింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్ష పునర్ నిర్వహణపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కోరింది. సోమవారం ఈ విషయాన్ని మరోసారి ధర్మాసనం ప్రస్తావించగా పరీక్షల నిర్వహణపై తమ వైఖరి వెల్లడించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చిన ఖాళీలను భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ న్యాయస్థానానికి నివేదించారు. పూర్తి స్థాయి వాదనలు వినాలి ఏపీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసుకుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పునర్ నిర్వహణకు ఉమ్మడి సర్వీసు కమిషన్ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడిన ధర్మాసనం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సిలబస్లో వచ్చిన మార్పులపై ఆరా తీసింది. ‘రాష్ట్ర విభజన అనంతరం గ్రూప్-1 పరీక్షలో సిలబస్తో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సైతం పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉంది..’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. విచారణను మే 3వ తేదీకి వాయిదా వేశారు. 2011లో ఏపీపీఎస్సీ 312 ఖాళీలను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో తప్పులు దొర్లిన అంశంపై అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం పెండింగ్లో ఉండటంతో అభ్యర్థులు తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు. -
‘నీట్’ పరీక్షపై విచారణ వాయిదా
వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం జాతీయ వైద్యమండలి ప్రతిపాదించిన నీట్ పరీక్షపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. మార్చి 31 నాటికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘానికి నిర్ధేశించింది. తదుపరి నాలుగు రోజుల్లో ప్రతిస్పందనలు ఇవ్వాలని జాతీయ వైద్య మండలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
రాజ్యాంగం తల్లితో సమానం
సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాలగౌడు అట్టహాసంగా ఐలు రాష్ట్ర 10వ మహాసభలు ప్రారంభం కర్నూలు(లీగల్): భారత రాజ్యాంగం ప్రజలకు తల్లితో సమానమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడు అన్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర 10వ మహాసభలు శనివారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ప్రారంభమయ్యాయి. ఐలు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు రిజర్వేషన్లలో 33 శాతం మాత్రమే కల్పించడం సమంజసమా? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు మానవతా విలువలు, నీతి, న్యాయం, సామాజిక స్పృహతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, మైనార్టీ ప్రజలు అనే తేడా ఉండదని, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేలా ఉండాలన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చట్టాలు న్యాయపాలన అనే అంశంపై జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి సెమినార్లతో ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం జూనియర్లకు కలుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత మాట్లాడుతూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే సమయంలో ఐలు నిర్వహించిన శిక్షణ శిబిరం తాను న్యాయమూర్తిగా ఎంపిక అయ్యేందుకు దోహదపడిందన్నారు. ఏపీ రాష్ట్ర ఐలు అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాద సమస్యలు, సంక్షేమంతో పాటు వృత్తి పరిరక్షణకై సంఘం నిరంతరం కృషి చేసుందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసే విధంగా న్యాయమూర్తులు కృషి చేయాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు న్యాయవాదులకు నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐలు జాతీయ అధ్యక్షులు బట్టాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, కర్ణాటక, తెలంగాణ ఐలు నాయకులు నారాయణస్వామి, కోటేశ్వరరావు, కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, జిల్లా జడ్జిలు ప్రేమావతి, రఘురామ్, శేషుబాబు, కె.సుధాకర్, సబ్ జడ్జిలు సోమశేఖర్, శివకుమార్, గాయత్రిదేవి, జూనియర్ సివిల్ జడ్జిలు రామచంద్రుడు, బాబు, స్వప్నారాణి, పి.రాజు, జిల్లా ఐలు నాయకులు పి.వెంకటస్వామి, పి.నిర్మల, కె.కుమార్, రవి, లక్ష్మణ్, తిరుపతమ్మ, న్యాయ వాదులు పాల్గొన్నారు. -
నేడు బీసీసీఐ ఎస్జీఎం
జస్టిస్ లోధా కమిటీ నివేదికపై చర్చ ముంబై: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) శుక్రవారం జరగనుంది. కమిటీ నివేదికను అమలు చేసే విషయంలో స్పష్టతనిచ్చేందుకు మార్చి 3 వరకు సుప్రీం కోర్టు బోర్డుకు గడువునిచ్చింది. బీసీసీఐలోని అధికారుల గరిష్ట వయస్సు 70 ఏళ్లు, ఒక రాష్ట్రానికి ఒక ఓటుతో పాటు ఆఫీస్ బేరర్లుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచాలని కమిటీ కీలక ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. ఈ నెలారంభంలో తమ న్యాయ కమిటీ సమావేశం అనంతరం బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఎస్జీఎం ఏర్పాటుకు నిర్ణయించారు. దీంట్లోని కొన్ని సూచనలు అమలుకు సాధ్యం కాకుండా ఉన్నాయని, ఇందుకోసం నిపుణుల అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. మరోవైపు ఐసీసీ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఎస్జీఎంలో చర్చించనున్నారు. శ్రీనివాసన్ హయాంలో మూడు దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్)కు ఇచ్చిన సూపర్ పవర్ను ప్రస్తుత ఐసీసీ చైర్మన్గా ఉన్న శశాంక్ తొలగించారు. న్యాయ సలహా తీసుకుంటా..: హర్భజన్ వివిధ రాష్ట్ర జట్లకు ‘భజ్జీ స్పోర్ట్స్’ పేరిట కిట్స్ను సరఫరా చేస్తున్న హర్భజన్ పరస్పర విరుద్ధ ప్రయోజాలనాలకు పాల్పడుతున్నట్టు బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ ఏపీ షా తేల్చడంపై న్యాయ సలహా తీసుకుంటానని స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘బోర్డు నుంచి ఈ విషయంలో ఈమెయిల్ అందింది. మా న్యాయ సలహాదారునితో అన్ని విషయాలను చర్చించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తా’ అని హర్భజన్ తెలిపాడు. సామాజిక కార్యకర్త నీరజ్ గుండే లేవనెత్తిన అంశాలపై షా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కంపెనీ భజ్జీ తల్లి అవతార్ కౌర్ పేరిట నడుస్తోంది. -
దేశం మార్కు... అతిక్రమణ!
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన రహదారుల మధ్యలో పైలాన్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యం చిలకలూరిపేటలో అధికారుల అత్యుత్సాహం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఆరాటంలో జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నెల 18న చిలకలూరిపేట నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరుకానున్న సీఎంను మరింత సంతృప్తి పరిచేందుకు అనుమతులు లేని ఆర్భాటాలకు తెరతీశారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, పైలాన్ల నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి, హడావుడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’అనే రీతిలో ఇద్దరి ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హడావుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులను కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తులుగా మార్చేస్తున్నారు. వివరాలు ఇవి.... 2012లో సుప్రీం తీర్పు .....రహదారులు, కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, ఇతర కట్టడాల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని 2006 లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రహదారులు, కూడలి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్ని ప్రభుత్వశాఖలకు 2013 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదారులు, కూడలి ప్రాంతాలు, పేవ్మెంట్లకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల్లోని అంశాలను జిల్లా స్థాయి అధికారులకు అందే విధంగా చేయడంతోపాటు వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడిలా.... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మించనున్న గృహ సముదాయంతో పాటు రూ. 10 కోట్లతో టౌన్హాలు, రూ.11 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 143 కోట్లతో అమృత పథకం కింద మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన, రూ. 4 కోట్లతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేస్తారు. రూ. 2 కోట్లతో నిర్మించిన అర్బన్ మోడల్ పోలీస్స్టేషన్ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు పైలాన్లు నిర్మిస్తున్నారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో వీటిని నిర్మించరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు. మూడు సెంటర్లలో అధికారులు భారీ ఎత్తున పైలాన్లను నిర్మిస్తున్నారు. నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో ఒకటి, ఎన్ఆర్టీ సెంటర్ (అమృత్ పథకం తాలూకు)లో, పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్(స్వచ్ఛాంధ్ర పథకం తాలుకు)లో పైలాన్లు నిర్మిస్తున్నారు. ఈ మూడింటిలో రెండు పైలాన్లు జాతీయ రహదారుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులనుఅధికారులుధిక్కరించారనేవిమర్శలుబాహాటంగావినపడుతున్నాయి. ఆర్భాటపు పైలాన్లు .... ప్రతి పనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మూడు పైలాన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించకుండా ఒక్కోదానిపై రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్లు ఆహ్వానించాలనే నిబంధన ఉన్నప్పటికీ, నామినేషన్ పద్ధతిపై పైలాన్ నిర్మాణాలను ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. -
మళ్లీ వస్తా!
పై స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం ఆయన హయాంలో పలు అవినీతి ఆరోపణలు కొత్త అధికారి వస్తే బయటపడుతుందేమోనని ఆందోళన సిబ్బంది నోరు మెదపకుండా ముందస్తు జాగ్రత్త కర్నూలు: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో గతంలో పనిచేసిన అధికారి వ్యవహారం హాట్టాపిక్గా మారింది. మళ్లీ ఎస్ఎస్ఏ అధికారిగా తానే వస్తానంటూ అక్కడి ఉద్యోగుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇందుకోసం తనకు పైస్థాయిలో ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన అధికారి మొదట్లో విధుల్లో చేరకుండా అడ్డుకోగలిగానని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుండటం చర్చకు దారితీస్తోంది. రెండు నెలల్లోగా తానే మళ్లీ అధికారిగా వస్తానని ఆయన నిర్దిష్ట సమయాన్ని కూడా చెబుతుండటం దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఎస్ఎస్ఏ వ్యవహారాలపై ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది . అన్నీ ఆరోపణలే.. వాస్తవానికి ఎస్ఎస్ఏ వ్యవహారంలో మొదటి నుంచీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పుణ్యమా అని 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇందుకు కారణం 2014-15లో కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేయకపోవడమే. దీంతో పాటుగా జిల్లాలో పాఠశాలన్నింటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ అధికారులు నివేదించారు. అదేవిధంగా కేవలం ఈ విద్యా సంవత్సరంలో 700 పైచిలుకు పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు కూడా చూపించారు. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించిన సందర్భంలోనూ ఇదే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారి రావడంతో తాను చేసిన మొత్తం వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న అనుమానం గతంలో పనిచేసిన అధికారికి కలుగుతోందని సమాచారం. -
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
పరిగి: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఐ నగేష్తో కలిసి శనివారం ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన చోదకులకు జరిమానా విధించారు. హెల్మెట్ వాడకం, టూ వీలర్ ప్రమాదాల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించ డంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రమాదాలను నివారించే చర్యలపై దృష్టి సారించాలని ఆర్టీఏ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ శాఖ అధికారులు హెల్మెట్ వాడకాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో టూ వీలర్లు ఢీకొని, జారి కిందపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా మారాయని.. ఇందులో కేవలం హెల్మెట్ లేని కారణంగానే 90 శాతం మృత్యు ఒడికి చేరుతున్నారని అన్నారు. ఇప్పటివరకు 70 శాతం మంది హెల్మెట్లు కొంటున్నా వారిలో 10 శాతం మంది కూడా వాడడం లేదని ఆయన వివరించారు. హెల్మెట్ల వాడకంపై అందరూ సహకరించాలన్నారు. ప్రధానంగా హెల్మెట్లు వాడటం, లెసైన్సు కలిగి ఉండడం, ఇన్సూరెన్సు చేయించుకోవటం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. -
కరువు రాష్ట్రాల్లో ‘సంక్షేమం’పై నివేదికివ్వండి
కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కరువు అలముకున్న రాష్ట్రాల్లో ఏమేం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వర్షపాతాల నమోదుపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ లోకూర్, ఆర్కే అగర్వాల్తో కూడిన బెంచ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సోమవారం సూచించింది. 22వ తేదీలోపు నివేదికలివ్వాలంది. కరువు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, యూపీ, ఎంపీ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, బిహార్, హరియాణా, గుజరాత్, మహారాష్ర్ట, ఛత్తీస్గఢ్ల్లో బాధితులను ఆదుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు స్పందించింది. ఎన్నికల సర్వేలు నిర్వహించే యోగేంద్ర యాదవ్ తదితరుల ఆధ్వర్యంలోని ‘స్వరాజ్ అభియాన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ వేసింది. వారి తరుఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ... కరువు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపాయన్నారు. ఎంతో మంది మరణించారని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 24 ఉల్లంఘనే అవుతుందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్ మినహా మరే కరువు బాధిత రాష్ట్రాలూ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీఎల్-బీపీఎల్ల మధ్య వ్యత్యాసం ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నడిపిస్తున్నాయని, ఈ విధానం వల్ల ఉపయోగం లేదని పరిశోధనల్లో తేలిందన్నారు. ‘ఎన్ఎఫ్ఎస్ఏ’ను అమలు చేయడం వల్ల బిహార్, మధ్యప్రదేశ్ల్లో సత్ఫలితాలు వచ్చాయని ప్రశాంత్భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు... బాధితులు, బాధిత ప్రాంతాల్లో కనీసం అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలపాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ను అడిగారు. రంజిత్కుమార్ వివరణనిస్తూ... రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల సహాయ నిధిల నుంచి ఆర్థిక సాయం అందించామన్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఎంపీ, మహారాష్ట్రలకు వరుసగా రూ.1,500 కోట్లు, రూ.1,276 కోట్లు, రూ.2,032 కోట్లు, రూ.3,044 కోట్లు మంజూరు చేశామన్నారు. 2015-20 కాలానికి మొత్తం రూ.61,291 కోట్లు సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు. -
బీసీసీఐ సమూల ప్రక్షాళన
♦ బీసీసీఐలో మార్పులకు లోధా కమిటీ ప్రతిపాదనలు ♦ సుప్రీం కోర్టు చేతుల్లో తుది నిర్ణయం ♦ అమల్లోకి వస్తే ప్రస్తుత పెద్దలంతా అవుట్ భారత క్రికెట్ నియంత్రణ మండలి పుట్టిన దగ్గరినుంచి నియంత్రణ లేకుండా సాగుతున్న పరిపాలనకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందా... తాము ‘ఆడించిందే’ ఆట అన్నట్లుగా బోర్డులో సుదీర్ఘంగా పాతుకుపోయిన పెద్దలకు చెక్ చెప్పే సమయం ఆసన్నమైందా... మేం రాసుకుందే రాజ్యాంగం, ప్రభుత్వానికి కూడా మేం జవాబుదారీ కాదు అన్నట్లుగా వ్యవహరించే క్రికెట్ అడ్డా... ఇకపై అడ్డగోలుగా వ్యవహరించకుండా బంధనాలు రాబోతున్నాయా..? ఐపీఎల్లో ఫిక్సింగ్, బెట్టింగ్తో మొదలైన వివాదానికి క్లైమాక్స్గా జస్టిస్ లోధా కమిటీ భారీ నివేదిక ఇచ్చింది. పలు మార్పులు సూచిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఇది అమల్లోకి వస్తుందా? రాదా? అనేది సుప్రీం కోర్టు చేతుల్లో ఉంది. న్యూఢిల్లీ: బీసీసీఐలో సమూల ప్రక్షాళనకు సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బోర్డులో మార్పులతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక ప్రతిపాదనలు చేసింది. ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి పరిమితులు విధించడం మొదలు రాష్ట్ర సంఘాల్లో ఓటింగ్ హక్కు, సెలక్షన్ కమిటీ ఎంపిక, బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావడం వరకు అనేక అంశాలు ఉన్నాయి. బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని సూచించడం కూడా కమిటీనుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన. ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ అశోక్ భాన్, జస్టిస్ ఆర్. రవీంద్రన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్లో చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు, మెయప్పన్, రాజ్ కుంద్రాలకు శిక్షలు ప్రతిపాదించడంతో పాటు బీసీసీఐ పనితీరుపై తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కమిటీని కోరింది. తాజా నివేదికను కమిటీ సుప్రీంకే సమర్పిస్తుంది. ఇందులోని చాలా అంశాలు ప్రస్తుతం సాగుతున్న పరిపాలనా శైలికి ముగింపు పలికే విధంగానే ఉన్నాయి. కమిటీ చేసిన ప్రతిపాదనలు అవి అమల్లోకి వస్తే పడే ప్రభావం ఏమిటో చూద్దాం.... 1 ప్రతిపాదన: 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదు. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శరద్పవార్ (75 ఏళ్లు), శ్రీనివాసన్ (71), నిరంజన్ షా (71)లతో పాటు పాండోవ్, ఐఎస్ బింద్రా లాంటి అనేకమంది క్రికెట్ పరిపాలనకు దూరమవుతారు. 2 ప్రతిపాదన : ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే. ప్రభావం: ఇది అమల్లోకి వస్తే శశాంక్ మనోహర్ కనీసం బీసీసీఐ సమావేశంలో ఓటు వేయలేరు. మహారాష్ట్ర సంఘానికి మాత్రమే ఓటు ఉంటుంది. విదర్భ, ముంబై సంఘాలు నామమాత్రంగా మారిపోతాయి. ఇలాగే గుజరాత్లోనూ జరుగుతుంది. నగరం ఆధారంగా ఉన్న సంఘాలు పోయి చత్తీస్గఢ్, తెలంగాణ, బీహార్లకు ఓటు హక్కువస్తుంది. 3 ప్రతిపాదన: ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలి. అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలి. ప్రభావం: అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బోర్డు కార్యదర్శి. తన పదవీకాలం పూర్తి కాగానే తిరిగి అధ్యక్ష పదవికో, కార్యదర్శి పదవికో పోటీ చేయలేరు. మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. 4.ప్రతిపాదన: బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే (మూడేళ్ల చొప్పున) పదవిలో ఉండాలి. ఆ త ర్వాత మరే పదవిలోనూ ఉండకూడదు. ప్రభావం: శశాంక్ మనోహర్ ప్రస్తుత పదవీకాలం ముగిస్తే ఆరేళ్లు పూర్తవుతుంది. ఇక ఆ యన బీసీసీఐలో ఎలాంటి పదవిలోనూ ఉండరు. 5.ప్రతిపాదన: ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదు. ప్రభావం: ప్రస్తుతం బీసీసీఐలో ఉన్న పెద్దలంతా తమ రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు. వారంతా ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. 6.ప్రతిపాదన: సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. వాళ్లు కూడా కచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడినవారై ఉండాలి. ప్రభావం: ప్రస్తుత సెలక్టర్లలో ఖోడా కేవలం వన్డేలు ఆడాడు. కాబట్టి తను అనర్హుడు. అలాగే రాథోడ్, సాబా కరీమ్, ఎమ్మెస్కే ప్రసాద్, సందీప్ పాటిల్ (చైర్మన్)లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. 7.ప్రతిపాదన: బెట్టింగ్ను చట్టబద్దం చేయడం ప్రభావం: విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లండ్లోని ప్రముఖ బెట్టింగ్ కంపెనీలు భారత్లోనూ తమ కార్యకలాపాలు చేపడతాయి. 8. ప్రతిపాదన: బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తేవాలి. ప్రభావం: ఇకపై సామాన్యులు కూడా బీసీసీఐ వ్యవహారాలను, చెల్లింపులను తెలుసుకోవచ్చు. ఏం జరుగుతుంది? లోధా కమిటీ ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇవన్నీ కచ్చితంగా అమలు కావాలని నిబంధన ఏమీ లేదు. ముందుగా ఈ నివేదికపై సుప్రీంకోర్టు బీసీసీఐ అభిప్రాయాన్ని కోరుతుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి బోర్డు తరఫున వివరణ ఇచ్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే బోర్డు పెద్దలకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా వయో పరిమితి, రెండు సార్లు ఎన్నిక కావడానికి మధ్య విరామం ఇవ్వాలనే అంశాలే బోర్డు పెద్దలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై బోర్డు గట్టిగా వాదించే అవకాశం ఉంది. ‘నివేదికను పూర్తిగా చదివిన తర్వాతే నా అభిప్రాయం చెబుతాను’ అని బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వెల్లడించారు. అయితే శరద్పవార్లాంటి వారు ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, 70 ఏళ్లు దాటారని పని చేయకూడదా అని ఒక బోర్డు సభ్యుడు ప్రశ్నిస్తే... బాగా పని చేసినప్పుడు వరుసగా ఎన్నిక కాకుండా ఎందుకు నిరోధించాలని మరొకరు అడుగుతున్నారు. అన్నింటికి మించి ముగ్గురు సెలక్టర్లు 27 రంజీ ట్రోఫీ మ్యాచ్లను ఎలా చూడగలరనేది మరొకరి సందేహం. మొత్తానికి సుప్రీం కోర్టులో బీసీసీఐ ఎలాంటి వాదన వినిపిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు తన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి బాగానే సమయం పట్టొచ్చు. మరికొన్ని ప్రతిపాదనలు... ♦ బోర్డు అధ్యక్ష పదవిని రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్కు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని తొలగించాలి. బోర్డు ఎన్నికల సమయంలో అధ్యక్షుడికి ఇప్పుడు మూడు ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి తప్పించాలి. ♦రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించించేందుకు సీఈఓను నియమించాలి. ఆటగాళ్ల తరఫున మాట్లాడేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ప్లేయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. 9 మంది సభ్యులతో అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి ఒక మహిళ సహా ముగ్గురు ఆటగాళ్లు అందులో సభ్యులుగా ఉండాలి. ♦ 9 మంది సభ్యులతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను విస్తరించి అందులో ఇద్దరు ఫ్రాంచైజీల తరఫున, ఒకరు ప్లేయర్స్ అసోసియేషన్ తరఫున ఉండేలా చూడాలి. మరొకరు ప్రభుత్వ ప్రతినిధిగా ‘కాగ్’ నామినేట్ చేసిన వ్యక్తిని నియమించాలి. ♦ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’పై దృష్టి పెట్టేందుకు ఒక నైతిక విలువల అధికారిని నియమించాలి. సుందర్ రామన్కు క్లీన్ చిట్ బుకీలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్కు కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. అతడిని దోషిగా తేల్చేందుకు ఎలాంటి ఆధారం లభించలేదని కమిటీ పేర్కొంది. అతనిపై వచ్చిన ఏడు రకాల ఆరోపణల్లో ఒక్కదాంట్లోనూ బలం లేదని, కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. త్వరలో బోర్డు ఎస్జీఎం న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు వారాల్లోపే ఎస్జీఎంను సమావేశపరచాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం కోసం నేడు (మంగళవారం) ఉన్నతాధికారులంతా ముంబైకి రానున్నారు. ఇక్కడే ఎస్జీఎం ఎప్పుడనేది తేలనుంది. నివేదికలోని కొన్ని అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. మరోవైపు ఈ రిపోర్టుపై బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కడే 652 నాటౌట్! స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సృష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. మైనర్ క్రికెట్లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పృథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
ఒక్క రాష్ట్రానికి ఒక్కటే సంఘం!
► బీసీసీఐలో మార్పుల గురించి లోధా కమిటీ సూచనలు ► నివేదిక జనవరి 4న కోర్టు ముందుకు న్యూఢిల్లీ: బీసీసీఐ నిర్వహణలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండకూడదు... ఒక్క రాష్ట్రానికి ఒక్కటే క్రికెట్ సంఘం ఉండాలి... బీసీసీఐలో ఉండే వ్యక్తులు రాష్ట్ర సంఘాల్లో ఎలాంటి పదవుల్లో ఉండకూడు... సుప్రీం కోర్టుకు జస్టిస్ లోధా కమిటీ సమర్పించబోతున్న నివేదికలోని కొన్ని అంశాలు ఇవి. జనవరి 4న కమిటీ తన తుది నివేదికను కోర్డుకు సమర్పించబోతోంది. విశ్వసనీయ సమచారం ప్రకారం... ఆ నివేదికలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని లోధా కమిటీ సూచించబోతోంది. ప్రస్తుతం బీసీసీఐ 1975 తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజస్టర్ అయి ఉంది. దీనిని పబ్లిక్ ట్రస్ట్ లేదా కంపెనీగా మార్చాలనేది సూచన. ఈ నివేదిక రూపొందించేందుకు క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు, లాయర్లు, ప్రముఖ వ్యక్తులతో వివిధ అంశాలతో కమిటీ చర్చించింది. ‘కమిటీ ప్రతిపాదనలు మెజారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరచనున్నాయి. క్రికెటర్లు కానివారికి ఇవి రుచించకపోవచ్చు. ఆయా క్రికెట్ సంఘాలకు వారే అధ్యక్షులుగా ఉంటున్నారు. పలుకుబడి ఉన్నవారి స్టేట్కే ప్రధాన మ్యాచ్లు వెళుతున్నాయి’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. -
'డీజిల్ కార్లను నిషేధిస్తారా?'
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని బయటపడేసేందుకు ఒక్కో ప్రయత్నం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాలుష్యానికి ఎక్కువకారణం అవుతున్న డీజిల్ కార్లను నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పారు. డీజిల్ కార్లను ఢిల్లీ నగర వీధుల్లో నుంచి పూర్తిగా బహిష్కరించాలా లేక పరిమితులు విధిస్తే సరిపోతుందా అనే అంశాలను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం వెల్లడించనుంది. ఏదేమైనా ఢిల్లీ గుండా ట్రక్కులను వెళ్లకుండా తీసుకునే నిర్ణయానికి సుప్రీంకోర్టు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క, కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై స్పందిస్తూ ఏదో ఒక పరిష్కారంతో సమస్య మొత్తం అంతంకాదని, ఇందుకోసం బహుళకార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. -
ప్రసవ ఆవేదన
తొమ్మిదినెలలు మోసి పేగు తెగగానే బంధం తెగితుందా? జీవితం నడవడానికి కొంచెం డబ్బు రావచ్చుకానీ... పుట్టిన బిడ్డ నడవకముందే వదులుకోవడం ఎంత వేదన?మహిళకున్న కష్టాల గురించిపుటలు పుటలు రాస్తున్నా కొత్త కష్టాలుపుట్టుకొస్తూనే ఉన్నాయ్!ఇదంతా డబ్బుకోసమే చేస్తున్నా స్త్రీ తనకోసం చేసుకోవడం లేదుతన కుటుంబం కోసమో..బంధువుల కోసమోకడుపును అద్దెకిచ్చిపేగు బంధాన్నే త్యజించిఒక ఫ్యాక్టరీగా మారిందిప్రసవ వేదన గురించి విన్నాం..ప్రసవం తర్వాత ఉండే వేదన గురించీ విన్నాం..కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడ్తుందేమోనన్న ఆవేదన గురించి వింటున్నాం! ఆనంద్... మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా! గుజరాత్ నుంచి పొంగే పాలధార. క్షీర విప్లవం వల్ల కళకళలాడిన ఊరు. అయితే అది ఇంకొకందుకు కూడా ఖ్యాతి గాంచింది. సరోగసీకి. అవును... అక్కడ నిత్యం పసిపిల్లల కేర్కేర్మనే ఏడుపులు వినిపిస్తాయి. వారిని ఒడిలోకి తీసుకున్న తల్లిదండ్రుల ఆనందబాష్పాలు కనిపిస్తాయి. ఆ ఆనందబాష్పాలకు వెల నిర్ణయించి స్థిరపడిన జీవితాలు కూడా కనిపిస్తాయి. అద్దె గర్భాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆనంద్ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ దేశంలోని అమ్మలు తమ గర్భాన్ని విదేశీ జంటలకు అద్దెకివ్వడానికి వీల్లేదు అనే ఆ తీర్పు మీద చర్చ జరుగుతున్న దరిమిలా ఆనంద్ అమ్మల ఆలోచనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేబీ ఫ్యాక్టరీస్ అహ్మాదాబాద్ నుంచి వదోదరా వెళుతుంటే మార్గమధ్యంలో కనిపించే ఆనంద్ గత పదేళ్ల నుంచి సంతానలేమితో బాధపడ్తున్న భార్యభర్తలకు బిడ్డల్నిచ్చే కర్మాగారాల నెలవుగా మారింది. ఇక్కడి మెటర్నీటీ నర్సింగ్హోమ్స్ అన్నీ సరోగసీ సెంటర్సే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆనంద్ను సిటీ ఆఫ్ బేబీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద సరోగసీ కేంద్రం ఇది. ఈ ఊళ్లోని ఒక్క ఆకాంక్ష ఇన్ఫెర్టిలిటీ క్లినిక్కే ఇప్పటి వరకు వెయ్యిమంది సరోగసీ బిడ్డలకు పురుడు పోసిందంటే అదేం చిన్న సంఖ్య కాదు. ఈ క్లినిక్లో వారానికి ఇద్దరు సరోగసీ బిడ్డలు కేర్మంటున్నారంటే సరోగసికి ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇక్కడ యేడాదికి 13 వందల కోట్ల పై చిలుకు వ్యాపారం జరుగుతోంది కనుకనే దీనిని ‘సరోగసీ ఇండస్ట్రీ’ అని సగౌరవంగా పిలుస్తున్నారు. భారతదేశం నుంచే కాదు నైజీరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ జంటలు కూడా ఆనంద్కు చేరుకుంటుంటాయి. వేలమందికి ఉపాధి ఆనంద్లో వెయ్యిమంది సరోగసీ మదర్స్ ఉన్నారని అంచనా. ఆరోగ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఒక్కో అమ్మ తన గర్భాన్ని అద్దెకివ్వడానికి నాలుగు నుంచి పదకొండు లక్షలు చార్జ్ చేస్తోంది. హ్యుమన్రైట్స్ కమిషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఇలాంటి విశేషాలు అనేకం తెలిశాయి. బీనా అనే 34 ఏళ్ల సరోగసీ మదర్ తన గర్భాన్ని అద్దెకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో మంచి ఇల్లు కట్టుకుందట. కొడుకుని ఇంజనీరింగ్ చదివించిందట. భర్తకు రద్దీ చోట మంచి హోటల్ పెట్టించిందట. అంతే కాదు సరోగసీ వల్ల తనకు కలిగిన లాభాన్ని మరో ఇద్దరు పేద మహిళలకు వివరించి వారికి కూడా సరోగసీ ద్వారా ఉపాధి చూపించిందట. రాంజుది కూడా అలాంటి పరిస్థితే. ఆమె వయసు 32 ఏళ్లు. ఒక అగ్ని ప్రమాదంలో రాంజు భర్త గాయపడ్డాడు. ఆపరేషన్ కోసం పెద్దమొత్తంలోనే డబ్బులు కావాల్సి వచ్చింది. కూలీనాలీ చేసుకునే జీవితాలకు అంత డబ్బు అప్పుగా దొరకడం కల్లే కనుక ఎవరో చెప్తే విని సరోగసీ మదర్గా ఉండడానికి తన పేరును రిజిస్టర్ చేయించుకుంది. ఒక కెనడియన్ జంటకు బిడ్డను కనిచ్చింది. అప్పటికే ఒక బిడ్డ తల్లి అయిన రాంజుకి ఈ ఒప్పందం ద్వారా ఎనిమిది లక్షలు వచ్చాయి. భర్తకు ఆపరేషన్ చేయించడమే కాక మిగిలిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంది. తర్వాత రెండో విడతలో జర్మనీ జంటకు బిడ్డకు కనిచ్చింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో భర్తకు ఆటో కొనిపెట్టి తానూ ఓ బడ్డీ కొట్టు పెట్టుకుంది. కొడుకును పె చదువులకు ముంబై పంపించింది. సరోగసీ ద్వారా ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలెన్నో కనిపిస్తాయ్ ఆనంద్లో. ఇతర వ్యాపారాలు పిల్లల కోసం యేడాదికి రెండువందల విదేశీ జంటలు ఆనంద్కు చేరుకుంటాయి. కనీసం ఆర్నెల్ల దాకా బస చేసే ఈ జంటల వల్ల అక్కడి ఆసుపత్రులు, సరోగసీ సెంటర్సే కాదు... ఎయిర్పోర్ట్ నుంచి ఆనంద్కు తీసుకొచ్చే ట్రావెల్ ఏజెన్సీలకు, వాళ్లకు వసతి కల్పించే హోటళ్లకు, ఆయా దేశ వాసులకు వాళ్ల ఆహారాన్ని వండిపెట్టే రెస్టారెంట్లకు, గుజరాతీ థాలీ రుచులను చూపించే గుజరాతీ కిచెన్లకు, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ను అందించే స్టోర్స్కు, డైపర్స్ నుంచి మల్టీవిటమిన్ డ్రాప్స్ దాకా ఫారిన్ కంపెనీల మందులను అమ్మే మెడికల్ షాప్స్కు, ఇంగ్లిష్ మాట్లాడే స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ ఖజానా నిండుతోంది. నిజానికి ఆనంద్ శాకాహార రెస్టారెంట్లకు పేరు. కాని సరోగసీ సంతానం కోసం వస్తున్న విదేశీయుల కోసం నాన్వెజ్ రెస్టారెంట్ల డిమాండ్ ఏర్పడింది. అవి తెరవక తప్పలేదు. అన్నిటికీ మించి విదేశీ జంటలకు, సరోగసీ మదర్స్కు మధ్య లీగల్ అగ్రీమెంట్స్ కుదర్చడం లాయర్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సుప్రీంకోర్టు ప్రస్తుత తీర్పుతో వీరందరి ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు మార్కెట్ అనలిస్ట్లు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా సరోగసీ మదర్స్ మాత్రం ‘సరోగసీకి మేం ఇష్టపడే ఒప్పుకున్నాం. తొమ్మిది నెలల్లో మంది సంపాదననిచ్చే మార్గం ఇది. కోర్టు తీర్పు వల్ల విదేశీయులు రాకపోవచ్చట. వాళ్లు ఇచ్చినంత డబ్బులు మన వాళ్లు ఇవ్వరు. మాకైతే సంపాదన పోయినట్టే. మళ్లీ కూలీనాలీ అంటే కష్టమే’ అని వాపోతున్నారు.. - సాక్షి ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల ఆనంద్ దేశంలో సరోగసీకి గుజరాత్ తర్వాత తెలుగు రాష్ట్రాలే ప్రధాన కేంద్రాలు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ ఈ విషయంలో ముందంజలో ఉంది. విదేశీ జంటల దృష్టి ఇంకా పడకపోయినా ప్రవాస భారతీయ జంటల సంతాన సాఫల్య కేంద్రంగా ఇది ప్రచారం పొందుతోంది. గత అయిదేళ్లలో 100 మందికి పైగా సరోగసీ బిడ్డలకు ఈ నగరం జన్మనిచ్చింది. ఇక్కడి సరోగసి మదర్ కూడా 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులను డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. సరోగసీ వల్ల ఆనంద్ లాంటి మౌలిక సదుపాయాలు, వ్యాపారం ఇక్కడ పెరగకపోయినా, సరోగసీ మదర్స్ను కంటికి రెప్పలా కాపాడే అత్యంతాధునిక వైద్యసదుపాయాలున్న ఆసుపత్రులు, సకల సౌకర్యాలున్న హాస్టల్స్, లైబ్రరీలు, వీడియో లైబ్రరీలు వెలుస్తున్నాయి. ప్రవాస జంటలు తమ బిడ్డ ఉన్న సరోగసీ మదర్కు ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే విషయంలో శ్రద్ధ చూపుతుండటం వల్ల డైటీషీయన్లకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రవాస భారతీయ జంటలకు గర్భం అద్దెకివ్వచ్చు అన్న వెసులుబాటు సుప్రీం కోర్టు ఇచ్చింది కాబట్టి ఆనంద్కు ఉన్న గిరాకీ ఇక మీద కరీంనగర్కు మారవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్లోని సంతాన సాఫల్యకేంద్రాల్లోని గైనకాలజిస్ట్లు. -
ఆధార్పై నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి
సుప్రీంను కోరిన కేంద్రం శుక్రవారం నిర్ణయం చెబుతామన్న సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ అనుసంధానాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ‘పిటిషన్ విచారణకు తొమ్మిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ అవసరం. అంతమందిని ఇస్తే మిగతాపనులు ఏమవ్వాలి. అందుకే రేపు సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి’ అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు చెప్పారు. కేవలం పీడీఎస్, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ స్వచ్ఛంద వినియోగానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును మార్చాలని రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, హరీశ్ సాల్వే కూడా మద్దతు తెలిపారు. ఉపాధి హామీ, జన్ధన్ యోజన లాంటి పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రాముఖ్యతను గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించిన రోహత్గీ.. పిటిషన్ను త్వరగా పరిష్కరించాలని కోరారు. -
ధోనికి ఊరట
న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనను విష్ణుమూర్తిగా చూపిస్తూ ఓ బిజినెస్ మేగజైన్ ముఖచిత్రం ప్రచురించడంతో ధోనిపై బెంగళూరు ట్రయల్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ ధోని సుప్రీం కెళ్లాడు. ఇప్పుడు తాజాగా ఆ కేసు విచారణపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఆర్కే అగర్వాల్లతో కూడిన బెంచ్ స్టే విధిం చింది. విచారణ కొనసాగించాల్సిందేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది. అంతేకాకుండా ధోనిపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త జయకుమార్కు నోటీసులు పంపింది. -
‘కృష్ణా’పై కేంద్రం వైఖరేమిటో?
10న సుప్రీంకోర్టులో తన వైఖరిని చెప్పనున్న కేంద్రం ట్రిబ్యునల్ సభ్యుడి ఎంపికపైనా స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదంలో నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు 4 రాష్ట్రాల వాదనలు వినాలా? లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలన్న దానిపై కేంద్రం చెప్పే వైఖరిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో కేంద్రం ఏం చెబుతుందన్న దానిపై నాలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ మాత్రం మరోమారు నాలుగు రాష్ట్రాల వాదనలు విని పునఃకేటాయింపులపై నిర్ణయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనుంది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే దృష్ట్యా, దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని రాష్ట్రం సుప్రీంను అభ్యర్థించింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం.. తెలంగాణ వినతిపై వైఖరిని చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలోనే ఒకమారు వైఖరిని చెప్పాలని సుప్రీం సూచించినా కేంద్రం ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నందున త్వరగా వైఖరిని చెప్పాలని సుప్రీం గట్టిగానే చెప్పడంతో ఈ నెల 10న జరగబోయే విచారణలో ఏదో ఒక వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ సభ్యుడు డీకే సేథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో మరో సభ్యుడి నియామకంలో చేపట్టిన చర్యలపైనా కేంద్రం స్పష్టతనిచ్చే అవకాశముంది. -
ఆ ముగ్గురు దోషులే!
కటారా కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: నితీశ్ కటారా హత్య కేసులో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్దేవ్ పహిల్వాన్లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే వారికి శిక్షాకాలం పొడిగించడంపై 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. వికాస్, అతని బంధువు విశాల్కు విధించిన జీవితఖైదును హైకోర్టు ఫిబ్రవరిలో 25 ఏళ్లకు పెంచింది. శిక్ష త గ్గిస్తూ ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని ఆదేశించింది. కేసులో ఆధారాలు నాశనం చేసినందుకు మరో ఐదేళ్ల అదనపు జైలు శిక్ష విధించింది. సుఖ్దేవ్కూ శిక్షను 25 ఏళ్లుగా నిర్ధారించింది. దీన్ని సవాలు చేస్తూ వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. దోషులకు శిక్షాకాలం పెంపుపై మాత్రమే దృష్టిసారిస్తామని, వారి దోషిత్వంపై మళ్లీ ఎలాంటి విచారణ జరిపేది లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ దేశంలో నేరగాళ్లే న్యాయం కోసం పోరాడుతున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. తన సోదరి భారతిని ప్రేమించినందుకు 2002, ఫిబ్రవరి 17న నితీశ్ కటారాను వికాస్ యాదవ్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
సిద్ధార్థ యాజమాన్యం దిగివచ్చేనా!
సుప్రీంకోర్టులో దుర్గగుడి ఈవో పిటిషన్ దాఖలు పిటిషన్ దాఖలులో ప్రభుత్వం తాత్సారం కాగితాలకే పరిమితమైన లీజుల పెంపు ప్రతిపాదన విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న దుర్గగుడి దేవస్థానం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయం మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు దేవస్థానమే గెలిచినప్పటికీ సిద్ధార్థ యాజమాన్యం ఆ భూములను వదల కుండా సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చి దుర్గగుడికి చెందిన భూములను దేవస్థానానికి ఇప్పించడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగింది.... శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉన్నాయి. ఈ రెండుస్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను 2006లో ప్రభుత్వమే రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టుకెళ్లారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడా చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లగా ‘యథాతథ స్థితి’ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషనర్, ప్రభుత్వం తాత్సారం.... దుర్గగుడి దేవస్థానంతోపాటు దేవాదాయశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా దుర్గగుడి భూములపై స్టే ఎత్తివేయాలని, దేవస్థానానికి భూములు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పిటిషన్ దాఖల చేసేందకు ఈవోకు అనుమతి మంజూరులోనే దేవాదాశాఖ కమిషనర్ కార్యాలయం తీవ్ర తాత్సారం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్లు ఎప్పుడు పిటిషన్లు దాఖలుచేస్తారో ఆ కనకదుర్గమ్మకే తెలియాలి. వేగవంతంగా ఫైల్స్ కదిపి సుప్రీం కోర్టులో తమ వాదన వినిపిస్తే సాధ్యమైన త్వరగా భూములు స్వాధీనం చేసుకునే అవకాశ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే తాత్సారం చేస్తోందని భక్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అద్దెలు పెంచడం పై భేదాభిప్రాయాలు సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూముల అద్దె ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెల ధరలకు యాజమాన్యం చెల్లిస్తున్న అద్దెల రేట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం అద్దెలకు తీసుకునేడప్పుడు ఎకరాకి రూ.5 వేల చొప్పున అద్దె చెల్లించేలా, ఆ తరువాత ప్రతి ఏడాది రూ.500 పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమ భూములకు అద్దె చెల్లించాలని దేవస్థానం డిమాండ్ చేస్తోంది. అయితే ఆ స్థాయిలో అద్దెలు పెంచితే తమకు భారం అవుతుందని సిద్ధార్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిద్ధార్థ యాజమాన్యం ఆధ్వర్యంలోని భూముల లీజు పెంచేందుకు ప్రభుత్వం గతంలో ఒక కమిటీని వేయాలని భావించింది. రెండు వర్గాలతో సంప్రదించి లీజు ఖరారు చేసి విభేదాలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కేవలం ఆలోచనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం వాదన ఇదీ... సుప్రీంకోర్టులో ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొల గించి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమకు భూమి అప్పగించాలని కోరుతూ తాజాగా దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దుర్గగుడికి చెందిన ఆస్తిపై పూర్తి హక్కులు దేవస్థానానికే ఉంటాయని, సెక్షన్ 15 ప్రకారం దేవస్థానం భూములను లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని దేవస్థానం న్యాయవాదులు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను హైకోర్టు అంగీకరించింది. ఆ వాదన ప్రకారం భూములను సిద్ధార్థ యాజమాన్యం నుంచి ఇప్పిం చాలని ఈవో పిటిషన్ దాఖలుచేశారు. -
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు మెమన్కు ఉరి
-
మెమన్కు ఉరి
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు ► స్టే పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్పూర్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!! న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్కుమార్లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఉరి తీయాల్సిందే..మెమన్కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్ను మోసం చేయడం వల్లనే మెమన్కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉరి అమలు ఎలా..! జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. యాకూబ్ వీలునామా రాయలేదు యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ఉరికంబానికీ ఉంది వివక్ష
కొత్త కోణం కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరిస్తోంది. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపులు తట్టడమంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలుగుతున్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవం తెలియజేస్తున్నది అదే. ‘‘మరణశిక్షను ఖరారు చేయడం రాష్ట్రపతిగా నేను ఎదుర్కొన్న అతి కఠిన మైన సమస్య. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేసులే ఎక్కు వగా పెండింగ్లో ఉన్నాయి.’’ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాటలివి. మరణశిక్ష విధింపులో ధన, కుల పక్షపాతం కనిపిస్తున్నదని ఆయన సుస్పష్టంగా తెలిపారు. కలాంను వేనోళ్ల కొనియాడుతున్న వాళ్ళు ఆయనలోని ఆ మానవత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతవరకు ఆచరణలో పెట్టగలరనేది అనుమానమే. కనీసం ఆలోచించడం మొదలు పెట్టినా అది ఆయనకు ఘన నివాళే. కులం, ధనం కలవారిదే ‘ఉన్నత’ న్యాయం కలాం అభిప్రాయం అక్షర సత్యమని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యా లయం విద్యార్థులు, అధ్యాపకుల అధ్యయనం రుజువు చేసింది. మరణశిక్ష పడ్డ ఖైదీలలో నాలుగింట మూడువంతులు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలేనని తేల్చింది (93% దళితులు, మైనారిటీలు). 23% నిరక్షరా స్యులు కాగా, మిగతావారిలో చాలా మంది హైస్కూల్ విద్యకు నోచుకోని వారు. వీరిలో చాలా మందిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనూ లేదు, న్యాయవాదులతో తమ కేసును చర్చించే అవకాశమూ ఇవ్వలేదు. మరీ దుర్మార్గంగా మరణ శిక్షకు గురైనవారిలో చాలా మందిని ప్రత్యేక గదుల్లో బంధించి, ఎవరితో కలవకుండా చేశారు. కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపులు తట్టడ మంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలిగారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవాన్ని ఈ అధ్య యనం బయటపెట్టింది. భారత న్యాయవ్యవస్థ... బొమ్మా బొరుసు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపున ఇంకో కథ ఉంది. దళితులు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఖరారై ఉరికంబం ఎక్కితే, దళితులు ఊచ కోతకు గురైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది, నిగ్గు తేలిన నిజాలు చెబుతున్న కథ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో దళితులపై జరి గిన రెండు ఘోర దురాగతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చను రేకెత్తించాయి. అయినా ఆ రెండు కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగానో, లేదా తక్కువ శిక్షలతోనో బయటపడ్డారు. ఒకటి ‘చుండూరు’. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు. ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్ర తను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు... అంతా నివ్వెరపోయేలా ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానాల్లో నిరుపేదలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం సన్నగిల్లింది. చుండూరు కేసు అరుదైనది కాకపోతే, అరుదైనవిగా పేర్కొన్న చాలా కేసులు కూడా అరుదైనవి కాకపోయే ఉండాలి. జరిగిన ఘోర దురంతం కాదనలేనిదై నప్పుడు... ప్రాసిక్యూషన్ విఫలమైతే, ఆ కేసును తిరిగి పరిశోధించాలని, అవసరమైతే అందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టు ఆదేశించాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో న్యాయస్థానం తన బాధ్యతను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి విజయవాడ శ్రీలక్ష్మి హత్య కేసు. ఆ విద్యార్థినిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపినందుకు మనోహర్ అనే యువకుడికి మరణ శిక్ష విధించాలని పలు మహిళా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడి తరఫున వాదించరాదని న్యాయవాదులు ఏకగ్రీ వంగా తీర్మానించారు. న్యాయస్థానం సైతం మనోహర్కు మరణ శిక్ష విధిం చింది. మంచిదే అలాంటి దుర్మార్గుడికి ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఈ హత్యతో పోలిస్తే, చుండూరు మారణకాండ కొన్ని వేల రెట్లు అమానుషమైనది. మనో హర్ కేసులో ఏడాదిలోగానే విచారణ పూర్తయింది, శిక్ష పడింది. కానీ చుం డూరు కేసు విచారణకు 16 ఏళ్లు పట్టింది, నలుగురు జడ్జీలు మారారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికే తొమ్మిదేళ్ళు పట్టింది! సాక్షులు సైతం చాలా మంది చనిపోయారు. ఈ రెండు కేసుల్లో ఎందుకింత వ్యత్యాసం? ఢిల్లీ అధ్యయనం పేర్కొన్నట్టు న్యాయ ప్రక్రియలో, శిక్షల విధింపులో కులం, ధనం ప్రాబల్యం వహిస్తున్నాయనేది సులభంగానే అర్థమవుతుంది. దళితులపై దురాగతాలు ‘అరుదైనవి’ కాలేవు ఇక మహారాష్ట్రకు వస్తే, నాగపూర్ సమీపంలోని భండార జిల్లా ఖైర్లాంజిలో ఒక భూవివాదం సాకుతో ఆధిపత్య కులాల వారు భూత్ మాంగే అనే ఒక దళితుని కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశారు. దాదాపు 40 మంది మారణాయుధాలతో చుట్టుముట్టి మాంగే గుడిసెను తగులబెట్టి, ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను, కూతురిని చిత్రహింసలకు గురిచేసి, తల్లీ కూతుళ్ళిద్దరిపై నడిబజారులో అత్యాచారం జరిపి అతి అమానుషంగా చం పారు. ఈ ఘోరాన్ని ఆధిపత్య కులాల మహిళలు ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా పొదల మాటున దాగి చూసిన భూత్ మాంగే స్వయంగా కేసుపెట్టారు. 2008లో ఆరుగురు నిందితులకు ప్రత్యేక న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. కానీ తర్వాత బొంబాయి హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది! ఇక ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఐదుగురు దళిత యువకులు, ఒక జాట్ అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పెట్టిన కేసులో నిందితులకు మరణశిక్ష విధించారు. కాగా, 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఒక హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి (పేరు మార్చాం) అనే దళిత యువతి అత్యాచారానికి గురైంది. ఆమె నిందితులను గుర్తుపట్టి, జరిగిన దురాగతాన్ని కోర్టులో పూసగుచ్చినట్టు వివ రించింది. అయినా ఆ కేసులోని నిందితులంతా నిర్దోషులుగా బయట పడ్డారు! దీన్ని బట్టి మన దేశంలో అమలవుతున్న నేరము-శిక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనుస్మృతి ఆధారంగానే నేరము-శిక్ష ఇలా ఒక్కొక్కటొక్కటిగా చూస్తుంటే న్యాయం త్రాసులో బలిపశువులుగా మారుతున్న వారంతా దళితులు, పేదలేనని రుజువవుతుంది. నేరం చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, విధిస్తున్న శిక్షల్లోని అంతరాలను గమనిస్తే నేరం తీవ్రతేగాక కులం, ధనం వంటి ఇతర అంశాల ప్రభావం తీర్పులపై అధికంగా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ అధ్యయనం దీన్ని మరోమారు రుజువు చేసింది. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కేవ లం రాతలకే పరిమితమైంది. వాస్తవంగా అమలవుతున్నది భారత రాజ్యాం గం కాదు. రెండు వేళ ఏళ్ల నాటి మనుస్మృతి. దానిలో 8, 9, 11 అధ్యాయాల లోని నేరము-శిక్షకు సంబంధించిన అంశాలన్నీ పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి శిక్షలని నిర్దేశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థలోని ప్రజలకు వారి వారి వర్ణ నేప థ్యాన్ని బట్టి మనువు శిక్షలను ఖరారు చేశాడు. ఆ మనుధర్మాన్ని మెదళ్ల నిండా నింపుకొని మనం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాం. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయ చరిత్ర దాన్నే రుజువు చేస్తోంది. ఈ తీరు మారాలి, తీర్పులూ మారాలి. అప్పుడే న్యాయానికి ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదన్న అబ్దుల్ కలాం కల నిజమవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష ఖాయం
1993 ముంబయి పేలుళ్ల కేసులో తొలి మరణశిక్ష క్యూరేటివ్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు; జూలై 30న ఉరి న్యూఢిల్లీ: ముంబయిలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతని ఉరిశిక్ష అమలు ఖరారైనట్లయింది. మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్ అతని సోదరుడు టైగర్ మెమన్లను న్యాయస్థానం నిర్ధారించి మరణ శిక్షను విధించింది. 1993 తరువాత టైగర్ దేశం విడిచి పారిపోయాడు. 1994లో నేపాల్ సరిహద్దులో యాకూబ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనకు మరణ శిక్ష నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా యాకూబ్ మెమన్ సర్వోన్నత న్యాయస్థానంలో నిరుడు క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అతను పిటిషన్ లో పేర్కొన్న కారణాలు క్షమాభిక్షకు అర్హమైనవి కావని తేల్చిచెప్పింది. ఈ కేసులో మరణ శిక్ష అమలవుతున్న తొలి నేరస్థుడు మెమనే. తాను 1996 నుంచి దాదాపు 20 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నానని, మనోవైకల్యంతో బాధపడుతున్నానని యాకూబ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఒక నేరస్థుడికి ఒక నేరంలో జీవితఖైదు, ఉరిశిక్ష రెండు శిక్షలు వేయజాలరని యాకూబ్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను కొట్టివేసింది. సుప్రీం తీర్పుతో జూలై 30న యాకూబ్ ఉరికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాగపూర్ సెంట్రల్ జైలులో కానీ, పూణె ఎఱవాడ జైలులో కానీ ఉరిశిక్ష అమలు చేయవచ్చని నాగపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. చరిత్రాత్మకం: ఉజ్వల్ నికమ్ యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించటం చరిత్రాత్మకమని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. సుప్రీం తీర్పును శివసేన కూడా హర్షించింది. ఇదేకేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ ఎంపీగా ఉన్న అబూ ఆజ్మీకూడా ఆహ్వానిస్తున్నానని అన్నారు. గవర్నర్ను క్షమాభిక్ష కోరిన యాకూబ్ క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీం తిరస్కరించటంతో తుది ప్రయత్నంగా మహారాష్ట్ర గవర్నర్ను క్షమాభిక్ష కోరుతూ యాకూబ్ మెర్సీ పిటిషన్ దాఖలు చేశారు. నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకు ఈ పిటిషన్ను అందజేశారు. తొలి క్షమాభిక్ష పిటిషన్ను యాకూబ్ సోదరుడు సులేమాన్ వేశారని, ఇప్పుడు యాకూబ్ స్వయంగా క్షమాభిక్ష కోరుతున్నందున రెండో క్షమాభిక్ష పిటిషన్ చెల్లుతుందని ఆయన లాయర్ అనిల్ గెడెమ్ తెలిపారు. ముంబయి పేలుళ్ల కేసు పరిణామ క్రమం 1993 మార్చి 12: ముంబైలో 13 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి.. 713మందికి పైగా గాయాలు 1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు 1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు. 2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్మెంట్ల రికార్డు పూర్తి 2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు 2006 సెప్టెంబర్ 12: తీర్పు వెల్లడి. యాకూబ్ మెమన్తో సహా అతని నలుగురు కుటుంబ సభ్యులు దోషులుగా ఖరారు. యాకూబ్ సహా 12మంది నిందితులకు మరణ శిక్ష. మరో 20మందికి జీవిత ఖైదు. 2013 మార్చి 21:యాకూబ్ ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. 2014 మే: యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. 2014 జూన్ 2: సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ను వేసిన యాకూబ్ 2015 జూలై 21: క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత -
రాజీవ్ హంతకులు క్షమాభిక్షకు అనర్హులు
సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష పొందే అర్హత లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఆ హత్య విదేశీయుల పాత్ర ఉన్న కుట్ర ఫలితమని పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలి, జైలుశిక్ష అనుభవిస్తున్న శ్రీలంకకు చెందిన శ్రీహరన్ అలియాస్ మురుగన్, శాంతన్, రాబర్ట్ పియస్, జయకుమార్లతో పాటు, భారతీయులైన నళిని, రవిచంద్రన్, అరివులకు క్షమాభిక్ష ప్రసాదించి, జీవిత ఖైదునుంచి విముక్తి కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై కేంద్ర అభిప్రాయాన్ని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వివరించారు. ‘వీరు మన మాజీ ప్రధానమంత్రిని చంపారు. ఇందులో విదేశీయుల కుట్ర ఉంది. వారికి క్షమాభిక్ష ఏంటి? వారి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి, గవర్నర్(తమిళనాడు) ఇద్దరూ తిరస్కరించారు’అని రంజిత్ వివరించారు. దోషుల్లో మురుగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ హాజరయ్యారు. వాదనల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా.. ‘నేరస్థుల మరణ శిక్షను మేం ఇప్పటికే జీవిత ఖైదుగా మార్చాం. ఇప్పుడు మళ్లీ మా తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. సీబీఐ దీన్ని సవాలు చేయొచ్చా? వారికి శిక్ష పడింది కూడా సీబీఐ దర్యాప్తుతోనే కదా!’ అని ధర్మాసనం ప్రశ్నిం చింది. మరోవైపు, ‘ఒక సారి మేం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత వారికి శిక్ష తగ్గించే విషయంలో అధికారం రాష్ట్రాలకు ఉంటుం ది. దోషులు ఇప్పటికే 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని, అది చాలని తమిళనాడు ప్రభుత్వంవాదిస్తోంది. ఈ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’అని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర దర్యా ప్తు సంస్థలు విచారణ జరిపిన కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే లేదాశిక్షను తగ్గించే అధికారం కేంద్రాలకు ఉంటుందా? లేక రాష్ట్రాలకు ఉంటుందా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. -
తల్లిదండ్రుల వద్దకు వీధి బాలలు
విజయవంతంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తున్న ప్రత్యేక డ్రైవ్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి.. బాలల అప్పగింత హైదరాబాద్: ఇంటినుంచి పారిపోయి వీధి బాలలుగా మారిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ కార్యక్రమం అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ల నిమిత్తం పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, విద్యా శాఖల నుంచి ఒక్కో అధికారి, స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల నుంచి మరికొందరు సభ్యులుగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, కాగితాలు ఏరుకునే వారు, రైల్వే ఫ్లాట్ఫారాలపై ఉంటున్నవారు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తారు. బాలల నుంచి వారి స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేస్తారు. ఆపై ఎవరైనా తామే తల్లిదండ్రులమని తగిన గుర్తింపు పత్రాలతో వస్తే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ల సమక్షంలో విచారించి బాలలను అప్పగిస్తారు. వారం రోజుల్లో 970 మంది పట్టివేత వారం రోజులుగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో బాలల పరిరక్షణ బృందాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 970 మంది బాలలను పట్టుకున్నారు. వీరిలో బాలకార్మికులే ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్లో దొరికిన బాలలను ఆయా జిల్లా కేంద్రాల్లోని తాత్కాలిక వసతి గృహాల్లో ఉంచి, చదువు నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) నుంచి నిధులను కేటాయించారు. -
రేపు తేలకపోతే కష్టమే!
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్పై సోమవారం కూడా స్పష్టత రాలేదు. అన్ని కాలేజీలకు సంబంధించిన కేసులను జేఎన్టీయూహెచ్ ఫైల్ చేయనందున ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి (ఈనెల 15కు) వాయిదా పడింది. మరోవైపు ప్రవేశాల ముగింపు, తరగతుల ప్రారంభ గడువు సమీపిస్తోంది. బుధవారం నాటి విచారణలో ప్రవేశాలపై స్పష్టతరాకపోతే.. ఈ నెలాఖరుకు ప్రవేశాలు పూర్తయి, వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీల అఫిలియేషన్ల కేసులో సోమవారం స్పష్టత వస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. కౌన్సెలింగ్కు అనుమతి వస్తేనే.. ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారంలో ఈనెల 15వ తేదీన స్పష్టత వస్తేనే నెలాఖరుకు ఒకటి, రెండు దశల ప్రవేశాల కౌన్సెలింగ్ను పూర్తి చేయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభించినా.. ఆ తరువాత 3 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, తర్వాతే సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పది రోజులు పడుతుందని చెప్పారు. ఇక రెండోదశ కౌన్సెలింగ్కు కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. 15న స్పష్టత రాకపోతే ఆగస్టు 1న తరగతుల ప్రారంభం కష్టమేనని, ఇందుకు గడువు కోసం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. -
‘వ్యాపమ్’ దర్యాప్తునకు 40 మందితో సీబీఐ బృందం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తు చేయటానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం 40 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి సారథ్యంలోని ఈ బృందం సోమవారం భోపాల్ చేరుకుని దర్యాప్తు స్వీకరిస్తుందని.. సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్.కె.గౌర్ తెలిపారు. వ్యాపమ్ కుంభకోణం పైనా, ఆ కుంభకోణానికి సంబంధించిన వారి అసహజ మరణాలపైనా సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ ఈ దర్యాప్తుపై ఈ నెల 24వ తేదీలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. -
దేశానికి పంగనామాలు పెట్టొద్దు
తానా రెండో రోజు మహా సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదన్న జస్టిస్ ఎన్వీ రమణ డెట్రాయిట్: అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) మహాసభలు రెండోరోజు ఘనంగా జరిగాయి. ఈ సభలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మతం ఏదైనా, కులం ఏదైనా జనాలందరూ తమకు కావల్సినట్లు అడ్డనామమో, నిలువునామమో పెట్టుకోండిగానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టొద్దని అన్నారు. భారతీయ విధానాల్లో సైన్స్ నిగూఢంగా దాగుందన్నారు. ధ్యానం దేవుడితో మాట్లాడే వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పారు. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మాట్లాడుతూ 36.5 కోట్ల మంది యువతతో భారత్ నవయవ్వనంతో తొణికిసలాడుతోందని అన్నారు. తెలుగు లిపి అజంతా శిల్పమంతటి అందమైనదని, జపాన్, చైనా దేశాలు భాషనే ఆయుధంగా మలుచుకుని ప్రపంచ వాణి జ్యాన్ని శాసిస్తున్నాయని అందుకే అందరూ భాషను గుర్తించి గౌరవించాలని కోరారు. అనంతరం వెంకయ్య నాయుడు వేడుకల సావనీర్ను విడుదల చేశారు. చిత్తూరు ప్రవాసులు న్యూట్రిన్ సంస్థల ఉపాధ్యక్షురాలు అనితారెడ్డికి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో రాజకీయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరూ తనను మౌనముని అంటారని కానీ తనను తాను మహామౌనమునిగా పిలుచుకుంటానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సభలో చమత్కరించారు. రెండోరోజు జరిగిన పలు కార్యక్రమాల్లో నిర్మాత సురేశ్బాబు, ఏపీ స్పీకర్ కోడెల, మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ , ఎంపీ సీఎం రమేశ్, ఏపీ మంత్రులు అయ్యనపాత్రుడు, కామినేని, పరిటాల, క్యూబాలో భారత రాయబారి రవి, పితాని, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీనటుడు వెంకటేశ్, నటులు నారా రోహిత్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకు దిగ్విజయ్
ఒకరి తరువాత ఒకరుగా నిందితులు అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తున్న మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు స్కాం(వ్యాపమ్)ను తక్షణం సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ జూన్ 30న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేశంలోనే ఏ కేసులోనూ జరగని విధంగా ఇందరు నిం దితులు అనుమానాస్పదంగా మరణించడం ఆందోళనకరమనీ, అనధికార వార్తల ప్రకారం 40మంది చనిపోయినట్లు సమాచారముందని దిగ్విజయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సక్రమంగా విచారించలేకపోతున్నందువల్ల.. అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని దిగ్విజయ్ కోరారు. -
ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు..
ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో... అది భారతదేశం అవుతుంది. అమ్మను, చెల్లిని, బిడ్డను... ‘తల్లీ’ అని పిలుచుకోవడం మన ఆచారం. జన్మనిచ్చిన తల్లి అని కాదు... ముక్కోటి దేవతల ప్రతీక అని. దేవుడి కోసం మనం గుడి కడితే... దేవుడు తన కోసం కట్టుకున్న గుడి... స్త్రీ అని నమ్ముతాం. ‘ఈ గుడి పవిత్రతను కాపాడడంలో రాజీ ఉండదు, ఉండకూడదు’ అని ఉపదేశించిన మరో మహోన్నత దేవాలయమే... సమాజం కట్టిన సుప్రీం దేవాలయం. స్త్రీని పూజించే కంటే ముందు... స్త్రీని రక్షించే ఈ దేవాలయానికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ వందనాలు. 2004.. జనవరి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని ఓ గ్రామం. స్నేహితురాలు వనజ ఇంటి నుంచి బయలుదేరింది పద్మ (పేరు మార్చాం). ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. వనజ వాళ్లన్నయ్య దగ్గర లెక్కలు చెప్పించుకోవడానికి స్కూల్ అవగానే వనజతో కలిసి వాళ్లింటికి వెళ్తుంటుంది. ఆ రోజు ట్యూషన్ అయిపోయాక సాయంత్రం ఆరున్నరకు ఇంటికి బయలుదేరింది. వనజ వాళ్లింటికి పద్మ వాళ్లింటికి అట్టే దూరం లేకపోయినా మధ్యలో పొదలు ఉంటాయి. చుట్టుపక్కల ఇళ్లేవీ ఉండవు. పద్మ సరిగ్గా ఆ పొదల దగ్గరకు రాగానే సంతోష్ (పేరు మార్చాం) ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. సంతోష్ ఆ ఊరి మోతుబరి కొడుకు. ఆకతాయి. సంతోష్ గురించి తెలిసిన పద్మ తలవంచుకొని తానే పక్కనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. వెళ్లనివ్వలేదు సంతోష్. పైగా తాగి ఉన్నాడు. పద్మ వెన్నులో సన్నని వణుకు. అరవబోయింది. చేత్తో నోటిని మూసి పద్మను పొదల్లోకి ఎత్తుకెళ్లాడు. గంట తర్వాత పద్మ ఇంటికి చేరింది.. సంతోష్ పారిపోయాడు. రాత్రి తొమ్మిదింటికి ఊళ్లో పంచాయితీ. ‘పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పంచాయితీలోనే రెండు కుటుంబాల వాళ్లు కాంప్రమైజ్ అయిపోండి’ అని పంచాయితీ పెద్దలు చెప్పారు. పద్మ వాళ్లన్నయ్య ‘అట్లెట్టా ఊరుకుంటాం.. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే’ అని పట్టుబట్టాడు. ఆ రాత్రికి రాత్రే చెల్లెలిని, తండ్రిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు పద్మవాళ్లన్నయ్య. కంప్లయింట్ ఇచ్చారు. పద్మను మెడికల్ టెస్ట్కు పంపారు. మరుసటి రోజు... మెడికల్ రిపోర్ట్ వచ్చింది పద్మ రేప్కి గురైనట్టు. పారిపోయిన సంతోష్ను పట్టుకొచ్చారు పోలీసులు. గ్రామ పెద్దతో పాటు రెండు కుటుంబాల వాళ్లూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కేసులు పెట్టుకొని ఎంత దూరం పోతరు? ఆడపిల్ల.. ఆలోచించుండ్రి’ అన్నడు గ్రామపెద్ద. ‘మావాడు చేసింది తప్పే.. మా తాహతుకు తగకపోయిన వాడు చేసిన తప్పుకి శిక్షగా మీ పిల్లను మా ఇంటి కోడల్ని చేసుకుంటం.. దీన్ని ఇక్కడితోనే ఇడిచిపెట్టుండ్రి’ అన్నాడు సంతోష్ మేనమామ. పద్మ మేనమామా ఆ పరిష్కారానికి అంగీకరించాడు. పద్మతల్లిదండ్రులనూ ఒప్పించాడు. ఒప్పందం కుదిరింది. రెండు కాళ్లమధ్య తలపెట్టుకొని వెక్కివెక్కి ఏడుస్తున్న పద్మకు సంబంధం లేకుండానే ఒప్పందం కుదిరింది. సంతోష్ని చూస్తే వణికిపోతున్న పద్మ అంగీకారం లేకుండానే అతనితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. టెన్త్లో స్కూల్ ఫస్ట్ రావాలనే లక్ష్యం తప్ప ఇంకే ఆలోచనా లేని ఆమె ఈసారి పెళ్లి అనే బలవంతానికి గురైంది! ఇది పదకొండేళ్ల నాటి మాట.. ఊరి పెద్దలు, పోలీసులు, తల్లిదండ్రులు కలిసి చేసిన మధ్యవర్తిత్వానికి ఓ అమాయకురాలు బలైంది. పైకి పొక్కింది ఇదొక్క సంఘటనే. పొక్కనివి, బాధితురాలి నోరు నొక్కి పెళ్లి చేసినవీ ఎన్నో! 2015.. జూలై.. ఇక నుంచి ఇలాంటి మధ్యవర్తిత్వాలు చెల్లవు. రేప్ చేసిన వాడు శిక్షను అనుభవించాల్సిందే! ‘స్త్రీ దేహం.. ఆమెకు దేవాలయం! ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణహక్కు. స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరిచే నిర్ణయాలతో, ఒప్పందాలతో ఆమె సమాధానపడవల్సిన అవసరం లేదు. రేప్కి గురైన స్త్రీ తల్లిదండ్రులతో నేరస్థుడు ఎలాంటి మధ్యవర్తిత్వం నెరపడానికీ వీల్లేదు. పెళ్లి చేసుకుంటానని, నష్టపరిహారమిస్తాననే ప్రలోభాలతో కేస్ను విత్డ్రా చేయించే ప్రసక్తే లేదు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే ’ అంటూ మూడ్రోజుల క్రితమే జూలై ఒకటో తారీఖున సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుకి కారణమైన కేసు ఇదే 2008లో మధ్యప్రదేశ్లో ఏడేళ్ల పాప రేప్కి గురైంది. నేరస్థుడికి సెషన్స్కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్ష రద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్టు నేరస్థుడి శిక్షను తగ్గించి యేడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే సరికి యేడాది కాలం పట్టింది కాబట్టి ఆ యేడాదీ శిక్షా పూర్తయిందని కేస్ కొట్టేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీకోర్టుకు అప్పీలు చేసింది. అదే సమయంలో తమిళనాడులో ఓ రేప్ కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా అత్యాచార బాధితురాలు మైనర్ బాలికే (15). రేప్వల్ల గర్భవతి అయింది. మద్రాస్ హైకోర్టు జడ్జి ఆ అమ్మాయితో... ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం అతడిని (రేపిస్టుని) పెళ్లిచేసుకో’ అంటూ రాజీకుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు ఆ తీర్పుతోపాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ స్త్రీ ఆత్మగౌరవాన్ని భంగపరిచే రాజీలు కుదరవు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తన తీర్పును స్పష్టం చేసింది. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మధ్యవర్తిత్వం అంటే ఏంటి? అఈఖ.. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం సులభంగా పరిష్కారం అయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్కి జడ్జి రిఫర్ చేస్తారు. సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, డౌరీ డెత్కేసులు, డెకాయిటీ కేసులను మీడియేషన్ సెంటర్కి రిఫర్చేయరు. చేయకూడదు కూడా! - ఇ. పార్వతి, హైకోర్టు అడ్వొకేట్ సమర్థించే అంశాలు కావు ఆడపిల్లలపై లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదుర్చు కోవడం లాంటివి సమర్థించే అంశాలు కావు. రాజీకి రావడానికి సమాజం కూడా ఓ కారణం. కాబట్టి మార్పనేది సమాజం నుంచే రావాలి. ప్రతి ఒక్క పౌరుడు దేశంలో జరుగుతున్న హింసను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. - డాక్టర్ లక్ష్మీదేవి, కేశవ్మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ ఈ తీర్పు మీద ఏమంటున్నారంటే.. ఏ ఆడపిల్లా కోరుకోదు రేప్ చేసిన మృగాన్ని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లా కోరుకోదు. ఇలాంటి వ్యక్తులకు పడే శిక్షలు వెలుగు చూస్తే ఇలాంటివి రిపీట్ కావు. - మౌనిక, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏ రకంగానూ భర్తీ చేయలేం రాజీ కుదుర్చుకోవడం కరెక్ట్ కాదు. ఆడపిల్లకు ఇలాంటి సంఘటనల కారణంగా కలిగే నష్టాన్ని ఏ రకంగానూ భర్తీ చేయలేం. ముందు అతనికి శిక్ష పడాలి. అలాగే ప్రభుత్వం బాధితురాలి కెరీర్కు ఆసరానివ్వాలి - సరోజినీ వల్లారపు, సాఫ్ట్వేర్ ఉద్యోగి మనకన్నా న్యాయంగా... మన కన్నబిడ్డ మనసు గురించి మనకన్నా సుప్రీంకోర్టే న్యాయంగా ఆలోచిస్తుందని తల్లిదండ్రులు ఇప్పటికైనా గ్రహించాలి. రేప్కు గురైన అమ్మాయిని సమాజం ఆమెను చూసే విధానంలో మార్పు రావాలి. -మాధవీలత, సామాజిక పరిణామాల విశ్లేషకురాలు ప్రక్షాళన కావాలి తీర్పు సరే.. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సభ్యసమాజం పూర్తిగా ప్రక్షాళన కావాలి. - శిలాలోలిత, లెక్చరర్, రచయిత్రి పెళ్లేమిటి!? సుప్రీం తీర్పు ఆహ్వానించదగ్గదే. రేప్ చేసిన వాడితో పెళ్లేమిటి? వాడిని కఠినంగా శిక్షించకుండా! -సతీష్, కాప్రికాన్ సిస్టమ్స్ -
ఎనిమిది వారాలు గడువు
పాలికె ఎన్నికల నిర్వహణపై సుప్రీం తీర్పు బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల నిర్వహణకు మరో ఎనిమిది వారాల పాటు గడువునిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 28న జరగాల్సిన బీబీఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వెనక్కు వెళ్లనుంది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పు ప్రతి తమకు అందినతర్వాతే ఈ విషయంపై మాట్లాడగలనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచార్ తెలిపారు. వివరాలు... ఆగస్టు 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీం తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడమే కాకుండా ప్రభుత్వానికి రూ.10వేల అపరాధ రుసుం విధించిన విషయం విషయం తెలిసిందే. అయితే హైకోర్టును తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈకేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వాదనల్లో భాగంగా బీబీఎంపీ వార్డులను పునఃవిభజన చేయడంతో పాటు నూతనంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల ఎన్నికల నిర్వహణకు కనీసం మరో మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించిన ఫణీంద్ర....‘ప్రస్తుత తరుణంలో వార్డుల పునఃవిభజ చేయడం వల్ల ఓటర్ల జాబితాను మార్చాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా వార్డుల రిజర్వేషన్ల జాబితా అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు అందజేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. అందువల్ల రిజర్వేషన్ జాబితా మార్చడానికి కాని, ఎన్నికల వాయిదా వేయడం కాని సరికాదు.’ అని వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయపీఠం బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి మరో ఎనిమిది వారాల పాటు గడువు ఇస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఈ విషయమై ఫణీంద్ర మాట్లాడుతూ...తాజా తీర్పు వల్ల వార్డుల పునఃవిభజనకు అవకాశం కలగదు. అంతేకాకుండా రిజర్వేషన్ల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎనిమిది వారాలు వెనక్కు వెళ్లేఅవకాశం ఉందన్నారు. ఈ ఎనిమిది వారాల వాయిదా నేటి (శుక్రవారం) నుంచి అన్వయిస్తుందా లేదా ఆగస్టు 5 నుంచి అన్వయిస్తుందా అనే విషయంపై తీర్పు ప్రతి అందిన తర్వాత స్పష్టత వస్తుంది.’ అని వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ శ్రీనివాచార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత పరిశీలించి న్యాయనిపుణులతో చర్చించి నూతన ఎన్నికల షెడ్యూల్ వెళ్లడించడం పై అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలా ఉండగా సుప్రీం తీర్పు వల్ల గతంలో వలే ఆగస్టు 5 లోపు కాకుండా అక్టోబర్ 5లోపు బీబీఎంపీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
రాష్ట్రంలో ఎస్మా
బెంగళూరు : రాష్ట్రపతి అంగీకారంతో కర్ణాటకలో ‘ఎస్మా’ చట్టం అమల్లోకి వచ్చిం దని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. ఎస్మాను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ప్రయోగించబోదని, అయితే ప్రభుత్వ అమ్ముల పొదిలో ఒక అస్త్రంగా మాత్రం ఉండనుందని తెలిపారు. మంగళవారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైద్యులు, ఉపాధ్యాయుల నిరసనకు దిగిన సందర్భంలో ఎస్మా చట్టం అమల్లో లేక పోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే ఎస్మా చట్టం ఇక పై అమల్లో ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో వారం లోపు పిటీషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పోస్టు ప్రస్తుతానికి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మంత్రిమండలి పునఃవ్యవస్థీకరణ, విస్తరణకు సంబంధించి హై కమాండ్తో సీఎం సిద్ధరామయ్య చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇస్తే తనకు అభ్యంతరం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి టీ.బీ జయచంద్ర సమాధానం చెప్పారు. -
బీసీసీఐకి లోధా కమిటీ ప్రశ్నావళి
న్యూఢిల్లీ: బీసీసీఐలో పరిపాలనా సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన లోధా కమిటీ కార్యరంగంలోకి దిగింది. దీంట్లో భాగంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ 80కి పైగా ప్రశ్నలను బోర్డుకు పంపింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ... బోర్డుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, ఆడిట్స్, ఖాతాల నిర్వహణ, కమిటీలు.. ఎన్నికలు, ఆటగాళ్ల సంక్షేమం, పారదర్శకత, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఏడు ఉప శీర్షికలతో ఈ ప్రశ్నావళిని రూపొందించింది. వీటికి బీసీసీఐ ఉన్నతాధికారులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. -
భావ ప్రకటనకూ పరిమితులున్నాయి: సుప్రీం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ నిరపేక్షమేం కాదని, దానికీ పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛను విశాల కోణంలో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దానికి అంతర్గతంగా స్వతఃసిద్ధ పరిమితులు కూడా ఉండాలి. అవి రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని 19(1) అధికరణ అందించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నిరపేక్షమేం కాదని, దానికీ అదే అధికరణంలోని రెండవ భాగం 19(2) కింద పరిమితులుంటాయని మేం ఇదివరకే స్పష్టమైన వివరణ ఇచ్చాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్ల ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. మహాత్మాగాంధీపై అనుచిత రీతిలో, అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ వసంత్ దత్తాత్రేయ గుర్జార్ అనే మరాఠీ కవి రాసిన కవితను 1994లో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ వారి ఇన్హౌజ్ జర్నల్లో ప్రచురించిన ప్రచురణ కర్త దేవీదాస్ రామచంద్ర తుల్జాపుర్కర్పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. -
2011 గ్రూప్-1కు సొంత ఏర్పాట్లు
హైదరాబాద్: 2011లో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్స్ను మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏపీతో సంబంధం లేకుండా విడిగా మెయిన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రిలిమ్స్లో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులను మళ్లీ మెయిన్స్కు ఎంపిక చేసి పరీక్షను నిర్వహించడమా లేక ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త పరీక్షకు వెళ్లాలా అని సర్కారు యోచి స్తోంది. 2011లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో 6 తప్పులు దొర్లడంతో తాము మెయిన్స్కు అర్హత పొందలేకపోయామని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది కోర్టు ఆదేశించింది. -
జవాబుదారీతనం ఎలా?
ఎన్జేఏసీపై సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ) పనితీరుకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పలు ప్రశ్నలు సంధించింది. ‘న్యాయ వ్యవస్థ పనితీరును ఆ కమిషన్ ఏ విధంగా అర్థవంతంగా, జవాబుదారీగా మారుస్తుంది?’ అని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రభుత్వాన్ని అడిగేముందు, మేం అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం’ అని ఎన్జేఏసీకి వ్యతిరేకంగా వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్కు వివరించింది. ఆ కమిషన్ ప్రభుత్వానికే జవాబుదారీ కనుక ఈ ప్రశ్నలను ప్రభుత్వాన్నే అడగడం మంచిదని ధావన్ బదులిచ్చారు. ఎన్జేఏసీ చట్టంలోని ‘లక్ష్యాలు- కారణాలు’లో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం పై సందేహాలను వ్యక్తం చేస్తూ.. వారు చెబుతున్న అర్థవంతమైన పాత్ర అంటే ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత లేదా లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సభ్యులుగా ఉండటంపై.. ‘ఇద్దరు రాజకీయ నేతలు, వారిమధ్య ఇరుక్కుపోయిన చీఫ్ జస్టిస్.. వీరు ముగ్గురు న్యాయ నియామకాల్లో జోక్యం చేసుకోగల ఇద్దరు వ్యక్తులను ఎలా నిర్ణయిస్తారు?’ అని ప్రశ్నించింది. ‘న్యాయవ్యవస్థలో ప్రాథమిక, దిగువ స్థాయి నియామకాలకు వారి(ప్రముఖులైన ఇద్దరు సభ్యులు) స్థాయి సరిపోతుంది కావచ్చు కానీ ఉన్నతస్థాయి నియామకాల్లో న్యాయమూర్తిగా, లేదా న్యాయవాదిగా అభ్యర్థి సామర్ధ్యాన్ని గుర్తించగలగడం ముఖ్యం. అది వారు చేయగలరా’ అని జస్టిస్ గోయెల్ వ్యాఖ్యానించారు. ఆ సభ్యులకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని, ఆ మూడేళ్లూ వారిని భరించాల్సిందేనని ధావన్ పేర్కొన్నారు. ఎన్జేఏసీ చట్టం 2014, సంబంధిత రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పై ప్రశ్నలను ధర్మాసనం సంధించింది. న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో నిరాధారమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇది రాజకీయ వేదిక కాదని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆయనను మందలించింది. ఈ తరహాలో పిల్ దాఖలు చేసినందుకు ఇక ముందు మరెప్పుడూ పిల్ దాఖలు చేయకుండా ఎందుకు అనర్హుడిగా చేయకూడదో చెప్పాలని, దీనికి వారంలోగా సమాధానం ఇవ్వాలని శుక్రవారం కోర్టు ఆదేశించింది. శర్మ దాఖలు చేసిన పిల్లోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. శర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సుప్రీంకోర్టులో అనవసరంగా పిల్లు దాఖలు చేస్తున్న విషయాన్ని తాము గుర్తించామని, చెత్త ఆరోపణలతో ఇలా ఎవరంటే వారిపై పిల్లు దాఖలు చేయడానికి కోర్టు రాజకీయ వేదిక కాదని ధర్మాసనం పేర్కొంది. -
‘బ్లాక్మనీపై దర్యాప్తు పురోగతి చెప్పండి’
న్యూఢిల్లీ: నల్లధనంపై దర్యాప్తు పురోగతిని వివ రిస్తూ మే 12కల్లా తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సిట్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. వచ్చేనెల 12కల్లా నివేదిక సమర్పిస్తే వేసవి సెలవులకు ముందు ఈ అంశాన్ని పరిశీలించే వీలుంటుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సోలి సొరాబ్జీకి ధర్మాసనం సూచించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
పరువునష్టం కేసుల్లో కేజ్రీవాల్కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీ ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులపై ఆయన పిటిషన్కు సంబంధించి 6 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అత్యంత అవినీతిపరుల జాబితాలో కేజ్రీవాల్ తన పేరు చేర్చారంటూ కేంద్రమంత్రి గడ్కారీ కోర్టుకెక్కగా, ఆప్ విద్యుత్ చార్జీల తగ్గింపు ఉద్యమంలో నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మాజీ రాజకీయ కార్యదర్శి కేసు పెట్టారు. -
మందిరాన్ని పునర్నిర్మించండి: పాక్ సుప్రీంకోర్టు
ఇస్లామాబాద్: గతంలో ధ్వంసం చేసి, మతపెద్ద ఆక్రమించుకున్న ఓ హిందూ మందిరాన్ని పునర్నిర్మించి పరిరక్షించాల్సిందిగా పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఖైబర్ పక్తూంక్వా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగేలా జరుగుతున్న అసాంఘిక సంఘటనల్లో జోక్యం కల్పించుకోవాల్సిందిగా రమేశ్ కుమార్ వంక్వాని అనే హిందువు కోర్టును కోరారు. అలాగే ఖైబర్ పక్తూంక్వాలోని ఓ గ్రామంలో శ్రీ పరమహంస జీ మహరాజ్ సమాధిని కూల్చివేసి, ఆక్రమించుకోవడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ విషయంలో సామరస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని అదనపు అడ్వొకేట్ జనరల్ వకార్ అహ్మద్.. ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ దేవాలయాన్ని పునర్ నిర్మించి పరిరక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పరువు నష్టం కేసుల్లో కేజ్రీవాల్కు ఊరట
- సమాధానం ఇవ్వాల్సిందిగా - కేంద్ర న్యాయశాఖకు నోటీసు - జారీ చేసిన సుప్రీం - అంతవరకూ రెండు కేసులపై - విచారణ నిలిపేయాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీలోని ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే పరువు నష్టాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్ట్టాల రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖకు నోటీసు జారీ చేసింది. సమాధానం వచ్చేంతవరకూ కేజ్రీవాల్పై దిగువ న్యాయస్థానంలో దాఖలైన రెండు నేరపూర్వక పరువు నష్టం కేసులపై విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్కు తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ పరువు నష్టం కేసులపై తదుపరి విచారణ జులై 8న జరుగనుంది. కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్ను, ఇదే విషయమై బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పెండింగ్ పిటిషన్ విచారణతో జోడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కే జ్రీవాల్పై దాఖలైన పరువు నష్టం కేసుల్లో ఒకటి గడ్కరీ కేసిన పరువు నష్టం పిటిషన్ కాగా మరొకటి సురేందర్కుమార్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్పై పటియాలా హౌజ్ కోర్టు విచారణ జరుపుతోంది. తనను అత్యంత అవినీతిపరుడైన నేతగా ఆరోపణలు చేయడాన్ని సవాలుచేస్తూ గడ్కరీ కేజ్రీవాల్పైనా, ఆయన సహచరులపైనా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని ఆశ చూపి ఆ తరువాత తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాక అవినీతిపరుడినంటూ తనపై అభాండాలు మోపారని ఆరోపిస్తూ న్యాయవాది సురేందర్ శర్మ సీఎం కేజ్రీవాల్పైనా, ఆప్ నేతలపైనా పరువు నష్టం దావా వేశారు. అ కేసు కడ్కడూమా న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. -
‘గాంధీపై అశ్లీల కవిత్వం’ కేసులో తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: మహాత్మునిపై మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్జర్ రాసిన కవిత్వం అసభ్యకరంగా ఉందంటూ ఓ ఉద్యోగి వేసిన పిటిషన్పై తీర్పును గురువారం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 1984లో రాసిన ఈ కవితను 1994లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్కు చెందిన పత్రికలో ప్రచురించారు. -
సుప్రీంకు విన్నవించిన అంశాలపై ‘మీడియా’లో చర్చ సరికాదు: సహారా
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతోరాయ్ విడుదల బెయిల్కు రూ.10,000 కోట్ల సమీకరణ అంశాలపై సుప్రీంకోర్టు ముందు పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చ, మీడియా ఊహాగానాలు సరికాదని సహారా పేర్కొంది. ఆయా అంశాలు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. సహారా నిధుల సమీకరణపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. నిధుల సమీకరణకు సుప్రీంకోర్టుకు తాజాగా సంస్థ ఒక ప్రతిపాదనను తెలియజేసింది. చైనా బ్యాంక్ నుంచి సహారా ఆస్తుల తనఖా విడుదలకు స్పెయిన్ బ్యాంక్ బీబీవీఏ రుణం అందించనుందన్నది దీని సారాంశం. అయితే తమ వద్ద ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బీబీవీఏ పేర్కొన్నట్లు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇక హెచ్ఎస్బీసీ రూ.5,000 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని సహారా పేర్కొంటున్నప్పటికీ, ఆ బ్యాంకు నుంచి సైతం ఈ మేరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. హెచ్ఎస్బీసీ ప్రతినిధి అసలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించగా, పేరు తెలపడానికి ఇష్టపడని మరో అధికారి అసలు ఇటువంటి ప్రతిపాదనే తమ వద్ద లేదని పేర్కొన్నారు. విదేశాల్లోని ఆస్తుల అమ్మకం, బెయిల్కు నిధుల సమీకరణకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. -
అవసరమైతే మార్పులు చేస్తాం..!
న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ విషయంలో తమ ప్రభుత్వానికి, గత యూపీఏ ప్రభుత్వానికి పోలిక లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘భావప్రకటన స్వేచ్ఛ హక్కుకు కట్టుబడి ఉన్నామని మేం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపాం. యూపీఏ ప్రభుత్వం మాత్రం తమను వ్యతిరేకిస్తున్నవారిపై, వ్యంగ్యంగా చిత్రిస్తున్నవారిపై కక్షసాధింపునకు మార్గంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంది’ అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కానీ ఈ తీర్పు నేపథ్యంలో చట్టంలో ఏమైనా మార్పులు అవసరమని భద్రతా సంస్థలు భావిస్తే.. చట్టపరంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా.. అవసరమైన చర్యలు చేపడతాం’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ముందు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కేంద్రప్రభుత్వం సమర్ధించిన విషయం తెలిసిందే. -
‘ఎన్జేఏసీ చట్టంపై ఫిర్యాదులు స్వీకరించొద్దు’
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొత్తగా రూపొందించిన రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను ఇకపై దిగువ కోర్టులు స్వీకరించరాదని సుప్రీంకోర్టు బుధవారం నిర్దేశించింది. రాజ్యాంగ సమ్మతి ఉన్న ఈ రెండు చట్టాలకు సంబంధించిన ఎలాంటి విషయాలపై పిటిషన్లు వచ్చినా హైకోర్టుతో సహా దిగువ కోర్టులు ఏవీ కూడా విచారించరాదని జస్టిస్ దవే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు చట్టాలను సవాలు చేస్తూ వేసే పిటిషన్లను విచారించాలా... వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. కాగా, సైన్యానికి సంబంధించిన వివాదాల్లో సాయుధ బలగాల ట్రిబ్యునల్(ఏఎఫ్టీ) ఇచ్చే తీర్పులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారించేందుకు హైకోర్టులకు అధికారం లేదని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
‘వర్కింగ్ కమిటీకి ఎందుకు వెళ్లారు’
న్యూఢిల్లీ: ఈనెల 8న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ మీటింగ్కు కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ శ్రీని హాజరు కావడమే కాకుండా అధ్యక్షత వహించారని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఏజీఎం తేదీని మాత్రమే ఖరారు చేశారని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకూడదనే కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ఎన్నికలయ్యే వరకు తన పదవికి దూరంగా ఉండమని చెప్పలేదని అన్నారు. వచ్చే శుక్రవారంలోపు తాము పూర్తి వివరణ ఇస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. -
జేడీఎస్ కార్యాలయం ఖాళీ
నేడు కేపీసీసీకి అప్పగింత : దేవెగౌడ బెంగళూరు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్కు నేడు (ఆదివారం) అప్పగించబోతున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ను శనివారం ఆయన దగ్గరుండీ మరీ మరో ప్రాంతానికి మార్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... చివరి వరకూ కార్యాలయాన్ని దక్కించుకోవడానికి చాలా పోరాడమన్నారు. అయితే న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కిందని వాపోయారు. న్యాయస్థానం ఆదేశాలను ఎవరైనా పాటించక తప్పదన్నారు. ఇందుకు తాను అతీతుడేమి కాదని తెలిపారు. సరైన భవనం దొరికినప్పుడు తమ కార్యాలయాన్ని అందులో కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆనందరావ్ సర్కిల్లో ఉన్న జేడీఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందినదని అందువల్ల ఆ కార్యాలయాన్ని కర్ణాటక కాంగ్రెస్ పార్టీకు అప్పగించాలని ఆ పార్టీ నాయకులు న్యాయస్థానంలో కేసు వేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు
సీ కేటగిరీ గనుల వేలంపై స్పందించిన సీఎం తుంగభద్ర పూడికతీత అసాధ్యం ప్రత్యామ్నాయలపై దృష్టి మంత్రి జారకిహోళికి శాఖ మార్పు మార్చిలో బడ్జెట్ సమావేశాలు బళ్లారి : రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరు నుంచి బాగల్కోటకు వెళుతూ జిందాల్ విమానాశ్రయంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఆ గనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారని, ఆయనతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ చేస్తున్నామన్నారు. తుంగభద్రలోని పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి సతీష్ జారకిహోళి శాఖ మార్పు, ఆయనకు ఏ శాఖ కేటాయించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం జారకిహోళికి సముచిత శాఖ కల్పిస్తామన్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. వచ్చే వారం బడ్జెట్కు సంబంధించి నిపుణులతో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చేసిన సలహాలు, సూచనల మేరకు బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. క్రికెట్ బోర్డును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు. ‘బీసీసీఐ పబ్లిక్ బాడీ అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాబట్టి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. రోజువారి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి’ అని సోనోవాల్ వ్యాఖ్యానించారు. -
స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
-
స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
వెల్లడించనున్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు నేడు (గురువారం) వెల్లడించనుంది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 18 నెలల కిందట ఈ స్కాండల్ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ... ఫిక్సింగ్లో బీసీసీఐలోని కొంత మంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తేల్చడంతో కేసు అనేక మలుపులు తీసుకుంది. -
సంబరాలు
గాలి జనార్దనరెడ్డికి బెయిల్తో సంబరాలు బళ్లారిలో పండగ వాతావరణం పెద్ద ఎత్తున బాణసంచా మోత బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి మంగళవారం అన్ని కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బెయిల్ లభించడంతో బళ్లారిలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మూడేళ్ల క్రితం మైనింగ్ కేసులకు సంబంధించి సీబీఐ గాలి జనార్దనరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. మూడేళ్లుగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్న గాలి జనార్దనరెడ్డికి ఎట్టకేలకు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో బళ్లారిలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, గాలి జనార్దనరెడ్డి అభిమానుల నేతృత్వంలో బళ్లారిలోని ఎస్పీ సర్కిల్, రాయల్ సర్కిల్, తాళూరు రోడ్డు సర్కిల్, ఏపీఎంసీ సర్కిల్, మోతీ సర్కిల్ తదితర అన్ని ప్రధాన కూడళ్లలో బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నేతకు బెయిల్ లభించడంతో బళ్లారిలో పండుగ వాతావరణం నెలకొందని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని సంతోష క్షణాలు పంచుకున్నారు. మూడేళ్లుగా గాలి జనార్దనరెడ్డి జైలులో ఉండటంతో అభిమానులతో పాటు బళ్లారిలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు కుదేలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో బళ్లారికి తిరిగి కొత్త కళ సంతరించుకునే అవకాశం ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మోత్కర్ శ్రీనివాస్రెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు నగరంలో ర్యాలీ చేపట్టి సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఇక ప్రజలు గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించిన సంగతి తెలియడంతో ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కుపోయారు. ఇక జనార్దనరెడ్డి ఒకటి రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఆయనను చూసేందుకు బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలి వెళ్లేందుకు అభిమానులు, మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెయిల్ లభించడం హర్షణీయం : గాలి సోమశేఖర్రెడ్డి తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సాక్షితో మాట్లాడారు. భగవంతుని కృప, బళ్లారి జిల్లా ప్రజల ఆశీస్సుల వల్ల తన సోదరునికి బెయిల్ లభించిందన్నారు. బళ్లారి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు జనార్దనరెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారన్నారు. బళ్లారి అభివృద్ధికి బాటలు : కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్రెడ్డి గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో నిస్తేజంగా ఉన్న బళ్లారి జిల్లా అభివృద్ధి చెందడం ఖాయమని బీజేపీ నేత, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాలి జనార్దనరెడ్డి అరెస్టయినప్పటి నుంచి జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆయన నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు. గాలి బెయిల్తో బళ్లారిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. -
బెంగళూరులో భద్రత రెట్టింపు
బెంగళూరు : అన్ని కేసులకు సంబంధించి మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి సుప్రీం కోర్టులో బెయిల్ లభించిన నేపథ్యంలో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. ఆయన విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు బెయిల్ లభిం చిన వెంటనే బళ్లారితో పాటు బెంగళూరులో ఉన్న జనార్ధనరెడ్డి అభిమాను లు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఆయన విడుదలకు సంబంధించిన కాగితాలు తొలుత హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం నాలుగు రోజుల సమయం పట్టనున్నట్లు జనార్ధనరెడ్డి తరుఫు న్యాయవాది హనుమంతరాయ పేర్కొన్నారు. కాగా, జైలులో ఉన్న తమ అభిమాన నేత గాలి జనార్ధనరెడ్డిని కలవడానికి బుధవారం నుంచి బళ్లారితోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విడుదల రోజున ఎక్కువ మంది జనసందోహం చేరే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.