Tamil Nadu
-
రూ.1,141 కోట్లతో రోడ్లు..
పీఎంకు లేఖ రాసేందుకు ముందుగా సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో కొత్త రోడ్లు వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి పనులను ప్రభుత్వం విస్తృత చేసిన విషయం తెలిసిందే. చెంగల్పట్టు – తిరువణ్ణామలై, సెయ్యూరి రహదారి విస్తరణ, పనయూర్ లింక్ రోడ్డుతో సహా సెయ్యూర్–వందవాసి–పోలూర్ రోడ్డు పనులు ప్రస్తుతం ముగించారు. మరుతడు, వందవాసి, సేతుపట్టులలో బైపాస్రోడ్డుల ఏర్పాటు, హై లెవల్ వంతెనలు, రోడ్డుకు ఇరు వైపులా 47,700 మొక్కలు పెంపకం వంటి వంటి పనులు ముగించారు. చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిలోని తూర్పు వైపున సముద్ర తీర రోడ్డును విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారి అనుసంధానించే విధంగా మరుతడు, వందవాసి, సేతుపట్టులలో బైపాస్ రోడ్డులను ఏర్పాటు చేశారు. చెంగల్పట్టు– తిరువణ్ణామలైలలోని 67 గ్రామాలకు రవాణాను సులభతరం చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ పనులన్నింటినీ సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారుల శాఖమంత్రి ఏవీ వేలు, కార్యదర్శి ఆర్. సెల్వరాజ్, చైన్నె–కన్యాకుమారి ఇండస్ట్రియల్ ఏరియా ఆఫీస్ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర పాండియన్, చీఫ్ ఇంజినీర్ డి. జెబాసెల్విన్ పాల్గొన్నారు. అలాగే తమిళనాడు వినియోగదారులు, ఆహార సరఫరా విభాగం నేతృత్వంలో రూ. 92.45 కోట్లతో నిర్మించిన 6 గిడ్డంగులు ,11 ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలు, 4 పైకప్పు నిర్మాణంతో ఆధునిక బియ్యం నిల్వ సౌకర్యాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ. 10.20 కోట్ల అంచనా వ్యయంతో 6 వృత్తాకార ప్రాసెసింగ్ గిడ్డంగుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేలు, పెరియకరుప్పన్, చక్రపాణి, టి.ఆర్.బీ. రాజ, ప్రధాన కార్యదర్శి మురుగానందం, వినియోగదారుల రక్షణ శాఖ కార్యదర్శి సత్యప్రద సాహూ, రిజిస్టార్ నందకుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ బర్తడే మరి కొద్ది రోజుల్లో జరగనుది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్టాలిన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన సతీమని దుర్గా స్టాలిన్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాటూ రోజుకు 1000 మంది అన్నదానం దిశగా ఏర్పాట్లు చేశారు. -
చైన్నె కామిక్ కాన్ – 2025
సాక్షి, చైన్నె: చైన్నె నందంబాక్కం ట్రేడ్సెంటర్ వేదికగా శని, ఆదివారాలలో కామిక్ కాన్ – 2025 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యమహా యాక్షన్ – ఫ్యాక్ట్ షోకేస్ను కొలువుదీర్చారు. భారతదేశంలోనే అతిపెద్ద పాప్ సాంస్కృతిక కార్యక్రమం కామిక్ కాన్ నిలవడమే కాకుండా గొప్ప సాంస్కృతిక, వారసత్వం, డైనమిక్ ఆటోమోటివ్ పరిశ్రమ, ఉద్వేగభరితమైన అభిమానుల సంఘాల నగరం కళ, జీవనశైలి ఆవిష్కరణలతో అద్బుత వేడుకను నిర్వహించారు. ఇందులో యమహా ఎక్స్పీరియనన్స్ జోన్ ప్రధాన హైలైట్గా నిలిచింది, సందర్శకులు వర్చువల్ రేసింగ్ అనుభవాన్ని, గేమింగ్లో వచ్చే తమకు నచ్చిన వారి వేషాధారణలో అలరించారు. కంపెనీ కామిక్ కాన్ సూపర్ ఫ్యాన్ బాక్స్, యమహా ప్రత్యేకమైన కామిక్ కాన్ థీమ్డ్ వస్తువులు ఔత్సాహికులను అలరించాయి. -
అన్నామలైకే మళ్లీ ఛాన్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైకు మళ్లీ ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రంలో తుది దశకు చేరిన విషయం తెలిసిందే. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధిష్టానం ఆమోదంతో జాబితా వెలువడాల్సి ఉంది. ఆ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవుల ప్రక్రియ సాగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విస్తృతంగాఅ న్నామలై పర్యటిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేతో వైర్యం పెట్టుకోవడం ఇతర బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారంలో సీనియర్ నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఈనెల 17వ తేది జరగబోతోంది. అధ్యక్ష ఎంపికకు నియంచిన కమిటీ బాధ్యతల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఈసారి అధ్యక్ష పదవి రేసులో మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ సైతం రేసులో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే వారు సుముఖంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతం దిశగా అన్నామలై పరుగులు తీస్తుండడం, అధిష్టానం మద్దతు పాటూ రాష్ట్రంలో కేడర్ అంతా ఆయన వైపు చూస్తుండడంతో మరోమారు అన్నామలై అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయం అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆహ్వానం!
సాక్షి, చైన్నె: కొత్త సంవత్సరంలో తొలి సమావేశానికి హాజరుకావాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని అసెంబ్లీ స్పీకర్ అప్పావు ఆహ్వానించారు. ఈనెల 6న అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం తొలి అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగంతో మొదలెట్టడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్గా ఆర్ఎన్ రవి బాధ్యతలు స్వీకరించినానంతరం మూడవ సంవత్సరంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈనెల 6న సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ రవిని ఆహ్వానించేందుకు స్పీకర్ అప్పావు శుక్రవారం ఉదయం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో కాసేపు సమావేశమయ్యారు. తొలి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా తన ప్రసంగం పాఠం గురించి స్పీకర్తో గవర్నర్ సమాచారం రాబట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే అంశాలను వివరించే విధంగా గవర్నర్ ప్రసంగంలో అంశాలను పాలకుల పేర్కొనడం జరుగుతోంది. అయితే, ఈ ప్రసంగాలను గవర్నర్ రవి గత రెండేళ్లు పక్కన పెట్టారు. తొలిసారిగా అయితే, పెద్ద దుమారమే సభలో చోటుచేసుకుంది. గవర్నర్కు వ్యతిరేకంగా సభలో డీఎంకే పాలకులు తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా గత ఏడాది ప్రభుత్వ ప్రసంగాన్ని గవర్నర్ పక్కన పడేశారు. తొలి పేజీ, చివరి పేజీని మాత్రం చదివి సభ నుంచి బయటకు వచ్చేయడం మళ్లీ చర్చకు, రచ్చకు దారి తీసింది. తాజాగా మూడో సంవత్సరంగా సభలో అడుగు పెట్టబోతున్న గవర్నర్ ఆర్ఎన్ రవి ఎలా స్పందించనున్నారో అనే చర్చ ఇప్పటికే అందరిలో సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవిని స్పీకర్ కలవడం, సభకు రావాలని ఆహ్వానించడం గమనార్హం. -
ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: తిరుపతి – చైన్నె జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా ఉన్న దుకాణాలు, భవనాలను అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ శుక్రవారం తొలగించారు. అయితే దుకాణాలను తొలగించే సమయంలో వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో నిత్యం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండడంతో తరచూ ట్రాఫిక్కు సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జేఎన్ రోడ్డు, సీవీనాయుడు రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం ప్రకటనలు జారీ చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, భవనాలను ఎవరికి వారే తొలగించుకోవాలని సూచించారు. అయితే వ్యాపారులు పెద్దగా స్పందించకపోవడంతో శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించేలా ఉన్న పూల దుకాణాలు, టీస్టాల్స్, స్వీట్స్స్టాల్స్తోపాటు ఇతర వాటిని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సమయంలో ఆక్రమణలను వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. కొందరు వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వ్యాపారులను బలవంతంగా పక్కకు తప్పించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించారు. -
రేయింబవళ్లు శ్రమిద్దాం
సాక్షి, చైన్నె: ఎన్నికలకు 15 నెలలే సమయం ఉంది...రేయింబవళ్లు శ్రమిద్దాం.. విజయ్ను సీఎం చేద్దాం అని పార్టీ నేతలకు తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆదేశాలతో నియోజకవర్గ నేతలతో తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సమీక్షలపై దృష్టి సారించారు.చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాల విస్తృతానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం తిరువణ్ణామలై జిల్లా పరిధిలోని చెయ్యారు, ఆరణి, పోలూరు, వందవాసి, కలశసాక్కం, కీల్ పెన్నాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వం, పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి బుస్సీ ఆనంద్ వివరించారు. నియోజకవర్గాల వారీగా పట్టున్న ప్రాంతాలు, బలం కలిగిన నేతలు,తదితర వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలలుమాత్రమే సమయం ఉందని వివరించారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రతి కార్యకర్త,నాయకుడు రేయింబవళ్లు శ్రమించాల్సిన అవసరం ఉందని సూచించారు. అహర్నిషలు శ్రమించడం ద్వారా విజయ్ను సీఎం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ సూచించే అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాలలో తీవ్రంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోండడంతో కార్యక్రమాల వేగం మరింత పుంజుకోవాలని, అందర్నీ కలిసేందుకు త్వరలో విజయ్ నియోజకవర్గాలకు వస్తారని పేర్కొన్నారు. -
ఆయనతో నటించడం మంచి అనుభవం
తమిళసినిమా: సంచలన నటీమణుల్లో శ్రుతిహాసన్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. చాలా బోల్డ్ నటి ఈమె. నచ్చింది చేయడం, నచ్చకపోతే నో అని నిర్మొహమాటంగా చెప్పే నటి శుృతిహాసన్. ఇలానే ఇటీవల ఒక తెలుగు చిత్రం నుంచి వైదొలగి వార్తల్లోకి ఎక్కారు. పెళ్లి వద్దు, సహజీవనం ముద్దు అని చెప్పే గట్స్ ఉన్న నటి ఈ భామ. అయితే వివాహమనేది పవిత్రమైనదని, పెళ్లి చేసుకోవడానికి తనకలాంటి వ్యక్తి ఇప్పటి వరకు తారసపడలేదని అంటారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో శ్రుతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్లో తాను క్రిస్మస్ రోజు కూడా కూలీ చిత్రం షూటింగ్లో పాల్గొన్నానని చెప్పారు. గత ఏడాది కూడా క్రిస్మస్ రోజున క్రాక్ అనే తెలుగు చిత్ర షూటింగ్లో ఉన్నట్లు గుర్తు చేశారు. తనకు లోకేష్కనకరాజ్ చిత్రాలంటే చాలా ఇష్టమని ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని, అది కూలీతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. రజనీతో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ అమ్మడు త్వరలో ధనుష్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈమె ఇంతకుముందు ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది కూడా. త్వరలో సలార్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులోనూ శ్రుతిహాసన్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
25 కేజీల గంజాయి స్వాధీనం
తిరుత్తణి: ఆంధ్రా నుంచి బస్సుల్లో తరలించిన 25 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని పొన్పాడి చెక్పోస్టు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తిరుపతి నుంచి చెన్నై, కాంచీపురం, తిరుత్తణి ప్రాంతాలకు పయనించిన బస్సుల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో వుంచి తరలించిన 25 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. విచారణలో కాంచీపురం జిల్లా చిరువానూరుకు చెందిన దినేష్(21), ప్రతాప్కుమార్(21), విజయ్(18) ఆంధ్రాలో గంజాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలించినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ప్రభుత్వ బస్సులో తరలించిన 6 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న తిరుత్తణి పోలీసులు చిత్తూరు జిల్లా నగరి సమీపం ఓజుకుప్పానికి చెందిన తరుణ్(18) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
విజయ్పై ఆదిలోనే విమర్శలెందుకు!
తమిళసినిమా: శ్ఙ్రీరాజకీయ రంగ ప్రవేశం చేసిన పురిటీలోనే నటుడు విజయ్పై విమర్శల దాడి చేస్తున్నారు. ముందు ఆయన్ని రాజకీయాలు చేయనివ్వండి ఆ తర్వాత విమర్శించండి శ్ఙ్రీఅని దర్శకుడు, సినీ దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వి.ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. సిగర్ పిక్చర్స్ పోతాకంపై కమల కుమారి, రాజ్ కుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఎక్స్ ట్రీమ్. రాజ వేర్ కష్ణ దర్శకత్వం వహించిన ఇందులో నటి రక్షిత మహాలక్ష్మి, అబి నక్షత్ర, రాజ్ కుమార్,ఆనంద్ నాగ్ ,అమృత షెల్టర్, శివం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతాప్ సంగీతాన్ని డీజే బాల ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హిట్టు సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద ల్యాబ్లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె. రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఇతని నిర్మాత రాజ్కుమార్ మాట్లాడుతూ శ్ఙ్రీదర్శకుడు రాజా వేల్ మొదట ఒక కథ చెప్పినప్పుడు దాన్ని షార్ట్ ఫిలింగా రూపొందించాం. అది పలు అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు అందులో నటించిన నా నటనకు అభినందనలు లభించాయి. అదే షార్ట్ ఫిలింను తూవల్ పేరుతో చిత్రంగా రూపొందించి ఇటీవల విడుదల చేయగా పలువురి ప్రశంసలు లభించాయి.. ఆ తర్వాత మహిళల దక్షిణ ఇతివృత్తంతో కూడిన ఈ ఎక్స్ట్రీమ్ చిత్రాన్ని నిర్మించాం.. ఇందులోనూ దర్శకుడు నన్ను పోలీసు అధికారిగా నటింపజేశారుశ్రీశ్రీ అని చెప్పారు.. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ భర్త రాజ్కుమార్ ఆశకు బలాన్నిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన కమల కుమారికి అభినందిస్తున్నాను. ఇప్పుడు బయట వారు సినిమా వాళ్లను విమర్శిస్తున్నారు. అయితే బయట ప్రపంచంలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి. నటుడు విజయ్ ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన పై ఆదిలోనే విమర్శల దాడి చేస్తున్నారు. విజయ్ రాజకీయాలు చేసిన తర్వాత విమర్శించండి. సినిమా రంగం నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు.. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు.. అని దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. -
హీరోయిన్లను ఎంపిక చేసేది వీరే..
తమిళసినిమా: సినీరంగంలో కథానాయికలు ఒక స్థాయికి ఎదిగిన తరువాత కచ్చితంగా వారి వాయిస్ రైజ్ అవుతుంది. అలాంటి వారిలో నటి తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటి స్తూ అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈ ఉత్తరాది భామ కోలీవుడ్లో ధనుష్ కు జంటగా ఆడుగళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ తొలి చిత్రమే సూపర్ హిట్ కావడం, నటుడు ధనుష్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చి పెడటంతో తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చాలా తక్కువ చిత్రాల్లోనే ఇక్కడ నటించారు. అయితే తెలుగులో చాలా చిత్రాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ పై దృష్టి సారించారు. ఇక్కడ ఈమె నటించిన బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. వరుసగా అవకాశాలు వరించాయి. ఇలా తాప్సీ నటించిన చిత్రాలలో పింక్ ఒకటి. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. హలో బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ వరకు పలువురు హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా గత మార్చి 24న బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బో అనే డెన్మార్క్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ కోచ్ను పెళ్లి చేసుకున్నారు. అలాంటి తాప్సీ ఇటీవల ఓ భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రాల్లో హీరోయిన్లు ఎంపిక చేసేది హీరోలే అని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోలు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న హీరోయిన్లకే అవకాశా లు ఇస్తారన్నారు. ఇలా తాప్సీ తనకు ఎదురైన అనుభవాలను పేర్కొన్నారు. కాగా కెరీర్ ఆరంభంలో అయితే ఇలాంటివి మాట్లాడేవారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
కనుల పండువగా మహారథోత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచ మూర్తులు పంచ రథోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న ధ్వజారోహనంతో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు నిర్వహించి ఉత్సవ మూర్తులకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏడవ రోజైన మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పంచ మూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరుడికి మేళ తాళాల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన నిర్వహించారు. వినాయకుడిని ఉదయం 6.25 గంటలకు భక్తుల హరోం... హరా... నామస్మరణ మధ్య పుష్పాలంకరణలో రాజగోపురం వద్దనున్న రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం అన్నామలైయార్ ఆలయ రాజగోపురం ఎదురుగా నుంచి బయలుదేరింది. ఆ సమయంలో చలిని కూడా భక్తులు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ రథం దారాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర పాండియన్, ఎస్పీ సుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.మాడ వీధుల్లో ఊరేగిన పంచ రథాలు:మాడ వీధుల్లో బయలుదేరిన రథం ఉదయం 9.20 గంటలకు వచ్చి చేరింది. అనంతరం ఉదయం 9.35 గంటలకు సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగించారు. మద్యాహ్నం 12.20 గంటలకు మహా రధాన్ని ఊరేగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహా రథంలో అన్నామలైయార్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథాన్ని ఒక పక్క మహిళా భక్తులు, మరో పక్క పురుషులు రథం దారాలను పట్టి లాగారు. ఈ మహా రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరునికి హరోంహర నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నామలై అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథాన్ని మహిళా భక్తులు మాత్రమే లాగారు. స్వామి వారి మహారథం, చండికేశ్వరుడి రథం, పంచ రధాలు విడివిడిగా మాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నామలై అమ్మవారి రఽథ తాడును మహిళా భక్తులు మాత్రమే అధికసంఖ్యలో చేరుకొని లాగారు. ఒకే రోజు పంచ రథాలు మాడ వీధుల్లో ఊరేగనున్న నేపథ్యంలో చైన్నె, విల్లుపురం, కాంచీపురంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొని పంచ మూర్తులను దర్శించుకున్నారు. సంతాన భాగ్యం కలిగిన దంపతులు తమ బిడ్డలకు చెరుకులతో ఉయ్యాల కట్టి అందులో సంతానాన్ని ఉంచి ఆలయ మాడ వీధుల్లో తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు.5 లక్షల మంది భక్తులు హాజరు..మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఐదు రథోత్సవాల్లో కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకున్నారు. ఫలితంగా మాడ వీధులు కిక్కిరిశాయి. ఈ సందర్బంగా భక్తులు రథాలపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటురథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆరువేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ సుధాకర్ తెలిపారు.పారంపర్య గుర్రపు సంత ప్రారంభంరథోత్సవం రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గుర్రపు సంత మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీపోత్సవాన్ని పురష్కరించుకొని గత వంద సంవత్సరాల నుంచి గుర్రపు సంతను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోడ్డు, పుదుక్కోటై, తిరుపత్తూరు, ఓసూరు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి విక్రయ సంతలో ఉంచారు. ఈ సంత ఈనెల 13న దీపోత్సవంతో ముగుస్తుంది. ఈ సంవత్సరం గుర్రం, ఎద్దుల సంతకు పన్ను వసూలు చేయకుండా అధికారులు మినహాయింపు ఇచ్చారు.రూ. 70 లక్షలతో మహా రథానికి మరమ్మతు పనులుమహారథం అనే పిలిచే అన్నామలైయార్ రథం పూర్తిగా శిథిలం కావడంతో ఈ సంవత్సరం దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.70 లక్షల వ్యయంతో రథానికి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో గత నవంబర్ 8వ తేదీన ఆలయ మాడ వీధుల్లో ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం రథానికి మెరుగులు దిద్ధి పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు అమర్చి మంగళవారం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్తో విజయ్కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఆనందోత్సాహాలతో దీపావళి
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను గురు, శుక్రవారాల్లో ఆనందోత్సాహాలతో అత్యంత వేడుకగా జరుపుకున్నారు. పండుగ వేళ వర్షం పడకపోవడంతో బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. వస్త్రాలు, స్వీట్లు, మాంసం, బాణసంచా సహా ఇతర విక్రయాలు రాష్ట్రంలో ఈ ఏడాది రూ.60 వేల కోట్లకు జరిగినట్టు అంచనా వేశారు. ఇందులో బాణసంచా మాత్రం రూ.6 వేల కోట్లకు అమ్మకాలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణ సంచాలు అమ్మిన, కాల్చి వారికి కేసులతో పోలీసులు వాతలు పెట్టారు. బాణసంచాల దాటికి 150 ప్రమాదాలు జరగ్గా 544 మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. గత రెండేళ్లలతో పోల్చితే ఈసారి దీపావళిని రాష్ట్ర ప్రజలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. మహాబలిపురంలో విదేశీయులు దీపావళి సంబరాల్లో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. వడలూరులోని మేట్టుకుప్పంలోని అనాథ ఆశ్రమంలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పండుగను జరుపుకున్నారు. వర్షం పడని దృష్ట్యా, ఈ ఏడాది బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణసంచాలను పేల్చడంతో పోలీసులు కన్నెర్రజేశారు. కోయంబత్తూరు, తేని జిల్లాల్లోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు, గబ్బిలాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాణసంచాలకు దూరంగా పండుగను జరుపుకున్నారు. బాణసంచాల మోతతో చెత్తతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు పరిసరాల్లో గాలిలో కాలుష్యం పెరిగింది. బాణసంచాలతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు శుక్రవారం ఉదయాన్నే చైన్నెలో ఐదు వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని 34 వేల వీధుల్లో 15 వేల టన్నుల చెత్తను తొలగించారు.కేసులతో వాత..ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణసంచాలను పేల్చేందుకు విధించిన సమయాన్ని అనేక చోట్ల ప్రజలు ఖాతరు చేయలేదు. రాత్రి పది గంటల వరకు సైతం గాల్లో రంగురంగుల బాణసంచాలు మార్మోగాయి. చైన్నె నగరంతో పాటు, ఆవడి, తాంబరంలలో గస్తీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా పేల్చుతున్న వారిని పసిగట్టి కేసులతో వాతలు పెట్టారు. చైన్నెలో 347 కేసులు, ఆవడిలో 65 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. అలాగే, నిబంధనలు ఉల్లంగించి బాణసంచాలను విక్రయించిన దుకాణదారులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.తగ్గిన ప్రమాదాలు..బాణసంచా కారణంగా రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి ప్రమాదాలు తగ్గాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అబాస్కుమార్, అదనపు డైరెక్టర్ సత్యనారాయణన్ నేతృత్వంలో దీపావళికి ముందుగానే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. పండుగ రోజున ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా అప్రమత్తతతో వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 బృందాలలో 8 వేల మంది సిబ్బంది సేవలను అందించారు. విరుదునగర్ జిల్లా అల్లంపట్టిలో గురువారం రాత్రి తారాజువ్వ చొచ్చుకు రావడంతో అగ్గి పెట్టెల పరిశ్రమ దగ్ధమైంది.ఎవ్వరికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇక మిగిలినవి చిన్నచిన్న ప్రమాదాలే. అనేకచోట్ల గుడిసెలు, పందిళ్లు దగ్ధమయ్యాయి . చైన్నె ఎర్నావూరులో నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. బాణసంచా పేల్చుతూ, తారాజువ్వల దాడిలో రాష్ట్రంలో 150 ప్రమాదాలు జరిగాయి. ఇందులో చైన్నెలో మాత్రం 48 ఉన్నాయి. 544 మంది గాయాలపాలయ్యారు. ఇందులో చైన్నెలో 95 మంది ఉన్నారు. కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరుపేట సమీపంలోని ఎర్నావూరుకు చెందిన ముగ్గురు మిత్రులు సమీప గ్రామంలో నాటు బాణసంచాలను కొనుగోలు చేసి మోటారు సైకిల్పై తీసుకెళ్తుండగా అవి పేలాయి. ఈ ఘటనలో విన్సంట్(22) మృతిచెందాడు. ప్రేమ్కుమార్(24), పౌల్రాజ్(22) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పండుగ రోజున చైన్నె ఎన్నూరు సత్యవాణి ముత్తునగర్లో మద్యం మత్తులో మేసీ్త్ర ముత్తువేల్(42) రెండవ అంతస్తు నుంచి పడి మృతిచెందాడు.ప్రత్యేక బస్సులుదీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం ఆదివారం నుంచి తిరుగు పయనం కానున్నారు. వీరి కోసం ఆయా మార్గాలు, ప్రాంతాల నుంచి చైన్నె వైపుఅదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె శివారులోని కిలాంబాక్కంకు బస్సులు పరిమితం చేసిన దృష్ట్యా, ఈ ప్రయాణికులు నగరంలోకి వచ్చేందుకు వీలుగా దక్షిణ రైల్వే అదనపు ఎలక్ట్రిక్ రైలు సేవలకు నిర్ణయించింది. తాంబరం– కాటాన్ కొళత్తూరు మధ్య ఉదయం 4 గంటల నుంచి ఎలక్ట్రిక్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది.గొడవల్లో..బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో ఇద్దరు మృతిచెందారు. చైన్నె రాయపేట అంబేడ్కర్ నగర్కు చెందిన శ్యామ్ను బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో మరో ప్రాంత యువకులు దాడి చేయడంతో కింద పడి మృతిచెందాడు. విల్లుపురం జిల్లా విక్రవాండి ఒరత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉత్తరాది కార్మికులు సుదన్ రిషిదేవ్(31), దిల్కుష్ కుమార్(22)బాణసంచా పేల్చే విషయంగా పొటీలు పడి చివరకు గొడవకు దిగారు. దిల్కుష్కుమార్ బలంగా నెట్టడంతో కింద పడ్డ రిషిదేవ్ మృతిచెందాడు. సేలం జిల్లా ఇరుంబాలై పట్టిలో బాణసంచా పేల్చే గొడవలో ఓ వర్గం ఆ ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ సతీష్కుమార్(38) ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇక, పండుగ వేళ మద్యం వ్యాపారం జోరుగానే జరిగింది. గురు, శుక్రవారాలలో టాస్మాక్ దుకాణాలు కిక్కిరిశాయి. -
విజయ్ సంకీర్ణం చిచ్చు!
విక్రవాండి మహానాడు వేదికగా తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ చేసిన సంకీర్ణ ప్రభుత్వం, అధికారంలో వాటా ప్రకటన డీఎంకే కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ కూటమిలోని వీసీకే తమ గళానికి బలం చేకూరినట్టయ్యిందన్న వ్యాఖ్యలు తూటాలను పేల్చింది. అధికారంలో వాటా పై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు లేఖాస్త్రం సందించడం గమనార్హం. అదే సమయంలో డీఎంకే కూటమి బలంగా ఉందని, 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా పనుల వేగం పెంచాలని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్లకు స్టాలిన్ పిలుపు నిచ్చారు.సాక్షి, చైన్నె: విల్లుపురం జిల్లా, విక్రవాండి వీసాలై గ్రామంలో ఆదివారం జరిగిన తమ పార్టీ తొలి మహానాడు బ్రహ్మాండ విజయవంతం కావడంతో తమిళగ వెట్రికళగం వర్గాలు మంచిజోష్ మీదున్నాయి. పది లక్షల మందికి పైగా ఈ మహానాడుకు తరలి వచ్చినట్టు భావిస్తున్నారు. ఇందులో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపీగా మారాయి. ఏ చానళ్లు చూసినా విజయ్ వ్యాఖ్యలపై డిబెట్ల హోరు పెంచాయి. ప్రధానంగా అవినీతి, అక్రమాలంటూ రాష్ట్రంలో డీఎంకేను, మతతత్వ శక్తి పేరిట కేంద్రంలో బీజేపీని విజయ్ టార్గెట్ చేసినా తాము గెలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం.. మిత్రులకు అధికారంలో వాటా అన్న ప్రకటన రాష్ట్రంలో పెను చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు రాష్ట్రంలో కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నా, అధికారం విషయానికి వస్తే డీఎంకే , అన్నాడీఎంకేలు మార్చిమార్చి చేజిక్కించకుంటూ వచ్చాయి. ఆ పార్టీలకు చెందిన వారే మంత్రులుగా రాజ్యమేలుతుండే వారు. కూ టమి పార్టీలు మి త్ర పక్షాలుగా రా జకీయం సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విజయ్ కూటమి, వాటా అంటూ సంకీర్ణ ప్రభు త్వం అధికారంలో కి రావాల్సిన అవశ్యం ఉందన్న వ్యాఖ్యలు అందుకోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే గొడుగు నీడన చేరే పార్టీలను ఆలోచనలో పడేశాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పార్టీలను తన వైపు తిప్పుకునేందుకే విజయ్ ఈ కొత్త ప్రకటన అందుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఎవరేమంటున్నారంటే?ఇటీవల కాలంగా డీఎంకే కూటమిలోని వీసీకే అధికారంలో వాటా అన్న నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నేత అర్జున్ సోమవారం స్పందించారు. తమ గళానికి బలం చేకూరిందని వ్యాఖ్యలు చేశారు. తమ గళం మున్ముందు మరింతగా జ్వలిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత రవికుమార్ స్పందిస్తూ అంబేడ్కర్ భగవద్గీత గురించి రాసిన విషయాలను కూడా విజయ్ చదవాలని సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ ప్రస్తుతం కూటమిలో ఎలాంటి మార్పు లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షు డు, సీఎం స్టాలి న్కు ఓ లేఖ రాయడం చ ర్చకు దారితీ సింది. ఇప్పు డే అధికారంలో వాటాపై నిర్ణయం తీసుకుని భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాలని అందులో సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ సీనియర్నేత, ఎంపీ మాణిక్యంఠాకూర్ స్పందిస్తూ కూటమి పాలన నినాదం బాగుందంటూ విజయ్పేరు ప్రస్తావన లేకుండా వ్యాఖ్యలు చేశారు.డీసెంట్ పెర్ఫామెన్స్అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ పేరు మహానాడులో ప్రస్తావించిన విజయ్, ఆ పార్టీని టార్గెట్ చేయకపోవడం మరో చర్చకు దారితీసింది. అస్సలు అన్నాడీఎంకేను ఆయన లెక్కలోకి తీసుకోలేదన్న చర్చ ఊపందుకుంది. ఈ విషయంగా అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ, విజయ్ సిద్ధాంతాలలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారని, అన్ని పార్టీల సిద్ధాంతాలలో తలా ఓ ముక్క తీసుకుని కాక్ టైల్ ఐడియాలజీని ఉపయోగించారని ఎద్దేవా చేశారు. నోటి మాట, రాతపూర్వకంగా అమలయ్యేనా అన్నది కాలం సమాధానం చెబుతుందన్నారు. మరో నేత ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, ద్రావిడ మోడల్కు వ్యతిరేకంగా ఆయన గళం వినిపించి ఉన్నారని, ఇదే కాద తాము కూడా ఆది నుంచి చేస్తూ వస్తున్నదని వ్యాఖ్యలు చేశారు.బీ, సీ టీంవిజయ్ తమను టార్గెట్ చేయడంపై డీఎంకే నేతలు తీవ్రంగానే స్పందించారు. స్పీకర్ అప్పావు మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాలలో యూ టర్న్ తీసుకోవడంతో విజయ్ను బీజేపీ తెర మీదకు తెచ్చినట్టుందని ఆరోపించారు. ఇది బీజేబీ బీటీం అన్నది స్పష్టమవుతోందన్నారు. మంత్రి రఘుపతి స్పందిస్తూ, పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని, ఇప్పటికే అనేక మంది నాయకులు ఉదాహరణకు శరత్కుమార్, కమల్, కరుణాస్.. ఇలా చెప్పకుంటూ పోతే ఎందరో పార్టీని పెట్టారని వివరించారు. అయితే, డీఎంకే నీడను కూడా ఎవ్వరూ తాకలేక పోయారని హితవు పలికారు. మరో మంత్రి శేఖర్బాబు స్పందిస్తూ, డీఎంకే అనే మహాశక్తిని కొత్తగా ఏ శక్తీ నిలువరించ లేదన్నారు. ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ పేర్కొంటూ డీఎంకేను నిర్వీర్యంచేయాడం లేదా ఉదయ సూర్యడ్ని తాకేందుకు ఎవ్వరూ సాహసం చేయలేరని, చేయబోరని హితవు పలికారు. ఈ చర్చల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్లతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.బలంగానే కూటమిపార్టీ కార్యాలయంలో స్టాలిన్ అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్లు, పర్యవేక్షకుల సమావేశం జరిగింది. ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో వందకు వంద గెలిచామన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇందులోనే గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఆదేశించారు. దేశంలో ఈ పార్టీ ప్రభుత్వం అమలు చేయని పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా ప్రజలకు దరి చేర్చామని వివరించారు. పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల పనులు వేగవంతంచేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించడం గమనార్హం.ఎవరికి నష్టంవిజయ్ ప్రకటన నేపథ్యంలో నష్టం తీవ్రత రాష్ట్రంలో ఎవరికి ఎక్కువగా ఉండబోతున్నదో అన్న చర్చ ఊపందుకుంది. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో పాటుగా వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్లు చీలుతాయన్న ప్రచారం ఊపందుకుంది. దివంగత నేతల ఎంజీఆర్, జయలలితల తరహా రాజకీయాన్ని విజయ్ సాగించబోతున్నట్టుగా, అధికారంలో వాటా అన్న నినాదంతో రాష్ట్రంలో 2026లో బలమైన కూటమి ఏర్పాటు చేసి తీరుతారన్న ధీమాను రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లు, డీఎంకే, అన్నాడీఎంకేల గొడుగు నీడన చేరి ఎన్నికలను ఎదుర్కొనే అనేక పార్టీలు అధికార బలం కోసం విజయ్ వైపుగా దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. బలమైన కూటమి ఏర్పాటులో సఫలీకృతులైన పక్షంలో తొలి నష్టం డీఎంకేకు, ఆ తదుపరి అన్నాడీఎంకేకు తప్పదని పేర్కొంటుండడం గమనార్హం. -
జయంరవి చిత్రం షురూ!
తమిళసినిమా: నటుడు జయంరవి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన బ్రదర్ చిత్రం దీపావళి రేస్లో నిలవనుంది. అలాగే జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలకు కమిట్ అయ్యారు. అలా జయంరవి తాజాగా కమిట్ అయిన చిత్రానికి డాడా చిత్రం ఫేమ్ గణేశ్బాబు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సుందర్ ఆరుముగన్ సమర్పణలో స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికార పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా వైవిధ్యభరితంగా ఉండి చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది జయంరవి నటిస్తున్న 34వ చిత్రం కావడం గమనార్హం. దీనికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రదీప్ ఆంటోని ముఖ్యపాత్రను పోషించనున్నారని సమాచారం. త్వరలోనే సెట్పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను వెలువడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. జయంరవి వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొంటున్నా, వృత్తిపై దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి. -
దీపావళికి 14 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, చైన్నె: దీపావళి సందర్భంగా ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రవాణా సంస్థ సిద్ధమైంది. 14 వేల బస్సులను ప్రయాణికుల కోసం రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. చైన్నెలో 3 చోట్ల నుంచి వివిధ మార్గాలలో ప్రయాణించే బస్సుల వివరాలను రవాణా మంత్రి శివశంకర్ సోమవారం ప్రకటించారు. వివరాలు.. దీపావళికి పది రోజులే సమయం ఉంది. ఇంటిళ్లి పాది స్వస్థలాలలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి పండుగకకు ఏకంగా నాలుగురోజులు సెలవు రావడంతో వివిధ ప్రాంతాలలో ఉన్నవాళ్లంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వీరికోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. బస్సుల రూట్లు, బస్సుల సంఖ్య తదితర అంశాల గురించి రవాణా అదనపు ముఖ్యకార్యదర్శి కె. ఫణీంద్రరెడ్డి , ఇతర పోలీసుల అధికారులతో జరిపిన సమావేశానంతరం ప్రత్యేక బస్సుల వివరాలను మంత్రి శివశంకర్ ప్రకటించారు.ప్రత్యేక బస్సులు..చైన్నెలో ఈనెల 28, 29, 30 తేదీలలో సాధారణంగా నడిచే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడపున్నారు. తొలిరోజున 2,092 బస్సులు, తదుపరి రెండురోజులు 4,900 చొప్పున ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. ఇతర నగరాలు, పట్టణాల మధ్య ప్రత్యేక బస్సులతో కలుపుకుని మొత్తంగా మొత్తం 14,086 బస్సులు నడపనున్నారు. దీపావళి పండుగ తర్వాత ఇతర నగరాల నుంచి చైన్నెకి వచ్చే వారికోసం 2వ తేదీన 2,092 బస్సులు, మూడు, నాలుగు తేదీలలో 3,165 చొప్పున బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. తిరుగు పయనం అయ్యే వారి కోసం 12,606 బస్సులు రోడ్డెక్కిస్తున్నామని మంత్రి వివరించారు. చైన్నె శివారులోని కిలాంబాక్కం కలైజ్ఞర్ కరుణానిధి శత జయంతిస్మారక బస్టాండ్ నుంచి పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, తిరుచ్చి, మధురై, తూత్తుకుడి,సెంగోట్టై, తిరునెల్వేలి, సేలం, కోయంబత్తూర్, వందవాసి, పోలూర్, తిరువణ్ణామలై, కుంభకోణం, తంజావూరు వైపుగా వెళ్లే బస్సులను నడపనున్నారు. పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి ఈసీఆర్ మార్గం, కాంచీపురం, వేలూరు, బెంగళూరు, తిరుత్తణి మార్గాలలో నడిచే బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మాధవరం సబర్బన్ టెర్మినల్ నుంచి పొన్నేరి వైపుగా ఆంధ్ర ప్రదేశ్ మార్గంలో, అలాగే వయా ఊత్తుకోట్టై మార్గంలో నడిచే బస్సులతోపాటు తిరుచ్చి, సేలం, కుంభకోణం మార్గాలలో నడిచే బస్సులు రోడ్డెక్కించనున్నారు.ఫిర్యాదులు..ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శివశంకర్ వివరించారు. కార్లు, ఇతర వాహనాలు ప్రయా ణించే వారిని దృష్టిలో ఉంచుకుని తాంబరం, పెరుంగళత్తూరు, తిరుపోరూర్, చెంగల్పట్టు మీదుగా వెళ్లే వారున అవుటర్ రింగ్రోడ్డును ఉపయోగించే విధంగా చూస్తామన్నారు. ప్రత్యే క బస్సుల రిజర్వేషన్లు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల కోసం 94450 14436 నెంబర్ను ఈసందర్భంగా ప్రకటించారు. ప్రైవేటు ఆమ్నీ బస్సులు అధిక చార్జీల వసూళ్లకు పాల్పడిన పక్షంలో 1800 425 6151 (టోల్ ఫ్రీ నంబర్), 044– 24749002, 044–26280445, 044–2628 1611 నంబర్లను సంప్రదించాలని వివరించారు. అన్ని బస్టాండ్లలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయన్నారు. కోయంబేడు నుంచి కిలాంబాక్కం, మాధవరం బస్టాండ్లకు 24 గంటల పాటు ఎంటీసీ బస్సులపై తేదీలలో సేవలను అంది స్తాయన్నారు. ఈ సందర్భంగా చైన్నె ఎంటీసీలో పనిచేసి విధుల సమయంలో మరణించిన ఉద్యోగుల వారసులు నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక ఉత్తర్వులను మంత్రి శివశంకర్ అందజేశారు. -
శ్రీరస్తు.. శుభమస్తు
హిందూ దేవదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో సామూహిక వివాహ మహోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. 379 జంటలకు ఆలయాలలో వివాహాలు జరిపించారు. అన్ని రకాల వస్తువులతో సారెను అందజేశారు. చైన్నెలో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలు ఏకమయ్యాయి. పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని ఈసందర్భంగా స్టాలిన్ వధూవరులకు విజ్ఞప్తి చేశారు.సాక్షి, చైన్నె: డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం హిందూ దేవదాయ శాఖ ద్వారా ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ పనులు, భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన, ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకోవడం, విద్యా కార్యక్రమాలు, పండుగుల సమయంలో ఆధ్యాత్మిక పర్యటనలు అంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన జంటలకు వివాహాలను జరిపించే విధంగా ముందుకెళ్తోంది. ఆ దిశగా 2022–2023 సంవత్సరం 500 జంటలకు, 2023–2024 సంవత్సరం 600 జంటలకు వివాహం జరిపించారు. ఒక్కో జంటకు నాలుగు గ్రాముల బంగారం తాళిబొట్టు,రూ. 50 వేలు విలువగల గృహోపకరణ వస్తువులు, ఇతర అన్నిరకాల వస్తువులను పంపిణీ చేశారు. 2024–25లో 700 జంటలకు వివాహం జరిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో 379 జంటలకు సోమవారం రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరిగాయి. వీరికి నాలుగు గ్రాముల బంగారం తాళితోపాటు రూ. 60 వేల విలువైన వివిధ రకాల వస్తువులను సారెగా అందజేశారు. మంచం, బీరువా, పరుపు, దిండ్లు, వంట గ్యాస్ స్టవ్, వెట్ గ్రైండర్, మిక్సర్,కుక్కర్, వంటపాత్రలు తదితర వాటిని సారెగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శేఖర్ బాబు, పొన్ముడి, ఎం.సుబ్రమణియన్, శ్రీపెరంబదూరు ఉలగార్య రామానుజ ఎంబార్ జీయర్స్వామి, తొండై మండలం ఆధీనం చిదంబరనాథ జ్ఞాన ప్రకాశ దేశిక పరమాచార్య స్వామి, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, మేయర్ ఆర్. ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, అసన్ మౌలానా, జగన్, జోసెఫ్ శామ్యూల్, అరవింద్ రమేష్, ప్రభాకర్ రాజ, దేవాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, కమిషనర్ శ్రీధర్, అదనపు కమిషనర్ సుకుమార్ పాల్గొన్నారు.అందమైన తమిళ పేర్లు పెట్టండి..చైన్నెలో తిరువాన్మీయూరు మరుదీశ్వరర్ ఆలయంలో వివాహ వేడుక కోలాహలంగా సాగింది. ఇక్కడ సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహాలు జరిగాయి. అనంతరం ఆయా జిల్లాలో ఎంపిక చేసిన ప్రధాన ఆలయాలలో మిగిలిన జంటలకు వివాహాలు జరిగాయి. నవ వధువరులకు తాళిబొట్టును సీఎం అందజేశారు. వివాహ అనంతరం వారికి అన్నిరకాల వస్తువులతో సారెను అందజేశారు. నవ దంపతులను సీఎం ఆశీర్వదించిన అనంతరం ప్రసంగిస్తూ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే అత్యధికంగా హిందూ మత ధర్మాదాయ శాఖ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు వివరించారు. ఇందుకు కారణం ఆ శాఖ మంత్రిగా ఉన్న శేఖర్ బాబు అని, ప్రతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందేనని , కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా హాజరు కావాలని పట్టుబట్టే వారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. ధార్మిక రంగంలోనే కాదు, అన్నిరంగాలకు రాష్ట్రంలో తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మూడేళ్లలో ఈ శాఖ తరపున వివిధ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. 2,226 ఆలయాలకు కుంభాభిషేకం, 10,238 దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు జరిగినట్లు పేర్కొన్నారు. దాతల నుంచి విరాళంగా సేకరించిన రూ. 1,103 కోట్లతో 9,163 పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో 6,792 కోట్లు విలువైన భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రామేశ్వరం, కాశీ ఆధ్యాత్మిక యాత్రలు, వృద్ధులకు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నామని పేర్కొన్నారు. బంగారం పెట్టుబడి పథకం, దేవాలయాలలో తమిళంలో అర్చనలు వంటి అంశాలను ఈసందర్భంగా గుర్తుచేశారు. అన్ని మతాలను, అందరినీ సమానంగా గౌరవించే విధంగా వారి హక్కులను పరిరక్షించే రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఇదే ద్రవిడ మోడల్ పాలన అని సగర్వంగా చెప్పుకుంటున్నామని, అయితే ఆలయాలు, భక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి అస్త్రాలు వెతుకుంటున్న వాళ్లు కూడా ఈరాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏకమైన కొత్త జంటలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, సకల సౌభ్యాగాలతో జీవితం ఆనందమయం చేసుకోవడమేకాకుండా పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
విల్లుపురంలో మెడికల్ పార్క్
సాక్షి, చైన్నె: విల్లుపురంలో మెడికల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 155 కోట్లతో 111 ఎకరాలలో పనులు చేపట్టనున్నారు. రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి దిశగా దూసుకెళ్తోంది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పారిశ్రామిక రంగంలో తమిళనాడును నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఐటీ, మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, వివిధ విడి భాగాలు, జౌళి, తోలు ఉత్పత్తులు, ఆర్మీకి ఉపయోగ పడే వివిధ రకాల ఉత్పత్తులు అంటూ పారిశ్రామికంగా తమిళనాడు 2030 నాటికి ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, జిల్లా కేంద్రాలలో పారిశ్రామిక వాడల ఏర్పాటు విస్తృతమయ్యాయి. అలాగే నగరాలలోౖ టైడల్ పార్కుల ఏర్పాటు వేగం పెరిగింది.ఈ పరిస్థితుల్లో ఇటీవల విల్లుపురం జిల్లా వానూరులో టైడల్ పార్కు ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా విల్లుపురం జిల్లా మైలం నియోజకవర్గం పరిధిలోని మేల కుప్పం సిప్కాట్లో 111 ఎకరాలలో రూ. 155 కోట్లతో మెడికల్ పార్కు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ అత్యాధునిక వసతుల కల్పనతో, వివిధ రకాల మందుల తయారీ, వైద్య సంబంధిత పరిశ్రమలను ఆహ్వానించి ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టేదిశగా మెడికల్ పార్కు పనుల మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 51 కోట్లు, కేంద్రం వాటగా రూ. 20 కోట్లతో ప్రాథమిక పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మెడికల్ పార్కు ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలు అభివృద్ధి పధంలో ముందుకు సాగేందుకు వీలుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మెడికల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అధికారులు పేర్కొనడం విశేషం. -
ఓం కాళీ.. జై కాళీ
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు శుక్రవారం ఆయుధ పూజ పండుగను జరుపుకున్నారు. ఇక శనివారం విజయ దశమి సందర్భంగా ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలో భక్తిభావం మిన్నంటింది. ఉదయం నుంచి ఆలయాలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా కుల శేఖర పట్నంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ మహిషాసుర సంహారం సాగింది.రాత్రంతా పూజలు..కర్ణాటక రాష్ట్రం మైసూర్ తర్వాత దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోని కులశేఖర పట్నం ప్రసిద్ధి చెందిన విష యం తెలిసిందే. తూత్తుకుడి జిల్లాలోని ఈ కులశేఖర పట్నంలో ముత్తారమ్మన్ దేవిగా కాళీ మాత కొలువై ఉన్నారు. ఆలయంలో వారం రోజులుగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చాయి. రో జూ రాత్రి వేళ అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఉత్సవాలో ముఖ్య ఘట్టం శనివారం సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయంలో అమ్మవారికి పలుమార్లు అభిషేకాలు జరిగాయి. వేలాదిగా భక్తులు కాళీమాత, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు తదితర దేవతలు, దేవళ్ల వేషాలలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచి ఊరూరా తిరిగి తాము సేకరించిన విరాళాల్ని ఆలయంలో కానుకలుగా సమర్పించారు. వివిధ వేషాలలో వచ్చిన భక్తులు చేతిలో మట్టి పాత్రలను పెట్టుకుని అందులో కర్పూరాన్ని వెలిగించి ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.అద్వితీయంగా సూరసంహారం..అర్ధరాత్రి 11 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం, విశేష పూజలు చేశారు. 12 గంటల సమయంలో అమ్మవారు సింహవానాన్ని అధిరోహించి సముద్ర తీరం వైపుగా కదిలారు. ఈ సమయంలో భక్తులు ఓం కాళీ..జై కాళీ అన్న నామస్మరనను మార్మోగించారు. సాగర తీరంలోని చిదంబరేశ్వరర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ అర్ధరాత్రి వేళ మహిషాసూర సంహారఘట్టం అత్యంత వేడుకగా అద్వితీయంగా జరిగింది. ఇసుక వేస్తే రాలనంతగా లక్షల్లో తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సూర సంహార ఘట్టం జరిగింది. ఇక్కడి నుంచి అమ్మవారు చిదంబరేశ్వర్ ఆలయంలోకి చేరుకున్నారు. ఇక్కడ ఆదివారం వేకువ జామున అమ్మవారికి గంధం వంటి సుగంద ద్రవ్యాలతో అభిషేకం సాగింది. ఆరు గంటల వరకు అమ్మవారికి పలు విడతలుగా అభిషేకాలు, ఆరాదనలు జరిగాయి. మధ్యాహ్నం వరకు భక్తులకు అమ్మవారు ఇక్కడే దర్శనం ఇచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారు మళ్లీ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. రాత్రంతా సూర సంహార ఘట్టం అద్వితీయంగా సాగింది. తిరునల్వేలి,తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల పోలీసులు బందోబస్తు చేపట్టారు. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అధికారులు అంచనా. -
ఆయుధ పూజ సందడి
రాష్ట్రంలో ఆయుధ పూజ సందడి నెలకొంది. పండుగ శుక్రవారం కావడంతో గురువారం పూజా సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక కుటుంబ సభ్యులతో పండుగను ఆనందోత్సాహలతో జరుపుకునేందుకు చైన్నె నుంచి లక్షలాదిమంది ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న తమిళనాడులో పండుగలొస్తే సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఎక్కడెక్కడో వివిధ పనుల నిమిత్తం స్థిర పడ్డ వాళ్లంతా శ్రమ కోర్చి సెలవులకు స్వస్థలాలకు చేరుకుంటారు. రాష్ట్రంలో సంక్రాంతి, వినాయక చవితి తదుపరి వచ్చే ఆయుధ పూజ, విజయ దశమి పర్వదినాలకు ప్రజలు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఇందులో చిన్నచిన్న దుకాణాల మొదలు అతిపెద్ద ఫ్యాక్టరీల వరకు, కూలీల మొదలు రైతుల వరకు తాము ఉపయోగించే వివిధ రకాల సామగ్రి, పనిముట్లకు పూజలు నిర్వహించే రీతిలో ఆయుధ పూజను అత్యంత భక్తిశ్రద్ధల పర్వదినంగా భావిస్తుంటారు. ఇంటిళ్లి పాది అత్యంత భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.నేతల శుభాకాంక్షలు..ఆయుధ పూజ, విజయ దశమి పండుగలను ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, బీజేపీ నేతలు తమిళి సై సౌందరరాజన్, శరత్కుమార్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు తదితరులు ఉన్నారు.స్వస్థలాలకు పయనం..ఈ ఏడాది పండుగకు మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధిక శాతం మంది స్వస్థలాలకు వెళ్లి ఇంటిళ్లి పాది ఆయుధ పూజను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నె వంటి నగరాలలో వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలలో ఉన్న వాళ్లు దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, దిండుగల్, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు జిల్లా లో ఉన్న తమ స్వస్థలాలకు అత్యధికంగా బయలు దేరి వెళ్లారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించడంతో లక్షల మంది ఆయుధ పూజ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లినట్టు రవాణా సంస్థ పరిశీలనలో తేలింది. చైన్నె, శివారులలోని బస్టాండ్ల అర్ధరాత్రి వరకు బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. సుమారు 4 వేల బస్సులను చైన్నె నుంచి నడిపారు. ఇదే అదనుగా ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. విమాన టికెట్లు సైతం గాల్లో ఎగిరాయి. మదురై, తిరుచ్చి, తూత్తుకుడి,సేలంలకు విమాన చార్జీలు రెండింతలు పెరిగాయి.కులశేఖరపట్నంలో..తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దసరా సంబరాలు మిన్నంటుతున్నాయి. మైసూర్ తదుపరి దసరా ఉత్సవాలు కులశేఖర పట్నంలోని ముత్తాలమ్మన్ ఆలయంలో కనుల పండువగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఆయుధపూజ, విజయ దశమి వేళ ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు కాళి మాత వేషధారణలతో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాము విరాళాల రూపంలో సేకరించిన కానుకలను అమ్మవారి హుండీలో సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో కులశేఖర పట్నంలో ఇసుక వేస్తే రాలనంతంగా కిక్కిరిసి ఉన్నాయి. ఇక్కడ విజయ దశమి పర్వదినం రోజైన 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సాగర తీరంలో శూర సంహారం అత్యంత వేడుకగా జరగనుంది. లక్షలలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని శివాలయాలు, అమ్మవారి ఆలయాలలో, తమ ఇళ్లల్లో నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. విజయ దశమి వేళ ఆలయాలలో, ఇళ్లల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను అందుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.మార్కెట్లు కిటకిటఆయుధ పూజ కోసం ఉపయోగించే పూజా సామగ్రి రాష్ట్రంలోని మార్కెట్లోకి పెద్దఎత్తున కొలువు దీరాయి. మరమరాలు(బొరుగులు), అటుకులు, బెల్లం, యాపిల్, ఆరంజ్ తదితర పండ్లు, వివిధ రకాల పువ్వులు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు నిమిత్తం జనం మార్కెట్ల వైపుగా కదిలారు. రాష్ట్రంలోని మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం తదితర నగరాలలోని చిన్న పెద్ద మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. చైన్నెలోని టీ నగర్, పురసైవాక్కం, బ్రాడ్ వే మార్కెట్లు, దక్షిణాసియాలోనే అతిపెద్ద మార్కెట్గా ఉన్న కోయంబేడు జనంతో నిండాయి. ఎటు చూసినా కొనుగోలు దారులతో వర్తక కేంద్రాలు కిక్కిరిశాయి. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. ధర పెరిగినా, తమ స్తోమతకు తగ్గట్టుగా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయుధ పూజ, శనివారం విజయదశమి పండుగకు కావాల్సిన అన్నిరకాల పూజాసామాగ్రిని సిద్ధం చేసు కున్నారు. -
మురసోలి సెల్వం కన్నుమూత
సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత కరుణానిధి అల్లుడు, సీఎం స్టాలిన్ సోదరి సెల్వి భర్త మురసోలి సెల్వం (85) గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక అంబులెన్స్లో చైన్నెకు సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చారు. గోపాలపురంలోని నివాసంలో ఆప్తులు సందర్శనార్థం ఉంచారు. మురసోలి సెల్వం మరణ సమాచారం హృదయంలో పిడుగు తాకినట్టు అయిందని, తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్క భుజం కూడా కనుమరుగైందని సీఎం స్టాలిన్ ఉద్వేగానికి లోనయ్యారు. వివరాలు.. డీఎంకే దివంగత అధినేత కరుణానిధికి అప్పట్లో వెన్నుదన్నుగా ఉన్న వారిలో మేనళ్లులు మురసోలి మారన్. మురసోలి సెల్వం ముఖ్యులు. మురసోలి మారన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చి కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి కరుణానిధి తీసుకొచ్చారు. మురసోలి సెల్వంకు తన కుమార్తె సెల్విని ఇచ్చి వివాహం చేసి ముద్దుల అల్లుడిగా వెన్నంటే ఉంచుకున్నారు. కరుణానిధి మెచ్చిన డీఎంకే పత్రిక మురసోలికి ఐదు దశాబ్దాల కాలం సిలంది పేరిట సంపాదకీయాలతో మురసోలి సెల్వం సంపాదకులుగా పనిచేశారు. డీఎంకేలోనూ కీలకంగా అప్పట్లో వ్యవహరించిన మురసోలి సెల్వం అంటే సీఎం స్టాలిన్కు ఎనలేని అభిమానం. తండ్రి కరుణానిధి తర్వాత తనకు బావే అంతా అన్నట్టుగా మెలిగారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వచ్చిన సెల్వం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో గుండె పోటు రావడంతో గురువారం ఉదయం మరణించారు.విషాదంలో కుటుంబంమురసోలి సెల్వం మరణ సమాచారంతో సీఎంస్టాలిన్ కుటుంబంలో విషాదం నెలకొంది. గోపాలపురంలోని తల్లి దయాళు అమ్మాల్కు సహకారంగా వెన్నంటి సెల్వి ఉంటూ వచ్చారు. ఈ సమాచారంతో సెల్వి తీవ్ర విషాదంలో మునిగారు. అన్నిపనులను పక్కన పెట్టిన సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధితో పాటు మంత్రులు, మురసోలిమారన్ కుమారుడు, ఎంపీ దయానిధి మారన్ తదితరులు గోపాలపురానికి చేరుకున్నారు. కరుణానిధి కుటుంబానికి చెందిన వారందరూ గోపాలపురానికి వచ్చేశారు. సీఎం స్టాలిన్ అయితే తీవ్ర విషాదంతో కనిపించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక అంబులెన్స్లో చైన్నెకు సాయంత్రం మురసోలిసెల్వం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం 6.30 గంటల తరువాత గోపాలపురం ఇంట్లో ఆప్తుల సందర్శనార్థం ఉంచారు. మాజీ సీఎం పన్నీర్సెల్వం, ఎండీఎంకే నేత వైగో, పుదియ నీతి కట్చి నేత ఏసీ షణ్ముగంతో పాటు పలువురు ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పించారు. మురసోలి సెల్వం మరణ సమాచారం తన హృదయంలో పిడుగు పడినట్లయ్యిందని సీఎం స్టాలిన్ ఆవేదనను వ్యక్తం చేశారు. అదిగో... పార్టీకి సిద్ధాంతాల ఆయుధంగా ఉన్న మురసోలి మనల్ని వదలి పెట్టి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తర్వాత తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్కగా నొక్క భుజం కూడా కనుమరుగైందని విషణ్ణవదనంతో వ్యాఖ్యలు చేశారు.మూడు రోజుల సంతాప దినాలుమురసోలి మారన్ మరణంతో డీఎంకేలో మూడురోజుల సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయాలు, వాడవాడలలోని స్తూపాలలలో పార్టీ జెండాను అవనతం చేయాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించారు. మురసోలి సెల్వం మరణ సమాచారంతో ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ఈ సమాచారం సెల్వి ఎలా తట్టుకో గలదోఅని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వం లేదన్న సమాచారంతో సీఎం స్టాలిన్ తీవ్ర విషాదంలో ఉన్నారని మనో ధైర్యంతో ఆయన ముందుకెళ్లాలని పేర్కొన్నారు. -
మంత్రులకు జిల్లా బాధ్యతలు
అభివృద్ధి పనులు, పథకాల పర్యవేక్షణ, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా మంత్రులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రూ.38 వేల కోట్ల మేరకు పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. 14 సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా కేబినెట్ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకటించారు.సాక్షి, చైన్నె : ఇటీవల మంత్రి వర్గంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళవారం కేబినెట్ భేటీ సచివాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం హోదాలో ముందు వరసలో ఓ వైపు తొలి సీటును ఉదయనిధికి కేటాయించారు. ఈ భేటిలో సీనియర్ మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ పెరియస్వామి, ఏవీవేలు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, పొన్ముడి, ఎంఆర్కే పన్నీరు సెల్వం తదితరులు హాజరయ్యారు. తొలి సారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రన్, చెలియన్లు, మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్న సెంథిల్ బాలాజీ, నాజర్లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఇందులో ఈశాన్య రుతు పవనాల సీజన్ నేపథ్యంలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదం మళ్లీ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో కొన్ని టాస్మాక్ దుకాణాల మూత, ఉదయ నిధికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే విషయంగా చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థల గురించి చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. జిల్లాలో ప్రభుత్వ పరంగా కార్యక్రమాల విస్తృతం, ప్రజలకు పథకాలను దరిచ్చేడం వంటి అంశాలను పరిగణించి మంత్రులను ఇన్చార్జ్లుగా నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు ఏఏ జిల్లాలను కేటాయించారో అన్న వివరాలను ప్రకటించారు.క్షేత్రస్థాయిలో పర్యవేక్షణే లక్ష్యంగా..రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల విస్తృతం, సహాయకాల పంపిణీ, ప్రకృతీ వైపరీత్యాల సమయంలో, అతవ్యసర పరిస్థితులలో చేపట్టాల్సిన పనులు తదితర వాటిని పరిగణించి మంత్రులకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జ్లగా నియమించారు. ఈ మేరకు తిరునెల్వేలి జిల్లాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.ఎన్. నెహ్రూ, తేని జిల్లాకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియసామి, తిరుపత్తూరు, కళ్లకురిచి జిల్లాలకు ప్రజాపనుల శాఖ మంత్రి ఏ.వి. వేలు, ధర్మపురి జిల్లాకు రైతు సంక్షేమం, వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం, తెన్కాశి జిల్లాకు విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఆర్. రామచంద్రన్ను నియమించారు. కన్యాకుమారి – ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, నీలగిరి – తమిళ అభివృద్ధి , సమాచార శాఖ సామినాథన్, కృష్ణగిరి– ఆహార భద్రతా శాఖ మంత్రి ఆర్చక్రపాణి, కోయంబత్తూరు – విద్యుత్ మంత్రి సెంథిల్ బాలాజీ, కాంచీపురం – జౌళి శాఖ మంత్రి ఆర్. గాంధీ , పెరంబలూరు– రవాణా మంత్రి శివశంకర్, నాగపట్నం – పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్, మైలాడుతురై – వెనుకబడిన సంక్షేమం శాఖ మంత్రి శివ.వి. మెయ్యనాథన్ తదితరులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.రూ. 38 వేల కోట్లకు ఆమోదంకేబినెట్ భేటి అనంతరం మీడియాతో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ఇందులో 14 సంస్థలకు కేబినెట్లో ఆమోదం తెలిపిందన్నారు. రూ. 38 వేల కోట్ల పెట్టుబడితో 46 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ సంస్థలో రాష్ట్రంలో నెలకొల్పనున్నట్లు వివరించారు. ఇందులో రాణిపేటలో టాటా మోటార్స్ రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. కాంచీపురంలో కంచిలో ఫాక్సాన్ అనుబంధ సంస్థ యూసాన్ టెక్నాలజీ రూ.13 వేల కోట్లతో 14 వేల మందికి ఉద్యోగాలనుక ల్పించే పరిశ్రమను నెలకొల్పనున్నట్టు తెలిపారు. తూత్తుకుడి, తిరుల్వేలి,రామనాపురం, తిరువణ్ణామలైలో పీహెచ్డీ గ్రూప్ లోని 3 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా రూ. 10, 375 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించారు. అరియలూరులో తైవాన్కు చెందిన టీన్ షూస్ గ్రూప్ రూ. 1000 కోట్లతో 15 వేల మందికి ఉద్యోగకల్పన దిశగా పరిశ్రమను, కాంచీపురంలో కేమ్స్ సర్క్యూట్స్ ఇండియా రూ. 1,395 కోట్లతో 1000 మందికి ఉద్యోగాల కల్పన, కృష్ణగిరి జిల్లా హోసూర్ హసన్ సెక్యూర్ రూ. 612 కోట్లతో 1,200 మంది ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యాయని వివరించారు. మొత్తం 14 సంస్థల పెట్టుబడులకు ఆమోదించామని, వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.38 వేల కోట్ల పెట్టుబడి, 46,931 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని ప్రకటించారు. -
కమలహాసన్, దర్శకుడు అట్లీ, సల్మాన్ఖాన్
తమిళసినిమా: లోకనాయకుడు కమలహాసన్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ కలిసి నటిస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. మీ ఊహ నిజం కాబోతోందన్నది తాజా సమాచారం. నటుడు కమలహాసన్కు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం చిత్రాలు కొత్తేమీ కాదు. ఇక హిందీ చిత్రాల్లో నటించడం అస్సలు కొత్త కాదు. అదేవిధంగా పాన్ ఇండియా చిత్రాలు కూడా కొత్తేమీ కాదు.ఆయన ఇటీవల కూడా కల్కీ 2898 అనే పాన్ ఇండియా చిత్రంలో నటించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. ఆయన తమిళంలో నేరుగా ఇప్పటి వరకూ నటించకపోయినా, ఇక్కడ అభిమాన గణం ఎక్కువే. ఇక దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు శంకర్ శిష్యుడైన ఈయన రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా మోగాఫోన్ పట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన మెర్శల్, తెరి, బిగిల్ చిత్రాలు సూపర్హిట్ అయ్యాయి. ఇకపోతే ఇటీవల షారూఖ్ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్ బ్లాక్బస్టర్ అయ్యి, రూ. 1200 కోట్లు వసూలు చేసింది. కాగా దర్శకుడు అట్లీ తదుపరి చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలుగు చిత్రం అనీ, హిందీ చిత్రం అనీ, కాదు తమిళ చిత్రం చేయబోతున్నారని ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటుడు కమలహాసన్, బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ కలిసి నటించే పాన్ ఇండియా చిత్రాన్ని అట్లీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాదు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింనుందని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
హిజ్రా దర్శకత్వం వహించిన చిత్రం నీల నిర సూర్యన్
తమిళసినిమా: ఒకప్పుడు హిజ్రాలను చిన్నచూపు చూసిన సమాజంలో ఇప్పుడు వారు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఎందరో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అలా అమ్మాయిగా మారిన సంయుక్త విజయన్ దర్శకుడుగా అవతారమెత్తి తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ (నీలి రంగ సూర్యుడు). తమిళంలో సినీ దర్శకురాలిగా పరిచయం అవుతున్న తొలి హిజ్రా ఈమెనే అన్నది గమనార్హం. కాగా ఫస్ట్ కాపీ ప్రొడక్షన్ పతాకంపై మాలా మణియన్ నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త విజయన్తో పాటు గీతా కై లాసం, గజరాజ్, మషాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర వివరాలను సంయుక్త విజయన్ తెలుపుతూ ఒక మగవాడు యువతిగా మారాలనుకోవడంతో పాటు మన సమాజం వారిని ఎలా అవమానిస్తుందీ, వాటన్నింటినీ అధిగమించి వారు ఎలా సాధిస్తారు. అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రం ఐఎఫ్ఎఫ్ఐ 23 తదితర పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రపంచ ప్రేక్షకులతో పాటు మంచి చిత్రాలను ఇష్టపడే సినిమా ప్రియుల అభినందనలు అందుకుందని దర్శకురాలు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి స్టీవ్ బెంజిమెన్ సంగీతాన్ని, చాయాగ్రహణం అందించారు. -
సవాళ్లకు .. సంసిద్ధం
ఈశాన్య రుతు పవనాల సీజన్లో ఎదురయ్యే విపత్తులను సమష్టిగా సమన్వయంతో.. ఎదుర్కొందామని అధికారులకు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తలు మరింత విస్తృతం కావాలని, స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో ప్రత్యేక సహాయక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విపత్తులు ఎదురైన పక్షంలో ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వొద్దని, ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల రూపంలో ఈ ఏడాది తమిళనాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి సచివాలయంలో అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు ముఖ్యశాఖల మంత్రులు, ప్రధా న, అదనపు కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి ముందే అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తలను విస్తృతం చేయాలని సూచించా రు. జాగ్రత్తగా ఉంటే ఎంతటి విపత్తు ఎదురైనా ప్రా ణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు వీ లుంటుందన్నారు. గత మూడేళ్ల కాలంలో ఈశాన్య రుతు పవనాలతో ఎదురైన విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది నైరుతి రూపంలో ఇంకా వర్షాలు పడుతున్నాయని గుర్తుచేస్తూ, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్యం రూపంలో మరింత వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వచ్చి ఉన్నాయన్నారు.సురక్షితంగా..వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా సమష్టిగా పనిచేసి ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిర్చారు. అవసరమైన చోట్ల ఉందుగానే మోటరు పంపు సెట్లు, జేసీబీలు, బోట్లను సిద్దంచేసి ఉంచుకోవాలన్నారు. వివిధ వరద నివారణ పనులు త్వరగా ముగించాలని, జిల్లాల వారీగా సీనియర్ అధికారుల పర్యవేక్షణ ముందు జాగ్రత్తలను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. ప్రధానంగా చైన్నెలో మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్లోని అన్ని జోన్లకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. వరద నియంత్రణ పనులే కాదు. ఇతర సహాయకాల నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా? అని ఈ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వరదల సీజన్ వస్తే నీటి పరివాహక ప్రదేశాలపై మరింత దృష్టి పెట్టాలని, పిల్లలు ఎవ్వరూ అటు వైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వ వద్దని కోరారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వరదలు తుఫానులు వంటి విపత్తుల సమాచారం బదిలీలు, విద్యుత్ సేవలకు ఆటంకం అనేది ముఖ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సురక్షితమైన తాగునీరు, పాలు ఆహార పదార్థాల కొరత అన్నది లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ చోటు చేసుకోకుండా, అంటు వ్యాధులు వ్యాపించకుండా ప్రజారోగ్య సేవ విభాగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయడం ద్వారా మాత్రమే ఎలాంటి విపత్తులు, సవాళ్లను ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. అలాగే, విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవకులు, వలంటీర్ల పాత్ర కూడా ఎంతో కీలకం అని, రెస్క్యూ బృందాలతో కలిసి వలంటీర్లు పనిచేసే విధంగా ప్రత్యక చర్యలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పనిచేయడం ద్వారా 100 శాతం విజయం సాధించగలమని, రుతు పవనాలసీజన్లో సవాళ్లను ఎదుర్కొని, ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే వేదిక మీద నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.సకాలంలో సమాచారం..ప్రజలకు సకాలంలో, వాతావరణ సూచనలు, సమాచారం చేర వేయడం ద్వారా పెద్ద ఎత్తుననష్టాలను నివారించేందుకు వీలుందన్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలను సకాలంలో చేర వేయడమేనని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్లో ప్రస్తుతం ఆధునిక సౌకార్యలను కల్పించి ఉన్నామని వివరిస్తూ, ఇక్కడ పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తారని, ఇదే సమన్వయం అన్ని జిల్లాలలోనూ ఉండాలని ఆదేశించారు. ఎంత వర్షం పడింది? ఎం జరుగుతోంది? అన్నది సకాలంలో తెలిస్తే, డ్యామ్లలో నీటి విడుదల నిర్వహణ, వరద హెచ్చరికల సమాచారంతో సహా వివిధ విధులను సక్రమంగా నిర్వహించ గలిగేందుకు వీలుంటుదన్నారు. 100 ఆటోమేటిక్ రెయిన్ గేజ్లు, ఆటోమేటిక్ వాతావరణం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సమాచారం పొందుతున్నామని గుర్తు చేస్తూ, ఈ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే వారు వారి జాగ్రత్తలలో ఉంటారని వ్యాఖ్యలు చేశారు. సమాచారాన్ని తమిళంలో తెలుసుకునేందుకు ప్రభుత్వం టీఎన్ అలర్ట్ మొబైల్ అప్లికేషన్ను సిద్ధం చేసిందని ప్రకటించారు. చైన్నెతో సహా నగరాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, దేశానికే ఆదర్శంగా నిలిచిన మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్లో ప్రాంతాలు, వార్డులు, వీధుల వారిగా వరద హెచ్చరికల సమాచారాలను సకాలంలో అందించాలని, వరద ముంపు ఎదురైన పక్షంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, బిడ్డల తల్లులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.వాతావరణ మార్పులతో..గతంలో ఈశాన్య రుతుపవనాలు సీజన్ రాష్ట్రం అంతటా వ్యాపించేవని వివరించారు. అయితే, ఇటీవలి వాతావరణ మార్పుల నేపథ్యంలో రోజుల వ్యవధిలో ఒకే చోట మొత్తం వర్షం పడుతోందని, కొన్ని గంటల్లో ఊహించని రీతిలో వర్షపాతం నమోదు అవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి వర్షాన్ని ఎదుర్కొనడమే పెను సవాళ్లు గా మారి ఉన్నాయన్నారు. గంటల వ్యవధిలో కురిసే వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజలకే కాదు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలకు సైతం పెద్ద ఎత్తుననష్టం ఎదురు అవుతోందన్నారు. గత ఏడాది ఈశాన్య రుతుపవనాల సమయంలో చైన్నె, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి భారీ వరదల రూపంలో అతి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతో ఆ జిల్లాలు త్వరితగతిన కోలుకున్నాయని వివరించారు. ఈ విపత్తులు నేర్పిన గుణపాఠంతో ముందు జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎస్ నేతృత్వంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాలు జరిగాయని, సమగ్ర అధ్యయనంతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారని గుర్తు చేశారు. -
ఘనంగా అవార్డుల వేడుక
తమిళసినిమా: అవార్డులు అనేవి ప్రతిభకు గుర్తింపునే కాకుండా వర్తమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహకారంగా నిలుస్తాయి. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయి. ఇక సామాజిక సేవకులకు ఈ అవార్డులు వారి సేవలకు ఫలితంగానూ, గౌరవాన్ని పెంచే విధంగాను ఉంటాయి. అలాంటి ప్రోత్సాహంగా అవార్డుల వేడుకలను అనురాధ జయరామన్కు చెందిన మహా ఆర్ట్స్ సంస్థ, కలైమామణి, డాక్టర్ నైల్లె సుందరాజన్కు చెందిన యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థ కలిసి చాలా ఏళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు.అదేవిధంగా శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి జ్ఞానప్రకాశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటి శ్రీవిద్య తదితర కళాకారులతోపాటు, సైకిల్ ఛాంపియన్ డాక్టర్ ఎం ఆర్ సౌందర్య రాజన్, సెన్సార్ బోర్డు సభ్యుడు డాక్టర్ వీకే. వెంకటేశన్ మొదలగు పలువురు సామాజిక సేవకులకు విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం చేతుల మీదగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల కళా, సామాజిక సేవలను విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం అభినందించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
మా సంస్థపై విష ప్రచారం తగదు.. తిరుపతి లడ్డు వివాదంపై ఏఆర్ డెయిరీ
చెన్నై : దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ స్పందించింది. ‘‘ఏఆర్ డెయిరీ నుండి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యడం లేదు. 25 సంవత్సరాలుగా మేం డైయిరీ సేవల్ని అందిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు.తాజాగా, మా సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మేం.. టీటీడీకి అందించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై టెస్ట్లు నిర్వహించాం. ఆ టెస్టుల్లో నేయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్ట్ను పంపించాం. కానీ టీటీడీ నుంచి మాకు స్పందన రాలేదు’’ అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
ట్రెండింగ్ బీజేపీ నేత బయోపిక్లో స్టార్ హీరో
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బయోపిక్ ఉందా..? అందులో నటుడు విశాల్ అన్నామలై పాత్రలో నటించనున్నారా..? వంటి ప్రశ్నలు రాష్ట్రా వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. తమిళనాడులో బీజేపీ అధ్యక్ష పగ్గాలను అన్నామలై చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. అన్నామలై రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారన్నది గమనార్హం. ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి అన్నామలై జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో అన్నమలై పాత్రలో విశాల్ నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. విశాల్ తాజాగా నటించిన రత్నం చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఆయన తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డిటెక్టివ్ 2 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఆయన 2026 ఎన్నికల పట్టికలో తన పేరు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వాగ్దాటి, ఆయన పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ నటుడు విశాల్ పేర్కొనడం గమనార్హం. కాగా అన్నామలై ఎలా పోలీస్ అధికారి అయ్యారు? ఆ తర్వాత ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించారు? వంటి ఆయన జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. -
ఎన్నికల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. డిఫరెంట్ స్టైల్ ప్రచారం!
చెన్నై: దేశంలో ఎన్నికల సందడి నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఎన్నికల సిత్రాల్లో భాగంగా నేతలు కూరగాయలు అమ్ముతూ, వంట చేస్తూ వివిధ పనుల్లో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాగా, ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి లోక్సభ స్థానం నుంచి ఇండిపెండింట్ అభ్యర్థిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్. దామోదరన్ డిఫరెంట్ బరిలో నిలిచారు. ఎన్నికల సందర్భంగా దామోదరన్ డిఫరెంట్ స్టైల్లో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియా సహా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఇంటిపెండెంట్ అభ్యర్థి కాగా.. ఈసీ ఆయనకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. #WATCH | Tiruchirappalli, Tamil Nadu: Independent candidate from Trichy Lok Sabha seat Padma Shri S Damodaran indulges in making flower garland and sells vegetables as the part of Election Campaign pic.twitter.com/9iARbrat1O — ANI (@ANI) April 11, 2024 ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దామోదరన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ వద్ద ఉధృత ప్రచారం నిర్వహిస్తున్న దామోదరన్.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను కోరారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తిరుచిరాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. గత నలభై ఏళ్లుగా నేను పారిశుధ్య వాలంటీర్గా పనిచేస్తున్నాను. 21 ఏళ్ల వయసప్పుడు నా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. 60 ఏళ్ల వయసులో నాకు పద్మశ్రీ లభించింది చెప్పుకొచ్చారు. తనను గలిపిస్తే పచ్చదనంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
9న చైన్నెలో పీఎం రోడ్షో
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ ఆరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈనెల 9వ తేదీన చైన్నెలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లపై బీజేపీ వర్గాలతో పాటు పీఎం భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఐదుసార్లు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. ఆరోసారి పర్యటనకు ఆయన రెడీ అయ్యారు. ఈసారి చైన్నెలో రోడ్ షో నిర్వహణకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. ఉత్తర చైన్నె, సెంట్రల్చైన్నె, దక్షిణ చైన్నెలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ రోడ్ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా పరమైన చర్యలపై బీజేపీ వర్గాలతోపాటుగా పీఎం భద్రతా బృందాలు దృష్టి పెట్టాయి. మాంబళం నుంచి పాండి బజార్ మీదుగా ఓ రూట్ మ్యాప్, కోడంబాక్కం – నుంగంబాక్కంమార్గంలో మరో రూట్ మ్యాప్, ఉత్తర చైన్నెలోని తిరువొత్తియూరు వడి ఉడయమ్మన్ ఆలయంలో దర్శనం, అక్కడ కొంత దూరం రోడ్ షోకు కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా ఈరోడ్ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే వేలూరు, పెరంబలూరులో పోటీ చేస్తున్న మిత్ర పక్షాల అభ్యర్థులకు మద్దతుగా తిరుచ్చిలో జరిగే సభలో పీఎం ప్రసంగించబోతున్నారు. అనంతరం కేరళకు బయలుదేరనున్నారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలలోజాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం వెలువడ్డ సమాచారం మేరకు ఈనెల 11 నుంచి 13 తేదీలో వారి పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశిలలో రాహుల్ పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. -
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి
తిరుచిరాపల్లి/లక్షద్వీప్: రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్ర ప్రభుత్వం విశ్వసించే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆయన మంగళవారం తమిళనాడులో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర విమానయానం, ఓడ రేవులు, రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహాయ వాయువు, అణు శక్తి, ఉన్నత విద్యకు సంబంధించిన రూ.20,140 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలుత భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400సార్లు పర్యటించారని చెప్పారు. తమిళనాడు అభివృద్ధితో ఇండియా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అభివృద్ధికి కీలక మార్గమని అన్నారు. దీనివల్ల కీలక రంగాల్లో పెట్టుబడులు, తద్వారా వ్యాపారం, వాణిజ్యం పెరుగుతాయని, ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువతకు ఇది మంచి సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. లక్షద్వీప్లో మోదీ.. రూ1.1,50 కోట్లకుపైగా విలువైన పలు జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ మంగళవారం లక్షద్వీప్కు చేరుకున్నారు. అగత్తీ ఎయిర్పోర్టు వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. లక్షద్వీప్లో గత పదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను
తమిళసినిమా: సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను కోరుకుంటారు. అలాంటి పాత్రలతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడవచ్చునని, ప్రేక్షకుల ఆదరణను పొందవచ్చు అనేది వారి అలోచనగా ఉంలుటుంది. అలాంటిది నటి అనుకీర్తీవాస్ మాత్రం ఛాలెంజింగ్ పాత్రలను కోరుకుంటున్నారు. ఈమె గురించి చెప్పాలంటే కళాశాల రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్నీ గెలుచుకున్నారు. తర్వాత సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఇంకేముందు విజయ్సేతుపతి కథానాయకుడిగా నటించిన డీఎస్పీ చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేశారు. అలా తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ బ్యూటీకి ఆ వెనువెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వరించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీని గురించి నటి అనుకీర్తీవాస్ మాట్లాడుతూ తన తొలి చిత్రం డీఎస్పీలో కంటే మంచి పాత్రను తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వరరావులో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఇంకా ఛాలెంజింగ్తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఈ బ్యూటీ పేర్కొన్నారు. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటున్న ఈ భామ అందంతో పాటు అభినయంతోనూ సత్తా చాటుకోవడం విశేషం. -
బలపడుతున్న ఈశాన్యం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 29వ తేదీ నుంచి డెల్టా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం రాష్ట్రంలో మరీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సాధారణ వర్ష పాతం కన్నా 39 శాతం వర్షం తక్కువగా పడ్డట్లు వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. చైన్నెలో 18 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఐదు సెంటీ మీటర్లు వర్షం మాత్రమే పడిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నైరుతి కారణంగా అత్యధిక వర్షం కన్యాకుమారిలో పడింది. ఇక్కడ సగటున 19 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. ఏకంగా 49 సెంటీ మీటర్ల వర్షం పడడం విశేషం. ఒక్క కన్యాకుమారి మినహా తక్కిన అన్ని జిల్లాలో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవడం గమనార్హం. బలపడుతున్న ఈశాన్యం అదే సమయంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసి ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ పవనాలు క్రమంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నెలకొన్న తుపాన్లు తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఈ పవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రధానంగా డెల్టాలోని తిరువారూర్, నాగపట్నం, కడలూరు, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పుదుకోట్టై, పెరంబలూరు జిల్లాలతోపాటు శివగంగై, విల్లుపురం, కళ్లకురిచ్చి తదితర 16 జిల్లాల్లో ఈనెల 29వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో ఆ జిల్లాల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. క్రమంగా విస్తరిస్తున్న ఈశాన్య రుతుపవనాలు నైరుతిలో సాధారణ వర్షపాతం కంటే 39 శాతం తక్కువగా వానలు -
వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో
సాక్షి, చైన్నె : వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. చైన్నె బీసెంట్ నగర్లో వాకింగ్ కోసం కేటాయించిన మార్గాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఎం. సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ, వర్షాల సీజన్ నేపథ్యంలో వచ్చే జ్వరాలను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రానున్న 10 వారాల పాటు వారాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల పరీక్షలూ ఈ శిబిరాల్లో నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా చైన్నెతో పాటు 38 జిల్లాల్లో వాకింగ్ కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేస్తున్నామని, చైన్నెలో బీసెంట్ నగర్ బీచ్ మార్గాన్ని తాజాగా పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి గగన్ దీప్సింగ్ బేడీ, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ గుండెపోటుతో మరణించారు. (ఇదీ చదవండి: విజయ్కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్) కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఫిట్నెస్కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది. యోగేష్ చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను బాడీ బిల్డర్, కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్షిప్లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. బాడీబిల్డింగ్లో 'మిస్టర్ తమిళనాడు' అవార్డును అందుకున్నాడు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్.. ఓ జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్.. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. -
తోడొకరుండిన అదే భాగ్యము!
తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్ పొందింది. రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్లి వస్తారు. గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్ చందరమరక్షణ్ అనే ఇన్స్టా యూజర్ పోస్ట్ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య. (చదవండి: అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!) -
డ్రైవర్కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
ఇటీవల తమిళనాడులో సాధారణ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 9000కోట్లు జమయ్యాయన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తి ఇంత డబ్బు వచ్చిందని సంతోషపడేలోపు అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాగా దీనికి కారణమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తన పదవికి రాజీనామా చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'ఎస్ కృష్ణన్' గురువారం తన రాజీనామాను సమర్పించారు. చెన్నై క్యాబ్ డ్రైవర్కు రూ.9,000 కోట్లు తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన రాజీనామాకు ఇది కాదని, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే అని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో గతేడాది సెప్టెంబర్లో టీఎంబీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ 2023 సెప్టెంబరు 28న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రాజీనామాను ఆమోదించి, వారి మార్గదర్శకత్వం లేదా సలహా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఫార్వార్డ్ చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. డ్రైవర్కు రూ.9,000 కోట్లు ఖాతాలో యాడ్ అవ్వగానే ఇదేదో స్కామ్ అనుకున్నాడు, కానీ అనుమానంతో తమ ఫ్రెండుకు రూ. 21,000 ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మొత్తాన్ని బ్యాంక్ డెబిట్ చేసింది. -
89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్!ఆమె ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే!
కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది. మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్లో కూడా లీడర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023 (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కేబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ పార్టీపై చేసిన విమర్శలకు రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్బంగా స్టాలిన్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ప్లాట్ఫారం స్పీకర్ లా మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం ద్వారా తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. మాస్ వార్నింగ్.. మనీ లాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా ఈడీ వేధింపులకు గురిచేసినంత మాత్రాన మేము భయపడేది లేదు. మాక్కూడా రాజకీయాలు చేయడం తెలుసు. ఇది బెదింపు కాదు.. హెచ్చరిస్తున్నా.. " అంటూ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ మాటలేంటి? అన్నామలై మాట్లాడుతూ.. గౌరవనీయులైన స్టాలిన్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం తగదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఒక ప్లాట్ ఫారం స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. అదికూడా ఇప్పటివరకు ఐదు పార్టీలు మారి అనేక అక్రమాలకు పాల్పడిన అవినీతిపరుడిని కాపాడటానికి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఒకప్పుడు స్వయంగా మీరే ఈ బాలాజీ అవినీతిపరుడని ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరే ఆయన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, 8.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అనవసర భయాందోళనలను పక్కనపెట్టి కాస్త విచక్షణతో మాట్లాడమని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇది కూడా చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్కు విజయ్ అదేశం
కోలీవుడ్ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్గా తిరుగులేని ఫ్యాన్ బేస్తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి సాయం చేసేందుకు విజయ్ ముందుకొచ్చాడు. (ఇదీ చదవండి: వరుణ్, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!) “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలోని ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈనెల 17వ తేదీన ఆయన సన్మానించనున్నాడు. వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయంతో విద్యార్థుల సమాచారం సేకరించాలని తన ఫ్యాన్స్కు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
గల్లీలో ఐరావతం హల్ చల్
-
క్షీణించిన నిర్మాత ఆరోగ్యం.. దీనస్థితిలో వీడియో విడుదల.. లారెన్స్ సాయం
చెన్నై: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు. విక్రమ్, సూర్య కలిసి నటించిన పితామహన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రంతో పాటు విజయకాంత్ హీరోగా నటించిన గజేంద్ర తదితర భారీ చిత్రాలను నిర్మాత విఏ.దురై. చివరిలో నిర్మించిన చిత్రాలు ప్లాప్ కావడంతో నష్టాల పాలయ్యారు. కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నటుడు రజనీకాంత్ కూడా సాయం చేస్తానని చెప్పారు. రాఘవ లారెన్స్ నిర్మాత పరిస్ధితి గ్రహించి బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్ కథానాయకుడిగా నటించిన రుద్రన్ చిత్రం తమిళ ఉగాది సందర్భంగా ఇవాళ ఏప్రిల్ 14న విడుదలైంది. చదవండి: ‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ
భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మన దేశంలో కొన్ని కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ Dao EVTech భారీ పెట్టుబడిని ప్రకటించింది. మహారాష్ట్ర పూణే సమీపంలోని చకన్లోని 'డావ్ ఈవీటెక్' (Dao EVTech) తమిళనాడులో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 షోరూమ్లను కలిగి ఉన్న ఈ కంపెనీ మరిన్ని షోరూమ్లను ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. (ఇదీ చదవండి: పది గ్రాముల బంగారం రూ. 2 లక్షలకుపైనే .. ఎక్కడంటే?) తమిళనాడులో ఇప్పటికే మధురై, పొల్లాచ్చి, కోయంబత్తూర్, తంజావూరు ప్రాంతాల్లో డీలర్షిప్లను కలిగి ఉన్న డావ్ ఈవీటెక్ మరిన్ని డీలర్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. చెన్నైలో ప్రారభించాలనుకున్న డీలర్షిప్లు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నగరాల్లో డీలర్షిప్లు ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమళనాడు చాలా కీలకమైన ప్రాంతం. చెన్నైలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఎక్కువ జనాభా ఉండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు చాలా దోహదపడతాయని కంపెనీ చైర్మన్ డాక్టర్ మైఖేల్ లుయి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయం చేయదలచుకోలేదు: సీఎం స్టాలిన్
‘తమిళుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళతాం’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు ధన్యవాదాలు తెలుపుతూ, సభలో ఆయన వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయం చేయదలచుకోలేదని.. ప్రజా సంక్షేమం, తల్లి తమిళనాడును రక్షించడమే తమ ముందున్న అతిపెద్ద బాధ్యత అని ఉద్వేగంగా ప్రసంగించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూ.. అందరికీ సమ న్యాయం చేయడమే తమ లక్ష్యమని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా తమిళనాడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సభలో గవర్నర్ వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం గురించి మాట్లాడి రాజకీయం చేయదలచుకోలేదన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమష్టి అభివృద్ధి, సమానత్వం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి సూత్రాలను అనుసరించి ద్రావిడ మోడల్ పాలనను రూపొందించామన్నారు. ప్రజల సంక్షేమం మాత్రమే తమ ఆలోచన అని, అదే ప్రజల హృదయాలను తాము గెలుచుకున్నామని పేర్కొన్నారు. నేను అంటే ఓ వ్యక్తి కాదని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కెబినెట్, ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయనున్నామని ప్రకటించారు. కొత్తగా సీఎం గ్రామీణ రోడ్డు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. శక్తిమంతమైన ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాష, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి నినాదాలతో శక్తిమంతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంగా రాజీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నామన్నారు. తమిళనాడు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యా అభివృద్ధి ఏక కాలంలో జరగాలని, తద్వారా అందరికీ మేలు జరగాలన్న కాంక్షతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమిళనాడు ప్రభుత్వం ఆశయాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను క్లుప్తంగా పేర్కొన్నామని వివరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకు, బలాన్ని చాటేందుకు, శతాబ్దాల చరిత్ర కలిగిన అసెంబ్లీ విలువలను నిలబెట్టే విషయంలో వెనకడానని, ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూక్తులు, తమిళ కవిత్వాలను క్రోడీకరించారు. నిరంతరం శ్రమిస్తున్నాం... గడిచిన ఏడాదిన్నర కాలం తమిళనాడుకు సువర్ణ యుగాన్ని తలపించే రోజులు అని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కరోనా బారిన ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించామని, తాను సైతం అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన గదిలో ఓ ‘డ్యాష్ బోర్డ్ ‘ ఉందని, ప్రతి రోజు అందులోకి వచ్చే సమాచారాలను, వివరాలను పరిశీలించి ఆయా శాఖల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో తన పర్యటనలు, ప్రభుత్వ ప్రగతి, నిధుల కేటాయింపు, తదితర అంశాలను సభకు సీఎం వివరించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ద్రావిడ మోడల్ పాలనకు లభించిన ఫలితం ఇది అని పేర్కొన్నారు. పథకాల విస్తరణ.. రాష్ట్రంలోని 1,545 పాఠశాలల్లో అల్పాహారం పథకం అమల్లో ఉందని.. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఈ పథాకాన్ని అమలు చేస్తామన్నారు. 15 నెలల వ్యవధిలో రైతులకు లక్షా 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం పేరిట ప్రత్యేక పథకం అమలు చేయనున్నామన్నారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లతో 10 వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మసీదులకు ఇది వరకు రూ. 6 కోట్లు రాయితీలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను రూ. 10 కోట్లకు పెంచుతున్నటు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు 2024 జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడి పాలసీలు, మౌలిక వసతులను పెట్టుబడిదారులకు తెలియజేయడానికి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వందకుపైగా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఈ మహానాడుకు ఆహ్వానించనున్నామన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు - కృష్ణగిరి, హోసూరు మధ్య వర్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. - పుదుకోటైను కార్పొరేషన్గా మార్చబోతున్నామని మంత్రి కేఎన్ నెహ్రు అన్నారు. - సీఎం బీమా పథకం అమల్లో దేశంలో తమిళనాడు రికార్డు సృష్టించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ వివరించారు. - ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.2,37,850 కోట్లతో పనులు చేపట్టామని.. శరవేగంగా జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. - ఈ ఏడాది 316 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. - అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి పేర్కొన్నారు. చివరగా సభలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో సవరణలతో పాటు మరికొన్ని ముసాయిదాలు ఆమోదం పొందాయి. అనంతరం సభను స్పీకర్ అప్పావు వాయిదా వేశారు. -
సెంచరీతో చెలరేగిన బాబా అపరాజిత్.. ఆధిక్యంలో తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: బౌలర్ల వైఫల్యం కారణంగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 203/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 111.5 ఓవర్లలో 4 వికెట్లకు 510 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్నైట్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ (116; 16 ఫోర్లు, 3 సిక్స్లు) అదే స్కోరు వద్ద కార్తికేయ కక్ బౌలింగ్లో అవుటవ్వగా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (273 బంతుల్లో 179; 18 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబా అపరాజిత్ (165 బంతుల్లో 115; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. అపరాజిత్ సోదరుడు ఇంద్రజిత్ (52 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అపరాజిత్ అవుటైన వెంటనే తమిళనాడు తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్కు రెండు వికెట్లు దక్కాయి. 115 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (14; 3 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్ కాగా... కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5 బ్యాటింగ్), తనయ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు పోరాడి ‘డ్రా’ చేసుకుంటారో చేతులెత్తేసి ఓటమిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి. చదవండి: Mohammed Rizwan: వరల్డ్కప్లో భారత్ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..! -
బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే
చెన్నై: తమిళనాడు బీజేపీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శశికళను బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకునేందుకు పలుమార్లు ట్రై చేశాడు. ఆమె మాత్రం ఈ చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY — இசை (@isai_) September 13, 2022 ఈ వీడియోను సరిగ్గా చూపేందుకు స్లో మోషన్లో ఎడిట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అది పెద్ద సమస్యా? అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి సందర్భంగా రామనాథపురం జిల్లాలో నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీఎంకే ఆరోపణలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో బీజేపీ నేత ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. డీఎంకే దురుద్దేశంతోనే ఈ వీడియోను ఎడిట్ చేసిందన్నారు. మరోవైపు బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు -
హస్తినలో పళనిస్వామికి చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?
సాక్షి, చెన్నై: ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దక్కనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఆయన చెన్నైకు తిరిగి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం ఓ అడుగు ముందుకు వేసి, 14 జిల్లాలకు అన్నాడీఎంకే కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు నేతలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకర్ని మరొకరు అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ.. ఇప్పటికే పలు ప్రకటనలు విడుదల చేశారు.ఈ పరిస్థితుల్లో పళనిస్వామికి ఢిల్లీ నుంచి ఆహా్వనం రావడంతో ఇక, పన్నీరు సెల్వంకు కేంద్రం అండదండాలు కరువైనట్లే అన్న చర్చజోరందుకుంది. తిరుగు పయనం రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మును పళనిస్వామి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి కూడా పళని స్వామి హాజరయ్యారు. ఇక ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు పళని స్వామి బృందం ప్రయత్నాలు చేసింది. అయితే, అపాయింట్మెంట్ లభించకపోవడంతో వారంతా తిరిగి చెన్నైకు వచ్చేశారు. అదే సమయంలో పళని స్వామి వ్యవహరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు, అందుకే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వనట్లు పన్నీరు సెల్వం శిబిరం చెబుతుండడం గమనార్హం. ఇక ఈనెల 28వ తేదీ చెస్ ఒలంపియాడ్ నిమ్తితం చెన్నైకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడీఎంకేలో విభేదాలకు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారిగా తనను కలవాలనే ఆదేశాలు ఢిల్లీ నుంచి పన్నీరు, పళనికి వేర్వేరుగా వచ్చినట్లు సమాచారం. కొత్త కార్యదర్శులను నియమించిన పన్నీరు తన మద్దతుదారులు 14 మందిని అన్నాడీఎంకే కార్యదర్శులుగా నియమిస్తూ పన్నీరు సెల్వం ఆదివారం ప్రకటన చేశారు. చెన్నై పరిధిలోని నాలుగు జిల్లాలకు, కోయంబత్తూరు, రామనాథపురం తదితర జిల్లాలకు కార్యదర్శులను నియమించారు. ఇందులో ఎంపీ ధర్మర్ను రామనాథపురం జిల్లా కార్యదర్శి, కోవై సెల్వరాజ్ను కోవై నగర కార్యదర్శిగా నియమించారు. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వంపై పళని వర్గం నేత, ఎంపీ సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో వస్తువులు మాయమైనట్లుగా సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో ఆదివారం చెన్నై పోలీసులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
టోల్గేట్ సిబ్బందిపై 'చిన్నమ్మ' ఫైర్
చెన్నై : చిన్నమ్మ శశికళకు కోపం వచ్చింది. టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ రోడ్డుపై నిరసనకు దిగారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పురట్చి పయనానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తృతంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ, మద్దతుదారుల్ని ఏకం చేస్తూ, తన బలాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి విల్లుపురం పర్యటన ముగించుకుని తిరుచ్చి వైపుగా బయలు దేరి వెళ్లారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎనిమిది వాహనాలతో కూడిన ఆమె ప్రైవేట్ కాన్వాయ్ తిరుచ్చి తువ్వాకుడి టోల్ గేట్కు చేరుకుంది. ముందుగా వెళ్లున్న వాహనం టోల్ ‘గేట్’ను దాటింది. అయితే, చిన్నమ్మ వాహనానికి అడ్డుగా గేట్ పడటంతో వివాదం రేగింది. ఆమె ఉన్న వాహనం అద్దాలను తాకుతూ గేట్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇదే టోల్ గేట్లో తనకు రెండుసార్లు అవమానం జరిగిందని, మరో మారు అదే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మద్దతుదారులు సైతం తగ్గేది లేదంటూ వాహనాలను రోడ్డు మధ్యలో ఆపేశారు. నిరసన.. బుజ్జగింపులు చిన్నమ్మ మద్దతుదారులు ఒక్క సారిగా టోల్గేట్ వైపు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సిబ్బంది ప్రాణభయంతో పారిపోయారు. దీంతో టోల్లోని అన్ని గేట్లు మూత పడ్డాయి. వాహనాలు బారులు తీరడమే కాకుండా, కారులో నుంచి చిన్నమ్మ శశికళ నిరసనకు దిగారు. ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి చిన్నమ్మను, ఆమె మద్దతు దారులను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టోల్ గేట్ మేనేజర్ అమర్నాథ్ చిన్నమ్మకు క్షమాపణలు చెప్పినా చిన్నమ్మలో ఆగ్రహం తగ్గలేదు. తనపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఫిర్యాదు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొనడంతో చిన్నమ్మ శాంతించారు. గంట తర్వాత ఆమె కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది. ఇదీ చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
ఘాతుకం: కన్నతల్లి కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు..
తిరువొత్తియూరు(చెన్నై): బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడాన్ని ఖండించిందనే కోపంతో ఓ బాలిక తన తల్లిని హత్య చేసింది. వివరాలు.. తూత్తుకుడి కార్పొరేషన్ చాకలిపేట రెండో వీధిలో మాడస్వామి. మునిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో మునిలక్ష్మి శనివా రం రాత్రి హత్యకు గురైంది. తూత్తుకుడి పోలీసు లు మునిలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మునిలక్ష్మి కుమార్తె (17) రాజీవ్నగర్కు చెందిన కన్నన్ (20), ముత్తయ్యపురానికి చెందిన తంగకుమా ర్ (22)తో స్నేహం కలిగి ఉందని తేలింది. అలాగే తంగ కుమార్కు, ఈ బాలికకు ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో మునిలక్ష్మి దాన్ని తీ వ్రంగా ఖండించినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన బాలిక, కన్నన్, తంగకుమార్, మరోస్నేహితుడితో కలిసి మునిలక్ష్మిపై దాడి చేసి నోటిలో గుడ్డపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. పోలీసులు కన్నన్ను అరెస్టు చేశారు. తంగకుమార్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీ కొడుకు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు రాకేష్(22) మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం.. డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా.. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. మాజీ సీనియర్ న్యాయవాది ఇళంగోవన్ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సమానత్వం దిశగా ముందడుగు
భారత దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక మహత్తర విప్లవం. వేల సంవత్సరాలుగా ఉన్న అసమానతలకు రాజ్యాంగం చరమగీతం పాడింది. ప్రజలంతా సమానమేననీ, పౌరులందరూ సమానమైన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. అయితే ఇప్పటికీ దేవాలయాల్లో దళితులకు ప్రవేశం దొరకని సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే! వీటి విరుగుడుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. వాటికి అనుగుణంగానే తమిళనాడు ప్రభుత్వం, హిందువులుగా విశ్వాసం కలిగిన అన్ని కులాల వారికీ పూజారు లుగా ఉండే అవకాశం కల్పిస్తోంది. అంతకుమునుపే కేరళ ప్రభుత్వం ఈ బాటలో నడుస్తోంది. కులనిర్మూలనా ఉద్యమంలో ఇవి గొప్ప ముందడుగులు. ఒకే రకమైన నేరం చేసినప్పటికీ శిక్షలు కులాన్ని, వర్ణాన్ని బట్టి ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతర వ్యాఖ్యానాల ద్వారా ప్రజల మెదళ్ళలో తరతరాలుగా చొప్పించారు. అందుకే చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులు దైవంతో సమానం కాబట్టి వారిని శిక్షించే అధికారం ఎవరికీ లేదు. క్షత్రియులు ఏది చేసినా రాజ్య రక్షణార్థమై చేస్తారు. అందువల్ల వాళ్ళు శిక్షార్హులు కాదు. వైశ్యులను మందలించాలి, శూద్రులను కఠినంగా శిక్షించాలన్న సూత్రాన్ని వేల సంవత్సరాలుగా ఘోషిస్తూ వస్తున్నారు. దానికి అడ్డు కట్టపడింది సరిగ్గా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే! భారత రాజ్యాంగం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజ లంతా సమానమేననీ, పౌరులందరూ సమానావకాశాలు, సమాన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక విప్లవం. గత రెండువేల సంవత్సరాలకు పైగా భారత దేశంలో ఉన్న ప్రజలను... వర్ణాలుగా, ఆ తర్వాత కులాలుగా విభజించి, ఒకరిపై మరొకరికి ఆధిపత్యం కల్పించి, పుట్టుక ద్వారానే కులం, కులం ద్వారానే గౌరవం, అధికారం కట్టబెట్టిన స్మృతులు, శ్రుతులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కాలం చెల్లిపోవడం సమాజానికి జరిగిన ఒక గొప్ప మేలు. రాజ్యాంగం అమలులోకి రావడం ఒక మహత్తరమైన సందర్భమే అయినా, దాని అమలు మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయితే భారత రాజ్యాంగం, దానిపై ఆధారపడి రూపొందించిన చట్టాలు మాత్రం అణగారిన ప్రజలకు ఒక భరోసానిచ్చాయి. రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఒకసారి మాట్లాడుతూ, ‘‘అది ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ, అమలు చేసేవాళ్ళకు చిత్తశుద్ధి లేకపోతే అది నిరర్థకమవుతుంది. ఒక వేళ రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ, దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్లయితే, ఆ రాజ్యాంగమే తన స్వరూపాన్ని మార్చుకుంటుంది’’ అని ప్రభుత్వాల స్వభావాన్నీ, రాజ్యాంగం అమలు ప్రాధాన్యాన్నీ స్పష్టంగా విడమర్చి చెప్పారు. సరిగ్గా అదే విషయం తమిళనాడులో రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ శక్తిని నిరూపిస్తున్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ చిదంబరం నటరాజ దేవాలయంలో ఒక దళిత మహిళకు జరిగిన అవమానం పైన ప్రభుత్వం స్పందించి, ఇరవై మంది అర్చకులపై కేసును నమోదు చేసింది. చిదంబరం నటరాజ దేవాలయంలో ‘కనకసభ’ ప్రాంగణంలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించిన లక్ష్మి అలియాస్ జయశీల అనే మహిళను పూజారులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా, కులం పేరుతో దూషించారని ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం పూజారులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. గతంలో దేవాలయ ప్రవేశాలను నిరోధించిన సంఘటనల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు నిజమైన దోషు లను విడిచిపెట్టి, ఎవరెవరి మీదనో కేసులు పెట్టాయి. కానీ తమిళ నాడు ప్రభుత్వం దేవాలయాల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అర్చక వర్గం పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం సాహసోపేత నిర్ణయం. ఈ సాహసం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది ప్రాథమిక హక్కులే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 – ఇలా ఎన్నెన్నో ఆర్టికల్స్ అసమానతల తొలగింపు లక్ష్యంగా నిర్దేశించుకున్నవి. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఈ ఆర్టికల్స్ అన్నింటి వెనుక ప్రజలందరికీ సమానమైన, గౌరవప్రదమైన జీవితాలను అందించాలనే ఏకైక లక్ష్యం ఇమిడి ఉంది. వాటి అమలు బాధ్యతను ప్రభుత్వాల చేతికి ఈ ఆర్టికల్స్ అప్పగించాయి. ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. ఆధిపత్య కులాలు దేవాలయాలను దళితులకు దూరంగా ఉంచుతున్నాయి. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం 2007 సంవత్సరంలో హిందువులుగా విశ్వాసం కలిగి, హిందూ దేవాల యాల్లో పూజలు చేసుకోవాలనుకున్న అన్ని కులాలకు పూజారులుగా ఉండే అవకాశం ఉన్నదని భావించి, అర్హతలను బట్టి వారిని ఎంపిక చేసి, శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కానీ కొంతమంది సనాతనవాదులు ఈ విషయమై కోర్టు కెక్కారు. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గొగోయ్, జస్టిస్ రమణ ఈ కేసును విచారించి, దేవాలయాల్లో పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని, అర్చకవర్గాన్ని ఒక కులానికి మాత్రమే పరి మితం చేయకూడదనీ, హిందువులైన అందరూ హిందూ దేవాల యాల్లో అర్చకులుగా అర్హులేననీ, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సభ చర్చలను ఉదాహరిస్తూ, 2015 డిసెంబర్ 16న ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అయితే 2021లో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే హిందూ దేవాలయాల్లో వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరినీ అర్చకులుగా నియమిస్తామని తన ప్రణాళికలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 2021 ఆగస్టు 14న గతంలో శిక్షణ పొందిన అర్చకులను ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా దక్షిణాదిలో మరొక రాష్ట్రం కేరళ 2017 అక్టోబర్ 5వ తేదీన బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాలు భారత రాజ్యాంగంలోని కీలకమైన సమాన హక్కుల అమలుకు ఒక కొత్త దారిని చూపాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై; వాటిని అమలు చేసిన డీఎంకే, సీపీఎం లపై విమర్శలు వచ్చాయి. కానీ అవి వాటిని పట్టించుకోకుండా, రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను అమలుచేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే అంబేడ్కర్ 1935 డిసెంబర్లో ‘కుల నిర్మూ లన’ పేరుతో ప్రసంగపాఠంలో చాలా విస్తృతంగా కుల సమస్యను గురించి చర్చించారు. ఒక రకంగా భారత దేశ సమాజ మార్పునకు ఈ పుస్తకం ఒక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. కుల సమస్య సమసిపోవడానికి అడ్డంకిగా ఉన్న అంశాలను, పరిష్కారాలను ఎంతో సైద్ధాంతిక అనుభవంతో వివరించారు. కుల నిర్మూలన జరగాలంటే కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే పనికిరావనీ, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను కలుషితం చేసిన, చేస్తున్న ధర్మశాస్త్రాలను తిరస్క రించాలనీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనీ సూచించారు. అంతేకాకుండా హిందూ కులవ్యవస్థలో ఉన్న అసమానతలను తొల గించడానికి ఒక కార్యక్రమాన్ని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారు. అన్ని ధర్మశాస్త్రాలనూ పక్కన పెట్టి, హిందువులందరికీ ఆమోద యోగ్యంగా ఉండే ఒక గ్రం«థాన్ని రూపొందించాలని సూచించారు. ఒక కులానికే పరిమితమైన పూజారి వ్యవస్థను రద్దు చేయాలనీ, హిందూ మతం అవలంబిస్తోన్న అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలనీ ప్రతిపాదించారు. పూజారులు ప్రభుత్వోద్యోగులుగా ఉండాలనీ, ప్రభుత్వమే వారికి శిక్షణనిచ్చి నియమించాలనీ, ప్రభుత్వో ద్యోగులైన ఐసీఎస్(ఇప్పటి ఐఏఎస్) ఉద్యోగాల్లాగా ఒక పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలనీ పేర్కొన్నారు. దానికి అనుగుణం గానే రాజ్యాంగంలో సమాన హక్కులు, అవకాశాలను పొందు పరి చారు. 1935లో అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలు ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అమలులోకి తీసుకురావడానికి చేస్తున్న కృషి... కుల నిర్మూలనా మహోద్యమంలో ఒక ముందడుగు అని చెప్పక తప్పదు! వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
యువతితో దొంగ బాబా.. ఆ ఆశ్రమంలో ఏం జరిగింది..?
చెన్నై: స్వయం ప్రకటిక దైవం (దొంగ బాబా) అకృత్యాలకు మరో బాలిక బలైంది. మూలికలు, పూజల నెపంతో ఓ బాబా యువతికి వైద్యం అందిస్తున్న క్రమంలో ఆమె ఆ వైద్యానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. అయితే, ఆమె కొద్ది రోజులుగా కడుపు నొప్పి, మెడ నొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా.. వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యువతిని ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరులోని మునుస్వామి ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో మునుస్వామి.. హేమమాలినికి దోషం ఉందని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేయాలని, మూలికల వైద్యం అందించాలని సూచించాడు. బాధితురాలిని ఆశ్రమంలోనే ఉంచాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడే ఉండి అనేక పూజలు చేస్తూ, మునుస్వామి అందిస్తున్న వైద్యాన్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం హేమమాలిని ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆమెతో పాటే అక్కడే హేమమాలిని అత్త ఇంద్రాణి.. వెంటనే మునుస్వామిని కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తానని కోరింది. అయితే, హేమమాలినికి చిక్సిత జరుగుతోందని ఈ సమయంలో బయటకు పంపించలేమని మునుస్వామి చెప్పాడు. దీంతో మునుస్వామితో బాధితురాలి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు హేమమాలిని మృతి చెందినట్టు తెలిపారు. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మునుస్వామి వైద్యంతో తమ బిడ్డను చంపేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో హేమమాలినిని కాలేజీకి వెళ్లేందుకు కూడా మునుస్వామి అనుమతించలేదని అన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మునుస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి విచారణలో పూజలు, మూలికల చికిత్సతో రోగాలు నయం చేస్తున్నట్టు మునుస్వామి చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. -
ఆనంద్ మహీంద్రాకి చిర్రెత్తితే ఏం చేస్తాడో తెలుసా ?
సమకాలిన అంశాలపైనే కాదు విభిన్న విషయాలపై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. కాగా సంక్రాంతి పండగ వేళ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ మనందరికి బాగా తెలిసిన పోడా.. డేయ్ అనే తమిళ పదాన్ని తెర మీదకు తెచ్చి నెట్టింట్ట నవ్వులు పూయించారు. చిన్నప్పుడు తాను తమిళనాడులో చదువుకున్నప్పుడు మొదటగా తెలుసుకున పదం పోడా.. డేయ్ అని చెప్పారు. అంతేకాదు ఈ పదాన్ని తన జీవితంలో ఎన్నో సార్లు ఉపయోగించానని, అయితే కొన్ని సార్లు గట్టిగా చెప్పగా చాలా సార్లు లోలోపలే అనుకున్నట్టుగా చెబుతూ.. అనేక ఇంగ్లీష్ పదాలకు సమానంగా నిలిచే ఓ తమిళ పదాన్ని పోల్చుతూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. Having done my schooling in Tamil Nadu I confirm that this Tamil phrase is the one I learned first, used the most often and have used consistently on many occasions throughout my life. Sometimes loudly, but usually under my breath… 😊 pic.twitter.com/9xU835ntix — anand mahindra (@anandmahindra) January 14, 2022 సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విభిన్న పద్దతుల్లో విషెస్ చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. భోగి పండుగ రోజు వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగని ఎలా పిలుస్తారో చెబుతూ ఓ ఫోటోని ఆయన షేర్ చేశారు. కాగా పొంగల్ రోజున పొడా.. డేయ్ అనే తమిళ పదంతో తన చిన్న నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. -
నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో!
A young man tragically murdered by his mother In Chennai తమిళనాడు: ట్రాన్స్జండర్ మహిళగా జీవిస్తానన్నందుకు తల్లే అతని పాటిట మృత్యువైంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో 19 యేళ్ల నవీన్ అనే వ్యక్తిని తల్లి ధారుణంగా హతమార్చింది. ఈ కేసులో అందిన సమాచారం మేరకు మృతుడు నవీన్కు ట్రాన్స్జండర్గా మారాలని ఉందని తరచూ తల్లి ఉమాదేవికి వద్దకొచ్చి చెబుతూ ఉండేవాడు. ఈక్రమంలో నవీన్ తన పేరును అక్షితగా మార్చుకున్నాడు కూడా. ఐతే ఉమాదేవి కొడుకును ట్రాన్స్జండర్గా మారవద్దని పలుమార్లు సూచించింది. నవీన్ నిరాకచించడంతో తల్లి మరో ఐదుగురి సహాయంతో అతనిపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన నవీన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గత వారం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నవీన్ను అతని తల్లి ఉమాదేవి హత్య చేసినట్లు సేలం పోలీసుల దర్యాప్తులో తేలింది. మగవాడిగా ఉండేందుకు నవీన్ హార్మోన్లు తీసుకోవాలని ఉమాదేవి ఒత్తిడి చేసిందని, అందుకు నవీన్ నిరాకరించడంతో నిందితురాలు ఉమాదేవి, ఆమె సహచరులు నవీన్పై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉమాదేవితో పాటు వెంకటేష్, కామరాజ్, కార్తికేయ, సంతోష్, శివకుమార్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
ఎస్సీ విద్యార్ధుల చేత టాయిలెట్లు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
ఎట్టకేలకు డెలివరీకి సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఓలా ఎలక్ట్రిక్ కొన్నవారికి శుభవార్త. ఎట్టకేలకు రేపటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంతకు ముందు తెలిపినట్లుగా తమిళనాడుకు చెందిన ఈవీ స్టార్టప్ డిసెంబర్ 15 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తుంది. డెలివరీ ప్రక్రియకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను 30,000 మందికి పైగా టెస్ట్ రైడ్ చేసినట్లు తెలిపింది. త్వరలో ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ మరిన్ని నగరాలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రక్రియ గురుంచి ట్విటర్ వేదికగా భవిష్ అగర్వాల్ ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో "తమిళనాడు కేంద్రంగా ఉన్న తన ఫ్యూచర్ ఫ్యాక్టరీలో డెలివరీ కోసం తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సిద్ధం చేయడంలో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది". అక్టోబర్ 25 - నవంబర్ 25 మధ్య మొదటి బ్యాచ్ స్కూటర్లు డెలివరీలు చేయలని సంస్థ భావించింది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల తేదీని వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఓలా వచ్చే సంవత్సరం 2022 తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్మార్కెట్ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం. Gaddi nikal chuki! 🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵 pic.twitter.com/ZjttmnqBZo — Bhavish Aggarwal (@bhash) December 13, 2021 (చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్న్యూస్..!) -
బిపిన్ రావత్కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కి నివాళులర్పించాడు. ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి రావి ఆకుపై పై బిపిన్ రావత్ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ... 'సీడీఎస్ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. ఈ మేరకు సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్ లింక్ని కూడా జారీ చేసింది. (చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) Salute! pic.twitter.com/BVb8grqpgX — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021 -
Tamil Nadu: విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న వారంరోజులకు టీచర్ మృతి.. అసలేంజరిగింది?
లైంగిక వేధింపుల కారణంగా ఓ ఇంటర్ విద్యార్థిని వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఐతే సూసైడ్ నోట్లో అందుకు కారణమైన వారి పేరును బాలిక ప్రస్తావించలేదు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అదే స్కూల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఉరేసుని ఆహ్మహత్యకు పాల్పడ్డాడు. ఈ జంట మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. అసలేంజరిగిందంటే.. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు తెలుపుతూ సూసైడ్ నోట్రాసి గతవారం ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా తన సూసైడ్ నోట్లో ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్లో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను. . నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంద’ని తెల్పింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణలో భాగంగా విద్యార్ధిని చదివే పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించారు. అందులో భాగంగా ఐతే అదే స్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శరవణన్ (42)ను కూడా ప్రశ్నించారు. మ్యాథ్స్ టీచర్పై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసు అధికారులు నిర్ధారించారు. చదవండి: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! ఐతే ఈ సంఘటన చోటుచేసుకున్న వారం రోజుల తర్వాత గణిత ఉపాధ్యాయుడు శరవణన్ తన సూసైడ్ నోట్లో బాలిక మరణంపై విద్యార్థులు తనను ఆటపట్టించడంతో ఇబ్బందిపడ్డానని, బాలిక తన నోట్లో ఎవరి పేరు చెప్పనప్పటికీ అతనిపై అనుమానాలు తలెత్తాయని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ సంఘనపై ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుడి మరణం వెనుక ఉన్న కారణం మాకు ఖచ్చితంగా తెలియరాలేదు. సమగ్ర విచారణ తర్వాత కారణాలు తెలియజేస్తామని అన్నారు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
'లవ్స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు, ఇళమతి(23) అనే యువతి ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి ప్రేమను వ్యతిరేకించాయి. దాంతో కన్నవాళ్లను కాదనుకుని ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కొన్ని నెలలు పాటు సంతోషంగా జీవించారు. అయితే వీళ్లు ఎక్కడ కాపురం పెట్టారో తెలుసుకున్న యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్ తన భార్యను తీసుకెళ్లిపోయారని తాము మేజర్లమని.. ప్రేమ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపాడు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు. తన భార్య ఇళమతి నుంచి ఇటీవల సెల్వన్కు వాట్సాప్లో.. తనను చంపాలని చూస్తున్నారని కాపాడాలంటూ మెసేజ్ చేసింది. దాంతో ఆ యువకుడు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు. తన భార్యకు ప్రాణహాని ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
పూల వ్యాపారి స్మార్ట్ ఆలోచన.. ఫిదా అవుతున్న వధూవరులు
సాక్షి, చెన్నై: కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్ మాస్క్ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా స్మార్ట్గా ఆలోచించి చక్కటి మాస్క్లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్లో పట్టుచీరకు మ్యాచింగ్గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు. Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19 "Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p — ANI (@ANI) August 11, 2021 -
కన్నకూతుళ్లపై పోలీస్ లైంగిక వేధింపులు
సాక్షి , చెన్నై: చెన్నైలో పనిచేసే పోలీసు కానిస్టేబుల్ ఇలంగోవన్ తన ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతని భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం చెన్నై కీల్పాక్ పోలీసుస్టేషన్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉన్నాయి. 2006లో ఇలంగోవన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు 13, 11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఇలంగోవన్ అసభ్య పదజాలం, చేష్టలతో ఇద్దరు కుమార్తెలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. నిలదీసిన మాపై భౌతికదాడులకు పాల్పడుతున్నాడు. దీంతో విరక్తి చెందిన నేను, కుమార్తెలు కొన్ని నెలల క్రితం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా ఇలాగే లైంగిక వేధింపులు కొనసాగడంతో ఈ ఏడాది మార్చిలో మరోసారి ఆత్మహత్యాయత్నం చేయగా కీల్పాక్ ఆస్పత్రిలో చేరి కోలు కున్నాం. నా భర్తపై చర్యలు తీసుకుని నన్ను నా పిల్లలను కాపాడాలని ఆమె వేడుకుంది. ఇలంగోవన్ భార్యకు మద్దతుగా జననాయక మాదర్ సంఘం సభ్యులు పోలీసుస్టేషన్ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
చిక్కిన బాబా శివ శంకర్..
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవతార పురుషుడిగా చెప్పుకునే శివశంకర్ బాబ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బుధవారం అక్కడి ఖాజీయాబాద్లోని ఓ భక్తుడి ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఇలా బుక్కయ్యాడు... లైంగిక ఆరోపణలు రావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక అదృశ్యం అయ్యాడు. జార్ఖండ్లోని డెహ్రాడూన్లో ఓ ఆస్పత్రిలో గుండెపోటు చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించిన సీబీసీఐడీ విచారణ ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గం లేక ఢిల్లీలోని ఓ భక్తుడి వద్ద తలదాచుకునే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైయ్యారు. భక్తుడి ఇంట్లో బస.. డెహ్రాడూన్లో ఓ భక్తురాలితో కలిసి ప్రత్యక్షమైన బాబా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయినట్టు సీబీసీఐడీ బృందం విచారణలో తేలింది. అంతే కాకుండా సాధారణ రోజుల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ భక్తుడి ఇంట్లో బస చేసే వాడని సమాచారం అందడంతో అతని ఇంటిపై నిఘా ఉంచారు. బుధవారం వేకువ జామున అక్కడికి ఈ బాబా రాగానే, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి, అనంతరం చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేశారు. ముమ్మరంగా తనిఖీలు.. ఉండగా, కేలంబాక్కంలోని బాబుకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. 73 మంది టీచర్లు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో పలు కేసులను ఎదుర్కొంటున్న భారతి, దీపా అనే టీచర్ల వివరాలను సేకరించారు. బాబా లీలకు సంబంధించిన అనేక వీడియోలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు బయట పడినట్లు సమాచారం. ఈ పాఠశాలలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని పిల్లల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మాజీ మంత్రికి నో బెయిల్.. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మణికంఠన్పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు పీఏ, గన్మెన్గా వ్యవహరించిన వారందరిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆయన అరెస్ట్కు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మణి కంఠన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే, సాక్షుల్ని, ఫిర్యాదుదారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. బాబ్జీ మదన్ కోసం వేట.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్న అథ్లెటిక్ అకాడమి శిక్షకుడు నాగరాజన్ మీద విదేశాల్లోని ఇద్దరు తమిళనాడు క్రీడాకారిణులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాగే లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జూడో అకాడమి మాస్టర్ ఏబీన్ రాజ్కు చెన్నై కోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో పాటు యూట్యూబ్ ద్వారా మహిళలను అసభ్య పదజాలాలతో దూషించడం, ఆన్లైన్ ద్వారా నగదు వసూళ్లలో ఉన్న టాక్సిక్ మదన్ ఛానల్ నిర్వాహకుడు బాబ్జి మదన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తండ్రి, భార్య కృతికనును బుధవారం విచారించారు. కృతికను అరెస్ట్ చేశారు. చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం -
పెళ్లి పేరుతో మోసం చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ
ప్రేమ-పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన ఓ మాజీ మంత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన చాందినీ.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డాక్టర్ మణికందన్పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో సహజీవనం చేసి గర్భవతిని చేసిన మణికందన్.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. చెన్నై: కోలీవుడ్ నటి చాందినీ అన్నాడీఎంకే నేత మణికందన్ మీద ఛీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, తాను గర్భవతిని అని తెలిశాక అబార్షన్ చేయించాడని ఆమె మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకోమంటే కుదరదని అన్నాడని, గట్టిగా మాట్లాడితే తన గుండాలతో చంపిస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మణికందన్తో జరిగినట్లుగా వాట్సాప్ ఛాటింగ్లను ఆమె మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది. కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్, వాగి సూడా వా’ సినిమా లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు. కాగా చాందినీ ఆరోపణలపై మణికందన్ స్పందన తెలియాల్సి ఉంది. -
పెళ్లైన 10 రోజులకే నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష
తిరువొత్తియూరు: ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలో ఉన్న పుదుపేట ప్రాంతం పక్రి మఠం గ్రామానికి చెందిన యువకుడు విఘ్నేష్ (25). ఇతను 2018వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటనపై కేసు విచారణ వేలూరు సత్వాచ్చారి శాంతిభద్రతలు కోర్టు ప్రాంగణంలో వున్న ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసుకు విచారణ గురువారం రాగా న్యాయమూర్తి సెల్వం కేసును పరిశీలించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను విఘ్నేష్కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముద్దాయి విఘ్నేష్కు పది రోజుల ముందే వివాహం కావడం గమనార్హం. చదవండి: చిన్నారిపై వృద్ధ జంట వికృత చేష్టలు.. ఊయలలో ఆడించి -
శ్రీలంక సేన వీరంగం.. 40 మంది జాలర్లు బందీ
సాక్షి, చెన్నై: కొన్ని నెలల అనంతరం శ్రీలంక సేన మళ్లీ సాగరంలో వీరంగం సృష్టించింది. రామేశ్వరంకారైక్కాల్, పుదుకోట్టైలకు చెందిన 40 మంది జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. ఈ సమాచారం జాలర్ల గ్రామాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది. తమిళ జాలర్లపై శ్రీలంక సేనలు సాగించే వీరంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కాలంలో ఈ దాడులు తగ్గాయి. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లు మళ్లీ రాష్ట్రానికి చేరారు. అనేక పడవలు సైతం తిరిగి ఇక్కడకు చేరాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో శ్రీలంక సేనలు దాడులు చేసి నట్టు, ఓ పడవ మునగడంతో నలుగురు మరణించడం వెలుగు చూసింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన నలుగురు జాలర్లు మరణించారు. అయితే శ్రీలంక సేనలు తుపాకీలు గురిపెట్టినట్టు, దాడులతో హతమార్చినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణసాగుతోంది. బందీగా పట్టుకెళ్లారు.. అసెంబ్లీ ఎన్నికల వేళ సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాలు అనేక సురుక్కు ముడి వల(అల్లికల)తో వేటకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకున్నాయి. వీరిని బుజ్జగించేందుకు తీవ్రంగానే ఎన్నికల యంత్రాంగం ప్రయత్నాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక సేన జాలర్లపై విరుచుకుపడ్డ సమాచారం. యావత్ తమిళ జాలర్లల్లో ఆగ్రహాన్ని రేపింది. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం నుంచి వెళ్లి కచ్చదీవుల్లో చేపల వేటలో ఉన్న జాలర్లపై రెండు బోట్లలో వచ్చిన శ్రీలంక నౌకాదళం వీరగం సృష్టించారు. జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనం కాగా, రెండు పడవల్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ రెండు పడవల్లో ఉన్న 20 మందిని బందీలుగా శ్రీలంకకు పట్టుకు వెళ్లారు. అలాగే, కారైక్కాల్ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో ఐదు పడవల్ని సరిహద్దులు దాటేశారన్న నెపంతో పట్టుకెళ్లారు. ఈ పడవల్లో మరో 20 మంది జాలర్లు ఉన్నారు. 40 మంది జాలర్లను ఒకే రోజు శ్రీలంక సేన పట్టుకెళ్లడంతో జాలర్ల సంఘాల్లో ఆగ్రహం రేగింది. ఎన్నికల వేళ జాలర్లపై శ్రీలంక సేన దాడి చేయడంతో అధికార అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులకు కలవరం తప్పడం లేదు. సముద్ర తీర నియోజకవర్గాల్లో పోటీలో ఈ పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా జాలర్ల గళం విప్పే పనిలో పడడం గమనార్హం. చదవండి: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ -
ఇంటింటా ఫీవర్ టెస్ట్.. మినీ లాక్డౌన్
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ కాదు, మినీలాక్ అమలుకు కసరత్తులు చేపట్టినట్టు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చిన్న చిన్న ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. గురువారం 1,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో రెండు వేలను దాటే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది తరహాలో మున్ముందు పాజిటివ్ కేసులు అధికం అయ్యే పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. అన్ని నగరాలు, పట్టణ కేంద్రలో ప్రత్యేకంగా ఐదు వందల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటును విస్తృతం చేశారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న కేర్ సెంటర్లు అనేక జిల్లాల్లో నిండే పరిస్థితి ఉండడంతోనే అదనపు సెంటర్లపై దృష్టి పెట్టారు. చెన్నైలో అయితే, కరోనా శాతం రెండుకు చేరింది. నాలుగు వేల పాజిటివ్ వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో చెన్నైలో సోమవారం నుంచి ఇంటింటా ఫీవర్ టెస్టులకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 16 వేల మందితో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఏఏ ప్రాంతాల్లో వైరస్ ఉందో, ఆయా ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్ టెస్ట్ సాగనుంది. మినీ లాక్డౌన్.. రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కోయంబత్తూరు, తిరుప్పూర్ , తంజావూరుల్లో మరీ ఎక్కువగా కేసులు నమోదు అవు తున్నాయి. ఈ ప్రభావం ఇతర జిల్లాల్లోకి సైతం పాకుతోంది. దీంతో రాష్ట్రంలో లాక్డౌన్ అమలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందుకు తగ్గ ప్రచారం ఊపందుకోవడంతో ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ లాక్డౌన్కు అవకాశాలు లేవు అని స్పష్టం చేశారు. అయితే మినీ లాక్డౌన్ అమలుకు కసరత్తులు చేస్తున్నామని ప్రకటించారు. ఇది కేవలం వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తామన్నారు. ఒక వీధి లేదా, ఒక ప్రాంతంలో కేసులు అధికంగా ఉంటే, అక్కడ ఈ మినిలాక్ అమల్లో ఉంటుందని వివరించారు. ప్రజలు మాస్క్లు ధరించి, భౌతికదూరాల్ని అనుసరిస్తూ, నిబంధనల్ని పాటిస్తే, ఇది కూడా అవసరం లేదన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్నదని, దయ చేసి అందరూ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రేమలతకు నెగటివ్..... డీఎండీకే కోశాధికారి ప్రేమలతకు కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. దీంతో గురువారం ఆమె పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకుని ప్రచార బాట పట్టారు. డీఎండీకే పార్టీకి చెందిన చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గ అభ్యర్థి పార్థసారథికి పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరక తప్పలేదు. కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న 55 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో అదే కళాశాలలో ప్రత్యేక గదుల్లో వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్న ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ విస్తృతం చేశారు. రోజురోజుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ కోసం క్యూ కట్టే వాళ్లు పెరుగుతున్నారు. గురువారం నాటికి 24 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. అందుబాటులో 11 లక్షల మేరకు ఉండగా, మరో 10 లక్షల వ్యాక్సిన్లు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నాయి. ఏప్రిల్లో 40 లక్షల మేరకు వ్యాక్సిన్లు తెప్పించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ డ్రైవ్ వేగం పెరగనుంది. దీంతో చిన్న ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మేరకు 1900 చిన్న ఆస్పత్రులకు వ్యాక్సిన్ డ్రైవ్కు ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. గురువారం చెన్నైలో 450 మంది పోలీసులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. చదవండి: భయపెడుతున్న కరోనా.. 10 రోజుల సంపూర్ణ లాక్డౌన్ -
‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’
చెన్నై: మనుషులు ప్రైవసీకే విలువ ఇవ్వం.. ఇక జంతువుల ప్రైవసీని పట్టించుకుంటామా.. లేదు. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇదే పని చాలామందికి. ఇక జంతువులను ఫోటోలు, వీడియోలు తీయడం కొందరికి చాలా సరదా. వాటికి ఇబ్బంది కలగనంతవరకు ఓకే. కానీ చిరాకు అనిపించింది అనుకోండి.. అప్పుడు మన ఫోటో గొడెక్కుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఫోటోలంటే సిగ్గుపడే ఆ ఏనుగు తనను ఫోటోలు తీయొద్దని చెప్పమంటూ మావటి దగ్గరకి వెళ్లి ఎంతో ముద్దుగా చెప్తుంది. ఆ వ్యక్తి ఏనుగును కన్విన్స్ చేసి.. ఫోటోలు దిగడానికి ఒప్పిస్తాడు. ప్రసుత్తం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి) ఆ వివరాలు.. ఈ వీడియో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తీశారు. ఇక దీనిలో కనిపించేది ఆండాల్ అనే ఆడ ఏనుగు. ఇక వీడియోలో ఓ గుమ్మంలో మావటి కూర్చుని ఉంటాడు. ఏనుగు అతడి దగ్గరకు వెళ్లి తన భాషలో మావటితో ‘ఫోటోలు తీయొద్దని చెప్పు.. నాకు సిగ్గేస్తుంది’ అని చెప్తుంది. అతడు ఏనుగు తొండాన్ని కౌగిలించుకుని.. ‘పర్లేదు.. వాళ్లు నీతో ఫోటో దిగాలని ఆశపడుతున్నారు. వెళ్లి దిగు’ అంటూ నచ్చజెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక మావటి అడిగిన ప్రశ్నలకు ఏనుగు తల ఊపుతూ సమాధానాలు ఇవ్వడం వీడియోలో హైలెట్. ఏనుగు-మావటిల మధ్య జరిగిన సంభాషణ తీరు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. భాష తెలియకపోతనేం.. భావం అర్థం అవుతుంది కదా’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
తమిళనాడులో వీడిన ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం దక్కడంతో సస్పెన్స్ వీడింది. (చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్) -
తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సోమవారం చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. భగవద్గీతలోని సూక్తులను గుర్తు చేస్తూ ట్వీట్ ఉండడం..నలుగురు మంత్రులు పళనితో భేటీ కావడం గమనార్హం. ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పేరు ప్రకటనతో కుర్చీ కొట్లాటకు ముగింపు పలకాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే తేనిలో తిష్ట వేసిన పన్నీరు సెల్వం మూడు రోజులుగా పార్టీ వర్గాలతో సుదీర్ఘ మంతనాల్లో మునగడంతో కుర్చి వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్ర మంత్రులంతా చెన్నైలోనే ఉండాలన్న ఆదేశాలు జారీ కావడంతో చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో సోమవారం పన్నీరు సెల్వం చేసిన ఓ ట్వీట్ అన్నాడీఎంకే రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. (కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు) ట్వీట్ సారాంశం ‘ఏది జరిగిందో అది బాగానే జరిగింది...ఏది జరుగుతుందో అది బాగానే జరుగుతుంది..ఏది జరగబోతుందో అది బాగానే జరగబోతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇది వరకు నిర్ణయం తీసుకునే వాడినని.. అదే తరహాలో తదుపరి అడుగు.. నిర్ణయం ఉంటుందని ముగించారు. తేనిలో మూడు రోజుల మంతనాలను ముగించుకున్న పన్నీరు చెన్నైకు తిరుగు పయనమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ, వెల్లమండి నటరాజన్లు సీఎం పళనిస్వామితో భేటి కావడం మరింత ఆసక్తిని పెంచింది. యువత మద్దతు పళనికే అని కేటీ రాజేంద్ర బాలాజీ చెప్పడం గమనార్హం. -
కోవిడ్-19 : కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత్కుమార్ (70) శుక్రవారం మరణించారు. కోవిడ్-19కు చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. వసంత్కుమార్కు ఎక్మో పరికరంతో అపోలో వైద్యులు చికిత్స అందించారు. కోవిడ్-19 లక్షణాలు తీవ్రం కావడంతో ఈనెల 10న ఆయనను ఆస్పత్రికి తరలించారు. మూడు వారాల పాటు కరోనా వైరస్తో పోరాడిన వసంత్కుమార్ శుక్రవారం సాయంత్రం 6.56 గంటలకు మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో అతిపెద్ద గృహోపకరణాల రిటైల్ చైన్ వసంత్ అండ్ కోను ఆయన స్ధాపించారు. వసంత్కుమార్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ కుమారి అనంతన్ సోదరుడు కాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆయన సమీప బంధువు. 2006లో వసంత్కుమార్ తొలిసారిగా నంగునెరి నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కన్యాకుమారి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, అప్పటి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్పై ఘనవిజయం సాధించారు. వసంత్కుమార్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత, ఎంపీ హెచ్ వసంత్కుమార్ మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన మద్దతుదారులు, అభిమానులకు తీరనిలోటని పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. చదవండి : తమిళనాడులో తెరపైకి రెండో రాజధాని -
త్వరలో సీఎం జగన్కు చెన్నై వాసి అరుదైన కానుక
సాక్షి, చెన్నై: బక్రీద్ పండుగను పురస్కరించుకుని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన బంగారు తయారీ కార్మికుడు దేవన్ బంగారం, వెండితో మసీదు నమూనాను తయారు చేశారు. 35 గ్రాముల వెండి, 6.5 గ్రాముల బంగారంతో ఐదున్నర ఇంచుల ఎత్తుతో ఒకరోజులోనే దీన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పొంగల్ కుండ బంగారంతో చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను బంగారంతో చేసి సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు.