Vignesh Shivan
-
ఇది మా బెస్ట్ హాలీడే.. ఫ్యామిలీతో పారిస్లో నయనతార (ఫొటోలు)
-
నయనతార భర్త.. ప్రభుత్వ భూమిపై కన్నేశాడా?
హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
విఘ్నేశ్తో జీవితం పంచుకోకుంటే బాగుండేది: నయనతార
విఘ్నేశ్ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందంటోంది నయనతార. కానీ తన వల్ల అతడు విమర్శలపాలవుతున్నాడని, అదే సహించలేకపోతున్నానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. జీవితాన్ని కలిసి పంచుకోకపోయుంటే బాగుండేదేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. తనను ఈ రిలేషన్షిప్లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఫీలవుతున్నాను. ప్రేమను పంచుకోవాలి కానీ..మా రిలేషన్లో నేనే మొదటి అడుగు వేశాను. నేనే గనక అతడి జీవితంలో లేకపోయుంటే అతడి ప్రతిభను గుర్తించేవారు. డైరెక్టర్గా, రచయితగా, గేయరచయితగా తనకు క్రెడిట్ ఇచ్చేవారు. విఘ్నేశ్ మంచి మనసున్న వ్యక్తి. నేను కూడా మంచిదాన్నే. కానీ తనంత మంతనమైతే నాలో లేదనుకుంటా! సక్సెస్ అయిన మనుషులు తమతో సమానంగా సక్సెస్ అయినవారినే పెళ్లి చేసుకోవాలని జనం ఆలోచిస్తారు. ఇక్కడ మీరు ప్రేమను ఎంచుకోవాలి తప్ప విజయాలను, డబ్బును, లగ్జరీని కాదు! అప్పుడే మీరు మరింత ప్రేమలో పడతారు.అందుకేనేమో..విఘ్నేశ్ నాకంటే ఆలస్యంగా కెరీర్ ప్రారంభించాడు. నేను అతడికంటే సీనియర్ను. అతడు వరుస బ్లాక్బస్టర్స్ ఇవ్వలేదనో, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయనో కానీ విఘ్నేశ్ను చాలామంది ట్రోల్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయి, నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అతడు ఇంకా తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన! అని నయనతార చెప్పుకొచ్చింది.చదవండి: ట్రెండింగ్లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే? -
ధనుష్తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఎరుపు రంగు చీరలో లేడీ సూపర్ స్టార్ ..వైరల్గా పెళ్లినాటి పోటోలు
-
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
ఫ్రీగా నటిస్తున్నారా? ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలి?: నిర్మాత
మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.మరి నీ భర్త చేసిందేంటి?ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్ఐసీ సినిమా టైటిల్ను అప్పనంగా వాడేశాడు. నా నిర్ణయాన్ని గౌరవించలేదుఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్ఐసీ టైటిల్తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్ఐసీ టైటిల్కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?ఎంత కుంగిపోయానో?ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: బిగ్బాస్ షోలో పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్ -
మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదు: విఘ్నేష్ శివన్
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు. మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ)ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
పిక్చర్ ఫెర్ఫెక్ట్.. భర్త, కొడుకులతో నయనతార ఫుల్ హ్యాపీ (ఫొటోలు)
-
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ రానుంది. కొన్నిరోజుల క్రితం ఇందుకు సంబంధించిన పోస్టర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నయన్ జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు తదితర విషయాల్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశాడు. నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ చూస్తే.. నయన్ గురించి కన్నడ హీరో ఉపేంద్ర, తెలుగు హీరో నాగార్జున, తమిళ నటి రాధిక, తమిళ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్ మాట్లాడటం చూపించారు. చివర్లో దర్శకుడు విఘ్నేశ్.. నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. తమిళ నటి పోస్ట్ వైరల్)నేను మనుషుల్ని త్వరగా నమ్మేస్తాను, నా గురించి పేపర్ లో వచ్చేవన్నీ చూసి అమ్మ చాలా భయపడేది లాంటి విషయాలు నయన్ చెప్పింది. అసలు మీ జీవితాన్ని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్గా ఎందుకు తీసుకురావాలని అనుకున్నారని అడగ్గా.. పక్కనోళ్ల హ్యాపీనెస్ చూసి, అందరూ హ్యాపీగా ఫీలవ్వాలని నేను అనుకున్నా. అందుకే దీనికి ఒప్పుకొన్నా అని చెప్పింది.నయన్ చెప్పడం బాగానే ఉంది గానీ అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అలానే నయనతార గతంలో తమిళ హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. కాకపోతే అవి తర్వాత స్టేజీకి వెళ్లలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాల్ని ఏమైనా ఈ సిరీస్లో చూపిస్తారా? లేదంటే విఘ్నేశ్తో ప్రేమ, పెళ్లి వరకు మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
నయన్ ఇంట ఆయుధపూజ... పిల్లలతో బహుమతులు ఇప్పించిన విఘ్నేష్ శివన్ (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్డే : మా ‘ప్రాణం, ప్రపంచం’ మీరే - స్టార్ దంపతులు (ఫొటోలు)
-
విఘ్నేశ్ శివన్ బర్త్ డే.. బుర్జ్ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దుబాయ్లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మ తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా భర్త బర్త్ డే వేడుకను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేసింది.దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్ కోసం బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్ను గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా 'మన్నంగట్టి 1960' మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీక చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
కేరళకు భారీ సాయం ప్రకటించిన 'నయనతార' దంపతులు
స్టార్ హీరోయిన్ నయనతార- విగ్నేష్ శివన్ దంపతులు మంచు మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల వల్ల తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఇప్పుడు వయనాడ్లో కనిసిస్తుంది. జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. కేరళ ప్రజలను ఆదుకునేందకు ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. తాజాగా నయనతార దంపతులు కూడా తమ వంతుగా కేరళ కోసం విరాళం ప్రకటించారు.కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఒక నోట్ విడుదల చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ వంతుగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు అందులో వారు పేర్కొన్నారు. కేరళ ప్రజల కష్టాలను చూస్తుంటే కన్నీటితో తమ గుండె బరువెక్కుతుందని వారు తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు అంటూ నయనతార దంపతులు తెలిపారు. సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు... విక్రమ్ రూ. 20 లక్షలు, మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు,ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Vignesh Shivan: నువ్వు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు (ఫోటోలు)
-
నువ్వు లేకపోతే ఇంతదూరం వచ్చేవాడినే కాదు: విఘ్నేశ్
తల్లిగా/ తండ్రిగా ప్రమోషన్ పొందాకే పేరెంట్స్ విలువ బాగా అర్థమవుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీల విషయంలోనూ అంతే! తనకు కూడా తండ్రయ్యాకే అమ్మానాన్నల విలువ బాగా తెలిసొచ్చిందంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. శనివారం విఘ్నేశ్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్ చేసిన విక్కీ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. పేరెంట్స్ కూడా ఇలాగే..నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఎన్ని ఏండ్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను. తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు. హ్యాపీ బర్త్డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ..దేవుడు మంచివాడుఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)చదవండి: నేను, మహేశ్బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ -
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫాదర్స్ డే (జూన్ 16) రోజు అందరూ తమ తండ్రి గొప్పదనాన్ని, మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పై ఫోటోలో కుమారుడిని పైకెత్తి పట్టుకున్న వ్యక్తి మాత్రం.. పిల్లలు వచ్చాకే తన జీవితం సంతృప్తికరంగా మారిందంటున్నాడు. ఇంతకీ ఇలా చిన్నారులను బాహుబలిలా ఎత్తుకుంది ఎవరో కాదు. దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఫాదర్స్ డేను నయనతార, విఘ్నేష్శివన్ తమ కవల పిల్లలతో చాలా జాలీగా గడిపారు. ఈ సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంలతో సరదాగా గడిపిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. విఘ్నేష్ శివన్ నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలో సంతోషానికి కారణం ఉయిర్, ఉలగం అని, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్లో మోస్ట్ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది కింది స్థాయి నుంచి పైకి వచ్చినవారే! అలాంటివారిలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఒకరు. ఎన్నో కష్టాలను దాటుకుని గొప్ప స్థాయికి ఎదిగాడు. తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నయనతార, కవల పిల్లలతో కలిసి హాంకాంగ్ ట్రిప్పుకు వెళ్లాడు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ కుటుంబంతో చుట్టేస్తున్నాడు.12 ఏళ్ల తర్వాత..ఈ క్రమంలో తాజాగా డిస్నీల్యాండ్ రిసార్ట్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. 12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్ కోసం అనుమతివ్వమని అర్థించాను. పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్ నయనతార, ఉయిర్, ఉలగ్తో డిస్నీలాండ్ రిసార్ట్లో అడుగుపెట్టాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంది. జీవితం ఎంత అందమైనదో కదా.. నిజంగా ఆ దేవుడు చాలా మంచివాడు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. కాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పొడా పోడి. ఈ సినిమాలోని అప్పన్ మవనే వాడ పాట సాంగ్ షూటింగ్ అంతా హాంకాంగ్లోని డిస్నీల్యాండ్ రిసార్ట్లోనే జరిగింది. ఇందులో శింబు హీరోగా వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) చదవండి: జాతరలో మాస్ స్టెప్పులేసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్ -
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
నయన్- విఘ్నేశ్లను కలిపిన స్టార్ హీరో ఎవరంటే?
నయనతార- విఘ్నేశ్ శివన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్ కపుల్. నయనతార హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ (2015) సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు. ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఓ స్టార్ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్ నచ్చలేదన్న విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. -
Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార
-
20 రోజులు దూరంగా.. భర్త కోసం అల్లాడిపోయిన నయనతార
కోలీవుడ్లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్ శివన్నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారు. రాక కోసం ఎదురుచూశాం ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్ శివన్ను ఎంతగానో మిస్ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్ శివన్ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో తెలుపుతూ ఇన్స్ట్రాగామ్లో ఫోటోలు షేర్ చేసింది. మాటల్లో చెప్పలేం.. విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఏల్ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్స్ట్రాగామ్లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
భర్తతో నయనతార ఎప్పటికీ విడిపోదు.. అసలు సీక్రెట్ ఏమిటంటే
సౌత్ ఇండియాలో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్ నయనతార. ఆమె సినీ పయనం ఒక సంచలనం. అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత శ్రమతో నంబర్ వన్ నటి అనే అంతస్తులో నిలిచారు. సూపర్ స్టార్గా అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ నాయకిగా రాణిస్తున్నారు. రెండు మూడు సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమను పొంది, ఆయనతో గత రెండేళ్ల క్రితం ఏడు అడుగులు వేశారు. ఇప్పుడు వీరికి ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయకిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ షాకింగ్కు గురి చేస్తుంటారు. భర్త విగ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంతో ఎంతో అన్యోన్యంగా ఉండే నయనతార ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్ అందరిని షాక్కు గురి చేసింది. దర్శకుడు విగ్నేశ్ శివన్తో మనస్పర్థలా? ఇద్దరు విడిపోతున్నారా? అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ పలు ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే తన భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. కాగా నయనతార విగ్నేష్ శివన్ విడిపోతారనే పదానికే తావు లేదని విశ్లేషకులు అంటున్నారు. నయనతార ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించడానికి సలహాలు ఇచ్చిందే విగ్నేష్ శివన్ అని, ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలకు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఫౌండర్గానో, కో ఫౌండర్గానో ఉన్నారని, కాబట్టి విడిపోయే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. -
ఓడిపోయానంటూ పోస్ట్.. విఘ్నేష్ , నయనతారల మధ్య ఏం జరుగుతుంది?
నేను ఓడిపోయాను అని నటి నయనతార తన ఇన్స్ర్ట్రాగామ్లో పేర్కొన్నారు. ఇప్పుడిది పెద్ద చర్చకి దారి తీస్తోంది. లేడీ సూపర్స్టార్గా రాణిస్తున్న బహుభాషా నటి నయన తార. నాలుగు పదుల వయసులోనూ అగ్రకథా నాయకిగా రాణిస్తూ అత్యధిక పారితోషికం పు చ్చుకుంటున్న నటి ఈమె. ఇటీవల జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సంచలన నటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళంలో శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్, యూ ట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో మన్నాంగట్టి, తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టారు. మరో పక్క ఇతర వ్యాపార రంగాలలోనూ బిజీ గా వున్నారు. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఈ జంట ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి సంబంధించిన ఫొటోలను నయనతార తరచూ తన ఇన్స్ర్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా సమీప కాలంలో ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ను అన్పాలో చేస్తూ చేసిన పోస్టు పెద్ద చర్చకే దారి తీసింది. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరు విడిపోబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసే విధంగా తాజాగా నటి నయనతార నేను ఓడిపోయాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొనడం మరింత అలజడికి దారి తీస్తోంది. దీంతో విఘ్నేష్ శివన్, నయనతారల మధ్య అసలు ఏం జరుగుతోంది? నయనతార ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా వాస్తవమా? లేక ఏదైనా ఒక ప్రకటనలో భాగమా..? అనే చర్చ కోలీవుడ్లో జోరందుకుంది. -
నయనతార - విగ్నేష్ - విడాకులు ?
-
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్స్టాలో అన్ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
భర్తను అన్ ఫాలో చేసిన నయనతార..
-
అన్ఫాలో.. ఫాలో!
అస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తారు. అలాంటిది తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ను నయనతార ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించిన నయనతార తక్కువ సమయంలోనే 78 లక్షల మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నారు. ఇన్స్టాలో విఘ్నేష్ని ఫాలో అవుతూ వచ్చిన నయనతార అకస్మాత్తుగా అన్ఫాలో అయ్యారు. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కూడా ‘మా ప్రేమ బంధానికి పదేళ్లు’ అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నయనతార ఇప్పుడు ఇలా అన్ఫాలో కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సాంకేతిక కారణాల వల్లే అలా జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా అన్ఫాలో వార్త వైరల్ అయిన కొంత సమయానికి తిరిగి విఘ్నేష్ని ఫాలో అయ్యారు నయనతార. -
భర్తను అన్ఫాలో చేసిన నయనతార!
నయనతార.. సౌత్లో టాప్ హీరోయిన్, విఘ్నేశ్ శివన్.. కోలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటి గతేడాది జూన్లో పెళ్లి చేసుకున్నారు. మొన్నటి ప్రేమికుల రోజున కూడా మా ప్రేమ బంధానికి పదేళ్లు అంటూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. నయనతార గతేడాదే ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి భర్త విక్కీని ఫాలో అవుతూ వచ్చింది. కానీ సడన్గా ఇప్పుడు అతడిని అన్ఫాలో చేసింది. కన్నీటితో కూడా అదే మాట.. కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే జంటగా కలిసున్న ఫోటోలు మాత్రం ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉన్నాయి. దీంతో పొరపాటున అన్ఫాలో అయ్యారేమోనని కొందరు అభిప్రాయపడుతుండగా.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా? ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు కూడా విడిపోతారా? అసలేం జరిగింది? అంటూ తల పట్టుకుంటున్నారు. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ. ఈ వార్త అంతటా పాకేలోపు ఇన్స్టాగ్రామ్లో భర్తను మళ్లీ ఫాలో అయింది. ఇది చూసిన అభిమానులు హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే నయనతార గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా రాబట్టింది. తర్వాత ఆమె నటించిన అన్నపూరణి సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు ప్లాన్ చేస్తున్న నయనతార
నయనతార వంటి ప్రముఖ నటీనటులకు అవకాశాలు తగ్గే చాన్స్ ఉండదు. ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతారు. కాగా ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు. అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్స్టార్ మళ్లీ సక్సెస్ బాట పట్టే ప్రయత్నంలో సొంతంగా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల జయంరవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం 'అన్నపూరణి' కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్తో కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తుంది. కాగా భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. తాజాగా సెంథిల్కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనెక్ట్ చిత్రం తరువాత రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది కచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది. -
నయనతార భర్తకు 'ఎల్ఐసీ' నోటీసులు..!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్ఐసీ అనేది భారత్లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్ఐసీ అనే టైటిల్ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
భర్త సినిమా నుంచి నయనతార అవుట్!
లేడీ సూపర్స్టార్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్లకు టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం తరువాత విఘ్నేశ్ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. ఆ మధ్య అజిత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా సమయం వెచ్చించారు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. నయనతారకు అక్కగా.. ఈ మధ్యే లవ్టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్కు అక్కగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని 7 స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ చిత్ర టైటిల్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే! వివాదాస్పదంగా అన్నపూరణి ఎల్ఐసీ సంస్థ.. తమ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిన ఈ టైటిల్ చిత్రానికి ఉపయోగించరాదని నిర్మాతకు నోటీసులు పంపింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన చిత్రానికి టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నయనతార విషయానికి వస్తే ఈమె నటించిన తన 75వ చిత్రం అన్నపూరణి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో సినిమాపై కేసు నమోదైంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ను నిలిపేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేక.. ఇవన్నీ నయనతారకు ఎదురుదెబ్బలే. మరో విషయం ఏమిటంటే నయనతార తన భర్త విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఎల్ఐసీ చిత్రం నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. ఆమె ఎక్కువ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈమె ఒక చిత్రానికి రూ.10 నుంచి రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఎల్ఐసీ చిత్ర నిర్మాత అంత చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!
ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఒక్క పేరు వల్ల రెండు వివాదాలు ఇతడిని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ పెద్ద సంస్థ.. విఘ్నేశ్కి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? గొడవేంటి? తమిళంలో పేరున్న దర్శకుల్లో విఘ్నేశ్ శివన్ ఒకడు. 'నా పేరు రౌడీ' లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా 'ఎల్ఐసీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టైటిల్పై రోజుల వ్యవధిలో రెండు కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజస్టర్ చేయించుకున్నానని చెప్పారు. ఈ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ వివాదం అలా ఉండగానే ఇప్పుడు మరొకటి వచ్చింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్కి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, సినిమా కోసం ఈ టైటిల్ని ఉపయోగిస్తే.. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోపు పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై చిత్రబృందం, విఘ్నేశ్ స్పందించాల్సి ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
మళ్లీ అలాంటి చిత్రానికే రెడీ అవుతున్న నయనతార
కోలీవుడ్లో హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలకు కేరాఫ్గా మారిన నటి నయనతార. ఇంతకుముందు త్రిష, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇలాంటి పాత్రల్లో నటించినా సక్సెస్ కాలేదు. నటి ఐశ్వర్యారాజేశ్ కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్ అయినా, ఆ తరువాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఐశ్వర్యారాజేశ్కు అలాంటి అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. అయితే నయనతార విషయం వేరు. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిరాశపరిచినా, కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవల నటించిన అన్నపూరిణి చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం ఈ సంచలన నటి తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఐశ్వర్యారాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన కనా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అరుణ్రాజా కామరాజ్ తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల ఉత్తర చైన్నె నేపథ్యంలో లేబుల్ అనే వెబ్ సీరీస్కు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో నయనతారను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 75వ చిత్రంలో నటిస్తున్న నయనతార, మాధవన్, సిద్ధార్థ్లతో కలిసి టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తన భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో లవ్టుడే చిత్రం ఫేమ్ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి కృతిశెట్టి నటిస్తుండగా, నయనతార హీరోకు అక్కగా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. -
నయన్-విఘ్నేశ్ క్రేజీ సెలబ్రేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?
-
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
ఎల్ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్ఐసీ అని టైటిల్ ఖరారు చేశారు. ఎల్ఐసీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని అర్థం. లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్కు ఊరట.. ఆ స్కామ్లో క్లీన్ చిట్ -
యంగ్ హీరోకు అక్కగా నటించనున్న నయనతార
కోలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించడం విశేషం. ఆయన జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర విజయంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో వెంటనే కథానాయకుడు గానూ పరిచయమయ్యారు. అలా ఈయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ప్రదీప్ రంగనాథన్కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఒకటి నటుడు కమలహాసన్ నిర్మించ తలపెట్టిన చిత్రం. అయితే బడ్జెట్ అధికం కావడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో మరికొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో లియో చిత్ర నిర్మాత ప్రదీప్ రంగనాథన్తో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. నటుడు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన విఘ్నేష్ ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి 'ఎల్ఐసీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో దర్శకుడు మిష్కిన్, ఎస్ జే సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో కథానాయకిగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేకపోతే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటుడు ప్రదీప్ రంగనాథన్కు అక్కగా ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ప్రేమ గాయాలను తట్టుకుని ఆపై పడిలేచిన కెరటం నయనతార
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్నే సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో నేడు (నవంబర్ 18) నయన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత.ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్... తర్వాత తన రూట్ మార్చి ప్రేక్షల చేత విజిల్స్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. . నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన 'మానస్సినక్కరే' తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్లో 'లక్ష్మీ'లో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి,దుబాయ్ శ్రీను, తులసి తదితర సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అక్కడి నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకుని లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ ఫాదర్లో మెప్పించిగా.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని నిలిచింది సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..? ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ ఇలా చెప్పింది. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.' అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు. నయనతార ఆస్తులు ఎంత..? నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 14 కోట్లు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.200 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.అలాగే, ఆమె ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్ను ప్రారంభించింది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉంది. హిందూ మతాన్ని స్వీకరించిన నయన్ నయన్ క్రిస్టియన్.. ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతారకు 2011లో నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. -
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. నయన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సినిమా 'కూళంగల్'. పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుత్తడైయాన్, చెల్లపాండి ప్రధానపాత్రులు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మాతలు. తమిళనాడు, తంజావూర్లోని ఓ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మ్యాడ్' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమా అక్టోబరు 27న సోనీ లివ్ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విఘ్నేశ్ శివన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూడగానే చాలా నచ్చిందని, తమకు ఎంతో ఘనత తెచ్చిపెట్టిన చిత్రం ఇదని అన్నాడు. ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నామని కానీ సమయం గడిచిపోతుండడంతో సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేసినట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు వినోద్ రాజ్తో కలిసి మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
విజయ్కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్
విజయ్ చిత్రాలు విడుదలకు ముందు ఆ తర్వాత కూడా వివాదాస్పదం కావడం కొత్తకాదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన లియో కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మేనన్, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సమస్య లేదు అనుకుంటున్న సమయంలో లియో చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అందులో విజయ్ చెప్పే పవర్ ఫుల్ డై లాగ్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. అయితే ఇందులో విజయ్ చెప్పిన కొన్ని అనుచిత డైలాగులే ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయి. వీటిపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ సంభాషణలతో నటుడు విజయ్కి ఎలాంటి సంబంధం లేదని, ఈ డైలాగులు చెప్పాలా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారని, తానే కథకు అవసరమని ఒప్పించానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని, లియో చిత్రంలోని పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నారు. దానికి తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. అయితే చిత్ర టైలర్లో చోటు చేసుకున్న ఆ వివాదాస్పద సంభాషణలు చిత్రంలో మ్యూట్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నటుడు విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ల మధ్య విభేదాలు అంటూ ఒక పోస్టు ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్ను రజనీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. తాను ఆ ట్వీట్ను సరిగా చూడకుండా లైక్ కొట్టారని, అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆయన మరో ట్వీట్ చేయడం గమనార్హం. -
Nayanthara Sons Uyir, Ulag 1st Birthday: నయనతార-విఘ్నేశ్ పిల్లల ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
నయనతార- విఘ్నేశ్ శివన్ ట్విన్స్.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లోన కనిపించారు. (ఇది చదవండి: వహీదా రెహమాన్కు దాదాసాహెబ్ ఫాల్కే..) అయితే గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట అధికారికంగా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా ఈ జంటకు సరోగసీ ద్వారా కవల పిల్లలు కూడా జన్మించారు. వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. (ఇది చదవండి: ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్నే మార్చేసిన నయనతార) తాజాగా నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే గతంలో ట్విన్స్తో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్ను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
లవ్ టుడే హీరోతో విఘ్నేశ్ శివన్.. స్వీట్స్తో గుడ్న్యూస్..
శింబు, వరలక్ష్మి శరత్కుమార్ జంటగా నటించిన పోడాపొడి చిత్రంతో విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రం చేశారు. అందులో విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేష్ శివన్, నయనతారల పరిచయం ప్రేమగా మారింది. అది సుమారు ఆరేళ్లకు ఇద్దరిని పెళ్లిపీటలు ఎక్కించింది. ఆ తరువాత విఘ్నేష్ శివన కాత్తు వాకుల రెండు కాదల్, సూర్య హీరోగా తానా సేంద కూట్టం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఇటీవల అజిత్ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో నయనతార లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో సంధి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కూడా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. కాగా ఇటీవల నయనతార గుడ్టైమ్స్ ఆర్ హియర్ అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. లవ్ టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 19) విఘ్నేష్ శివన్ 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చైన్నెలోని ఓ జిమ్లో నటుడు ప్రదీప్ రంగనాథన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ డేట్స్ (ఖర్జూర పండ్లు)తో నిండిన ప్లేట్ను ఇవిగో నా డేట్స్ (కాల్షీట్స్) అంటూ సింబాలిక్గా విఘ్నేష్ శివన్కు అందించారు. కాగా ఇందులో నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇకపోతే జాన్వీ కపూర్ను నటింపచేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. Official announcement!👀#PradeepRanganathan X #VigneshShivan X #Anirudh X #RKFI pic.twitter.com/cmVYq2N3SW — Satham Hussan (@im_Satham) September 18, 2023 చదవండి: నా బలం వెనుక ఉన్న శక్తి నువ్వే.. తల్లి ప్రేమ అంటే ఇదే! -
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార
-
ఇన్స్టాగ్రామ్లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే
సౌత్ ఇండియా లేడీ సూపార్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉండగా నయనతార ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది. నయనతార ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే భారీగా వైరల్ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్ చేయగా.. రెండు మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) ఇప్పటికే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయని నయన్ తొలిసారి ఇలా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నయన్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ వచ్చేవాడు. (ఇదీ చదవండి: హీరోయిన్తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్గా బంగారం, భవనాలు) 'జైలర్'లోని హుకుమ్ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తన కవలలను ఎత్తుకుని మాస్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్ తన ఇన్స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్, హీరో షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
ఓనం సెలబ్రేషన్స్లో స్టార్ కపుల్.. ట్విన్స్తో తొలిసారిగా!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న భామ గతేడాది జూన్లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. అయితే నయన్ దంపతులు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఇప్పటివరకు తమ పిల్లల మొహాలను ఇప్పటివరకు అభిమానులకు చూపించలేదు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్తో ప్రజల్లోకి!) తాజాగా కేరళలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి తొలిసారిగా ఓనం జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. సెలబ్రేషన్స్తో పాటు తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 'మా జీవితంలో అందమైన, అద్భుతమైన క్షణాలు.. ఉయిర్, ఉలగంతో కలిసి తొలిసారిగా ఓనం పండుగ జరుపుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
రజనీకాంత్కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్ను మరో ట్రాన్స్లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!
లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను పెళ్లాడిన భామ.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్లో నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా నయన్.. చిన్న పిల్లలకు టైం కేటాయించేందుకు వీలు కాదు. అలా ప్రొఫెషనల్ లైఫ్తో పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తోంది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) ఆదివారం కాస్తా తన కుమారులతో అమ్మతన్నాని ఆస్వాదిస్తోంది. సినిమాల్లో ప్రియురాలుగా, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా ఎంతగా ప్రేమను చూపిన అది నటనే కాబట్టి అందులో మమతాను రాగాలు ఉండవు. అదే నిజ జీవితంలో ఇప్పుడు నయనతార అమ్మతనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అందులో సహజ సిద్ధంగా కలిగే మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. అలా ఆదివారం కాస్తా తీరిక లభించడంతో తన బిడ్డను లాలిస్తూ మురిసి పోతున్న దృశ్యాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫొటో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ ప్రాణంగా ప్రేమించే పిల్లలతో సమయాన్ని ఆనందంగా గడిపినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నయనతార హిందీలో షారుక్ ఖాన్తో తొలిసారిగా జతకట్టిన జవాన్ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ఆరేళ్లకు పైగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (ఇది చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు ) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతారపై భర్త విఘ్నేష్ శివన్ ఆస్తకికర ట్వీట్
దక్షిణాది లేడీ సూపర్ స్టార్గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం జవాన్. షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఇందులో నటి దీపికా పదుకోనే, ప్రియమణి, విజయ్ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో చాలా ఆసక్తి నెలకొంది. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నయనతార, విజయ్ సేతుపతి, దర్శకుడు అట్లీలే. కాగా ఇందులోని నయనతార ఫొటోతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. అందులో చేతిలో తుపాకీ, కూలింగ్ గ్లాస్ ధరించి ఫుల్ యాక్షన్ మూడ్ లో కనిపించారు. దీనిపై ప్రేక్షకుల రియాక్షన్ ను పక్కన పెడితే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమెను యథాతథంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పోస్టర్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి నయన్ ని చూస్తుంటే ఆనందంగా.. గర్వంగా ఉందన్నారు. షారూఖ్ ఖాన్ కి అభిమానిగా ఆయన నటించిన మూవీస్ అన్ని చూసిన నయన్.. ఇప్పుడూ షారూఖ్ మూవీలో మెయిన్ రోల్ లో నటించడం గర్వంగా ఉందన్నారు. ‘నువ్వు ఎంతోమంది స్ఫూర్తినిస్తున్నావు.. నిన్ను చూసి నేనొక్కడినే కాదు మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వంగా ఫీల్ అవుతోంది’ అంటూ నయనతారను ఆకాశానికెత్తారు. ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది. కాగా అంతకు ముందు నయనతార పోస్టర్ను విడుదల చేసిన సందర్భంగా నటుడు షారుక్ ఖాన్ తన ట్విటర్ లో తుఫాన్కు ముందు పిడుగు అని పోస్ట్ చేశారు. దీంతో నయనతార అటు బాలీవుడ్లోనూ దుమ్ము రేపుతారంటూ ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Happy & Proud of you thangamey #Nayanthara ❤️❤️ From being a fan of Shahrukh sir & binge watching only his movies ! Like literally only his movies !!! To Acting opposite to him in such a big film! Your journey is jus starting ❤️🫡😇☺️ You are soooo inspiring dear wife… https://t.co/6ZkGJtwrir — VigneshShivan (@VigneshShivN) July 17, 2023 -
నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!
షారుక్ ఖాన్ మంచి ఊపు మీదున్నాడు. ఐదేళ్లుగా ఒక్క సినిమా చేయక సైలెంట్గా ఉన్న ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్'తో హిట్ కొట్టాడు. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. త్వరలో 'జవాన్'తో రాబోతున్నాడు. దీని ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ఫుల్ యాక్టివ్గా ఉంటున్న షారుక్.. ఇప్పుడు నయనతార భర్తకి ఓ విషయమై హెచ్చరించాడు. ఆమెతో జాగ్రత్త ఉండని చెప్పుకొచ్చాడు. షారుక్తో కలిసి లేడీ సూపర్స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. దక్షిణాదిలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఇన్నాళ్లు సౌత్కే పరిమితమైన నయన్.. షారుక్ 'జవాన్'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఈ మూవీలో నయన్ది పోలీస్ క్యారెక్టర్. (ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) విఘ్నేశ్కి జాగ్రత్తలు 'జవాన్' ట్రైలర్ చూసిన నయన్ భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. 'అట్లీ ఇలాంటి సూపర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం. ఔట్ఫుట్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. హ్యాట్యాఫ్' అని పోస్ట్ పెట్టాడు. అలానే షారుక్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నందుకు నయనతార, అనిరుధ్, విజయ్ సేతుపతికి విషెస్ చెప్పాడు. షారుక్ పంచులు ఇక విఘ్నేశ్ శివన్ పోస్ట్ చూసిన షారుక్.. తనదైన శైలిలో స్పందించాడు. 'విఘ్నేశ్ శివన్ చూపిన ప్రేమకు థ్యాంక్స్. నయనతార అద్భుతంగా చేసింది. అయితే నేను చెప్పబోయేది మీకు ముందే తెలుసనుకుంటాను. కానీ జాగ్రత్త. ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది' అని షారుక్ ఫన్నీగా విఘ్నేశ్కి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడిది వైరల్గా మారింది. @VigneshShivN thank u for all the love. #Nayanthara is awesome…but oh who am I telling this…you toh already know!!! But Hubby, beware, she has now learnt some major kicks & punches!! pic.twitter.com/5aMZ8rzReN — Shah Rukh Khan (@iamsrk) July 12, 2023 (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
నయనతార ఆశలన్నీ ఆ 75 పైనే!
సంచలనాలకు బ్రాండ్ అంబాసిడర్ నయనతార. ఈమె నట జీవితం అంతా వివాదాలు, వినోదాలతోనే సాగుతుందని చెప్పవచ్చు. మొదట్లో నటుడు శింబును గాఢంగా ప్రేమించిన నయనతార అది పెళ్లికి దారి తీస్తుందని నమ్మారు అయితే ఆ ప్రేమ బెడిసికొట్టింది. ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో ప్రేమ ఇక ఏడడుగులు వేయడమే ఆలస్యం అన్నంత వరకు వెళ్లింది. అయితే ఆ ప్రేమ కథ అడ్డం తిరిగింది. ఇక ఇటీవల దర్శకుడు విగ్నేష్శివన్తో కొంతకాలం సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న టాప్ హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) అయినా ఇప్పటికీ నటనకు మాత్రం దూరం కాలేదు. అయితే పెళ్లి అయిన తరువాత కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే మాట వినిపిస్తోంది. భారీ చిత్రాల అవకాశాలు రావడం, నటించిన చిత్రాలు కూడా ఆశించిన విధంగా ఆడడం లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బాలీవుడ్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ జంటగా జవాన్ చిత్రంలో నటించడం ఒక్కటే ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు. లేడీస్ సూపర్స్టార్ స్థానాన్ని అనుభవించిన నయనతార ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఎందుకు నయనతార తన 75వ చిత్రాన్నే నమ్ముకున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఇందులో జై కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజారాణి చిత్రం తర్వాత వీళ్లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా శంకర్ శిష్యులు నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది తిరుచ్చి, చైన్నెలలో జరిగే కథా చిత్రంగా ఉంటుందని, ఇందులో నయన మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. ఓకే చోట పనిచేసే నయనతార, జై మధ్య ప్రేమను దర్శకుడు కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిసింది. View this post on Instagram A post shared by Nayanthara (@nayantharaofficiial) (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) -
ఆ వెడ్డింగ్ వీడియో ఏమైనట్లు ?
-
12 ఏళ్ల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్.. చాలా థ్రిల్లింగ్గా ఉంది: విఘ్నేశ్ శివన్
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు విఘ్నేశ్ శివన్ చిన్ననాటి స్నేహితుడు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు) చెన్నైలోని వీరి నివాసంలో జరిగిన వార్షికోత్సవంలో ఫ్లూట్ వాయించి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాల్య స్నేహితుడు ఇచ్చిన సర్ప్రైజ్కు నయన్- విఘ్నేశ్ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్స్టాలో పంచుకున్నారు. వీడియోనూ షేర్ చేస్తూ స్నేహితునిపై ప్రశంసలు కురిపించారు. విఘ్నేశ్ ఇన్స్టాలో షేర్ చేస్తూ..'మాకు ఇవీ ప్రత్యేకమైన క్షణాలు. మా మొదటి వివాహా వార్షికోత్సవ వేడుక. నా 12 ఏళ్ల వయస్సు నుంచి నవీన్ బెస్ట్ ఫ్రెండ్. నీతో కలిసి ఒకే వేదికపై డ్రమ్స్ వాయించడం.. చాలాసార్లు నీతో వేదికను పంచుకున్నా. నా జీవితంలో నిన్ను చూస్తూనే ఎదిగా. కానీ ఈరోజు మర్చిపోలేనిది. అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న నయన్- విఘ్నశ్ (ఫొటోలు)
-
నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ ఇన్స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు. కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్లో కవలలకు స్వాగతం పలికారు. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ను గతేడాది జూన్లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారి పిల్లల ఫోటోలను కూడా ఆయన మొదటిసారి షేర్ చేశాడు. ఆ ఫోటోలలో, నయనతార తన బిడ్డలను పట్టుకుని ప్రకాశవంతమైన చిరునవ్వులతో కనిపిస్తుంది. ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అప్పుడు మా కాలికి నమస్కరించేవాళ్లు, ఇప్పుడేమో హగ్గులు, ముద్దులు: నటి) నయనతార గురించి విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లో ఇలా రాసుకొచ్చాడు. 'నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం. నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ (నయన్), పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను' అని భావోద్వేగానికి లోనయ్యాడు. గత అక్టోబరులో అద్దె గర్భం ద్వారా ఈ జంట ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!) -
విజయ్ స్పీడ్కు నో బ్రేక్స్.. అజిత్కు అన్నీ అడ్డంకులే
హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. (ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య) ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్ శివన్ వైదొలిగారు. ఆయన స్క్రీన్ప్లే లైకా ప్రొడక్షన్స్ అధినేతకు, అజిత్కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. (ఇదీ చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) అజిత్ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్ వెల్లడించారు. దీంతో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్, దర్శకుడు మగిళ్ తిరుమేణి ప్రస్తుతం లండన్లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్ రెండు విభిన్న గెటప్లలో కనిపిస్తున్నట్లు సమాచారం. -
కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ?
సాక్షి,ముంబై: లేడీ సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార మరోసారి తన ప్రత్యకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. అటు సినిమాలు ఇటు వ్యాపారం లోనూ రాణిస్తున్న నయనతార తాజాగా మరో కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతోన్నట్లు తెలుస్తోంది. భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ఉత్తర చెన్నైలోని 56 ఏళ్ల నాటి పాత అగస్త్య థియేటర్ను కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాంటిదేమీలేదు నయనతార, విఘ్నేష్ శివన్ కోలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై థియేటర్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పడినట్టే కనిపిస్తోంది. దర్శకుడు, నయన్ సన్నిహితుడు ఈ వార్తలను కొట్టి పారేశారు. ఎలాంటి థియేటర్ను కొనడానికి ప్లాన్ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై నయన్, విఘ్నేష్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప క్లారిటీ ఉండదు. ఇప్పటికే అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన టాప్ సౌత్ ఇండియాన్ స్టార్ నయన్ ఇపుడిక థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. తమ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ కింద చెన్నైలో తొలి ఆస్తిని కొనుగోలు చేసారనేది టాక్. ఉత్తర చెన్నై ప్రాంతంలో, దేవి థియేటర్ గ్రూప్ యాజమాన్యంలోని అగస్త్య థియేటర్ 1967నుంచి పనిచేస్తోంది. తమిళ టాప్ స్టార్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్ మొదలు రజనీ కాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ దాకా లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రదర్శించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ కరోనా, లాక్డౌన్ కాలంలో చిక్కుల్లో పడింది. దీంతో 2020లో దీన్ని మూసి వేశారు. 1000 సీటింగ్ కెపాసిటీతో కూడిన థియేటర్ను రెండు స్క్రీన్లతో మల్టీప్లెక్స్గా రెన్నోవేట్ చేసి ఈ ఏడాది చివరికి తిరిగి లాంచ్ చేయనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా నయనతార ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో బాలీవుడ్ మూవీ 'జవాన్' లో విజయ్ సేతుపతి, షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. దీంతోపాటు 'లేడీ సూపర్ స్టార్ 75' ఆర్. మాధవన్తో తన తొలిచిత్రం 'ద టెస్ట్' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైనాడు. -
ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!) అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) విఘ్నేశ్ ఇన్స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఆ క్షణమే నయన్తో ప్రేమలో పడిపోయా: విఘ్నేశ్ శివన్
సౌత్ లేడీ సూపర్స్టార్ నయనతార కోలీవుడ్ రెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇటీవల ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విఘ్నేశ్ శివన్ నయనతారతో తన ప్రేమ కహానీని వెల్లడించారు. పోడాపోడి సినిమాతో డైరెక్టర్గా మారిన నేను తొలి సినిమాతోనే భారీ పరాజయాన్ని చూశాను. కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘నేనూ రౌడీనే’ అనే కథ రాశాను. హీరో ధనుష్ కథ నచ్చడంతో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. నయనతారను కలిసి కథ చెప్పమన్నాడు. నయన్ అంగీకరించదేమో అని అనుకొని నజ్రియాతో మాట్లాడదామనుకున్నా. కానీ ధనుష్ చెప్పడంతో నయన్ దగ్గరికి వెళ్లా. ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నయన్తో ప్రేమలో పడిపోయా. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ నుంచే మేం ఇద్దరం డేటింగ్లో ఉన్నాం. కానీ సెట్స్లో అస్సలు బయటపడలేదు. నయన్ను మేడమ్ అనే పిలిచేవాడ్ని. ఆమె క్యారవాన్కు కూడా వెళ్లేవాడిని కాదు. ఇద్దరం వృత్తిపరంగా ప్రొఫెషనల్గా ఉండేవాళ్లం. మేం ప్రేమలో ఉన్నామని చెప్పేవరకు ఈ విషయం ఎవరికి తెలియదు అంటూ విఘ్నేశ్ తన లవ్స్టోరీని రివీల్ చేశాడు. -
అందుకే అజిత్ సినిమా నుంచి తొలిగించారు: విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అజిత్ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అజిత్ 62వ సినిమా రాబోయే ప్రాజెక్ట్కు ఎన్నికైన విఘ్నేశ్ శివన్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంతవరకు అజిత్ కానీ విఘ్నేశ్ శివన్ నుంచి క్లారిటీ లేదు. నయన్ కూడా దీనిపై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తన భర్తను అవమానించినందుకు నయన్ హర్ట్ అయ్యిందని, ఇకపై అజిత్తో నటించనని ఆమె నిర్ణయించుకుందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. చదవండి: పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే దీంతో ఈ విషయంలో అంతా అజిత్ని తప్పుబట్టారు. అజిత్కు స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందంటూ కోలీవుడ్ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ సినిమా నుంచి తప్పుకోవడంపై మొదటిసారి విఘ్నేశ్ శివన్ పెదవి విప్పాడు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AK62 ప్రాజెక్ట్ నిలిచిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. తన స్కిప్ట్ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తనని తప్పించారన్నాడు. చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు ఇందులో అజిత్ తప్పులేదని, తాను రాసిన స్క్రిప్ట్ ఆ మూవీ నిర్మాణ సంస్థకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్ట్కు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్న అన్నాడు. అంతేకాదు ఒక అభిమానిగా అజిత్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తానంటూ విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. కాగా అజిత్ - విఘ్నేశ్ శివన్ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ గతేడాది ప్రకటించింది. అజిత్ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది. -
ఐదు నిమిషాలు కూడా ఆగలేరా?.. నయనతార ఆగ్రహం!
లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. దక్షిణాది ఇండస్ట్రీలో అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ. గతేడాది దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లాడిన నయన్.. సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమ పిల్లల పూర్తి పేర్లను కూడా వెల్లడించారు. అయితే ఇటీవల కుంభకోణంలోని తమ ఇష్టదైవమైన ఆలయానికి వెళ్లిన దంపతులు పూజలు నిర్వహించారు. కానీ అదే సమయంలో అక్కడున్న భక్తులపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 5న కుంభకోణం జిల్లాలోని ఆలయానికి వెళ్లారు నయన్, విఘ్నేశ్ దంపతులు. వీరు పూజలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు గొడవకు దిగారు. అంతే కాకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో నయనతార భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ఐదు నిమిషాలు ఆగండి. మా పూజ పూర్తవుతుంది, మేము మీలాగే దేవుడి ఆశీస్సుల కోసమే వచ్చాం.' అని అన్నారు. కాగా.. నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా దర్శకుడు అశ్విన్ శరవణన్ 'కనెక్ట్'లో కనిపించింది. త్వరలోనే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. "5 நிமிஷம் ப்ளீஸ்" - பொதுமக்களிடம் பொறுமையாக இருக்கக் கோரிய நடிகை நயன்தாரா! #Nayanthara | #VigneshShivan | #WikkiNayan pic.twitter.com/lxGftqQVrI — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 5, 2023 -
కవల పిల్లల పేర్లు రివీల్ చేసిన నయనతార
-
ఎట్టకేలకు కవలల పేర్లు చెప్పిన నయన్ దంపతులు
నయనతార, విఘ్నేశ్ శివన్ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం అందరికీ తెలిసిందే! ఈ కవలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ దంపతులు తమ పిల్లల ముఖాలను మాత్రం ఇంతవరకు చూపించనేలేదు. కనీసం పేర్లు కూడా వెల్లడించలేదు. ఎప్పుడెప్పుడు వారి ముఖాలు రివీల్ చేస్తారా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. సస్పెన్స్కు తెర దించుతూ విఘ్నేశ్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో కిటికీ దగ్గర కూర్చున్న నయన్ చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో క్యూట్గా కనిపిస్తున్న పిల్లల పేర్లను కూడా బయటపెట్టాడు విఘ్నేశ్. 'ఉయిర్ రుద్రనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్.. ఈ ప్రపంచంలోనే ఉత్తమ తల్లి నయనతారకు సంకేతంగా ఇద్దరి పేర్లలో ఎన్ను చేర్చాం. మా పిల్లల పేర్లను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని క్యాప్షన్లో రాసుకొచ్చాడు. కాగా చాలాకాలం డేటింగ్లో ఉన్న నయన్, విఘ్నేశ్ 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. అక్టోబర్లో సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్ కవలల పిక్ షేర్ చేసిన భర్త విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార-దర్శకుడు విఘ్నేశ్ గతేడాది జూన్లో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేశ్లు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు నెలలు తిరక్కుండానే సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఈ వ్యవహరం వివాదం మారింది. అన్ని నిబంధనల ప్రకారమే తాము సరోగసికి వెళ్లామని నయన్ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవడంతో వివాదం సద్దుమనిగింది. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ కవలలు జన్మించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారి ఫేస్ రివీల్ చేయలేదు ఈ జంట. దీంతో నయన్ పిల్లలను చూసేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త విఘ్నేశ్ తాజాగా చిన్నారుల క్యూట్ పిక్స్ షేర్ చేశాడు. ఎప్పటిలాగే వారి ముఖం కనిపించకుండ విఘ్నేశ్ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ కాగా నయన్, విఘ్నేశ్లు చిన్నారుల చేతులు పట్టుకుని ఉన్న ఫొటోలన పోస్ట్ చేస్తూ.. ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటనే ప్రేమ’ అంటూ విఘ్నేశ్ తన పోస్ట్కు రాసుకొచ్చాడు. కాగా ఇటీవల ఈ స్టార్ కపుల్ తమ కవలలతో ముంబై ఎయిర్పోర్టులో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టంట వైరల్గా మారాయి. కాగా తమ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తొలిసారి కవలలతో బయట కనిపించిన నయన్- విఘ్నేశ్, వీడియో వైరల్
సౌత్ స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే! తొలిసారి పిల్లలతో కలిసి వీరిద్దరూ దర్శనమిచ్చారు. మార్చి 8న ముంబై ఎయిర్పోర్టులో నయన్, విఘ్నేశ్.. చెరొక బాబును ఎత్తుకుని కనిపించారు. దీంతో మీడియా వారిని ఫోటోలు క్లిక్మనిపించే ప్రయత్నం చేశాయి. కానీ ఈ దంపతులు మాత్రం తమ పిల్లల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కెమెరామన్లను చూసి నయన్ చిరునవ్వులు చిందిస్తూనే బుడ్డోడిని జాగ్రత్తగా అదిమిపట్టుకుంది. పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇకపోతే నానుం రౌడీ ధాన్ సినిమా సెట్స్లో నయన్, విఘ్నేశ్ మధ్య ప్రేమ చిగురించింది. చాలాకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2022 జూన్ 9న పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాకముందే సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎయిర్ పోర్టులో కవలపిల్లలతో నయన్.. విఘ్నేశ్ (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత నయన్కు కలిసిరావడం లేదా?
లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెళ్లి తర్వాత కలిసిరావడం లేదని అనిపిస్తోందంటున్నారు ఆమె ఫ్యాన్స్. సౌత్ లేడీ సూపర్ స్టార్గా ఎనలేని క్రేజ్ను సంపాదించుకున్న ఆమె గతేడాది ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లు చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నయన్కు పెళ్లి అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోవడమే. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. ఇటీవలే బాలీవుడ్లోనూ రంగప్రవేశం చేసింది నయన్. హిందీలో షారూఖ్ ఖాన్కి జంటగా నటించిన జవాన్ చిత్రం, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకున్నాయి. వీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు తర్వాత చిత్రం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది.దీనికి కారణం కొత్త చిత్రాలేవీ చేతిలో ఏమీ లేకపోవడమే. అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించిన చిత్రాలు సైతం వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్గా మారిన నయనతార ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి. మరో విషయం ఏంటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయడానికి అంగీకరించారని. అందుకు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు చొప్పున రెండు చిత్రాలకు రూ. 20 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. అయితే అడ్వాన్స్ తీసుకుని రెండేళ్లుగా కాలయాపన చేయడంతో వారు చిత్రాలను నిలిపివేయడమే కాకుండా.. నగదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. చదవండి: మృణాల్కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే! ఇదిలా ఉంటే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆయన అజిత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు వీరిద్దరి కెరీర్కూ పెద్ద ఎదురుదెబ్బ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉండగా.. నయన్ నటనకు స్వస్తి చెప్పారనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో నయనతారకు టైమ్ బాగాలేదా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా రాణిస్తున్న నటి నయనతార. జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ పాగా వేసిన సంచలన నటి మరోసారి వార్తల్లో నానుతున్నారు. నయనతార పెళ్లి అయిన తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఏమీ ఆశించిన విధంగా విజయాలు సాధించలేదు. ఇక తన భర్త విఘ్నేష్ శివన్ విషయంలో ఘోర పరాభవం జరిగింది. ఈయన నటుడు అజిత్ కథానాయకుడుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రకటన కూడా జరిగింది. ఇక షూటింగ్కు వెళ్లడమే ఆలస్యం అన్న తరుణంలో సినిమా కథ నచ్చలేదంటూ ఇటు అజిత్, అటు సంస్థ పేర్కొనడమే కాకుండా చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ను తొలగించారు. ఇది దర్శకుడు విఘ్నేష్ శివన్ కంటే ఆమె భార్య, నటి నయనతారను బాగా గాయపరచిందనే ప్రచారం వైరల్ అయ్యింది. దీనికి కారణం ఈ వ్యవహారంలో ఆమె చేసిన సంధి ప్రయత్నం కూడా విఫలం కావడమే. దీంతో అజిత్కు బదులుగా నటుడు విజయ్ సేతుపతిని తీసుకొని విఘ్నేష్ శివన్ చిత్రం చేసేలా నయనతార చక్రం తిప్పిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా నటుడు విజయ్ సేతుపతి తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే తాజాగా ఆ చిత్ర కథ నచ్చలేదంటూ సుందర్.సి కి హ్యాండ్ ఇచ్చారు. అయితే దీని వెనుక నటి నయనతార హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అజిత్ తిరస్కరించిన కథలోనే విజయ్ సేతుపతిని నటింపజేస్తూ తన ఈగోను తృప్తి పరచుకుంటోందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, విఘ్నేష్ శివన్ కాంబోలో ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్, కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రాలు రూపొందాయి. -
అజిత్ సినిమాలో విలన్గా పాపులర్ హీరో
అజిత్ లేటెస్ట్ మూవీ తుణివు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టార్ హీరో తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి కథతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్కు, నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో ఆయన్ను తప్పించి మగిళ్ తిరుమేణిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ నటించనున్నారట. గతంలో వీరిద్దరు కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎన్నై అరిందాల్ అనే చిత్రంలో నటించారు. అందులో అజిత్ పోలీసు అధికారిగా, అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్ 62వ సినిమాలో కూడా అరుణ్ విజయ్ ఢీ కొనబోతున్నారన్నమాట. -
నయనతార షాకింగ్ నిర్ణయం.. ఇకపై ఆ స్టార్ హీరోతో..!
పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్ రౌడీదాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార భర్త విగ్నేశ్ శివన్. తాజాగా నటుడు అజిత్ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఈ సమయంలో శివన్కు ఊహించని రీతిలో షాకిచ్చారు స్టార్ హీరో అజిత్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అందుకు కారణం విగ్నేశ్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్కు, లైకా సంస్థకు నచ్చకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే అజిత్ నటించిన తునివు ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. కథలో కొన్ని మార్పులు చేయాలని చెప్పినా అందుకు విగ్నేశ్ శివన్ నిరాకరించినట్లు టాక్. దీంతో నటి నయనతార రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో నయనతార కఠిన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. నయనతార ఇకపై అజిత్ సరసన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది . తన భర్త విగ్నేశ్ శివన్కు చిత్రానికి అజిత్, లైకా ప్రొడక్షన్స్ తిరస్కరించటమే కారణంగా భావిస్తున్నారు. కాగా.. నయన్, అజిత్ నటించిన బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. ఇకపై నయన్, అజిత్ తెరపై కనిపించరన్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరికొన్ని రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశముంది. -
భర్తకు అవమానం.. ఇకపై ఆ హీరోతో నయన్ కనిపించదా?
తమిళసినిమా: దక్షిణాది లేడీసపర్ స్టార్గా వెలిగొందిన నటి నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈమె నిర్మాతగాను మారి చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షారుక్ఖాన్ సరసన నటించిన హిందీ చిత్రం జవాన్, జయంరవితో జతికట్టిన ఇరైవన్ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. కొత్తగా మరో రెండు చిత్రాలను అంగీకరింనట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది దర్శకుడు విఘ్నేశ్శివన్ను పెళ్లి చేసుకున్న నయనతార ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఆనందకరమైన సమయంలో ఈ దంపతులకు జీర్ణించుకోలేని చేదు అనుభవం ఎదురైంది. ఇది నయనతార భర్త విషయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్ నటుడు అజిత్ కథానాయకుడుగా చిత్రాన్ని చేయడానికి చాలా కాలంగా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి చాలానే ప్రచారం జరిగింది. అన్ని బాగుంటే ఈపాటికి చిత్రం సెట్స్పైకి వెళ్లేది. ఇలాంటి పరిస్థితుల్లో కథ నచ్చలేదంటూ నటుడు అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు విగ్నేశ్ శివన్ను చిత్రం నుంచి తొలగించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది దర్శకుడు విఘ్నేష్ శివన్కు చాలా పెద్ద అవమానమే. ముఖ్యంగా అతని భార్య నయనతారకు ఇంకా పెద్ద భంగపాటు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ వ్యవహారంలో విఘ్నేష్ శివన్ తరఫున వకాలతు పుచ్చుకున్న ఈమె అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో సామరస్య పరిష్కారం కోసం సంధి ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె ప్రయత్నం మెడిసికొట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన నయనతార మంగమ్మ శపథం లాంటిది చేసినట్లు సామాజి మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇంతకీ ఆ శపథం ఏంటంటే ఎన్ని కోట్లు పారితోషికం ఇస్తానన్నా ఇకపై నటుడు అజిత్ సరసన నటించేదిలేదన్నదే. నిజానికి అజిత్ , నయనతారలది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇంతకు ముందు బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో వీరు కలిసి నటించారు. ఇప్పుడు ఆమె అజిత్తో నటించనని తెగేసి చెప్తుందట. ఈ వార్త నయన్, అజిత్ అభిమానులను కొంత షాక్కి గురి చేసిందనే చెప్పాలి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
నయనతార భర్త విగ్నేశ్ శివన్కు షాక్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ సినిమా: చిత్ర పరిశ్రమను విచిత్ర పరిశ్రమ అంటారు. ఇక్కడ లక్కు కిక్కు కంటే కూడా మరొకటి ఉంటుంది. అదేంటో దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేష్ శివన్ను చూస్తే తెలుస్తుంది. పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్ రౌడీదాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజాగా నటుడు అజిత్ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. అజిత్ చిత్రం తుణివు ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. తదుపరి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. చిత్రం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ వైదొలిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం విగ్నేశ్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్కు, లైకా సంస్థకు సంతృప్తినివ్వక పోవడమేనని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేయాలని సంస్థ చెప్పినా అందుకు విగ్నేష్ శివన్ నిరాకరించినట్లు టాక్. దీంతో నటి నయనతార రంగంలోకి దిగి ఇరువురి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అజిత్ కన్విన్స్ అయినా లైకా ప్రొడక్షన్స్ ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ 62వ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు మిగామన్, తడం, కలగతలైవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విజయ్ కోసం తయారు చేసిన కథను అజిత్తో చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. -
అజిత్ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్గా ఉంచారా?
నటుడు అజిత్ తన వయసుకు దగ్గ పాత్రలో నటించడం ప్రారంభించి చాలా కాలమైంది. ఆయనకు జతగా నటించే హీరోయిన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమధ్య వివేకం చిత్రంలో కాజల్ అగర్వాల్, విశ్వాసం చిత్రంలో నయనతార, వలిమై చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి అజిత్ సరసన నటించారు. తాజాగా విడుదలైన తుణివు చిత్రంలో మలయాళ భామ మంజువారియర్ నటించారు. వీళ్లందరూ వయసులో సీనియర్ నటీమణులే అనేది గమనార్హం. కాగా తుణివు చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కారణం పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉండడమే. ముందుగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంతో ఆమె నటించడం లేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. అదేవిధంగా ఇటీవల నటి ఐశ్వర్యరాయ్ అజిత్ సరసన నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నటి సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరి పేరు ఇప్పటివరకు చిత్ర వర్గాలు ప్రకటించలేదు. చిత్రం షూటింగ్ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు అసలు హీరోయిన్ ఎంపిక చేశారా, చేస్తే ఆ విషయాన్ని సస్పెన్స్గా ఉంచారా? అనే చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. -
పేదలకు నయన్ దంపతుల సర్ప్రైజ్ గిఫ్ట్స్.. వీడియో వైరల్
కొన్నేళ్లపాటు ప్రేమ లోకంలో విహరించిన కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ - విఘ్నేశ్ ఎట్టకేలకు గతేడాది పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. దీంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ నూతన సంవత్సరానికి వెరైటీగా అండ్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. పూజలు, పార్టీల సంగతి ఏమో కానీ పేదలకు ఊహించని బహుమతులిచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రోడ్డు పక్కన కారు ఆపిన నయన్ దంపతులు అక్కడున్న కొందరు మహిళలకు, పిల్లలకు గిఫ్టులు పంపిణీ చేశారు. సెలబ్రిటీలు నేరుగా తమ దగ్గరకు వచ్చి మరీ బహుమతులిస్తుండటంతో అక్కడున్న వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్, ఇందుకే కదా మిమ్మల్ని లేడీ సూపర్ స్టార్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నయనతార ఇటీవల కనెక్ట్ సినిమాలో నటించింది. ఇది తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజైంది. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వినయ్ రాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటించారు. చదవండి: పారితోషికంతో కూతురికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి నేను కోరుకుంది ఇదే, సంతోషంగా ఉంది: తమన్నా -
పేదలకు నయన్ దంపతుల సర్ప్రైజ్ గిఫ్ట్స్
-
2022 నాకెంతో స్పెషల్.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్
సంచలన నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2016 నుంచి సహజీవనం చేసిన జంట 2022 జూన్లో వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంటకు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. తాజాగా విఘ్నేశ్ శివన్ 2022కు గుడ్ బై చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. గతేడాదిలో జరిగి విషయాలను విఘ్నేశ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తనకు 2022 ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. నయనతారతో పెళ్లి, సూపర్స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు మరిచిపోలేనివని తెలిపారు. 2022లోనే ఇద్దరు పిల్లలు జన్మించడం దేవుడిచ్చిన వరమన్నారు విఘ్నేశ్. అలాగే 'కాతువాక్కుల రెండుకాదల్' మూవీ రిలీజ్, తమిళనాడు ప్రభుత్వం చెస్ ఒలిపింయాడ్ ఆహ్వానం, నయనతార 'కనెక్ట్' మూవీ, తన తదుపరి ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఏకే62 ఇందులో ప్రస్తావించారు. మధురమైన క్షణాలను మిగిల్చిన 2022కు గుడ్బై చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శివన్. ఈ ఏడాది మరింత సంతోషంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
విఘ్నేశ్ డైరెక్షన్లో అజిత్-త్రిష చిత్రం.. ఫ్యాన్స్కి గుడ్న్యూస్
తమిళసినిమా: కోలీవుడ్లో జయాపజయాలకు అతీతంగా చిత్రాలు చేసుకుంటూ పోయే నటుడు అజిత్. 'నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు. ఫలితం అదే వస్తుంది' అన్న సిద్ధాంతాన్ని పాటించే నటుడు ఈయన. అదేవిధంగా తాను నటిస్తున్న చిత్రాల గురించి ఎలాంటి విషయాన్ని చెప్పరు. ఆడంబరాలకు పోరు. అభివనులను ప్రోత్సహించారు. అందుకే అజిత్ రూటే సెపరేటు అనే ప్రచారం ఉంది. తాజాగా ఈయన నటించిన తుణివు చిత్రం పొంగల్ బరిలోకి దిగుతోంది. జి సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. నటి మంజు వారియర్ నాయకిగా నటించిన ఈ చిత్రం బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే కథగా ఉంటుందని సమాచారం. దీన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. దీంతో తుణివు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అజిత్ నటించే తదుపరి చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి ఆయన అభివనుల్లో నెలకొంది. ఎందుకంటే అజిత్ తుణివు చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత 180 రోజుల పాటు బైక్లో సుదీర్ఘ విదేశీ ప్రయణానికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అజిత్ తదుపరి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. నటి త్రిష నాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం జనవరిలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్
తల్లయిన తర్వాత లేడీ సూపర్ స్టార్ తొలిసారి పబ్లిక్లోకి వచ్చింది. గత కొంతకాలంగా నయన్ పెద్దగా బయటకు రావడం లేదనే విషయం తెలిసిందే. తన మూవీ ప్రమోషన్స్లో సైతం హాజరకావడం లేదు. సినిమాకు సంతకం చేసినప్పుడే చిత్రం దర్శక-నిర్మాతలకు నయన్ ముందుగానే ఈ కండిషన్ పెట్టేదట. అందుకే ఆమె ఏ మూవీ ఈవెంట్స్ అయినా చివరికి తన చిత్రం ప్రమోషన్స్కి దూరంగా ఉండేది. కానీ, తాజాగా నయన్ తన తీరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్లో పాల్గొంది. నయన్ తాజా చిత్రం కనెక్ట్ మూవీ ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. చదవండి: ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాకు ప్రదర్శించిన కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకు నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్లో కలిసి హాజరైంది. అక్కడ హాలీవుడ్ నటిలా స్టైలిష్గా కనిపించిన ఆమెను చూసి అభిమానులంతా స్టన్ అయ్యారు. పెళ్లయ్యాక నయన్ మరింత అందంగా, స్టైలిష్గా మెకోవర్ అయ్యిందంటూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ షో హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని నయన్ను పిలిచి ఐ లవ్ యూ మామ్ అని అన్నాడు. మరికొందరు కనెక్ట్ చిత్రం బాగుందంటూ ప్రసంశలు కురిపించారు. దీంతో ఆమె చాలా థ్యాంక్స్ అంటూ చిరునవ్వులు చిందించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! నయనతార ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రాన్ని ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. గతంలో నయనతార నటించిన మాయ, తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దీన్ని తెరకెక్కించారు. హార్రర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో 99 నిమిషాల నిడివితో రూపొందడం విశేషం. ఇది లాక్డౌన్ నేపథ్యంలో హర్రర్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందింది. ఈ చిత్రంలో నయనతారతో పాటు సత్యరాజ్, వినయ్రాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ఖేర్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా కనెక్ట్ చిత్రాన్ని ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విఘ్నేష్ శివన్ ఈ సందర్భంగా తెలిపాడు. -
దెయ్యంతో నయన్కు సంబంధం ఏంటి? 'కనెక్ట్' స్టోరీ లైన్ ఇదే!
తమిళ సినిమా: వరుస సక్సెస్లు అందుకుంటున్న అగ్ర నటి నయనతార. మాయ చిత్రంతో ఈమె హర్రర్ కథా చిత్రాల ప్రస్థానం మొదలైంది. తాజాగా కనెక్ట్ చిత్రం ద్వారా ముందుకొస్తోంది. నయన్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ తన రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించడం విశేషం. వినయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ.. ఇది లాక్డౌన్ కాలంలో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే హర్రర్ సన్నివేశంతో కూడిన చిత్రం కలెక్ట్ అని చెప్పారు. నయనతార ఇంట్లోకి దెయ్యం ఎలా వస్తుంది? దాంతో ఎవరు బాధింపునకు గురవుతారు? చివరికి దాన్ని ఎలా తరిమేస్తారు అన్న ఆసక్తికత విషయాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కథ విన్న తరువాత నయనతారకు నచ్చడంతో చిత్రాన్ని తామే నిర్మిస్తామని చెప్పి విఘ్నేష్ శివన్ను కలవమని చెప్పారన్నారు. ఆయనకీ కథ నచ్చడంతో కనెక్ట్ సెట్పైకి వెళ్లిందని తెలిపారు. హాలీవుడ్ చిత్రంలా కనెక్ట్ చిత్రం నిడివి 90 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. దీన్ని థీయోటర్లలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో సంప్రదిస్తున్నట్లు అశ్విన్ శరవణన్ తెలిపారు. -
నా కోడలు బంగారం అంటున్న నయనతార అత్త!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది నయనతార. కోలీవుడ్లో టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు విఘ్నేశ్ శివన్. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న వీరు ఇటీవలే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా నయనతారను పొగడ్తలతో ముంచెత్తించింది ఆమె అత్తయ్య, విఘ్నేశ్ తల్లి మీనా కుమారి. విఘ్నేశ్ తల్లి మీనా కుమారి మాట్లాడుతూ.. 'నా కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్, నా కోడలు టాప్ హీరోయిన్. ఇద్దరూ కష్టపడి పని చేసేవారే! నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు. అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని తెలిసి వెంటనే వాళ్లకు ఆ డబ్బులిచ్చి సాయం చేసింది. అంత గొప్ప మనసు నా కోడలిది. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. పది మంది చేసే పనిని కూడా ఒంటిచేత్తో చేయగల సత్తా ఆమె సొంతం. కొడుకు కోడలిద్దరూ కష్టపడటమే కాదు వారిలా కష్టపడేవాళ్లను ఎంతగానో గౌరవిస్తారు' అని చెప్పుకొచ్చింది. చదవండి: రేవంత్కు బిగ్బాస్ షాక్, అర్ధాంతరంగా.. శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్నా -
నయనతార-విగ్నేశ్ల ఇంటికి వెళ్లిన రాధికా శరత్కుమార్
తమిళసినిమా: సంచలన నటి నయనతార దర్శకుడు విగ్నేశ్ శివన్ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2016 నుంచి ఈ జంట సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత జూన్లో ఈ ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్ల మధ్య ప్రేమ చిగురించింది. కాగా ఈ జంట అద్దె తల్లి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ సంచలనం కలిగించారు. పలు వురి విమర్శల మధ్య ఇది ప్రభుత్వం వరకు వెళ్లింది. నయనతార విగ్నేశ్శివన్లకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సమన్లు జారీ చేయడం, వారు వి వరణ ఇవ్వడం విచారణ వంటి సంఘటన తరువాత అన్నీ సక్రమమే అన్న ప్రత్యేక కమిటీ ప్రకటనతో నయనతార విఘ్నే ష్ శివన్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు అందించా రు. తాజాగా నటి రాధికాశరత్కుమార్ స్వయంగా స్థానిక ఎగ్మోర్లోని నయనతార ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలను చూశారు. అలాగే నయనతార విఘ్నేష్ శివన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసి, నయనతార కవల పిల్లలు చాలా బాగున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్
లేడీ సూపర్ స్టార్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ నయనతార. దక్షిణాది సినిమాల్లో నటిస్తూ తన కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి నిలదొక్కుకుంది. టాలీవుడ్లో డబ్బింగ్ సినిమా 'చంద్రముఖి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పూర్తి హీరోయిన్గా వెంకటేశ్తో కలిసి నటించిన చిత్రం 'లక్ష్మీ'. ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్లో వరుస అవకాశాలొచ్చాయి. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ అలియాస్. కేరళలోని తిరువల్లాకు చెందిన నయన్ బాల్యమంతా గుజరాత్లోని జామ్నగర్లో గడిచింది. సినిమా కథలో ట్విస్ట్ల లాగే ఆమె జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది కోలీవుడ్ తార. ఈ తరం హీరోయిన్లలో దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆమెదే. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కథానాయిక ప్రధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. (చదవండి: ఆ హీరోతో తొలిసారి కలిసి నటించనున్న నయనతార) ప్రేమ-పెళ్లి: ‘నానుమ్ రౌడీ ధాన్’ (2015) అనే సినిమాతో దర్శకుడు విఘ్నేశ్ శివన్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి ఒక్కటైంది ఈ జంట. ఇటీవలే నయన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇవాళ నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. భార్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో రాస్తూ..' ఈ పుట్టినరోజు మాకు ఎంతో ప్రత్యేకమైంది. చిరస్మరణీయమైంది. ఎందుకంటే మేం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అలాగే ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యాం. ఆమె ఆత్మవిశ్వాసం, అంకితభావం, జీవితం పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి నుంచి నేను ప్రేరణ పొందా. ఆమెను ఒక తల్లిగా చూడడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ప్రస్తుతం తనను మేకప్ వేసుకోకుండా ఇంత అందంగా ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం పిల్లలు ముద్దు పెట్టుకుంటారనే నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. నీ ముఖంలో అందం, చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. రాబోయే పుట్టినరోజులు మరింత సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. దేవుని అశీర్వాదాలతో మన జీవితం మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ నా ప్రియమైన పొండాయాటి(ముద్దుపేరు), పిల్లలను(ఉయిర్, ఉలగం) ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ జీవితంలో గుర్తుండిపోయేలా ప్రత్యేక విషెష్ తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
సరోగసీ వివాదంలో నయనతార దంపతులకు క్లీన్ చిట్
-
నయన్ దంపతుల సరోగసి.. ఊహించిందే జరిగింది..!
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్టాపిక్గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది. (చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?) తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది. -
నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?
స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. రేపు(బుధవారం) తమిళనాడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక అందించనున్నారు. కాగా లేడీ సూపర్స్టార్ నయనతారదంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్టాపిక్గా మారింది. సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళరం ఈ విచారణ పూర్తయింది. ఈ క్రమంలో నయన్ దంపతలు కమిటీకి అపిడవిట్ పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని తెలిపారు. గతేడాది డిసెంబర్లోనే సరోగసి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇందులో నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ పూర్తిచేసిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందిచనున్న నేపథ్యంలో నివేదికలో ఏం ఉండనున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
నయన్ దంపతుల దీపావళి సర్ప్రైజ్.. కవల పిల్లలతో కలిసి..!
ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ్యాన్స్కు దివాళీ విషెస్ తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్ - విఘ్నేశ్ లవ్ స్టోరీ.. నాంది పలికింది ఆ సినిమాతోనే..!
కోలీవుడ్ ప్రేమజంట నయన్- విఘ్నేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట జూన్ 2022లో ఒక్కటైంది. తాజాగా నయనతార కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి ప్రేమకథ ఎక్కడ ప్రారంభమైంది? అసలు వారిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? తొలిసారి వారు ఎక్కడ కలిశారు? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల ప్రమాయాణానికి తొలి అడుగు పడింది మాత్రం ఆ సినిమాతోనే. వీరిద్దరి కాంబినేషన్లో 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'నానుమ్ రౌడీ ధాన్'. ఈ ప్రేమకథా చిత్రం విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం. మొదటి ఎంపికా నయన్ కాదు: నాను రౌడీ ధాన్ షూటింగ్ సందర్భంగా మొదటిసారి విఘ్నేశ్ శివన్ను నయనతార కలిశారు. ఇక అప్పటి నుంచి వీరి లవ్ స్టోరీ ప్రారంభమైంది. ఇక వారిద్దరు ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార మొదటి ఎంపిక కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే అనుకోకుండా ఓ హోటల్లో నయనతారను కలుసుకోవడంతో ఈ సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారు. నానుమ్ రౌడీ ధాన్ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విఘ్నేష్ శివన్ సెట్స్లో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో విఘ్నేశ్,నయనతార సముద్రం వద్ద సంభాషణలో పాల్గొన్నారు. మొదట్లో వారిద్దరూ ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ నవ్వుతూ సంభాషించుకున్నారు. విఘ్నేశ్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ 'ఒకప్పుడు పాండీవుడ్లో!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 2016లో నానుమ్ రౌడీ ధాన్ హిట్ కావడంతో వీరిద్దరి రిలేషన్పై రూమర్లు వచ్చాయి. అయితే 2016లో జరిగిన సైమా వేడుకలో విఘ్నేష్ శివన్ తనకు అవార్డును అందజేయాలని కోరడంతో వీరి రిలేషన్పై గాసిప్స్ గుప్పుమన్నాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
అది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది: విఘ్నేశ్ శివన్
ఇటీవల నయనతార దంపతులు సరోగసి వివాదం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ జంట ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో సమసిపోయింది. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టా స్టోరీస్ షేర్ చేశాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రేస్టేషన్లో ఉన్న రోజుల గురించి స్టోరీలో ప్రస్తావించారు. మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మంచి కనిపిస్తుందన్న సందేశంతో కోట్స్ షేర్ చేశారు. గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన ఇన్స్టా కోట్స్ను సోషల్ మీడియాలో విఘ్నేశ్ పోస్ట్ చేశారు. విఘ్నేష్ ఇన్స్టా స్టోరీలో 'మనకు మంచి రోజులు ఉన్నాయి. కానీ ఫ్రస్టేషన్ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.' అని కోట్స్లో రాసి ఉంది. ఆ రెండు పోస్టులు ఇటీవల నయనతార కవలలకు జన్మనివ్వడంతో వచ్చిన వివాదాన్ని ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. -
ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట్విస్ట్!
నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సైతం నయన్ దంపతులను వివరణ కోరింది. (చదవండి: నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు) నివేదికలో బిగ్ ట్విస్ట్..: అయితే తాజాగా నయన్ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట 6 ఏళ్ల క్రితమే చట్టబద్ధంగా రిజిష్టర్ వివాహం చేసుకున్నట్లు అఫిడవిట్లో వెల్లడించినట్లు సమాచారం. తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని తెలిపింది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్తో పాటు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించలేదు: సరోగసీ (నియంత్రణ) చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటాక మాత్రమే సరోగసీని ఎంచుకోవడానికి అర్హులు. అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలని కూడా చట్టం చెబుతోంది. అలాగే సరోగేట్ మదర్ యూఏఈకి చెందిన నయనతార బంధువే అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కవలలు జన్మించిన చెన్నై ఆసుపత్రికి కూడా అధికారులు ఇండెంట్ పెట్టారు. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
లేడీ సూపర్స్టార్ నయనతారకు సరోగసీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం ఆమెకు షాకిచ్చింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో వారు సరోగసీ(అద్దె గర్భం) ద్వారానే తల్లిదండ్రులు అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో ప్రస్తుతం నయన్ సరోగసీ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు షాకిచ్చింది. చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా వారు తల్లిదండ్రులు కావడంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ మీడియాతో పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు నయన్ దంపతులు స్పందించకపోవడం గమనార్హం. చదవండి: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు -
కవల పిల్లల ఇష్యూ పై స్పందించిన విగ్నేష్ శివన్
-
నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు
తమిళసినిమా: నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవలపిల్లలకు తల్లి అయిన వి షయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నటి నయనతారను వివరణ కోరుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరికి అద్దె తల్లి ద్వారా కవల పిల్లలు జన్మించారు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది -
సెలబ్రిటీ సరొగసీ రచ్చ!
సినీ ప్రముఖుల ప్రతి అంశమూ ఆసక్తికరమే, అనేకసార్లు సంచలనమే. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులు తల్లితండ్రులైన వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక చర్చలకూ దారి తీసింది. పెళ్ళయిన 4నెలలకే తల్లితండ్రులైన ఈ దంపతులు బాహాటంగా ప్రకటించకున్నా, సరొగసీ (అద్దె గర్భం) ద్వారానే మగ కవలల్ని కన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అద్దె గర్భం ప్రక్రియ ఓ వ్యాపారంగా సాగడాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం నిరుడు తెచ్చిన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని కొందరి అనుమానం. నయన కవలపిల్లల వ్యవహారంలో చట్ట ఉల్లంఘనలు జరిగిందీ, లేనిదీ రాష్ట్ర వైద్యసేవల డైరెక్టరేట్ ద్వారా విచారణ జరుపుతామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడంతో కథ మరో మలుపు తిరిగింది. నయనతార దంపతులేమీ అధికారికంగా వివరణ ఇవ్వకపోవడంతో, వ్యక్తిగత వ్యవహారం కాస్తా సెలబ్రిటీ సరొగసీ రచ్చగా మారింది. సరొగసీపై 2021 డిసెంబర్లో భారత పార్లమెంట్ రెండు చట్టాలను ఆమోదించింది. అవి – సరొగసీ (నియంత్రణ) చట్టం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం. మొదటి చట్టం దేశంలో సరొగసీ ప్రక్రియ, ఆచరణకు సంబంధించినది. రెండోది ఏఆర్టీ క్లినిక్లనూ, బ్యాంకు లనూ పర్యవేక్షించడానికీ, నియంత్రించడానికీ ఉద్దేశించినది. పిల్లలు లేనివాళ్ళు, నిర్ణీత వయస్కులు, అద్దెగర్భమే దిక్కయిన ఆరోగ్యపరిస్థితుల్లోని వారే ఈ చట్టాల కింద సరొగసీకి అర్హులు. గుజరాత్లోని ఆనంద్ సహా పలు ప్రాంతాలు అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డా కావడంతో, అలాంటి అక్రమాలను ఈ చట్టాలు దేశంలో నిషేధించాయి. సరొగసీతో సంతానం పొందాలనుకొనే దంపతులకు సాయపడే అద్దె తల్లి వారికి రక్తసంబంధీకురాలై ఉండాలనీ పేర్కొన్నాయి. ఈ ఉద్దేశాలన్నీ మంచివే అయినా... సరొగసీ ద్వారా తండ్రి కావాలనుకున్న ఒంటరి మగాడి పట్ల, అలాగే ఒక బిడ్డ ఉన్నప్పటికీ అద్దెగర్భంతో కుటుంబాన్ని విస్తరించుకోవాలనుకొనే వివాహిత స్త్రీ పట్ల ఈ చట్టాలు దుర్విచక్షణతో ఉన్నాయనేది విమర్శ. దీనిపై ఢిల్లీ హైకోర్ట్లో ఓ పిటిషన్ పెండింగ్లో ఉంది. అలాగే, ఈ చట్టాల్లోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఓ డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీమ్ కోర్ట్ విచారిస్తోంది. నయన, శివన్ 2022 జూన్లో చెన్నైలో పెళ్ళి చేసుకొన్నారు. నాలుగు నెలలకే సంతానం కలగడం, నటనలో బిజీగా ఉన్న నయన గర్భవతిగా ఉన్న సూచనలేవీ బయట కనిపించకపోవడం, ఆంతరంగిక వర్గాల కథనం అది అద్దెగర్భమనే అనడంతో ఇంత చర్చా మొదలైంది. నటి కస్తూరి సహా కొందరు ప్రముఖులు, నెటిజన్లు కమర్షియల్ సరొగసీ నిషేధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి ఇంటికథ రచ్చకెక్కింది. నిజానికి, సంతానం కోసం సెలబ్రిటీలు సరొగసీని ఆశ్రయించడం మన దేశంలోనూ కొత్తేమీ కాదు. హీరో షారుఖ్ ఖాన్ 2013 మేలో తన మూడో బిడ్డ అబ్రామ్ కోసం సరోగసీని ఆశ్రయించినప్పటి నుంచి చర్చ రేగింది. ధనికులు తప్పుడు కారణాలతో అద్దెతల్లుల్ని పెట్టుకుంటున్నారనే వివాదం మొదలైంది. నటి మంచు లక్ష్మి, 2017 మార్చిలో నిర్మాత కరణ్ జోహార్ దాకా పలువురు బిడ్డల కోసం సరొగసీనే ఆశ్రయించారు. సినిమా సహా గ్లామర్ ప్రపంచంలో ఉన్నవారు తమ వృత్తి అవసరాల రీత్యా అద్దె తల్లుల్ని అరువు తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. నైతిక చర్చలు పక్కనపెడితే, అందులో న్యాయ విరుద్ధమేమీ లేదు. పెళ్ళికాక ముందే ఏడేళ్ళుగా 2015 నుంచి నయన, శివన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సహ జీవనం సైతం చట్టబద్ధమని కోర్టులే తేల్చాయి. కాబట్టి, పెళ్ళయి అయిదేళ్ళయితేనే సరొగసీకి అర్హులనే చట్ట నిబంధనను వారు ఉల్లంఘించారనే వాదన నిలుస్తుందా? అలాగే, కొత్త సరొగసీ చట్టాలు ఈ ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటికే అద్దె తల్లులుగా ఉన్నవారి క్షేమం కోసం పది నెలల గర్భధారణ కాలమూ ఇచ్చాయి. దాని ప్రకారం చూస్తే జనవరికి ముందే నయన దంపతులు సరొగసీని ఎంచుకొని ఉంటే, అదీ చట్టవిరుద్ధం అనలేం. కాబట్టి వారి సరొగసీ చట్టవిరుద్ధమనే వాదన చివరకు నిలబడకపోవచ్చు. విచారణలో వివరాలు బయటకొచ్చేదాకా, నయన దంపతులు పెదవి విప్పేదాకా జరిగిందేమిటో తెలియదు. తొందరపడి తీర్పులు చెప్పడమూ భావ్యం కాదు. నిజానికి, సరొగసీ దోపిడీని అరికట్టడానికి పెట్టిన చట్టాలు సైతం పేదలైన వేలాది అద్దెతల్లుల్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నాయనే వాదన ఉంది. నయనతారతో పాటు వేలాది కేసుల్లో ఒకవేళ చట్ట ఉల్లంఘనలు జరిగాయనుకున్నా, ప్రతి కేసులో విచారణ అయ్యేపనీ కాదు. వైవాహిక అత్యాచారం సహా అనేకవాటిని నేరంగా తీర్మానించడానికి నిరాకరిస్తున్న మనం ఒక మహిళ తన బతుకుతెరువు కోసం తన దేహాన్ని వాణిజ్య సరొగసీకి వాడి, మరో స్త్రీకి సాయం చేస్తే తప్పేమిటనే వాదనకు జవాబు లేదు. సమాజంలో పెళ్ళికీ, మాతృత్వానికీ ఇచ్చిన అతి ప్రాధాన్యమూ సరొగసీపై చర్చోపచర్చలకు కారణమవుతోంది. అద్దె గర్భంతో బిడ్డను కంటే ఆ స్త్రీ ‘మంచి తల్లి’ కాదంటారా? అలాంటి తప్పుడు మూస ఆలోచన నుంచి మనం బయటపడేదెప్పుడు? నటి ప్రియాంకాచోప్రా, నిక్ జోన్స్ దంపతులు ఆ మధ్య సరొగసీతో సంతానం పొందినప్పుడూ వారిని అనరాని మాటలన్నారు. ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని, తన హక్కును వినియో గించుకుంటే... ‘ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలాగే అమ్మతనం పొందా’లంటూ పితృస్వామ్య భావజాలంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి ఏం హక్కుంది? ఈ సెలబ్రిటీ సరొగసీ రచ్చతో చర్చకు వచ్చిన అనేక అంశాలను సావధానంగా ఆలోచించాల్సిందే! సమాజం సమాధానం చెప్పాల్సిందే! -
సరోగసీ వివాదం.. ఇన్డైరెక్ట్గా స్పందించిన నయన్ దంపతులు!
సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కవలలు జన్మించారంటూ విఘ్నేశ్ శివన్ ఆదివారం(అక్టోబర్ 9న) సోషల్ మీడియా వేదికగ ప్రకటించాడు. ఈ సందర్భంగా నయన్-విఘ్నేశ్ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఈ జంటకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు అయిన వ్యవహరంపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లయిన 5 నెలలకే పిల్లలు జన్మించడంతో ఈ జంట సరోగసీని మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారానే నయన్ తల్లయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు నయన్ దంపతులు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వారు భారత చట్టాన్ని ఉల్లంఘించారంటూ నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహరంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు నయన్-విఘ్నేశ్లు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కోట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపిక పట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అంటూ ఇన్స్టాలో స్టోరి షేర్ చేశాడు. మీ గురించి ఆలోచిస్తూ మీ మంచి కోరే వ్యక్తుల పట్ల మీరు శ్రద్ద చూపించండి. అలాంటి వారే మీ వాళ్లు’ అంటూ మరో కోటేషన్ షేర్ చేశాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరోగసీ వివాదంపై నయన్ దంపతులు ఇన్డైరెక్ట్గా స్పందించారని, వారిపై విమర్శలు చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి -
నయనతార చేసిన తప్పేంటి ...? జైలు శిక్ష తప్పదా ...?
-
నయన్-విఘ్నేశ్ చట్టాన్ని అతిక్రమిస్తే.. శిక్షేంటో తెలుసా?
నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
MS Dhoni: తమిళ, తెలుగు ప్రేక్షకుల కోసం ధోని! లేడీ సూపర్స్టార్ నయన్తోనే..
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా వ్యవహరిస్తున్న ధోనిని తలా అంటూ అక్కున చేర్చుకున్నారు తమిళ ప్రజలు. అందుకు ప్రతిఫలంగా క్రికెట్తో పాటు తమిళ ప్రేక్షకులకు సినిమాలతోనూ వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడట ఈ జార్ఖండ్ డైనమైట్. తమిళం, తెలుగుతో పాటు.. ఇప్పటికే పలు వ్యాపారాల్లో రాణిస్తున్న ధోని.. తాజాగా ‘ధోని ఎంటరైన్మెంట్’ పేరిట సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ ద్వారా తమిళంలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ చిత్రాలు ప్రొడ్యూస్ చేసేందుకు ధోని సిద్ధమయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లెట్స్సినిమా సహా క్రీడా విశేషాలు పంచుకునే ముఫద్దల్ వోహ్రా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆడియన్స్ లక్ష్యంగా.. కాగా ఇప్పటికే ధోని, ఆయన భార్య సాక్షి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన విషయం తెలిసిందే. రోర్ ఆఫ్ ది లయన్(సీఎస్కేపై నిషేధం- రీఎంట్రీ నేపథ్యంలో), బ్లేజ్ టూ గ్లోరీ(2011 వరల్డ్కప్ నేపథ్యంగా డాక్యుమెంటరీ) తదితర చిన్న సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సౌత్ సినిమాపై దృష్టి సారించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాదు ధోని ఎంటరైన్మెంట్ వ్యవహారాలు చూసుకునేందుకు.. సూపర్స్టార్ రజనీకాంత్కు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ధోని నియమించినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక ఈ ప్రొడక్షన్ కంపెనీలో మొదటగా తీసే సినిమాలో లేడీ సూపర్స్టార్ నయనతార కీలక పాత్ర పోషించనున్నారంటూ గతంలోనూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వీటిలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన స్పెషల్ వీడియో రూపకల్పనలో నయన్ భర్త విఘ్నేష్ శివన్.. ధోనితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నయన్- విఘ్నేష్ దంపతులు తాము కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. #LetsCinema EXCLUSIVE: Dhoni is launching his film production company in south ‘Dhoni Entertainment’ to produce films in Tamil, Telugu and Malayalam. pic.twitter.com/zgTxzdSynT — LetsCinema (@letscinema) October 9, 2022 MS Dhoni launching his film production company named 'Dhoni Entertainment' to produce films in Tamil, Telugu and Malayalam. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 9, 2022 -
చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం
తల్లిదండ్రులైన మరుసటి రోజే సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులకు షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన నయన్-విఘ్నేశ్లు ఐదు నెలల తిరక్కుండానే తల్లిదండ్రులు అయ్యారు. తాము కవలలకు తల్లిదండ్రులమయ్యామంటూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్ ఈ సందర్భంగా వారిద్దరు చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయాడు విఘ్నేశ్. దీంతో సరోగసి(అద్దే గర్భం ద్వారా పిల్లలను కనడం) ద్వారానే నయన్-విఘ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో సీనియర్ నటి కస్తూరి సరోగసి ద్వారా నయన్ తల్లి కావడంపై పరోక్షంగా స్పందించింది. సరోగసీని దేశంలో నిషేధించారని, ఈ ఏడాది దీనిపై ఉత్తర్వులు కూడా వచ్చాయంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. చదవండి: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి? నటి కస్తూరితోపాటు చాలామంది అదే అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నయన్ దంపతులు వ్యవహరించారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు తెరలేపారు. ఇవన్నీ చూస్తుంటే.. నయన్ దంపతులు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు తల్లిదండ్రులు అయిన తీరుపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం స్పందిందించింది. ఈ మేరకు సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. అంతేకాదు సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? లేదా? అన్న దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
నయనతార ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. కవలలకు జన్మనిచ్చిన నటి
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్. తాజాగా నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో ఘనంగా జరిగింది. ఇటీవలే అభిమానుల కోసం వీరిద్దరి పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని అభిమానులకు చూపించనున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి లవ్ స్టోరీ, పెళ్లి వీడియో ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. అయితే నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. Nayan & Me have become Amma & Appa❤️ We are blessed with twin baby Boys❤️❤️ All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇 Need all ur blessings for our Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9 — Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022 -
కవలలకు జన్మనిచ్చిన నయనతార-విఘ్నేశ్ దంపతులు (ఫొటోలు)
-
Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి నయనతార. ఈమె గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతునే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి కథానాయికగా గుర్తింపు పొంది నంబర్ వన్ స్థానానికి చేరుకోవడమే కాకుండా లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నయన్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు, అంతకుమించి శ్రమపడింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నా, వ్యక్తిగతంగా చాలా చేదు అనుభవాలను చవి చూసింది. మొదట్లో నటుడు శింబుతో ప్రేమాయణం, ఆ కథ కంచికి చేరడంతో ఆపై ప్రభుదేవాతో చట్టాపట్టాల్, అదీ మానసిక క్షోభనే మిగల్చడంతో కొంతకాలం ప్రేమ, పెళ్లి విషయాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. చదవండి: (సూపర్ స్పీడ్) అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమె మనసులో చోటు సంపాదించుకున్నాడు. అలా వీరిద్దరి మధ్య ప్రేమ సహజీవనానికి దారి తీసింది. అలా వీరి ప్రేమ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసింది. ఇక నటిగా కోట్లకు పడగలెత్తిన నయనతార తాజాగా అమ్మతనం కోసం ఆరాట పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు పదుల వయసు టచ్ చేసిన నయనతార పిల్లలను కనడానికి సమయం మించిపోతోందని భావించినట్లు, అందువల్ల తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలకు పూర్తిగా దూరం కాకుండా నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అయినా అగ్రకథానాయికగా రాణిస్తున్న నయనతార అంత సులభంగా నటనకు దూరం కాగలుగుతుందా? అన్నది కొశ్చన్ మార్కే. -
మీకు నయన్ సూపర్స్టార్ గానే తెలుసు..: విఘ్నేష్ శివన్
నటి నయనతారను ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ మరోసారి పొగడ్తల్లో ముంచేశారు. ఆయన నయనతారను పొగడటం కొత్త ఏమీ కాదుగా అంటారా..? అది నిజమే. అయితే ఈసారి సందర్భం ఏమిటంటే గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార, విఘ్నేష్ శివన్ల జంట ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుక అంతా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలోనే జరిగిందంటారు. సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. అయితే ఈ పెళ్లి తంతు ఖర్చు అంతా నెట్ఫ్లిక్స్ సంస్థ భరించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీని ఓటీటీ ప్రచార హక్కుల కోసం ఆ సంస్థ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేష్ శివన్లు పెళ్లి పంక్షన్ను బియాండ్ ద ఫెయిరీ టేల్ పేరుతో నెట్ప్లిక్స్ త్వరలో ప్రచారం చేయడానికి సిద్ధమైంది. అందులో నయనతార, విఘ్నేష్ శివన్ల ప్రేమ, పెళ్లి గురించి తమ భావాలను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అందులో విఘ్నేష్ శివన్ పేర్కొంటూ నయనతార మీకు సూపర్స్టార్గానే తెలిసి ఉంటుందని, వ్యక్తిగతంగా తెలిసి ఉండదని పేర్కొన్నారు. తన అలవాట్లు అన్ని మార్చుకున్న అద్భుతమైన ప్రేమకథ ఉన్న మై బంగారం ఈ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ త్వరలో నెట్ప్లిక్స్లో ప్రచారం కానుందన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన నటి నయనతార అని, అయితే చేపట్టిన పనికి 100 శాతం శ్రమించాలని భావించే సాధారణ మహిళని తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. -
నయన్-విఘ్నేశ్ లవ్ డాక్యుమెంటరీ.. టీజర్ చూసేయండి..
కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ గురించి అందరికి సుపరిచితమే. ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్డే వేడులకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై 'నయనతార- బియాండ్ ది ఫెయిర్టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేశ్ కలిసి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పలు ప్రశ్నలకు వీరిద్దరు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్లుక్ పోస్టర్) దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు. త్వరలోనే విడుదల ప్రేమజంట డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. కాగా, చిరంజీవి గాడ్ఫాదర్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విఘ్నేశ్ శివన్కు నయన్ బర్త్డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్ సమ్థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది నయన్. దుబాయ్లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanthara (@nayantthara) . -
ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే..
స్పెయిన్లో నయనతార, విఘ్నేశ్ శివన్ జంట హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇందుకు ఆ జంట రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీరి ఒక్క రోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలట. ఇతర ఖర్చులు అదనం అని టాక్. ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. రీల్ జీవితంలో అందాలార బోతతో అభిమానుల్ని అలరించిన నయనతార నిజ జీవితంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఆరేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింటలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా హద్దంటు ఉంటుందని, మితిమీరితే వెగటు పుడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ చేసింది చాలంటూ నెటిజన్లు నయన్ దంపతులపై ఫైర్ అవుతున్నారు. -
భర్తతో నయన్ వెకేషన్.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార- విగ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్ తీసుకొని హనీమూన్కు చెక్కేశారు. స్పెయిన్లో బార్సిలోనాలో వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ నయన్ తాళిబొట్టుతో మెస్మరైజ్ చేస్తుంది. నయన్ తాళిని ఫ్యాషన్ ట్రెండ్గా క్రియేట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతార ప్రెగ్నెంటా?
స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లాడిన విషయం తెలిసిందే! మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత ఈ కొత్త జంట హనీమూన్కు కూడా వెళ్లొచ్చింది. ఆ వెంటనే నయన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తాను ఓకే చెప్పిన సినిమాల షూటింగ్స్లో పాల్గొంటోంది. అయితే తాజాగా నయనతార అస్వస్థతకు గురైందట. ఆమెకు వాంతులు కావడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఏదైనా గుడ్న్యూసేమో అని ఊహల్లో తేలిపోతున్నారు. కానీ విఘ్నేశ్ శివన్ స్వతాహాగా తయారు చేసిన ఓ వంటకాన్ని ఆరగించడంతో ఆమెకు వాంతులు అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆమె హాస్పిటల్కు వెళ్లగా వైద్యులు కొన్నిగంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే కొందరు మాత్రం స్కిన్ ఇన్ఫెక్షన్ వల్లే ఆమె ఆస్పత్రికి వెళ్లిందని అంటున్నారు. మరి అసలు నిజమేంటన్నది తెలియాలంటే నయన్, విఘ్నేశ్లలో ఎవరు ఒకరు స్పందించాల్సిందే! ఇకపోతే నయన్- విక్కీల పెళ్లి వీడియో త్వరలో నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే! ఈమేరకు ఇటీవలే టీజర్ కూడా రిలీజైంది. వీరి పెళ్లి మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చదవండి: 'ఇన్స్టాలో బ్లాక్ చేసుకున్నాం.. కలిసుండటం ఇక జరగదు' ఎప్పుడూ మీరే కరెక్ట్.. ప్రతిసారి మాదే తప్పు -
సర్ప్రైజ్.. నయన్-విఘ్నేశ్ల పెళ్లి టీజర్ వచ్చేసింది
కోలీవుడ్ నూతన దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్ల పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. వీరి పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్ను తాజాగా నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో నయన్-విఘ్నేశ్లు తమ ప్రేమకు సంబంధించిన మధుర క్షణాలను పంచుకున్నారు. వారి తమ ప్రమే బంధం గురించి వివరిస్తుండగా మధ్యలో వారికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలతో ఆసక్తిగా టీజర్ను మలిచారు. కాగా వీరి పెళ్లి వేడుకకు వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ నయన్ దంపతులతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం నెట్ఫ్లిక్స్ నయన్-విఘ్నేశ్లకు ఫ్యాన్సీ రెటుకు డీల్ కుదుర్చుకుంది. దాదాపు అయిదేళ్లు ప్రేమలో మునిగితేలిన నయన్-విఘ్నేశ్లు గత జూన్ 9న వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లికి కోలీవుడ్కు సంబంధి సినీ తారలు, బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా నయన్ దంపతులు ఈ పెళ్లి డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అవన్ని పుకార్లే.. ఓటీటీలోకి నయన్-విఘ్నేశ్ల పెళ్లి వీడియో, స్ట్రీమింగ్కి రెడీ!
నయనతార, విఘ్నేశ్ శివన్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్ఫ్లిక్స్. చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్ నయనతార-విఘ్నెశ్ శివన్లకు సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేస్తూ వీరి పెళ్లి డాక్యుమెంటరీ స్ట్రీమింగ్పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నయన్ విఘ్నేశ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘త్వరలోనే నయనతార, విఘ్నేశ్లు మా నెట్ఫ్లిక్స్కి రాబోతున్నారు. అప్పటి వరకు ఈ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. కాగా గత జూన్ 9వ తేదీన నయన్-విఘ్నేశ్లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ జంట పెళ్లి జరిగింది. చదవండి: మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్ పోస్ట్ ఇక సినీ ప్రముఖుల రాకతో వీరి పెళ్లి వేదిక కళకళలాడింది. వీరి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్ఫ్లిక్స్ డాక్యూమెంటరి రూపంలో అందించేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరిని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేష్ల ప్రేమ ప్రయాణం, అక్కడి నుండి వారి పెళ్లి వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
కొత్త జంట నయన్-విఘ్నేశ్కు ఓటీటీ షాక్! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు?
నూతన దంపతులు నయనతార, విఘ్నేశ్ శివన్కు ప్రముఖ ఓటీటీ సంస్థ షాకిచ్చింది. గత నెల 9వ తేదీని నయన్-విఘ్నేశ్లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ జంట పెళ్లి జరిగింది. ఇక సినీ ప్రముఖుల రాకతో వీరి పెళ్లి వేదిక కళకళలాడింది. అయితే పెళ్లి అనంతరం వీరి ఫొటోలు కూడా చాలా అరుదుగా బయటకు వచ్చాయి. ఇక వీడియోలు అయితే ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణంగా వీరి వివాహ మోహోత్సవాన్ని సంబంధించిన వీడియో, ఫొటోలు హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం నయన్ దంపతులకు భారీగా డబ్బు చెల్లించుకుందట నెట్ఫ్లిక్స్. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేశ్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి పెళ్లి జరిగి నెల రోజులు గడిచిన సందర్భంగా విఘ్నేశ్ వరుసగా పలు పెళ్లి ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ నుంచి పలువురు సినీ ప్రముఖలు పెళ్లికి హాజరై ఆశీర్వదించిన ఫొటోలను విక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇది చూసి సదరు ఓటీటీ సంస్థ నిరాశ వ్యక్తం చేసిందట. ఒప్పందం ప్రకారం స్ట్రీమింగ్కు ముందే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియో షేర్ చేయకూడదట. కానీ విఘ్నేశ్ అసలైన ఫొటోలను షేర్ చేయడంతో వారి పెళ్లి వీడియోను స్ట్రీమింగ్ చేయకూడదని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందని కోలీవుడ్లో టాక్. అంతేకాదు తమ ఢీల్ను రద్దు చేసుకుని, అడ్వన్స్గా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని నెట్ఫ్లిక్స్ నయన్, విఘ్నేశ్లకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో నయన్-విఘ్నెశ్ల పెళ్లీ వీడియో, ఫొటోషూట్లు నిర్వహించారు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు నటుడితో డేటింగ్, సీక్రెట్గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ -
వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్
ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేశ్ శివన్-నయనతార గత నెల అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చెన్నైలోని మహాబలిపురంలో జూన్ 9న గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వీరి పెళ్లి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీ, సూర్య దంపతులతో పాటు కోలీవుడ్కు చెందిన ఇతర హీరోలు, నటీనటులు సందడి చేశారు. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ అయితే ఈ జంట పెళ్లై నెల గడిచిన ఇప్పటికి వీరి పెళ్లి ఫొటోలు కానీ, వీడియోలు కానీ పెద్దగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ వరుసగా తమ పెళ్లి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ ఫొటోలు షారుక్, విజయ్ సేతుపతి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇతర నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. చదవండి: సల్మాన్ ఖాన్ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్స్టర్ లారెన్స్ View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
సీఎంను డైరెక్ట్ చేసిన విఘ్నేశ్ శివన్
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను దర్శకుడు విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేశారు. ఏంటీ నమ్మశక్యంగా లేదా? సీఎం స్టాలిన్ నటించడమేమిటని ఆశ్యర్యపోతున్నారా? ఈ వార్త మాత్రం నిజం. అదేంటో చూద్దాం రండి. తమిళనాడులో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగనున్నాయి. చెన్నై సమీసంలోని మహాబలిపురంలో జరగనున్న ఈ క్రీడల్లో 186 దేశాలకు చెందిన 2 వేలకు పైగా చెస్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రచారాన్ని నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా ఒక ప్రచార చిత్రాన్ని దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ను ఇటీవలే నెప్పియార్ వంతెన వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం. చదవండి: (దూతతో ఎంట్రీ) -
పెళ్లి అనంతరం తొలిసారి షూటింగ్ సెట్లో నయన్ సందడి!
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఆనంతరం థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త దంపతులు నిన్న తిరిగి వచ్చారు. హానీమూన్ నుంచి వచ్చిరాగే నవ వధువు నయన్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టిందట. నయన్ జావాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక హానీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే నయన్ షూటింగ్ కోసం ముంబైలో వాలిపోయిందట. ఈ రోజు జవాన్ షూటింగ్లో నయనతార పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లి అనంతరం తొలిసారి నయన్ షూటింగ్లో పాల్గొని సందడి చేసిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి అనంతరం షూటింగ్ కాస్తా బ్రేక్ ఇస్తుందని అంత అనుకున్నారు. అంతేకాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇక దీనితో పాటు నయన్ తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ మూవీ చేస్తోంది. -
నయనతార- విఘ్నేశ్ హనీమూన్కు ఎక్కడికి వెళ్లారో తెలుసా?
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్కు చెక్కేసింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఓ లగ్జరీ హోటల్లో దిగారు నయన్ దంపతులు. దీనికి సంబంధించిన ఫొటోలను విక్కీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. అలాగే వీరు విమానంలో ప్రయాణించే సమయంలో వారితో కలిసి ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయితే క్షణం తీరిక దొరకదు కాబట్టి ఇప్పుడే జ్ఞాపకాలను కూడబెట్టుకోండి అని సలహా ఇస్తున్నారు అభిమానులు. #WikkiNayan latest click in flight with fan. @VigneshShivN and #Nayanthara for a bangkok,Thailand. pic.twitter.com/sTFhUeK2Ev — NAYANwedsWIKKI🎊 (@kalonkarthik) June 19, 2022 #vacation #Thailand 🫶🏻 #WikkiClicks 📸 pic.twitter.com/Y2cByV4T6g — Nayanthara✨ (@NayantharaU) June 20, 2022 View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) చదవండి: తాప్సీ 'శభాష్ మిథూ' ట్రైలర్ రిలీజ్.. ఆసక్తిగా, ఎమోషనల్గా.. ఆ నటితో సీనియర్ హీరో నరేష్ పెళ్లి ? -
నయన్ పెళ్లిలో షారుక్ ఖాన్, నెట్టింట ట్రోలింగ్
అందమైన ప్రేమకావ్యాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారు నయనతార, విఘ్నేశ్. తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం(జూన్ 9న) నాడు వేదమంత్రాల సాక్షిగా వీరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, కింగ్ఖాన్ షారుక్ ఖాన్ కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా షారుక్ పలువురు సెలబ్రిటీలతో పాటు తన అభిమానులతో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. 'ఓయ్' హీరోయిన్ షామిలీ షారుక్తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ మురిసిపోయింది. చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో ఆరాధిస్తున్న నా ఫేవరెట్ హీరోను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది. ఇందులో షారుక్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు షారుక్ను తిట్టిపోస్తున్నారు కూడా! ఎందుకంటే కరణ్ జోహార్ బర్త్డే పార్టీకి వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని వచ్చిన విషయం తెలిసిందే కదా! అందులో షారుక్ కూడా ఉన్నాడు. కానీ వారం రోజులకే కరోనా నుంచి కోలుకోవడంతో నయన్ వివాహానికి హాజరయ్యాడు. మొన్నే కరోనా వచ్చినా కూడా పెళ్లికి వెళ్లడం అవసరమా? అని పలువురు నిందిస్తున్నారు. కాగా నయనతార, విఘ్నేశ్ తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కుదరకపోవడంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వారికి మాత్రమే కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అందుకోసం అన్నిదానాల్లో కన్నా గొప్పదైన అన్నదానాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షమందికి విందు భోజనం వడ్డించారు. ఇక పెళ్లైన మర్నాడే తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక షారుక్ విషయానికి వస్తే అతడు 'రాజారాణి', 'బిగిల్', 'మెర్సల్' వంటి బ్లాక్బస్టర్ హిట్లు అందించిన తమిళ దర్శకుడు అట్లీతో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న ఈ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు రాజ్కుమార్ హిరానీతో 'డంకీ' మూవీ చేస్తున్నాడు షారుక్. అలాగే మాధవన్ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్', రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' చిత్రాల్లో అతిథిగా కనిపించనున్నాడు. చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న జయమ్మ పంచాయితీ -
పెళ్లవగానే భర్తకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నయన్
అందమైన ప్రేమకావ్యాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారు నయనతార, విఘ్నేశ్. చెన్నైలో జూన్ 9న వేదమంత్రాల సాక్షిగా వీరు వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని వారు మాత్రమే కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అందుకోసం అన్నిదానాల్లో కన్నా గొప్పదైన అన్నదానాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, వృద్ధులకు, అనాధలకు, చిన్నారులకు విందుభోజనం వడ్డించారు. సుమారు లక్షమందికి భోజనం అందించారు. వీరు చేసిన మంచి పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లయిందో లేదో అప్పుడే నయనతార తన భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిందట. ఓ కొత్త బంగ్లాను విఘ్నేశ్ పేరు మీద రాసిపెట్టిందట. దీని విలువ అక్షరాలా రూ.20 కోట్లని సమాచారం. అటు విఘ్నేశ్ కూడా నయన్ పెళ్లిలో సింగారించుకునేందుకు దాదాపు మూడు కోట్ల విలువైన బంగారం కొన్నాడట. దీంతోపాటు రూ.5 కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్ కూడా ఆమె చేతికి తొడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు సైతం నూతన వధూవరులకు కళ్లు చెదిరే బహుమతులిచ్చినట్లు వినికిడి. #WikkiNayanWedding Virundhu for 1000 people at Nallagoundampalayam, Coimbatore 😇❤️#WikkiNayan #NayantharaVigneshShivan pic.twitter.com/7LIa86mJ1M — Wikki Nayan Wedding ❤️ (@Rowdy_Pictures) June 10, 2022 చదవండి: కేరింత నటి సుకృతి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ మేజర్.. పాన్ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు.. కానీ! -
Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’
నూతన దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట.. పెళ్లయిన మరుసటి రోజే దంపతులుగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో నయనతార చెప్పులతో తిరగడం, శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్లో పాల్గొనడం వివాదస్పదమైంది. శ్రీవారిని దర్శించుకునేందు వచ్చిన ఈ కొత్త జంట భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిండంతో వారిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు వీరి తీరుపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై వివరణ ఇస్తూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రెస్నోట్ విడుదల చేశాడు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్నట్లు గుర్తించలేదని లేఖలో పేర్కొన్నాడు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని, తాము తెలియక చేసిన తప్పులను మన్నించాలని కోరాడు. ‘మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మా వివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తరువాత ఇంటికి కూడా వెళ్లకుండా మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చాము. స్వామి వారి కల్యాణోత్సవం సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. శుక్రవారం దర్శనం చేసుకునేందుకు వచ్చాము. దర్శనం అనంతరం మా పెళ్లి తిరుమలలో పూర్తయినట్లు అనిపించేలా ఫోటో తీసుకోవాలని అనుకున్నాము. అయితే ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఆలయం నుంచి వెళ్ళిపోయాము. మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాము. వెంటనే ఫోటోషూట్ పూర్తి చేయాలనే కంగారులో చూసుకొకుండా చెప్పులు ధరించి రావడం జరిగింది. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు ఉన్నట్లు గమనించుకోలేదు. ఇందుకు మనస్ఫూర్తిగా మేమిద్దరం క్షమాపణ కోరుతున్నాం. మాపెళ్లి ఏర్పాట్ల కోసం గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమలకు రావడం జరిగింది. ఎప్పుడూ ఇలా జరగలేదు. మేము ఎంతగానో ప్రేమించే స్వామి వారిపై భక్తి లేకుండా లేదు. తెలియక జరిగిన మా తప్పులకు మేము క్షమాపణలు చెప్తున్నాము. దయచేసి క్షమించండి’ అని విఘ్నేశ్ తన నోట్లో పేర్కొన్నాడు. -
నయనతార దంపతులపై టీటీడీ ఫైర్, నోటీసులు జారీ
వివాహానంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన కొత్త దంపతులు నయతార-విఘ్నేశ్ శివన్లు వివాదంలో చిక్కుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్లో పాల్గొన్నారు. చదవండి: తిరుమల మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయన్ ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించి భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు. దీంతో ఈ నయనతార దంపతుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులకు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ పీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. చదవండి: మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే? అంతేకాదు నయనతార దంపతులతో ఫోన్లో మాట్లాడామని, భక్తుల మనోభావాలు దెబ్బతిసినందుకు నయనతార క్షమాపణలు చెప్పారన్నారు. తెలియక చేసిన తప్పుకు మన్నించమని నయనతార-విఘ్నేశ్లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై టీటీడీ ఈఓ, చైర్మన్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులపై నయనతార దంపతలు స్పందించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. ఇక చివరగా సాంప్రదాయాలు ఉన్నత వ్యక్తులే పాటించాలని ఆయన సూచించారు. -
తిరుమలలో నయనతార దంపతులు (ఫొటోలు)
-
తిరుమల మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయన్
నయనతార- విఘ్నేశ్ శివన్ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు ఈ నూతన దంపతులు నేడు(జూన్ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది. గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ నయన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోషూట్కు తిరుమల ఆలయం వేదికనుకుంటున్నారా? అని ఫైర్ అవుతున్నారు. వెంటనే చేసిన తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమాపణ కోరండని సూచిస్తున్నారు. #WikkyNayan From #Tirupati #Nayanthara #VigneshShivan #Nayantharawedding #NayantharaMarriage pic.twitter.com/Y4SlK813yf — NAYANTHARA FC KERALA (@NayantharaFCK) June 10, 2022 They were soo interested in conducting the wedding in Tirupathi.. now have visited the temple soon after wedding 🙏 ❤️ Uff! Such a believer 🙌 #Ladysuperstar #Nayanthara #Nayantharawedding pic.twitter.com/zAhNHp5hdz — Theladysuperstarclub (@Nayantharian) June 10, 2022 చదవండి: కిన్నెరసాని సినిమా రివ్యూ హీరోయిన్పై అసభ్య కామెంట్స్, పోలీసులకు ఫిర్యాదు -
శ్రీవారిని దర్శించుకున్న నయనతార దంపతులు
హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్బర్డ్స్.. దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. కాగా ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో జరిగిన వీరి వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో కార్తీతో పాటు కోలీవుడ్కు చెందిన దర్శక-నిర్మాతలు సినీ ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన మేనేజర్ పూజా దద్లానీ, డైరెక్టర్ అట్లీతో కలిసి ఈ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. -
Nayanthara-Vignesh Shivan wedding: భారీ ఆఫర్తో ప్రచార హక్కులు
తమిళసినిమా: హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట గురువారం ఒక్కటయ్యింది. స్థానిక మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికైంది. రెండు రోజుల ముందే అంటే మంగళవారం సాయంత్రమే వివాహ వేదికకు చేరుకుని మెహందీ వేడుకలు జరుపుకున్నారు. గురువారం సినీ ప్రముఖుల రాకతో పెళ్లి వేదిక కళకళలాడింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య విఘ్నేష్ శివన్ నయనతార మెడలో మాంగల్యధారణ చేశారు. భారీ ఆఫర్తో నెట్ఫ్లిక్స్ ప్రచార హక్కులు నయనతార, విఘ్నేష్శివన్ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్ప్లిక్స్ సంస్థ రూ.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో 5 రోజుల నుంచే ఈ సంస్థ వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సముద్రతీరంలో అద్భుతమైన అద్దాల మేడలో వివాహ వేదికను తీర్చి దిద్దారు. ఇందుకు ఢిల్లీ, ముంబయిల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. 50 మందికి పైగా బౌన్సర్లు, ప్రైవేటు రక్షకులను రప్పించి వివాహ వేడుక పరిసర ప్రాంతాలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆహ్వాన పత్రిక ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు. పెళ్లికి ముందు విఘ్నేష్ శివన్ ట్వీట్ దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి కొద్ది గంటల ముందు తన ఇన్స్ట్ర్రాగామ్లో ఓ ట్వీట్ చేశారు. అందులో ‘‘ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా జీవితాన్ని నయనతారకు సమర్పించబోతున్నాను. నా బంగారంతో మరి కొద్ది గంటల్లో ఒకటి కాబోతున్నాం అన్న భావనే ఉత్సాహాన్నిస్తోంది..’’అని పేర్కొన్నారు. కాగా తమ వివాహ వేడుక సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, అనాథాశ్రమాలలో లక్షమందికి అన్నదానం కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల ఆశీస్సులు.. ఈ వివాహానికి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ఖాన్, నిర్మాత బోనీ కపూర్ ప్రత్యేకంగా విచ్చేసి నవ దంపతులకు శుభాకాంక్షలు అందించారు. నటుడు రజనీకాంత్, శరత్కుమార్, రాధిక, సూర్య, కార్తీ, విజయ్సేతుపతి, దర్శకుడు మణిరత్నం, గౌతమ్మీనన్, అట్లీ, ఏఆర్ రెహ్మాన్, అనిరుధ్, కుష్భు సుందర్, విక్రమ్ ప్రభు, ఎడిటర్ మోహన్, దర్శకుడు మోహనరాజా, ఐసరి గణేష్, శాలిని అజిత్కుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అత్యంత సన్నిహితులతో పాటు 200 మంది సినీ ప్రముఖులనే నయనతార, విఘ్నేష్ శివన్ ఆహ్వానించినట్లు సమాచారం. -
నయనతార మేడమ్ నా భార్యగా.. విఘ్నేశ్ ఎమోషనల్ ట్వీట్
ఎట్టకేలకు నయనతార, విఘ్నేశ్ శివన్ ఒక్కటయ్యారు. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గురువారం(జూన్ 9) వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. నాను రౌడీదాన్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్ బర్డ్స్ గత లాక్డౌన్లో సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ మధ్య అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన ఈ జంట ఈరోజు తమ జీవితంలో పెళ్లి పుస్తకాన్ని తెరిచారు. ఎంతగానో ఆరాధించే నటుడు రజనీకాంత్ చేతుల మీదుగా అందుకున్న మంగళ సూత్రాన్ని విఘ్నేశ్ తన ప్రియసఖి నయనతార మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ సందర్భంగా విఘ్నేశ్ సోషల్ మీడియాలో తమ ప్రేమ కావ్యాన్ని సింగిల్ లైన్లోనే అద్భుతంగా చెప్పుకొచ్చాడు. 'నయన్ మేడమ్ నుంచి కాదంబరి, కాదంబరి నుంచి తంగమే.. తంగమే నుంచి నా బేబీ, నా బేబీ నుంచి నా ఉయిర్.. నా ఉయిర్ నుంచి కన్మణి, కన్మణి నుంచి ఇప్పుడు నా భార్యగా మారావు' అంటూ లవ్ సింబల్ ఎమోజీలు పెడుతూ పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్తో పాటు వీరి పెళ్లి ఫొటోలు సైతం నెట్టింట వైరల్గా మారాయి. From Nayan mam … to Kadambari … to #Thangamey …. to my baby ….. and then my Uyir … and also my Kanmani ….. and now … MY WIFE 😇☺️😍😘❤️🥰🥰😘❤️😇😇😍😍 #WikkiNayanWedding #WikkiNayan pic.twitter.com/5J3QT71ibh — Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022 ☺️❤️😇 https://t.co/CEsAsCkRnG — Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022 చదవండి: గ్రాండ్గా నయన్-విఘ్నేశ్ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్ -
ఒక్కటైన ప్రేమ జంట.. నయన్-విఘ్నేష్ పెళ్లి ఫొటోలు
-
ఒక్కటైన విఘ్నేశ్-నయన్, పెళ్లి ఫొటో వచ్చేసింది..
అవును, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేశ్ శివన్-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. చెన్నైలోని మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు. On a scale of 10… She’s Nayan & am the One ☝️☺️😍🥰 With God’s grace , the universe , all the blessings of our parents & best of friends Jus married #Nayanthara ☺️😍🥰 #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F — Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022 చదవండి: గ్రాండ్గా నయన్-విఘ్నేశ్ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్ -
గ్రాండ్గా నయన్-విఘ్నేశ్ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం(జూన్ 9) తెల్లవారు జామున 2.22 గంటలకు నయన్-విఘ్నేశ్లు ఏడడుగులు వేశారు. మహాబలిపూరంలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు సైతం హజరైనట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్లు పెళ్లికి హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. చదవండి: ఇకపై అధికారికంగా.. నయన్పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్ రజనీకాంత్ కారు దిగి లోపలికి వెళుతున్న ఫొటోను ఒకటి బయటక రాగా.. పెళ్లిలో క్రిమ్ కలర్ షూట్, వైట్ షర్డ్ ధరించి షారుక్ స్టైలిష్ లుక్లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫొటోను షారుక్ మేనేజర్ పూజా దద్దాని షేర్ చేసింది. షారుక్తో పాటు డైరెక్టర్ అట్లీ కూడా హజరయ్యాడు. అంతేకాదు కోలీవుడ్ చెందిన స్టార్ హీరోలు అజిత్, కార్తీ, విజయ్తో పాటు టాలీవుడ్, శాండల్వుడ్కి చెందిన సినీ సెలబ్రెటీలు సైతం పెళ్లికి హజరైనట్లు సమాచారం. కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ శివన్ నయన్పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే చూడాలని ఆతృతుగా ఎదురు చూస్తున్నానంటూ కాబోయో భార్య గురించి ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు విఘ్నేశ్. అంతేకాదు ఈ సందర్భంగా తన ఆనందాన్ని, ప్రేమను నయన్కు అంకితం ఇస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు విఘ్నేశ్. చదవండి: 200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్ తండ్రి పాత్ర ఇదే! View this post on Instagram A post shared by Atlee (@atlee47) View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) -
ఇకపై అధికారికంగా.. నయన్పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్
ఎట్టకేలకు లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు ఒక్కటి కాబోతున్నారు. అయిదేళ్లుగా రిలేషన్లో ఉన్న ప్రేమ జంట గురువారం ఏడడుగులు వేయబోతున్నారు. ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య(నయనతార) గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. చదవండి: నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్ ‘ఈ రోజు జూన్ 9.. ఇది నయన్ లవ్. థ్యాంక్యూ గాడ్... నా జీవితంలోని అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞతుడిని. ఇప్పుడు, ఇదంత నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై. మన కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదంతో అధికారికంగా నీతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు. తాజాగా ఈ నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ View this post on Instagram A post shared by Hanoosh🧿❤Narin🧿 (@hanaz_worldmusic) -
Its Official: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్. 'నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.' అని తెలిపాడు విఘ్నేష్ శివన్. చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్.. -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
నయన్-విఘ్నేష్ ఆహ్వానం అదిరింది
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్లాన్స్తో బిజీ బిజీగా ఉంటున్నారు. జూన్ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని కూడా పంపించారట. ఆ వీడియో ఇన్విటేషన్ వైరల్గా మారింది. ఈ పత్రిక ప్రకారం నయన–విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పెళ్లి అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్ స్పష్టం చేస్తోంది. ఓ రిసార్ట్లో ఈ వేడుక జరుగుతుందట. కాగా.. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అదిరిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. -
పెళ్లి పనులు షురూ..ఆధ్యాత్మిక పర్యటనల్లో నయన్,విఘ్నేష్ బిజీబిజీ
కోలీవుడ్లో నటి నయనతార, దర్శకుడు వఘ్నేష్ శివన్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లెప్పుడు అన్న విషయంపై మీడియా ఇప్పటికే చాలా కథనాలు అల్లేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నయనతార విఘ్నేష్ శివన్ పళ్లి పీటలు ఎక్కడానికి సమయం ఆసన్నమైంది. జూన్9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారు. అంతకు ముందు పలు గుళ్లు గోపురాలు చుట్టేస్తుండటం విశేషం. ఇటీవల తిరుపతికి వెళ్లి ఏడు కొండలస్వామిని దర్శించుకున్న ఈ జంట సోమవారం తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుని సేవించుకుంది. అనంతరం తంజావూరు జిల్లా అయ్యంపేట సమీపంలోని పళత్తూర్ గ్రామానికి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ కులదైవం కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి పాలు పొంగించి విశేష పూజలు చేశారు. -
నయన్ వద్దంటున్నా వినని విఘ్నేశ్ శివన్, వీడియో వైరల్
సినీ స్టార్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లకు ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఈ మధ్య గుళ్లూ గోపురాలు చుట్టేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. జూన్ 9న తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడడుగులు నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తిరుపతి, షిరిడీ పర్యటనకు వెళ్లి ఇప్పుడు తమిళనాడు, కేరళలోని దేవాలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వారి మధ్య ఉన్న ఆప్యాయతను తెలియజేస్తూ విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. టేబుల్ మీద ఎన్నో రకాల ఐటంస్ ఉన్నాయి. అందులో ఒకటి ట్రై చేయమని విఘ్నేశ్ అడగ్గా నయన్ నో అంటూ తలూపింది. అయినా సరే అతడు మాత్రం భుజం మీద చేయి వేసి బుజ్జగిస్తూ ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. ఆ తర్వాత అతడు తిన్నాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ 'సరిగ్గా తినాల్సిన సమయం ఇదే.. స్థానికంగా దొరికే రుచికరమైన ఆహారాన్ని తనకు తినిపించడంలోనే అసలైన సంతోషం ఉంది. అద్భుతమైన మనుషుల మధ్య రుచికరమైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ప్రేమజంట లవ్కు ఫిదా అవుతుంటే కొద్దిమంది మాత్రం మా సింగిల్స్ ఏమైపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) VigneshShivN and #Nayanthara visited a temple in vazhuthur village. I think it's #VigneshShivan family diety. To give first respect for family diety??????,🧐🧐🧐#WikkiNayan #NayanWikkiWedding pic.twitter.com/H2nIvngH6I — Kanmani❤️Rambo (@kalonkarthik) May 23, 2022 చదవండి 👇 సిస్టర్ క్యారెక్టర్స్లో స్టార్ హీరోయిన్స్.. 11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు -
నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు
Astrologer Predictions Nayanthara Marriage Life: ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ సెలబ్రెటీల గురించిన జోష్యంపై ఆసక్తికర విషయాలను చెబుతు ఉంటారు ఆయన. గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి సమయంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సమంతకు వైవాహిక జీవితం కలిసి రాదని, ఆమె పెళ్లి చేసుకున్న అతి త్వరలోనే భర్తతో విడిపోతుందని జోష్యం చెప్పారు. ఇక చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం వేణు స్వామి చెప్పినట్లుగానే ఆమె జీవితంలో జరిగిందని అందరు చర్చించుకున్నారు. ఇప్పడు తాజాగా ఆయన లేడీ సూపర్ స్టార్ నయన తార పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: ‘ద పీకాక్’ మ్యాగజైన్పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్ అయితే నయనతార-విఘ్నేశ్ శివన్ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్-శివన్లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార వైవాహిక జీవితంపై అస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్ నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన అంటున్నారు. తన జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్ 2024 తర్వాత అంతమైపోతుందని ఆయన పేర్కొన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమంత, నయనతార మధ్య నలిగిన హీరో.. ఆసక్తిగా ట్రైలర్
Kaathu Vaakula Rendu Kaadhal Telugu Trailer Released: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్.' ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ తమిళ ట్రైలర్ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్ను శనివారం (ఏప్రిల్ 23) రిలీజ్ చేశారు. తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజ' టైటిల్తో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు. ట్రైలర్లో ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కామెడీ జోడించి డైరెక్ట్ చేశారు విఘ్నేష్ శివన్. చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్తో పోటీ ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1071263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఇంతకంటే గొప్ప కాంబినేషన్ను ఊహించలేను, వాళ్లతో పని చేయడం నా అదృష్టం’
తమిళసినిమా: అసాధారణ నటీనటులతో పని చేశాను.. అందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అని దర్శకుడు విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. నటుడు విజయ్ సేతుపతి, సమంత, నయనతార కలిసి నటించిన చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్. నిర్మాత లలిత్కుమార్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ కోసం నయనతార, విఘ్నేష్ శివన్ రౌడీపిక్చర్స్ సంస్థ ఫస్ట్కాపీ బేస్లో నిర్మించిన చిత్రం ఇది. దీనికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పాట చిత్రీకరణతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు ట్విట్టర్లో చిత్ర ఫొటోలను పోస్టు చేసి దీన్ని సాధ్యం చేసిన భగవంతుడికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అసాధారణ నటీ నటులతో పని చేశానని, అలాంటి వారు దొరకడం నా అదృష్టం, ఒక దర్శకుడికి కలే అని అన్నారు. ఇంతకంటే గొప్ప కాంబినేషన్ను ఊహించలేనన్నారు. ఉత్తమ నటుడు విజయ్సేతుపతి, అందమైన ప్రొఫెషనల్ నటి నయనతార, ప్రతిభావంతమైన నటి సమంత వీళ్లంతా ఈ చిత్రాన్ని అద్భుతంగా నడిపించారని అన్నారు. చిత్రాన్ని ఈనెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: Sai Pallavi : కూలీగా మారిన స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్ -
అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: సమంత
Samantha Ruth Prabhu Kaathuvaakula Rendu Kaadhal Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన తాజా చిత్రాల్లో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా గురించి కొత్త అప్డేట్ ఇచ్చింది సామ్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే మూవీ రిలీజ్ డేట్ను కూడా చెప్పేసింది. 'మీరంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంకొన్ని రోజులే ఉన్నాయి. ఏప్రిల్ 28న విడుదల కానుంది.' అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్కు సినిమాలోని కొన్ని సన్నివేశాలతోపాటు షూటింగ్ ముగింపు వేడుక ఫొటోలను పంచుకుంది. విజయ్ సేతుపతిని పట్టుకుని నయన తార, సమంత వేలాడి ఉండటం ఆకట్టుకుంటుంది. చదవండి: సమంత 'యశోద'కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'కాతువాకుల రెండు కాదల్' సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది ఈ చిత్రం. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాగా సమంత యశోద, శాకుంతలంతోపాటు హాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ డైరెక్షన్లో మరో మూవీ చేయనుంది సామ్. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత