Simbu
-
కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
పల్లెటూరి నుంచి వచ్చి ఎన్నో పాట్లు పడి సినిమా తీసి నిలదొక్కుకున్నవారెందరో. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (Suseenthiran) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. సినిమా తీయాలన్న లక్ష్యంతో 18 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్నాడు. కష్టాలకు ఓర్చుకున్నాడు. ఎదురుదెబ్బలకు వణికిపోకుండా నిలబడ్డాడు. పన్నెండేళ్ల ప్రయత్నాల తర్వాత తొలి సినిమా తీశాడు. వెన్నెల కబడ్డీ కుజు దర్శకుడిగా అతడి తొలి చిత్రం. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో మరుపటి ఏడాది కార్తీ- కాజల్తో కలిసి నాన్ మహాన్ అల్లా మూవీ తీశాడు. ఇది మరింత హిట్టు.సహజమైన కథలతో..అళగర్సామిన్ కుదిర, ఆదలాల్ కాదల్ సెవీర్, పాండ్య నాడు, జీవా, పాయుం పులి వంటి హిట్ చిత్రాలు తీశాడు. కొన్నిసార్లు అపజయాలతోనూ ప్రయాణం సాగించాడు. అయితే లేనిపోని హీరోయిజం, లాజిక్ లేని సీన్స్కు దూరంగా ఉంటూ తన కథలు సహజంగా ఉండేలా చూసుకున్నాడు. ఇతడు 2021లో శింబు (Silambarasan TR)తో ఈశ్వరన్ తీశాడు. నిజానికి ఈ కథ హీరో జై కోసం రాసుకున్నాడట!కథ బాలేదని ఛీ కొట్టిన హీరోకానీ శింబు తనతో ఓ సినిమా చేయమని కోరడంతో ఈ కథ అతడికి వినిపించాడు. అయితే కథ అస్సలు బాగోలేదంటూ శింబు ఉమ్మేశాడట! దీంతో కథను శింబుకు తగ్గట్లుగా మార్చేశానని దర్శకుడు సుశీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త వైరలవుతోంది. ఇకపోతే ఈశ్వరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. శింబు విషయానికి వస్తే పాదు తల (2023) సినిమాలో చివరిగా కనిపించాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది? -
ఇండస్ట్రీ ప్లే బాయ్తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'
సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం. కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్లైన్ కూడా ఆయనకు ఉంది. నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయంటూ కోలీవుడ్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. -
క్రేజీ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి!
హీరోయిన్ మీనాక్షీ చౌదరి కెరీర్ జెట్ స్పీడ్తో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మీనాక్షి నటించిన ఇతర చిత్రాలు ‘లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, మట్కా’ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్కు ముస్తాబు అవుతున్నాయి. ఇక తాను హీరోయిన్గా కమిటైన సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తి కావడంతో మీనాక్షీ చౌదరి కొత్త సినిమాలు సైన్ చేసేందుకు కథలు వింటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ విన్నారట మీనాక్షి. కథ నచ్చడంతో శింబు హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లో కూడా మీనాక్షీ చౌదరి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపిస్తారు. -
యువన్ శంకర్రాజా బిగ్ ప్లాన్.. డైరెక్టర్గా ఎంట్రీకి లైన్ క్లియర్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అతి కొద్దిమందిలో యువన్ శంకర్రాజా ఒకరు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడైన ఈయన ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ మారారు. అందులో నటుడు హరీశ్ కల్యాణ్ కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత విజయ్సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన గోట్ చిత్రం కమర్శియల్గా మంచి విజయాన్ని సాధించింది. మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన భేటీలో ఆయన పేర్కొంటూ త్వరలో మోగాఫోన్ పట్టనున్నట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో నటుడు శింబును కథానాయకుడిగా నటింపజేస్తానని చెప్పారు. ఈయనకు నటుడు శింబుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి శింబు ఒకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. నటుడు శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ పిలింస్ పతాకంపై నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తరువాత యువన్శంకర్రాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి. -
తమిళ 'బిగ్బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్గా సక్సెస్ఫుల్గా నడిపారు. కమల్ ఇమేజ్తో ఈ షో పట్ల కోలీవుడ్లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు
తమిళంలో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న శింబు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు అంటే వివాదాలు, వివాదాలు అంటే శింబు అనే రీతిలో ఉంటుంది. ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్ కూడా శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నిర్మించనున్న 'కరోనా కుమార్' చిత్రంలో నటించడానికి కమిట్ అయిన శింబుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన మూవీలో నటించడం లేదని, తన చిత్రాన్ని పూర్తి చేసే వరకు ప్రస్తుతం శింబు చేస్తున్న 'థగ్ లైఫ్' మూవీలో నటించకుండా నిషేధించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)దీంతో శింబుపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన శింబు.. తాను కమలహాసన్ 'థగ్ లైఫ్'లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను చాలా నిజాలు మాట్లాడానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని పేర్కొన్నారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. కాగా కమల్ హాసన్తో కలిసి నటిస్తూనే ఈయన నిర్మిస్తున్న మరో మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్చరణ్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే -
తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
రీసెంట్ టైంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..
హీరో శింబు సినిమాలు జయాపజయాలకు అతీతంగా మినిమమ్ వసూళ్లు సాధిస్తాయి. అందుకే నిర్మాతలు ఈయనతో చిత్రాలు చేయడానికి క్యూ కడతారు. ఆ మధ్య మానాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శింబు, ఆ తరువాత వెందు నిందదు కాడు చిత్రంతోనూ హిట్ కొట్టారు. ఆ తరువాత నటించిన పాత్తు తల చిత్రం నిరాశపరచింది. కాగా త్వరలో కమల్ హాసన్ బ్యానర్లో దేశింగు పెరియసామి దర్శకత్వంలో నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. థగ్లైఫ్ మూవీలోప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే పోస్టర్ కూడా రిలీజైంది. ప్రస్తుతం ఇతడు ఆ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో థగ్లైఫ్ చిత్రంలో శింబు నటించరాదని నిర్మాత ఐసరి గణేశ్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్మాదు చేశారు. రూ.4 కోట్లు అడ్వాన్స్అందులో ఆయన తాను వెందు తనిందదు కాడు చిత్రం తరువాత శింబు హీరోగా కరోనా కుమార్ అనే చిత్రాన్ని గోకుల్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నానని తెలిపారు. అందుకు గానూ ఆయనకు రూ.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.4 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం శింబు తన చిత్రంలో నటించడం లేదని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు ఎక్కడా నటించొద్దుసెప్టెంబరు 19వ తేదీలోగా రూ.1 కోటితో కూడిన అనుమతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని, లేని పక్షంలో ఇతర చిత్రాల్లో నటించడానికి నిషేధం విధించనున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. కాబట్టి తన చిత్రాన్ని పూర్తి చేసే వరకూ శింబు థగ్లైఫ్ చిత్రంలో నటించరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే థగ్లైఫ్ చిత్రంలో నటిస్తున్న శింబు ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. -
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
సూపర్ హిట్ డైరెక్టర్తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మృణాల్ ఠాకూర్ ఏ హీరోకు ఎస్ అంటుందో?
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
శింబు సినిమాలో కమల్ హాసన్?
తమిళ సినిమా: సంచలన నటుడు శింబు ప్రస్తుతం తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని విశ్వనటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దేశింగు పెరియసామి కళ, దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. పిరియాడికల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు కుంగ్ఫు హాస్టల్ ఆత్మ రక్షణ విద్యల్లో శిక్షణ పొందడంతో పాటు తన శారీరక భాషను పూర్తిగా మార్చుకున్నాడు. మరో విషయం ఏమిటంటే శింబు ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా, ప్రతినాయ కుడిగా నటించనుండడం మరో విశేషం. ఇందులో ఆయన సరసన నటి కీర్తి సురేష్, మృణాల్ ఠాగూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా శింబు 48 చిత్ర అప్డేట్ ఏమిటంటే కమలహాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి. చిత్ర షూటింగ్ మార్చి నెల రెండో వారంలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. ఇది శింబు అభిమానులకు పండగ చేసుకునే వార్తే అవుతుంది. కాగా ఇందులో నటించే వారి వివరాలు త్వరలో వెలుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కెరీర్ ఖతం అన్నారు.. కానీ ఎట్టకేలకు హీరోయిన్గా ఓ ఛాన్స్!
పూజా హెగ్డే.. అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో తదితర చిత్రాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఛాన్సుల్లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కానీ ఈమెకు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ప్రముఖ తమిళ హీరో శింబు ప్రస్తుతం దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తున్నారు. శింబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసమే శింబు.. లండన్కు వెళ్లి మరీ కరాటే, మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, కీర్తీ సురేశ్ నటిస్తారని టాక్ నడిచింది. కానీ కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ కాగా మరో కథానాయికగా పూజా హెగ్డేకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) -
స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?
'హనుమాన్' సినిమా చూశారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరూ అద్భుతంగా చేశారు. అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి.. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వివాహంపై రూమర్స్ వచ్చాయి. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్) అసలేం జరిగింది? వరలక్ష్మి.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. తండ్రిలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె గతంలో విశాల్తో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం పక్కనబెడితే ఇప్పటికీ వీళ్లిద్దరూ సింగిల్గానే ఉండిపోయారు. నిజమెంత? ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ధనుష్తో పెళ్లి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో శింబుతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మిలానే శింబు కూడా సింగిల్గా ఉండటంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది. హీరో, విలన్.. అన్నీ ఒక్కడే అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్వీన్తో.. హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్ -
బాహుబలి సినిమాకు ధీటుగా శింబు మూవీ!
జయాపజయాలను లెక్క చేయకుండా ముందుకుసాగే హీరోల జాబితాలో శింబు పేరు కచ్చితంగా ఉంటుంది. మానాడు చిత్రం తర్వాత ఈయనకు సరైన హిట్ లేదనే చెప్పాలి. వెందు తనిందదు కాడు చిత్రం ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత నటించిన పాత్తుతల చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినా శింబు చిత్రం వస్తుందంటే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా శింబు తాజాగా తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనుండటం విశేషం. రజనీ నుంచి శింబుకు దీనికి దేశింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇది ఈయన సూపర్స్టార్ రజనీకాంత్ కోసం తయారు చేసుకున్న కథ అని సమాచారం. కానీ తర్వాత దీన్ని శింబు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం శింబు కొత్తగా మేకోవర్ అవుతున్నారు. గత కొన్ని నెలల క్రితమే విదేశాలకు వెళ్లి కరాటే, కుంగ్ఫూ వంటి ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ పొంది వచ్చారు. ఈ చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకుంటున్నారు. లుక్కు మార్చేశాడు బాగా స్లిమ్గా తయారవడంతోపాటు పొడవైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తిగా మారిపోయారు. తాజా సమాచారం ప్రకారం ఇది బాహుబలి చిత్రానికి దీటుగా భారీస్థాయి చారిత్రక కథాచిత్రంగా ఉంటుందట. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ చిత్రం గురించి అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: కొత్త కండీషన్లు పెడుతున్న రైతుబిడ్డ! గర్వం తలకెక్కిందా? -
శింబు సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్
సౌత్ ఇండియాలో సంచలన నటుడుగా ముద్ర వేసుకున్న శింబు.. కొత్త చిత్రాల విషయంలో వేగం పెంచాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన నటించిన వెందు తనిందదు కాడు (లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది. తదుపరి కరోనా కుమార్ అనే చిత్రంలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం శింబు రాజ్కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించనున్న చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. నటుడు రజనీకాంత్ నటించాల్సిన కథలో శింబు నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు ఇంతకు ముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన మానాడు చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా దానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న 68వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఈ చిత్రం పూర్తి అయిన తరువాత మానాడా–2 ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!
స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు? జరిగింది ఇదే తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) ఎందుకు గొడవ? అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ మిస్ ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) -
ఈ ఫొటోలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో కనిపెట్టారా?
చాలామంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. ఈ కుర్రాడికి మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారు. కలిసి సినిమాలు చేయడం లేటు.. ఆ బ్యూటీతో ఎఫైర్ పెట్టుకున్నాడనే రూమర్స్ వస్తాయి. అవి నిజమనేలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి. ఆ హీరో చిన్నప్పటి ఫొటో ఇప్పుడు ఒకటి వైరల్ అయింది. మరి అతడెవరో కనిపెట్టారా? పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి తండ్రి యాక్టర్ కమ్ డైరెక్టర్. దీంతో చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 17 ఏళ్ల పాటు పలు సినిమాల్లో నటించాడు. అవును మీరు ఊహించింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు హీరో శింబు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు మనోడు బాగానే తెలుసు. 'మన్మథ', 'వల్లభ' చిత్రాలతో అప్పట్లోనే తెలుగులో పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ఆ సక్సెస్ని నిలబెట్టుకోలేకపోయాడు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) 2002లో హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన శింబు.. 2004లో 'మన్మథ', 2006లో 'వల్లభ' లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో హిట్స్ కొట్టాడు. 2010లో 'ఏ మాయ చేశావె' తమిళ రీమేక్తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే శింబు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ తమిళంలో అంతంత మాత్రంగానే ఆడేవి. ఇక్కడ అసలు రిలీజయ్యేవి కావు. దీంతో తెలుగు ఆడియెన్స్కి శింబు మెల్లగా దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మళ్లీ 'మానాడు', 'పాతు తలా' చిత్రాలతో విజయాలు అందుకుని.. సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు. సినిమాల గురించి పక్కనబెడితే కెరీర్ ప్రారంభంలో నయనతారతో రిలేషన్ మెంటైన్ చేశాడు. శింబు-నయన్ ముద్దులు పెట్టుకున్న ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. ఇలా చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు తెగ రూమర్స్ వచ్చాయి. ఓ దశలో నిధి అగర్వాల్ని శింబు పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ అది ఇప్పటికే రూమర్ గానే మిగిలిపోయింది. అలాంటి శింబు చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ విషయాల్ని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
మణిరత్నంతో మళ్లీ..
ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (2018) (తెలుగులో ‘నవాబ్’) సినిమాలో శింబు ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కమల్–మణిరత్నం కాంబో సినిమాలో శింబు నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్లో 1987లో ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వచ్చిన సంగతి తెలిసిందే. -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానికి కోలీవుడ్లో మరో చాన్స్ తలుపు తట్టిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్లో సత్తాచాటిన ఈమె ఇప్పటికే తమిళంలో నటుడు సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సమకాలీన కథలో చారిత్రక అంశాలను జోడించి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే నటి దిశా పటానికి మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. కమలహాసన్ తన రాజ్ కుమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించే చిత్రం చోటుచేసుకుంది. దీన్ని కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి తెరకెక్కించనున్నారు. వచ్చేనెల ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కినున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో శింబుతో జతకట్టే నటి ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది భారీ బడ్జెట్లో రూపొందనున్న పాన్ ఇండియా కథాచిత్రం కావడంతో బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. అయితే ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో చిత్ర వర్గాలు వేరే నటిని ఎంపిక చేసే పనిలో పడ్డట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కమల్ మాస్టర్ ప్లాన్ శింబు కోసం దీసికకు 30 కోట్లు
-
Simbu: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, శింబు మూవీలో కీర్తి సురేశ్!
అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం సహజమే. హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలోనూ ఇదే జరుగుతోందనిపిస్తోంది. కోలీవుడ్లో కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె ఆ తరువాత టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మహానటి చిత్రంతో అందరి అభినందనలు అందుకున్న కీర్తిసురేశ్ ఆపై వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఒకటి, రెండు చిత్రాలే చేతిలో ఉండగా ఇప్పుడు మళ్లీ తమిళంలో బిజీ అవుతోంది. జయం రవి సరసన సైరన్, ఉదయనిధి స్టాలిన్తో మామన్నన్లతో పాటు రఘు తాతా, రివాల్వర్ రీటా చిత్రాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్ తాజాగా మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్లు సమాచారం. కమల్హాసన్.. విక్రమ్ చిత్రం విజయం సాధించిన తరువాత ఆయన బిజీగా మారిపోయారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నటుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. అదే విధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంచలన నటుడు శింబు హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఇందులో జంటగా బాలీవుడ్ సంచల నటి దీపిక పదుకొనేను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు, అయితే ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం. దీంతో తాజాగా శింబుకు జంటగా కీర్తి సురేశ్ను ఎంపిక చేయడానికి చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: Jr NTR: ఆ డైలాగ్స్ వింటే పూనకాలే! -
శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్కి దిమ్మతిరిగిపోయిందట
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో దీపికా పదుకొణె ఒకరు. ఈమె ఇటీవల షారూఖ్ఖాన్తో జత కట్టిన పఠాన్ చిత్రంలో మోతాదుకు మించిన అందాలను ఆరబోసి కుర్రకారు మతులను పోగొట్టింది. ఈ సంచలన నటి ఇంతకుముందు కోలీవుడ్లో రజనీకాంత్కు జంటగా కోచ్చడయాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు శింబుకు జంటగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. శింబు నటించిన తాజా చిత్రం పత్తుతల ఇటీవల తెరపైకి వచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ఆయన తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు కమలహసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇందులో కథానాయకిగా దీపికా పదుకొణెను ఎంపిక చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అందులో భాగంగా శింబు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా కథ నచ్చిందని, తాను నటించడానికి సిద్ధం అని చెప్పిందట. అయితే తన పారితోషికం మాత్రం రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా తాను షూటింగ్కు వస్తే ఫైవ్స్టార్ హోటల్లో బసచేస్తానని, ఆ హోటల్లో తాను బస చేసే అంతస్తు మొత్తం తనకే కేటాయించాలని కండిషన్ పెట్టి చిత్ర యూనిట్కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. దీపికా పదుకొణె డిమాండ్ చేసిన పారితోషికం నయనతార పారితోషికం కంటే 3 రెట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు మరో హీరోయిన్ను ఎంపిక చేయాలనే ఆలోచనలో శింబు చిత్ర వర్గాలు ఉన్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత తెలియాల్సి ఉందన్నది గమనార్హం. -
శింబుతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె
హీరో శింబుతో జతకట్టడానికి బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె సై అంటుందా? ప్రస్తుతం కోలీవుడ్లో జరుగుతున్న చర్చ ఇదే! శింబు ఇటీవల నటించిన మానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. అయితే తాజాగా గ్యాంగ్స్టర్ పాత్రలో నటించిన పత్తుతల చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ కథకు మొదట రజనీకాంత్ను హీరోగా అనుకున్నారు. అనివార్య కారణాలతో అది మిస్సైంది. దీంతో అదే కథతో శింబు హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇటీవల యాక్షన్ సన్నివేశాలతో పాటు, అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోసిన పఠాన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాంటి బ్యూటీ ఇప్పుడు శింబుతో రొమాన్స్ చేయడానికి సై అంటుందా అన్నదే చర్చ. శింబు కంటే చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ దీపిక. అయితే ఇక్కడ నిర్మాత కమల్ హాసన్ కావడంతో ఆమె శింబుతో నటించే అవకాశాలే ఎక్కువగా ఉంటుందని సమాచారం. అలాగే ఇందులో కమల్ హాసన్ గౌరవ పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జూన్లో సెట్ పైకి వెళ్లనుంది. కాగా దీపిక పదుకొనే ఇంతకుముందు కోలీవుడ్లో రజనీకాంత్ సరసన కొచ్చాడయాన్ యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! చదవండి: ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం, నటి అరెస్ట్ -
కామెడీ కథలో శింబు
మానాడు చిత్రంతో రీచార్జ్ అయిన నటుడు శింబు. ఆ తరువాత ఆయన నటించిన వెందు తనియందది కాడు చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఇటీవల విడుదలైన పత్తుతల చిత్రం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సంచలన నటుడు శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. శింబు తాజాగా కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్ర ఫేమ్ దేసింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. కాగా దీనికి ముందు శింబు మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావాల్సింది. అనివార్య కారణాల వల్ల శింబు ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేశారు. దీనికి బదులుగా మరో చిత్రం చేస్తానని నిర్మాత ఐసరిగణేష్కు ఆయన మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో దర్శకుడు గోకుల్, నటుడు విజయ్సేతుపతిని ఇందులో నటింపజేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా నటుడు ఆర్జే బాలాజీ, తాజాగా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా శింబు మళ్లీ కరోనా కుమార్ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఆయన నటించే 48వ చిత్రం అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. నటుడు శింబు -
సినిమాలోనే కాదు జీవితంలోనూ నాకు తోడు లేదు: హీరో
శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పత్తు తల. ఆ మధ్య వరుస ప్లాప్లతో సతమతమైన ఈయన మానాడు చిత్రం విజయంతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. కాగా జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థ,పెన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన చిత్రం పత్తు తల. దీనికి చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటుడు గౌతమ్ కార్తీక్, నటి ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పత్తు తల చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఇందులో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ చిత్రంలోని రెండు పాటలు వేదికపై పాడడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని అక్కరైయిల్ అనే పాటను శింబు పాడాల్సి ఉందని, అయితే ఆయన థాయిలాండ్ వెళ్లడంతో తానే ఆ పాటను పాడానని చెప్పారు. మొదట్లో ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథన్, కె.మహదేవన్ తదితరుల వద్ద పనిచేశానని, అయితే టి. రాజేందర్ వర్కు చూసి అప్పటి వరకు ఇన్ట్రోవర్ట్గా ఉన్న తాను ఎక్స్ట్రోవర్ట్గా మారానన్నారు. అందుకే ఆయన తనకు ఇన్స్పరేషన్ అని చెప్పారు. నటుడు శింబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రారంభించే ముందు తాను చాలా కష్టాల్లో ఉన్నారన్నారు. అప్పుడు రాజా ఫోన్ చేసి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు తాను ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు రాను అని చెప్పానన్నారు. అయితే పది రోజుల తర్వాత మళ్లీ ఆయనే ఫోన్ చేసి పత్తు తల చిత్రం చేద్దామని చెప్పారన్నారు. ఇది కన్నడ చిత్రం అన్నారు. ఈ చిత్రం తనకు సక్సెస్ ఇవ్వకపోయినా గౌతమ్ కార్తీక్కు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానన్నారు. తనకు ఏఆర్ రెహమాన్ గాడ్ ఫాదర్ లాంటివారని పేర్కొన్నారు. ఆయనకు తనపై ఉన్న ప్రేమాభిమానాలను కాపాడుకుంటానన్నారు. తన ఆధ్యాత్మిక చింతనకు ఆయనే గురువని పేర్కొన్నారు. కాగా తనకు ఈ చిత్రంలోనూ తోడు లేదు, లైఫ్ లోనూ తోడు లేదని అన్నారు. ఇప్పుడు తాను ఇంతకుముందులా కాదని వేరే లెవెల్లో వచ్చానని అన్నారు. ఏఆర్ రెహమాన్ సినిమా లైట్మెస్ సహాయార్థం నిర్వహిస్తున్న సంగీత విభావరి యాప్ను శింబు చేతుల మీదుగా ఈ వేదికపై ఆవిష్కరించారు. -
రజనీ స్కిప్ట్తో శింబు మూవీ?
తమిళ సినిమా: నటుడు శింబు.. ప్రస్తుతం పత్తుతల చిత్రంలో నటిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది కన్నడ చిత్రం మట్టికి రీమేక్ కావడం గమనార్హం. ఇందులో శింబు గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శింబు తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఇంతకు ముందు ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన వెందు తనిందదు కాడు చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఐసరి గణేష్ వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందని సమాచారం. ఇకపోతే ఇంతకు ముందు కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన దేసింగు పెరియసామి తదుపరి రజినీకాంత్ కోసం కథను సిద్ధం చేసుకున్నారు. ఆయన్ని కలిసి కథను వినిపించారు. రజనీకాంత్ కూడా కథా నచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఆయన దేసింగు పెరియసామిని పక్కన పెట్టి బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్కు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రమే నిర్మాణంలో ఉన్న జైలర్. దీంతో ఎప్పటికైనా రజనీకాంత్తో చిత్రం చేస్తానని చెప్పిన దేసింగు పెరియసామి తాజాగా శింబు హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. శింబు హీరోగా చేసే చిత్రం రజినీకాంత్కు చెప్పిన కథా లేక వేరేనా అన్న చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నయనతార, హన్సిక పెళ్లైపోయింది, నెక్స్ట్ శింబునే? ఇదిగో క్లారిటీ!
హీరో శింబు పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో నయనతార, హన్సికతో లవ్వాయణం చేసిన ఈ హీరో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో తాను కూడా వివాహం చేసుకుని సెటిలైపోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇదంతా వుట్టి పుకారేనని తెలుస్తోంది. శింబు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని హీరో మేనేజర్ స్పష్టం చేశాడు. 'శ్రీలంకకు చెందిన అమ్మాయితో శింబు ఏడడుగులు వేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. దయచేసి పెళ్లి వంటి వ్యక్తిగత విషయాల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. నిజంగా వివాహానికి రెడీ అయినప్పుడు అందరికంటే మేమే మొదటగా ఆ న్యూస్ షేర్ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో శింబు పెళ్లి వార్తలకు చెక్ పడినట్లైంది. చదవండి: అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి భర్త కన్నుమూసిన వార్డులోనే కళాపతస్వి భార్య కూడా.. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే!
హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే కాదు, సింగర్గా, సంగీత దర్శకుడిగా, రైటర్గా కూడా శింబుకి గుర్తింపు ఉంది. మల్టీ టాలెంటెడ్గా హీరోగా తమిళ నాట విపరీతమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న శింబు హీరోయిన్స్తో లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పట్లో నయనతార, హన్సికలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ శింబు పెళ్లంటూ వార్తలు రాగా వాటిలో నిజం లేదని తేలింది. ఈసారి మాత్రం శింబు పెళ్లి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు వధువుకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ తాజ బజ్ ప్రకారం.. కోటీశ్వరురాలైన శ్రీలంకన్ అమ్మాయితో శింబు త్వరలో ఏడడుగు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో శింబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయి ఓ మెడికల్ స్టూడెంట్ అని, శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని తెలుస్తోంది. ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయట. అయితే ఆ అమ్మాయి శింబుకు పెద్ద అభిమాని అని, ఇదే క్రమంలో ఓ సారి శింబును కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఎర్పడిందట, అది కాస్తా ప్రేమగా మారినట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకుంటున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్కు రెడీ అయితే ఆయన తండ్రి డి. రాజేంద్రన్ శింబు పెళ్లిపై గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శింబు పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో ఆయన ఫ్యాన్స్ అంత ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శింబు నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. -
హీరోతో లవ్ బ్రేకప్.. పెదవి విప్పిన హన్సిక!
హీరోయిన్ హన్సిక మొత్వానీ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ను పెళ్లాడింది. డిసెంబర్ 4న గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందడి హాట్స్టార్లో లవ్ షాదీ డ్రామా పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. సోహైల్కు ఇది రెండో వివాహం కాగా హన్సికకు ఇది రెండో లవ్.. అర్థం కాలేదా? గతంలో ఈ బ్యూటీ శింబుతో డేటింగ్ చేసింది. కొంతకాలం బాగానే ఉన్న ఈ లవ్ బర్డ్స్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ విషయాలను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వేరేవారికి ఎస్ చెప్పడానికి నాకు ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమను నమ్ముతాను, కానీ రొమాంటిక్ పర్సన్ అయితే కాదు. అంత ఈజీగా అన్ని ఎమోషన్స్ను వ్యక్తపరచలేను. నాతో కలకాలం ఉండాలనుకుంటున్న వ్యక్తికి ఓకే చెప్పడానికి నేను చాలా సమయమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్షిప్ విచిత్రంగా సాగింది. అయినా ఇప్పుడది ముగిసిన కథ' అని చెప్పుకొచ్చింది. కాగా సోహైల్ మొదటి పెళ్లి పెటాకులవడానికి కూడా హన్సికే కారణమంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పేరెంట్స్కు చెన్నైలో లగ్జరీ ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ధనుష్ -
నెట్టింట వైరల్గా మారిన శింబు లేటెస్ట్ సాంగ్..
సంచలనానికి మారుపేరు నటుడు శింబు. ఈయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా అభిమానులు మాత్రం తలకెక్కించుకుంటారు. ఇకపోతే శింబు ఇటీవల వరుస విజయాలతో మంచి జోరులో ఉన్నారు. మహానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా పత్తు తల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నటి ప్రియా భవాని శంకర్ కథానాయకి. గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్ర పోషించారు. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియో సంస్థలు నిర్మిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా తాజాగా శింబు 40వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల్లో పండగ వాతావరణమే నెలకొంది. శింబు ఫొటోలతో ఎస్టేక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొత్తుల చిత్రంలోని నమ్మి సత్తం అనే లిరికల్ వీడియోను ఏఆర్ రెహా్మన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. -
Recap 2022: స్టార్స్కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్ హీరోలు
ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’, బాలీవుడ్ చిత్రం రణ్బీర్ కపూర్ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్బీర్, ఆలియా జంటగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది. (చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్) అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్తో ఆడియన్స్కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్రాజ్ టైటిల్ రోల్ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేశ్బాబు. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్ ‘బాద్షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజైన సంగతి తెలిసిందే. (చదవండి: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు) మరోవైపు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ అందించిన ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజైంది. ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై ఇప్పటికే ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్ ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్కు నాని వాయిస్ ఓవర్ అందించారు. సోనీ లివ్లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్కు హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రానుంది. పాటల సందడి.. ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’లోని ‘బుల్లెట్ సాంగ్’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు. రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’ థీమ్ సాంగ్ కూడా శింబు గొంతు నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్లా’. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ యాక్టింగ్కు గుడ్బై! ప్రొడక్షన్లోకి ఎంట్రీ?
తమిళసినిమా: కేజీఎఫ్, కేజీఎఫ్ – 2 సినిమాల తరువాత కన్నడ చిత్ర పరిశ్రమలో పేరు మోగుతున్న చిత్ర నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్స్. దక్షిణాది భాషల్లో చిత్ర నిర్మాణం చేపడుతామని అధికారికంగా ప్రకటించిన ఆర్ సంస్థ అధినేత విజయ్ కిరగందర్ ఇప్పటికే టాలీవుడ్లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సలార్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సంస్థ కోలీవుడ్లోనూ చిత్రాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. 'ఇందులో నటుడు శింబు కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా ఈ సంస్థలో నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం అని సమాచారం. దీనికి దర్శకుడు ఎవరు..? తదితర వివరాలు ఇంకా వెలువడ లేదు.కాగా ప్రస్తుతం నటి కీర్తి సురేష్ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. నానితో జత కట్టిన దసరా చిత్రం, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు షటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటున్నాయి. మరోపక్క కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంకో పక్క ఆమె చిత్రం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీటన్నిటిపై స్పష్టత రావాలంటే కీర్తి సురేష్ స్పందించాల్సిందే. -
తమిళ స్టార్ శింబు నోట మరో తెలుగు పాట
తమిళ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని తనకంటూ కొంతమంది అభిమానులను సాధించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా శింబు లో మంచి సింగర్ కూడా ఉన్నాడు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం పాట పాడనున్నాడు శింబు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న ‘18పేజిస్’ ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేసారు. ఆ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెరగడం వలన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు చిత్రబృందం. అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో శింబు తో ఈ చిత్రంలో పాట పాడించనున్నారట. ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా కి ‘డైమెండ్ గర్ల్’, మంచు మనోజ్ పోటుగాడికి కి ‘బుజ్జి పిల్ల’.. యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి ‘బుల్లెట్ సాంగ్’ ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు’ అనే పాటను పాడనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23 విడుదల కానుంది. -
తమిళ ఇండస్ట్రీకి మంచిరోజులొచ్చాయి : హీరో శింబు
తమిళసినిమా: తమిళ సినిమాకు మంచిరోజులు నడుస్తున్నాయి అని అన్నది ఎవరో తెలుసా? ఇంకెవరు సంచలన నటుడు శింబు. ఈ మాట ఆయనకే వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన శింబుకు మానాడు చిత్రం ఊపిరి పోసింది. ఆ తరువాత ఆయన నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. బాలీవుడ్ భామ సిద్ధిసిద్నానీ నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత సెప్టెంబర్ 15న విడుదల చేసింది. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందననే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా చిత్ర యూనిట్ను ఖుషి చేసింది. ముఖ్యంగా శింబు ఖాతాలో మరో హిట్ చిత్రంగా నమోదు కావడంతోపాటు నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్తో రూపొందిన వెందు తనిందదు కాడు చిత్రం రూ.60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా చిత్ర అర్ధ శతదినోత్సవం వేడుకను బుధవారం సాయంత్రం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు శింబు మాట్లాడుతూ ఇప్పుడు తమిళ సినిమాకే గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని అన్నారు. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం నుంచి మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్, కన్నడ చిత్రం కాంతార నుంచి ఇటీవల విడుదలైన లవ్ టుడే చిత్రం వరకు ఉన్న అన్ని చిత్రాలు మంచి ఆదరణ పొందాయన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించాలనే కోరిక తో వస్తున్న దర్శకుల కలలను సాకారం చేసేలా తమిళ సినిమా వారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను తన ఇమేజ్కు భిన్నంగా ముత్తు పాత్రగా మారి నటించిన గ్యాంగ్ స్టార్ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, ఘన విజయాన్ని అందించారన్నారు. నిర్మాత ఐసరి గణేష్ చిత్రాన్ని భారీగా నిర్మించారని, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత సంస్థ లాంటిదన్నారు. గౌతమ్ మీనన్ చిత్రాన్ని కొత్తగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. తను కోరగానే చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించిన ఉదయనిధి స్టాలిన్కు ధన్యవాదాలు అన్నారు. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా ఇందులో పనిచేసిన నటీనటులు సాంకేతిక వర్గాన్ని గౌరవించాలని భావించినట్లు నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఉదయనిధి స్టాలిన్, ఆర్కే సెల్వమణి, ఉదయకుమార్, అరుళ్ మణి, ధనుంజయ్, శరత్ కుమార్, రాధిక పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరోయిన్ తో లవ్ నిజమేనా?
-
హైదరాబాద్లో హీరో శింబు కొత్త చిత్రం షూటింగ్
తమిళసినిమా: వెందు తనిందదు కాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పత్తుతల. నటి ప్రియభవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రతి నాయకుడిగా దర్శకుడు గౌతమ్మేనన్ నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కన్నడంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మఫ్టీ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. అక్కడ ఈ చిత్రం విజయం సాధించింది. కాగా కన్నడంలో శివరాజ్ కుమార్ నటించిన పాత్రను తమిళంలో శింబు పోషిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ను పెట్టుకోవడం కోసం సీక్రెట్ పోలీస్ చేసే ప్రయత్నం ఈ చిత్ర ప్రధాన కథ. కాగా పత్తు తల చిత్ర షూటింగ్ ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, కన్యాకుమారి, బళ్లారి, శివగంగ జిల్లాలోని కారైక్కుడి, కోవిలూర్ వంటి ప్రాంతాల్లో నాలుగు షెడ్యూ ల్ పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో షెడ్యూల్ హైదరాబాద్లో జరుపుకుంటుంది. ఈ చిత్రం కోసం అక్కడ భారీ సెట్టును వేసి నటుడు శింబుపై పాటను చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు అధికంగానే నెలకొన్నాయి. కాగా చిత్రాన్ని డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారన్నది గమనార్హం. -
శింబుతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్!
తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ను చుట్టేస్తున్న కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి ఈమె. ఇంకా చెప్పాలంటే మహానటి వంటి చిత్రాల్లో స్థాయికి మించిన పాత్రలను పోషించి మెప్పించింది. పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న కీర్తీ సురేష్ ఇటీవల గ్లామర్పై మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్ ఫొటో షూట్ చేయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం పూర్తి కావస్తోంది. భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న చిత్రం కూడా చివరిదశలో ఉంది. కాగా అక్కడ ప్రస్తుతానికి కీర్తీ సురేష్ చేతిలో మరో చిత్రం లేదు. ఇక మలయాళంలో కూడా ఏ చిత్రం చేయడం లేదు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా నటిస్తున్న మామన్నన్ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో మరో లక్కీ ఛాన్స్ సురేష్కు వరించినట్లు సమాచారం. కన్నడంలో కేజీఎఫ్, ఎజీఎఫ్–2 కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలి ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో శింబు కథానాయకుడుగా ఒక భారీ చిత్రాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సూరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబుకు జంటగా కీర్తిసురేష్ నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర వర్గాలు దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. -
Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు
కేజీఎఫ్ చాప్టర్–1, చాప్టర్–2 చిత్రాలు కన్నడ సినీ చరిత్రను మార్చేశాయని చెప్పవచ్చు. అప్పటి వరకు లో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన కన్నడ నిర్మాతలు కేజీఎఫ్ చిత్రం తరువాత పాన్ ఇండియాస్థాయిలో చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టారు. ఆ రెండు చిత్రాల విజయాల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం చూపింది. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ హూంబాలే ఫిలిమ్స్ అన్నది తెలిసిందే. కాగా ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సూరరైపోట్రు చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటనను నిర్మాణ సంస్థ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందని అందులో ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన వెందు తనిందదు కాడు చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న శింబు ప్రస్తుతం పత్తు తల చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. అదే విధంగా దర్శకురాలు సుధా కొంగర ప్రస్తుతం సూరరై పోట్రు చిత్ర హిందీ రీమేక్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించే భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ధనుష్ సరసన చాన్స్ కొట్టేసిన శింబు మూవీ హీరోయిన్
దేనికైనా అదృష్టం ఉండాలంటారు. ప్రతిభ ఎంత ఉన్నా అది ఒక్కటే చాలదు. అదే విధంగా దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాల్లో నటించే హీరోయిన్లకు లక్ గ్యారెంటీ అనే టాక్ ఉంది. అలాంటి లక్కే ఇప్పుడు సిద్ధి ఇద్నానిని వరించనుందనే టాక్ కోలీవుడ్లో స్ప్రెడ్ అవుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వెందు తనిందదు కాడు’. ఇందులో గుజరాతీ నటి సిద్ధి ఇద్నాని కథానాయకిగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంతోషంతో దర్శకుడు, కథానాయకులకు భారీ బహుమతులను కూడా అందించారు. ఈ విషయాన్ని అటుంచితే ఇందులో నాయకిగా నటించిన సిద్ధి ఇద్నానికి మరో లక్కీ ఛాన్స్ వరించినట్లు సమాచారం. నటుడు ధనుష్తో రొమాన్స్ చేసే అవకాశమే అది. ఈ సంచలన నటుడు తన అన్నయ్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నానే వరువేన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29వ తేదీ తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాత్తి చిత్రంతో పాటు కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో ధనుష్ నటిస్తున్నారు. కాగా మరో చిత్రంలో నటించడానికీ ఈయన పచ్చజెండా ఊపారు. దీనికి ఇళన్ దర్శకత్వం వహించనున్నారు. 2015లో విడుదలైన గ్రహణం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హరీష్ కల్యాణ్ హీరోగా ప్యార్ ప్రేమ కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజా ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇందులో నటి సిద్ధి ఇద్నానిని నాయకిగా ఎంపిక చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మొత్తం మీద ఈ అమ్మడు కోలీవుడ్లో అవకాశాలను రాబట్టుకుంటోందన్న మాట. -
హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
'మానాడు' విజయంతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన హీరో శింబు. తాజాగా ఆయన నటించిన ‘వెందు తానింధాతు కాడు’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోకి ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’పేరుతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో శింబు, గౌతమ్ మీనన్లకు కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చారు. హీరో శింబుకు టొయోటొ న్యూ వెల్వైర్ కారును గిఫ్టుగా ఇవ్వగా, డైరెక్టర్ గౌతమ్ మీనన్కు ఖరీదైన బైక్ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. #VTK Producer @IshariKGanesh gifted a brand new luxury car to Actor @SilambarasanTR_ and a Motor bike to Director @menongautham at #VTK success celebrations.. pic.twitter.com/M0YVVsplXF — Ramesh Bala (@rameshlaus) September 24, 2022 -
హీరోయిన్ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్
కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్ చేసిన ఈశ్వరన్ ఆమెను నిరాశ పరిచింది. అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్లో నటి నిధి అగర్వాల్కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది. ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా నిధి అగర్వాల్ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్ బదులిస్తూ నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది. -
సినిమా కోసం 21 కేజీల బరువు తగ్గిన శింబు
తమిళ సినిమా: శింబు నటించిన తాజా చిత్రం వెందు తనిందదు కాడు. సిద్ధి ఇద్నాని నాయిక. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ద్వారా ఈ నెల 15 తేదీ విడుదలైన విషయం తెలిసిందే. టాక్తో సంబంధం లేకుండా చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం చెన్నైలో విజయోత్సవ సమావేశం నిర్వహించింది. నిర్మాత ఐసరి గణేష్ మాట్లాడుతూ.. వెందు తనిందదు కాడు చిత్రం హిట్టు కాదు బంపర్ హిట్ అని పేర్కొన్నారు. చిత్రం రూ. 50 కోటక్లకు పైగా వసూలు సాధిస్తుందని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్వాహకులు చెప్పారన్నారు. చిత్ర కథను దర్శకుడు గౌతమ్ తనకు చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉందని.. వెంటనే చేద్దామని చెప్పానన్నారు. ఇందులో కథానాయకుడి పాత్రను శింబు మినహా వేరెవరు చేయలేరన్నారు. ఈ చిత్రం కోసం శింబు 21 కిలోల బరువు తగ్గారంటే ఆయన ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవాలన్నారు. ఇందులోని పాత్రకు శింబుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమన్నారు. మరో విషయం ఏంటంటే ఈ చిత్రానికి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని.. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. విన్నైతాండి వరువాయా చిత్రానికంటే ఈ చిత్రానికి ఎక్కువ విమర్శలు వచ్చాయని తెలిపారు. అలాంటి వాటి నుంచి చాలా నేర్చుకున్నానని, విమర్శలు చిత్రంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని గమనించాలన్నారు. చిత్ర బాధ్యతలను నిర్మాత పూర్తిగా తన భుజాలపై వేశారని, సింగిల్ లైన్ కథ చెప్పగానే సూపర్ స్టార్ కథనా, ఏఆర్ రెహమాన్ సంగీతం చేద్దాం అని శింబు అన్నారని తెలిపారు. నటుడు శింబు మాట్లాడుతూ.. ఇది ఎక్స్పెరిమెంటల్ కథ కావడంతో వర్కౌట్ అవుతుందా అని నిర్మాత ఐసరి గణేష్తో అడిగానన్నారు. కథ ఆసక్తిగా ఉండడంతో ఓకే అన్నానన్నారు. చిత్రం బాగా వచ్చిందని, ఇప్పుడు చిత్రానికి మంచి స్పందన రావడంతో సంతోషంగా ఉందన్నారు. విన్నైతాండి వరువాయా తరువాత కొన్ని చిత్రాలు హిట్ అయినా, ఈ చిత్రానికి యాక్టింగ్ పరంగా వస్తున్న రెస్పాన్స్ బాగుందన్నారు. మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోందన్నారు. దీనికి పార్ట్ 2 ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారని, జనరంజక అంశాలతో ఫ్యాన్స్ చప్పట్లు కొట్టేలా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. -
‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది: గౌతమ్ మీనన్
‘‘ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదు. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి. ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది’’ అని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అన్నారు. శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ‘వెందు తనిందదు కాడు’. సిద్ధీ ఇద్నాని కథానాయిక. ఇషారి.కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్తో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ–‘‘పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే కథ. రెహమాన్గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కథ డిమాండ్ చేయడంతోనే ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నాం. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ను తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్గారు విడుదల చేయడం హ్యాపీ. నేను, రామ్ చేయాలనుకుంటున్న మూవీ వేసవి తర్వాత ఉండొచ్చు. కమల్హాసన్గారితో ‘రాఘవన్ 2’ చేయాలనే ప్లాన్ ఉంది. వెంకటేష్గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతే ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది. విక్రమ్తో నేను తీసిన ‘ధృవనక్షత్రం’ ఈ డిసెంబరులో రిలీజ్ అవుతుంది’’ అన్నారు. -
Kamal haasan- Simbu: శింబు కోసం కమల్ హాసన్
మానాడు సక్సెస్ తర్వాత శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. విన్నై తాండి వరువాయా, అచ్చం యన్బదు మడమయడ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శింబు, గౌతమ్ మీనన్ల కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని కాలత్తుకు నీ వేనుం అనే పాట, ఏఆర్ రెహ్మాన్ పాడిన మరక్కుమా నెంజమ్ అనే పాట ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఐసరి గణేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండవ తేదీ చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరి నిర్వహించబోతున్నట్లు వర్గాలు తెలిపారు. కాగా, ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నిర్మాత ఐసరి గణేష్ మంగళవారం కమలహాసన్ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. చదవండి: (కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ) -
గ్లామరస్ ఫొటోలతో దడ పుట్టిస్తున్న నిధి అగర్వాల్
సినిమా రంగుల ప్రపంచం. ఇందులో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఉంటుంది. బోల్డ్గా నటించే వారికి బోలెడు అవకాశాలు అందుతాయి. అందుకే తారలు ఫొటో సెషన్లు నిర్వహించి దర్శక, నిర్మాతలతో పాటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం ఫొటో సెషన్స్ నిర్వహించి గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవికాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తరువాత టాలీవుడ్లో సవ్యసాచి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్తో మరింత వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రం బంపర్ హిట్ అయిన ఈమెకు అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే. ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయ్యింది. శింబు ఈ చిత్ర హీరో. ఇంకేముంది నిధి అగర్వాల్కు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా అందులోని పాటలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ముఖ్యంగా శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని వీరి పెళ్లికి పెద్దలు కూడా సమర్థించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేసింది. వీరు సహజీవనం చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై శింబు, నిధి అగర్వాల్ స్పందించకపోవడం విశేషం. ఈ అమ్మడు నటించే చిత్రాల విషయానికి వస్తే మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ -
హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్సిరీస్ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వెబ్సిరీస్లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తాజాగా రూపొందిన వెబ్ సిరీస్ ‘పేపర్ రాకెట్’. ఇది జీ చానల్ ఒరిజినల్ వెబ్సిరీస్. శ్రీనిధి సాగర్ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఇందులో గౌరీ జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి జీ చానల్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్ ఆంటోని, దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, అది ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కాలేదని ఒక యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదే విధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయని అన్నారు. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ అయితే ఆయన నటిస్తున్న తొలి చిత్రం స్టిల్స్ బయటకు వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించానన్నారు. ఇక ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళుతానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంటిలో చేసే గోల పడటం కంటే సినిమా రంగంలోకి వెళ్లడమే మంచిదని, తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో గాని సమ్మతించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి అన్నారు. -
శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్
హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. ఇది ఆమెకు 50వ చిత్రం కావడం మరో విశేషం. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర యూనిట్ మంగళవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ తాను దర్శకత్వం వహించిన పుళన్ విచారణై చిత్రం ట్రైలర్ను గుర్తుకు తెచ్చిందన్నారు. శింబు ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. ఆయన మంచి నటుడని, సకాలంలో చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తమకు ఎన్ని పనులు ఉన్నా రోజూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అంతకంటే ముఖ్యచిత్రాలకు సంబంధించిన వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిర్మాత మదియళగన్ సినిమా పరిశ్రమలో ప్రముఖులని, మహా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సెల్వమణి తెలిపారు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? -
చెన్నైలో శింబును కలిసిన రామ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ నటుడు రామ్ కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈయన కథానాయకుడిగా నటించిన ‘ది వారియర్’ తెలుగు, తమిళం భాషల్లో రూపొంది ఈ నెల 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస స్టూడియోస్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు దిగుమతి అవుతున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బుల్లెట్ పాటను శింబు పాడటం విశేషం. కాగా చిత్రం విడుదల దగ్గర పడటంతో యూనిట్ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో ది వారియర్ చిత్రంలో శింబు పాడిన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. రామ్ కోరిక మేరకు శింబు ఈ పాటను పాడారట. దీంతో శనివారం నటుడు రామ్ చెన్నైలో శింబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్ స్టైలిష్ లుక్ ఎంతగానో ఆకట్టుకుందని శింబు ప్రశంసించారు. బుల్లెట్ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని, థ్యాంక్స్ శింబు అంటూ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున నెటిజన్లు! నా భర్త వేస్ట్.. అస్సలు కోపరేట్ చేయడు: స్టార్ హీరోయిన్ -
కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్న హీరో శింబు
మానాడు హిట్ తరువాత శింబు నటిస్తున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గుజరాతీ భామ సిద్ధి ఇడ్నాని కథానాయికగా పరిచయం అవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో శింబు విభిన్న పాత్రల్లో నటించినట్లు, ఆయన గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్ -
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్పోర్టులో ఎమోషనల్
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్లో మీడియాతో ఎమోషనల్గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్లు, ఆడియో ఫంక్షన్స్ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్ -
స్టార్ హీరో తండ్రికి అస్వస్థత
కోలీవుడ్ స్టార్ శింబు తండ్రి, నటుడు టి.రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్పటినుంచి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ విషయం బయటకు పొక్కడంతో హీరో శింబు సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్యం గురించి ఓ లేఖ విడుదల చేశాడు. 'మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన బాగున్నారు. ట్రీట్మెంట్ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు' అని శింబు రాసుకొచ్చాడు. కాగా రాజేందర్ అనారోగ్యానికి గురి కావడంతో మొదట చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలు చికిత్స అందించిన తర్వాత పొరూర్లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడని పక్షంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లారు. pic.twitter.com/Wo2AZOxNR0 — Silambarasan TR (@SilambarasanTR_) May 24, 2022 https://t.co/8oKFJwpMET — VIJAY ANNA Fan 🕊 (@MathaiyanVijay) May 24, 2022 చదవండి 👇 విజయ్ మాల్యా కూతురి పెళ్లికి వెళ్లాను, అక్కడ నాతో ఏం చేయించారంటే? భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్సింగిల్ పేరుతో తొలి సాంగ్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్ను అందించాడు. -
వారియర్ మూవీలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు
ది వారియర్కు పాట పాడారు తమిళ హీరో, సింగర్ శింబు. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో బుల్లెట్ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్, దేవి శ్రీ ప్రసాద్లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్ పాట పాడారు. ఇది ఒక మాస్ నెంబర్. ఇటీవల ఇంట్రవెల్ సీన్తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్, కెమెరా : సుజీత్ వాసుదేవ్. Thank you @SilambarasanTR_ #STRforRAPO #Thewarriorr pic.twitter.com/KUX2Fu62sa— Lingusamy (@dirlingusamy) April 17, 2022 చదవండి: షారుక్, అజయ్లతో అక్షయ్ యాడ్, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ -
ఆటో డ్రైవర్గా మారిన స్టార్ హీరో.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ శింబు గతేడాది మానాడు హిట్తో తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్తో ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం శింబు గౌతం వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో ‘వెందు తణిందదు కాడు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శింబు ఆటోడ్రైవర్గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో శింబు సినిమాలో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారంటూ ఆయన ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ చేసి ట్రెండింగ్ చేశారు. కానీ నిజానికి ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం శింబు ఇలా ఆటో డ్రైవర్గా నటించారు అని ఆయన సన్నిహితులు వివరణ ఇవ్వడంతో రూమర్స్కి చెక్ పడినట్లయ్యింది. ஆட்டோ ஓட்டுநராக ஸ்டைலான லுக்கில் நடிகர் சிலம்பரசன் வீடியோ#Silambarasan |#silambarasantr |#str |#simbu |#tamildiary pic.twitter.com/MDC0JIOzj9 — Tamil Diary (@TamildiaryIn) April 11, 2022 -
చిక్కుల్లో హీరో శింబు కుటుంబం.. కారు డ్రైవర్ అరెస్ట్
Simbu Car Driver Arrest For Runs Over 70 Year Old Man In Chennai: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపిన 70 ఏళ్ల వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వంని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18న రాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్ కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటునుంచి వస్తున్న వాహనాల వెలుగులతో వృద్ధుడిని గమనించని డ్రైవర్ కారు నడపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన టి. రాజేందర్ ప్రమాదం జరిగిన చోటు నుంచి 10 మీటర్ల దూరంలో కారు దిగి అంబులెన్స్కు ఫోన్ చేశాడు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు మునుస్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు శింబు డ్రైవర్ సెల్వంను మార్చి 19న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై శింబు కుటుంబం ఇంకా స్పందించలేదు. కాగా ఈ కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. சாலையை கடக்க முயன்ற முதியவர் மீது ஏறி இறங்கிய நடிகர் சிம்புவின் கார்.. பதைபதைக்க வைக்கும் சிசிடீவி காட்சி.. காரில் சிம்புவின் தந்தை டி.ராஜேந்தரும் இருந்ததாக தகவல்..#Simbu #ActorSimbu #SimbuCarAccident #Death #CCTVfootage #TRajendran pic.twitter.com/9Z9w3diXev — Asianetnews Tamil (@AsianetNewsTM) March 24, 2022 -
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు.. ఆ హీరోతో నిధి వివాహం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్. మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్తో లవ్ ట్రాక్ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. -
శింబు కేసులో నిర్మాతల సంఘానికి హైకోర్టు జరిమానా
High Court Fined Tamil Film Producers Council: నటుడు శింబు కేసులో తమిళ సినీ నిర్మాతల సంఘానికి చెన్నై హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైఖేల్ రాయప్పన్ నటుడు శింబు కథానాయకుడిగా నిర్మించిన అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రం 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నటించడానికి తనకు రూ.8 కోట్లు పారితోకం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్గా రూ.కోటి 51 లక్షలు ఇచ్చిన నిర్మాత మిగిలిన రూ.6 కోట్ల 48 లక్షలు చెల్లించలేదని ఆ మొత్తాన్ని ఇప్పించవలసిందిగా శింబు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? అదే సమయంలో నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబుతో నిర్మించిన చిత్రంతో తాను తీవ్రంగా నష్టపోయానని, కాబట్టి శింబు నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై శింబు చెన్నై హైకోర్టులో రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్లో నిర్మాతల సంఘాన్ని, నడిగర్ సంఘాన్ని, అప్పటి ఈ సంఘం కార్యదర్శి విశాల్ను ప్రతివాదులుగా చేర్చారు. చదవండి: బిగ్బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చాలాకాలంగా విచార ణలో ఉన్న ఈ కేసును బుధవారం న్యాయమూర్తి నీ.వేల్ మురుగన్ సమక్షంలో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో 1080 రోజులు అయినా నిర్మా త సంఘం లిఖిత పూర్వకంగా వాదనలను కోర్టులో దాఖలు చేయని కారణంగా ఆ సంఘానికి రూ.లక్ష అపరాధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొ త్తాన్ని ఈ నెల 31వ తేదీలోగా కోర్టు రిజిస్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ ఒకటవ తేదీకి వాయిదా వేశారు. -
Bigg Boss: హాట్ టాపిక్గా హీరో శింబు రెమ్యునరేషన్, ఎంతంటే?
వెండితెర మీద మెరుపులు కురిపించే ఎంతోమంది హీరోలు పలు షోలకు వ్యాఖ్యాతగా మారడం చూశాం. బుల్లితెర హిట్ షో బిగ్బాస్ కోసమైతే ఏకంగా స్టార్ హీరోలే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో బిగ్బాస్ తెలుగు సీజన్లకు ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా తమిళ షోకు కమల్ హాసన్, కన్నడ షోకు సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్గా పని చేశారు. అయితే కాల్షీట్లు కుదరకపోవడంతో కమల్ బిగ్బాస్ ఓటీటీ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానాన్ని హీరో శింబు భర్తీ చేశాడు. బిగ్బాస్ అల్టిమేట్ షోకు శింబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని షోకు రప్పించేందుకు బిగ్బాస్ నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! ఒక్క ఎపిసోడ్కు సుమారు కోటి రూపాయల దాకా పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన బిగ్బాస్ ద్వారా శింబు రూ.5 కోట్లు వెనకేయనున్నట్లు కనిపిస్తోంది. #BBUltimate 🙏🏻 https://t.co/Lshz5ajZ6z — Silambarasan TR (@SilambarasanTR_) February 27, 2022 #BBUltimate-இல் இன்று.. ▶️ 6:30 pm onwards..#Day28 #Promo3 #NowStreaming only on #disneyplushotstar. @SilambarasanTR_ pic.twitter.com/fGOmZo8NKG — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 27, 2022 -
రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నశింబు
-
బిగ్బాస్ షో హోస్ట్గా స్టార్ హీరో, ప్రోమో రిలీజ్!
తమిళ బిగ్బాస్ షో హోస్ట్గా విశ్వ నటుడు కమల్ హాసన్ తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. మొదట్లో రమ్యకృష్ణను హోస్ట్గా నిలబెడతారనుకున్నారు. కానీ, బిగ్బాస్ అల్టిమేట్ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ కారణంగా షో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్ యంగ్ హీరోను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది నిజమేనని వెల్లడించింది బిగ్బాస్ టీమ్. బిగ్బాస్ ఓటీటీకి హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. మరి శింబు హోస్ట్గా బుల్లితెరపై అదరగొడతాడా? కంటెస్టెంట్ల లెక్కలు సరిచేస్తాడా? అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడా? అనేది చూడాలి! #STRtheHostOfBBUltimate 💥 pic.twitter.com/GWozob5Kwu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 24, 2022 -
స్టార్ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి? త్వరలోనే అనౌన్స్మెంట్!
Will Nidhi Agarwal And Simbu To Get Married Soon?: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరు త్వరలోనే ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కథనాలు వెలుడుతున్నాయి. ఈ వార్తలపై ఇంతవరకు స్పందించని ఈ జంట త్వరలోనే తమ పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా మానాడు చిత్రంతో హిట్ అందుకున్న శింబు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అటు నిధి సైతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. -
తమిళ హీరో శింబుకు గౌరవ డాక్టరేట్, ఏ యూనివర్శిటీ ఇచ్చిందంటే
తమిళ స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్యయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు శింబు. Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me. I dedicate this huge honour to Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them! Finally - my fans, #NeengailaamaNaanilla Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR — Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022 -
స్టార్ హీరోతో లవ్లో పడ్డ నిధి, అతడి ఇంట్లోనే మకాం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రేమలో విఫలమైన శింబుతో ఆమె లవ్లో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ సినీప్రియులను ఆకర్షిస్తోంది. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఇది గతేడాది జనవరిలో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట! కరోనా టైంలో లవ్లో పడ్డ నిధి కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే! కాగా 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. గతేడాది 'ఈశ్వరన్'తో కోలీవుడ్లో లక్ పరీక్షించుకున్న ఆమె ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. శింబు విషయానికి వస్తే 'మానాడు' సినిమాతో ఈ మధ్యే మంచి సక్సెస్ అందుకున్నాడీ హీరో. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. అప్సరసలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటోలు చూసేయండి -
ఆస్పత్రిలో చేరిన హీరో శింబు
Hero Simbu Hospitalised in Chennai: తమిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరాడు. వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా 'వెందు తనిందదు కాడు' అనే సినిమా షూటింగ్లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే ఇది కరోనా కాదని, సాధారణ ఇన్ఫెక్షనేనని వైద్యులు స్పష్టం చేశారు. శింబు అనారోగ్యంబారిన పడ్డారని తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా తమిళ స్టార్ అయిన శింబు తెలుగులో 'వల్లభ', 'మన్మధ' వంటి ప్రేమకథా చిత్రాలతో ఇక్కడిప్రేక్షకులకూ చేరువయ్యాడు. ఇటీవలే రిలీజైన ‘మానాడు’ తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. -
'మానాడు' మూవీ సక్సెస్ జోష్లో హీరో శింబు
Simbu thanks fans for overwhelming support for Maanaadu: మానాడు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. వీ.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 25వ తేదీ తెరపైకి వచ్చిన మానాడు చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకొని అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత సురేష్ కామాక్షి ట్విట్టర్లో పేర్కొంటూ ‘సూపర్ స్టార్ ఆహ్వానం, అభినందనలు ఈ చిత్ర విజయాన్ని దృవపరిచాయి. మంచిని వెతికి అభినందించే ఈ మనసే ఇంకా మిమ్మల్ని ఉన్నత సింహాసనంపై కూర్చోబెట్టింది. గొప్ప ఫలితాన్ని పొందాం. యూనిట్ సభ్యులందరి తరఫునా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
లాక్డౌన్లో 27 కేజీల బరువు తగ్గాను : శింబు
Hero Simbu Says He Lost 27 Kgs In Lockdown: ‘‘నేను నటించిన ‘మన్మథ, వల్లభ’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధం’’ అని హీరో శింబు అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, యస్.జె. సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మానాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ది లూప్’ రూపొందింది. ఇందులో నేను చేసిన అబ్దుల్ కాలిక్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాల వల్ల సామాన్య వ్యక్తి అయిన అబ్దుల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే ఈ చిత్రకథ. ఒక్క రోజులో వేరే వేరే సమయాల్లో జరిగే కథ ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్ర పోషించాను. ఈ పాత్ర కోసం 27 కిలోల బరువు తగ్గాను. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. గతంలో ‘మన్మథ’ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దామంటే వద్దన్నారు.. అయినా పట్టుబట్టి నేను డబ్బింగ్ చేయించి, రిలీజ్ చేశాను. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘ది లూప్’ని కూడా నేనే తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాను. నాపై నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
నటుడు శింబుపై భారీ కుట్రలు
తమిళసినిమా: నటుడు శింబుపై కుట్రలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎగ్మూర్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించిన అన్భాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో తన కొడుకు శింబు కథానాయకుడిగా నటించారన్నారు. మీడియాతో మాట్లాడుతున్న టి.రాజేందర్, ఉషా రాజేందర్ అయితే అతనికి నిర్మాత పూర్తిగా పారితోషికం చెల్లించలేదని, అలాంటిది శింబునే ఆయనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారన్నారు. శింబుపై రెడ్కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని టి.రాజేందర్ ఆరోపించారు. ఉషా రాజేందర్ మాట్లాడుతూ ఈకుట్రను సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆయన ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. చదవండి: (క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) -
రూ.125 కోట్ల భారీ బడ్జెట్ మూవీకి హీరో నాని సాయం
తమిళ స్టైలీష్ స్టార్ శింబు, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మానాడు’. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి’ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్, మొదటి సింగిల్ విడుదలై మంచి ఆదరణ పొందాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ సినిమా తెలుగు ట్రైలర్ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు. అలాగే తమిళ ట్రైలర్ ఎ.ఆర్. మురుగదాస్, మలయాళంలో నివిన్ పాలి, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. -
హీరో శింబుకు ఊరట.. రెడ్కార్డు రద్దు
చెన్నై: నటుడు శింబుకు ఊరట కలిగింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన రెడ్కార్డును రద్దు చేసింది. శింబు కథానాయకుడిగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించిన మైఖేల్ రాయప్పన్ శింబు సహకరించకపోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ నిర్మాతల మండలిలో (టీఎఫ్పీసీ) ఫిర్యాదు చేశారు. శింబు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా ఫలితం లేకపోవడంతో రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. తదనంతరం శింబుకు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. చదవండి : సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా! మా సినిమా సక్సెస్పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్ -
శింబు: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్..ఫోటో వైరల్
కోలీవుడ్ హీరో శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'వెందు తానింధుడు కాదు'. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ఫస్ట్లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గిన శింబు సరికొత్త లుక్లో అలరిస్తున్నారు. లేటెస్ట్గా తన ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో క్లీన్షేవ్తో స్టైలిష్ లుక్లో శింబు కనిపిస్తున్నారు. కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
కాలిన గాయాలతో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా?
Vendu Thanindathu Kadhu Movie: మాసిన చొక్కా, పైకి కట్టుకున్న లుంగీ, శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయుధంగా పొడవాటి కర్ర, ఏదో ఆపద సంభవించిందన్నదానికి ప్రతీకగా భూమి మీద మండుతున్న గడ్డి.. పై ఫొటో చూస్తుంటే హీరో ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లే కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ హీరోను గుర్తుపట్టారా? తమిళంలో ఈయన పెద్ద స్టార్. మన్మధ, వల్లభ, పోకిరోడు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. పోస్టర్లో ఉన్నదెవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. అతడు స్టార్ హీరో శింబు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఓ సినిమా చేస్తున్నాడు. నేడు(ఆగస్టు 6) ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. 'నదిగలిలే నీరాడుం సూరియన్' అని గతంలో పెట్టిన టైటిల్ను మార్చివేసి 'వెందు తనిందదుక్కాడు' అని కొత్త టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్లో అడవిలో అంటుకున్న కార్చిచ్చులో శింబు గాయపడినట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషారి కె గణేశ్, అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శింబు ప్రస్తుతం మానాడుతో పాటు పాతు కల(కన్నడ 'ముఫ్తీ' రీమేక్) సినిమాలు చేస్తున్నాడు. Here’s the title and first look of the new film with @TRSilambarasan @arrahman @IshariKGanesh@VelsFilmIntl @Ashkum19 Thank you to everybody who made this possible pic.twitter.com/6LY9icJuSd — Gauthamvasudevmenon (@menongautham) August 6, 2021 -
యూనిట్ సభ్యులకు శింబు సర్ప్రైజ్ గిఫ్ట్
తమిళసినిమా: మానాడు చిత్ర యూనిట్ సభ్యులను నటుడు శింబు ఖుషీ పరిచారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మానాడు, వెంకట్ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. సమకాలిన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శనివారంతో పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. శింబు సర్ప్రైజ్ గిఫ్ట్తో చిత్ర యూనిట్ సభ్యులను ఖుషీ పరిచారు. ఆయన దర్శకుడు వెంకట్ప్రభు నుంచి 300 మంది యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచీలను కానుకగా అందించారు. -
అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశా : హీరో శింబు
మధ్యపానం ఆరోగ్యానికి హానికారం అని తెలిసినా చాలామంది ఆ వ్యసనానికి అలవాటుపడతారు. దీనికి హీరో, హీరోయిన్లు కూడా అతీతం కాదు. డిప్రెషన్తో మద్యం, డ్రగ్స్కు అలవాటు పడి కెరీర్ని నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే... మత్తుతో తమ జీవితం చిత్తవుతుందని గ్రహించి త్వరగా ఆ వ్యసనం నుంచి బయటపడి కెరీర్ను గాడిన పెట్టుకున్న నటీనటులూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్లోకి కోలీవుడ్ హీరో శింబు కూడా చేరిపోయారు. ప్రస్తుతం శింబు ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా శింబు, డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శి సహా పలువురు నటీనటులు ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్జే సూర్య అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తాను ఆల్కహాల్ మానేసినట్లు శింబు వెల్లడించాడు. ఆల్కహాల్ మానేసి దాదాపు ఏడాది కావొస్తుందని,మందు మానేయడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తన ఫోకస్ అంతా హెల్త్ అండ్ ఫిట్నెస్పైనే ఉందని వివరించాడు. చదవండి : అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు తమిళనాడు రియల్ పాలిటిక్స్ ఆధారంగా ధనుష్ మూవీ! -
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు
తమిళ సూపర్ స్టార్ శింబు ఇన్స్టాగ్రామ్లో 1మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది అక్టోబర్లో ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన శింబు ఏడాది కూడా పూర్తి కాకుండానే 1మిలియన్ మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులకు శింబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది చెన్నైలోని ఓ కాలేజీ ఈవెంట్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ 1 మిలియన్ ఫాలోవర్స్కి థ్యాంక్స్ చెప్పాడు. ఇక లేట్గా ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చినా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మానాడు’ సినిమాలో శింబు నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి :Rangam: జీవా ప్లేస్లో శింబు, ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Silambarasan TR (@silambarasantrofficial) -
వివాదంలో హన్సిక మూవీ: కోర్టుకెక్కిన డైరెక్టర్
హీరోయిన్ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మహా’ పై వివాదం నెలకొంది. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించారు. కాగా ‘‘నేను దర్శకత్వం వహించిన ‘మహా’ని నాకు చెప్పుకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.. దీనిపై నిషేధం విధించాలి’’ అని జమీల్ డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. హన్సిక టైటిల్ రోల్ చేసిన ‘మహా’ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ‘‘ఈ చిత్రం పెండింగ్ పనులు నాకు తెలియకుండానే పూర్తి చేశారు.. నిర్మాత (మదియళగన్) నాకు 24 లక్షలు పారితోషికం చెల్లించాల్సి ఉండగా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారు. నాకు తెలియకుండానే పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసినందున, నా కథ మార్చినందున రూ.10 లక్షల పరిహారంతో పాటు, నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయి చెల్లించాలి’’ అని కేసు పెట్టారు జమీల్. అంతేకాదు.. సినిమా రిలీజ్ కానివ్వకుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని విధించాలని కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ‘జమీల్ పిటిషన్పై మే 19లోగా స్పందించాలి’ అంటూ సదరు కోర్డు నిర్మాతను ఆదేశించింది. కాగా ఒక పైలెట్తో ప్రేమలో పడే పైలెట్ అటెండెంట్ (హన్సిక) కథ ఇది. ఈ జంటకు పుట్టిన కుమార్తె మరణం వెనక దుర్మార్గుల్ని హీరో ఎలా పట్టుకుని అంతం చేశాడు? అనేది ‘మహా’ చిత్రకథ. ఇందులో శింబు అతిథి పాత్రలో కనిపిస్తారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే..