Asian Games 2023
-
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్.. నాలుగేళ్లకే కెరీర్ ఖతం
పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్లో పాకిస్తాన్కు ఆఖరిసారిగా ఆడాడు.ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
Preeti Rajak: సుబేదార్ ప్రీతి
ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్’ ర్యాంక్కు ప్రమోట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్గా చేరిన ప్రీతి రజక్ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్లో ట్రాప్ షూటర్గా సిల్వర్ మెడల్ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు. మధ్యప్రదేశ్కు చెందిన ప్రీతి రజక్ ఆర్మీలో ‘సుబేదార్’ ర్యాంక్కు ప్రమోట్ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్ నాయక్’, ‘నాయక్’, ‘హవల్దార్’, ‘నాయబ్ సుబేదార్’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్ రికార్డును నమోదు చేసింది. ట్రాప్ షూటర్గా ఆసియన్ గేమ్స్లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు. ► లాండ్రీ ఓనరు కూతురు ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్ది మధ్యప్రదేశ్లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్లోకి వచ్చింది. భోపాల్లోని స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో మిలటరీ పోలీస్ డివిజన్లో నేరుగా 2022లో హవల్దార్ ఉద్యోగం వచ్చింది. ► ఏ సాహసానికైనా సిద్ధమే ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్ను ప్రాక్టీస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్ గేమ్స్లో షార్ట్ పిస్టల్ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్గా ప్రమోషన్ ఇచ్చారు. ► పారిస్ ఒలింపిక్స్కు ఈ సంవత్సరం జూలైలో పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్మెన్షిప్ యూనిట్’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్ షూటింగ్లో విభాగంలో ఆరవ ర్యాంక్లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
శెభాష్ తల్లీ.. గ్రీష్మను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: స్కేటింగ్ క్రీడాకారిణి, ఆసియా క్రీడల విజేత గ్రీష్మ దొంతరను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ప్రతిభావంతురాలైన గ్రీష్మ ఆట తీరు.. ఆమె సాధించిన విజయాలను ప్రశంసించారు. కాగా.. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ గురువారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలో.. నగరానికి చెందిన గ్రీష్మ దొంతర తన తండ్రితో పాటు మధురవాడ ఐటీ హిల్పైన హెలీప్యాడ్ వద్ద సీఎంను కలిశారు. ఈ సందర్భంగా గ్రీష్మ.. తను సాధించిన మెడళ్లను ముఖ్యమంత్రికి చూపించి మురిసిపోయారు. స్కేటింగ్లో తన విజయాల గురించి సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. 105 పతకాలు ఈ నేపథ్యంలో శెభాష్ తల్లీ అంటూ చిరునవ్వుతో గ్రీష్మను అభినందించిన సీఎం జగన్.. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆమెకు ఆశీర్వాదం అందించారు. కాగా.. ఇప్పటి వరకు స్కేటింగ్లో వివిధ స్థాయిల్లో 105 మెడల్స్ సాధించినట్లు గ్రీష్మ తెలిపారు. అదే విధంగా.. ఇటీవల చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భాగస్వామ్యం అయ్యానని.. మూడు పతకాలు కూడా సాధించి 16వ స్థానంలో నిలిచానని పేర్కొన్నారు. చదవండి: #Virat Kohli: నీకే ఎందుకిలా కోహ్లి? -
ఆసియా క్రీడల్లో సత్తా చాటారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీకి 11 పతకాలు.. ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్ సాయిరాజ్
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్ సాయిరాజ్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్ పేర్కొన్నారు. ఇక.. సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్కు తొలిసారి గోల్డ్ మెడల్ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్గా అవతరించింది సాత్విక్- చిరాగ్ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జంట నంబర్వన్ ర్యాంక్ను అందుకోవడం విశేషం. చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం -
‘ఒలింపిక్ సవాల్కు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: ‘మేం వరుస విజయాలు సాధిస్తున్నా చాలా మంది ప్రత్యర్థులు కొంత కాలం వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఆటపై అందరి దృష్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇకపై మా ఆటను విశ్లేషించి మాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు’... భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్లో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో కూడా భారత పురుషుల జట్టు రజతం సాధించగా... పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం గెలిచాడు. ఈ నేపథ్యంలో బుధవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆటగాళ్లతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు. వాళ్లని పడగొట్టగలిగాం... గత ప్రపంచ చాంపియన్షిప్లో పతకం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందామని, ఆ తర్వాత మరింత పట్టుదలగా సాధన చేసి ఆసియా క్రీడలకు వెళ్లినట్లు సాత్విక్ వెల్లడించాడు. చాలా కాలంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మలేసియా జోడీ సొ వుయి యిక్–ఆరోన్ చియాలను ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓడించడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతను అన్నాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం తాము అన్ని విధాలా సిద్ధమవుతామన్న సాత్విక్... అన్నింటికంటే ఫిట్నెస్ కీలకమని వ్యాఖ్యానించాడు. ‘ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు. మా శరీరమే మాకు ప్రత్యర్థి. రాబోయే రోజుల్లో గాయాలు లేకుండా పూర్తి ఫిట్గా ఉంటే చాలు. కోర్టులో ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్కు ముందు కొన్ని టోరీ్నలలో మేం ఓడినా పర్వాలేదు. అన్నింటిలోనూ గెలిస్తే అసలు సమయానికి సమస్య రావచ్చేమో’ అని సాత్విక్ అన్నాడు. ఇలాంటి అవకాశం రాదని... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీవ్ర గాయంతో బాధపడుతూనే ప్రణయ్ పతకం కోసం పోరాడాడు. చివరకు అతను విజయం సాధించినప్పుడు కోచ్ గోపీచంద్ సహా సహచరులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గాయం ఉన్నా ఆడేందుకు సిద్ధం కావడం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని ప్రణయ్ చెప్పాడు. ‘నా శరీరం ఎంత వరకు సహకరించగలదో ఫిజియో కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారమే కోచ్ గోపీ సర్తో పాటు అందరితో చర్చించాక నేను ఆడేందుకు సిద్ధమయ్యా. నొప్పి ఉన్నా సరే పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆసియా క్రీడల్లో పతకం విలువేంటో తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలతో బాధపడి కీలక సమయాల్లో అవకాశం కోల్పోయా. ఈ జీవితకాలపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావించా. అయితే గాయం తీవ్రత వల్లే టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆడలేదు’ అని ప్రణయ్ చెప్పాడు. నిజానికి తమ స్వర్ణంకంటే ప్రణయ్ కాంస్యం గెలుచుకోవడం తమకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని సాత్విక్ అన్నాడు. అతను పతకం కోసం ఎంత కష్టపడ్డాడో, కీలక సమయాల్లో వెనుకబడి పుంజుకునేందుకు ఎంత పోరాడాడో తమకు తెలుసు కాబట్టి అతను పతకం సాధించాని జట్టంతా కోరుకుందని సాత్విక్ వెల్లడించాడు. ‘వారి వల్లే ఈ ఉత్సాహమంతా’ గోపీచంద్ భారత కోచ్గా మారి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక చాలనుకొని తప్పుకోవాలని చాలా సార్లు భావించానని, అయితే యువ ఆటగాళ్ల విజయాలు తనకు ప్రేరణ అందిస్తున్నాయని గోపీచంద్ చెప్పారు. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పతకాలు రావడం ఎంతో ఆనందం కలిగించిందని గోపీచంద్ అన్నారు. ‘నా దృష్టిలో ఆసియా క్రీడల మెడల్ అంటే ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ పతకాలతో సమానం. అందుకే ఈ ఆనందమంతా. జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. శ్రీకాంత్, లక్ష్య సేన్లకు ప్రత్యేక అభినందనలు. ఇక ప్రణయ్ పతకం కోసం ప్రార్థించినంతగా నేను ఎప్పుడూ ప్రార్థించలేదు. ఈ ఒక్కసారి అతడిని గెలిపించమని దేవుడిని కోరుకున్నా. ఒలింపిక్స్కు ఇంకా సమయముంది. అయితే దానికి తగిన విధంగా సిద్ధమవుతాం’ అని గోపీచంద్ అన్నారు. అధికారికంగా ఇప్పుడు సాత్విక్–చిరాగ్ నంబర్వన్ ర్యాంక్ అందుకున్నా... గత ఏడాది కాలంగా వారి ఆటను చూస్తే అప్పటి నుంచే వారిని తాను నంబర్వన్గా భావించినట్లు ఆయన వెల్లడించారు. -
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్లో మూడు స్వర్ణాలు సాధించింది. -
ఆసియా క్రీడల పతక విజేతలకు మోదీ ప్రశంస
తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు. ‘ప్రభుత్వం క్రీడాకారులకు ఏం కావాలో అది చేస్తుంది. వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది. పారిస్ ఒలింపిక్స్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్ డబుల్స్లో రజత పతకం గెలిచిన సాకేత్ మైనేని, మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్ను అందించారు. స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్ను, క్రికెట్లు జట్లు బ్యాట్ను మోదీకి బహూకరించాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం 107 పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్లో జరుగుతాయి. -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
నగోయాలో కలుద్దాం!
హాంగ్జౌ: గత 16 రోజులుగా క్రీడాభిమానులను ఆద్యంతం అలరించిన ఆసియా క్రీడా సంరంభానికి ఆదివారం తెర పడింది. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు అక్టోబర్ 8న అంతే ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ‘బిగ్ లోటస్’ స్టేడియంలో 75 నిమిషాలపాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా... చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు, భారత మాజీ దిగ్గజ షూటర్ రణ్ధీర్ సింగ్ 19వ ఆసియా క్రీడలు ముగిశాయని అధికారికంగా ప్రకటించారు. ‘గత 16 రోజుల్లో మనమంతా ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలను తిలకించాం. హాంగ్జౌకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చి న హాంగ్జౌను ఆసియానే కాకుండా మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వానికి, చైనా ఒలింపిక్ కమిటీకి, నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రణ్దీర్ సింగ్ వ్యాఖ్యానించారు. తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో ఐచి రాష్ట్ర గవర్నర్ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్ నకాటా హిడియో ఆసియా క్రీడల జ్యోతితోపాటు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని అందుకున్నారు. ♦ ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టు గోల్కీపర్ శ్రీజేశ్ పతాకధారిగా వ్యవహరించాడు. చాలా మంది భారత క్రీడాకారులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, ముగింపు వేడుకల్లో వంద మంది వరకు క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. ♦ మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో 12,407 మంది క్రీడాకారులు హాంగ్జౌలో పోటీపడ్డారని నిర్వాహకులు తెలిపారు. ♦ మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చి న చైనా మరోసారి తమ ఆధిపత్యం చాటుకొని హాంగ్జౌలోనూ ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 188 పతకాలతో జపాన్ రెండో స్థానంలో, 190 పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో, 107 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఓవరాల్గా దక్షిణ కొరియా కంటే జపాన్ రెండు తక్కువ పతకాలు గెలిచినా... కొరియాకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచినందుకు జపాన్ రెండో ర్యాంక్లో నిలిచింది. ♦ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి. 41 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 41 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. 4 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక్క పతకం కూడా నెగ్గని దేశాలు (భూటాన్, ఈస్ట్ తిమోర్, మాల్దీవులు, యెమెన్). 2 తొలిసారి బ్రూనై, ఒమన్ దేశాలు ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకాలు గెలిచాయి. 4 ఒకే ఆసియా క్రీడల్లో 100 పతకాల మైలురాయిని దాటిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. 11 వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. తొలిసారి చైనా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలి స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి చైనా పతకాల పట్టికలో తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంటోంది. 201 తాజా ఆసియా క్రీడల్లో చైనా గెలిచిన స్వర్ణ పతకాలు. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని దాటిన తొలి దేశంగా చైనా నిలిచింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు గెలిచింది. 9 వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో తొలిసారి ‘సెంచరీ’ నమోదు చేసింది. -
2036 ఒలింపిక్స్కు భారత్ బిడ్ వేయాలి: పీటీ ఉష
హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్పై దృష్టి సారించాలి. మన క్రీడాకారులు, కోచ్లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్ ఒలింపిక్స్లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. -
తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ పురస్కారం
ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కడం విశేషం. ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్ జాంగ్ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్లో 24 ఏళ్ల కిన్ హైయాంగ్ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (2010 గ్వాంగ్జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్ గుర్తింపు పొందారు. -
ఏషియన్ గేమ్స్ లో విజేతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
-
జయహో భారత్ 107
‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సురేఖ, ఓజస్ ‘స్వర్ణ’ చరిత్ర శనివారం ముందుగా ఆర్చరీలో భారత్ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్తోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష (1986 సియోల్ గేమ్స్; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్ అదితి స్వామి (భారత్) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్కే లభించాయి. ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 149–147తో అభిషేక్ వర్మ (భారత్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ విభాగంలో ఓజస్ పసిడి పతకాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జోడీ అద్భుతం ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చాంపియన్గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. సెమీస్లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్–ప్రదీప్ గాంధే భారత్కు పురుషుల డబుల్స్లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జోడీ నంబర్వన్ ర్యాంక్ను అందుకోనుంది. దీపక్ ‘రజత’ పట్టు ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్ను భారత్ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్ దిగ్గజ రెజ్లర్ హసన్ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం బౌట్లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్ తొలి రౌండ్లో 3–2తో షరిపోవ్ (ఖతర్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–0తో రియాన్డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. భారత్కే చెందిన యశ్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయారు. భారత జట్ల ‘పసిడి’ కూత గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది. చెస్లో డబుల్ ధమాకా వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు. పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్లతో కూడిన భారత పురుషుల జట్టు నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్తో జరిగిన చివరి రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది. క్రికెట్లో కనకం... తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో పోటీపడ్డ భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్లో 35 కిలోమీటర్ల రేస్వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఏషియన్ గేమ్స్ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జైత్రయాత్ర ముగిసింది. ఇవాల్టితో (అక్టోబర్ 7) ఆసియా క్రీడల్లో భారత్ ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించింది. ఈ ఎడిషన్కు ముందు భారత్ అత్యధిక పతకాలను 2018 జకార్తా ఆసియా క్రీడల్లో (70) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ జకార్తా గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. పతకాల పట్టికలో చైనా 376 పతకాలతో (197 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత జపాన్ (181; 50 స్వర్ణాలు, 63 రజతాలు, 68 కాంస్యాలు), రిపబ్లిక్ ఆఫ్ కొరియా (188; 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) ఉన్నాయి. భారత్ పతకాల వివరాలు.. ఆర్చరీ (కాంపౌండ్ మెన్స్): ఓజాస్ దియోతలే (గోల్డ్) ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): జ్యోతి సురేఖ (గోల్డ్) ఆర్చరీ (మెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (వుమెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మిక్సడ్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మెన్స్ సింగిల్స్): అభిషేక్ వర్మ (సిల్వర్) ఆర్చరీ (రికర్వ్ మెన్స్ టీమ్): సిల్వర్ ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): అదితి స్వామి (బ్రాంజ్) ఆర్చరీ (రికర్వ్ వుమెన్స్ టీమ్): బ్రాంజ్ అథ్లెటిక్స్ (మెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): అవినాశ్ సాబ్లే (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 4X400మీ రిలే): గోల్డ్ అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో): నీరజ్ చోప్రా (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ షాట్పుట్): తజిందర్పాల్ సింగ్ తూర్ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 5000): పారుల్ చౌదరీ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ జావెలిన్ త్రో): అన్నూ రాణి (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 10000): కార్తీక్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): అజయ్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 5000 ): అవినాశ్ సాబ్లే (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 800): మోహమ్మద్ అఫ్సల్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ డెకత్లాన్): తేజస్విన్ శంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ జావెలిన్ త్రో): కిషోర్ జెనా (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ లాంగ్ జంప్): శ్రీశంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 100 మీ హర్డిల్స్): జ్యోతి యర్రాజీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 1500): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): పారుల్ చౌదరీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 4X400మీ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (వుమెన్స్ 800): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ లాంగ్జంప్): అంచీ సోజన్ (సిల్వర్) అథ్లెటిక్స్ (4X400మీ మిక్సడ్ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (మెన్స్ 10000): గుల్వీర్ సింగ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): జిన్సన్ జాన్సన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ ట్రిపుల్ జంప్): ప్రవీణ్ చిత్రవేల్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): ప్రీతి లాంబా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 400 హర్డిల్స్): విత్య రామ్రాజ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ డిస్కస్ త్రో): సీమా పూనియా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ హెప్టాత్లాన్): నందిని అగసర (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ షాట్పుట్): కిరణ్ బలియాన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (35కిమీ రేస్వాక్ మిక్సడ్ టీమ్): బ్రాంజ్ బ్యాడ్మింటన్ (మెన్స్ డబుల్స్): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి (గోల్డ్) బ్యాడ్మింటన్ (మెన్స్ టీమ్): సిల్వర్ బ్యాడ్మింటన్ (మెన్స్ సింగిల్స్): ప్రణయ్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 75 కేజీ): లవ్లీనా (బ్రాంజ్) బాక్సింగ్ (మెన్స్ 92 కేజీ): నరేందర్ (బ్రాంజ్)ఔ బాక్సింగ్ (వుమెన్స్ 45-50 కేజీ): నిఖత్ జరీన్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 50-54 కేజీ): ప్రీతి (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 54-57 కేజీ): పర్వీన్ (బ్రాంజ్) బ్రిడ్జ్ (మెన్స్ టీమ్): సిల్వర్ కనోయ్ స్ప్రింట్ ఝ(మెన్స్ డబుల్స్ 1000మీ): బ్రాంజ్ చెస్ (మెన్స్ టీమ్): సిల్వర్ చెస్ (వుమెన్స్ టీమ్): సిల్వర్ క్రికెట్ (మెన్స్): గోల్డ్ క్రికెట్ (వుమెన్స్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్ టీమ్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్): అనూష అగర్వల్లా (బ్రాంజ్) గోల్ఫ్ (వుమెన్స్): అదితి అశోక్ (సిల్వర్) హాకీ (మెన్స్): గోల్డ్ హాకీ (వుమెన్స్): బ్రాంజ్ కబడ్డీ (మెన్స్): గోల్డ్ కబడ్డీ (వుమెన్స్): గోల్డ్ రోలర్ స్కేటింగ్ (వుమెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోలర్ స్కేటింగ్ (మెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ డబుల్స్): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 8): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 4): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ పెయిర్): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ క్వాడ్రపుల్): బ్రాంజ్ సెయిలింగ్ (గర్ల్స్ ILCA4): నేహా ఠాకూర్ (సిల్వర్) సెయిలింగ్ (మెన్స్ ILCA7): విష్ణు శరవనన్ (బ్రాంజ్) సెయిలింగ్ (మెన్స్ విండ్సర్ఫర్ RS-X): ఎబద్ అలీ (బ్రాంజ్) సెపకతక్రా (వుమెన్స్ రేగు): బ్రాంజ్ షూటింగ్ (10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (ట్రాప్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): పలక్ (గోల్డ్) షూటింగ్ (25మీ పిస్టల్ టీమ్ వుమెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ వుమెన్): సిఫ్త్ కౌర్ సమ్రా (గోల్డ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ మెన్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (స్కీట్ మెన్): అనంత్జీత్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (25మీ పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (ట్రాప్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ మిక్సడ్ టీమ్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ మెన్): ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (25మీ రాపిడ్ఫైర్ పిస్టల్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (స్కీట్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (ట్రాప్ మెన్): చెనై కేడీ (బ్రాంజ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్): అషి చౌక్సీ (బ్రాంజ్) స్క్వాష్ పురుషుల జట్టు- స్వర్ణం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- స్వర్ణం స్క్వాష్ పురుషుల సింగిల్స్ సౌరవ్ ఘోశల్ - రజతం స్క్వాష్ మహిళల జట్టు- కాంస్యం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- కాంస్యం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్- కాంస్యం టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్- గోల్డ్ టెన్నిస్ పురుషుల డబుల్స్- రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీ దీపక్ పునియా - రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల అమన్ - కాంస్యం రెజ్లింగ్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీ సునీల్ కుమార్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల ఆంటిమ్ పంఘల్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సోనమ్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీ కిరణ్ - కాంస్యం ఉషు మహిళల 60 కిలోల రోషిబినా దేవి - రజతం -
క్రికెట్ లో భారత్ కు గోల్డ్.. ఎలా వచ్చిందంటే?
-
Asian Games 2023: కబడ్డీలో భారత్కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ స్వర్ణ పతక జోరు కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 స్వర్ణ పతకాలు చేరాయి. తాజాగా పురుషుల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భారత్.. ఇరాన్పై 33-29 తేడాతో నెగ్గింది. ఏషియన్ గేమ్స్ పురుషుల కబడ్డీలో మొత్తంగా భారత్కు ఇది 8వ స్వర్ణం. ఈ పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 28కి చేరింది. మొత్తంగా ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య ఇప్పటివరకు 103కు (28 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. ప్రస్తుతానికి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. చైనా ఇప్పటివరకు 366 పతకాలు (193 స్వర్ణాలు, 107 రజతాలు, 66 కాంస్యాలు) సాధించింది. పతకాల పట్టికలో జపాన్ రెండో స్థానంలో (177; 48 స్వర్ణాలు, 62 రజతాలు, 67 కాంస్యాలు) ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (183; 39 స్వర్ణాలు, 55 రజతాలు, 89 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది. -
Ind Vs Afg: ఫైనల్ మ్యాచ్ రద్దు.. టీమిండియా గోల్డ్ మెడల్ ఎలా గెలిచిందంటే!
Asian Games Mens T20I 2023- India vs Afghanistan, Final: ఆసియా క్రీడల్లో టీమిండియా స్వర్ణంతో మెరిసింది. భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పసిడి గెలిచి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా చైనా వేదికగా హోంగ్జూలో రుతురాజ్ గైక్వాడ్ సేన శనివారం అఫ్గనిస్తాన్తో ఫైనల్లో తలపడింది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాపార్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మారిపోయింది. వరణుడి అంతరాయం కారణంగా 18.2 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉన్న వేళ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రుతురాజ్ సేనకు స్వర్ణం ఎలా అంటే? ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను స్వర్ణం వరించింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు సైతం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇక రుతురాజ్ సేన విజయంతో భారత్ పసిడి పతకాల సంఖ్య 27కు చేరింది. అదే విధంగా 35 రజత, 40 కాంస్య పతకాలు రావడంతో మొత్తంగా 102 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో రుతురాజ్ సేన ప్రయాణం ►పటిష్ట టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ►తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ►తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ►ఫైనల్లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్ రద్దు కావడంతో పసిడి కైవసం. చదవండి: శుభ్మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ ట్వీట్ Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్లో తొలి స్వర్ణం -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్లో తొలి స్వర్ణం
ఏషియన్ గేమ్స్-2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. పతకాలకు సంబంధించి ఇవాళ ఉదయమే సెంచరీ మార్కు తాకిన భారత్ తాజాగా మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్-చోయ్పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. FIRST BADMINTON GOLD FOR INDIA🇮🇳🇮🇳😭😭❤️❤️ History has been scripted in Hangzhou as @Shettychirag04 and @satwiksairaj become the first ever badminton players from India to win gold at the #AsianGames 🥇💯 The 'Brothers of Destruction' defeated South Korea's Kim-Choi in the… pic.twitter.com/X87O5owODf — The Bridge (@the_bridge_in) October 7, 2023 #AsianGames2023 #AsianGames #Cheer4India #IndiaAtAG22 #India 🇮🇳 #SatwiksairajRankireddy and #ChiragShetty after their historic #Badminton gold 🥇 FOLLOW LIVE: https://t.co/38IQLKfS9H@WeAreTeamIndia pic.twitter.com/80fk2YpHIX — TOI Sports (@toisports) October 7, 2023 ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్ ఎన్నడూ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో భారత్కు ఇది (బ్యాడ్మింటన్లో) మూడో పతకం. పురుషుల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్, పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్ గోల్డ్తో భారత్ పతకాల సంఖ్య 101కి (26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. India creates history at the #AsianGames in winning Gold in the men’s doubles in badminton! Congratulations to @satwiksairaj and @Shettychirag04 for their spectacular performance! Kudos to our very our very own @satwiksairaj for making me, all of Andhra Pradesh and India proud!… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2023 అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం నెగ్గిన సాత్విక్సాయిరాజ్-చిరగ్ షెట్టి ద్వయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సాత్విక్సాయిరాజ్ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. సాత్విక్ నాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశాడని కొనియాడాడు. -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. -
AFG vs IND Final: భారత్- ఆఫ్గాన్ ఫైనల్ రద్దు.. టీమిండియాకు గోల్డ్
ఆసియాక్రీడల్లో భారత్-ఆఫ్గానిస్తాన్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 112/5 వద్ద మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేనకు స్వర్ణం ఖాయమైంది. 18 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 109/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(48), నైబ్(26) పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/5 15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్ స్కోర్: 70/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(36), నైబ్(4) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్.. భారత్తో జరగుతున్న ఫైనల్లో ఆఫ్గానిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 53 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఇఒక్క పరుగు మాత్రమే చేసిన కరీం జనత్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 53/5 నాలుగో వికెట్ డౌన్.. 49 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జజాయ్.. బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 47/3 షహీదుల్లా కమల్ నిలకడగా ఆడుతుండటంతో(21 పరుగులతో ) అఫ్గన్ ఇన్నింగ్స్ తిరిగి గాడిలో పడింది. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్గానిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నూర్ అలీ జద్రాన్ రూపంలో ఆఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్ రనటౌయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్గానిస్తాన్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగులు చేసిన జుబైద్ అక్బరీను శివమ్ దుబే పెవిలయన్కు పంపగా.. మహ్మద్ షాజాద్(4)ను అర్ష్దీప్ ఔట్ చేశాడు. 3 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 10/2 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ గోల్డ్మెడల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ దూరమయ్యాడు. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఆఫ్గానిస్తాన్ ఒకే ఒక మార్పు చేసింది. జుబైద్ అక్బరీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్దీప్ సింగ్ ఆఫ్గానిస్తాన్: జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్ టాస్ ఆలస్యం.. ఏషియన్ గేమ్స్-2023 పురుషుల క్రికెట్ ఫైనల్లో పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్- ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది. -
అసాధారణం.. మన అద్భుత విజయం: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత్కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి బంగ్లాదేశ్ గెలుపు! పాక్కు బిగ్ షాక్
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో పాకిస్తాన్కు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాకిచ్చింది. శనివారం పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరిగిన కాంస్య పతకపోరులో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. దీంతో కాంస్య పతకాన్ని బంగ్లా టైగర్స్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో బంగ్లా జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 6 బంతుల్లో 20 పరుగులు.. ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. ముఖీమ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే యాసిర్ అలీ సిక్సర్గా మలిచాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసిన యాసిర్ అలీ.. మూడో బంతిని స్టాండ్స్కు తరలించాడు. ఈ క్రమలో ఆఖరి మూడు బంతుల్లో బంగ్లాకు 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అలీ.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో బంగ్లా డగౌట్లో ఒక్కసారిగా నిరాశ నెలకొంది. అయితే ఆరో బంతికి రకీబుల్ హసన్ ఫోర్ బాది బంగ్లాదేశ్కు చిర్మసరణీయ విజయాన్ని అందించాడు. కాగా తొలుత వర్షం కారణంగా మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించారు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ 5 ఓవర్లలో 48/1 ఉండగా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ను 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్ణయించారు. బంగ్లా బ్యాటర్లలో యాసిర్ అలీ(16 బంతుల్లో 34), అఫిప్ హోస్సేన్(11 బంతుల్లో 20 పరుగులు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. -
టాటూ చూపిస్తూ తిలక్ వర్మ సంబరాలు.. ఎందుకంటే? వీడియో వైరల్
ఆసియాక్రీడలు-2023లో భారత పురుషల క్రికెట్ జట్టు బంగారు పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న తుది పోరులో ఆఫ్గానిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. కాగా బంగ్లాదేశ్తో సెమీఫైనల్లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాదీ తిలక్ వర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో ఒక వికెట్ పడగొట్టిన తిలక్.. అనంతరం బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో సిక్స్తో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న తిలక్ వర్మ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత తిలక్ వర్మ.. టీషర్ట్ పైకెత్తి తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును డగౌట్ వైపు చూపిస్తూ సంబరాలు జరుపుకున్నాడు. కాగా ఆ పచ్చబొట్టు తన తల్లిదండ్రులది కావడం గమానార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ సెలబ్రేషన్స్ గల కారణాన్ని మ్యాచ్ అనంతరం తిలక్ వెల్లడించాడు. "ఈ సెలబ్రేషన్స్ మా అమ్మ కోసం. నేను గత కొన్ని మ్యాచ్ల్లో బాగా రాణించలేకపోయా. నేను కొంచెం బాధపడ్డాను. కానీ మా అమ్మ మాత్రం నాకు ఎల్లప్పడూ సపోర్ట్గా ఉంటుంది. తిరిగి నా రిథమ్ను పొందతానని మాటిచ్చా. అందుకే ఇలా చేశా. అదే విధంగా అమ్మతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ 'సమైరా'కు ఈ హాఫ్ సెంచరీ అంకితమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ ప్రేజేంటేషన్లో తిలక్ వర్మ పేర్కొన్నాడు. కాగా అంతకుముందు వెస్టిండీస్పై చేసిన తన తొలి టీ20 అర్ధ సెంచరీని కూడా సమైరాకు వర్మ అంకితమిచ్చాడు. సమైరా ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి. కాగా 5 ఏళ్ల సామీతో తిలక్ చాలా క్లోజ్గా ఉంటాడు. చదవండి: ODI WC 2023: పాక్ స్టార్ బౌలర్ను కొట్టిన బాబర్ ఆజం.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
ఆసియాక్రీడల్లో భారత్ రికార్డు.. 100 పతకాలు! ఇదే తొలిసారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడల్లో భారత్ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే తొలి సారి 100 పతకాల మార్క్ను భారత్ అందుకుంది. తాజగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్మెడల్ సాధించడంతో.. భారత్ ఈ ఘనత సాధిచింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుది పోరులో చైనీస్ తైపీ జట్టును 26-25తో భారత్ ఓడించింది. దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది. కాగా శనివారం ఒక్క రోజే భారత్ మూడు బంగారు పతకాలు సాధించింది. రెండు ఆర్చరీలో రాగా.. మరో స్వర్ణ పతకం కబడ్డీలో వచ్చింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు 100(25 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Asian Games 2023: అదరగొడుతున్న ఆర్చర్లు.. భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ -
గురి తప్పని బాణం.. జ్యోతి సురేఖ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత ఆర్చర్లు అదరగొడతున్నారు. తాజాగా భారత ఖాతాలో రెండు బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఆర్చరీలో భారత్ రెండు పసిడి పతకాలు భారత్ సాధించింది. పురుషల కాంపౌండ్ ఈవెంట్లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్ మెడల్ సాధించగా.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఆసియాక్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు మూడో బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అధితి గోపిచంద్కు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీలో తాజా విజయాలతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 24కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 99(24 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంక్కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
హాకీలో పసిడి వెలుగులు
ఏ లక్ష్యంతోనైతే చైనా గడ్డపై భారత పురుషుల హాకీ జట్టు అడుగుపెట్టిందో దానిని దిగ్విజయంగా అందుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందాలన్న లక్ష్యాన్ని టీమిండియా సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పోటీల 13వ రోజు భారత్ ఖాతాలో మొత్తం తొమ్మిది పతకాలు చేరాయి. ఆర్చరీలో రజతం, కాంస్యం... రెజ్లింగ్లో మూడు కాంస్యాలు... బ్రిడ్జ్, సెపక్తక్రా, బ్యాడ్మింటన్లో ఒక్కో కాంస్య పతకం లభించాయి. ప్రస్తుతం భారత్ 95 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. నేడు క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, మహిళల హాకీ, చెస్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల బరిలో ఉన్నారు. క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, బ్యాడ్మింటన్ ద్వారా భారత్కు కచ్చి తంగా ఏడు పతకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి నేడు అధికారికంగా 100 పతకాల మైలురాయిని దాటనుంది. హాంగ్జౌ: పక్కా ప్రణాళికతో, పూరిస్థాయిలో సన్నద్ధమై ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు తమ లక్ష్యాన్ని సాధించింది. లీగ్ దశ నుంచి ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా తుది పోరులోనూ ఈ దూకుడు కొనసాగించింది. దాంతో ఆసియా క్రీడల్లో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల విజేత హోదాలో టీమిండియా వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందింది. జపాన్తో జరిగిన తుది పోరులో భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ (32వ, 59వ ని.లో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ ని.లో), మన్ప్రీత్ సింగ్ (25వ ని.లో), అభిషేక్ (48వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు సెరెన్ తనాకా (51వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్గా ఆసియా క్రీడల్లో భారత్ నాలుగోసారి స్వర్ణ పతకం సాధించింది. 1966 బ్యాంకాక్, 1998 బ్యాంకాక్, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లోనూ భారత్ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో చైనా జట్టుపై గెలిచింది. హర్మన్ప్రీత్ 13 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. జపాన్ జట్టును ఏమాత్రం తక్కువ చేయకుండా ఆడిన భారత్ అవకాశం వచ్చి నపుడల్లా ప్రత్యర్థి గోల్పోస్ట్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కొన్నిసార్లు గోల్ చేసే అవకాశాలను చేజార్చుకుంది. తొలి 25 నిమిషాల వరకు భారత్ను నిలువరించిన జపాన్ ఆ తర్వాత తడబడింది. అభిషేక్ ‘డి’ ఏరియా వద్ద నుంచి కొట్టిన రివర్స్ షాట్ను జపాన్ గోల్కీపర్ నిలువరించాడు. తిరిగి వచ్చిన బంతిని అక్కడే ఉన్న మన్ప్రీత్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు పెంచగా... జపాన్ డీలా పడింది. ‘క్రికెట్’ ఫైనల్లో భారత్ తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ క్రీడల్లో టీమిండియా ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో అఫ్గానిస్తాన్తో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 97 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అందుకుంది. భారత్ తరఫున హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (26 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సాయికిశోర్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. -
ఏషియన్ గేమ్స్లో పతక విజేతలకు సీఎం జగన్ అభినందన
సాక్షి, తాడేపల్లి: చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత్, ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాలు సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఏసియా గేమ్స్లో పతకాలు సాధించిన విజేతలకు శుభాకాంక్షలు. ఆర్చర్ అటానుదాస్, బొమ్మదేవర ధీరజ్తోపాటు, రజత పతకం సాధించిన తుషార్ షెల్కేలకు అభినందనలు. మీ విజయాలతో ఏపీతోపాటు దేశమంతా గర్వపడుతోంది. బొమ్మదేవర ధీరజ్ ఒక మెరిసే నక్షత్రం అంటూ సీఎం జగన్ మెచ్చుకున్నారు. మన తెలుగు జెండా రెపరెపలాడుతోందన్నారు.’ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. My best wishes and congratulations to @ArcherAtanu, @BommadevaraD and Tushar Shelke for bringing home silver in the recurve men’s event at the #ASIANGAMES2023. Andhra Pradesh and all of India is incredibly proud of you! A special mention to our very own @BommadevaraD, a… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2023 -
ఆసియాక్రీడల్లో భారత్కు 22వ స్వర్ణం
-
Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ఒలంపిక్స్ బెర్తు ఖరారు
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్ ఒలంపిక్స్-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 22కు చేరింది. సెంచరీ దిశగా భారత్ అదే విధంగా.. ఇప్పటి వరకు 34 వెండి, 39 కాంస్య పతకాలను మన క్రీడాకారులు దేశానికి అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 95 మెడల్స్ సాధించిన భారత్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్లో ఒక పతకం ఖాయం కావడంతో రికార్డు స్థాయిలో కనీసం 101 మెడల్స్ సాధించనుంది. అక్టోబరు 6(శుక్రవారం) నాటి పతకాలు ►మెన్స్ హాకీ: స్వర్ణం ►మెన్స్ బ్రిడ్జ్ టీమ్: రజతం ►మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: అమన్ సెహ్రావత్- కాంస్యం ►వుమెన్ 76కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: కిరణ్ బిష్ణోయి- కాంస్యం ►వుమెన్ 62కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: సోనం మాలిక్- కాంస్యం ►సెపాక్టక్రా వుమెన్స్ టీమ్: కాంస్యం ►బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్: హెస్ ప్రణయ్కు కాంస్యం ►ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీమ్: అతాను, ధీరజ్, తుషార్- రజతం ఖాయమైనవి ►ఫైనల్కు చేరిన కబడ్డీ పురుషుల జట్టు- స్వర్ణం దిశగా అడుగులు ►ఫైనల్కు చేరిన భారత పురుషుల క్రికెట్ జట్టు- స్వర్ణంపై ధీమా తొలిసారి పతకం మహిళల సెపక్తక్రాలో తొలిసారి భారత్కు పతకం ఆసియా క్రీడల సెపక్తక్రా ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది. మహిళల రెగూ టీమ్ ఈవెంట్లో ఐక్పమ్ మైపాక్ దేవి, ఒయినమ్ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్బమ్ ప్రియాదేవి, ఇలాంగ్బమ్ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 10–21, 13–21తో ఓడిపోయింది. బ్రిడ్జ్లో రజతంతో సరి... గత ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్ క్రీడాంశంలో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత బృందం ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 152–238.1 పాయింట్ల తేడాతో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. సందీప్ ఠక్రాల్, జగ్గీ శివ్దసాని, రాజు తొలాని, అజయ్ ప్రభాకర్ రజత పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. రికర్వ్లో తొలిసారి రజతం ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత్ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెర పడింది. చివరిసారి 2010 గ్వాంగ్జౌ ఏషియాడ్లో రికర్వ్ ఈవెంట్ టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాలు లభించాయి. ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్లతో కూడిన జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో భారత్కు తొలిసారి రజత పతకం అందించింది. ఫైనల్లో భారత్ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్పై గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు సిమ్రన్జిత్ కౌర్, అంకిత, భజన్ కౌర్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్యం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో భారత్ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–2తో జపాన్పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. నేడు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం జ్యోతి సురేఖ, కాంస్యం కోసం అదితి... పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్, ఓజస్ ప్రవీణ్ స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడతారు. Indian athletes are on 🔥 Team India beat Japan 5-1 in Asian Games 2022 and won the medal🥇#Asiangames23 #Hockey#PAKvNED #PAKvsNED pic.twitter.com/0kNk3q8EiJ — Saurabh Singh (@100rabhsingh781) October 6, 2023 -
పాకిస్తాన్కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్
Asian Games Mens T20I 2023- Pakistan vs Afghanistan, Semi Final 2: ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్ మెడల్ రేసు నుంచి పాక్ క్రికెట్ బృందం నిష్క్రమించింది. మరోవైపు.. అఫ్గన్ టీమ్ ఈ విజయంతో ఫైనల్కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది. 115 పరుగులకే ఆలౌట్ చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో సెమీఫైనల్లో పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లకే చాపచుట్టేసింది. అఫ్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఒమైర్ యూసఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ గులాబదిన్, కరీం జనత్ ఒక్కో వికెట్ తీయగా.. ఫరీద్ అహ్మద్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఫైనల్కు చేర్చి కైస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్ 5, మహ్మద్ షాజాద్ 9 పరుగులకే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది అఫ్గనిస్తాన్ను ఫైనల్కు చేర్చాడు. పసిడి కోసం టీమిండియాతో పోటీ ఇక పాక్తో మ్యాచ్లో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ ఫైనల్లో టీమిండియాను ఢీకొట్టనుంది. రుతురాజ్ గైక్వాడ్ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11.30 నిమిషాలకు ఆరంభమవుతుంది. కాంస్యం కోసం బంగ్లాతో పాక్ పోరు కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి టీమిండియా గోల్డ్ మెడల్ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్ ఫైనల్స్లో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది. చదవండి: ఇంగ్లండ్కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్తో సంబంధం ఏంటి? -
అదరగొట్టిన తిలక్ వర్మ..సెమీఫైనల్లో బంగ్లా చిత్తు! ఫైనల్కు భారత్
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో రుత్రాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బారత్.. ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. దీంతో భారత్కు పతకం ఖాయమైంది. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(55 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్(40 నాటౌట్) అదరగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! #TeamIndia's skipper wants this done in a jiffy - takes the attack to 🇧🇩 with 2️⃣0️⃣ runs off the 3rd over! Which of these Ruturaj Gaikwad shots was your favourite? 💬⤵️#Cheer4India #INDvBAN #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/z0qHDw4aF1 — Sony LIV (@SonyLIV) October 6, 2023 A stroke-filled half-century for Tilak Varma & a heart-warming celebration for his mom follows ♥️#TeamIndia beat Bangladesh by 9 wickets in the Semi FINALS#Cheer4India #HangzhouAsianGames #AsianGames2023 #ShubmanGill #Ahmedabad #INDvsBAN #Archery #AssassinsCreedMirage… pic.twitter.com/jiX4v6wGLy — Abdul (@RolexbhaisirSir) October 6, 2023 -
చెలరేగిన భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ కేవలం 96 పరుగులకే
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో భాగంగా బంగ్లాదేశ్తో సెమీఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్నర్ల ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
సూపర్ సౌరవ్...
భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్ యో ఎన్జీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ డబుల్స్లో దీపిక పల్లికల్–హరీందర్పాల్ జోడీ (భారత్) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్పాల్ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్–కమాల్ (మలేసియా) జంటపై నెగ్గింది. రెజ్లర్ అంతిమ్కు కాంస్యం మహిళల రెజ్లింగ్లో భారత రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం గెలిచింది. 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో 19 ఏళ్ల అంతిమ్ 3–1తో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బొలోర్తుయా బత్ఒచిర్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్కే చెందిన పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతక బౌట్లో 2–9తో కెయునిమ్జేవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మాన్సి అహ్లావత్ కాంస్య పతక బౌట్లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో 0–4 గోల్స్ తేడాతో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడుతుంది. పురుషుల మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) భారత అథ్లెట్లు మాన్ సింగ్ ఎనిమిదో స్థానంలో (2గం:16ని:59 సెకన్లు), అప్పచంగడ బెలియప్ప (2గం:20ని:52 సెకన్లు) 12వ స్థానంలో నిలిచారు. -
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఏషియన్ గేమ్స్లో బంగారు పథకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన వీజే.సురేఖ, పరిణీత్, అదితిగోపీచంద్ స్వామిలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా గర్వపడుతోందన్న సీఎం.. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. చదవండి: గురి తప్పలేదు.. అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం My best wishes and congratulations to @VJSurekha, @Parrneettt and Aditi Gopichand Swami for winning India the gold in the archery final at #AsianGames2023. Your precision and skill have made all of proud. I and all of Andhra Pradesh is particularly proud of our very own… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2023 -
ఆసియా క్రీడల్లో దీపిక పల్లికల్ జోడికి గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా స్క్వాష్ ఈవెంట్లో భారత్ గోల్డ్మెడల్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్లో దీపిక పల్లికల్–హరీందర్పాల్ ద్వయం 11-10, 11-10తో మలేషియా జంట మొహమ్మద్ కమల్,ఐఫా అజ్మాన్లను ఓడించింది. దీంతో బంగారు పతకాన్ని ఈ భారత జోడీ కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో స్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే దీపిక పల్లికల్–హరీందర్పాల్ ఛాంపియన్స్గా నిలిచారు. స్వాష్ డబుల్స్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 84(20 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. కాగా ఇది స్క్వాష్లో రెండవ స్వర్ణం కావడం విశేషం. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే? 20th gold for India🥇🇮🇳 The experienced pair of Dipika Pallikal and Harinder Pal Singh Sandhu defeated the Malaysian duo 11-10 11-10 to clinch gold in the mixed doubles category of #Squash 🔥💯#AsianGames2022 #AsianGames pic.twitter.com/xcZKc7aVog — The Bridge (@the_bridge_in) October 5, 2023 -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
‘పసిడి’కి విజయం దూరంలో...
పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు... ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై కష్టపడి గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (5వ ని.లో), మన్దీప్ సింగ్ (11వ ని.లో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (24వ ని.లో), అభిషెక్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున మన్జె జుంగ్ (17వ, 20వ, 42వ ని.లో) ‘హ్యాట్రిక్’తో మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో జపాన్ 3–2తో చైనాను ఓడించింది. భారత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... 2018 జకార్తా ఏషియాడ్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
భళా భారత్...
పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. పోటీల 11వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్ రేసుతో నేడు అథ్లెటిక్స్ ఈవెంట్స్కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్ క్రీడాంశాల్లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్ ‘పోస్టర్ బాయ్’ నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్ కుమార్ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్ చోప్రా నుంచి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కిశోర్ కుమార్ జేనా జావెలిన్ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందినా నీరజ్ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్ ఫౌల్ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు. మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్ త్రోయర్గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ నవాజ్ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్ కిశోర్ కుమార్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లో మొహమ్మద్ అనస్, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్ సింగ్, దల్జీత్ సింగ్, జగదీశ్ సింగ్ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్కు బంగారు పతకాన్ని అందించింది. మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్రాజ్లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్ రేసును భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. సురేఖ–ఓజస్ జోడీకి స్వర్ణం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడాంశంలో పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి. -
స్క్వాష్లో రెండు స్వర్ణాలపై గురి
ఆసియా క్రీడల స్క్వాష్ ఈవెంట్లో భారత్ రెండు స్వర్ణ పతకాలపై గురి పెట్టింది. మిక్స్డ్ డబుల్స్లో దీపిక పల్లికల్–హరీందర్పాల్ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లగా... భారత్కే చెందిన అనాహత్ సింగ్–అభయ్ సింగ్ జంట సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో సౌరవ్ ఘోషాల్ కూడా తుది పోరుకు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్లో దీపిక–హరీందర్ ద్వయం 7–11, 11–7, 11–9తో లీ కా యి–వోంగ్ చి హిమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. అనాహత్–అభయ్ జోడీ 11–8, 2–11, 9–11తో అజ్మాన్ ఐఫా–మొహమ్మద్ కమాల్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరవ్ 11–2, 11–1, 11–6తో చి హిన్ హెన్రీ (హాంకాంగ్)పై గెలుపొందాడు. -
Asian Games 2023: భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్ (ముహమ్మద్ అనాస్ యహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్) 4X400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్లో 70 పతకాలు) అధిగమించిన భారత్.. నీరజ్, ఫురుషుల రిలే టీమ్ స్వర్ణాలతో ఏషియన్ గేమ్స్ ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్ స్వర్ణాల విషయంలో ఆల్టైమ్ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి. -
Asian Games 2023: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. 80కి చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్లో ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్ను విసిరి, నీరజ్కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. కాగా, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్, సిల్వర్) భారత్ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో (168 గోల్డ్, 93 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 144 మెడల్స్తో (36, 51, 57) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 145 పతకాలతో (33, 44, 68) మూడో స్థానంలో ఉన్నాయి. -
బంగ్లాదేశ్కు ముచ్చెమటలు పట్టించిన మలేషియా.. సెమీస్లో టీమిండియాతో "ఢీ"
ఏషియన్ గేమ్స్-2023 మెన్స్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్కు ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్లో మలేషియా.. బంగ్లాదేశ్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. అఫీఫ్ హొస్సేన్ ఆల్రౌండ్ షోతో (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు, 4-0-11-3) ఆదుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్కు ఘోర పరాభవం ఎదురయ్యేది. అఫీఫ్ పుణ్యమా అని ఈ మ్యాచ్లో గట్టెక్కిన బంగ్లాదేశ్, అక్టోబర్ 6న జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన టీమిండియాను ఎదుర్కొంటుంది. బంగ్లా బ్యాటర్లకు కట్టడి చేసిన మలేషియా బౌలర్లు.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. మలేషియా బౌలర్లు పవన్దీప్ సింగ్ (4-1-12-2), విరన్దీప్ సింగ్ (4-0-13-0) బంగ్లా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. విజయ్ ఉన్ని, అన్వర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ సైఫ్ హస్సన్ (50 నాటౌట్), అఫీఫ్ హొస్సేన్ (23), షాదత్ హొస్సేన్ (21) మాత్రమే రాణించారు. మలేషియాను గెలిపించినంత పని చేసిన విరణదీప్ సింగ్.. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేషియా 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరన్దీప్ సింగ్ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి ఓవర్ వరకు క్రీజ్లో నిలబడి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్ హొస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. అఫీఫ్ చివరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ (విరన్దీప సింగ్) పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ 3లో ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకు షాకిచ్చి సెమీస్కు చేరుకుంది. సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్.. పాక్ను ఢీకొంటుంది. -
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట.. ఇదే తొలి సారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023 భారత్ హవా కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. ఇదే తొలిసారి.. ఈ విజయంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యధిక పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియాక్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది. కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్ ✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨ With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅 Our athletes' dedication and hard work have made this moment possible🔥 Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV — SAI Media (@Media_SAI) October 4, 2023 -
శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్
ఏషియన్ గేమ్స్ 2023 పురుషల క్రికెట్లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్కు బిగ్ షాకిచ్చింది. హాంగ్జౌ వేదికగా జరిగిన క్వార్టర్పైనల్-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్ జట్టు అడుగుపెట్టింది. కాగా 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆఫ్గాన్ బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ నైబ్, కైస్ అహ్మద్ తలా మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు జహీర్ ఖాన్, జనత్, ఆష్రాప్ తలా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్.. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో 116 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో నూర్ అలీ జద్రాన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. సహన్ అరాచ్చిగే రెండు, సమరాకూన్ తలా, విజయ్కాంత్ చెరో వికెట్ సాధించారు. చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్ -
కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే జోడీ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. కాగా ఆసియా క్రీడల్లో ఇది భారత్కు 16 స్వర్ణం. ఓవరాల్గా ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 71 పతకాలు కైవసం చేసుకుంది. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం -
పసిడి ‘పంచ్’కు లవ్లీనా
ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్లో మంగళవారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రీతి 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో... నరేందర్ 0–5తో కున్కబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ, రజత పతకం రేసులో నిలిచింది. అంతే కాకుండా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. సెమీఫైనలో లవ్లీనా 5–0తో బైసన్ మనికోన్ (థాయ్లాండ్)పై గెలిచింది. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1–4తో లియు పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: ODI WC 2023: అహ్మదాబాద్కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు -
29 ఏళ్ల తర్వాత కనోయింగ్లో పతకం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రీడాకారులు అర్జున్ సింగ్–సునీల్ సింగ్ ఆసియా క్రీడల కనోయింగ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకం అందించారు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ కనోయ్ 1000 మీటర్ల స్ప్రింట్లో అర్జున్–సునీల్ 3ని:53.329 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో సిజీ సదానందన్–జానీ రోమెల్ భారత్కు కాంస్యం అందించారు. చదవండి: Asian Games 2023: ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో సింధు 21–10, 21–15తో వి చి సు (చైనీస్ తైపీ)పై, శ్రీకాంత్ 21–16, 21–11తో లీ యున్ జియు (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–12తో బత్దవా ముంఖ్బత్ (మంగోలియా)పై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–14, 21–12తో నబీహా–ఫాతిమత్ (మాల్దీవులు) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. స్క్వాష్ ‘మిక్స్డ్’లో పతకం ఖాయం స్క్వాష్ ‘మిక్స్డ్ డబుల్స్’ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్ పాల్ సింగ్ జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఈ ఈవెంట్లో భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో దీపిక –హరీందర్ 7–11, 11–5, 11–4 స్కోరుతో ఫిలిప్పీన్స్కు చెందిన అరిబాడో–ఆండ్రూ గారికాపై గెలిచారు. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి
ఏషియన్ గేమ్స్లో ఇవాళ (అక్టోబర్ 3) కూడా భారత్ జోరు కొనసాగుతుంది. మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో అన్నూ 62.92 మీటర్ల దూరం వరకు జావెలిన్ (బల్లెం) విసిరి, ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. Gold in women’s javelin throw at the Asian Games in Hangzhou. Annu Rani best throw was 62.92m.@Adille1 @Media_SAI pic.twitter.com/sYnRJUTmpm — Athletics Federation of India (@afiindia) October 3, 2023 -
Asian Games 2023: భారత్ ఖాతాలో 15వ స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. 5000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ఇవాళ (అక్టోబర్ 3) పారుల్ చౌదరీ స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 69కి (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) చేరింది. నిన్న 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో సిల్వర్ మెడల్ సాధించిన పారుల్ గంటల వ్యవధిలో తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది. ఈ పతకంతో పారుల్ చౌదరీ స్వర్ణం నెగ్గిన మూడో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నిలిచింది. Hangzhou Asian Games: India's Parul Chaudhary wins gold medal in Women's 5000-metre racePhoto source: Athletics Federation of India (AFI) pic.twitter.com/oxyHWYM2qN— ANI (@ANI) October 3, 2023 5000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో తొలుత వెనుకపడిన పారుల్, ఆతర్వాత అనూహ్యంగ పుంజుకుని 15:14.75 సెకెన్లలో రేసును ముగించింది. ఈ ఈవెంట్లో జపాన్ అథ్లెట్ రిరికా హిరోనాకాకు (15:15.34) రజత పతకం లభించగా.. కజకిస్తాన్ అథ్లెట్ కరోలిన్ కిప్కిరుయ్కు (15:23.12) కాంస్యం దక్కింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ అంకిత (15:33.03) ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, 69 పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 292 పతకాలతో (159 గోల్డ్, 87 సిల్వర్, 46 బ్రాంజ్) చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 129 పతకాలతో (33, 46, 50) జపాన్ రెండో స్థానంలో, 138 పతకాలతో (32, 42, 64) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన హాంగ్కాంగ్ బౌలర్లు.. అయినా..!
ఏషియన్ గేమ్స్ 2023లో పసికూన హాంగ్కాంగ్ పటిష్టమైన పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. హాంగ్కాంగ్ మ్యాచ్ అయితే గెలవలేపోయింది కాని, పాక్ బ్యాటింగ్ను కకావికలం చేసి నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసింది. 8.5 ఓవర్లలో కేవలం 54 పరుగులకే సగం పాక్ వికెట్లు పడగొట్టిన హాంగ్కాంగ్ బౌలర్లు.. ఆ తర్వాత పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆమెర్ జమాల్ను (16 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కట్టడి చేయడంలో విఫలం కావడంతో పాక్ ఓ మోస్తరు చేయగలిగింది. అయితే ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో హాంగ్కాంగ్ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో పాక్ సెమీ ఫైనల్కు చేరుకోగా.. హాంగ్కాంగ్ ఇంటిదారి పట్టింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్-2లో టాస్ ఓడి హాంగ్కాంగ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడినప్పటికీ, ఆతర్వాత తేరుకుని నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పాక్కు ఆమెర్ జమాల్ (41) ఆదుకోగా.. ఆసిఫ్ అలీ (25), అరాఫత్ మిన్హాస్ (25), ఒమర్ యూసుఫ్ (21), ఖుష్దిల్ (13), రోహైల్ నజీర్ (13), ఖాసిమ్ అక్రమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. హాంగ్కాంగ్ బౌలర్లలో ఆయేష్ శుక్లా (4-0-49-4) పాక్ టాపార్డర్ను గడగడలాడించగా.. మెహమ్మద్ గజన్ఫార్ (4-0-26-3), అనాస్ ఖాన్ (3-0-18-2), ఎహసాన్ ఖాన్ (4-0-28-1) వికెట్లు తీశారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంగ్కాంగ్.. ఖుష్దిల షా (4-0-13-3), అరాఫత్ మిన్హాస్ (4-0-19-2), సుఫియాన్ ముఖీమ్ (4-1-11-2), ఖాసిమ్ అక్రమ్ (1.5-0-6-2) ధాటికి 18.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటై, 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హాంగ్కాంగ్ ఇన్నింగ్స్లో బాబర్ హయత్ (29) టాప్ స్కోరర్గా నిలువగా.. ఎహసాన్ ఖాన్ (16 నాటౌట్), నియాజ్ అలీ (12), నిజఖత్ ఖాన్ (11), శివ్ మాథుర్ (100 రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్కు ముందు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్.. నేపాల్ను మట్టికరిపించి, సెమీస్కు చేరింది. సెమీస్లో భారత్.. క్వార్టర్ ఫైనల్-4 (బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా) విజేతను ఎదుర్కొంటుంది. పాక్ సెమీస్లో క్వార్టర్ ఫైనల్-3 (శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్) విజేతతో తలపడుతుంది. భారత్, పాక్లు సెమీస్ను దాటితే స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడతాయి. -
అదరగొడుతున్న భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా నాలుగో విజయం
ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్తో జరిగిన చివరి పూల్ మ్యాచ్లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్ గ్రేస్ ఎక్కా తలా మూడు గోల్స్తో అదరగొట్టారు. వీరి ముగ్గురితో పాటు సంగీతా కుమారి రెండు గోల్స్, నవనీత్ కౌర్ ఒక్క గోల్ సాధించారు. కాగా పూల్-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్లో పూల్-బి రన్నరప్తో భారత్ తలపడనుంది. చదవండి: అతడిని భారత క్రికెటర్గా చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్ -
అతడిని భారత క్రికెటర్గా చూడటం చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్
తమిళనాడు యువ ఆల్రౌండర్ సాయి కిషోర్ నేపాల్పై టీమిండియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసియాక్రీడలు-2023లో భాగంగా నేపాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్తో సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సాయి కిషోర్కు తన సహచర ఆటగాడు, వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అభినందనలు తెలిపాడు. "కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఆ దేవుడు ఖచ్చితంగా అన్ని తిరిగి ఇస్తాడు. తెల్ల బంతితో దేశవాళీ క్రికెట్లో అద్బుతాలు చేసిన ఈ ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఉదయం లేచి ప్లేయింగ్ ఎలెవన్లో అతడి పేరు చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను. మీరు అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నారు. కానీ అతడు ఎప్పుడూ నా దృష్టిలో నెంబర్1గానే ఉంటాడు. సాయి కిషోర్కు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా ఉంది. అతడు తన బ్యాటింగ్ను కూడా బాగా మెరుగుపరుచుకున్నాడు. అతడు కేవలం టీ20 క్రికెట్కు మాత్రమే కాదు అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటగాడు. అతడిని ఇండియన్ క్రికెటర్గా చూడటం చాలా సంతోషంగా ఉంది. నీవు మరిన్ని అద్బుతాలు సృష్టించు సాయి" అంటూ ఎక్స్(ట్విటర్)లో దినేష్ కార్తీక్ రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ జాతీయ గీతాలాపన సమయంలో సాయి కిషోర్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. తొలి మ్యాచ్లో సాయి కిషోర్ పర్వాలేదనపించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు God has his ways of giving back to people who work hard This unbelievable player @saik_99 who has DOMINATED domestic cricket with white ball is an absolute superstar and I couldn't be happier for him. Woke up in the morning and when I saw his name in the 11 , i was… https://t.co/6RijBdRP6R — DK (@DineshKarthik) October 3, 2023 -
టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!
తమిళనాడు యువ ఆల్రౌండర్ సాయి కిషోర్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్పై సాయి కిషోర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో సాయి కిషోర్ తన తొలి మ్యాచ్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. జాతీయ గీతం ప్రారంభం కాగానే సాయి కిషోర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సాయి తన తొలి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో నేపాల్పై 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు Emotions aplenty as Sai Kishore swelled up during the national anthem of 🇮🇳, making his T20I debut today 🆚🇳🇵 Drop a 💙 if you believe hard work always pays off 🙌💯#Cheer4India #TeamIndia #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/x9fdZjIGg2 — Sony LIV (@SonyLIV) October 3, 2023 -
23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్కు చేరిన టీమిండియా
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హాంగ్జౌ వేదికగా జరిగిన క్వార్టర్పైనల్-1లో నేపాల్ను 23 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నేపాల్ ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. తొలి భారత ఆటగాడిగా!
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ విరోచిత శతకంతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. కాగా ఇది జైశ్వాల్కు తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే.. ఆసియాక్రీడల్లో సెంచరీ సాధించిన తొలి ఇండియన్గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో పురుషల, మహిళలల క్రికెట్లో ఎవరూ ఈ ఘనత సాధించలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్నవయస్సులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా యశస్వీ నిలిచాడు. 21 ఏళ్ల తొమ్మిది నెలల 13 రోజుల వయస్సులో జైశ్వాల్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మరో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ న్యూజిలాండ్పై 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో గిల్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఇంటర్ననేషనల్ టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో సురేష్ రైనా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శుబ్మన్ గిల్ ఉన్నారు. ఈ జాబితాలోకి జైశ్వాల్ కూడా చేరాడు. చదవండి: Asian games 2023: యశస్వీ జైశ్వాల్ విధ్వంసకర సెంచరీ.. -
జైశ్వాల్, రింకూ సింగ్ మెరుపులు.. నేపాల్ బౌలర్లకు చుక్కలు
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై భారత జట్టు అదరగొట్టింది. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్లతో 100 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇక ఆఖరిలో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ తన స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయయాడు. 23 బంతులు ఎదుర్కొన్న రుత్రాజ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా తిలక్ వర్మ(2), అరంగేట్ర ఆటగాడు జితేష్ శర్మ(5) తీవ్ర నిరాశపరిచాడు. ఇక నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే' -
యశస్వీ జైశ్వాల్ విధ్వంసకర సెంచరీ..
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్గా 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్లతో 100 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్తో పాటు రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే' Indian left-handed batters to score a T20I century: Suresh Raina v SA, 2010 Yashasvi Jaiswal v NEP, today#INDvNEP #AsianGamespic.twitter.com/IKDDDPamHP — Kausthub Gudipati (@kaustats) October 3, 2023 -
బంగ్లాదేశ్పై ఘన విజయం.. సెమీస్లో భారత హాకీ జట్టు
స్వర్ణ పతకం సాధించి... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించడమే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన భారత్ పూల్ ‘ఎ’లో 15 పాయింట్లతో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్తో సోమవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (2వ, 4వ, 32వ ని.లో), మన్దీప్ సింగ్ (18వ, 24వ, 46వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించి ‘హ్యాట్రిక్’లు నమోదు చేశారు. అభిషేక్ (41వ, 57వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (47వ ని.లో), గుర్జంత్ సింగ్ (56వ ని.లో), అమిత్ రోహిదాస్ (28వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పూల్ ‘ఎ’లోనే జపాన్ జట్టు 12 పాయింట్లతో రెండో సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 3–2తో పాకిస్తాన్ను ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ పూల్ ‘ఎ’లో మూడో స్థానానికి పరిమితమై సెమీఫైనల్కు చేరుకోలేకపోయింది. పూల్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, చైనా జట్లు టాప్–2లో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగే సెమీఫైనల్స్లో చైనాతో భారత్; దక్షిణ కొరియాతో జపాన్ తలపడతాయి. భారత్, చైనీస్ తైపీ మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు తొలి మ్యాచ్లోనే ఊహించని ఫలితం ఎదురైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా చైనీస్ తైపీతో సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ను భారత్ 34–34తో ‘డ్రా’ చేసుకుంది. చివరి సెకన్లలో ఆఖరి రెయిడ్తో చైనీస్ తైపీ బోనస్ పాయింట్ సంపాదించి మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. భారత్ ఒకదశలో 26–20తో ముందంజ వేసి ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారత జట్టు వృథా చేసుకొని గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే' -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్జంప్లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్వాల్ట్లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. రేపే టీమిండియా మ్యాచ్.. ప్రత్యర్ధి ఎవరంటే..?
ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల క్రికెట్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. జట్ల సీడింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వార్టర్స్కు చేరుకోగా.. క్వాలిఫయింగ్ పోటీల ద్వారా నేపాల్, హాంగ్కాంగ్, మలేషియా జట్లు ఫైనల్ 8కు చేరాయి. టీమిండియా మ్యాచ్ ఎవరితో, ఎప్పుడంటే..? ఈ పోటీల్లో టీమిండియా మ్యాచ్ రేపు జరుగనుంది. తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్.. టీమిండియాతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు (అక్టోబర్ 3) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పోటీల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా.. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నేపాల్ అండర్ డాగ్గా బరిలోకి దిగనుంది. నేపాల్ జట్టు సభ్యులు ఇటీవలే మంగోలియాపై పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి, అత్యధిక టీమ్ స్కోర్.. ఇలా ఈ మ్యాచ్లో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మిగతా క్వార్టర్ ఫైనల్స్లో ఎవరెవరంటే..? తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్, నేపాల్ జట్లు తలపడనుండగా.. రెండో క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్, హాంగ్కాంగ్ (అక్టోబర్ 3న ఉదయం 11:30 గంటలకు), మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ (అక్టోబర్ 4న ఉదయం 6:30 గంటలకు), నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్, మలేషియా (అక్టోబర్ 4న ఉదయం 11:30 గంటలకు) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ల్లో విజేతలు అక్టోబర్ 6న జరిగే సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 7న స్వర్ణ పతకం కోసం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఏషియన్ గేమ్స్లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్లాండ్ను దెబ్బకొట్టారు. థాయ్లాండ్ ఇన్నింగ్స్లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్తో తలపడనుంది. -
నేనేంటో నాకు తెలుసు.. వదిలిపెట్టను: స్వప్నాకు నందిని అగసార కౌంటర్
స్వప్నా బర్మన్ చేసిన సంచలన ఆరోపణలను భారత అథ్లెట్ నందిని అగసార ఖండించింది. తన విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చింది. తానేంటో తనకు తెలుసునని.. ఒకవేళ స్వప్నా దగ్గర తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరింది. కాగా ఆసియా క్రీడలు-2023లో తెలంగాణకు చెందిన నందిని అగసార హెప్లథ్టాన్ విభాగంలో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాలోని హోంగ్జూలో ఏడు క్రీడాంశాలతో కూడిన హెప్టథ్టాన్లో సత్తా చాటి మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాన్స్జెండర్ వల్ల తాను కాంస్యం కోల్పోయానంటూ సంచలన పోస్టుతో నందినిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటమిని తట్టుకోలేని ఆమె విద్వేషంతో ఈ మేరకు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. నందినిని తక్కువ చేసేలా మాట్లాడిన స్వప్నా బర్మన్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన నందిని అగసార స్వప్నాకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ‘‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర నాకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. నేను కూడా నా దగ్గర దేశం కోసం గెలిచిన ఈ మెడల్ను చూపిస్తాను. దేశం కోసం ఆడాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు మేము గెలిచాం. మా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయనుకుంటా. ఈ విషయాన్ని నేను భారత అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను పతకం సాధించానన్న ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇండియాకు వెళ్లిపోతున్నాను’’ అని నందిని అగసార పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా తెలంగాణకు చెందిన 20 ఏళ్ల నందిని మహిళల హెప్లథ్టాన్ విభాగంలో 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు స్వప్నా బర్మన్కు ఈ ఈవెంట్లో 5708 పాయింట్లు మాత్రమే వచ్చాయి. చదవండి: కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్ #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
భారత అథ్లెట్ నందినిపై విషం చిమ్మిన స్వప్నా.. ట్రాన్స్జెండర్ అంటూ తీవ్ర ఆరోపణలు
భారత అథ్లెట్ స్వప్నా బర్మన్ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్జెండర్గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్ మెడల్ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. Now this is Shocking! Swapna Barman, who finished 4th in Heptathlon yesterday, saying that compatriot Nandini, who won Bronze medal, is a transgender and that this is against the rules of Athletics! https://t.co/ST6Th0mAc9 — India_AllSports (@India_AllSports) October 2, 2023 ‘‘చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడల్లో భాగంగా నేను నా కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్జెండర్ వుమెన్కు చేజార్చుకున్నాను. నా మెడల్ నాకు కావాలి. నాకు ఎవరైనా సాయం చేయండి. అథ్లెటిక్స్లో ఇలాంటి వాళ్లు పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధం’’ అంటూ ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వెంటనే ఆ పోస్ట్ను స్వప్నా డిలీట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. కాగా స్వప్నా బర్మన్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ వచ్చిందా లేదంటే ఆమె అకౌంట్ నుంచి వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా నందినిపై ఆరోపణలు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం.. ట్రాన్స్జెండర్ అథ్లెట్లు మహిళా వరల్డ్ ర్యాంకింగ్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కాగా స్వప్నా ఇటీవల బ్రిడ్జ్తో మాట్లాడుతూ.. ‘‘టెస్టోస్టిరాన్ లెవల్స్ 2.5 కంటే ఎక్కువగా ఉన్నవాళ్లు 200 మీ. మించి ఏ ఇతర ఈవెంట్లలో పాల్గొనకూడదు. ఏ అమ్మాయైనా సరే.. త్వరగా హెప్టాథ్లాన్ ఈవెంట్ను పూర్తి చేయలేదు. నేనైతే 13 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఆమె నాలుగు నెలల శిక్షణలోనే ఈ స్థాయికి ఎలా చేరుకుందో’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం), 800 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన అగసార నందిని కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో స్వప్నా బర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 🎽𝗔 𝗖𝗢𝗡𝗧𝗥𝗢𝗩𝗘𝗥𝗦𝗬 𝗨𝗡𝗙𝗢𝗟𝗗𝗜𝗡𝗚! Swapna Barman, who finished fourth in the Heptathlon, has alleged that her fellow Indian and Bronze winner Nandini Agasara is transgender and contends that this gives her an unfair advantage in competing in the women's event. 🥉… pic.twitter.com/CsM5sJVF8I — Team India at the Asian Games 🇮🇳 (@sportwalkmedia) October 2, 2023 -
జ్యోతి విజయం అపూర్వ ఘట్టం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆసియా క్రీడలు 2023 మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో రజత పతకం సాధించిన జ్యోతి యార్రాజీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. జ్యోతి విజయం.. ఆంధ్రప్రదేశ్కి మరో అపూర్వ ఘట్టం అంటూ ట్వీట్ ద్వారా ప్రశంసలు గుప్పించారు. జ్యీతి అంకితభావం, కృషి.. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం గర్వించేలా చేసింది. ఈ అద్భుతమైన విజయం సాధించిన జ్యోతికి అభినందనలు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Another glorious moment for Andhra Pradesh! Congratulations to @JyothiYarraji on winning the Silver medal in Women's 100m hurdles at the Asian Games. Your dedication and hard work have made Andhra Pradesh and India proud. Kudos to you for this incredible achievement. The Telugu… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
చైనాలో కొనసాగుతున్న భారత్ పతకాల వేట.. చరిత్ర సృష్టించిన ముఖర్జీ సిస్టర్స్
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది. కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్లో 9, షూటింగ్లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! ముఖర్జీ సిస్టర్స్కు కాంస్యం టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓 🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫 They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p — SAI Media (@Media_SAI) October 2, 2023 రోలర్ స్కేటింగ్లో.. భారత స్కేటింగ్ రిలే టీమ్ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. అబ్బాయిలు సైతం.. రోలర్ స్కేటింగ్లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ. రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కలిసి భారత్కు మరో పతకం అందించారు. 🥉 BACK TO BACK BRONZE GLORY 🇮🇳 What a start to the day! ☀️ 🇮🇳's Aryan Pal, Anand Kumar, Siddhant, and Vikram have rolled their way to BRONZE in the Men's Speed Skating 3000m Relay, clocking an incredible time of 4:10.128! 🤩 🛼 Let's give them a roaring applause for their… pic.twitter.com/WkLDxvKvTS — SAI Media (@Media_SAI) October 2, 2023 -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్ను భారత్ 1–1 గోల్తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్లో, కొరియా రెండో ర్యాంక్లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను హాంకాంగ్తో మంగళవారం ఆడుతుంది. -
క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్లో నిలిచారు. -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్లో ఒక్కో పతకం లభించాయి. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్పుట్లో తజీందర్పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్జంప్లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్కు రజతం, జాన్సన్కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్కు చెందిన మొహమ్మద్ అల్గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
సూపర్ కైనన్...
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. షూటింగ్ క్రీడాంశం చివరిరోజు భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం కలిపి మూడు పతకాలు వచ్చాయి. ఓవరాల్గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి. పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్కు అర్హత పొందారు. వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. రజతంతో ముగింపు... ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో గాయంతో ఫైనల్కు దూరమైన భారత నంబర్వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు. -
నిఖత్ జరీన్కు చుక్కెదురు
కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ 2–3తో రక్సత్ చుథామట్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రక్సత్ను అలవోకగా ఓడించిన నిఖత్కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. పక్కా ప్రణాళికతో ఈ బౌట్లో దిగిన రక్సత్ భారత బాక్సర్ను నిలువరించింది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్కే చెందిన పర్వీన్ హుడా (63 కేజీలు) సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పర్విన్ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. అయితే జాస్మిన్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఉంగ్యోంగ్ వన్ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్లకు జాస్మిన్ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్ను ముగించి ఉంగ్యోంగ్ను విజేతగా ప్రకటించారు. -
‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి
Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది. 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది. అయితే చివరి ఈవెంట్ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. 2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది. పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్ అకాడమీ తొలి బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
ఏషియన్ గేమ్స్లో ఇవాళ టీమిండియాకు పతకాల పంట.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) భారత్కు పతకాల పంట పండింది. ఈ రోజు టీమిండియా ఏకంగా 15 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. ఏషియన్ గేమ్స్ హిస్టరీలో భారత్ ఒకే రోజు ఇన్ని పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 14వ రోజు భారత్ సాధించిన 11 పతకాలే ఇవాల్టి వరకు ఓ రోజులో భారత్ సాధించిన అత్యధిక పతకాలుగా ఉన్నాయి. దీని తర్వాత 2014 ఆసియా క్రీడల్లో 8వ రోజు భారత్ 10 పతాకలు సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ 10వ రోజు 9 పతకాలు సాధించింది. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 9వ రోజు భారత్ 9 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే, ఇవాళే భారత్ పతకాల సంఖ్య కూడా 50 దాటింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 53 పతకాలు ఉన్నాయి. 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్య పతకాలను భారత్ ఇప్పటిదాకా సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 243 పతకాలతో చైనా (132 గోల్డ్, 72 సిల్వర్, 39 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 125 పతకాలతో (30, 35, 60) కొరియా రెండో స్థానంలో, 112 పతకాలతో (29, 41, 42) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, 2018 క్రీడల్లో గెలిచిన 69 పతాకలే ఇప్పటివరకు భారత్ అత్యధిక పతకాల సంఖ్యగా కొనసాగుతుండగా.. ఈసారి క్రీడల్లో భారత్ ఈ రికార్డును సునాయాసంగా దాటి 100 పతకాల మార్కును తాకుందని అంచనా. ఈ ఎడిషన్లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి. ఇవాళ భారత్ సాధించిన స్వర్ణ పతకాలు.. పురుషుల ట్రాప్ టీమ్ షూటింగ్ (కైనన్ డేరియస్, జొరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్) అవినాశ్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్) తజిందర్పాల్ సింగ్ తూర్ (మెన్స్ షాట్పుట్) -
ఏషియన్ గేమ్స్లో హైడ్రామా.. రజతంతో సరిపెట్టుకున్న ఆంధ్ర అమ్మాయి
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) హైడ్రామా చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్లో చైనా అథ్లెట్ వు యన్ని నిర్ణీత సమయానికంటే ముందే పరుగు ప్రారంభించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ డిస్క్వాలిఫై అయ్యింది. తద్వారా ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీకి రజత పతకం దక్కింది. ఈ పోటీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన యర్రాజీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా లయ తప్పి రజతంతో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్ రేస్ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించగా.. ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరుగు మొదలుపెట్టింది. రేస్ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్ ఫుటేజ్లను పరిశీలించి, చైనా అథ్లెట్ను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ విషయంలో జ్యోతి యర్రాజీ ఉద్దశపూర్వకంగా ఎలాంటి తప్పిదం చేయలేదని నిర్ధారించుకుని ఆమెకు రజతం ప్రకటించారు నిర్వహకులు. ఏదిఏమైనప్పటికీ చైనా అథ్లెట్ చేసిన తప్పిదం కారణంగా మన విశాఖ అమ్మాయి ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. యర్రాజీ సాధించిన పతకంతో ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 52కు (13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. మరో 2 స్వర్ణాలు
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాశ్ సాబ్లే.. షాట్పుట్లో తజిందర్పాల్ సింగ్ తూర్ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్తో ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్, 16 సిల్వర్, 16 బ్రాంజ్) చేరింది. 13th Gold Medal for India 🇮🇳 in Asian Games. - Tajinderpal Singh Toor is a hero.pic.twitter.com/dIfl9NN0DB — Johns. (@CricCrazyJohns) October 1, 2023 పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్, 71 సిల్వర్, 38 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్ 110 మెడల్స్తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి. Avinash Sable - the hero of India today in Asian Games!A Gold Medal in record time in 3000m Steeplechase.pic.twitter.com/EpLjVD83YF— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2023 రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే.. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకం. నాలుగో షాట్పుటర్.. షాట్పుట్లో స్వర్ణంతో మెరిసిన తజిందర్ పాల్ సింగ్ తూర్ వరుసగా రెండో ఏషియన్ గేమ్స్లో (2018, 2023) గోల్డ్ మెడల్స్ సాధించిన నాలుగో షాట్పుటర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగిందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత క్రీడల్లో తూర్ సాధించిన పతకం భారత్కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో స్వర్ణ పతకం సాధించాడు. -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు పృథ్వీరాజ్ తొండైమాన్, క్యానన్ చెనై, జొరావర్ సింగ్ సంధు గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 12వ గోల్డ్ మెడల్ చేరింది. ఓవరాల్గా భారత్ ఖాతాలో ప్రస్తుతం 44 మెడల్స్ (12, 16, 16) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 229 పతకాలతో (121 గోల్డ్, 71 సిల్వర్, 37 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 121 పతకాలతో (30, 33, 58) రెండో స్థానంలో, జపాన్ 108 మెడల్స్తో (29, 39, 40) మూడో స్థానంలో ఉన్నాయి. 🥇 Gold Rush Alert! 🥇 #AsianGames2022 🇮🇳 Shooters @tondaimanpr, #KheloIndiaAthlete @KynanChenai, and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Men's Trap Team event! 🎯🇮🇳 with an Asian Games record of 361 ⚡ Their precision, focus, and teamwork have brought glory… pic.twitter.com/7pAakYlsaj — SAI Media (@Media_SAI) October 1, 2023 ఇదిలా ఉంటే, మెన్స్ ట్రాప్-50 టీమ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ తొండైమాన్, క్యానన్ చెనై, జొరావర్ సింగ్ సంధు త్రయం స్వర్ణం సాధించడానికి ముందు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.. మనీశా కీర్, ప్రీతి రజక్, రాజేశ్వరి కుమారి టీమ్ భారత్కు 16వ సిల్వర్ మెడల్ అందించింది. దీనికి ముందు అదితి అశోక్ గోల్ఫ్లో భారత్కు రజత పతకం అందించింది. అదితి ఆసియా క్రీడల్లో గోల్ఫ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కింది. అంతకుముందు 1982లో లక్ష్మనన్ సింగ్ భారత్కి గోల్ఫ్లో స్వర్ణం అందించాడు. -
టీ20ల్లో నేపాల్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు
ఏషియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్ జట్టు ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో రికార్డుల రారాజుగా మారింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. తాజాగా మాల్దీవ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు బౌలర్ అభానష్ బొహారా టీ20ల్లో ఏడో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అతను 3.4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో నేపాల్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ విభాగానికి సంబంధించి మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. ఇదే ఏడాది చైనాతో జరిగిన మ్యాచ్లో ఇద్రుస్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇద్రుస్కు ముందు 7 వికెట్లు తీయలేదు. ఇదిలా ఉంటే, ఏషియన్ గేమ్స్లో మాల్దీవ్స్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. మాల్దీవ్స్ 19.4 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా.. గత మ్యాచ్లో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన కుషాల్ మల్లా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. మాల్దీవ్స్ బౌలర్లలో నజ్వాన్ ఇస్మాయిల్ (4-0-17-3) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మాల్దీవ్స్ అభినాశ్ బొహార ధాటికి 74 పరుగులకు కుప్పకూలింది. మాల్దీవ్స్ ఇన్నింగ్స్లో ఘనీ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత్ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన అదితి అశోక్.. గోల్ఫ్లో తొలి పతకం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత గోల్ఫర్ అదితి అశోక్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల గోల్ఫ్ పోటీలో అదితి అశోక్ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో గోల్ఫ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అదితి రికార్డులకెక్కింది. అండర్-17 స్కోర్తో నాలుగు రౌండ్ల పోటీని ముగించిన అదితి రెండో స్ధానంలో నిలిచింది. ఇక అండర్-19 స్కోర్తో అగ్రస్ధానంలో నిలిచిన థాయ్లాండ్ గోల్ఫర్ అర్పిచాయ యుబోల్ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఆసియాక్రీడల్లో భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది. అందులో 11 బంగారు పతకాలు, 16 సిల్వర్, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్ -
Asian Games 2023: బంగారంలాంటి కూతురు
దివ్యాకృతి సింగ్, అనూష్, హృదయ్, సుదీప్తిలతో కూడిన ఇండియన్ టీమ్ ఈక్వెస్ట్రియన్ డ్రస్సెజ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో ఒకరైన దివ్యాకృతిసింగ్కు తండ్రి విక్రమ్ రాథోడ్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఆమె ట్రైనింగ్ కోసం ఇంటిని కూడా అమ్మాడు. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదువుకునే రోజుల్లో పోటీ పడేందుకు గుర్రం లేకపోవడంతో రెండు సంవత్సరాలు పోటీకి దూరంగా ఉంది దివ్యాకృతి. ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే కూతురు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో గుర్రాన్ని కొన్నాడు. గుర్రం కొనడం నుంచి స్పాన్సరర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం వరకు విక్రమ్ రాథోడ్ పడని కష్టం లేదు. ఏమైతేనేం, ఆయన శ్రమ ఫలించింది. కుమార్తె బంగారు కల నెరవేరింది. -
పసిడి టెన్నిస్ శభాష్ స్క్వాష్...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో రజతం మనకు దక్కింది. ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది. పాకిస్తాన్ను పడగొట్టి... ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్తో అభయ్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఐదు గేమ్ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్ను ఓడించాడు. నాలుగో గేమ్లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు. అంతకు ముందు తొలి మ్యాచ్లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్కర్పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌఆసియా క్రీడలు ‘సిల్వర్’ సరబ్జోత్ – దివ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్జోత్ – దివ్యలను ఓడించింది. గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సరబ్జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. సత్తా చాటిన కార్తీక్, గుల్విర్ 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం. కార్తీక్ కుమార్కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్లో బహ్రెయిన్కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు. మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్పై విజయం సాధించారు. భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది. బోపన్న సర్వీస్తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది. -
కిడాంబి శ్రీకాంత్ గెలిపించగా...
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియానుంచి భారత్కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ వరకు వెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 21–16, 21–19తో జీన్ హ్యోక్ జీన్పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్లో టాప్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్ మిన్ హ్యూక్ – స్యూంగ్ జే సంచలన విజయం సాధించారు. రెండో సింగిల్స్లో లక్ష్య సేన్ 21–7, 2–19తో లీ యూన్ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్లో ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల 16–21, 11–21తో కిమ్ వోన్ హో – సంగ్ సియూంగ్ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్ను గెలిపించాల్సిన బాధ్యత కిడాంబి శ్రీకాంత్పై పడింది. తొలి గేమ్ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్పై శ్రీకాంత్ గెలుపొందాడు. -
భారత్ 10, పాకిస్తాన్ 2
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను బలంగా దెబ్బ కొట్టింది. పూల్ ఎ మ్యాచ్లో భారత్ 10–2 గోల్స్ తేడాతో పాక్ను చిత్తు చిత్తుగా ఓడించింది. అంతర్జాతీయ హాకీలో పాక్పై భారత్కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 2017లో నమోదు చేసిన 7–1 స్కోరును భారత్ ఇక్కడ తిరగరాసింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్తో చెలరేగాడు. హర్మన్ 11వ, 17వ, 33వ, 34వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు. వరుణ్ కుమార్ 41వ, 54వ నిమిషాల్లో గోల్స్ సాధించగా...లలిత్ (49వ ని.), షంషేర్ (46వ ని.), సుమీత్ (30వ ని.), మన్దీప్ సింగ్ (8వ ని.) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ తరఫున అబ్దుల్ వహీద్ రానా (45వ ని.), సూఫియాన్ ఖాన్ (38వ ని.) ఒక్కో గోల్ నమోదు చేశారు. బాక్సింగ్లో మూడు పతకాలు ఖాయం ముగ్గురు భారత బాక్సర్లు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టి కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ సెమీస్ చేరింది. క్వార్టర్స్లో ఆమె 4–1తో జైనాశికర్బెకొవా (కజకిస్తాన్)ను ఓడించింది. తాజా ఫలితంతో ప్రీతి పారిస్ ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పురుషుల విభాగంలో నరేందర్ (92 కేజీలు) సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్స్లో లవ్లీనా 5–0తో సియోంగ్ సుయాన్ (కొరియా)పై, నరేందర్ 5–0తో ఇమాన్ దిలావర్ (ఇరాన్)ను ఓడించారు. మీరాబాయి చానుకు నాలుగో స్థానం టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో చాను నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 191 కేజీల బరువెత్తిన చాను కాంస్యం కోసం ప్రయత్నిస్తూ చివరి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ గాయపడింది. 117 కేజీల క్లీన్ అండ్ జర్క్ లక్ష్యంగా ప్రయత్నిoచి వెనుక వైపుకు పడిపోయింది. దాంతో కోచింగ్ సిబ్బంది ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. వైద్య పరీక్షలు జరిపి ఆమె గాయం తీవ్రతను తెలుసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. ఫైనల్స్కు జ్యోతి క్వాలిఫై భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజి ఆసియా క్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఫైనల్స్కు అర్హత సాధించింది. హీట్స్ను ఆమె 13.03 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. మరో భారత అథ్లెట్ నిత్య రామ్రాజ్ కూడా ఇదే ఈవెంట్లో ఫైనల్స్కు క్వాలిఫై అయింది. లాంగ్జంప్లో కామన్వెల్త్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్ కూడా ముందంజ వేశారు. 7.97 మీటర్లు దూకిన మురళి అర్హత మార్క్ (7.90 మీటర్లు)ను సునాయాసంగా దాటి ఫైనల్స్కు చేరాడు. జెస్విన్ ఆల్డ్రిన్ కూడా భారత్ తరఫున ఫైనల్లో పోటీ పడనున్నాడు. 1500 మీటర్ల పరుగులో భారత్ తరఫున జిన్సన్ జాన్సన్, అజయ్ కుమార్ బరిలోకి దిగుతారు. -
కార్తిక్, గుల్వీర్లకు రజతం, కాంస్యం.. అదరగొట్టిన అమ్మాయిలు
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత అథ్లెట్లు దుమ్ములేపారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత, కాంస్య పతకాలు రెండూ మనోళ్లే కైవసం చేసుకున్నారు. కార్తిక్ కుమార్, గుల్వీర్ సింగ్ ఈ అద్భుతం చేశారు. చైనాలోని హోంగ్జూ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన రేసులో ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలవడం గమనార్హం. కార్తిక్ 28:15.38, గుల్వీర్ 28:17.21 నిమిషాల్లో పరుగు పూర్తి చేయడం విశేషం. వరల్డ్ నంబర్ 2 జోడీని ఓడించి.. ఇదిలా ఉంటే.. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఐహిక, సుతీర్థ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చేందుకు సిద్ధమయ్యారు. శనివారం నాటి క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 జోడీ చెన్ మెంగ్, వాంగ్ యిదీలను మట్టికరిపించి వహ్వా అనిపించారు. అత్యధికంగా షూటింగ్లో ఇక 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 10 బంగారు, 14 వెండి, 14 కాంస్యాలు మొత్తంగా 38 పతకాలు గెలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్, వ్యక్తిగత విభాగం, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ మెన్, 10మీ. ఎయిర్ పిస్టల్ వుమెన్, 25మీ. పిస్టల్ టీమ్ వుమెన్, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ వుమెన్, మెన్స్ స్క్వాష్, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో భారత్ పసిడి పతకాలు గెలిచింది. ఇందులో అత్యధికంగా షూటింగ్లో ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
ఉత్కంఠ పోరులో పాక్పై విజయం.. భారత్ ఖాతాలో పదో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. స్క్వాష్ క్రీడాంశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరులో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. హోంగ్జూలో శనివారం నాటి ఉత్కంఠ ఫైనల్లో పాక్ టీమ్ను 2-1తో ఓడించి బంగారు పతకం గెలిచింది. సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగావ్కర్, హరీందర్ సంధులతో కూడిన భారత స్క్వాష్ జట్టు ఈ మేరకు పాక్ టీమ్ను ఓడించి చైనాలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 13 రజత, 13 కాంస్య పతకాలు గెలిచింది. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team! Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final ! What a great match guys! Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK — SAI Media (@Media_SAI) September 30, 2023 A game for the Indian history in Squash.....!!!! 🇮🇳 They won the Gold in Asian Games by beating Pakistan in the final. pic.twitter.com/qOuI1Dyjoh — Johns. (@CricCrazyJohns) September 30, 2023 -
భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శనివారం మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో వచ్చి చేరింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో థైపీ జోడీని బోపన్న, రుతుజా ద్వయం ఓడించింది. కాగా ఇది భారత్కు 9వ గోల్డ్మెడల్ కావడం గమానార్హం. ఇక ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్ కప్ జట్టు సెలక్షన్పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
సత్తా చాటుతున్న భారత షూటర్లు.. మరో సిల్వర్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షుటర్లు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సరబ్జోత్ సింగ్ ,దివ్యతో కూడిన భారత ద్వయం రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో భారత్ 14 పాయింట్లు సాధించి రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. 16 పాయిట్లతో అగ్రస్ధానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్లతో కూడిన చైనా జోడీ గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నారు. ఈ ఏషియన్ గేమ్స్లో షూటింగ్లో భారత్ మొత్తంగా 19 పతకాలు గెలుచుకుంది. అందులో 6 గోల్డ్, 8 సిల్వర్, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో గోల్డ్మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్తో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే విధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్లో భారత్కు సిల్వర్ మెడల్ దక్కింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్తో కూడిన భారత త్రయం రజత పతకం సొంతం చేసుకుంది. ఇక భారత్కు ఇది ఏడో గోల్డ్మెడల్. అందులో ఐదు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్గా 27 పతకాలతో భారత్ 4 స్థానంలో ఉంది. 🥇 1️⃣𝙨𝙩 𝙂𝙊𝙇𝘿 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙙𝙖𝙮🔥 🇮🇳's M 50m Rifle 3Ps team, featuring the trio - Aishwary Pratap Singh Tomar, @KusaleSwapnil, and Akhil Sheoran, secured the 𝙂𝙊𝙇𝘿 𝙈𝙀𝘿𝘼𝙇 today, beginning the day on a golden note! 🏆🎯 Let's shower our champions with applause and… pic.twitter.com/YxcsvLXuSG — SAI Media (@Media_SAI) September 29, 2023 -
Asian Games: చరిత్ర సృష్టించిన అనూష్.. తొలి పతకం
Asian Games 2023- Anush Agarwalla: ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారుడు అనూష్ అగర్వాలా చరిత్ర సృష్టించాడు. టీఎల్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి పతకం అందించాడు. చైనాలోని హోంగ్జూ వేదికగా గురువారం నాటి ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. తద్వారా 24 ఏళ్ల అనూష్ అగర్వాలా, అతడి గుర్రం ఎట్రోతో పాటు రికార్డులకెక్కాడు. కోల్కతాకు చెందిన అనూష్.. తన అశ్వానికి అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చాడు. ఈ క్రమంలో డ్రెసాజ్ ఈవెంట్ ఫైనల్లో అనూష్ సూచనల(మ్యూజిక్)కు తగినట్లుగా ఎట్రో పర్ఫెక్ట్ సింక్లో ప్రదర్శన ఇచ్చింది. చక్కటి సమన్వయం.. పతకం ఖాయం దీంతో ఇంప్రెస్ అయిన న్యాయనిర్ణేతలు అనూష్, ఎట్రోల మధ్య సమన్వయం చక్కగా ఉండటంతో పతకం ఖరారు చేశారు. ఈ క్రమంలో 73.030 స్కోరు చేసిన అనూష్ అగర్వాలాకు కాంస్యం లభించింది. కాగా డ్రెసాజ్ ఫైనల్లో బ్లాక్బస్టర్ జయహో పాటను కూడా ప్లే చేయడం గమనార్హం. ఇక ఈ ఈవెంట్లో మలేషియాకు చెందిన బిన్ మహ్మద్ స్వర్ణం గెలవగా.. హాంకాంగ్ ప్లేయర్ జాక్వెలిన్ వింగ్ యింగ్ రజతం సాధించింది. కాగా 19వ ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. డ్రెసాజ్ అంటే ఏంటి? డ్రెసాజ్ అనే ఫ్రెంచ్ పదానికి ఇంగ్లిష్లో ట్రెయినింగ్ అని అర్థం. ఇందులో రైడర్ తన గుర్రానికి ఏవిధమైన శిక్షణ ఇచ్చాడు.. ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉందన్న అంశాలను గమనిస్తారు. రైడర్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా అశ్వం ఎంత మేర నడుచుకుంటుందో చూసి అందుకు తగ్గట్లుగా పాయింట్లు కేటాయిస్తారు. కాగా ఈక్వెస్ట్రియన్లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, పెగ్గింగ్,డ్రెసాజ్, జంపింగ్ వంటి విభాగాలు ఉంటాయి. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్గా మార్కరమ్ -
గోల్డ్మెడల్ టార్గెట్గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా
ఆసియా క్రీడలు-2023లో పాల్గోనేందుకు రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని భారత జట్టు గురువారం చైనాకు బయలు దేరి వెళ్లింది. ముంబై నుంచి నేరుగా ఏసియన్ గేమ్స్ జరగుతున్న హంగ్జూకు టీమిండియా పయనమైంది. కాగా క్రీడలకు భారత త్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు రుత్రాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ.. వీవీయస్ లక్ష్మణ్కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు చోటు దక్కింది. ఇక ఇప్పటికే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత జట్టు గోల్డ్మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత పురుషల జట్టు కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రీడల్లో భారత్ ప్రయాణం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో తలపడనుంది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్సింగ్. The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM — BCCI (@BCCI) September 28, 2023 చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. అదరగొడుతున్న షూటర్లు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం మరో బంగారు పతకాన్ని మన షూటర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమాలో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్లో సరబ్జోత్ , శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమా 1734 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్ధానంలో నిలిచారు. దీంతో భారత ఖాతాలో ఆరో గోల్డ్మెడల్ వచ్చి చేరింది. ఇక 1733 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఆతిథ్య చైనా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇక ఓవరాల్గా భారత్కు ఇది ఆరో గోల్డ్మెడల్. అందులో నాలుగు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్గా 24 పతకాలతో భారత్ ఐదో స్థానంలో ఉంది. -
కొడితే బంతి ఎవరెస్ట్కు...
హంగ్జౌ: ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పనికూనలాంటి ఆ జట్టు ఆటలో ఇప్పుడే నడక మొదలుపెట్టిన టీమ్పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. పరుగుల వాన, పరుగుల వరద అనే విశేషణాలు ఈ మ్యాచ్కు సరిపోవు... విధ్వంసం, దూకుడు అనేవి కూడా చిన్న పదాలు... ఒకదాని తర్వాత మరో కొత్త మరో రికార్డు... పరుగులు, బంతులు, బౌండరీలు... ఇలా అన్నింటిలోనూ కొత్త ఘనతలే. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టి20ల్లో పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్స్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్స్లు), దీపేంద్ర సింగ్ ఐరీ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్స్లు) అతనికి అండగా నిలిచారు. అనంతరం మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దవాసురెన్ (10) ఒక్కటే రెండంకెల స్కోరు చేయగా, ఎక్స్ట్రాలదే (23) అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్గా కూడా ఆ జట్టుకు ఇదే తొలి టి20 మ్యాచ్. తుది జట్టులోని 11 మందీ తొలిసారి టి20 మ్యాచ్ బరిలోకి దిగినవారే. దాంతో కాస్త అనుభవం ఉన్న నేపాల్ ముందు ఈ జట్టు కనీసం నిలవలేకపోయింది. మ్యాచ్లో నమోదైన రికార్డులు... 314 అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ జట్టూ 300 పరుగులు చేయలేదు. 278 పరుగులతో ఉన్న రికార్డును (2019లో ఐర్లాండ్ జట్టుపై అఫ్గానిస్తాన్, 2019లో తుర్కియే జట్టుపై చెక్ రిపబ్లిక్) నేపాల్ బద్దలు కొట్టింది. 273 టి20ల్లో అతి పెద్ద విజయం. గతంలో చెక్ రిపబ్లిక్ 257 పరుగులతో తుర్కియేని ఓడించింది. 34 అంతర్జాతీయ టి20ల్లో కుశాల్ మల్లా 34 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్ శర్మ (భారత్; 2017లో శ్రీలంకపై), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా; 2017లో బంగ్లాదేశ్పై), విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్; 2019లో తుర్కియేపై) నెలకొల్పిన సెంచరీ రికార్డు తెరమరుగైంది. 9 అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని దీపేంద్ర సింగ్ నమోదు చేశాడు. గతంలో 12 బంతులతో ఈ రికార్డు భారత స్టార్ యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్పై) పేరిట ఉంది. 26 ఇన్నింగ్స్లో నేపాల్ అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు చేసింది. గతంలో అఫ్గానిస్తాన్ జట్టు ఐర్లాండ్పై (2019లో), వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై (2023లో) 22 సిక్స్లు చొప్పున కొట్టింది. -
బుల్లెట్ దిగింది...
చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్ను వదిలేసి రైఫిల్ ఎత్తిన సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్ షూటర్ ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించింది. పిస్టల్ ఈవెంట్లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ రెండు పతకాలతో భారత బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెయిలింగ్లో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్లో రోషిబినా దేవి ఫైనల్ చేరి... పురుషుల టెన్నిస్ డబుల్స్లో సాకేత్ మైనేని–రామ్కుమార్ జోడీ సెమీఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్గా 22 పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 467 పాయింట్లతో బ్రిటన్ షూటర్ సియోనైడ్ మెకింటోష్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్ కౌర్ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో భారత్కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్ కియోంగ్యు జాంగ్ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది. పంజాబ్లోని ఫరీద్కోట్ ప్రాంతానికి చెందిన సిఫ్ట్ కౌర్ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్ షూటింగ్లో కొనసాగింది. అయితే షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్ కౌర్కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్కు టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్ జీత్ సింగ్, గురుజోత్ సింగ్, అంగద్ వీర్సింగ్ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్లో బుధవారం భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్లో రజతం, మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
చెస్లో త్రుటిలో చేజారిన పతకం
ఆసియా క్రీడల చెస్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో హంపితో జరిగిన గేమ్ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో జినెర్ జు (చైనా)పై గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్ జు ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్), హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఇరిగేశి అర్జున్ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) రజతం, సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్లో పురుషుల క్రికెట్కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్లో ఎక్స్ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో మెన్స్ క్రికెట్ ఈవెంట్కు తెరలేచింది. చైనాలోని హోంగ్జూలో నేపాల్- మంగోలియాతో బుధవారం తొలి టీ20 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్డౌన్లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ 34 బంతుల్లోనే శతకం బాదిన అతడు.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కుశాల్, దీపేంద్ర ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన నేపాల్ 314 పరుగులు స్కోరు చేసింది. ప్రపంచ రికార్డులు బద్దలు తద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. తద్వారా అఫ్గనిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 2019లో ఐర్లాండ్తో మ్యాచ్లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. సిక్సర్ల జట్టుగా ఇక ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్తో మరో అరుదైన ఘనత కూడా ఖాతాలో వేసుకుంది నేపాల్ క్రికెట్ జట్టు. టీ20 ఫార్మాట్ హిస్టరీలో సింగిల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్గా నిలిచింది. నేపాల్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 26 సిక్స్లు బాదగా.. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్లు కొట్టింది. సంచలన విజయం మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
ప్రపంచ రికార్డుతో సిఫ్ట్కౌర్ సమ్రా.. ఇషా సింగ్కు సిల్వర్ మెడల్
Asian Games 2023 Day 4 Updates: టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో ముందడుగు భారత జోడీ సాహిత్యాన్, మనికా బాత్రా థాయ్లాండ్ ద్వయాన్ని ఓడించి రౌండ్ 16కు చేరుకున్నారు. చరిత్ర సృష్టించిన అనంత్జీత్ స్కీట్ మెన్ వ్యక్తిగత విభాగంలో భారత్కు రజత పతకం లభించింది. షూటర్ అనంత్జీత్ సింగ్ నరూకా ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత్కు ఈ పతకం అందించాడు. అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ సాధించి చరిత్రకెక్కాడు. 🥈SILVER IN SKEET MEN⚡ 🇮🇳 Shooter and #KheloIndiaAthlete Anantjeet adds another SILVER medal in India's medal haul🌟🎯 This is the 1️⃣st time ever in the history of the Asian Games that India has won a silver in this event. Our shooters' combined excellence is making India… pic.twitter.com/5178kedO1u — SAI Media (@Media_SAI) September 27, 2023 ఇషా సింగ్కు రజతం తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 25మీ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. 18 ఏళ్ల ఇషా ఇప్పటికే 25మీ పిస్టల్ టీమ్ విభాగంలో మనూ బాకర్, రిథం సంగ్వాన్తో కలిపి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. 🥈 A Shining Silver for Esha Singh! 🇮🇳🔫 18-year-old @singhesha10 #TOPSchemeAthlete won a spectacular silver 🥈 in the 25m Pistol event at the #AsianGames2022 Let's applaud her unwavering spirit 🎯🫡 Congratulations, Esha! 🌟🎯 P.S: A special shoutout to the Olympian,… pic.twitter.com/D0AkuBPIAY — SAI Media (@Media_SAI) September 27, 2023 ఫెన్సింగ్లో ముందుకు ఫెన్సింగ్ వుమెన్స్ ఎపీ టీమ్ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. తనిక్షా ఖత్రి, జ్యోతికా దత్త, ఇనా అరోరా జెర్డాన్ మహిళా జట్టుపై 45-36తో విజయం సాధించారు. ఇక క్వార్టర్స్లో భారత జట్టు సౌత్ కొరియాను ఎదుర్కోనుంది. హాకీలో.. భారత మహిళా జట్టులో హాకీలో విజయంతో గ్రూప్ దశను ఆరంభించింది. సెయిలింగ్లో మరో పతకం ఆసియా క్రీడల్లో సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. Men's Dnghy ILCA7 ఈవెంట్లో విష్ణు శరవణన్ కాంస్యం గెలిచాడు. కాగా సెయిలింగ్లో భారత్కు ఇది మూడో మెడల్. 3️⃣rd Medal in SAILING⛵🇮🇳@VishnuS28686411 has secured the BRONZE🥉 MEDAL in the ILCA7 sailing event at the #AsianGames2022! 🥉⛵ His outstanding performance on the water has brought honor to India. Well done, Vishnu! 🌟🌊 #Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/Dr9RSqq5ae — SAI Media (@Media_SAI) September 27, 2023 GOLD WITH A WORLD RECORD- భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్) వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా గోల్డ్ మెడల్ సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సమ్రా. తద్వారా భారత పసిడి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చింది. GOLD FOR 🇮🇳 WITH A WORLD RECORD! Huge applause for Sift Samra Kaur, who has secured 🇮🇳's 1st Individual Gold🥇at the #AsianGames2022 👏@SiftSamra's Gold in the Women's 50m Rifle 3 Position event was achieved through unbelievable and surreal shooting, displaying incredible… pic.twitter.com/M1Sg1aB9e6 — Anurag Thakur (@ianuragthakur) September 27, 2023 స్కీట్ మెన్స్ టీమ్ విభాగంలో భారత జట్టుకు కాంస్యం భారత పురుష షూటర్ల జట్టు కాంస్య పతకం సాధించింది. గుర్జోత్, అనంత్జీత్, అంగాడ్విర్ స్కీట్ మెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. Remarkable display of skill and teamwork⚡👍 The Skeet Men's Team secures the BRONZE MEDAL! 🥉🇮🇳 Their precision shooting has earned 🇮🇳 a place on the podium, and we couldn't be prouder! 🌟🎯#Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/FfaqFlRubI — SAI Media (@Media_SAI) September 27, 2023 ఆషీ చోక్సీకి కాంస్యం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్ ఆషీ చోక్సీ కాంస్యం సాధించింది. AND ANOTHER BRONZE🥉🎯 Outstanding performance by the 🇮🇳 Shooter, Ashi Chouksey finished 3️⃣rd in the Women's 50m Rifle 3 Positions Individual, winning India it's 8️⃣th bronze at the #AsianGames2022 ⚡🏅 With this, Ashi has won a total of 3️⃣ medals (2🥈1 🥉) so far. Proud of you,… pic.twitter.com/IQhhdQyA6m — SAI Media (@Media_SAI) September 27, 2023 బంగారు తల్లులు.. వారికేమో వెండి పతకం చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ బుధవారం శుభారంభం చేసింది. షూటింగ్ విభాగంలో తొలుత రజతం, తర్వాత ఈవెంట్లో స్వర్ణం దక్కింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో సిఫ్ట్కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన మహిళా జట్టు భారత్కు సిల్వర్ మెడల్ అందించింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో రజతం బంగారు తల్లులు వీరే తదుపరి.. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
శెభాష్ మనూ, ఇషా, రిథమ్.. భారత్కు మరో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. చాంపియన్లుగా నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. తాజా గోల్డ్ మెడల్తో 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు
Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో పతకం
Sift Kaur Samra-Ashi Chouksey - Manini Kaushik: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో భారత మహిళా జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. షూటింగ్ త్రయం సిఫ్ట్కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీ తమ అద్భుత ప్రదర్శనతో భారత్కు రజతం అందించారు. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో బుధవారం నాటి 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఆతిథ్య జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరు చేసి వెండి పతకం గెలవగా.. . పబ్లిక్ ఆఫ్ కొరియా 1756 స్కోరు సాధించి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక తాజా విజయంతో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఐదు సిల్వర్, ఏడు కాంస్యాలు సాధించారు. 🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈 Incredible marksmanship on display! 🎯👏 Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women's Team event! 🥈👩🎯 Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz — SAI Media (@Media_SAI) September 27, 2023 -
ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హ్రిదయ్ చద్దా, అనుష్ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్లో భారత్కు ఇవాళే (సెప్టెంబర్ 26) మూడు పతకాలు అందాయి. #EquestrianExcellence at the 🔝 After 41 long years, Team 🇮🇳 clinches🥇in Dressage Team Event at #AsianGames2022 Many congratulations to all the team members 🥳🥳#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/CpsuBkIEAw — SAI Media (@Media_SAI) September 26, 2023 భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం, ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. -
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
ఆ విభాగంలో భారత్కు తొలి పతకం.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే!
Asian Games 2023- Neha Thakur Silver In Sailing: భారత్ ఖాతాలో మరో ఆసియా క్రీడల పతకం చేరింది. సెయిలింగ్(ఐఎల్సీఏ డింఘీ)లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్తో మెరిసింది. దీంతో ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇక ఈ మెగా ఈవెంట్లో సెయిలింగ్లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే? కాగా ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 2019లో సెయిలింగ్ విభాగంలో ఐఎల్సీఏ డింఘీ పేరిట రేసులకు అనమతినిచ్చింది. ఇక ఐఎల్సీఏ డింఘీ-4 కేటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. ఇందులో సెయిలర్ వరస్ట్ స్కోరును.. మొత్తం రేసు పాయింట్ల నుంచి మైనస్ చేస్తారు. తద్వారా నెట్ స్కోరును నిర్ణయిస్తారు. నేహా 11 రేసులలో మొత్తంగా పోటీ ముగిసేలోపు ఎవరైతే తక్కువ నెట్ స్కోరు కలిగి ఉంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. కాగా 19వ ఆసియా క్రీడల్లో నేహా ఠాకూర్ ఐఎల్సీఏ డింఘీ-4 విభాగంలో 11 రేసులలో కలిపి 32 పాయింట్లు స్కోరు చేసింది. ఐదో ప్రయత్నంలో అత్యల్ప స్కోరు సాధించగా.. నెట్ స్కోరు 27గా నమోదైంది. ఈ క్రమంలో థాయ్లాండ్కు చెందిన నొప్పాస్సాన్ ఖుబూంజాన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి నేహా వెండి పతకం గెలుపొందింది. ఈ విభాగంలో థాయ్లాండ్కు స్వర్ణం, సింగపూర్కు కాంస్యం(కియారా మేరీ- నెట్ స్కోరు 28) దక్కాయి. ఇప్పటికి ఎన్ని పతకాలంటే? కాగా నేహా మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల నేషనల్ సెయిలింగ్ స్కూల్లో సెయిలర్గా ఓనమాలు నేర్చుకుంది. ఇక చైనాలోని హోంగ్జూ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మంగళవారం(సెప్టెంబరు 26) మధ్యాహ్నం నాటికి భారత్ ఖాతాలో 2 పసిడి, నాలుగు రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 🥈🌊 Sailing Success! Neha Thakur, representing India in the Girl's Dinghy - ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵ This is India's 1️⃣st medal in Sailing🤩👍 Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI — SAI Media (@Media_SAI) September 26, 2023 -
Asian Games 2023 Hockey: సింగపూర్పై భారత ఘన విజయం..
చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత పురుషుల హాకీ జట్టు సత్తా చాటుతోంది. ప్రిలిమినరీ రౌండ్ పూల్-ఏ మ్యాచ్లో సింగపూర్పై 16-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టులో హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో మెరిశాడు. ఓవరాల్గా హర్మన్ ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేయగా.. మన్దీప్ సింగ్ మూడు, వరుణ్కుమార్, అభిషేక్ తలా రెండు గోల్స్ చేశారు. ఇక ఈ విజయంతో పూల్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతి పూల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత తమ తదుపరి మ్యాచ్లో జపాన్తో తలపడనుంది. కాగా మొదటి మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్ను 16-0 తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: World Cup 2023: భారత్ను ఓడించిన జట్టు వరల్డ్కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! -
రెండు కాంస్యాలతో ముగింపు.. రోయింగ్లో మెరుగైన భారత్ ప్రదర్శన
హాంగ్జౌ: గత ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన భారత రోయర్లు ఈసారి ఐదు పతకాలు గెలిచి తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్నారు. సోమవారం నాలుగు ఫైనల్స్లో భారత క్రీడాకారులు పోటీపడగా... రెండు ఈవెంట్స్లో కాంస్య పతకాలు సాధించారు. ఆదివారం భారత రోయర్లకు రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి. సోమవారం పురుషుల ఫోర్ ఈవెంట్లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:08.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్, జకర్ ఖాన్, సుఖ్మీత్ సింగ్లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:10.81 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. నాడు తండ్రి... నేడు తనయుడు... 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఇందర్పాల్ సింగ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు కాక్స్లెస్ ఫోర్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. 21 ఏళ్ల తర్వాత ఇందర్పాల్ సింగ్ తనయుడు పరిమందర్ సింగ్ తండ్రి ఘనతను అందుకున్నాడు. పర్మిందర్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు ఈసారి క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్లో కాంస్యం గెలిచింది. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్కు పాకిస్తాన్ జట్టు -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్లో విజయ్వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్వీర్, అనీశ్ -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సొంతం
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix — CricTracker (@Cricketracker) September 25, 2023 కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q — CricTracker (@Cricketracker) September 25, 2023 -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్మాస్టర్ కియాన్యున్ గాంగ్ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్.. -
Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్ తొలి గోల్డ్మెడల్ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్లో 1893.7 స్కోర్తో భారత్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1 స్కోర్) సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు -
‘ఐదు’తో అదరగొట్టారు
ఈసారి పతకాల వేటలో ‘సెంచరీ’ దాటాలని చైనాలో అడుగుపెట్టిన భారత క్రీడాకారులు తొలిరోజే పతకాల ఖాతా తెరిచారు. 19వ ఆసియా క్రీడల్లో మొదటి రోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. స్వర్ణ పతకం అందకపోయినా మూడు రజతాలు, రెండు కాంస్యాలతో శుభారంభం చేశారు. అంచలను అందుకుంటూ షూటర్లు తమ గురిని పతకాలపై పెట్టగా... రోయింగ్లోనూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. మహిళల బాక్సింగ్, పురుషుల హాకీ, టెన్నిస్ క్రీడాంశాల్లోనూ మనోళ్లు రాణించారు. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, మహిళల ఫుట్బాల్లో భారత్ పతకాల రేసు నుంచి ని్రష్కమించారు. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్లో రెండు, రోయింగ్లో మూడు పతకాలతో రాణించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం టీమ్ ఈవెంట్లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్ జియావు, యుటింగ్ హువాంగ్, జిలిన్ వాంగ్లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. గాన్హుయగ్, యసుజెన్, నరన్తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫయింగ్లో రమిత 631.9 పాయింట్లతో రెండో స్థానంలో, మెహులీ 630.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో టాప్–8లో నిలిచిన వారి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ను నిర్వహిస్తారు. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్ హువాంగ్ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. రోయింగ్లో పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో అర్జున్ లాల్ జాట్–అరవింద్ సింగ్ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్జీ ఫాన్–మన్ సున్ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్ విభాగంలో బాబూలాల్ యాదవ్–లేఖ్ రామ్ జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్ రేసులో బాబూలాల్–లేఖ్ రామ్ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్ కల్వానియా, నితీశ్ కుమార్, చరణ్జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. వాలీబాల్లో భారత పురుషుల జట్టు పతకం రేసు నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 16–25, 18–25, 17–25తో జపాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్కుమార్ (భారత్) 6–2, 6–3తో అభిషేక్–ప్రదీప్ (నేపాల్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 6–0, 6–0తో మార్కో టిన్ (మకావు)పై ఘనవిజయం సాధించాడు. ఏషియాడ్లో నేటి భారతీయంమెడల్ ఈవెంట్స్ షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రుద్రాం„Š పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ (ఉదయం గం. 6:30 నుంచి 9 వరకు). మహిళల క్రికెట్ ఫైనల్: భారత్గీశ్రీలంక (ఉదయం గం. 11:30 నుంచి). రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (బల్రాజ్ పన్వర్; ఉదయం గం. 7 నుంచి); పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ (ఉదయం గం. 8:30 నుంచి); మహిళల ఎయిట్ (ఉదయం గం. 8:50 నుంచి). -
స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (12) టాప్ స్కోరర్ కాగా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు ‘డకౌట్’ కావడం విశేషం. పేస్ బౌలర్ పూజ వస్త్రకర్ (4/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేసి బంగ్లాను దెబ్బ కొట్టింది. భారత్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్మృతి మంధాన (7) తొందరగానే అవుటైనా... జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షఫాలీ వర్మ (17) కలిసి గెలిపించారు. స్వర్ణపతకం కోసం నేడు జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. రెండో సెమీస్లో శ్రీలంక 6 వికెట్లతో పాకిస్తాన్పై గెలిచింది. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్
హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్లో ఒకటి, రోయింగ్లో ఒకటి) ఉన్నాయి. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
పాక్ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో టీమిండియాతో 'ఢీ'
ఏషియన్ గేమ్స్ 2023 వుమెన్స్ క్రికెట్లో శ్రీలంక ఫైనల్కు చేరింది. ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో లంకేయులు పాక్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో షావాలా జుల్ఫికర్ (16), ఒమైమా సోహైల్ (10), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అమీన్ (3), కెప్టెన్ నిదా దార్ (9), అలియా రియాజ్ (2), నటాలియా పర్వేజ్ (8). ఉమ్ ఎ హనీ (9), డయానా బేగ్ (9), నస్రా సంధు (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలోప్రబోదని 3 వికెట్లు పడగొట్టగా.. కవిష దిల్హరి 2, ప్రియదర్శిని, అచిని కులసూరియా, రణవీర తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 14, అనుష్క సంజీవని 15, హర్షిత సమరవిక్రమ 23, విష్మి గుణరత్నే 0 పరుగులు చేయగా.. నిలక్షి డిసిల్వ 18, హసిని పెరీరా 1 శ్రీలంకు విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్, డయానా బేగ్, ఉమ్ ఎ హనీ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో భారత్ను ఢీకొట్టనున్న శ్రీలంక.. రెండో సెమీస్లో పాక్పై గెలుపుతో శ్రీలంక ఫైనల్కు చేరింది. గోల్డ్ మెడల్ కోసం జరిగే తుది సమరంలో లంకేయులు టీమిండియాను ఢీకొట్టనున్నారు. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 11:30 గంటలకు మొదలవుతుంది. కాగా, ఇవాలే జరిగిన తొలి సెమీస్లో భారత్.. బంగ్లాదేశ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
Asian Games 2023: సెమీస్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్కు చేరిన భారత్
ఆసియాక్రీడల మహిళల క్రికెట్లో భారత్కు పతకం ఖాయమైంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్ను 8వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం 52 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(20 నాటౌట్),షెఫాలీ వర్మ(17) పరుగులతో రాణించారు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) జరగనున్న ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. చదవండి: Asian Games 2023: పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్ -
పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్
ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఆదివారం భారత ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా రజిత పతకం సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్లో మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే షూటర్లతో కూడిన భారత జట్టు.. 1886 స్కోర్తో రెండో స్ధానంలో నిలిచింది. దీంతో సిల్వర్ మెడల్ భారత్ను వరించింది. ఇక 1896 స్కోర్తో మొదటి స్ధానంలో నిలిచిన చైనా బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయింది. మరోవైపు రోయింగ్లో కూడా భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు. ఇక మొదటి స్ధానంలో నిలిచిన చైనా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం -
Asian Games 2023: పతకాల వేట ఆరంభం.. తొలి రోజు భారత షెడ్యూల్ ఇదే
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆసియాక్రీడలు-2023కు తేరలేచింది. శనివారం జరిగిన వేడుకలతో ఈ ఆసియా క్రీడల పోటీలు అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ఆదివారం నుంచి పతకాల వేట ప్రారంభం కానుంది. ఇ ఈ మెగా ఈవెంట్లో భారత్ షెడ్యూల్ను ఓ సారి పరిశీలిద్దాం. మెడల్ ఈవెంట్స్ షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రమిత, మెహులీ, ఆశి చౌక్సీ (ఉదయం గం. 6 నుంచి 9:15 వరకు). రోయింగ్: పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ (అర్జున్ లాల్, అరవింద్ సింగ్; ఉదయం గం. 7:10కు); పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్ (సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్; ఉదయం గం. 8 నుంచి). మహిళల ఫోర్ ఫైనల్ (అశ్వతి, మృణ్మయి, ప్రియా దేవి, రుక్మిణి; ఉదయం. గం. 8:20 నుంచి). పురుషుల పెయిర్ ఫైనల్: బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ (ఉదయం గం. 8:40 నుంచి). పురుషుల ఎయిట్ ఫైనల్ (ఉదయం గం. 9:00కు). మహిళల బాక్సింగ్ (54 కేజీలు తొలి రౌండ్): ప్రీతి వర్సెస్ సిలీనా (జోర్డాన్; ఉదయం గం. 11:30 నుంచి). 51 కేజీలు: నిఖత్ వర్సెస్ ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్ సెమీఫైనల్: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఉ. గం. 6:30 నుంచి). ఫుట్బాల్ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ వర్సెస్ మయన్మార్ (సాయంత్రం గం. 5 నుంచి); మహిళల విభాగం: భారత్ వర్సెస్ థాయ్లాండ్ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి). హాకీ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ గీ ఉజ్బెకిస్తాన్ (ఉదయం గం. 8:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (ప్రిక్వార్టర్ ఫైనల్స్): మహిళల విభాగం: భారత్ గీ థాయ్లాండ్ (ఉదయం గం. 7:30 నుంచి). పురుషుల విభాగం: భారత్ వర్సెస్ కజకిస్తాన్ (ఉ.గం. 9:30 నుంచి). వాలీబాల్ (క్వార్టర్ ఫైనల్): భారత్ వర్సెస్ జపాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి). -
ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం
ఆర్టిఫీషయల్ ఇంటలిజెన్స్... డిజిటల్ టార్చ్ రిలే టెక్నాలజీ... స్టేడియంలోనే ఉవ్వెత్తున ఎగసి ప్రేక్షకుల మీదికే దూసుకొచి్చనట్లు కనిపించిన అలలు... టపాకాయలు లేకుండానే అందరి చుట్టూ బాణాసంచా పేలినట్లుగా అనుభూతి... ఒక్కటేమిటి, ఇలా ప్రతీది అత్యుత్తమ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో కూడిన ప్రదర్శన... అనూహ్య రీతిలో, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అంతా అచ్చెరువొందేలా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం జరిగింది... సాంకేతికతను గొప్పగా వాడుకోవడంలో తమ ఘనత ఏమిటో ప్రపంచానికి చైనా మళ్లీ చూపించింది... ఆటలో అగ్రస్థానానికి గురి పెట్టిన ఆ దేశం అసలు సమరానికి ముందే అందరితే ఔరా అనిపించే ఉత్సవాన్ని ప్రదర్శించింది. హాంగ్జౌ: క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 19వ ఆసియా క్రీడలకు విజిల్ మోగింది. శనివారం జరిగిన వేడుకలతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. చైనా దేశాధ్యక్షుడు జిన్పింగ్ ఈ కార్యక్రమానికి హాజరై పోటీల ప్రారంభపు ప్రకటన చేశారు. 45 దేశాల నుంచి దాదాపు 12 వేలకు పైగా అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 80 వేల సామర్థ్యం గల ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా ఆరంభోత్సవం జరగ్గా... అదరగొట్టిన మెరుపు ప్రదర్శనలతో స్టేడియం దద్దరిల్లింది. ఆసియా క్రీడల ఆరంత్సవ వేడుకలకు ‘టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా’ అనే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పోటీల వేదిక అయిన హాంగ్జౌ నగరం గుండా కియాన్టాంగ్ నది ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అలలు వచ్చే నదిగా కియాన్టాంగ్కు గుర్తింపు ఉంది. అందుకే ఆసియాలో ఉధృత అలలు అనే తరహా థీమ్ను క్రీడలకు కలిపారు. 13 వేర్వేరు అంశాలు ప్రదర్శించగా అన్నింటా ఏదో ఒక చోట నీటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. ►ఆసియా క్రీడల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల క్రీడల గురించి ప్రత్యేక బ్యాంగ్ను ప్రదర్శించారు. ►ప్రాచీన చైనా నుంచి మొదలు ఆధునిక చైనా వరకు ఆ దేశ పురోగతి, ప్రస్థానం... ఇలా అన్ని అంశాలను కలుపుతూ చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా నిలిచింది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతూనే కొత్త తరం సాంకేతికలో ఆ దేశం ముందంజ వేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పోటీల ప్రారంభోత్సవ రోజైన సెపె్టంబర్ 23కు చైనా సౌర వ్యవస్థలో ప్రత్యేక చోటు ఉంది. ఈ సీజన్ ఆ దేశంలో పంట సేకరణ (మన సంక్రాంతిలాంటిది) అతిథులను ఆహ్హనించే సమయం కూడా. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆటమ్ గ్లో’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ►1990, 2010లలో కూడా ఆసియా క్రీడలు నిర్వహించిన చైనా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ... ఈసారి క్రీడలు జరుగుతున్న హాంగ్జౌ సమీపంలోనే మూడు హెరిటేజ్ నగరాల విశేషాలు చెబుతూ ‘మెమరీస్ ఆఫ్ జియాంగ్నాన్’ పేరుతో క్రీడల మూడు మస్కట్లు చెన్చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్ సందడి చేశాయి. ► ప్రారంభోత్సవ వేడుకల మార్చ్పాస్ట్లో అన్నింటికంటే ముందుగా అఫ్గానిస్తాన్, చివరగా ఆతిథ్య చైనా వచ్చాయి. అఫ్గానిస్తాన్ నుంచి రెండు జట్లు బరిలో ఉన్నాయి. ఒకటి మహిళలు లేకుండా ఆ దేశం పంపిన అధికారిక జట్టు కాగా... మరొకటి విదేశాల్లో తలదాచుకొని శిక్షణ తీసుకుంటూ బరిలోకి దిగిన బృందం. ఇందులో 17 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. మార్చ్పాస్ట్ సమయంలో బ్యాక్గ్రౌండ్లో ‘అవర్ ఏషియా’ పాటను వినిపించారు. ► భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ మన దేశపు జాతీయ పతాకంతో టీమ్ మార్చ్పాస్ట్కు నాయకత్వం వహించారు. ► చైనాకు చెందిన ముగ్గురు స్టార్లు ప్లేయర్లు, ఒలింపిక్ పతక విజేతలు యి షివెన్, ఫ్యాన్ జెండాంగ్, వాంగ్ జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరంతా ఒకవైపు నిలబడగా... డిజిటల్ పద్ధతిలోనే టార్చ్ను వెలిగించారు. టార్చ్తో అథ్లెట్ పరుగెడుతూ వెళుతున్న లేజర్ షో ప్రేక్షకులకు కొత్త తరహా అను భూతిని పంచింది. చివర్లో బాణాసంచాను కూడా ఇదే తరహాలో పేల్చి క్రీడల ఆరం¿ోత్సవానికి ఘనమైన ముగింపునిచ్చారు. చదవండి: నేడు ఆసీస్తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ -
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా క్రీడలు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరే
Asian Games 2023 Opening Ceremony: చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలకు తెర లేచింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శనివారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవంలో.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలో భారత క్రీడాకారులంతా ఖాఖీ రంగు ప్రధానంగా ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించారు. మహిళా ప్లేయర్లు చీరలో మెరిసిపోగా.. పురుష క్రీడాకారులు కుర్తా.. పైజామా ధరించి హుందాగా కనిపించారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసియా క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి క్రికెట్ జట్లు కూడా ఇక ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్ మొత్తంగా 671 పతకాలు గెలవగా.. ఇందులో కేవలం 155 మాత్రమే స్వర్ణాలు ఉన్నాయి. అత్యధికంగా 316 కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే, ఈసారి ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య చైనా ఇప్పటి వరకు ఏకంగా 3187 పతకాలు గెలిచి తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగిపోతోంది. ఇక హాంగ్జౌ ఏసియన్ గేమ్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 30 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి.. ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్తక్రా). తెలంగాణ నుంచి.. వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్బాల్), తిలక్ వర్మ (క్రికెట్). 𝑺𝒂𝒃𝒔𝒆 𝑨𝒂𝒈𝒆 𝑯𝒐𝒈𝒂 𝑩𝒉𝒂𝒓𝒂𝒕💪🏻 The excitement & energy of the 🇮🇳 contingent is contagious as they walk into the opening ceremony of #AsianGames2022🔥 This edition of #BharatAtAG22 will rock for sure! #Cheer4India#HallaBol#JeetegaBharat pic.twitter.com/cnY5M0r2pN — SAI Media (@Media_SAI) September 23, 2023 The moment we've all been waiting for is almost here! 🌟 In just a few minutes, the Indian team will proudly march into the Asian Games opening ceremony at Hangzhou, China. 🎉 Let's unite, show our support, and create unforgettable memories together. 🙌🏆 #Cheer4India… pic.twitter.com/6PBePg9bMi — SAI Media (@Media_SAI) September 23, 2023 -
ఆసియా సంరంభం నేడే ఆరంభం
ఔత్సాహిక క్రీడాకారులు... వర్థమాన తారలు... ఒలింపిక్ చాంపియన్స్... జగజ్జేతలు... అందరూ మళ్లీ ఒకే వేదికపై తళుక్కుమనే సమయం ఆసన్నమైంది. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న ఆసియా క్రీడలకు నేడు తెర లేవనుంది. చైనాలోని హాంగ్జౌ నగరం ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి 19వ ఆసియా క్రీడలు గత ఏడాదిలోనే జరగాలి. అయితే చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ క్రీడలను ఈ ఏడాదికి వాయిదా వేశారు. అధికారికంగా ఈ క్రీడలు నేడు ఆరంభమవుతున్నా... ఇప్పటికే పలు టీమ్ ఈవెంట్స్ (టి20 క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, రోయింగ్, టేబుల్ టెన్నిస్)మొదలయ్యాయి. హాంగ్జౌ: ఆసియా క్రీడా పండుగకు వేళయింది. 19వ ఆసియా క్రీడలకు నేడు చైనాలోని హాంగ్జౌ నగరంలో అధికారికంగా తెర లేవనుంది. మొత్తం 45 దేశాల నుంచి 12 వేలకుపైగా క్రీడాకారులు 40 క్రీడాంశాల్లో పతకాల వేటకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 8న ఈ క్రీడా సంరంభం సమాప్తం కానుంది. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలిసారిగా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనా గత 2018 జకార్తా ఆసియా క్రీడల వరకు తమ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా పతకాల పట్టికలో చైనాకు నంబర్వన్ స్థానం దక్కడం లాంఛనమే. జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ టాప్–5లో ఉండే అవకాశముంది. క్రితంసారి భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు కలిపి మొత్తం 70 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత బృందం ఈసారి పతకాల సంఖ్య 100 దాటడంతోపాటు టాప్–5లో చోటు సంపాదించాలనే పట్టుదలతో ఉంది. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, టెన్నిస్ క్రీడాంశాల్లో ఈసారి భారత క్రీడాకారుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. 2021 టోక్యో ఒలింపిక్స్లో, ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు గెలిచిన నీరజ్ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో చైనాలో అడుగు పెడుతున్నాడు. భారత్ నుంచి ఈసారి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ పతాకధారులగా వ్యవహరించనున్నారు. భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్లు సౌరవ్ గోషాల్, జోష్నా చినప్ప ఆరోసారి ... టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ ఐదోసారి... వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నాలుగోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనుండటం విశేషం. 7 ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లోనూ పోటీపడిన దేశాల సంఖ్య. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయ్లాండ్ ఈ జాబితాలో ఉన్నాయి. 671 ఇప్పటి వరకు జరిగిన 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్ గెలిచిన పతకాలు. ఇందులో 155 స్వర్ణాలు, 200 రజతాలు, 316 కాంస్య పతకాలు ఉన్నాయి. అత్యధికంగా అథ్లెటిక్స్లో భారత్కు 254 పతకాలు వచ్చాయి. బాక్సింగ్ (57), షూటింగ్ (57), రెజ్లింగ్ (49), టెన్నిస్ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 3187 ఆసియా క్రీడల చరిత్రలో చైనా నెగ్గిన పతకాలు. ఇందులో 1473 స్వర్ణాలు, 994 రజతాలు, 720 కాంస్యాలు ఉన్నాయి. చైనా తర్వాత జపాన్ (3054), దక్షిణ కొరియా (2235) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 14 మంది క్రీడాకారులు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్: ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్తక్రా). తెలంగాణ: వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్బాల్), తిలక్ వర్మ (క్రికెట్). -
సెమీస్లో భారత్ ప్రత్యర్ధి బంగ్లాదేశ్.. ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్..!
ఏషియన్ గేమ్స్ 2023 మహిళల క్రికెట్లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్కు చేరాయి. నిన్న (సెప్టెంబర్ 21) జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ 1, 2 మ్యాచ్లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ప్రత్యర్ధుల (మలేషియా, ఇండోనేషియా) కంటే మెరుగైన సీడింగ్ ఉన్న కారణంగా భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్కు అడ్వాన్స్ కాగా.. ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ 3లో శ్రీలంక.. థాయ్లాండ్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్కు చేరింది. ఆ తర్వాత జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ 4 కూడా వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో హాంగ్కాంగ్ కంటే మెరుగైన సీడింగ్ ఉండటం చేత బంగ్లాదేశ్ సెమీస్కు చేరింది. థాయ్లాండ్పై శ్రీలంక విజయం.. క్వార్టర్ ఫైనల్ 3లో థాయ్లాండ్పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్.. 7 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేయగా.. శ్రీలంక ఆడుతూ పాడుతూ 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చమారీ ఆటపట్టు (27), అనుష్క సంజీవని (32) కీలక ఇన్నింగ్స్లు ఆడి లంకను గెలిపించారు. సెమీస్లో ఎవరెవరు..? సెప్టెంబర్ 24న జరిగే సెమీఫైనల్ మ్యాచ్ల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్లో భారత్-బంగ్లాదేశ్.. రెండో సెమీస్లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్..? సెమీఫైనల్ మ్యాచ్ల్లో భారత్, పాక్లు తమతమ ప్రత్యర్ధులపై విజయం సాధిస్తే.. ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురెదురుపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25న గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీస్ల్లో ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోసం పోటీపడతాయి. -
Asian Games 2023: బంగ్లాదేశ్పై భారత్ విజయం.. నాకౌట్ ఆశలు సజీవం
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల ఫుట్బాల్ ఈవెంట్లో భారత్ బోణీ కొట్టింది. రౌండ్ ఆఫ్ 16కు (నాకౌట్) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్పై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి భారత్ను గెలిపించాడు. తొలి మ్యాచ్లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్ తేడాతో ఓడి, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో చైనా, మయన్మార్లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 24న మయన్మార్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే భారత్ నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. రౌండ్ ఆఫ్ 16కు ఎలా..? ఏషియన్ గేమ్స్ పురుషుల ఫుట్బాల్లో భారత్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఈ పోటీల్లో గ్రూప్కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 6 గ్రూప్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే మరో నాలుగు అత్యుత్తమ జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరతాయి. భారత్ అవకాశాలు ఎలా..? గ్రూప్-ఏలో చైనా, మయన్మార్ జట్లు ఇప్పటివరకు ఆడిన ఒక్కో మ్యాచ్లో విజయం సాధించి, తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్లో చైనా చేతిలో ఓడి, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తదుపరి మయన్మార్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, గ్రూప్లో రెండో స్థానానికి ఎగబాకి నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. -
Asian Games 2023 Cricket: సెమీస్లో భారత్, పాక్
ఏషియన్ గేమ్స్లో క్రికెట్ను తొలిసారి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పురుషులతో పాటు మహిళల విభాగంలో ఈ దఫా ఆసియా క్రీడలు జరుగనున్నాయి. చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 మహిళల క్రికెట్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన క్వార్టర్ ఫైనల్ 1, 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ రెండు జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి. మెరుగైన సీడింగ్ ఆధారంగా విజేతగా భారత్.. భారత్-మలేసియా మధ్య జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో మెరుగైన సీడింగ్ ఆధారంగా భారత్ను విజేతగా ప్రకటించారు. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ వర్మ (67), జెమీమా రోడ్రిగెజ్ (47 నాటౌట్) రాణించారు. అనంతరం మలేసియా ఇన్నింగ్స్ మొదలయ్యాక వర్షం మొదలుకావడంతో కేవలం 2 బంతుల ఆట మాత్రమే సాగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు భారత్ను విజేతగా ప్రకటించారు. ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్లో పాక్.. ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీస్కు చేరుకుంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సెకెండ్ క్వార్టర్ ఫైనల్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఇండోనేషియాతో పోలిస్తే మెరుగైన సీడింగ్ ఉందన్న కారణంగా పాక్ ఈ మ్యాచ్లో విజేతగా నిలిచింది. తద్వారా భారత్ తర్వాత సెమీస్కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. సెమీస్లో ఎవరెవరు..? తొలి క్వార్టర్ ఫైనల్ విజేత భారత్.. సెప్టెంబర్ 24న జరిగే తొలి సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్ 4 (బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్కాంగ్) విజేతను ఎదుర్కొంటుంది. అలాగే రెండో క్వార్టర్ ఫైనల్లో విజేత అయిన పాక్.. అదే సెప్టెంబర్ 24న జరిగే రెండో సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్ 3 (శ్రీలంక వర్సెస్ థాయ్లాండ్) విజేతను ఢీకొంటుంది. క్వార్టర్ ఫైనల్ 3, 4 మ్యాచ్లు రేపు (సెప్టెంబర్ 22)న జరుగనున్నాయి. ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్..? ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్, పాక్లు తలపడే అవకాశం ఉంది. సెమీస్లో ఈ రెండు జట్లు తమ తమ ప్రత్యర్ధులపై విజయాలు సాధిస్తే, సెప్టెంబర్ 25న జరిగే ఫైనల్లో ఎదురెదురుపడే ఛాన్స్ ఉంటుంది. -
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలి భారత క్రికెటర్గా
భారత మహిళల జట్టు యువ బ్యాటర్ షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో మలేషియాపై షఫాలీ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించింది. తద్వారా ఏషియన్ గేమ్స్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక హాఫ్ సెంచరీని షఫాలీ కేవలం 31 బంతుల్లోనే సాధించింది. ఓవరాల్గా 39 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. అయినప్పటికీ మలేషియా కంటే భారత్ ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో.. ఉమెన్ ఇన్ బ్లూ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత భారత్ను బ్యాటింగ్ అహ్హనించింది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్గా వెనుదిరిగింది. భారత్ స్కోర్ 59/1 ఉండగా వర్షం మొదలైంది. ఆతర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన భారత్ నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ పాటు పాటు రోడ్రిగ్స్(47 నాటౌట్), రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ దుమ్మురేపారు. ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. చదవండి: Gambhir-SRK Viral Photo: షారుఖ్ ఖాన్తో ఫొటో.. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు..: గంభీర్ పోస్ట్ వైరల్ .@TheShafaliVerma was a class act with the bat in the 19th #AsianGames quarter-final 🏏💥 React to her 🔥innings in one emoji 💬#SonySportsNetwork #Hangzhou2022 #TeamIndia #Cheer4India #IssBaarSauPaar pic.twitter.com/v7TVVeKB9K — Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2023 -
మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్కు చేరిన టీమిండియా
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్ను ఉమెన్ ఇన్ బ్లూ ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్-1లో పాకిస్తాన్తో తలపడే అవకాశం ఉంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్గా వెనుదిరిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యాక షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. షఫాలీ వర్మ( 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోడ్రిగ్స్(47 నాటౌట్) పరుగులతో దుమ్మురేపింది. ఆఖరిలో రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిముగ్గరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. చదవండి: IND Vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే? చివరగా -
ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియా మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఘోర ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో మ్యాచ్లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ ఈవెంట్లో భాగంగా బుధవారం హాంకాంగ్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఏకంగా 180 పరుగుల తేడాతో మంగోలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో కెప్టెన్ కారీ చాన్ (70) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. యీ షాన్ టోనోట్(34 నాటౌట్),మర్యం బీబీ(30) పరుగులతో రాణించారు. కాగా మంగోలియన్ బౌలర్లు ఏకంగా 36 పరుగులు ఎక్స్ట్రాస్గా ఇవ్వడం గమనార్హం. 22 పరుగులకే ఆలౌట్ అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 12.4 ఓవర్లలో కేవలం 22 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ బౌలర్లలో అలిసన్ సియు, కానీ చాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బీబీ, యూసఫ్, అమండా చెయుంగ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు మ్యాచ్లో కూడా ఇండోనేషియాపై మంగోలియా ఈ తరహా ప్రదర్శనే చేసింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో మంగోలియా కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! Indonesia Women win comprehensively over Mongolia Women in this Asian Games fixture. The Indonesians put up a huge total on the board first, then bowled out their opposition for just 15 runs!#AsianGames pic.twitter.com/FgxMI1mIub — AsianCricketCouncil (@ACCMedia1) September 19, 2023 -
ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడలు 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ ఆల్రౌండర్ గుల్బదిన్ నైబ్ నాయకత్వం వహించనున్నాడు. ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఈ జట్టుకు ఆఫ్ఘన్అబ్దల్యన్ అని పేరు పెట్టారు. ఈ జట్టులో మొహమ్మద్ షెహజాద్, కరీమ్ జన్నత్, సెదీఖుల్లా అటల్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఖైస్ అహ్మద్, అఫ్సర్ జజాయ్ లాంటి జాతీయ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అక్టోబర్ 3 లేదా 4వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో నేరుగా ఆడుతుంది. క్వార్టర్స్ అనంతరం అక్టోబర్ 6న సెమీఫైనల్, 7న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించాయి. కాగా, ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్కు చోటు దక్కింది. తొలిసారి జరుగుతున్న పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా భారత్ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది. టీమిండియా క్వార్టర్స్లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు.. గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ షెహజాద్, సెదీఖుల్లా అటల్, జుబ్దైద్ అక్బరీ, నూర్ అలీ జద్రాన్, షహీదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, వఫీవుల్లా తరాఖిల్, కరీం జన్నత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్, నిజత్ మసౌద్,సయ్యద్ అహ్మద్ షిర్జాద్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్తో తొలి మ్యాచ్లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్లో రిజర్వ్గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్కప్ టీమ్లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ -
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్ తలో వికెట్ పడగొట్టారు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్ట్రాల రూపంలో, ఓపెనర్ బత్జర్గల్ చేసిన 5 పరుగులే మంగోలియన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్స్గా నిలిచాయి. కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఈవెంట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ కూడా పాల్గొంటుంది. -
ఆసియా క్రీడల్లో టీమిండియా షెడ్యూల్ ఇలా.. కొత్త జెర్సీలో తళుక్కుమంటున్న భారత క్రికెటర్లు
ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. చైనాలో జరుగనున్న ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత పురషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల క్రికెట్ జట్టు కూడా పాల్గొంటుంది. స్వర్ణమే లక్ష్యంగా భారత్ ఈ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది. ఈ క్రీడల్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించాయి. టీమిండియా క్వార్టర్స్లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్ సెమీస్లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. కాగా, సెప్టెంబర్ 27న మొదలయ్యే గ్రూప్ మ్యాచ్లతో పురుషుల క్రికెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో పాల్గొనే 9 జట్లు మూడు గ్రూప్లుగా విభజించబడ్డాయి. గ్రూప్-ఏలో నేపాల్, మంగోలియా, మాల్దీవ్స్.. గ్రూప్-బిలో జపాన్, కంబోడియా, హాంగ్కాంగ్.. గ్రూప్-సిలో మలేసియా, సింగపూర్, థాయ్లాండ్ జట్లు పోటీపడతాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్లోని మిగతా రెండు జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. కొత్త జెర్సీలో తళుక్కుమంటున్న భారత క్రికెటర్లు.. ఏషియన్ గేమ్స్ 2023లో భారత క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతారు. JSW స్పాన్సర్ చేసిన ఈ జెర్సీలోనే ఆసియా క్రీడల్లో పాల్గొనే మొత్తం భారత బృందం బరిలోకి దిగుతుంది. కొత్త జెర్సీలో భారత యువ క్రికెటర్లు తళుక్కుమంటున్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ -
ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ సహన్ అరాచ్చిగే కెప్టెన్గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా ఆసియాకప్-2023 ఫైనల్ శ్రీలంక జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్గా ఉన్నాడు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గోనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో,అషెన్ బండార వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్కప్-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ టోర్నీలో పాల్గోనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8వరకు జరగనుంది. శ్రీలంక జట్టు: లసిత్ క్రూస్పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార (వికెట్ కీపర్), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి, చదవండి: Asia Cup 2023: పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్తో విభేదాలు! వైస్ కెప్టెన్పై వేటు The Sri Lanka Cricket Selection Committee selected the following men’s (Sri Lanka ‘A’) and women’s squad to take part in the Asian Games 2023 to be held in Hangzhou, China, from September 23 to October 8.#AsianGames pic.twitter.com/fOV9reZmwV — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 18, 2023 -
BCCI: ఏపీ పేసర్ అంజలి శర్వాణి చేజారిన గోల్డెన్ ఛాన్స్.. జట్టులోకి ఆమె
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది. మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్గా ఉన్న పూజా వస్త్రాకర్కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక. ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్. -
ఆర్సీబీ పేసర్కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన
Asian Games 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ ఆకాశ్ దీప్ను అదృష్టం వరించింది. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత పురుషుల క్రికెట్ జట్టులో అతడికి చోటు దక్కింది. శివం మావి స్థానంలో ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్ను చైనాకు పంపనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది. మావి వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా అతడి స్థానంలో ఆకాశ్ దీప్ను ప్రధాన జట్టులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా బిహార్కు చెందిన ఆకాశ్ దీప్.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఎన్ని వికెట్లు తీశాడంటే 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ 26 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్.. అదే ఏడాది లిస్ట్-ఏ(వన్డే), ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. 2021 (సెకండ్ ఫేజ్)లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. ఇప్పటి వరకు మొత్తంగా 7 మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్- శివం మావి(PC: IPL/BCCI) టీ20 ఫార్మాట్లో ఈ క్రమంలో శివం మావి గాయపడటంతో చైనాకు వెళ్తున్న టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. కాగా అండర్-19 వరల్డ్కప్-2018 గెలిచిన జట్టులో సభ్యుడైన యూపీ పేసర్ మావి దురదృష్టవశాత్తూ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి కాగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు చైనాలోని హొంగ్జూ వేదికగా.. ఆసియా క్రీడలు-2023 ఆరంభం కానున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 28 నుంచి టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్లు షురూ అవుతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న మహిళా క్రికెట్ జట్టుకు పేసర్ అంజలి శార్వాణి దూరం కాగా.. పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి వచ్చింది. 19వ ఆసియా క్రీడలకు భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: యశ్ ఠాకూర్, సాయికిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. చదవండి: Asia Cup: అభిమానులకు చేదువార్త.. ఫైనల్కు వర్షం ముప్పు! -
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్లో జరిగిన గ్రాండ్ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
ఆసియా క్రీడలకు భారత ఫుట్బాల్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) క్లబ్ జట్లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎంపిక చేసిన పలువురు అగ్రశ్రేణి సీనియర్, జూనియర్ ఆటగాళ్లను ఐఎస్ఎల్ క్లబ్లు విడుదల చేయలేదు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కెప్టెన్ సునీల్ ఛెత్రి మినహా మిగతా వారంతా అనుభవంలేని ఆటగాళ్లే ఉన్నారు. సునీల్ ఛెత్రితోపాటు సీనియర్ గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్, సందేశ్ జింగాన్లను ఏఐఎఫ్ఎఫ్ ఎంపిక చేసింది. ఆసియా క్రీడల కోసం గుర్ప్రీత్ను బెంగళూరు ఎఫ్సీ, సందేశ్ను గోవా ఎఫ్సీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు. భారత జట్టు వెంట రెగ్యులర్ కోచ్ ఇగోర్ స్టిమాక్ వెళ్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆసియా క్రీడల ఫుట్బాల్ మ్యాచ్లు ఈనెల 19న మొదలుకానుండగా... ఐఎస్ఎల్ పదో సీజన్కు ఈనెల 21న తెరలేస్తుంది. భారత ఫుట్బాల్ జట్టు: ధీరజ్ సింగ్, గుర్మీత్ సింగ్ సుమిత్ రాఠి, నరేందర్ గెహ్లోట్, అమర్జీత్ సింగ్, శామ్యూల్ జేమ్స్, కేపీ రాహుల్, అబ్దుల్ రబీ, ఆయుశ్ దేవ్, బ్రైస్ మిరిండా, అజ్ఫర్ నూరాని, రహీమ్ అలీ, విన్సీ బరెటో, సునీల్ ఛెత్రి, రోహిత్ దాను, గుర్కీరత్ సింగ్, అనికేత్ జాదవ్. -
టీమిండియాకు షాక్.. ఉమ్రాన్కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. భారత జట్టుకు గాయాల బెడద ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్రాన్తో పాటు అతడి పేరు పరిశీలనలో అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తొలిసారి భారత క్రికెట్ జట్లు చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. శిక్షణా శిబిరం అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు. ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్. చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? -
ఏషియన్ గేమ్స్ ట్రైనింగ్ క్యాంప్.. భారత బాక్సింగ్ జట్టుతో పాటు రైల్వే కోచ్ దుర్గా ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: చైనాలోని వుయిషాన్ నగరంలో సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు (17 రోజులు) జరిగే ఏషియన్ గేమ్స్ ట్రైనింగ్ క్యాంప్కు తెలంగాణ బాక్సింగ్ కోచ్ దుర్గా ప్రసాద్ నామినేట్ అయ్యాడు. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన దుర్గా ప్రసాద్ భారత బాక్సింగ్ జట్టుతో పాటు చైనాకు వెళ్లనున్నాడు. ఈ శిక్షణా శిబిరంలో మొత్తం 46 మంది పాల్గొననున్నారు. ఇందులో 26 మంది బాక్సర్లు (పురుషులు, మహిళలు) కాగా.. 9 మంది కోచ్లు, 11 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. కాగా, 2023 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్ఝౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. అతడు కూడా
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత పురుష, మహిళ క్రికెట్ జట్లు తొలిసారి పాల్గోనున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 హాంగ్జౌలో జరగనున్నాయి. కాగా ఈవెంట్ కోసం భారత పురుషల ద్వితీయ శ్రేణి జట్టును బీసీసఘై ఎంపిక చేసింది. ఆక్టోబర్లో వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో.. ఆసియాకప్లో యువ భారత జట్టు పాల్గొనుంది. ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు యశస్వీ జైశ్వాల్,రింకూ సింగ్, జితేష్ శర్మకు చోటు దక్కింది. ఇక ఈవెంట్లో భారత పురుషల జట్టు కెప్టెన్గా యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడపించనుంది. హెడ్ కోచ్లుగా వీవీఎస్ లక్ష్మణ్, హృషికేష్ కనిట్కర్ కాగా ఈ ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ప్రస్తుతం ఆసియాకప్-2023 కోసం ఆలూర్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్లో భారత ఆటగాళ్లతో పాటు ఉన్నాడు. ఇక లక్ష్మణ్తో పాటు చైనాకు సాయిరాజ్ బహుతులే(బౌలింగ్కోచ్),మునీష్ బాలి (ఫీల్డింగ్ కోచ్) కూడా వెళ్లనున్నారు. లక్ష్మణ్తో పాటు, ఆసియాడ్ కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే మరియు ఫీల్డింగ్ కోచ్గా మునీష్ బాలి ఉన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు ఈ ఆసియాటోర్నీలో భారత మహిళల జట్టు హెడ్కోచ్గా మాజీ ఆటగాడు హృషికేష్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. కాగా గత డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టు రెగ్యూలర్ హెడ్కోచ్ లేకుండానే ఆడుతోంది. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్గా! ఎవరీ అక్రమ్?
చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఖాసిం అక్రమ్ను కెప్టెన్గా పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. అయితే ఆక్టోబర్ నుంచి 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరగనుండడంతో ఆసియా క్రీడలకు తమ ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఖాసిం అక్రమ్తో పాటు అరాఫత్ మిన్హాస్, మీర్జా తాహిర్ బేగ్, సుఫియాన్ ముఖీమ్, రోహైల్ నజీర్, ఓమైర్ బిన్ యూసుఫ్,ముహమ్మద్ అఖ్లాక్లకు తొలి సారి పాకిస్తాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఎవరీ అక్రమ్? ఇక ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా ఏకంగా పాక్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన ఖాసిం అక్రమ్ గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 20 ఏళ్ల అక్రమ్కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరపున అక్రమ్ ఆడుతున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడిన ఈ ఆల్రౌండర్.. 27 వికెట్లతో పాటు 960 పరుగులు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడిన అక్రమ్ 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అక్రమ్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్-2021-2022లో పాక్ జట్టు కెప్టెన్గా అక్రమే వ్యవహరించాడు. ఈ టోర్నీలో కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా అక్రమ్ అకట్టుకున్నాడు. అదే విధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్ నిలవడంలో కూడా అక్రమ్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్-ఏ జట్టు తరపున అక్రమ్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి జట్టు పగ్గాలు సెలక్టర్లు అప్పగించారు. పాకిస్థాన్ షాహీన్స్ జట్టు: ఖాసిమ్ అక్రమ్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్ (విసి), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మీర్జా తాహిర్ బేగ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), రోహైల్ నజీర్ , షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖదీర్. నాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: అబ్దుల్ వాహిద్ బంగల్జాయ్, మెహ్రాన్ ముంతాజ్, మొహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ముబాసిర్ ఖాన్. చదవండి: Praggnanandhaa: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
‘పసిడి’ ఆశలు ఆవిరి! ఇక ఏ గొడవా లేదు..
Asia Games 2023- న్యూఢిల్లీ: ట్రయల్స్ లేకుండా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మినహాయింపు పొందిన మహిళా స్టార్ రెజ్లర్, డిఫెండింగ్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ తాజాగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకొంది. మోకాలు గాయం వల్ల హాంగ్జౌ ఈవెంట్లో పాల్గొనడం లేదని మంగళవారం ఆమె ప్రకటించింది. దీంతో మినహాయింపు అనుచితమంటూ కోర్టుకెక్కిన అంతిమ్ పంఘాల్కు 53 కేజీల కేటగిరీలో లైన్ క్లియరైంది. ఆ విభాగంలో ట్రయల్స్లో నెగ్గి ఆసియా ఈవెంట్కు అర్హత సంపాదించినప్పటికీ... వినేశ్ బరిలో ఉండటం వల్ల ఆమె స్టాండ్బైగా కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినేశ్ తనంతట తానుగా తప్పుకోవడంతో ఇక ఏ గొడవా లేకుండా అంతిమ్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ‘పసిడి’ ఆశలు ఆవిరి ‘ట్రెయినింగ్లో ఎడమ మోకాలుకు గాయమైంది. స్కానింగ్లో గాయం తీవ్రత దృష్ట్యా సర్జరీ తప్పనిసరని వైద్యులు సూచించడంతో ఈ నెల 17న ముంబైలో ఆపరేషన్ చేయించుకుంటాను. దీనివల్ల జకార్తా ఆసియా క్రీడల్లో (2018) సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న నా ఆశలు ఆవిరయ్యాయి’ అని వినేశ్ వాపోయింది. రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్ తదితరులు పలుమార్లు జంతర్మంతర వద్ద నిరసనకు దిగారు. డబ్లూఎఫ్ఐ అడ్హక్ కమిటీ వినేశ్, భజరంగ్లకు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమివ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ట్రయల్స్ గెలిచిన అంతిమ్ కోర్టును ఆశ్రయించింది. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఆసియా క్రీడలకు ముందు భారత్కు బిగ్ షాక్.. స్టార్ రెజ్లర్ ఔట్
2023 ఆసియా క్రీడలకు ముందు భారత్కు బిగ్ షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా పోటీల్లో పాల్గొనడం లేదని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆగస్ట్ 13న రిహార్సల్స్ సమయంలో ఎడమ మోకాలికి తీవ్ర గాయమైందని.. స్కాన్లు, పరీక్షల అనంతరం డాక్టర్లు సర్జరీ అనివార్యమని చెప్పారని, ఆగస్ట్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానని పేర్కొంది. కాగా, చైనాలోని హ్యాంగ్ఝౌలో త్వరలో (సెప్టెంబన్ 23-అక్టోబర్ 8) జరుగనున్న ఆసియా క్రీడల్లో వినేశ్ ఫోగట్పై భారీ అంచనాలే ఉన్నాయి. మహిళల రెజ్లింగ్లో ఆమె స్వర్ణం సాధించడం ఖాయమని అంతా ఆశించారు. ఇప్పుడు వినేశ్ గాయపడటంతో భారత్ తప్పక గెలవాల్సిన గోల్డ్ మెడల్ను కోల్పోవాల్సి వచ్చింది. వినేశ్ స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల్లో పాల్గొనవచ్చని తెలుస్తుంది. 28 ఏళ్ల వినేశ్ 2018 ఏషియన్ గేమ్స్ 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. -
అమ్మానాన్న వద్దన్నారు! ఇప్పుడు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్కు ఆమె పేరు
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించింది మిన్ను మణి. కష్టపడితే ఫలితం తప్పక దక్కుతుందడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గిరిజన గూడెంలో పుట్టి.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను మనోబలంతో జయించి.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగింది. ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకని వారించిన అమ్మానాన్నలతో పాటు.. తమ ఊరు మొత్తాన్ని గర్వపడేలా చేస్తోంది. విమర్శించిన నోళ్లే తనను కొనియాడేలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2023కి సన్నద్ధమవుతున్న ఈ ‘మట్టిలో మాణిక్యం’ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! మగవాళ్ల ఆట మనకెందుకు? కేరళలోని వయనాడ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండల అంచున ఉన్న గిరిజన గూడెం మిన్ను స్వస్థలం. ‘కరూచియా’ తెగకు చెందిన ఆమె తండ్రి మణి రోజువారీ కూలీ. ఆయన తెచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు తలకెత్తుకున్న వసంత మిన్ను తల్లి. చిన్ననాటి నుంచే మిన్నుకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడేది. కానీ మిన్నును అథ్లెట్గా చూడాలనుకున్న ఆమె తల్లిదండ్రులకు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. మగవాళ్ల ఆట మనకెందుకని కూతుర్ని వారించారు. పురుషాధిక్య ప్రపంచంలో మిన్నుకు ఇంటి నుంచే ఇలాంటి పోరు మొదలైంది. పట్టువీడలేదు.. బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయలా! కానీ ఆమె పట్టువీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్ పీఈటీ టీచర్తో పరిచయం మిన్ను రాతను మార్చింది. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నును కేరళ క్రికెట్ అసోసియేషన్కు తీసుకెళ్లింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతురాలైన మిన్ను తన ఆటతో అక్కడున్న వాళ్లను మంత్రముగ్ధులను చేసి.. తొలుత జిల్లా స్థాయి, ఆపై అండర్ 16.. అండర్ 23లో కేరళకు ఆడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళా అండర్-23, అనంతరం ఇండియా- ఏ జట్టుకు ఎంపికైంది. అయితే, ఆటలో దూసుకుపోతున్నా ‘ఆర్థిక కష్టాల కడలి’ని మాత్రం అంత తేలికగా దాటలేకపోయింది మిన్ను. దశ తిరిగింది.. అదృష్టం వరించింది అలాంటి సమయంలో మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో మిన్నును ‘అదృష్టం’ వరించింది. ఆమె అద్భుత ఆట తీరుకు ప్రతిఫలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 30 లక్షలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. దీంతో మిన్ను కుటుంబానికి కాస్త సాంత్వన లభించింది. అయితే, ఆర్థికంగా కష్టాలు తీరినా.. తనకు ఈ డబ్బు ముఖ్యం కాదని.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం.. మిన్నుకు ఆట పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఆమె ఆశయం గొప్పది.. అందుకే బంగ్లాదేశ్ పర్యటన రూపంలో అవకాశం కలిసివచ్చింది. అరంగేట్రంలోనే సత్తా చాటి.. ఈ ఏడాది బంగ్లాదేశ్తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమెకు అవకాశం వచ్చింది. బంగ్లాతో మొదటి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మిన్న మణి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్రౌండర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ సిరీస్లో మొత్తంగా ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను.. తనదైన ముద్ర వేయగలిగింది. ఆరంభంలోనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుని వారం తిరిగే లోపే 19వ ఆసియా గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. చైనా వేదికగా సెప్టెంబరు 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక క్రీడల్లో భాగం కానుంది. సమాజం నుంచి ఎన్నో విమర్శలు ‘‘క్రికెట్పై నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. ఎనిమిదో తరగతికి వచ్చే దాకా నేను లోకల్ మ్యాచ్లు ఆడుతున్న విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ.. వరి పొలాల్లో పనిచేసుకుంటూ.. నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని. స్థలం కావాలి అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతోందని చుట్టుపక్కల వాళ్లు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ల కుమార్తెలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు’’ అని 24 ఏళ్ల మిన్ను మణి సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది. అరుదైన గౌరవం.. ఆ జంక్షన్కు పేరు ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో గల మనంతవాడీ మున్సిపాలిటి మిన్ను మణిని అరుదైన గౌరవంతో సత్కరించింది. మైసూర్ రోడ్డు జంక్షన్కు మిన్ను మణి జంక్షన్గా నామకరణం చేసింది. మిన్ను ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జంక్షన్ ఉంటుంది. ఊహించని బహుమతి సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని.. అయితే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమతి ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది. మట్టి సువాసనలు పరిమళించగా.. ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించనుండటం గర్వంగా ఉందన్న మిన్ను.. ఆల్రౌండర్గా మెగా ఈవెంట్లో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. బౌలర్గా తనకు ప్రాధాన్యం ఉంటుందన్న మిన్ను.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావొచ్చని చెప్పుకొచ్చింది. మరి లెఫ్టాండ్ బ్యాటర్.. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ అయిన మిన్ను మణి ఆసియా క్రీడల్లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగితే.. ఆమె తల్లిదండ్రులతో కేరళ మొత్తం గర్విస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి సువాసనలతో పరిమళించిన తమ ఆడబిడ్డను దేశం కూడా విజయోస్తు అని దీవిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా! హ్యాట్సాఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిన్ను ‘మణి’!! -సాక్షి వెబ్డెస్క్ చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! -
'నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా.. కానీ ఆ విషయంలో మాత్రం హ్యాపీ'
టీమిండియా వెటరన్ వికెట్ ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు వెళ్లే భారత జట్టుకు ధావన్ సారధ్యం వహిస్తాడని అంతా భావించారు. కానీ గబ్బర్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ను సారధిగా ఎంపిక చేశారు. కాగా గతంలో చాలా సిరీస్ల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావనే నాయకత్వం వహించాడు. ఇక ఆసియాగేమ్స్కు చోటు దక్కకపోవడంపై ధావన్ తాజాగా స్పందించాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు వేరే ఆలోచనతో జట్టును ఎంపిక చేశారని నేను భావించాను. దాన్ని మనం అంగీకరించక తప్పదు. రుత్రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు మొత్తం యువకులతో కూడి ఉంది. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.. జట్టుకు అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తూనే ఉంటాను. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పటికీ ఫిట్నెస్గా ఉన్నాను. అయితే నా ఫ్యూచర్ కోసం ఏ సెలక్టరు కూడా ఇప్పటివరకు నాతో ఏమి మాట్లాడలేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు టైటిల్ను అందించడమే నా లక్ష్యమని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: 'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు'