coffee
-
కాఫీ.. టీతో క్యాన్సర్కు చెక్...!
తల, మెడ క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా ఏడో అత్యంత సాధారణ క్యాన్సర్గా వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, రోజూ నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగిన వారిలో ఈ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఫర్ రివ్యూడ్ జర్నల్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ కన్సార్టియంతో అనుసంధానమైన శాస్త్రవేత్తలు సుమారు 14 అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ...’ అన్నాడో సినీ రచయిత. చాలామందికి తమ దైనందిన జీవితం కాఫీతో మొదలవుతుంది. కొందరికి ఉదయం కాఫీ/టీ తాగకపోతే అసలు ఏ పనీ జరగదు. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కొందరు కాఫీ, టీ తాగడం మంచిది కాదని చెబుతున్నా... అమెరికన్ కాన్సర్ సొసైటీ మాత్రం కాఫీ, టీలు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని చెబుతోంది. – ఏపీ సెంట్రల్ డెస్క్పరిశోధన ఇలా...సుమారు 25వేల మందికిపైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కాఫీ/టీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా తల, మెడ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు రోజు/వారం/నెల/సంవత్సరానికి.... కెఫెన్ లేని కాఫీ, టీని తీసుకోగా వచ్చిన డేటా ఫలితాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.ఇదీ డేటా..తల, మెడ క్యాన్సర్తో బాధపడుతున్న 9,548 మంది, క్యాన్సర్ లేని 15,783మందిపై పరిశోధనలు చేయగా... కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ 4 కప్పులు కంటే ఎక్కువ కెఫెన్ ఉన్న కాఫీ తాగే వ్యక్తుల్లో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే నోటికుహరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 30% తక్కువని, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం 22% తక్కువని తేలింది.ఇక రోజూ 3–4 కప్పుల కెఫెన్ ఎక్కువ ఉన్న కాఫీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ (గొంతు దిగువన ఉండే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం తక్కువని తేలింది. అలాగే కెఫెన్ లేని కాఫీ తాగడం వల్ల నోటి కుహర క్యాన్సర్ వచ్చే అవకాశాలు 25% తక్కువని, టీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ 29% తక్కువ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాగా, 1 కప్పు లేదా అంతకంటే తక్కువ టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9% తక్కువని, హైపోఫారింజియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందంటున్నారు. ఇలా ఉంటే, అధిక కాఫీ వినియోగం పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించడంలో మేలు చేసినా, ఇందుకు మరింత పరిశోధన అవసరమని నివేదికలో పేర్కొన్నారు. క్యాన్సర్ తగ్గించుకునేందుకు కాఫీ, టీలు తాగడం మాత్రమే పరిష్కారం కాదనీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామాలు, వైద్యపరీక్షలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్క్రీమ్లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
‘భారత్ మార్కెట్కు కట్టుబడి ఉన్నాం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఒకటైన భారత్లో కార్యకలాపాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేఫె చెయిన్ సంస్థ టాటా స్టార్బక్స్ వెల్లడించింది. భారత్ నుంచి స్టార్బక్స్ నిష్క్రమిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 76 నగరాల్లో 470 పైచిలుకు స్టోర్స్ను నిర్వహిస్తున్నట్లు వివరించింది. టాటా గ్రూప్లో ఎఫ్ఎంసీజీ విభాగమైన టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్), అమెరికాకు చెందిన స్టార్బక్స్ కార్పొరేషన్ కలిసి జాయింట్ వెంచర్గా టాటా స్టార్బక్స్ను ఏర్పాటు చేశాయి. నిర్వహణ వ్యయాలు భారీగా ఉండటం, నష్టాలు పెరిగిపోతుండటం, మార్కెట్లో చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా స్టార్బక్స్ భారత్ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.ఇదీ చదవండి: సోలారే సోబెటరూ..రెస్టారెంట్ బ్రాండ్స్ క్విప్నకు సైన్యూఢిల్లీ: రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్(గతంలో బర్గర్ కింగ్ ఇండియా) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ(క్విప్) చేపట్టనుంది. తద్వారా రూ. 500 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈక్విటీ షేర్లు లేదా క్విప్నకు వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2024 ఉద్యోగులకు షేర్ల కేటాయింపు(ఇసాప్)నకు సైతం బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అర్హులైన డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులకు స్టాక్ ఆప్షన్లను జారీ చేయనున్నట్లు వివరించింది. ఇసాప్లో భాగంగా దాదాపు 1.05 కోట్ల ఆప్షన్స్ను గరిష్టంగా ఆఫర్ చేసే వీలున్నట్లు తెలియజేసింది. -
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్ను ప్లాన్ చేసుకుంటుంది. -
కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న నభా నటేశ్... ఫోటోలు వైరల్
-
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
కార్స్ 'ఎన్' కాఫీలో ఆకట్టుకున్న వింటేజ్ కార్లు (ఫొటోలు)
-
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు!
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు! -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
నో స్ట్రింగ్స్ కాఫీ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కొలువుదీరింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో భాగంగా కాఫీ ఆర్ట్ సెషన్స్, బరిస్తా డిస్ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్ కోసం విభిన్న రకాల ఈవెంట్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్పీ హిల్ రోస్టర్స్.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. -
ఏపీ కాఫీకి ‘భలే’ డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.దేశంలో 2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్షాపుల ద్వారా కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది. 2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలారాష్ట్రం పేరు విస్తీర్ణం సాగు (హెక్టార్లు) ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు) కర్ణాటక 2,46,550 2,48,020 కేరళ 85,957 72,425 తమిళనాడు 35,685 18,700 ఆంధ్రప్రదేశ్ 1,00,963 12,265 ఒడిశా 4,868 465 ఈశాన్య ప్రాంతాలు 5,647 125 -
ఆఫీసులో బాస్ కొత్త రూల్: పనివేళల్లో..
ఆఫీసులో పని చేసి అలసిపోయినప్పుడు ఉద్యోగులు మధ్యలో విరామం తీసుకోవడంలో భాగంగా కాఫీ కోసం బయటకు వెళ్లారు. ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ కోసం బయటకు వెళ్ళకూడదు ఆస్ట్రేలియన్ మైనింగ్ బాస్ & మినరల్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ 'క్రిస్ ఎల్లిసన్' ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ తాగాలని బయటకు వెళ్తే, కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ఎల్లిసన్.. రోజంతా ఉద్యోగులను ఆఫీసులోనే ఉంచడానికి కొత్త రూల్ పాస్ చేశారు. ఇందులో భాగంగానే ఆఫీసులోనే ఉద్యోగులకు కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సన్నద్ధమయ్యారు.ఉద్యోగుల కోసం ఆఫీసులోనే రెస్టారెంట్, జిమ్, స్టాఫ్ సైకాలజిస్ట్లు, క్రెచ్ వంటి సౌకర్యాలను ఏపాటు చేయడానికి ఎల్లిసన్ పెట్టుబడి కూడా పెట్టారు. ఇవన్నీ ఆఫీసులోనే ఉంటే ఉద్యోగి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఉద్యోగులు ఓ కప్పు కాఫీ కోసం రోడ్డుపైకి (బయటకు) వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్ఉద్యోగులు బయటకు వెళ్లడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కూడా సరైనది కాదని వెల్లడించారు. కోవిడ్ 19 తరువాత రిమోట్ వర్క్ విధానానికి అనుమతి ఇచ్చిన కంపెనీలను కూడా అయన విమర్శించారు. ఎల్లిసన్ గత ఏడాది వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి మంగళం పాడేసారు. -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్గా, కంట్రోల్డ్గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్ఫుల్నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్ను ప్యాకేజింగ్ ఫుడ్గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్ను సంప్రదించడం మంచిది. -
ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?
చాలామంది తమ ఉదయాన్ని కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మార్నింగ్ కాఫీతోనే పరగడుపు మాత్రలు తీసుకుంటుంటారు. చాలావరకు కప్పు కాఫీతో మందులు మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదని, వివిధ దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏఏ మందులు కాఫీతో కలిపి తీసుకోకూడదో సవివరంగా తెలుసుకుందామా..!కాఫీ కడుపుని ప్రేరేపించి జీర్ణవ్యవస్థ ఆహారాన్ని తీసుకునే సమయాన్ని మారుస్తుంది. మందులు మింగే వారికి ఈ కాఫీ వాటితో రియాక్షన్ చెంది రక్తప్రవహంలోకి శోషించటానికి ఎక్కువ వ్వవధి తీసుకునేలా చేస్తుంది. ఇది మానువుల జీవక్రియ, విసర్జనపై గణనీయమైన ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాఫీతో తీసుకోవడం నివారించాల్సిన మందులు..యాంటీబయాటిక్స్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాఫీ కూడా ఒక ఉద్దీపన కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అశాంతి, నిద్రలేమి దారితీస్తుంది లేదా దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణమవుతుంది.ఫెక్సోఫెనాడిన్ వంటి అనేక ఇతర అలెర్జీ ఔషధాలను కాఫీతో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది - విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను పెంచుతుంది.థైరాయిడ్ మందులుహైపో థైరాయిడిజం ఉన్నవారికి - తగినంత థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి అవ్వదు. దీంతో బరువు పెరగడం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన జుట్టు రాలడం మహిళల్లో క్రమరహిత రుతుక్రమాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, హార్మోన్లను సమతుల్యం చేయడం కోసం థైరాయిడ్ మందులు తీసుకునేవారు కాఫీతో తీసుకుంటే గనుకు ఆ మందులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.ఆస్తమా మందులుఆస్తమా మందులు ఊపిరితిత్తులలోని కండరాలను సడలించి, వాయు వాయుమార్గాలను విస్తరించేలా చేసి..సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. ఇక్కడ కెఫీన్ ఒక తేలికపాటి బ్రోంకోడైలేటర్. ఇది ఈ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేగాదు ఈ బ్రోంకోడైలేటర్లను మందులతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, చిరాకు వంటివి కూడా ముఖ్యంగా పిల్లలలో కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.మధుమేహం మందులుకాఫీని చక్కెర లేదా పాలతో కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. అందువల్ల మధుమేహం మందులు అంతబాగా ప్రభావితంగా పనిచెయ్యవు. పైగా మధుమేహం ఉన్నవారికి కెఫీన్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.అల్జీమర్స్ ఔషధంఅల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒకరకమైన మెదడు రుగ్మత లేదా అభిజ్ఞా పనితీరును కోల్పోవడం. దీనివల్ల రోజువారీ పనులను ఆలోచించడం, గుర్తుంచుకోవడం లేదా చేయడం చాలా కష్టం.అల్జీమర్స్తో నివసించే మిలియన్ల మంది ప్రజలు ఈ పరిస్థితికి మందులు తీసుకుంటారు. అయినప్పటికీ, డోపెజిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి మందులు కెఫిన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ రక్తం, మెదడు మధ్య అవరోధాన్ని బిగించి, ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ అల్జీమర్స్ మందులు న్యూరోట్రాన్స్మిటర్, ఎసిటైల్కోలిన్ను రక్షించడం ద్వారా పని చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటామో అప్పుడు ఈ కెఫీన్ ఆ రక్షణ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలిందని వివరించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?) -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!) -
Filter Coffee: అటు ప్రిపరేషన్.. ఇటు ఫిల్టరేషన్
హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి బిర్యానీ అయితే మరొకటి ఇరానీ చాయ్.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. నలుగురూ ఒకచోట చేరి చాయ్ తాగుతూ ముచ్చట్లు పెడుతుంటారు. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టి సాయంత్రం కాస్త సేదతీరుతుంటారు. ఓ కప్పు టీ తాగితే ఉంటుంది భయ్యా.. శిరోభారం హుష్ కాకి అన్నట్టే.. అయితే..చాయ్ మాత్రమే కాదు.. చాలా మంది కాఫీ ప్రియులు కూడా ఉంటారు.. అలా గ్లాసులో కాఫీ పట్టుకొస్తుంటే.. ఆ రంగు.. ఆ అరోమా చూస్తే చాలు ఏదో తెలియని అనుభూతి. అలాంటి కాఫీ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు.. జస్ట్ అలా అశోక్నగర్ వెళ్తే చాలు. ⇒ పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీకి కేరాఫ్ అడ్రస్..⇒ ఇద్దరు అభ్యర్థుల వినూత్న ప్రయత్నం⇒ అశోక్నగర్లో ప్రత్యేక ఆకర్షణగా ⇒ మీమ్స్తో ఆకట్టుకుంటున్న యువత దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కాఫీకి ఫ్యాన్స్ ఎక్కువ. ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. మన దగ్గర కూడా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మందే ఉన్నారు. కాకపోతే ఫిల్టర్ కాఫీ అంత సులువుగా దొరకదు. చాలా ప్రాంతాల్లో ఇన్స్టంట్ కాఫీయే దొరుకుతుంది. అందుకే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఫిల్టర్ కాఫీ ప్రియుల కోసం కాఫీపురం పేరుతో చిన్న కేఫ్ను స్థాపించారు.అడుగడుగునా మీమ్స్.. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యువతను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్ను వీరు ఒడిసి పట్టుకున్నారు. కేఫ్లో ఎక్కడ చూసినా కామెడీ మీమ్స్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పేమెంట్ క్యూఆర్ కోడ్ వద్ద, సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేందుకు కూడా మీమ్స్నే వాడుతున్నారు. చిక్కమగళూరు కాఫీ, కూర్గ్ కాఫీ, అరకు కాఫీ, బీఆర్ హిల్స్ కాఫీ వంటి కాఫీ వెరైటీలను ప్రత్యేకంగా గ్రేడింగ్ చేయించి తెప్పిస్తున్నారు. జస్ట్ అలా షాప్లోకి అడుగు పెడితే చాలు కాఫీ అరోమాతో ముక్కుపుటాలు అదిరిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.యూపీఎస్సీ అభ్యర్థుల వినూత్న ప్రయత్నం..వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ.. కిశోర్ సంకీర్త్, కె.అభినయ్ అనే అభ్యర్థులు ఈ కేఫ్ను స్థాపించారు. కాస్త వినూత్నంగా ఆలోచించి దీనికి కాఫీపురం అని పెట్టారు. కాఫీ గింజలను ప్రత్యేకంగా పశ్చిమ కనుమలు, అరకు నుంచి తెప్పించి మరీ కాఫీ తయారు చేస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే కచ్చితంగా అందరికీ స్టీలు గ్లాసుల్లోనే అందిస్తున్నారు. వాడిన గ్లాసులను స్టీమ్ ద్వారా స్టెరిలైజ్ చేస్తారు. పరిశుభ్రతతో పాటు మంచి ఫిల్టర్ కాఫీ అనుభూతిని అందించడమే తమ ప్రథమ లక్ష్యమని చెబుతున్నారు.అథెంటిక్ కాఫీ ఇవ్వాలని..హైదరాబాద్లో అథెంటిక్ ఫిల్టర్ కాఫీ చాలా అరుదుగా దొరుకుతుంది. పుస్తకాలతో కుస్తీ పట్టి అలా సేదతీరాలనుకునే వారి కోసం ఈ కేఫ్ పెట్టాను. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంటే ఈ ఆలోచన వచి్చంది. – కిశోర్ సంకీర్త్, వ్యవస్థాపకుడుఫిల్టర్ కాఫీ కోసమే వస్తాను.. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. మాది కర్ణాటక. ఎక్కువగా ఫిల్టర్ కాఫీ తాగుతాను. చాలాచోట్ల ఫిల్టర్ కాఫీ కోసం వెతికాను. చివరకు కాఫీపురం గురించి తెలుసుకుని, ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి కాఫీ తాగనిదే రోజు గడవదు. –స్ఫూర్తి, బెంగళూరు, యూపీఎస్సీ అభ్యర్థిప్రభుత్వ ఉద్యోగం నా కల.. కేఫ్ నిర్వహణ నా చదువుకు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకుంటాను. పకడ్బందీగా షెడ్యూల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా కల. అలాగే భవిష్యత్తులో కాఫీ షాప్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనేదే నా కోరిక. – కపాడం అభినయ్, కాఫీపురం కో–ఫౌండర్ -
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
కాఫీ ఘుమఘుమలకు వహ్..! అని కితాబిస్తు ఒక్క సిప్ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్కీ బాత్ 111వ ఎపిసోడ్లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్షిప్ బ్రాండ్తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!) -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!!
ఒక సిప్ గొంతులోకి వెళ్తే ఎంత ఆస్వాదిస్తామో.. పొగలు కక్కే కప్పులోంచి ఆ పరిమళం నాసికకు సోకినా అంతే గొప్పగా ఆఘ్రాణిస్తామంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రియుల నాసికలకు పరీక్ష పెట్టిన కప్పా సెషన్ ఆకట్టుకుంది. ఓ వైపు కాఫీల ఘుమఘుమలు.. మరోవైపు కాఫీ గింజల ఉత్పత్తి దారులతో చర్చలు.. వెరసి నిర్వహించిన క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్ ఈవెంట్ నవాబుల నగరంలో పెరుగుతున్న కాఫీ సంస్కృతికి అద్దం పట్టింది. – సాక్షి, సిటీబ్యూరోకాఫీ ప్రియులు, కాఫీ గింజల పెంపకందారులు, కేఫ్ యజమానులు స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. నగరానికి చెందిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్లో ఉన్న కోరమ్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్లో రత్నగిరి ఎస్టేట్ నుంచి తీసుకువచ్చిన సరికొత్త స్పెషాలిటీ కాఫీలను ప్రదర్శించారు.ఆకట్టుకున్న పరిమళాల గుర్తింపు..ఈ ఈవెంట్లో భాగంగా కప్పా సెషన్ పేరిట కాఫీ ఫ్లేవర్లను గుర్తించేందుకు కాఫీ ప్రియులకు అవకాశం ఇచ్చారు. విభిన్న రకాల కాఫీలను కప్పులలో అందజేసి వాటిని నాసిక ద్వారా ఆఘ్రానించడం ద్వారా ఫ్లేవర్లను గుర్తించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేయడంలో కాఫీ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ పాత్రే, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ నిర్వాహకురాలు ఎస్ఆర్కె చాందినీలతో ఆహుతులకు ముఖాముఖి సెషన్ నిర్వహించారు.ఇవి చవవండి: టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్.. -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
గ్రీన్ కాఫీని తయారు చేసిన విద్యార్థులు!ఐతే టేస్ట్లో..
గ్రీన్టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విన్నాం. పైగా దీన్ని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కూడా. ఐతే గ్రీన్ టీ ఉన్నట్లే..గ్రీన్ కాఫీ కూడా ఉందని విన్నారా..?. కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకని టీ ఉన్నట్లే కాఫ్లీ కూడా ఉంటే బాగుండనన్న ఆ ఆలోచనకు రూపం ఇచ్చారు ఈ కేరళ విద్యార్థులు. అలానే గ్రీన్ టీ మాదిరిగానే ఈ గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల అందించేదిగా ఉండాలని భావించారు. అందుకోసం వాళ్లు ఏం చేశారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? విజయవంతమయ్యారా తదితరాల గురించి చూద్దాం.!లారస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్కు చెందిన పది మంది సభ్యుల విద్యార్థి బృందం ఈ గ్రీన్ కాఫీని తయారు చేసే ప్రయోగాలకు నాంది పలికారు. వాళ్లు మంచి ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేయడం, ఉత్పత్తులు మంచిగా కొనగోలు అయ్యేలా ప్యాకింగ్ వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇలాంటి కొత్త ప్రయోగాల్లో కంపెనీలు తమవంత సహాయ సహకారాలు అందిస్తుంది. అలానే కలమ్సేరి ఆధారిత ప్రైవేటు కంపెనీ ఒకటి ఈ బృందానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ బృందం ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ శంకర్ సలహాలు, సూచనలతో మంచి గ్రీన్ కాఫీని తయారు చేశారు. అయితే రుచి మాత్రం తాగేలా టేస్టీగా లేదు. ప్రజలు ఆసక్తిచూపి తాగే విధంగా అస్సలు లేదు. దీంతో విద్యార్థుల బృందం తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. అయితే దీనికి రోజ్ ఫ్లేవర్, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి చూశారు. అవి జోడిస్తే ప్రొడక్ట్ నిల్వ ఉండే వ్యవధి కాలం తగ్గిపోవడంతో ఇక ఆ ప్రయత్నం మానేశారు. దీంతో ఈ అరబికా కాఫీ గింజలను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాక్ చేయాలని నిర్ణయించారు. తీరా మార్కెట్లోకి రిలీజ్ చేశాక పూర్తిగా నష్టాల ఎదురయ్యాయి. దీంతో ప్రతి కస్టమర్కి గ్రీన్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల వివరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వారిలో కూడా ఈ ప్రోడక్ట్పై నమ్మకం ఏర్పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.(చదవండి: ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..) -
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ
కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్ అండ్ ట్రామెల్ గైడ్ ఫ్లాట్ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్ ఎస్ప్రెసో అనేది డార్క్ రోస్ట్ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్లా ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్ టాప్ ఎస్ర్పెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్ కాఫీ స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ. చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్లో సర్వ్ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్ ఉంటుంది. సర్వ్ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే.. 1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా) 2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం) 3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్) 5. కాపుచినో (ఇటలీ) 6. టర్కిష్ కాఫీ (టర్కీయే) 7. రిస్ట్రెట్టో (ఇటలీ) 8. ఫ్రాప్పే (గ్రీస్) 9. ఐస్కాఫీ (జర్మనీ) 10. వియత్నామీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) (చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!) -
యువత కబుర్లు కాస్త సీరియస్ విషయాలుగా మారితే...!
కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్ గురించి విన్నావా? ఇన్స్టాగ్రామ్లో నా లేటెస్ట్ ఇమేజ్లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్ టాక్’ కంటే.. ‘బిగ్ టాక్’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్ టాక్’ ట్రెండ్ అంటున్నారు. ‘బిగ్ టాక్’ అనేది ‘టాప్ ట్రెండ్స్ ఫర్ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్ టాక్’కు అపోజిట్ ట్రెండ్. ‘స్మాల్ టాక్’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్ టాక్ ట్రెండ్ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్ టాపిక్స్పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్ ఒకే అన్నారు. అయితే బిగ్ టాక్ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి. ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్ టాక్’లో భాగంగా ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘నా కొలీగ్ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ టాక్లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్ కాఫీ కార్నర్లో బిగ్ టాక్ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్పూర్కు చెందిన నిఖిల్ మిత్ర. బిగ్ టాక్లో భాగంగా.. జాబ్ మార్కెట్పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్–టైమ్ జాబ్స్పై ‘చాట్జీపీటి’లాంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చూపించే ప్రభావం, మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ ఎలాంటి అడ్జెస్ట్మెంట్స్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సీనియర్లతో పోల్చితే జెన్ జెడ్ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్లపై కొలీగ్తో మాట్లాడాడు నిఖిల్ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘బిగ్ టాక్’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్ టాక్’ ట్రెండ్ సారాశం. పారదర్శక సంభాషణ స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్ ప్రొఫెషనల్స్కు కొలీగ్స్తో ఉండే స్నేహం ఆఫీస్ టైమింగ్స్ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్–సెన్సర్ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్ ప్రొఫెషనల్స్లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్ సర్వే ప్రకారం సెన్సిటివ్ టాపిక్స్ గురించి కొలీగ్స్తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇవి చదవండి: పర్పుల్ కలర్ ఎందుకు? -
సర్వర్ డ్రోన్ సుందరం
కాఫీ హోటల్ ఏదైనా సర్వర్ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్ హోటల్స్ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్ గారి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్తో మేనేజ్ చేయొచ్చని కోల్కతా రెస్టరెంట్ డిసైడ్ అయ్యింది. వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్కతా సాల్ట్లేక్ సిటీ ఏరియాలోని ‘కోల్కతా 64’ అనే రెస్టరెంట్ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్ సుందరం గారే కాఫీని అందిస్తారు. ఈ వీడియో ఇన్స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు. కె.బాలచందర్ తీసిన ‘సర్వర్ సుందరం’లో నగేశ్ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ టిఫిన్ సెంటర్ నేపథ్యంలో ఓనర్ కమ్ సర్వర్గా హీరో చేసే స్ట్రగుల్ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్ ఏజ్లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు. -
వచ్చే ఐదేళ్లలో ఐదువేల స్టోర్లు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకానమీగా ఇండియా ఎదుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా చాలాదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. దేశీయ వినియోదారులను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో విదేశీ కంపెనీలు స్టోర్లు ఓపెన్ చేయడానికి సుమారు 160 బ్రాండ్లు లోకల్ సంస్థలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్ పార్టనర్లను వెతకడంలో సాయపడే ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. విదేశీ కంపెనీలు వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఫలితంగా దాదాపు రూ.2078 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటున్న కంపెనీల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ ఛైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్, కాఫీ చెయిన్స్ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3.. స్లీప్మోడ్లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్ ఫ్రాంచైజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్లాండ్కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ అమెజాన్, యూఎస్ కంపెనీ పీట్స్ కాఫీ వంటి కంపెనీలు ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో స్టార్బక్స్ కూడా తన విస్తరణను వేగవంతం చేసింది. -
అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం..!
ఎన్నో రకాల ఖరీదైన కాఫీల గురించి విని ఉంటారు. కానీ ఇలాంటి కాఫీని చూసి ఉండరు, విని ఉండరు. అవును దీన్ని ఎంత వెరైటీగా సర్వ్ చేస్తారంటే..అంతకుముంచి దాన్ని సిప్ చేయడం ఓ సవాలు. ఇదేంటి? అంత ఖర్చుపెట్టుకుని తింటే..మళ్లీ ఇదేం తిరకాసు అనుకుంటున్నారా!. అయితే ఆ కాఫీ కహానీ ఏంటో చూసేద్దాం!. కోల్డ్ కాఫీ, డార్క్ కాఫీ అంటూ మార్కెట్లో పలు రకాల కాఫీకేఫ్లు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన కాఫీలు వందకు మించి ఖరీదు ఉండదు. మహా అయితే అది ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయితే తప్ప కళ్లుబైర్లు కమ్మేలా అంతంత రేంజ్ ధరలు ఉండవు. అలాంటిది ఈ కాఫీ ధరలోనే కాదు దీన్ని సర్వ్ చేసే విధానం కూడా భలే విచిత్రంగా ఉంది. ఆ కాఫీని నేరుగా ఐస్క్రీం కోన్లో పోసి సర్వ్ చేస్తారు. పైగా ఓ అందమైన కళాకృతులతో ఈ కాఫీని అందిస్తారు ఫెన్స్టర్ అనే కేఫ్లో. ఈ కేఫ్ ఆస్ట్రియాలోని వియాన్నలో ఉంది. దీని ధర మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 865/-. ఆ ఐస్క్రీం కోన్ కూడా నోరూరించేలా చాక్లెట్ లేయర్డ్ కోన్. దీనిలో మంచి రుచికరమైన కాఫీని అది కూడా ఓ మంచికళాకృతిలో సర్వ్ చేస్తారు. అయితే ఆ కాఫీ తాగడం ముగిసేలోపు ఆ కోన్ తినకుండా కంట్రోల్ చేసుకుంటూ తాగాలి ఓ పక్కన కోన్ నానకూడదు. లేదంటే అంత ఖర్చు చేసిన కాఫీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా!. ఐడియా అదుర్స్ కదా!. అంతేకాదండోయ్ ఆ కాఫీ యజమానికి ఏడాదికి ఈ కాఫీకి సంబంధించి సుమారు ఒక లక్షకు పైనే ఆర్డర్లు వస్తాయట. అక్కడ ఈ పానీయాన్ని చాలామంది ఇష్టంగా తాగుతుంటారని సదరు కాఫీ యజమాని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Fenster Cafe (@fenstercafe) (చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!) -
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్, పొద్దున్నే ఇది తాగుతుందట
కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్లా తాగేస్తుంటారు. అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్లో నెయ్యి కాఫీ ముందుంటుంది. నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో తమ డే రొటీన్లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ రెసిపి నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే... ►ముందుగా గ్లాస్లో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్కి పైగా కాఫీ పౌడర్, కొలాజిన్ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే ► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by jhaji kitchen (@jhajikitchen13) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
World Coffee Portal: కాఫీకి చైనా జై
తేనీరు... ప్రపంచంలో ఈ పానీయం గురించి తెలియనివారు ఉండరు. తేనీరు డ్రాగన్ దేశం చైనాలో పుట్టిందన్న వాదన కూడా ఉంది. ఈ ఉష్ణోదకం సేవించడంలో చైనీయులు ముందంజలో ఉంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చైనా ప్రజలు ఇప్పుడు కాఫీపై మక్కువ పెంచుకుంటున్నారు. సాక్షాత్తూ ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. బ్రాండెడ్ కాఫీ షాప్ మార్కెట్ విషయంలో అమెరికాను చైనా మించిపోయిందని ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ వెల్లడించింది. అమెరికాలో కంటే చైనాలోనే అత్యధిక కాఫీ ఔట్లెట్లు ఉన్నాయని తెలియజేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనాలో కాఫీ ప్రేమికుల పెరిగిపోతోందని, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే కాఫీ ఔట్లెట్ల సంఖ్య 58 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసుతం చైనాలో 49,691 బ్రాండెడ్ కాఫీ దుకాణాలు ఉన్నాయని వివరించింది. ► ప్రఖ్యాత స్టార్బక్స్ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ దుకాణాలు తెరిచింది. చైనాలో రూ.1,660 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్బక్స్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనాయేనని స్టార్బక్స్ స్పష్టం చేసింది. ► చైనాలో కాఫీలను విక్రయించడంలో స్టార్టప్ కంపెనీ ‘లకిన్ కాఫీ’దే పైచేయి. ఈ సంస్థకు దేశంలో 13,000కుపైగా ఔట్లెట్లు ఉన్నాయి. ► సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియులను ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది వారానికోసారి హాట్ కాఫీ తాగుతామని చెప్పారు. వారానికి ఒక్కసారైనా ఐస్డ్ కాఫీ తీసుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ► ప్రతివారం కాఫీ షాప్నకు వెళ్తాం లేదా ఆర్డర్ చేసి తెప్పించుకుంటామని 90 శాతం మంది వెల్లడించారు. ► చైనాలో ఇటీవలికాలంలో ఆర్థిక ప్రగతి కొంత నెమ్మదించింది. అయినప్పటికీ ప్రపంచ కాఫీ పరిశ్రమగా చైనా ఎదుగుతుండడం విశేషం. ► చైనాలో తమ కంపెనీ ప్రస్థానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ చెప్పారు. 2025 నాటికి చైనాలో 9,000 కాఫీ దుకాణాలు ప్రారంభించాలని స్టార్బక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
చాయ్ బిజినెస్కు ఫుల్ డిమాండ్.. ఏమి'టీ'క్రేజ్ అనుకుంటున్నారా?
ఒకప్పుడు టీ తాగడమనేది చాలా చిన్న విషయం. ఏ చిన్న కొట్టు దగ్గరికో వెళ్లి.. అర్జెంటుగా టీ తాగి వెంటనే కప్పు అక్కడ పెట్టి వచ్చిన దారిన వెళ్లిపోయేవారు. అయితే, కాలం మారింది. పద్ధతులూ మారాయి. అన్నింటా ఎం‘జాయ్’ కోరుకుంటున్న జనం టీ సేవనమూ అదే రీతిలో ఉండాలని భావిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా టీ కొట్లూ మారిపోయాయి. ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో ఒకప్పుడు టీ తాగాలంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతకాల్సిన పరిస్థితి. కానీ, నేడు అలా కాదు. ప్రతి ఏరియాలోనూ టీ కేఫ్లు ఏర్పాటయ్యాయి. అదీ విశాల ప్రాంగణాల్లో. శివారు ప్రాంతాల్లో అయితే ఆధునిక హంగులతో పెద్దపెద్ద కేఫ్లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. తీరిగ్గా కూర్చొని..అలా కబుర్లు చెప్పుకుంటూ టీ/కాఫీ తాగేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి వద్ద రద్దీ ఎక్కువగా కని్పస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు సైతం ఖాళీ సమయం దొరికితే చాలు కేఫ్ల బాట పడుతున్నారు. కొన్ని కేఫ్ల వద్ద కార్లు, బైకుల రద్దీని చూస్తే ఏమి‘టీ’ మార్పు అని ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం వరల్డ్కప్ క్రికెట్ సీజన్ నడుస్తుండడంతో కేఫ్లు మరింత రద్దీగా మారాయి. ఒక్క అనంతపురం నగరంలోనే కాకుండా..ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం, కదిరి తదితర పట్టణ ప్రాంతాలు, చివరకు మండల కేంద్రాల్లో సైతం టీ కేఫ్ల సంస్కృతి విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీస్టాళ్లు, కేఫ్లు కలిపి ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. అభిరుచికి అనుగుణంగా.. ఒకప్పుడు టీ, కాఫీ అంటే ఆయా పొడులతో చేసేవే ఉండేవి. కానీ, నేడు వాటిలోనూ వివిధ రకాలు లభిస్తున్నాయి. సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, ఇరానీ ఛాయ్, పెప్పర్మెంట్ టీ, మసాలా టీ, లెమన్ టీ, లావెండర్ టీ.. ఇలా పలు రకాలు విభిన్న రుచుల్లో లభ్యమవుతున్నాయి. టీ మాత్రమే కాకుండా వివిధ రకాల కాఫీలు, రాగిమాల్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటున్నాయి. జనాన్ని ఆకర్షించేందుకు ఆయా దుకాణదారులు కొత్తదారులు అన్వేíÙస్తున్నారు. ఫ్రీ వైఫై అంటూ యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకట్టుకునేలా కుర్చీలు ఉంచుతున్నారు. టీ/కాఫీ అందించే కప్పులూ విభిన్నంగా ఉంటున్నాయి. బ్రాండ్లూ వచ్చేశాయి! టీ కేఫ్లకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు వాటినీ ‘బ్రాండ్’లుగా మార్చేస్తున్నారు. ‘ప్రాంచైజీలు’ ఇస్తూ చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. వారు నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఔట్లెట్ డిజైన్ చేయించడంతో పాటు వివిధ రకాల టీలు, కాఫీలు తయారుచేయడానికి వీలుగా మెటీరియల్ సరఫరా చేస్తున్నారు. వాటి తయారీలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ కేఫ్లు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ‘ఉపాధి’ మార్గం చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా టీ కేఫ్లను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి వ్యయం, మంచి మాస్టర్లు దొరికితే నిర్వహణ సులువు కావడం, ఆదాయం కూడా తగినంతగా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ యువత ఎక్కువగా ఉంటున్నారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం కోసం టీ కేఫ్లు నిర్వహించే వారూ ఉన్నారు. ‘చర్చా’వేదికలు కేఫ్లు కేవలం పిచ్చాపాటి కబుర్లతో టీ, కాఫీ సేవనానికే పరిమితం కాలేదు. ‘చర్చా’వేదికలుగానూ మారాయి. ఇక్కడ రాజకీయ చర్చలు వేడీవేడిగా సాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడుస్తుంటాయి. ఉద్యోగ సంబంధ కార్యకలాపాలూ జరుగుతుంటాయి. పెళ్లి సంబంధాలూ కుదిరిపోతుంటాయి. ఇలా ఒకటేమిటి అనేక వ్యవహారాలకు టీ కేఫ్లు అడ్డాగా మారాయి. టీ కేఫే జీవనాధారం ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ టీ కేఫ్లో వర్కరుగా పనిచేసేవాణ్ని. అదే కేఫ్నకు ఓనర్గా ఎదిగా. ఇది నా కుటుంబానికి జీవనాధారంగా మారింది. పలు రకాల టీ తయారు చేస్తున్నా. ఆశించిన స్థాయిలో వ్యాపారం అవుతోంది. ఉపాధికి ఢోకా లేదు. నాన్న కూడా నాకు సహాయంగా ఉంటున్నారు. – ధనుంజయ, టీ కేఫ్ నిర్వాహకుడు, రాయదుర్గం స్నేహం బలపడే వేదిక టీ కేఫ్లు స్నేహం బలపడే వేదికలనడంలో అతిశయోక్తి లేదు. కాలేజీకి బంక్ కొట్టినా.. లేదా తోటి స్నేహితులందరం కలుసుకునేందుకు అడ్డాగా టీ కేఫ్లే ఉంటున్నాయన్నది వాస్తవం. ఇక్కడే కొత్త స్నేహాలు కూడా చిగురిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీరిక సమయాల్లో కేఫ్లలో కాలక్షేపం చేస్తూ ప్రపంచం గురించి చర్చించుకుంటుంటారు. – కార్తీక్, డిగ్రీ విద్యారి్థ, తాడిపత్రి ఆదరణ పెరుగుతోంది ప్రతి విషయాన్ని చర్చించుకోవడంతో పాటు ప్రపంచంలోని విషయాలన్నింటిపై మాట్లాడుకునేందుకు గతంలో రచ్చబండలు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరి నుంచి పదుల సంఖ్యలో కూడుకుని మాట్లాడేందుకు వేదికగా టీ కేఫ్లు మారాయి. ఫలితంగా వీటికి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాపారంపై చాలా మంది యువత సైతం ఆసక్తి చూపుతున్నారు. – రవి, టీ మాస్టర్, తాడిపత్రి మిత్రులతో మాట్లాడే అవకాశం టీ తాగడానికి బాగా అలవాటు పడ్డాం. గతంతో పోలి్చతే ఇప్పుడు నగరంలో చాలా టీ స్టాల్స్, కేఫ్లు వెలిశాయి. మిత్రులతో కలసి ఛాయ్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు కేఫ్లు వేదికగా మారాయి. – సూర్యనారాయణ, రెవెన్యూ కాలనీ, అనంతపురం -
‘డౌనూరు’లో కాఫీ క్యూరింగ్ కేంద్రం
కొయ్యూరు: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్ యూనిట్కు శుక్రవారం వైఎఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజన్నదొర శంకుస్థాపనచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథులకు ప్రధాని మోదీ అరకు కాఫీని బహూకరించారని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లో ప్రస్తుతమున్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల నుంచి పసుపును కూడా కొనుగోలు చేయాలని జీసీసీ ఎండీ సురేష్కుమార్ను ఆదేశించారు. గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కాఫీ రైతులకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఐటీడీఏ పీవో అభిషేక్ పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు
‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్షాప్లు, స్టార్టప్ సమ్మిట్లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్కు బైడెన్ ఎలా చేరారు? -
అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు వేడివేడి కాఫీని ఎలా తాగుతారో చూపించారు. వీడియోలో క్రిస్టోఫోరెట్టి ఒక ప్యాకెట్లోని కాఫీని ఒకచిన్న బాటిల్లో పోయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. అయితే గురుత్వాకర్షణలేమి కారణంగా కాఫీ బయటకు రాదు. ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా రూపొందించిన ‘స్పేస్ కప్’ను బయటకు తీసి, అందులో కాఫీ పోస్తారు. దీంతో ఆమె హాయిగా కాఫీ తాగగలుగుతారు. 2,85,000కు మించిన వీక్షణలు, 2 వేలకు పైగా లైక్లను అందుకున్న ఈ వీడియో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను తెలియజేస్తుంది. ‘స్పేస్ కప్’ వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో ద్రవపదార్థాలను తాగేందుకు రూపొందించారు. స్పేస్ కప్ అనేది ద్రవాన్ని నిష్క్రియాత్మకంగా కప్పు పైభాగానికి చేరవేస్తుంది. దీని రూపకల్పనకు పరిశోధకులు ఉపరితల ఉద్రిక్తత, చెమ్మగిల్లే పరిస్థితులు,కప్పు నిర్దిష్ట జ్యామితి మొదలైనవాటిని పరిశీలిస్తారు. ప్రక్రియను చూసేందుకు కప్పును పారదర్శకంగా రూపొందిస్తారు. ఇది కూడా చదవండి: చైనా ‘జియాన్-6’తో భారత్పై నిఘా పెట్టిందా? How do you like your coffee?☕️ Our astronaut @AstroSamantha demonstrates how she has her morning coffee in space! #InternationalCoffeeDay pic.twitter.com/UKA1Hy0EWW — ESA (@esa) October 1, 2023 -
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!
ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) భాషే రమ్యం , సేవే గమ్యం, తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో, డల్లాస్ లో అసంఖ్యాకంగా పెరుగుతున్న తెలుగు వారి సంరక్షణ నిమిత్తం, ఇటీవల పెరుగుతున్న నేరాలు, దోపిడీలను దృష్టిలో ఉంచుకొని కాఫీ విత్ ఎ కాప్ (Coffee with a Cop) అనే కార్యక్రమాన్ని నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ఫ్రిస్కో మోనార్చ్ వ్యూ పార్క్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో పోలీస్ శాఖ నుండి విచ్ఛేసిన ఆఫీసర్ గిబ్సన్ మరియు డిటెక్టివ్ చావెజ్ ముఖ్యంగా ప్రజలు దొంగతనాలు, దోపిడీల బారిన పడకుండా వహించాల్సిన జాగ్రత్తలు , ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లను వివరించారు. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, చెట్లను క్రమ పద్ధతిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను, లైటింగ్ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియచేశారు. పండుగలు, సెలవలు వంటి సందర్భాలలో విలువైన నగలు, ఇతర వస్తువులను భద్రపరచటంలోనూ, వాటిని ధరించి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా, విద్యార్థులు స్కూల్స్ లో కంప్యూటర్ ఉపయోగించటంలోను, సైబర్ భద్రత విషయంలోను, బుల్లియింగ్ విషయంలోను మరియు ఇతర అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు. అంతేకాక, అనుమానిత వ్యక్తులను గుర్తించినపుడు దూరం నుండే వారి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించి వెంటనే పోలీసులకు అందివ్వాలని సూచించారు. అలాగే ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న వివిధ కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా హాజరై, చివరలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పోలీస్ ఆఫీసర్ ల నుండి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను అందిస్తున్నందుకు అక్కడకు వచ్చిన అందరూ నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రశంసించారు. నాట్స్ డల్లాస్ కార్యవర్గ సభ్యులు చాప్టర్ కో అర్డినెటర్స్ రవి తాండ్ర, సత్య శ్రీరామనేని ఇతర సభ్యులు శ్రీధర్ న్యాలమాడుగుల, రవి తుపురాని, పార్థ బొత్స, శివ నాగిరెడ్డి, రవీంద్ర చుండూరు, గౌతమ్ కాసిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔనాట్స్ అధ్యక్షులు బాపు నూతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల ఈ కార్యక్రమంలో పాల్గొని, మన కమ్యూనిటీకి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి కూడా ఈ సందర్భంగా డల్లాస్ చాప్టర్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నాక్స్ మరియు టీ అందించిన స్వాగత్ బిర్యానీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే, నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్ , ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ముందు, ముందు మరిన్ని విలక్షణమైన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియచేశారు. (చదవండి: కువైట్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!) -
అరకు కాఫీ రుచి చూసిన జి 20 సమ్మిట్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించడం గమనార్హం. ఈ గ్లోబల్ ఈవెంట్లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శన ద్వారా ప్రీమియం కాఫీ బ్రాండ్గా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సాక్షికి తెలిపారు. జి20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. జీసీసీకి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శోభా స్వాతిరాణి, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో అరకు కాఫీని సైతం అందజేయడం విశేషం. -
రోజూ కాఫీ తాగకుండా ఉండలేరా? అయితే ఇది మీకు బెస్ట్ ఛాయిస్
యూనివర్సల్ డిజైన్తో, స్టెయిన్ లెస్ స్టీల్ ఇంటీరియర్ థర్మల్ ట్రావెల్ మగ్తో ఆకట్టుకుంటున్న ఈ కాఫీ మేకర్.. 60 సెకన్లలోపే తాజా కాఫీని తయారు చేస్తుంది. ప్రయాణ సమయాల్లో, ఉదయం లేవగానే.. బిజీ లైఫ్ కోసం విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ స్టైలిష్, కాంపాక్ట్ 600 వాట్స్ కాఫీ మేకర్తో వేడిగా, తాజాగా తయారుచేసిన కాఫీని ఆస్వాదించొచ్చు. వన్–టచ్ ఆప్షన్తో కాఫీ కేఫ్ల ముందు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన కష్టం ఉండదు. ఇది చాలా తక్కువ స్థలం తీసుకుంటుంది. మన్నికైన మెటీరియల్తో రూపొందిన ఈ మేకర్ని.. వినియోగించడం చాలా సులభం. కాఫీ క్యాప్సూల్స్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన మినీ బాస్కెట్తో పాటు.. కాఫీ పౌడర్ వేసుకోవడానికి మినీ ఫిల్టర్ ఉంటుంది. దాంతో దీన్ని యూజ్ చేయడం చాలా తేలిక. ధర 21 డాలర్లు (రూ.1,737) -
అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!
కాఫీ గుమగుమలు ముక్కు పుటలకు తాకగానే అబ్బా అనేస్తాం. పొద్దున్నే ఓ కప్పు కాఫీ పొట్టలో పడితే గానీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించదు. అలాంటి కాఫీ ప్రియులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఉందని తెలుసా!. ఐతే దాన్ని ఎలా తయారచేస్తారో వింటే మాత్రం..ఛీ యాక్ అంటారు. కానీ ఆ కాఫీ చాలా రుచిగా ఉండటానికి కారణం వాటివల్లనేట. ఆ కాఫీ తయారయ్యే విధానం తెలిస్తే మాత్రం..అమ్మబాబోయ్! అంటూ జోలికి వెళ్లే సాహసం చేయలేం. విచిత్రం ఏంటంటే ఆ కాఫీకి ఉన్న డిమాండ్ చూస్తే వామ్మో! అంటారు. కోపి లువాక్ లేదా సివెట్ కాఫీ ప్రంపచంలోనే అత్యంత ఖరిదైన కాఫీగా ప్రసిద్ధిచెందింది. దీన్ని ఎలా తయారు చేస్తారో వింటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం నిశబ్దంగా ఉండిపోతాం. దీని ధర ట్యాగ్ వెనుకు ఉన్న రహస్యం తెలుసుకుంటే షాకవ్వడం గ్యారంటీ. ఎలా తయారు చేస్తారంటే.. కోపి లువాక్ అనే కాఫీ ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి నుంచి ఉద్భవించింది. ఇది కాఫీ చెర్రీస్ అనే పండ్ల నుంచి తయారవ్వుతుంది. అయితే ఆ పండ్లను సేకరించి నేరుగా తయారు చేసేయ్యరు. ఆ కాఫీ చెర్రీలను పునుగు పిల్లి(ఆంగ్లంలో (సివెట్) అనే పిల్లి జాతి క్షీరదం తింటుందట. ఆ తర్వాత వాటి గింజలను విసర్జిస్తుతుంది. కాఫీ ఉత్పత్తిదారులు అది విసర్జించిన గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారు. నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని ఈ పునుగు పిల్లులు తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్లు బీన్స్ నేచర్ని మారుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే వాటి చేదు గుణాన్ని తగ్గించి వాటిని రుచిగా మారుస్తాయి. ఈ సహజ కిణ్వనప్రక్రియే కోలి లువాక్ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. సేకరించిన పునుగు పిల్లి విసర్జకాలు ఎందుకింత ఖరీదంటే.. ఈ కాఫీ ఎందుకింత ఖరీదైందిగా పేరుగాంచిందంటే ఈ కాఫీ బీన్స్ సంప్రదాయంగా పండించడానికి బుదులుగా ఈ సివెట్(పునుగు పిల్లుల) రెట్లను సేకరించడం ద్వారానే తయారవ్వుతుంది కాబట్టి. ఉత్పత్తిదారులకు ఇది అధిక ఖర్చులకు దోహదం చేసే అంశం. ఇక సివెట్ తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలనే విసర్జిస్తాయి. దీంతో పరిమిత స్థాయిలోనే సరఫరా ఉండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జక పదార్థాలతో తయారవుతుందనే దృష్ట్యా ఈ కాఫీపై పలు విమర్శలు కూడాఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ తాగాలనుకునేవారికి ఈ కాఫీ ఒక స్టేటస్ ఆఫ్ సింబల్గా ఉంటుంది. ఈ కాపీ తయారీ కోసమనే ఈ పునుగు పిల్లలను బంధిస్తున్నారని జంతుప్రేమికుల నుంచి విమర్మలు కూడా ఉన్నాయి. ఈ కోపీ లువాక్ కాఫీ ఖరీదు, విలక్షణమైన తయారీ విధానం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుందట. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
కాఫీ షాప్లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!
ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్పూర్కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్దేవ్సింగ్ రైతు. అతని తల్లి హర్జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్లోని ఒక కాఫీషాప్లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్లోని బిల్లింగ్ సెషన్లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్లో వివాహం చేసుకున్నారు. సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే.. -
Coffee : షేక్పేటలో కాఫీ కొత్త రుచులు
బెంగెట్, బెర్గెండాల్, బెర్నార్డినా, బ్లూమౌంటెన్, బోర్బన్.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కాఫీల్లో. కతుర్రా, ఛారియర్, హరార్, ఫ్రెంచ్ మిషన్ ఇలా ఒక్కో దేశంలో కాఫీది ఒక్కో రుచి. కోన, జావా అంటూ దీవుల్లో, మోచా, పాకాస్ అంటూ లాటిన్ అమెరికాల్లో, సగడ, శాంటోస్ పేరిట దక్షిణాది దేశాల్లో.. ఇలా కాఫీ అంటే ప్రాణం ఇచ్చేవారు లోకమంతా కనిపిస్తారు. కాఫీ రుచులు, ఐస్ క్రీం టేస్టులు అందించే లా రొసెట్టా, సౌత్ పోల్ షాపులను షేక్పేట, ఓయూ కాలనీలో ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నాణ్యత, ప్రామాణికాలే వ్యాపారాభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగి రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించగలిగితే వ్యాపారం అంచలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని సూచించారు. కల్తీలేని ఆహార పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్న చోటుకు వినియోగదారులు వెతుక్కుంటూ రావడానికి ఇష్టపడతారన్నారు. పిల్లలకు యువతకు ఇష్టకరమైన అన్ని ఐటమ్స్ ఉంచగలిగితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నేపథ్య గాయకుడు, సంభాషణల రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్యామ, శ్రీనివాసరావు, ప్రశాంతి, శ్యామ్ సుందర్, శిరీష, రవికాంత్ , శ్రీకాంత్ మరియు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి వాళ్లకు ఈ కాఫీ మేకర్ భలే ఉపయోగపడుతుంది..
ప్రతి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు, కుకర్లలానే.. కాఫీ, టీ మేకర్స్ కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. ఇప్పుడంతా కాఫీ అయినా టీ అయినా.. స్విచ్ నొక్కి నచ్చిన ఫ్లేవర్ అందిపుచ్చుకోవడమే కదా! అలాంటి వారికి ఈ మెషిన్ భలే ఉపయోగడుతుంది. లాటే, కాపుచినో, కోల్డ్ వంటి ఆప్షనల్ బటన్స్ డివైస్కి కుడివైపు ఉంటాయి. ఎడమవైపు మినీ వాటర్ ట్యాంకర్ ఉంటుంది.ఇందులో ఆరుగురికి, ఎనిమిది మందికి, పది మందికి లేదా పన్నెండు మందికి ఒకేసారి కాఫీ లేదా టీని సిద్ధం చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ రీయూజబుల్ కాఫీ ఫిల్టర్ లాంటిది. చల్లని లేదా వేడి పాల నురుగుని తయారుచేస్తుంది. దీన్ని శుభ్రం చేయడమూ తేలికే. కప్పులు, మగ్గులు.. డివైస్ ముందువైపు పెట్టుకుంటే, అందులోకే కాఫీ లేదా టీ వచ్చి చేరుతుంది. బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు ఈ కాఫీ మేకర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ మేకర్ ధర 229 డాలర్లు(రూ.18,844) -
ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే
ఎక్కువ మంది బీర్లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్లో క్రిస్పీగా సైడ్ డిష్లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్స్టెంట్ బీర్ పౌడర్లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్లో దర్జాగా ఐస్క్యూబ్లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ. ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్స్టెంట్ కాఫీ లేదా మిల్క్షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట. దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది. -
ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!
ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్ బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. -
అదరగొడుతున్న తెలుగు వారి కాఫీ కంపెనీ
-
ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి..
మీకు పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటుందా? అయితే ఈ స్టోరీ మీకోసమే.. మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ లేనిదే రోజు మొదలవదు. టీ తాగకపోతే ఏదో అయిపోయింది అన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిక్ సమతుల్యత దెబ్బతింటుంది. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగడం వల్ల హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం టీ లేదా కాఫీ తీసుకున్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుందని ఇది నోట్లో యాసిడ్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. మరి టీ కాఫీలు ఏ సమయంలో తీసుకోవాలి? ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ► ఉదయాన్నే టీ తాగితే రిఫ్రెష్గా ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ దీని వల్ల లాభాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ► పొద్దున్నే పరిగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయట. ► కొంతమంది పళ్లు తోముకోకుండా పొద్దున్నే బెడ్ కాఫీ, టీలు తాగుతారు. ఇలా చేయడం వల్ల నోట్లోని చెడు బాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుందని, అతిగా తాగడం వల్ల పళ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్ మోతాదు పెరిగి మానసిక ఆందోళన, ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు టీలో దాదాపు 11 నుండి 61 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుందట. ► ఎక్కువగా టీ, కాఫీలు తాగడం వల్ల నీళ్లు తాగాలనిపించదు.ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీ హైడ్రేైషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ► చాలామంది రాత్రి, పగలు తేడా లేకుండా టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు టీ తాగడం వల్ల నిద్రలేమితో బాధపడతారని నిపుణులు సూచిస్తున్నారు. ఏ సమయంలో టీ,కాఫీలు తాగాలి? ♦ సాధారణంగా వ్యాయామం చేసే ముందు కాఫీ తాగడం మంచిది. ఇది ఇన్స్టంట్గా ఎనర్జీతో పాటు అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ♦ పొద్దున్నే టీ తాగాలనుకునేవారు పరిగడుపున కాకుండా, టిఫిన్ తిన్న గంట తర్వాత టీ తాగడం మంచిదట. ఏదైనా మితంగా తీసుకుంటే సమస్య లేదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుకప్పులు టీ, కాఫీలు తాగొచ్చని, అంతకుమించి మాత్రం తీసుకోవద్దని చెబుతున్నారు. -
తెలుగు కాఫీ కంపెనీ కొత్త రికార్డు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్లో ఒక్కొక్క ప్లాంటు ఉంది. ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్లో భారత్లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు. కాఫీ రుచులు 1,000కిపైగా.. సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు. ఏపీలో మరో ప్లాంటు.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!
ప్రముఖ డ్రైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న టాటా గ్రూప్ను ఢీకొట్టనున్నారా? టాటా గ్రూప్ అనుబంధ సంస్థ స్టార్బక్స్కు పోటీగా తన వ్యాపార తంత్రాన్ని ప్రదర్శించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు గత పదేళ్లుగా భారత్ కాఫీ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ జాయింట్ వెంచర్ స్టార్బక్స్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2012లో టాటా గ్రూప్ స్టార్బక్స్ను మార్కెట్కు పరిచయం చేసింది. కేవలం పదేళ్లలో ఆ సంస్థ కాఫీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. వెరసీ జాయింట్ వెంచర్ను ప్రారంభించిన 10ఏళ్ల తర్వాత వార్షికంగా రూ.1000 కోట్లకు అమ్మకాల్ని నమోదు చేసింది. ఇదే స్టార్బక్స్తో నేరుగా తలపడేందుకు రిలయన్స్ రీటైల్ గత కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేసింది. చివరికి రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ తన వ్యాపార వ్యూహాలతో యూకేలో కాఫీ, శాండ్ విచ్ విభాగంలో ఐకానిక్ బ్రాండ్ ‘ప్రెట్ ఎ మ్యాంగర్’తో చేతులు కలిపారు. ఇటీవల, ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రీటైల్ జాయింట్ వెంచర్ ప్రెట్ ఎ మ్యాంగర్ కార్యకలాపాల్ని భారత్లో ప్రారంభించింది. దిగ్గజ బ్రిటిష్ బ్రాండ్ను ముంబైలోని బాంద్రా - కుర్లా క్లాంప్లెక్స్ (BKC)లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, బెంగళూరుతో పాటు మొత్తం 12 నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇషా అంబానీ నేతృత్వంలోని అనుబంధ సంస్థలు ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని నిరూపించేలా..మార్కెట్లోని టీ, కాఫీలకు యువతలో పెరిగిపోతున్న అభిరుచికి అనుగుణంగా ప్రెట్ ఎ మ్యాంగర్ తన కాఫీ ఘుమఘుమలు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే తమ భాగస్వామ్యంతో భారత్లో వ్యాపారాల్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తూ రిలయన్స్ ఇటీవల పలు అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ప్రెట్ ఎ మ్యాంగర్ ప్రపంచవ్యాప్తంగా 550 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ ఆర్గానిక్ కాఫీ, కుకీలు, సలాడ్, శాండ్విచ్ల అమ్మకాలు ప్రసిద్ధి చెందింది. టాటా స్టార్బక్స్ భారత్లోని 43 నగరాల్లో 341 స్టోర్లను నడుపుతుంది.అయితే, దేశీయ స్టార్టప్ల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు బిజినెస్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుచుకోనుంది. చిన్న పట్టణాలలో సైతం విస్తరించేలా స్టార్బక్స్ చిన్న, చౌకైన పానీయాలతో పిల్లలతో సహా భారతీయులను ఆకర్షించడానికి తన వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ను ప్రారంభించింది. -
కాఫీ కప్పులోకి దూకేసిన కాజల్.. స్విమ్మింగ్ ఫూల్ అనుకుందేమో!
కాజల్ అగర్వాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి చిత్రంలో కనిపించనుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోన్న భామ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఈ భామ చేసిన ఓ వీడియో తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాజల్ మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకుంది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముందో తెలుసుకుందాం. (ఇది చదవండి: సల్మాన్ కోసం వెళ్తే.. కుక్కలా తరిమేశారు: 'దబంగ్' నటి) కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసిన వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవ్వాల్సిందే. ఓ కాఫీ కప్పు ముందు పెట్టి ఒక్కసారిగా అందులోకి దూకేసింది. ఇంకేముంది ఎంచక్కా స్విమ్మింగ్ ఫూల్లోగా మళ్లీ బయటకు కనిపించింది. ఇదేంటీ కాఫీ కప్పులో మనిషి దూకడమేంటీ? మళ్లీ బయటికి రావడమేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఈ వీడియో చూసేయండి. మొదటి నేను కూడా నమ్మలేదు. కానీ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా నమ్మకుండా ఉండలేరు. అలా ఉంది మరీ కాజల్ అగర్వాల్ క్రియేటీవిటీ. మరీ ఈ వీడియో ఎలా చేసిందో తెలియదు కానీ.. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం ఇదేలా సాధ్యమంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాజల్ తన ట్వీట్లో రాస్తూ.. 'దృఢ నిశ్చయం, ప్రేమతో కాఫీ కప్పులోకి ఈ రోజు దూకేస్తున్నా. ఎక్కువ కాఫీ, కాదు.. ఎక్కువ ప్రేమ.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!) Diving into this day with Conviction, Love and coffee...... loads of coffee , no, loads of love 🫶🏻😋☕ pic.twitter.com/xUCVc2wRvO — Kajal Aggarwal (@MsKajalAggarwal) June 19, 2023 -
ప్రయాణాల్లో కాఫీ తాగాలనుందా? ఈ మేకర్తో సులువుగా..
చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్లోకి చేరుతుంది. అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్లా మార్చుకుని బ్యాగ్లో వేసుకోవచ్చు. -
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్హౌస్గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
ఆర్గానిక్ బ్రాండ్తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి. ఫలించిన నాలుగేళ్ల కృషి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. మరో మైలురాయి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలురాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది. – శోభ స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ -
Parking Offer: రూ.60 కోసం సుదీర్ఘ పోరాటం!
వినియోగాదారుల హక్కుల ప్రాముఖ్యత, దాని కోసం నిలబడి పోరాడేలని చెప్పే అంశం దేశ రాజధాని ఢిల్లీలో తెరపైకి వచ్చింది. అదీకూడ ఒక చిన్న మొత్తం కోసం పోరాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినా.. మన హక్కులను గుర్తు చేయడమే గాక కొన్ని ఆఫర్లు మనల్నీ ఎలా నిలువు దోపిడి చేస్తున్నారో ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ ఘటన. వివరాల్లోకెళ్తే..కమల్ ఆనంద్ తన భార్యతో కలిసి సాకేత్లోని ఒక మాల్లో కోస్టా కాఫీ అవుట్లెట్కి వెళ్లారు. అవుట్లెట్ ఉద్యోగి వారికి ఒక ఆఫర్ ఇచ్చాడు. కాఫీ ఆర్డర్ చేస్తే పార్కింగ్ ఉచితం అని వారికి తెలియజేశాడు. దీంతో కమల్ రెండు కాఫీలు కొనుగోలు చేసి రూ.570 చెల్లించాడు. తదనంతరం అతను తన భార్యతో కలిసి పార్కింగ్ స్థలం నుంచి బయటకు రాగానే రూ. 60 చెల్లించమని పార్కింగ్ నిర్వాహకుడు అడిగాడు. అతను ఆఫర్ స్లిప్ను చూపించాడు. ఐతే అక్కడున్న వ్యక్తి ఆ ఆఫర్ గురించి ఎలాంటి సమాచారం లేదని పార్కింగ్కి డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఈ విషయమై కోస్టా కాఫీ నిర్వాహకులకు, మాల్ యజమానికి ఫిర్యాదు చేసినప్పటికీ..లాభం లేకుండా పోయింది. పైగా నిర్వాహకులు పార్కింగ్ డబ్బులు వసూలు చేశారు కూడా. దీంతో ఆనంద్ ఢిల్లీలోని వినయోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ సుమారు పదేళ్లు సాగింది. ఐతే విచారణ సమయంలో ఆనంద్ తన ఫిర్యాదుకు మద్దతుగా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించాడు. అయితే ఆనంద్ వాదనను ఎదుర్కోనేలా ప్రతివాది ఎటువంటి ఆధారాలను సమర్పించ లేకపోయాడు. దీంతో కోర్టు ఇది కేవలం రూ. 60కి సంబంధించినది కాదని వినియోగదారుల హక్కులకు వారు పొందాల్సి సౌకర్యాలకు సంబంధించిందని పేర్కొంది. కస్టమర్ను ఆఫర్తో ప్రలోభ పెట్టి ఆపై కస్టమర్ విపత్కర స్థితిలో చిక్కుకున్నప్పుడూ ఆ ఆఫర్ తిరస్కరించటం సర్వీస్లో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంత చిన్న మొత్తం అయినా వెనుకడుగు వేయక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డందుకు ఆనంద్ని కోర్టు ప్రశంసించింది. అంతేగాదు కోర్టు ఈ కేసులో నిందితులకు రూ.61,201 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కమల్కి చెల్లించాలని స్పష్టం చేసింది. (చదవండి: 'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు సెలవులు మంజూరు) -
గర్భిణులు కాఫీ తాగడం మంచిదేనా?
ఇటీవల కాలంలో తరచు వినవస్తున్న మాట ‘గర్భిణులు కాఫీ తాగకూడదు!’ అని. బహుశా అది వాట్సప్ లేదా సోషల్ మీడియాలో వ్యాపించిన సందేశాల వల్ల కావచ్చు. ఇంతకీ ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని తక్షణ శక్తిని అందించే ఉత్తేజపరిచేషధంగా భావిస్తారు. కాఫీలోని కెఫీన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసి΄ోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫీన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతకుమించి గర్భంపై కెఫీన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. మోతాదు మించక΄ోతే ముప్పు లేదు గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్ ్స అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా కప్పు (240 ఎం.ఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే గర్భిణులు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. -
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కడుతోందా? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? సాధారణంగా రక్తం మూడు విధాలుగా గడ్డ కడుతుంది. 1. సిరలలో... అది ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. కాలికి వాపు రావడంతో పాటు నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు చర్మం రంగు మారుతుంది. 2. ఊపిరితిత్తులలో కొన్ని సార్లు గడ్డ కడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాళ్ళలో నుంచి రక్తప్రవాహంలో సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఆయాసం, ఛాతీ నొప్పి ముఖ్య లక్షణాలు. 3. గుండె లో కూడా గడ్డ కడుతుంది. కొన్నిసార్లు ధమనుల ద్వారా మెదడుకు వెళ్లి పక్షవాతం రావచ్చు. D-dimer అనే రక్త పరీక్ష వలన సిరలలో ఉండే రక్త గడ్డ ను కొనుక్కో వచ్చు. గుండెలో ఉన్న రక్త గడ్డను Echocardiogramతో కనుక్కో వచ్చు. ఊపిరితిత్తుల రక్త గడ్డ ను ఛాతీ CT scanతో తెలుసుకోవచ్చు. రక్తం మన శరీరంలో చేసే కీలకమైన పనులేంటీ? 1. ఆక్సిజన్ను సరఫరాచేసేది రక్తమే మనం బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని తెలుసు. అయితే, ఆ ఆక్సిజన్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. శరీరమంతా వ్యాపిస్తుంది. మరి గాలి రూపంలో ఉండే ఆక్సిజన్ శరీరానికి ఎలా అందుతుందనేగా మీ అనుమానం? ఆ ఆక్సిజన్ను సరఫరా చేసేది వాహకం రక్తమే. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన పోషకాలు, హార్మోన్లకు సైతం సరఫరా చేస్తుంది. అయితే, మనం తినే ఆహారం, మన అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ప్రవాహానికి కూడా ఎలా ఆటంకాలు ఉండవు. 2. రోజూ వ్యాయామం చేయాలి వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్ చేయడానికి సమయం లేనట్లయితే.. ఇంట్లో యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే.. రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. 3. చక్కగా నిద్రపోండి నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రతీ రోజూ తప్పనిసరిగా కంటి నిండా నిద్రపోండి. 4. బీట్రూట్ జ్యూస్ తాగండి లేదా తినండి బీట్రూట్లో శరీరానికి మేలు చేసే ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఆ9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ఇ ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. బీట్రూట్ను ఆహారంగా గానీ, జ్యూస్గా గానీ తీసుకోవచ్చు. 5. నీళ్లు ఎక్కువగా తాగండి శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు (టాక్సిన్) ఉంటాయి. అవన్నీ బయటకు పోవాలంటే తప్పకుండా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే చాలు శరీరం టాక్సిన్లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 6. తులసి ఆకులు తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్-కె , ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి. 7. పసుపు తప్పనిసరి భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ను నాశనం చేస్తుంది. అందుకే, మీరు తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి. 8. ఆకుకూరలు ఎక్కువగా తినండి పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 9. నిమ్మరసం మంచిది కాలేయంలోని టాక్సిన్లను తొలగించాలంటే నిమ్మరసం తాగాల్సిందే. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. 10. ఉసిరి తినండి ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికులు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటో న్యూట్రియంట్లు, విటమిన్ ఈ, సీ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది. 11. అల్లం వెల్లులి మంచిది మన వంటకాల్లో అల్లం వెల్లులి ప్రాధాన్యం తెలిసిందే. ఇవి నోటికి రుచే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెల్లులిలో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లులి రక్తపోటును అదుపులోకి ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ C, B3, B6, మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 12. బ్లాక్ కాఫీ తాగండి రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్లు కూడా శరీరానికి అందుతాయి. 13. ఇవి కూడా మంచివే రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి. ఒమెగా 3 ఎక్కువగా ఉండే సోయాబీన్, చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ను తప్పకుండా తీసుకోండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: 37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే! Suman Kalyanpur Facts: సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు.. -
14 ఏళ్లప్పుడు పరిచయం అయ్యావ్.. థాంక్యూ మై డియర్, శ్రీజ పోస్ట్వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె పర్సనల్ లైఫ్లో విబేధాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ‘ ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. చివరకు ఆమె 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏదీ లేదన్నట్టుగా రాసుకొచ్చి అందరికి షాకిచ్చింది. తాజాగా తన కాఫీ అలవాటు గురించి శ్రీజ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావ్.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావ్.. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే.. నా 14 ఏళ్ల వయసులో నువ్వు(కాఫీ) పరిచయం అయ్యావ్. అప్పటి నుంచీ నాతోనే ఉంటున్నావ్.. థాంక్యూ మై డియర్ కాఫీ’ అంటూ తాను కాఫీ లవర్ని అని శ్రీజ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
‘ఇకాగో’..చాయ్ని చల్లారనివ్వదు
పని చేసుకుంటూ టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటే! పనిలో నిమగ్నమైపోయి కొద్ది నిమిషాలు పక్కనే ఉంచిన టీ లేదా కాఫీని పట్టించుకోకపోతే, అవి చల్లారిపోతాయి. చల్లారిన చాయ్ లేదా కాఫీ అంతగా రుచించవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఇకాగో హీట్ కోస్టర్’ ఉంటే, అలాంటి సమస్య ఉండదు. ఎంతసేపైనా కప్పులో పోసిన పానీయం వేడిగానే ఉంటుంది. ఇందులో విశేషం కప్పులో కాదు, దాని అడుగున ఉన్న స్మార్ట్ టేబుల్ టాప్ కోస్టర్లో ఉంది. చిన్న ట్రే సైజులో ఉండే దీనిని పనిచేసే చోట టేబుల్ మీద సులువుగా పెట్టేసుకోవచ్చు. దీని ప్లగ్ పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే చాలు. దీనిపైన పెట్టిన కప్పులోని టీ లేదా కాఫీ రెండు గంటల వరకు చల్లారిపోకుండా ఉంటాయి. దీంతో మనం తాగాలనుకునే పానీయం వేడిని గరిష్ఠంగా 175 డిగ్రీల ఫారెన్హీట్ (79.4 సెల్సియస్) వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు గంటల తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్లీ వేడి చేసుకోవాలనుకుంటే, తిరిగి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఇకాగో’కు చెందిన డిజైనర్లు దీనిని రూపొందించారు. -
Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి!
బనానా కాఫీ కేక్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! బనానా- కాఫీ కేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి) ►బ్రౌన్ సుగర్ – 1 కప్పు, ►నూనె – అర కప్పు ►మైదాపిండి – 1 కప్పు ►బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►పాలు – అర కప్పు, చాక్లెట్ చిప్స్ – 1 టేబుల్ స్పూన్ తయారీ: ►ముందుగా అరటిపండు ముక్కలు, నూనె, బ్రౌన్ సుగర్ మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవలి. ►ఇందులో కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్లా బాగా కలుపుకోవాలి. ►తర్వాత నచ్చిన షేప్లో ఉండే బేకింగ్ బౌల్ తీసుకుని.. దానిలోపల నూనె పూయాలి. ►ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకుని.. చాక్లెట్ చిప్స్ జల్లుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ►కాస్త చల్లారిన తర్వాత నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా తయారు చేసుకోండి! -
Health: వీళ్లు అస్సలు కాఫీ తాగకూడదు.. రోజూ మధ్యాహ్నం మజ్జిగ తాగితే!
డెయిలీ కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్–2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరు మాత్రం అస్సలు కాఫీ తాగకూడదు. వారు ఎవరు? కాఫీ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం. వీరు కాఫీ తాగకూడదు ►గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►ఒకవేళ తాగినా, 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ►అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. ►అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం. ►మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. ►కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి. మజ్జిగ వల్ల కలిగే ఈ ఆరోగ్య లాభాలు తెలుసా? ►రోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ దరి చేరదు. ►మజ్జిగ ప్రోబయోటిక్. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ►మజ్జిగలో చిటికడు జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణసమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీలు ఉండవు. ►మజ్జిగ లో ఉండే అనేక ప్రోటీన్లు, మినరల్స్ మనశరీరానికి రోజూ అవసరమైన అనేక విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయి. ►కాల్షియం లోపం ఉన్నవారు రోజూ మజ్జిగ తాగడం మంచిది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Health Tips: పరగడుపున ఇవి తింటే చాలా డేంజర్! జాగ్రత్త
మెరుగైన ఆరోగ్యం కావాలంటే.. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్థాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతారు. మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్యనిపుణుల ప్రకారం పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. ►అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం. వేయించిన చిరుతిళ్లు.. ►ఉదయం వేళల్లో మసాలా లేదా వేయించిన చిరుతిళ్లు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అతి వద్దు! ►అదే విధంగా పీచు పదార్థాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి. ఛాతీలో మంట.. ►కొంతమందికి బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల శరీరానికి తీవ్రనష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. పూర్తిగా ప్రమాదకరం ►పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్ బిజినెస్లోకి రిలయన్స్
సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చెయిన్ ప్రెటా మౌన్రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రెటా మౌన్రేకు దీర్ఘకాలిక మాస్టర్ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్లతో ప్రారంభించి, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆర్బీఎల్ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. ఆసియాలో రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్లెట్ను ప్రారంభించిన ప్రెటా మౌన్రేకు ఆర్బీఎల్తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు. కస్టమర్లకు ఫ్రెష్ ఫుడ్తోపాటు, 100% ఆర్గానిక్ కాఫీని అందిస్తామన్నారు. కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్ఫామ్గా ఉన్న ఆబీఎల్ గత 14 ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ తొలిసారిగా 1986లో లండన్లో ప్రారంభమైంది ప్రెటా మౌన్రే. యూకే, యూఎస్, హాంగ్కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ కాఫీ, శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్లను అందిస్తోంది ప్రెటా మౌన్రే -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
వర్క్ ఫ్రమ్ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన బ్రిటన్ ప్రధాని
కరోనా అవతరించినప్పటి నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులతోపాటు చిన్న సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్తా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే సదుపాయాన్నే కొనసాగిస్తున్నారు. అయితే పలు కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నా..వర్క్ ఫ్రమ్ హోంకు అలవాటు పడిన అధికశాతం మంది ఉద్యోగులు ఆఫీస్లకు వచ్చి పనిచేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం సంస్కృతిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల అటెన్షన్ మారిపోతుందని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చారు. ఇంటి దగ్గర ల్యాప్టాప్లో పనిచేసేటప్పుడు.. మధ్య మధ్యలో కాఫీ కోసమనో, టిఫిన్ కోసమనో లేచి వెళ్తుంటామని, తిరిగి ల్యాప్టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేమిటో గుర్తుకు రాదని అన్నారు. మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ తెలిపారు. చుట్టూ మనతోటి ఉద్యోగులు ఉండటం వల్ల ఉత్పాదకత ఎక్కువ వస్తుందని, మరింత ఉత్సాహంతో పాటు కొత్త కొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. చదవండి: ప్రపంచంలోనే అత్యధికం.. రెండున్నరేళ్లలో 10 లక్షల మరణాలు -
హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు!
Hot And Cool Traveling Refrigerator: ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రాంతాలకు వెళ్తున్నపుడు నాలుగు జతల బట్టలతో సహా ఆ నాలుగు రోజులకు సరిపడా ఫుడ్ కూడా వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్ అండ్ వార్మర్ను మీ లాగేజ్లో భాగం చేసుకోవాల్సిందే. దీన్ని బెడ్ రూమ్లో, ఆఫీస్ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్ కూడా ఉంటుంది. దాంతో ఎక్కడికైనా సులభంగా మోసుకుని వెళ్లొచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డివైజ్. దీని కూలింగ్ రేంజ్ 20 డిగ్రీల సెల్సియస్. హీటింగ్ రేంజ్ 60 డిగ్రీల సెల్సియస్. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది. ఇందులో కావాల్సిన టాబ్లెట్స్, బ్యూటీ కాస్మెటిక్స్ ఇలా అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు. పైగా ఇది స్టైలిష్ టెంపర్డ్ గ్లాస్ ప్యానెల్ కలిగి ఉండటంతో దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. అవసరాన్ని బట్టి ఇందులో బాస్కెట్స్ను అమర్చి, చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుని, చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో పెట్టుకునే ర్యాక్స్ లేదా బాస్కెట్స్ను తొలగించి.. పొడవాటి డ్రింక్ బాటిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. దీనికి రెండు పవర్ మోడ్స్ లభిస్తాయి. ఒకటి ఇంట్లో పవర్ సాకెట్కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్ చేసుకునేది. భలే ఉంది కదూ! ధర: 80 డాలర్లు (రూ.6,101) చదవండి: Ice Cream Maker: 10 నిమిషాల్లో ఐస్క్రీమ్ రెడీ.. ధర రూ.2,215! -
కాఫీ విత్ ఖతీక్!
సాక్షి, హైదరాబాద్: బాధితులు అంతా మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారు... ఒక్కో రూపాయి కూడగట్టుకుంటేనే తులం బంగారం చేకూరేది... స్నాచింగ్లో పోగొట్టుకున్నది సెంటిమెంట్తో ముడిపడి ఉన్న మంగళసూత్రాలు... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇవే కనిపించాయి. కేవలం తమ ఠాణా పరిధిలోని బాధితులే కాకుండా మూడు కమిషనరేట్లకు చెందిన వారికీ న్యా యం చేయాలని భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్ను చాకచక్యంగా విచారించారు. చివరకు ‘కాఫీ విత్ ఖతీక్’తో అసలు గుట్టు బయటపెట్టేలా చేశారు. మూడు నేరాలు పేట్ బషీరాబాద్లోనే... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ఐదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సింగిల్... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్ను ఈ నెల రెండో వారంలో పేట్ బషీరాబాద్ పోలీసులు పీటీ వారెంట్పై తీసుకువచ్చారు. ఎనిమిదింటిలో మూడు నేరాలు ఈ ఠాణా పరిధిలోనివే కావడంతో ఈ అధికారులే ముందడుగు వేశారు. విచార ణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరు తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ నెల 20న కస్టడీలోకి తీసుకుని తమ పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. అతడి ఆరోగ్యం, గత చరిత్ర నేపథ్యంలో... ఉమేష్కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమికంగా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తొలి రోజు ఉమేష్ పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు మరో రెండు రోజుల పాటు సాధారణంగా ప్రశ్నించారు. ఏమాత్రం తొణకని, బెణకని అతగాడు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పినట్టే ‘తెంచినవన్నీ పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు తమ శైలి మార్చాలని భావించారు. లాకప్లో కూర్చుని కాఫీ తాగుతూ... నేరాలు చేయడంతో ఆరి తేరిన, ఇప్పటికే అనేకసార్లు అరెస్టు అయిన, ఓ సందర్భంలో గురజాత్ పోలీసుల పైనే ఆరోపణలు చేసిన ఉమేష్ ఖతీక్ను రోటీన్కు భిన్నంగా ‘బ్రేక్’ చేయించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓ నేరగాడి నుంచి నిజాలు రాబట్టడాన్ని పోలీసు పరిభాషలో బ్రేక్ చేయడం అంటారు. దీంతో ఒక రోజు అతడితో ప్రేమ పూర్వకంగా మెలిగిన అధికారులు ఎలాంటి హాని ఉండదనే నమ్మకం కలిగించారు. ఆపై అతడితో కలిసి లాకప్ గదిలోనే కూర్చుని కాఫీ కూడా తాగారు. ఈ పరిణామంతో ఉమేష్ వ్యవహారశైలిలో మార్పు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఐదో రోజు నోరు విప్పాడు... పేట్ బషీరాబాద్ పోలీసుల తీరుతో ‘మంత్రముగ్ధుడైన’ ఉమేష్ ఖతీక్ ఐదో రోజు కస్టడీలో నోరు విప్పాడు. ఇక్కడ కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే దాచానంటూ బయటపెట్టాడు. ఈ విషయం అహ్మదాబాద్ పోలీసులకు చెబితే అక్కడి కేసుల్లో రికవరీ చూపించేస్తారని, జైలు నుంచి వచ్చాక తనకు ఏమీ మిగలదనీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు బయటపెట్టాడు. సాధారణంగా స్నాచింగ్ చేసిన బంగారం వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటానని, అలాంటప్పుడు బయటపెట్టినా రిసీవర్ల నుంచి రివకరీ చేస్తారు కాబట్టి తనకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడు. ఈ బంగారం అమ్మని కారణంగానే అలా చెప్పానని వివరించాడు. ఇలా అసలు విషయం తెలిసి అహ్మదాబాద్ వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు అతడి ఇంటి నుంచి 19 తులాలు రికవరీ చేసుకువచ్చారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) -
మంచి కాఫీలాంటి స్టోరీ.. కాఫీ తాగని దేశం..కాఫీ లవర్గా మారిందెలా?
ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కొందరు టీ రుచిని ఆస్వాదిస్తే ఇంకొందరు కాఫీ ఘుమఘుమలను ఇష్టపడతారు. అయితే వేల సంవత్సరాలుగా టీని అభిమానించి.. దాన్నే తాగడానికి అలవాటుపడిన ఓ దేశాన్ని ఒక కంపెనీ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే కాఫీ లవర్స్లా మార్చేసింది. అదెలా సాధ్యమైంది.. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా మరి. టీని ప్రేమించే దేశం... ప్రముఖ బహుళజాతి కంపెనీ నెస్లే గురించి తెలుసుగా... స్విట్జర్లాండ్కు చెందిన ఈ సంస్థ ఆహార, పానియాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రత్యేకించి ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తుల తయారీలో దిగ్గజం. కానీ ఈ సంస్థ 1970లలో జపాన్లో తమ ఇన్స్టంట్ కాఫీని విక్రయించేందుకు పడరాని పాట్లు పడింది. ఒక్క కప్పు కాఫీ కూడా అమ్మలేక చతికిలపడింది. ఇందుకు కారణం.. జపాన్ వేల సంవత్సరాలుగా టీని ఇష్టపడే దేశం కావడమే. ఇలాంటి మార్కెట్లో నెస్లే అడుగు ఎలా పెట్టింది? అక్కడి సంస్కృతిని అర్థం చేసుకొని.. ఇందుకోసం నెస్లే గట్టి కసరత్తే చేసింది. సంస్కృతిలో భాగంగా కొన్ని వస్తువులతో ప్రజలు ఏర్పరుచుకొనే ప్రత్యేక అనుబంధంపై పరిశోధనలు చేయడంలో పేరుగాంచిన సైకోఅనలిస్ట్, ఫ్రాన్స్ జాతీయుడైన క్లోయ్టెర్ రాపిల్లేను తన మార్కెటింగ్ కన్సల్టెంట్గా నియమించుకుంది. జపాన్పై అధ్యయనం చేపట్టిన క్లోయ్టెర్... నెస్లే కాఫీ రుచులను ముందుగా జపాన్ పిల్లలకు అలవాటు చేయడానికి ఓ వ్యూహం సూచించాడు. క్లోయ్టెర్ చెప్పిందే తడవుగా మొదటి దశలో భాగంగా నెస్లే జపాన్ మార్కెట్ను కాఫీ రుచితో కూడిన స్వీట్లు, చాక్లెట్లతో ముంచెత్తింది. పిల్లలకు ఇవి తెగ నచ్చాయి. నెమ్మదిగా జపాన్కు కాఫీ రుచి తెలిసొచ్చింది. చదవండి👉అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ మాట కలిపిన ఇంజనీరింగ్ యువతి నేటి పిల్లలే రేపటి వినియోగదారులు కాఫీ రుచి కలిగిన క్యాండీలు ప్రవేశపెట్టిన పదేళ్ల తర్వాత నెస్లే కొత్త రకం కాఫీ ఉత్పత్తులతో తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టింది. అప్పటికి నెస్లే ‘క్యాండీ వినియోగదారుల్లో’ చాలా మంది పెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు.. దీంతో వారంతా ఈ కాఫీ ఉత్పత్తులను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెస్లే తెచ్చిన ఇన్స్టంట్ కాఫీ అనతికాలంలోనే మార్కెట్ను హస్తగతం చేసుకుంది. తర్వాత 2012లో నెస్లే సంస్థ వివిధ ఆఫీసులకు నెస్కెఫే తయారీ మెషీన్లను సరఫరా చేయడంతోపాటు తమ సహచరులకు కాఫీ తయారు చేసి ఇవ్వగల ‘నెస్కెఫే అంబాసిడర్’లను నియమించింది. పని ప్రదేశాల్లో రుచికరమైన కాఫీ లభించేందుకు ఈ ప్రచారం దోహదపడింది. అలాగే ప్రజలు సామాజికంగా దగ్గరై సరదాగా గడిపేలా చేసింది. కాఫీ మెషీన్లు విక్రయించేందుకు, కాఫీ కాచి వినియోగదారులకు అందించేందుకు నెస్లే 2014లో హ్యూమనాయిడ్ రోబో ‘పెప్పర్’ను రంగంలోకి దించింది. జపాన్ రాజధాని టోక్యోలో నెస్లే 2019లో ప్రత్యేకంగా ఒక స్లీప్ కేఫ్ను తెరిచింది. ఈ కేఫ్కు వచ్చే వారు మెత్తటి పరుపులపై చిన్నపాటి కునుకుతీసి కాఫీ తాగేలా ఏర్పాట్లు చేసింది. టీ టు కాఫీ ఫైనల్గా ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు కనీసం కాఫీని తాగడానికి ఇష్టపడని జపాన్.. 2020 నాటికి ప్రపంచంలోకెల్లా 7వ అతిపెద్ద కాఫీ దిగుమతిదారుగా తయారైంది. ఈ దేశం ఏటా జపాన్ 43 లక్షల టన్నుల కాఫీని వినియోగిస్తోంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మ్యాగీ లవర్స్కు భారీ షాక్!
రెండు నిమిషాల్లోనే రెడీ. అంటూ మ్యాగీ నూడిల్స్తో మధ్యతరగతి జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది నెస్లే ఇండియా లిమిటెడ్. ఇప్పుడీ ఈ మ్యాగీ పెరుగుతున్న ధరలతో మసాలా దట్టించకముందే నషాళాలనికి అంటుతుంది. ఈ ఏడాది మార్చిలో నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్ ధరల్ని పెంచింది. ఇప్పుడు మరోసారి ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. మ్యాగీ ఈ పేరు తెలియని పిల్లలుండరు. రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ను వండి వార్చితే. లొట్టలేసుకొని లాగించేస్తుంటారు పిల్లలు. బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీ ఉంటే చాలు. పిల్లలే కాదు..పెద్దలు సైతం మసాలా నూడిల్స్ను ఇష్టంగా తింటుంటారు. అలాంటి నూడిల్స్..పెరుగుతున్న ధరల కారణంగా తినేందుకు మరింత భారంగా మారనున్నాయి. నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస్తున్న కిట్ కాట్, నెస్కెఫే కాఫీ ధరలు పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మ్యాగీ ధరలు పెరగడానికి కారణం ఇదే ముడి సరుకు,ఫ్యూయల్, ట్రాన్స్ పోర్ట్, వర్క్ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్లే వరుసగా మ్యాగీ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నెస్లే సీఈఓ ష్నీడర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెస్లే..ఉత్పత్తిని పెంచడం,అంతర్గతంగా అమ్మకాల వృద్ధిని' చూసింది. పెరుగుతున్న ఇతర (పైన పేర్కొన్నట్లు) ఖర్చుల కారణంగా ఉత్పత్తుల ధరల్ని పెంచడం అనివార్యమైంది. ఇక ఈ సంవత్సరం అమ్మకాలు,లాభాల లక్ష్యాలను చేరుకోగలదని నెస్లే స్పష్టం చేసింది. చదవండి👉 పిడుగులాంటి వార్త..సామాన్యులకు షాక్.. వీటి ధరలు భారీగా పెరిగాయ్! -
ఆర్వీ నగర్కు రానున్న కాఫీ పరిశోధన స్థానం
కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్వీనగర్లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది. గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్.వి.నగర్లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను ఈ విభాగం సమకూరుస్తోంది. మావోయిస్టులు పేల్చేయడంతో.. ఆర్వీనగర్లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్మైన్తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగు కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్వీ నగర్కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. శాస్త్రవేత్తల సహకారం అవసరం ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్వీ నగర్కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం -
Milk Maker: కొబ్బరి, బాదం, సోయా పాలు.. ఇలా తయారు చేసుకోండి.. ధర ఎంతంటే!
కొబ్బరి, బాదం, సోయా పాలు వంటివి వంటల్లో చవులూరించే రుచినే కాదు ఒంట్లో ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్న వారికోసమే ఈ డివైజ్. ఇది గింజలు, నట్స్ నుంచి పాలు తీసి పెడుతుంది. దీంట్లో బాదం లేదా కొబ్బరి లేదా సోయా(రాత్రి నానబెట్టి) వంటివి వేసుకుని.. సరిపడా నీళ్లు పోసుకుంటే.. జ్యూస్లా చేసిపెట్టేస్తుంది. చివరిగా టీ వడకట్టుకునే తొట్టెతో వడకట్టుకుంటే సరిపోతుంది. పైగా ఇందులో బ్రెడ్ రెసిపీ తయారు చేసుకోవడం, కాఫీ గింజలను పౌడర్ చేసుకోవడం.. వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్ మాదిరి ఉండే డివైజ్ కావడంతో వినియోగించడం చాలా సులభం. ధర 109 డాలర్లు- (రూ.8,347) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
సామాన్యులకు మరో షాక్..వీటి ధరలు భారీగా పెరిగాయ్!
పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి నేషనల్ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్,కాఫీ ఫౌడర్ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్ రూ.12 నుంచి రూ.14 పెరిగింది. ♦140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్ 12.5శాతంతో ధర రూ.3 పెరిగింది. ♦560 గ్రాముల ప్యాకెట్ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది. ♦నెస్లే ఏప్లస్ ఒకలీటర్ కార్టన్ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ కాఫీ ఫౌడర్ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ 25 గ్రాముల ప్యాకెట్ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. ♦నెస్ కెఫె క్లాసిక్ 50 గ్రాముల ప్యాకెట్ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది. ♦హెచ్యూఎల్ సైతం టీ, కాఫీ ఫౌడర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్ మహల్ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. ♦ బ్రూక్ బ్రాండ్ 3 రోజెస్ వేరియంట్ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత్తులపై పడనున్నాయి. చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్! -
గుడ్న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్స్టేషన్లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్ క్రాస్రోడ్స్, కేపీహెచ్బీ, ఎస్సార్నగర్, టెలిఫోన్ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్ డిమార్ట్ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్ తదితర బస్టాపులలో ఈ సదుపాయం ఉంటుంది. చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!) -
ప్రెషర్ కుక్కర్ కాఫీ.. వైరల్ అవుతున్న ఓల్డ్ మ్యాన్..
Pressure Cooker Coffee: A Man Makes Coffee in Cooker Video Goes Viral: పనిలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీలు తాగుతాం! అయితే ఒకే రకం కాఫీ కాకుండా కొత్తగా ట్రై చేస్తాం. కొంతమంది కాఫీ ప్రియులైతే.. ఎక్కడ మంచి కాఫీ దొరుకుతుందా? అని కనుక్కొని మరీ తాగుతారు. ఘుమఘుమలాడే మంచి కాఫీని అందిస్తున్న ఓ ఓల్డ్ మ్యాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఆయన కాఫీకి సంబంధించిన వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. అతడు కాఫీ చేస్తున్న విధానం అందరినీ అక్కట్టుకుంటోంది. అమోఘమైన రుచిని కూడా ఇస్తోంది. వీధుల్లో తిరుగుతూ చాలా కొత్తగా ప్రెషర్ కుక్కర్ ఆవిరితో.. రుచికరమైన కాఫీ చేసి అమ్ముతున్నాడు. ప్రెషర్ కుక్కర్తో ఎలా చేస్తున్నారని ఆశ్చర్యంగా ఉందా! సైకిల్ మీద ప్రెషర్ కుక్కర్ ఏర్పాటు చేసుక్కని.. ఒక గిన్నెలో కాఫీ పౌడర్, పాలు కలిపి ప్రెషర్ కుక్కర్ అవిరితో వేడిచేసి ఇన్స్టాంట్గా వేడివేడి కాఫీ ఇస్తున్నాడు. ఇలా ప్రెషర్ కుక్కర్ సాయంతో స్టీమ్ చేయటం వల్ల కాఫీ మరింత రుచిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఐతే ప్రెషర్ కుక్కర్లో నీళ్లు నింపి.. దానికి ఓ పైపు అమర్చాడు. ఆ పైపు గుండా వచ్చే ఆవిరితో కాఫీని మరిగించి ఇవ్వడంతో ఓల్డ్ మ్యాన్ కాపీ వైరల్గా మారింది. అయితే చిక్కటి రుచికరమైన కాఫీని వీధుల్లో తిరిగి మరీ అమ్మడంతో స్థానికులు ఉత్సాహంగా తాగుతున్నారు. ఈ కాఫీ విక్రేత గ్వాలియర్ చెందిన వ్యాక్తిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Vansh🇮🇳 (@eatthisagra) -
గుడ్న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే..
Consumption of coffee Daily can prevent development of Alzheimer's disease: ప్రతి ఉదయం వేడివేడిగా కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అటువంటి కాఫీ ప్రియులకు ఓ గుడ్న్యూస్! కాఫీ తాగనివారితో పోల్చితే తాగేవారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై 10 యేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీతాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెదడులోని అల్జీమర్స్ అభివృద్ధలో కీలకంగా వ్యవహరించే అమిలాయిడ్ ప్రొటీన్ను నిరోధించడంలో కాఫీలోని కారకాలు ఉపయోగపడతాయని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి కాఫీ తాగడం సులువైన మార్గమని పేర్కొన్నారు. మతిమరుపుతో బాధపడే వ్యక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పవచ్చు. చదవండి: కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం.. మధ్య వయస్సు వ్యక్తుల జీవనశైలిలో కాఫీని తప్పకుండా చేర్చుకోవాలి. రోజుకు 240 గ్రాముల చొప్పున ఒక కప్పు కాఫీ తాగేవారైతే, అదనంగా మరో కప్పును చేర్చడం మంచిది. ఫలితంగా 18 నెలల తర్వాత 8% వరకు మతిమరుపు సమస్య నివారణ ఔతుందని, అదేవిధంగా మెదడులో అమిలాయిడ్ ప్రొటీన్ ఏర్పడటం 5% తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో అమిలాయిడ్ బలమైన ఫలకాలు ఏర్పడేలా చేసి అల్జీమర్స్ వ్యాధిదారి తీస్తుంది. మెదడు ఆరోగ్యంపై కాఫీలో ఏ కారకాలు సానుకూలంగా పనిచేస్తున్నాయనే అంశంపై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి ఇది ఏకైక కారణమని దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందని పరిశోధకులు తెలిపారు. చదవండి: అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!! -
టీ, కాఫీతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చిలా..! పక్షవాతం, స్ట్రోక్ కూడా..
Are You Drinking More Coffee And Tea A Day Must Know These Shocking Health Benefits: ప్రతి రోజూ రెండు కప్పుల టీ, అలాగే రెండు కప్పుల కాఫీ తాగేవారికి మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరుపు రావడం అన్నది... అలా తాగని వారితో పోల్చినప్పుడు దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు డాక్టర్ యువాన్ ఝాంగ్, అతని బృందం. ఒక్కరూ ఇద్దరూ కాదు... దాదాపు అయిదు లక్షల మందిపై పదేళ్ల పాటు బ్రిటన్లో సుదీర్ఘ పరిశోధన చేశారు. చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ, టీ తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) మాత్రమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ జర్నల్ ‘ప్లాస్ మెడిసిన్’ (PLoS Medicine)లో ప్రచురితమయ్యాయి. అయితే ఇలా కాఫీ, టీల మీద పరిశోధనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివే చాలా సాగాయి. దాంతో ఈ ఫలితాల మీద కొంత ఎదురుదాడి కూడా జరుగుతోంది. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ఇలాంటి పరిశోధనలు గతంలోనూ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే దోహద పడి ఉండకపోవచ్చనీ, ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సైతం ఈ పరిశోధన ఫలితాల వెల్లడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుండే మాట వాస్తవమే. అయినప్పటికీ వాటిని పరిమితికి మించి తీసుకుంటూ ఉంటే కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53%మందికి డిమెన్షియా వస్తుందని తేలిన ఫలితాలను వారు ఉటంకిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘రెండంటే రెండే’’ అన్న పరిమితికి కట్టుబడాలంటూ గట్టిగా చెబుతున్నారు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!