deposits
-
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
రామోజీపై ‘రాజ’భక్తి!
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో హైకోర్టుని కోరింది. దాటవేత ధోరణే... రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్లో పొందుపరిచింది. అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో కోరింది. చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి... ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్యూఎఫ్లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది. వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్రావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు. బాబు బాటలోనే రేవంత్...ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి. ‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది. -
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్డ్రైవ్లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్డ్రైవ్లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్డ్రైవ్లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్డ్రైవ్ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్డ్రైవ్లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్కుమార్కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్డ్రైవ్లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్కుమార్ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్డ్రైవ్లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్డ్రైవ్లో ఇచ్చిన డేటాను అరుణ్కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్కుమార్కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
బ్యాంకు డిపాజిట్లపై గరిష్ట వడ్డీ
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతాయని అంచనా. ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకుంటుండగా.. ద్రవ్యోల్బణం సాకుతో ఆర్బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతికనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులుదేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు
న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
డిపాజిట్లు రూట్ మారడానికి కారణం ఇదే..
ముంబై: బ్యాంకుల నుంచి డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాల వైపు మళ్లడానికి సులభతర నిబంధనలే కారణమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంవీ రావు వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించిన నేపథ్యంలో.. ఎఫ్ఐబీఏసీ వార్షిక సదస్సులో భాగంగా దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఎండీ, సీఈవోగానూ వ్యవహరిస్తున్న ఎంవీ రావు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సులభతర నిబంధనల కారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. నిధుల నిర్వహణ విషయంలో బ్యాంకులపై ఎన్నో నియంత్రణలు ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్కు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. ‘‘నిధులను అంతిమంగా ఎందుకు వినియోగిస్తున్నారో తనిఖీ చేయాల్సిన అవసరం మ్యూచువల్ ఫండ్స్కు లేదు.మా వద్దే డిపాజిట్ చేయాలని కస్టమర్లను బ్యాకింగ్ రంగం నిర్దేశించలేదు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే విషయంలో ఫండ్స్కు ఎలాంటి ప్రొవిజనింగ్ లేదు. కానీ ప్రామాణిక రుణ ఆస్తులకు సంబంధించి కూడా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంక్లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయడం లేదు.ఆరేడేళ్ల తర్వాత ఈ సైకిల్ తిరగబడితే అది వ్యవస్థాగత ముప్పుకు దారితీయవచ్చు. రానున్న రోజుల్లో డిపాజిటర్లు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు, దేశ వృద్ధికి కావాల్సిన ముడి సరుకు (నిధులు)ను బ్యాంక్లు పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య చురుకైన భాగస్వామ్యం, చర్చ అవసరం’’అని రావు ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.డిపాజిట్ల మందగమనం కారణాలు వేరే..కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు కూడా అయిన నీలేష్ షా ఈ అభిప్రాయాలతో విభేదించారు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించడానికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను ఎలా తప్పుబడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వ నిధులు సైతం బ్యాంకింగ్ నుంచి బయటకు వెళుతున్నాయని, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, నగదు పంపిణీ తదితర అంశాలను ఇందుకు కారణాలుగా ప్రస్తావించారు. ప్రభుత్వ బ్యాలన్స్లను (మిగులు నిధులు) బ్యాంకుల్లో ఉంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ను తాను కోరినట్టు చెప్పారు. ఇలా చేసిన ప్రభుత్వం ఏటా రూ.12,000 కోట్ల ఆదాయం పొందొచ్చన్నారు. కాగా, రావు అభిప్రాయాలతో ఇదే సమావేశంలో పాల్గొన్న హెచ్ఎస్బీసీ హితేంద్ర దవే సేతం విభేదించడం గమనార్హం. -
డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు. -
పటిష్టంగా భారత ఎకానమీ
దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్ సానుకూల అంశాలను వెలువరించాయి. అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్ ఆర్బీఐ బులెటిన్లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలను చూస్తే...ధరల్లో స్థిరత్వం..‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రూపొందించిన ఈ ఆర్టికల్, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల..ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్ జాన్, ఆసిష్ థామస్ జార్జ్లు రాసిన మరో ఆర్టికల్ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్ ఫుడ్ ప్రైసెస్ స్పిల్లింగ్ ఓవర్? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్ పేర్కొంది. ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!నిధులకోసం ప్రత్యామ్నాయాలు..డిపాజిట్ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్ చూస్తోందని బులెటిన్ ప్రచురితమైన మరో ఆర్టికల్ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్ డిపాజిట్ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్వేనని తెలుస్తోంది. -
చెరుకూరి త్రిపాత్రాభినయం
సాక్షి, అమరావతి: ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకులు కొన్ని సినిమాల్లో ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభినయం చేయటాన్ని చూస్తుంటాం. చట్టం కళ్లకు గంతలు కట్టి ఆర్థిక అక్రమాలకు పాల్పడేందుకు త్రిపాత్రాభినయం చేయడం మాత్రం చెరుకూరి రామోజీరావుకే చెల్లింది. ఆర్బీఐ కళ్లుగప్పేందుకు చెరుకూరి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆర్బీఐను బురిడీ కొట్టించేందుకే... ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కాగా రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అంటే హెచ్యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీనిపై ఆర్బీఐగానీ ఇతర దర్యాప్తు సంస్థలుగానీ ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయనో ఎత్తుగడ వేశారు. అదే త్రిపాత్రాభియనం... సాంకేతిక కారణాలతో తప్పించుకునే ఎత్తుగడ చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ రశీదులపై హెచ్యూఎఫ్ కర్తగా... చెక్కులపై ప్రొప్రైటర్గా... బోర్డు మీటింగుల మినిట్స్ బుక్లో చైర్మన్గా సంతకాలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థ ముసుగులో ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు మరి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిపాజిట్ పత్రాలపై హెచ్యూఎఫ్ కర్తగా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్దారులకు పత్రాలను జారీ చేసింది. వాటిపై రామోజీరావు తనను తాను ‘హెచ్యూ ఎఫ్ కర్త’గా పేర్కొంటూ సంతకం చేశారు. బోర్డు మీటింగులో చైర్మన్గా... ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగుల విషయం వచ్చేసరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగు మినిట్స్ బుక్లో, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్గా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిట్దా రులకు కాలపరిమితి తరువాత చెక్కుల రూపంలో చెల్లింపులు చేసింది. ఆమేరకు జారీ చేసిన చెక్కులపై రామోజీరావు ‘ప్రొప్రైటర్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. అంటే డిపాజిట్ రశీదు మీద హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు చెక్కు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రొప్రైటర్ అయిపోయారు. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
‘బ్లాక్’ కోబ్రా
మార్గదర్శి చిట్ ఫండ్స్ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్దారుల పాన్ నంబరు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. – సాక్షి, అమరావతి ఘోస్ట్ చందాదారులతో నల్ల దందా బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్’ మ్యాజిక్ మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో బ్యాలన్స్ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్ షీట్తో సరిపోవాలి. అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్ షీట్ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్క్యాష్ కావు. కేవలం చిట్స్ రిజి్రస్టార్, రిజర్వ్ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం. ‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచుగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనంగా ఉండనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం వినియోగంలో లేని ఖాతాలు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ఈమెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకోసారి ప్రాతిపదికన పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్ను, నామినీని కూడా సంప్రదించాలి. -
మూడేళ్లలో రూ.87,877 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతోంది. సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రూ.87,877 కోట్ల మేర బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. 2021 మార్చి నాటికి బ్యాంకుల్లో రూ.3.85 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది జూన్ నాటికి రూ.4.73 లక్షల కోట్లకు పెరిగాయి. పెరిగిన జీవన ప్రమాణాలు.. వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల జీవనోపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మదుపు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతోపాటు జగనన్న పాల వెల్లువ ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తూ జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలు సాధికారతతో తమ కాళ్లపై నిలబడేలా వివిధ వ్యాపార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ కార్యక్రమాలతో 2021 మార్చి నుంచి ఏటా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో విశాఖలో అత్యధికంగా డిపాజిట్లు ఉండగా నూతన జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా డిపాజిట్లున్నాయి. -
బ్యాంకు చిన్నదే.. కానీ టార్గెట్ పెద్దది!
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో విలీనవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష కోట్ల డిపాజిట్లతో సంవత్సరాన్ని ముగించాలని భావిస్తోంది. జైపూర్ కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 2027 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 2027 మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే రిటైల్ రుణాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2023 సెప్టెంబర్ నాటికి రూ. 75,000 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది. ఇక ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వద్ద రూ. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము 28-30 శాతం స్థిరమైన వృద్ధితో ఎదిగామని, ఇదే వృద్ధితో కొనసాగితే 2027 నాటికి డిపాజిట్లను రూ. 2 లక్షల కోట్లకు పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల డిపాజిట్లను సాధించడం ఏ బ్యాంకుకు అయినా వేగవంతమైన వృద్ధిరేటు అవుతుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా తాము ఆస్తి విభాగంలో ఇతర బ్యాంకుల కంటే ప్రధానంగా ఎన్బీఎఫ్సీలతో పోటీ పడుతున్నామని, కానీ డిపాజిట్ల విషయానికి వస్తే తాము అన్ని బ్యాంకులతో పోటీ పడతామని వివరించారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ల ముందస్తు విత్డ్రా.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిక్స్డ్ డిపాజిట్దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఇక నుంచి అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మెచ్యూరిటీ కంటే ముందే డబ్బును తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కోటి రూపాయల వరకు ఉన్న అన్ని బ్యాంకు డిపాజిట్లపై ముందస్తు మెచ్యూర్ విత్డ్రాలను తప్పనిసరిగా అనుమతించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నాన్ కాలబుల్ (ముందస్తు ఉపసంహరణకు వీలు లేని) ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ గతంలోనే రూ.15 లక్షల వరకూ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.కోటి వరకూ పెంచింది. కాగా గతంలో ఈ ముందస్తు ఉపసంహరణకు వీలు లేని డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించేందుకు బ్యాంకులను అనుమతించింది. అధిక వడ్డీ రేటు వర్తించే సమయంలో మెచ్యూర్కు ముందు ఉపసంహరణ సౌకర్యం లేకుండా అధిక వడ్డీ రేట్లను అందించేలా బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహించింది. వడ్డీ రేట్లు పెరిగితే కస్టమర్లు తమ డిపాజిట్లను ముందస్తుగా విత్డ్రా చేయరనేది ఆర్బీఐ ఉద్దేశం. చిన్న పెట్టుబడిదారులను రక్షించడమే నాన్ కాలబుల్ డిపాజిట్లపై కనీస డిపాజిట్ల పరిమాణాన్ని పెంచడం వెనుక లక్ష్యం అని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు అధికంగా రాబడిని అందిస్తాయి. అధిక విలువ కలిగిన డిపాజిట్లకు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామీణ బ్యాంకులకు బల్క్ డిపాజిట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. అంటే రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్లపై మాత్రమే బ్యాంకులు డిఫరెన్షియల్ రేట్లను అందించగలవు. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తెలుసుకోవడానికి కొత్త పోర్టల్ - ఇది చాలా సింపుల్
ముంబై: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, గడువు ముగిసినప్పటికీ, వెనక్కి తీసుకోని వాటి (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) వివరాలను తెలుసుకునే ఉద్గమ్(యూడీజీఏఎం) పోర్టల్పైకి 30 బ్యాంక్లు చేరాయి. ఈ వివరాలను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో తమ, తమవారి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకుల్లో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 17 నుంచి ఈ పోర్టల్ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరంభంలో ఏడు బ్యాంక్లకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్పై అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటికి 30 బ్యాంక్లకు సంబంధించిన డిపాజిట్ల వివరాలు తెలుసుకునే విధంగా అప్గ్రేడ్ చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో 90 శాతం ఈ 30 బ్యాంక్ల కస్టమర్లకు చెందినవి కాగా, ప్రస్తుతం ఆ డిపాజిట్లు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏ) రూపంలో ఉండడం గమనార్హం. అన్ని ప్రముఖ బ్యాంక్లు ఈ పోర్టల్తో అనుసంధానమయ్యాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఎలాంటి క్లెయిమ్ రాని రూ.35,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ కస్టమర్లకు చెందినవే రూ.8,086 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీ నుంచి రూ.5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3,904 కోట్ల చొప్పున ఉన్నాయి. నిబంధనల కింద గడువు తీరి పదేళ్లు అయినా క్లెయిమ్ రాని డిపాజిట్లను, బ్యాంక్లు డీఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది. -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్లైన్ పొడిగిస్తారా?
Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆర్బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది. అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్లైన్ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్లైన్ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై కేంద్రం నుంచి ఆర్బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే రెండు వేల రూపాయలనోట్లను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్ని కలిగి ఉండటం మంచిది. ఈ వారంలో బ్యాంకుల సెలవులు ♦ బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి. ♦ గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు. ♦ శుక్రవారం,శనివారం అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో శుక్రవారం కూడా సెలవు. మరోవైపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది. -
మీరు బ్యాంకులో డబ్బుల్ని డిపాజిట్ చేస్తున్నారా?.. మీకొక విషయం తెలుసా?
మీరు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? చేస్తే మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్యాంకు డిపాజిట్లు అంత శ్రేయస్సకరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంకుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి దివాళా తీస్తే? ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అందిస్తుంది. ఆ పథకం గురించి మీకు తెలుసా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అన్ని బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అందించే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ను అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కొత్త మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నా, రూ.5లక్షల వరకు డిపాజిట్ను ఖాతాదారులు తిరిగి పొందే వీలుంది. అర్హులైన ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
డిపాజిట్ దారుల సొమ్ముపై సుప్రీం కోర్టు జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
తపాలాకు సాంకేతిక సొబగులు
నేరడిగొండ: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ ఆధునికతను అందిపుచ్చుకునే దిశగా తపాలా శాఖ అడుగులు వేస్తోంది. అన్ని రంగాలతో సమానంగా ఆన్లైన్ విధానంలోనూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇప్పటికే పలుసేవలను ఆన్లైన్ విధానంలోకి తెచ్చింది. వీటితోపాటు తాజాగా ‘పోస్ట్ ఇన్ఫో యాప్’ను తీసుకువచ్చింది. దీనిద్వారా పోస్టల్కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లోనే తెలుసుకునే వీలు కలిగింది. వినియోగదారుడికి సదుపాయంగా.. పోస్ట్ ఇన్ఫో యాప్ను స్మార్ట్ఫోన్లో ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, వివిధ డిపాజిట్లపై వడ్డీ లెక్కించుకునే సదుపాయాలు సైతం ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, డిపాజిట్ పథకం, టైమ్ డిపాజిట్లపై ఏడాది నుంచి ఐదేళ్ల వరకు వచ్చే ఆదాయం వాటిని లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు ఆధారంగా పథకాలు ఎంచుకొని డిపాజిట్లు చేయడం ద్వారా వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు అమలులో ఉన్న (ఆరు అంకెల) పిన్కోడ్ నంబర్లను ఎంటర్ చేస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్ పరిధి తెలియజేస్తుంది. తపాలా అందిస్తున్న సేవలపై ఖాతాదారులు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం సైతం ఉంది. కూర్చున్న చోటు నుంచే. ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు సులువుగా సమాచారం పొందవచ్చు. తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, పొదుపు పథకాల గురించి తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మరింత సులువు.. తపాలా శాఖలో బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ ద్వారా సేవలందిస్తోంది. మహిళలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. మా శాఖ ద్వారా ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏవైన వివరాలు ఉంటే ఆయా గ్రామాల్లో గల తపాలా శాఖ కార్యాలయంలో కాని, బీపీఎంల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. – మహేశ్రెడ్డి, సబ్ పోస్టుమాస్టర్, నేరడిగొండ -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
గ్రీన్ డిపాజిట్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ‘గ్రీన్ డిపాజిట్ల’ను పొందేందుకు ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ డిపాజిట్ నిధులను పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్ల వంటి ఫైనాన్సింగ్ కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. వాతావరణ మార్పును ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించడంతోపాటు వాతావారణంలో సుస్థిరతను ప్రోత్సహించేందుకు వివిధ ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఫ్రేమ్వర్క్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. -
బ్యూటీషియన్కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..
చిత్తూరు అర్బన్: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి వారం రూ.10 వేలు పట్టుకెళ్లండి. మూడేళ్ల తర్వాత మీరు పెట్టిన రూ.లక్ష పెట్టుబడిని వెనక్కు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన రూ.లక్షకు బాండు ఇదిగో’ అంటూ ఓ బ్యూటీషియన్ను మోసం చేసి ఏకంగా రూ.45 లక్షలు కాజేసిన ఉదంతమిది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిత్తూరు వన్టౌన్ పోలీసులు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డిపల్లెలోని బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు. బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ తన బంధువు చెప్పడంతో అనూరాధ అక్కడకు వెళ్లింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. మూడేళ్ల తరువాత పెట్టుబడి రూ.లక్షను సైతం ఇచ్చేస్తామని ఏవోజీ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని ఆశపడ్డ అనూరాధ తనతో పాటు తన సమీప బంధువుల నుంచి అప్పు తీసుకుని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఏవోజీ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా రూ.45 లక్షలు చెల్లించారు. చదవండి: జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో మూడు నెలలు దాటడంతో వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనూరాధ బోర్డు తిప్పేసినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కంపెనీలో మరికొందరు కూడా పెద్దఎత్తున నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లకు అసలు విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
ఆర్బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా?
క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంక్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిటర్లు, లేదంటే లబ్ధిదారులు గుర్తించేందుకు గాను వెబ్పోర్టల్లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ వివరాల ప్రకారం.. ఇటీవల ఆర్బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్నెస్ ఫండ్లో రూ. 35,012 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయి ఉంటాయి. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. అన్ క్లయిమ్ డిపాజిట్ల కోసం వెబ్ పోర్ట్లలో డేటాబేస్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా బ్యాంక్లు ఆ డేటా బేస్లో అన్ క్లయిమ్ డిపాజట్ల గురించి తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు. అన్క్లయిమ్ డిపాజిట్లపై పిల్ దాఖలు ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్, రచయిత సుచేతా దలాల్ తాజాగా అన్ క్లయిమ్ డిపాజిట్ల గురించి డేటా బేస్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (పిల్కు) దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు ఆర్థిక శాఖకు మరింత సమయం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
రూ.35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంటుకు తెలియజేశారు. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవని ఆయన వెల్లడించారు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. -
దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా తీసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ బ్యాంకులో మన దేశానికి చెందిన స్టార్టప్లు కూడా డిపాజిట్లు పెట్టాయి. దీనిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారత స్టార్టప్ కంపెనీల నిధులు ఇరుక్కున్నాయా అనే వివరాలను శోధిస్తోంది. ఈ క్రమంలో రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్వీబీలో ఉన్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఇలా ఎన్ని సంస్థల డిపాజిట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఉన్నయానే దానిపై కేంద్రం ఆరా తీసింది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ స్టార్టప్లకు చెందిన సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 8,251.5 కోట్లు) విలువైన డిపాజిట్లు ఉంటాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అంచనా వేశారు. ఈ స్టార్టప్లను స్థానిక బ్యాంకులు ఆదుకోవాలని, వారికి మరింతగా రుణాలు ఇవ్వాలని సూచించారు. అనిశ్చిత పరిస్థితులతో సంక్లిష్టమైన యూఎస్ బ్యాంకింగ్ వ్యవస్థపై మన దేశ స్టార్టప్లు ఆధారపడకుండా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉందని ట్విట్టర్ స్పేస్ చాట్లో కేంద్ర మంత్రి అన్నారు. ఇదీ చదవండి: ఆఫీస్కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సిలికాన్ వ్యాలీ బ్యాంకు 2022 చివరి నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సంక్షోభం తలెత్తిన వెంటనే డిపాజిటర్లు ఒక్క రోజులోనే 42 బిలియన్ డాలర్ల వరకు ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న ఎస్వీబీని మూసివేశాయి. ఆ తర్వాత యూఎస్ ప్రభుత్వం డిపాజిటర్లకు వారి నిధులన్నింటికీ యాక్సెస్ ఉండేలా చర్యలు చేపట్టింది. -
డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే
ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్ను చేరుకునేందుకు అవి హోల్సేల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు... సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా, రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి మోస్తరుగా.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్ఎఫ్సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. 2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్ఎఫ్సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. అందుబాటు గృహ రుణాల జోరు హెచ్ఎఫ్సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్ఎఫ్సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్ హౌసింగ్ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. -
రుణాల్లో 13 శాతం వృద్ధి; ఇండియా రేటింగ్స్ అంచనా
ముంబై: బ్యాంక్ డిపాజిట్ రేట్లు మరింత పెరుగుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో బ్యాంక్ రుణాల్లో 13 శాతం వృద్ధి నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. గత అంచనా 10 శాతాన్ని పెంచింది. ‘‘ఆగస్ట్ 26 నాటికి బ్యాకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి 15.5 శాతంగా ఉంది. డిపాజిట్లలో వృద్ధి 9.5 శాతంగా ఉంది. రుణ డిమాండ్ను అందుకునేందుకు బ్యాంక్లు మరిన్ని డిపాజిట్ల సమీకరణకు ప్రయత్నిస్తాయి. దీంతో రుణదాతల మధ్య డిపాజిట్ల కోసం పోటీ పెరగనుంది. డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల డిమాండ్ అధిగమించనుంది’’అని రేటింగ్ ఏజెన్సీ తన తాజా నివేదికలో వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంక్లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్లు మరిన్ని డిపాజిట్లను సమీకరిస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్ రంగలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 2023 మార్చి నాటికి 6.8 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. 2021–22 నాటికి జీఎన్పీఏలు 6.1 శాతానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. చిన్న వ్యాపార సంస్థల రుణ విభాగంలో ఒత్తిళ్లు ఉన్నట్టు తెలిపింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నందున నికర వడ్డీ మార్జిన్లు కూడా మెరుగుపడతాయని పేర్కొంది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
ఆర్బీఐ వద్ద రూ.48వేల కోట్లు.. పది సంవత్సరాల నుంచి ఎవరూరారే!
ముంబై: బ్యాంకింగ్లో క్లెయిమ్ చేయని నిధుల మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు ఎగశాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం తెలుగురాష్ట్రాలుసహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్లు జాబితాలో ఉన్న మిగిలిన ప్రధాన రాష్ట్రాలు. దీనితో ఈ అంశంపై ఆయా రాష్ట్రాల్లో విస్తృత ప్రాతిపదికన ప్రచారం నిర్వహించి, క్లెయిమ్ చేయని వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు బ్యాంకింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్లెయిమ్ చేయని నిధులు అంటే.. సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, 10 సంవత్సరాల పాటు ఎవ్వరూ నిర్వహించని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను ‘ క్లెయిమ్ చేయని డిపాజిట్లు‘గా వర్గీకరిస్తారు. ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్’కి బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేపట్టినప్పటికీ, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతున్న ధోరణి కనబడ్డం గమనించాల్సిన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కారణాలు ఏమిటి? క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం ప్రధానంగా సేవింగ్స్, కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల పెరుగుతోంది. డిపాజిటర్లు కొద్దో గొప్పో బ్యాంక్ ఖాతాల్లో వదిలివేసి ఆపరేట్ చేయకూడదనుకోవడం లేదా మెచ్యూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్ క్లెయిమ్లను సమర్పించకపోవడం వంటి అంశాలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని సందర్భాల్లో మరణించిన డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల విషయంలో నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు డబ్బును వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. క్లెయిమ్ చేయడంలో సహాయపడటం తమ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. చదవండి: EV: ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం! -
ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..
సాక్షి, ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను అందించే నిబంధన ఉంది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబరు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు , ఇతర డబ్బు నేరాల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్రం కసరత్తులో భాగంగా నిబంధనలను సవరిస్తోన్న సంగతి తెలిసిందే. -
యూనియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్ నెలల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. -
‘సొమ్ము’సిల్లుతున్న విశ్రాంత ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: వెంకటయ్య ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.. పదేళ్ల కింద పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు వెంకటయ్య దంపతులు ఆ డిపాజిట్పై వచ్చే వడ్డీతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వడ్డీ రావటం ఆగింది. సీసీఎస్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే, ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 7 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్కు జమ చేయాల్సిన మొత్తం సరిగా రావటం లేదన్నారు. అందుకే వడ్డీ చెల్లించేందుకు డబ్బు లేదన్న సమాధానం వచ్చింది. తన డిపాజిట్ మొత్తం తిరిగి ఇమ్మంటే.. ఆర్టీసీ బకాయి పడ్డ మొత్తం చెల్లిస్తేగాని ఇవ్వలేమని చెప్పడంతో ప్రతినెలా నెట్టుకొచ్చేది ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక వెంకటయ్య దుస్థితే కాదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొంది తమ రిటైర్మెంట్ సాయం మొత్తాన్ని సీసీఎస్లో దాచుకున్న దాదాపు 8 వేల మంది ఆవేదన. ఇందులో దాదాపు 4వేల మంది సీసీఎస్ అందించే వడ్డీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆందోళనలో ఉన్న ఈ ఉద్యోగులు రోడ్డెక్కబోతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ అందించే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ సీసీఎస్ నుంచి బస్భవన్ వరకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. రావాల్సిన రూ.25 కోట్లు రాకపోవడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత.. నెలనెలా సీసీఎస్లో జమ చేసుకున్న మొత్తంతో పాటు వడ్డీ పొందుతారు. దీన్ని చాలా మంది సీసీఎస్లోనే డిపాజిట్ చేసి వడ్డీ పొందుతుంటారు. దాన్నే పింఛన్లా భావిస్తుంటారు. ఇలా ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల మొత్తం సీసీఎస్లో రూ.250 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతంలోంచి మినహాయించే 7 శాతం మొత్తం నెలకు రూ.25 కోట్లవుతుంది. దీన్ని ప్రతినెలా ఆర్టీసీ సీసీఎస్కు సరిగా చెల్లించలేకపోతోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీగా చెల్లించాల్సిన నెలవారీ మొత్తం రూ.2.5 కోట్లు చెల్లించడం సీసీఎస్కు కష్టంగా మారి.. నిలిపివేసింది. విశ్రాంత జీవితంలో చీకూచింతా లేకుండా గడపాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏడాది క్రితం ఇలాంటి సమస్యే ఏర్పడి కొన్ని నెలల పాటు వీరికి వడ్డీ అందలేదు. సజ్జనార్ ఎండీగా వచ్చిన తర్వాత సమస్య పరిష్కారమైంది. మళ్లీ ఇప్పుడు ఎదురుకావటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
రూ.110 కోట్ల ‘మైత్రీ ప్లాంటేషన్స్’ ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి మదుపరులను మోసగించిన కేసులో మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ.110 కోట్ల విలువైన 210 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీలైన శ్రీనక్షత్ర బిల్డర్స్–డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైత్రీ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థల డైరెక్టర్లు లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికపూడి బ్రహ్మారెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2013లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన 210 స్థిరాస్తుల్లో ఆంధ్రప్రదేశ్లో 196, తెలంగాణలో 13, కర్ణాటకలో ఒకటి ఉన్నాయి. మైత్రీ ప్లాంటేషన్స్–హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లక్కు కొండారెడ్డి, ఇతరులు నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి డిపాజిట్లు సేకరించారని ఏపీ పోలీసులు 2013లో 12 ఎఫ్ఐఆర్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టడంతో కుంభకోణం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. లక్కు కొండారెడ్డి, తదితరులు అధిక కమీషన్లు ఎరజూపి ఏజెంట్లను నియమించుకుని మరీ డిపాజిట్ల సేకరణ చేపట్టారు. మదుపరులకు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి ఏకంగా రూ.288.42 కోట్లను డిపాజిట్లుగా సేకరించారు. అనంతరం ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తమ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి మళ్లించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఈ కేసులో ఆస్తులను జప్తు చేసిన ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. -
‘‘పాన్’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..
రాను రాను పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్ లేదా ఆధార్ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్ / ఆధార్తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. - ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, డిపాజిట్దారు పాన్/ఆధార్ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్ చేసినా ఈ రూలు వర్తిస్తుంది. - ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్ నుంచి మనం చేసే విత్డ్రాయల్స్, అకౌంట్ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్ అయినది, నగదు విత్డ్రాయల్ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. - బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్ క్రెడిట్ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
సాక్షి, హైదరాబాద్: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్ కాంపిటెంట్ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్ లేల్యాండ్ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు. అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్రాజ్ అనిల్ కుమార్ అలియాస్ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్ వేలం పూర్త యిన విషయం తెలిసిందే. (చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? ) -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్ మాల్
-
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
ఫిక్స్డ్ డిపాజిట్లను వదలని కరోనా
కరోనా తగ్గిపోయినా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంకో సమస్యను కూడా కరోనా మోసుకొచ్చింది. అదే అప్పులు, ఆర్థిక సమస్యలు. ఖరీదైన కరోనా వైద్యం కోసం అందినకాడల్లా అప్పులు చేశారు. బంగారం లాంటి వస్తువులు తాకట్టు పెట్టారు. ఆస్తులు అమ్ముకున్నారు. దేశవ్యాప్తంగా ఏకంగా 5.5 కోట్ల మంది ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి పేదలుగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 159 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి. ఫిక్స్డ్పై కోవిడ్ ఎఫెక్ట్ ఈ ఏడాది జనవరి నుంచి మార్చి (గత ఆర్థిక సంవత్సరం 2020–2021) త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ ఈ డేటాను విడుదల చేసింది. 2018 ఏప్రిల్ – జూన్ తో 53 జిల్లాల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గిపోతే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు మూడు రెట్టు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 22 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గడం గమనార్హం. డిపాజిట్లు భారీగా తగ్గిన జిల్లాల్లో యూపీవే 23 ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 21, కర్ణాటక 16, మహారాష్ట్రలో 11 జిల్లాల్లో జనాలు ఫిక్స్ డ్ డిపాజిట్లను డ్రా చేసుకున్నారు. అయితే, అత్యధికంగా డిపాజిట్లను డ్రా చేసిన జిల్లాగా తమిళనాడులోని నాగపట్టణం నిలిచింది. అక్కడ 24 శాతం డిపాజిట్లను జనం బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు మనదగ్గర ఆర్బీఐ లెక్కల ప్రకారం భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గిపోయిన జిల్లాలు తెలంగాణలోని 4 , ఆంధ్రప్రదేశ్ లోని 2 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం రెండు వరుస త్రైమాసికాల్లో 15 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు తగ్గాయి. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లూ ఉన్నాయి. ఇందులోనూ భద్రాద్రి, జనగామ, కరీంనగర్ సహా దేశంలోని ఏడు జిల్లాల్లో వరుసగా మూడు త్రైమాసికాల పాటు డిపాజిట్లు తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. డబ్బులు డ్రా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక అవసరాలు పెరగడంతో డబ్బును బ్యాంకు నుంచి ప్రజలు ఉపసంహరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 13 నుంచి 2021 మే 21 మధ్య జనం వద్ద ఉన్న నగదులో 5.54 లక్షల కోట్ల పెరుగుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనం వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.28.62 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో సగానికి పైగా నగదు కేవలం కోవిడ్ వల్లనే ప్రజలు ఖర్చు చేయాల్సి వచ్చింది. చదవండి : Covid Crisis: రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం -
స్పెక్ట్రం బిడ్డింగ్కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు... కళకళ!
ముంబై: తానిచ్చే రుణాలపై రిటర్న్స్, తన వద్ద డిపాజిట్లపై చెల్లించే వడ్డీల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. రుణ నాణ్యత విషయంలోనూ వాటికి అవే సాటిగా కొనసాగుతున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ– కేర్ రేటింగ్స్ విడుదల చేసిన ఒక విశ్లేషణాత్మక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... -తానిచ్చే రుణాలపై 19.87 శాతం రిటర్న్స్ను చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొందుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఈ రేటు 8.16 శాతంగా ఉంది. ప్రైవేటు రంగ బ్యాంకులు 10.10 శాతం రిటర్న్స్ పొందుతుండగా, ఫారిన్ బ్యాంకింగ్కు 8.45 శాతం వడ్డీ వస్తోంది. -నిధుల సమీకరణ వ్యయం మాత్రం చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయంలో అత్యధికంగా 8.66 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నిధుల సమీకరణ భారం 4.92 శాతంగా ఉంటే, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల విషయంలో ఈ వడ్డీరేట్లు వరుసగా 5.41 శాతం, 3.73 శాతాలుగా ఉన్నాయి. -ఒక్క డిపాజిట్లపై ఎస్ఎఫ్బీలు చెల్లించే వడ్డీ 8.20 శాతం. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.96 శాతం వడ్డీని చెల్లిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 5.26 శాతం ఇస్తున్నాయి. ఫారిన్ బ్యాంకుల విషయంలో మరీ తక్కువగా 3.65 శాతంగా ఉంది. -ఒక్క అసెట్స్ చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రిటర్న్స్ మైనస్ 0.23 శాతంగా ఉంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఇది 0.51 శాతం ఉంటే, ఎస్ఎఫ్బీలు మాత్రం అత్యధికంగా 1.70 శాతం రిటరŠస్న్ ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీ రుణదాతలు 1.55 శాతం రిటర్న్స్ పొందుతున్నారు. నగదు, ప్రభుత్వ బాండ్లు, తనఖాలు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ఇంటర్ బ్యాంక్ రుణాలు అసెట్స్ విభాగం లోకి వస్తాయి. -ఈక్విటీ ఆదాయాలపై చెల్లింపుల విషయానికి వస్తే, 15 శాతంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మైనస్ 4.16 శాతంతో ఉంటే, ప్రైవేటు బ్యాంకింగ్ ఆదాయం 3.30 శాతంగా ఉంది. ఫారిన్స్ బ్యాంకింగ్ తమ ఇన్వెస్టర్లకు 8.76 శాతం చెల్లిస్తోంది. -చిన్న ఫైనాన్స్ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8.34 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శాతాలు వరుసగా 2.27 శాతం, 3.42 శాతం, 3.26 శాతాలుగా ఉన్నాయి. -బ్యాంకింగ్ ప్రమాణాల విషయంలోనూ ఇవి మెరుగైన స్థానంలో ఉన్నాయి. క్యాపిటల్ అడిక్వెసీ రేషియో 20.2 శాతంగా ఉంటే, ఎన్పీఏల భారం 1.9 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో క్యాపిటల్ అడిక్వెసీ వరుసగా 12.9 శాతం, 16.5 శాతం, 17.7 శాతంగా ఉన్నాయి. ఇక ఎన్పీఏల విషయంలో ఈ రేట్లు వరుసగా 10.3 శాతం, 5.5 శాతం, 2.3 శాతాలుగా ఉన్నాయి. 10 ఎస్ఎఫ్బీల క్రియాశీలక పాత్ర 2016 తరువాత 10 చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. రుణ లభ్యత సరిగా లేని రంగాలకు అలాగే చిన్న వ్యాపారాలు, రైతులకు సకాలంలో తగిన రుణ సౌలభ్యత కల్పించడం లక్ష్యంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ 10 ఎస్ఎఫ్బీల మొత్తం బ్యాలెన్స్ షీట్ 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1.33 లక్షల కోట్లు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో వీటి వాటా 0.7 శాతం. ఈ విషయంలో ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 58 శాతం వృద్ధి రేటు నమోదుకావడం గమనార్హం. మొత్తం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లో వృద్ధి 8.5 శాతం మాత్రమే. ఇక మొత్తం 1.33 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్లో రూ.5,151 కోట్లు మూలధనం. రూ.11,047 కోట్లు నిల్వలు. డిపాజిట్లు రూ.82,488 కోట్లు. వీటిలో టర్మ్ డిపాజిట్ల విలువ రూ.69,823 కోట్లు. రిటర్న్స్, చెల్లించే వడ్డీల విషయంలో అధిక ధర ఎందుకు ఉందన్న అంశాన్ని కూడా నివేదిక వివరించింది. ఈ బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో 60 శాతం ఏడాదికన్నా తక్కువ కాలానికి సంబంధించినవే. ఒకటి నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్లు 37.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇందుకు సంబంధించి శాతాలు వరుసగా 40.4 శాతం, 22.8 శాతాలుగా ఉన్నాయి. ఇక ఇచ్చే రుణాల విషయంలో ఏడాది కన్నా తక్కువ కాలానికి సంబంధించిన రుణాలు 38.1 శాతం. 1 నుంచి మూడేళ్ల మధ్య రుణాలు 42.4 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇవి వరుసగా 25.2 శాతం, 40.3 శాతాలుగా ఉన్నాయి. -
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్కు సానుకూలం: మూడీస్ సింగపూర్కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్కుమార్ తెలిపారు. -
ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది. ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ను ప్రకటించడంతో ఈ ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది. చదవండి : రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం మారని రేట్లు.. వృద్ధికి చర్యలు -
డీహెచ్ఎఫ్ఎల్ 4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్లకు ఆమోదం
ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్లను డిసెంబర్ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిందే..
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీవోఎం)ను ఏడాదిలోపు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. నిర్వహణను పర్యవేక్షించేందుకు నిపుణుల కలయికతో బీవోఎం ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. డైరెక్టర్ల బోర్డుకు ఇది అదనం. పీఎంసీ బ్యాంకు సంక్షోభం కారణంగా 9 లక్షల మంది డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తదనంతరం కోపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు సంబంధించి ఆర్బీఐ పలు దిద్దుబాటు చర్యలను అమల్లోకి తీసుకొస్తోంది. ‘‘అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు ప్రజల డిపాజిట్లను స్వీకరిస్తున్నందున, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో బ్యాంకింగ్ లావాదేవీలను బీవోఎం పర్యవేక్షిస్తూ, సరైన నిర్వహణ దిశగా డైరెక్టర్ల బోర్డుకు సాయం అందిస్తుందని తెలిపింది. -
బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?
బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్ను వెనక్కి తీసుకోవచ్చు. లిక్విడిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ వెసులుబాట్లే ఎఫ్డీల ఆదరణకు కారణమని చెప్పొచ్చు. కానీ, బ్యాంకు సంక్షోభంలో పడితే, మీ డిపాజిట్ పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి అనుగుణంగా దానిని వెంటనే వెనక్కి తీసుకోలేరు.! బ్యాంకు పరిస్థితులు చక్కబడిన తర్వాతే తీసుకునేందుకు అనుమతిస్తామంటే..? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ..! డిపాజిట్దారులకు ఉన్న రక్షణ కవచం ఏంటి? ఆర్బీఐకి ఉన్న అధికారాలు, పరిమితులు... ఇలాంటి వివరాలన్నీ మీ కోసం... తాజాగా ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు(పీఎంసీ)లో అవకతవకల గురించి వార్తల్లో చూసే ఉంటారు. మొండి బాకీలను ఈ బ్యాంకు తక్కువ చేసి చూపించింది. ఈ బ్యాంకు మొత్తం రుణ పోర్ట్ఫోలియో రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్లను ఒక్క హెచ్డీఐఎల్ ఖాతాకు ఇవ్వడమే కాదు... దాన్ని ఆర్బీఐకి తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు అమల్లో పెట్టింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. రెండు రోజుల తర్వాత రూ.10,000కు పెం చింది. వారం రోజుల తర్వాత తాజాగా రూ.25,000కు పెంచింది. దీంతో డిపాజిట్ దారుల్లో ఆందోళన పెరిగిపోయింది. బ్యాంకు శాఖల వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కిచ్చేయాలంటూ వారు డిమాండ్ చేయడం కూడా చూశాం. ఈ తరహా సందర్భాలు ఎదురైతే ఏంటన్న విషయమై ఖాతాదారులు, డిపాజిట్ దారు ల్లో అవగాహన తక్కువే. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ తరహా పరిస్థితులు దిక్కుతోచనీయవు. కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులపైనా ఆర్బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించేందుకు అధికారాలు ఉంటాయి. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బీమా కవరేజీ పరిధిలో ఉంటాయి. ప్రాథమిక సహకార సొసైటీలు మాత్రం దీని పరిధిలోకి రావు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా డీఐసీజీసీ కింద బీమా తీసుకోవాల్సి ఉంటుందని ‘మైమనీమంత్రా డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు రాజ్ఖోస్లా తెలిపారు. ‘‘ప్రతీ డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ. లక్ష బీమా ఉంటుంది. ఒకవేళ పీఎంసీ బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ.లక్ష లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లు పొందేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంటుంది’’ అని ఖోస్లా వివరించారు. అసలు డిపాజిట్, దానిపై వడ్డీ సహా మొత్తం రూ.లక్ష పరిహారమే డీఐసీజీసీ ద్వారా లభిస్తుంది. పైగా ఒక్కో ఖాతాదారునికి సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో ఉన్నా కానీ దక్కే పరిహారం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే. ఏ తరహా డిపాజిట్లకు రక్షణ? సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంటు, రికరింగ్ డిపాజిట్లు అన్నీ కూడా డీఐసీజీసీ పరిధిలో బీమా కవరేజీ కిందకు వస్తాయి. కాకపోతే విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్బ్యాంక్ డిపాజిట్లు, విదేశాల నుంచి స్వీకరించిన డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి రావు. ఒకే బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు డిపాజిట్లు ఉంటే..? అప్పుడు కూడా గరిష్టంగా రూ.లక్ష వరకే డీఐసీజీసీ కింద దక్కుతుంది. అదే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తికి డిపాజిట్లు ఉంటే మాత్రం అప్పుడు ప్రతీ బ్యాంకులోని డిపాజిట్లపై గరిష్టంగా రూ.లక్ష పొందొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐలో, పీఎన్బీలో ఒక వ్యక్తికి డిపాజిట్లు ఉంటే, అప్పుడు రెండు బ్యాంకుల్లోనూ బీమా కవరేజీ కింద గరిష్టంగా ఒక్కో రూ.లక్ష చొప్పున లభిస్తుంది. ఉమ్మడి ఖాతాలు అయితే... ఒక్కరి పేరు మీద (సింగిల్) లేదా ఉమ్మడి ఖాతాల (జాయింట్) విషయంలో కవరేజీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు రవికి తన పేరుతో ఒక సేవింగ్స్ ఖాతా ఉంది. అలాగే, భార్య పేరుతోనూ రవికి జాయింట్ ఖాతా ఉందనుకోండి. బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు డీఐసీజీసీ కింద రెండు ఖాతాలకూ బీమా కవరేజీ ఉంటుంది. సిప్లు, ఈసీఎస్ల పరిస్థితి..? బ్యాంకు సంక్షోభంలో పడి ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వస్తే... అప్పటికే మీ ఖాతా నుంచి రిజిస్టర్ అయి ఉన్న ఈసీఎస్లు, సిప్లు ఆగిపోయినట్టే. వాటికి సంబంధించిన మొత్తాలను మీ ఖాతా నుంచి డెబిట్ కావని రాజ్ఖోస్లా తెలిపారు. కనుక మీరు మరో ఖాతా నుంచి సిప్, ఈఎంఐలకు సంబంధించి ఈసీఎస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తలే కాపాడతాయి... పీఎంసీ బ్యాంకు అనుభవం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కోపరేటివ్ బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. అంటే రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీటిని ఆర్బీఐతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షిస్తుంటాయి. ‘‘కోఆపరేటివ్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల విషయంలో నిబంధనల పరంగా ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్బీఐ కఠినంగానే వ్యవహరించింది. కనుక వ్యక్తులు ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఆర్బీఐ ఆంక్షలతో నిధులు పొందలేని పరిస్థితి ఎదురవుతుంది’’అని ఖోస్లా సూచించారు. బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకుల ఆరోగ్య పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచడం ఎంతో అవసరమని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు అయితే ఇది ఇంకా అవసరం. బ్యాంకుకు సంబంధించి ఆస్తులపై రాబడులు (ఆర్వోఏ), నికర ఎన్పీఏల రేషియోను గమనించడం ద్వారా ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు అయినా కానీ, వ్యాపారులు అయినా కానీ ఒకే ఖాతాపై ఆధారపడకుండా, వేర్వేరు బ్యాంకుల్లో కనీసం రెండు ఖాతాల పరిధిలో తమ డిపాజిట్లను వేరు చేసుకోవడం ద్వారా ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లు : ఎస్బీఐ బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంకు ఆఫ్ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు షాకిచ్చింది. వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటును తగ్గించింది. 45 రోజుల -10 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను భారీగా కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు అన్ని కాలపరిమితి గత ఫిక్స్డ్ డిపాజిట్లపై రేటును తగ్గించింది. 2-3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. 3-5 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గింపు అనంతరం వడ్డీరేటు 6.60 శాతంగా ఉంది. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 46-179 రోజుల ఎఫ్డిలపై వడ్డీ రేటు మే 6.25 శాతం నుండి 5.75 శాతానికి తగ్గించింది. 180-210 కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీరేటు 6.25గా ఉంటుంది. 2 కోట్ల రూపాయలకు మించిన బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును తగ్గించింది. రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో చేపట్టనున్న పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీరేటు కోతకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తాజాగా ఇలాంటి సంకేతాలను అందించారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ మరో సారి వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని భావిస్తున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం. -
జన్ధన్ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్ధన్ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పీఎంజేడీవై పథకాన్ని మోదీ సర్కారు తొలిసారి కేంద్రంలో కొలువు దీరిన సంవత్సరం 2014 ఆగస్ట్ 28న ప్రారంభించిన విషయం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందించడమే దీని ఉద్దేశ్యం. ఇవన్నీ జీరో బ్యాలన్స్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుతోపాటు, బ్యాలన్స్ లేకపోయినా రూ.5 వేల ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్: డిపాజిట్లపై వడ్డీరేటు కోత
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ రివ్యూలో 25 పాయింట్ల రెపో రేట్ కట్ తరువాత దేశీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిప్ బ్యాంకు, కోటక్ మహీంద్ర , హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివిధ కాలపరిమితి గల డిపాజిట్లపై వినియోగదారులకు చెల్లించే వడ్డీరేటు స్వల్పంగా తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్ల కోసం ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై 10 -25 బిపిఎస్ మధ్య వడ్డీ రేట్లను తగ్గించింది. 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా, 390 రోజుల నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై కొత్త రేటు 7.10 శాతం నుండి 7 శాతానికి పడిపోయింది, 2-3 సంవత్సరాల డిపాజిట్లపై 20 బిపిఎస్ నుండి 7.3 శాతానికి తగ్గింది. యాక్సిస్ బ్యాంకు దేశీయ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ రూ .2 కోట్ల లోపు ఒక సంవత్సరం మెచ్యూరిటీలపై డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించామని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఉదాహరణకు, బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ సవరించిన రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసి, బిల్ల డిపాజిట్ కాలాన్ని ఆఫర్లో ఉన్న మొత్తం పదవీకాలం 20 నుండి 18నెలలకు తగ్గించింది. 18 నెలలు- 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు 7.10 శాతంగా ఉంది. గతంలో మూడు వేర్వేరు 391 రోజుల నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ 7.20 శాతంగా ఉంది. అదేవిధంగా, 2-3 సంవత్సరాల దేవిధంగా, 2-3 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లు ఇప్పుడు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించి ప్రస్తుతం 7శాత వడ్డీని చెల్లిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కూడా డిపాజట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఈ సవరించిన రేట్లు జూన్12నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 2కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై చెల్లించేవడ్డీరేటు 7.30శాతంగా ఉంది. 2-3 ఏళ్ల డిపాజిట్లపై 7.25 శాతానికి తగ్గించింది. 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది. -
మీకొక నామినీ కావాలి..?
ఎన్నో రకాల ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమనే అలవాటు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు ఆర్జించే ప్రతీ వ్యక్తి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో పెట్టుబడులు ఉంటుంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం వీటిని ఆశ్రయించే వారు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్ చేయడమనే కాకుండా, సంబంధిత వ్యక్తికి ప్రాణ ప్రమాదం జరిగితే పెట్టుబడులన్నీ కుటుంబానికి చెందేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పెట్టుబడి సాధనంలో నామినీ పేరును రిజిస్టర్ చేయడం లేదా విల్లు రాయడం... ఈ రెండింటిలో ఏదో ఒక్కటైనా తప్పనిసరిగా చేయడాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది... ఓ ఇన్వెస్టర్ తను మరణం సంభవిస్తే, తన పేరిట ఉన్న పెట్టుబడులను స్వీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఫలానా అంటూ వారి పేరును నమోదు చేయడమే నామినేషన్ . ఆర్థిక సేవల సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ, బీమా సంస్థలకు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఇది. నామినీ నమోదు చేయడం వల్ల పెట్టుబడులను వారి పేరిట బదిలీ చేయడం సులభతరం అవుతుంది. ఇన్వెస్టర్ మరణించిన తర్వాత వారి పేరిట ఉన్న పెట్టుబడులను నామినీగా ఉన్న వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ నమోదు చేసుకోకుండా, ఓ ఇన్వెస్టర్ మరణించినట్టయితే అప్పుడు వారసులు ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసుకునే వారు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, ఇన్వెస్టర్తో తనకున్న అనుబంధం (లీగర్ హేర్ సర్టిఫికెట్), తనకున్న హక్కులను రుజువు చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కువ సమయం, శ్రమతో కూడిన పని. ప్రతీ ఇన్వెస్టర్ నామినీ పేరును నమోదుతో పాటు, నిర్ణీత కాలానికి ఓసారి సమీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు... వివాహానికి పూర్వం బ్యాంకు ఖాతా తెరిచిన వారు, పెట్టుబడులు పెట్టిన వారు తమ తండ్రి లేదా తల్లి లేదా సోదరుల్లో ఒకరి పేరును నామినీగా ఇచ్చి ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత నామినీగా తన భార్యను చేర్చుకోవడం సరైన చర్య. మరో ప్రత్యామ్నాయంగా విల్లు రాసుకోవడం కూడా మంచిదే. తన తదనంతరం తన పేరిట ఉన్న పెట్టుబడులు, ఆస్తులు ఎవరికి ఎంత మేర చెందాలనేది విల్లులో స్పష్టం చేసినా సరిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... విల్లు రాసినట్టయితే, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన నామినేషన్ రద్దయినట్టే. షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం నామినేషన్కు ప్రాధాన్యం ఉంటుంది. భిన్న సాధనాల్లో నామినేషన్ , క్లెయిమ్ ప్రక్రియ వివరాలను పరిశీలిద్దాం... జీవిత బీమా కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల పాలవకుండా ఆదుకునే సాధనమే జీవిత బీమా. కనుక జీవిత బీమా పాలసీల్లో నామినీ పేరును నమోదు చేయడం ఎంతో అవసరం. ఎవరిని: పాలసీ హోల్డర్ మరణిస్తే బీమా పరిహారం ఎవరికి చెందాలని భావిస్తే వారి పేరును నామినీగా పేర్కొనాలి. సాధారణంగా వారసులు లేదా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను బీమా సంస్థ సూచిస్తుంది. రక్త సంబంధీకులను అయినా నామినీగా నమోదు చేయవచ్చు. రక్త సంబంధీకులు కాని వారిని నామినీగా నమోదు చేయడానికి అవకాశం లేదు. నామినీ ఎన్ఆర్ఐ అయినా నమోదుకు అనుమతి ఉంటుంది. కాకపోతే క్లెయిమ్ మొత్తాన్ని భారత్లోని బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ప్రక్రియ: నామినీ పూర్తి పేరు, వయసు, వారితో ఇన్వెస్టర్కు ఉన్న అనుబంధం వివరాలను బీమా పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా పేర్కొనవచ్చు. అప్పుడు విడిగా ఒక్కో నామినీకి ఎంత మొత్తం అనేది శాతం వారీగా ఆప్షన్ ఇవ్వాలి. పాలసీ కాల వ్యవధిలో నామినీని ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. చివరిగా ఇచ్చిన నామినేషనే వ్యాలిడేషన్ లో ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు ముగిసేలోపు క్లెయిమ్ దరఖాస్తు వస్తే బీమా సంస్థలు 120 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. మూడేళ్లు దాటితే 15 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారాన్ని పూర్తి చేస్తాయి. ఎవరికి: నామినీకి క్లెయిమ్ హక్కు ఉంటుంది. ఒకవేళ విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తులకే పరిహారం చెల్లిం స్తారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఉండాలంటే, నామినీగా, విల్లులోనూ ఒకే పేరును పేర్కొనడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు నామినీ ఆప్షన్ ఇవ్వాలి. అయితే, నామినేషన్తప్పనిసరేమీ కాదు. ఇన్వెస్టర్లు స్వీయ ప్రయోజనాల కోణంలోనే నామినీని తప్పనిసరిగా రికార్డు చేసుకోవడం అవసరం. ఎవరిని: ఫండ్స్లో పెట్టుబడులు కలిగిన వ్యక్తి ఎవరినైనా నామినీగా పేర్కొనవచ్చు. కాకపోతే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. మైనర్లనూ నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఎన్ర్ఐలను కూడా నామినీగా నమోదు చేసుకోవచ్చు. అయితే, సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్త, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్లను నామినీగాలు పేర్కొనరాదు. నమోదు ప్రక్రియ: పెట్టుబడులకు సంబంధించి తొలుత దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నామినేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా నామినీలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒక్కో నామినీకి మొత్తం విలువలో ఎంత మేర చెల్లించాలన్న శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ఎంతన్నది పేర్కొనకపోతే ఒకరికి మించి నామినీలు ఉంటే అప్పుడు అందరు నామినీలకు సమానంగా చెల్లిస్తారు. నామినీ పేరును పేర్కొంటూ దరఖాస్తుపై ఇన్వెస్టర్ సంతకం చేయాలి. జాయింట్ హోల్డర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే అందరి సంతకాలు అవసరం. ముఖ్యంగా ఫండ్స్లో ప్రతీ ఫోలియోకు విడిగా నామినేషన్ రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అన్నింటికీ ఒకటే వర్తించదు. క్లెయిమ్: నామినీ ఎవరైనా కానీ, ఇన్వెస్టర్ మరణించిన తర్వాత క్లెయిమ్ చేసుకునే మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసులకు అందించాల్సి ఉంటుంది. అందుకే వారసులనే నామినీగా పేర్కొనడం మంచిదనేది నిపుణుల మాట. ఈక్విటీ షేర్లు కంపెనీల చట్టం, వాటాదారులు తమ పేరిట నామినేషన్ నమోదుచేసుకునేందుకు అనుమతిస్తోంది. కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ సైతం నామినేట్ చేయవచ్చు. అయితే, వ్యక్తులనే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్తను నామినీగా నమోదు చేయడం కుదరదు. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా నమోదు చేయొచ్చు. నమోదు ప్రక్రియ: డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉంటే డీమ్యాట్ ఖాతాను నిర్వహించే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) నామినేషన్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలో నామినీ కోసం ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉంటుంది. అక్కడే నామినీ పేరు, ఫొటో, వయసు, ఈ మెయిల్ ఐడీ, అనుబంధం, బ్యాంకు ఖాతా, చిరునామా వివరాలు ఉంటాయి. ఖాతా ప్రారంభంలో నామినీ వివరాలను ఇవ్వని వారు ఆ తర్వాత ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లెయిమ్: ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లో నామినీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే వారి పేరిట డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. నామినేషన్ లేకపోతే సంబంధిత షేర్లను ఇన్వెస్టర్ వారసులకు అందించడం జరుగుతుంది. ఇన్వెస్టర్ నామినేషన్ తోపాటు విల్లు కూడా రాసి ఉంటే కేవలం నామినేషన్నే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు డిపాజిట్లు గతంలో అయితే నామినేషన్ను బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో ఖాతా ప్రారంభ సమయంలో, డిపాజిట్ సమయంలోనూ బ్యాంకు సిబ్బంది నామినేషన్ గురించి కస్టమర్లకు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్లేకుండానే ఖాతా తెరిచేందుకు, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినీ ఎవరిని?: వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు. అసోసియేట్, ట్రస్ట్, సొసైటీ లేదా ఇతర ఆర్గనైజేషన్ ఆఫీసుబేరర్ అయితే నామినీగా అవకాశం ఉండదు. ప్రక్రియ: నామినేషన్ నమోదు కోసం నామినీ పేరు, అనుబంధం, చిరునామా వివరాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు పాస్బుక్లో, అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్లో నామినేషన్ రిజిస్టర్డ్ అని పేర్కొనడం తప్పనిసరి. నామినీ నమోదు, మార్పులకు, రద్దుకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. క్లెయిమ్: ఖాతాదారుడు లేదా డిపాజిట్ దారుడు మరణిస్తే నామినీలకు బ్యాంకులు బ్యాలన్స్ను చెల్లిస్తాయి. డిపాజిట్దారుని వారుసుల తరఫున ట్రస్టీగానే నామినీ వ్యవహరించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్టు బ్యాంకులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీకి సంబంధించి కేవైసీ ఇతర ధ్రువీకరణలు కూడా అవసరం. నామినేషనన్ రిజిస్టర్ కాకపోతే, వారసులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అందుకు వారసత్వ ధ్రువీకణ పత్రం, డెత్ సర్టిఫికెట్వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి... బీమా పాలసీలు, మ్యూచువల్ఫండ్స్, షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో జాయింట్ అకౌంట్ హోల్డర్స్గా ఉంటే, అప్పుడు జాయింట్ హోల్డర్స్ అందరూ ఒకే సందర్భంలో మరణించినట్టయితేనే నామినేషన్ అమల్లోకి వస్తుంది. మైనర్ను నామినీగా నమోదు చేసేవారు, ఆ మైనర్ సంరక్షణ చూసే వారి పేరు వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా పాలసీలయితే నామినీ క్లెయిమ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు క్లెయిమ్ ఫామ్ను పూర్తి చేసి, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం(ఒరిజినల్), పాలసీ డాక్యుమెంట్ ఒరిజినల్ను జత చేయాలి. ఒకవేళ ప్రమాదంలో మరణించినట్టయితే ఎఫ్ఐఆర్/పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీ తనకు సంబంధించి కేవైసీ వివరాలను కూడా సమర్పించాలి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ క్లెయిమ్ కోసం ఇవే పత్రాలు అవసరం అవుతాయి. అదే షేర్లు అనుకుంటే, నామినీ అకౌంట్ క్లోజర్ ఫామ్(మరణించిన ఇన్వెస్టర్ అకౌంట్), ట్రాన్సమిషన్ రిక్వెస్ట్ (ఇన్వెస్టర్ పేరిట ఉన్న షేర్లను బదిలీ కోరుతూ), డెత్ సర్టిఫికెట్, క్లయింట్ మాస్టర్ రిపోర్ట్(డీమ్యాట్ ఖాతాకు సంబంధించి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, క్లెయిమ్ దాఖలు చేసే నామినీలు తమ డీమ్యాట్ ఖాతాను జాయింట్గా కలిగి ఉండరాదు. ఒకవేళ ఇన్వెస్టర్ నామినీని నమోదు చేసి లేకపోతే, ఇక్కడ పేర్కొన్న పత్రాలతోపాటు, వారసులు వారసత్వ సర్టిఫికెట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధ వారసుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ లేదా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మైనర్ అయితే, గార్డియన్ గా ఉన్న వారు నామినీ తరఫున ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలి. -
రుణాలు@ 5.15 లక్షల కోట్లు
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్ఎల్బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనరు, ఎస్బీఐ జీఎం ఉన్ మయ్యాతో పాటు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, జనరల్ మేనేజర్ ఎస్.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
డిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ!
న్యూఢిల్లీ: దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్ డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొంటుందని రేటింగ్ ఏజెన్సీ తాజా నివేదిక వివరించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, వ్యవస్థలో రుణ వృద్ధి 12.9 శాతం అయితే, అదే సమయంలో డిపాజిట్ల వృద్ధి రేటు 9.3 శాతం. డిపాజిట్ల సమీకరణకు పోటీ పరిస్థితి నెలకొనవచ్చని ఈ అంశం సూచిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2018 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికాన్ని చూస్తే, మొత్తం బ్యాంకింగ్ రుణవృద్ధి రేటు 8.4 శాతం అయితే, ఇదే కాలంలో డిపాజిట్ వృద్ధి రేటు 4.9 శాతం. అయితే ఒక్క ప్రైవేటు బ్యాంకులు రుణ వృద్ధి భారీగా 22 శాతం నమోదవుతుండడం గమనార్హం. దీనితో ప్రైవేటు రంగ బ్యాంకులు నిధుల సమీకరణలో భాగంగా డిపాజిట్ రేట్లను పెంచే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
పీఎఫ్ వడ్డీ రేట్లు 8.65 శాతానికి పెంపు
-
పీఎఫ్పై 8.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015–16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016–17లో 8.65 శాతానికి, అటుపై 2017–18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతాం. వారినీ ఒప్పిస్తాం‘ అని గంగ్వార్ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటునిస్తే.. ఈపీఎఫ్ వద్ద రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని అందుకే ఈ రేటును నిర్ణయించామని ఆయన చెప్పారు. అదే 8.7 శాతం ఇస్తే రూ.158 కోట్ల లోటు ఉంటుందని తెలియజేశారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని పెంచవచ్చంటూ అధికార వర్గాల నుంచి సంకేతాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్వో నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈపీఎఫ్వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు. పింఛను పెంపుపై నిర్ణయం వాయిదా... కనీస నెలవారీ పింఛనును రూ.2,000కు పెంచాలన్న ప్రతిపాదనపై నిర్ణయాన్ని మార్చిలో జరిగే తదుపరి సమావేశం దాకా వాయిదా వేసినట్లు ఈపీఎఫ్వో ట్రస్టీ పీజే బానాసురే తెలిపారు. కనీస నెలవారీ పింఛనును రెట్టింపు చేయాలంటే అదనంగా రూ.3,000 కోట్లు అవసరమవుతాయి. అందుకని ఆర్థిక శాఖ అనుమతిస్తే తప్ప దీనిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ పింఛను పథకం (పీఎంఎస్వైఎం) కింద అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీసం రూ.3,000 నెలవారీ పింఛను ఇస్తామంటూ ఇటీవల మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పీఎఫ్ చందాదారుల పింఛనును కూడా రెట్టింపు చేయాల్సి రానుంది. ప్రభుత్వం నిర్వహించే అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఒకే మొత్తం పింఛను ఉండాలని, అందుకే ఈపీఎఫ్వో చందాదారులకు కూడా పింఛనును రూ. 3,000 చేయాలని తాము కోరుతున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జనరల్ సెక్రటరీ వీర్జేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. -
రూ. 100 కే నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు ఎగువనున్న వారు) వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటికే బీపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు దిగువనున్న వారు) ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తుండగా దాన్ని యథావిధిగా కొనసాగించనుంది. ఇతరులు పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు ఇప్పటివరకు రూ. 6,000 డిపాజిట్ తీసుకుంటుండగా ఇంటి లోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం రూ. 10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ‘మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే డిపాజిట్ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మిషన్ భగీరథతో అందే శుద్దిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1.20 లక్షల ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందున మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడంలేదు. దీంతో 6.7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లభించలేదు. వీటికితోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్ తీసుకునేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం కేసీఆర్ అన్నారు. -
హెచ్డీఎఫ్సీ దీపావళి శుభవార్త
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేటును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. కోటి రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీంతో ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాల పరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. 3-5 సంవత్సరాల డిపాజిట్ల వడ్డీరేటు 7.25 శాతానికి, వార్షిక డిపాజిట్లపై అందించే రేటు 7.3 శాతానికి చేరింది. ఈ సవరించిన రేట్లు నిన్నటినుంచే అమల్లోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమ వార్షిక ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటు 8.20శాతం నుంచి 8.30శాతానికి చేరింది. ఈ సవరించిన వడ్డీరేటు నేటి(నవంబరు 7, బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. -
ష్.. గప్చిప్
పెనుగొండ : ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సుమారు కోటి రూపాయల డిపాజిట్ల గల్లంతుతో రైతులు, డిపాజిట్దారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా అధికారుల్లో ఉలుకూ.. పలుకూ లేదు. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ల గల్లంతుకు సంఘ అధ్యక్షుడు టీవీవీఎస్హెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి అండలూరి సత్య వెంకటే శ్వరరావులు ఇద్దరూ బాధ్యత వహించి తిరిగి సంఘానికి చెల్లించడానికి డైరెక్టర్ల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, సమావేశ సమయానికి సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు తండ్రికి వైద్యం అంటూ తిరుపతికి వెళ్లడంతో కార్యదర్శికి ఒత్తిడి పెరిగి భయంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పాఠకులకు విధితమే. డైరెక్టర్లందరూ ఏకతాటిపైకి వచ్చి అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువచ్చి బాండ్ పేపర్లపై హామీలు పొందారు. అయితే, అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నాలు, చర్యలు ప్రారంభం కాకపోవడం విశేషం. చర్యలు తీసుకొంటామంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన కార్యదర్శి అండలూరి సత్య వెంకటేశ్వరరావు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రైతులు మాత్రం సహకార సంఘం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని మునమర్రు, దేవ సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల గల్లంతుతో రైతులు కుదేలై ఉన్నారు. ములపర్రు సహకార సంఘం అదేబాటలో పయనించడంతో సహకార వ్యవస్థపై రైతులకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఈ తరుణంలోనైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడి రైతులకు అండగా నిలవకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ డిపాజిట్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలి కాగా కేవలం డిపాజిట్లు మాత్రమే కాకుండా, సహకార సంఘ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు రెన్యువల్, చెల్లింపులకు సహకార సంఘ రసీదులు ఇవ్వకుండా, తెల్లకాగితాలపై సంతకాలు చేసి ఇచ్చి రైతులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. రైతులందరికీ ఇదేవిధంగా రసీదులు ఇచ్చారన్నారు. ఎరువుల వ్యాపారంలోనూ ఇదే తంతు నిర్వహించారని తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు తక్షణం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
తప్పుడు ప్రచారం: అదంతా నల్లధనం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్నవార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం డబ్బు "చట్టవిరుద్ధం" కాదని పేర్కొన్నారు. స్విస్బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లపై తప్పుడు 'తప్పుడు ప్రచారం' జరుగుతోందని జైట్లీ శుక్రవారం తన ఫేస్బుక్ పోస్ట్లో రాశారు. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నల్లదనం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత క్రియాశీలకంగా లేవన్న అంచనాలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేసేవారు బేసిక్ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. తాజాగా స్విస్ బ్యాంకులో దాదాపు రూ.7000 కోట్ల వరకు పలువురు భారతీయులు పెట్టుబడులు పెట్టారన్నవార్తలపై ఆయన స్పందించారు. గతంతో పోల్చుకుంటే 50 శాతం వరకు నల్లధనం నిల్వలు స్విస్ బ్యాంకులో పెరిగాయని పలు పత్రికలు రాసిన వార్తల పట్ల జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారందరూ నల్లధనాన్ని దాచినట్లు కాదని ఆయన అన్నారు. అలాంటి అక్రమ లావాలదేవీలపై కఠినంగా వ్యవరిస్తామన్నారు. నల్లధనాన్ని దాచే ప్రతి ఒకరిపై కూడా తీవ్రస్థాయిలో పెనాల్టీ ఉంటుందని జైట్లీ తెలియజేశారు. స్విట్జర్లాండ్, భారత్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జనవరి 1, 2018 తేది నుండి ఇప్పటి వరకు అక్కడి బ్యాంకులలో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం మన దేశానికి అందుతుంది. అలాంటప్పుడు అక్కడ భారతీయులు పలు ఆర్థిక లావాదేవీలు జరిపినంత మాత్రాన.. వారు నల్లధనాన్ని దాచుకుంటున్నారని భావించనవసరం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తొలి అయిదు సంవత్సరాల కాలం పూర్తి అయ్యే నాటికి టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారి శాతం గణనీయంగా పెరగనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఆదాయ పన్ను దాఖలు చేసేవారి సంఖ్య 57శాతం పుంజుకుందన్నారు. గత ఏడాది ఆదాయ పన్నుల వసూళ్లు 18శాతం పెరిగాయనీ జైట్లీ పేర్కొన్నారు. కాగా 2017 డేటా ప్రకారం స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పెరిగి1.01 బిలియన్ డాలర్ల (సుమారు రూ .7,000 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే విదేశీయుల లావాదేవీలు 3 శాతం వరకు పెరిగి 1.46 ట్రిలియన్ స్విస్ ఫ్రాంకులు( సుమారు 100 లక్షల కోట్ల రూపాయలుగా) ఉన్నాయి. -
స్విస్లో మళ్లీ మనోళ్ల డిపాజిట్ల జోరు
-
స్విస్ మనీపై పియూష్ స్పందన
సాక్షి,న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పుంజుకోవడంపై ఆర్థికశాఖ ఇంచార్జ్గా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తొలిసారి స్పందించారు. ఈ మొత్తం డిపాజిట్లు నల్ల ధనమే అవుతుందని ఎలా భావిస్తామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ స్విస్ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సరాంతానికి తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు. స్విస్బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల మొత్తాన్ని నల్లధనమా, లేక అక్రమ లావాదేవీయా అనేది ఇపుడే నిర్ధారించలేమంటూ చెప్పొకొచ్చారు. స్విస్ ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు మొత్తం డేటాను అందజేస్తుందనీ, దాని ప్రకారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. . ఇందులో సుమారు 40 శాతం లిబరైజ్డ్ రెమిట్టెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) కారణంగా నెలకొన్న డిపాజిట్లేనని గోయల్ చెప్పారు. ఒక వ్యక్తి సంవత్సరానికి 2,50,000 డాలర్లు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించే ఎల్ఆర్ఎస్ పథకాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిందేనని గుర్తు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల మూలంగా స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. -
స్విస్లో మళ్లీ మనోళ్ల డిపాజిట్ల జోరు
జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన డిపాజిట్ల విలువ 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లకు చేరుకుంది. కేంద్రం చేపట్టిన నల్లధనం నియంత్రణ చర్యలతో మూడేళ్ల క్షీణత తర్వాత మళ్లీ డిపాజిట్లు పెరగడం ఆశ్చర్యకరమే. స్విస్ నేషనల్ బ్యాంకు (స్విట్జర్లాండ్లో కేంద్ర బ్యాంకు) గురువారం విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం... ఆ దేశంలోని బ్యాంకుల్లో విదేశీ క్లయింట్ల డిపాజిట్ల విలువ 3 శాతం పెరిగి 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్లకు చేరింది. అంటే మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2014లో 10 శాతం... 2015లో 50 శాతం... 2016లో 45 శాతం చొప్పున క్షీణించాయి. 2016లో డిపాజిట్లు రూ.4,500 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే 2017లో ఇవి 999 మిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరాయి. అంటే మన కరెన్సీలో రూ.6,891 కోట్లు. ఇక ట్రస్టీలు, వెల్త్ మేనేజర్ల ద్వారా కలిగి ఉన్న నిధులు రూ.112 కోట్లు. ఈ లెక్కన 2017లో డిపాజిట్లు 50 శాతం పెరిగినట్లు లెక్క. భారతీయులు ఇతర దేశాల్లోని సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో కలిగి ఉన్న డిపాజిట్ల గణాంకాలు ఇందులో కలవలేదు. 2006లో గరిష్టంగా నిధులు ఇక భారతీయుల నిధులు అధికంగా ఉన్న సంవత్సరం 2006. అప్పట్లో రూ.23,000 కోట్ల మేర భారతీయుల డిపాజిట్లు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే మూడుసార్లే భారతీయుల డిపాజిట్లు పెరిగాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం, 2017లో 50 శాతం. నల్లధనం నియంత్రణకు గాను సమాచార పరస్పర మార్పిడికి భారత్, స్విట్జర్లాండ్ మధ్య నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి గణంకాలివి. భారత్, ఇతర దేశాలతో సమాచార మార్పిడిని స్విట్జర్లాండ్ ఇప్పటికే ప్రారంభించింది కూడా. నల్లధనంపై భారత్ చేపడుతున్న చర్యల నేపథ్యంలో మరింత సహకారానికి కూడా అంగీకరించింది. అయితే, 2017కు ముందు మూడు సంవత్సరాల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గడానికి కారణం, నల్లధనంపై అంతర్జాతీయంగా కఠిన చర్యల కారణంగా ఇతర దేశాలకు మళ్లించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్విస్ బ్యాంకులకు లాభాలే లాభాలు స్విట్జర్లాండ్ బ్యాంకుల లాభాలు గతేడాది 25% పెరిగి 9.8 బిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరాయి. 2016లో లాభాలు సగం తగ్గి 7.9 బిలియన్ డాలర్లకు పడిపోయాక తిరిగి పుంజుకున్నాయి. మొత్తం డిపాజిట్లు 1% పెరిగి 1.8 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్లుగా ఉన్నాయి. ఇందులో 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్లు విదేశీయులవే. ముఖ్యంగా స్థానికుల డిపాజిట్లు 57.6 బిలియన్ ఫ్రాంక్ల మేర పెరిగాయి. మొత్తం 253 బ్యాంకుల్లో 229 లాభాల్లో నిలవగా, మిగిలినవి నష్టాలను ప్రకటించాయి. పెద్ద బ్యాంకులు తమ విదేశీ లావాదేవీలను స్విట్జర్లాండ్కు మళ్లించడం వృద్ధికి దోహదపడింది. -
చంద్రన్న‘పెళ్లి’ కానుక.. ఒక్క రూపాయే!
సాధారణంగా ఏదైనా సంక్షేమ పథకానికి ప్రభుత్వం నిధులు విదల్చకపోతే ఎవరైనా ఏమంటారు.పైసా కూడా విదల్చలేదు.ఇదేమి ప్రభుత్వమంటారు. కానీ చంద్రన్న పెళ్లి కానుక విషయంలో మాత్రం ఆ విమర్శ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి జంట ఖాతాలో సొమ్ములు జమ చేశారు. కానీ చెప్పినట్టుగా అర్హతను బట్టి కాదు.. అందరికి ఒకేలా.. అదీ ఎంతో తెలుసా..అక్షరాల ఒక్క రూపాయి. నిజంగా నిజం.ఇదేమిటి ఒక్క రూపాయి జమ చేయడం ఏమిటని ప్రశ్నిస్తే అబ్బే అదేం లేదు అకౌంట్ సరిగా ఉందో లేదో చెక్ చేయడానికే వేశాం.. త్వరలోనే మొత్తం ఒకేసారి జమ చేసేస్తాం అంటూ నమ్మబలుకుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక ఆదిలోనే అబాసు పాలవుతోంది. పథకం ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లి కానుక జమ చేయని పరిస్థితి నెలకొంది. విచిత్రమేమిటంటే విమర్శించడానికి వీల్లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో రూపాయి చొప్పున జమ చేశారు. మిగిలిన సొమ్ముల కోసం ఎప్పుడుపడతాయో తెరపై వేచి చూడండి అని ఊరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినా.. చంద్రన్న పెళ్లి కానుక...రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న అమలులోకి తీసుకొచ్చిన పథకం. ఇందుకోసం ప్రతి మండలానికి డ్వాక్రా సంఘాల నుంచి ముగ్గురు వివాహమిత్రలను నియమించారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్తో పాటు 1100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేసిన జంటల వివరాలను అప్లోడ్ చేశారు. వారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిని ప్రజాసాధికారిత సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చారు. గడిచిన మూడు నెలల్లో పెళ్లి కానుక కోసం 1323 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. బీసీ సామాజిక చెందానికి చెందిన 910, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 159, ఎస్టీలు 58, ముస్లీంలు ఏడుగురు, వికలాంగులు 29, ఇతరులు 12 మంది దరఖాస్తు చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న 29 మంది ఎస్సీ, 13 ఎస్టీ, 106 బీసీ జంటల నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో 1096 మందికి సంబంధించి పరిశీలన పూర్తి చేశారు. వీరిని అర్హులుగా గుర్తించి మంజూరుకు అప్లోడ్ చేశారు. కేటగిరీల వారీగా.. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలైతే రూ.50వేలు, బీసీలైతే రూ. 35వేలు, ముస్లింలకు రూ.50 వేలు ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులైతే ఏకులానికి చెందిన వారికైనా రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. 20 శాతం పెళ్లి నిశ్చయమైన రోజున..మిగిలిన 80శాతం పెళ్లిరోజున పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ముస్లిం జంటలకు రూ.3.50లక్షలు, ఎస్టీ జంటలకు రూ.29లక్షలు బీసీ జంటలకు 3.19 కోట్లు,ఎస్సీ జంటలకు రూ.63.60లక్షలు, వికలాంగ జంటలకు రూ.29లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.21.75లక్షలు, ఎస్టీలకు రూ.9.75లక్షలు, బీసీలకు రూ.79.50 లక్షలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన జంటలకు రూ.2.40లక్షలు జమ కావాల్సి ఉంది. ఇలా మొత్తమ్మీద జిల్లాలో గడిచిన మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రూ.5.57 కోట్లు జమ చేయాలి. అప్లోడ్ చేసి దాదాపు మూడునెలలు కావస్తున్నా ఏ ఒక్క జంటకు పెళ్లికానుక జమకాలేదు. దరఖాస్తు చేసుకున్న కొత్తజంటలు, వారి కుటుంబ సభ్యులు కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. మీ అకౌంట్లోకే నేరుగా సొమ్ములు జమవుతాయని చెబుతున్నారు. అర్హుల ఎంపిక విషయంలో వివాహ మిత్రలతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క రూపాయే జమ నిజమే ఒక్క మన జిల్లాకే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెళ్లికానుకకు తొలి విడత సొమ్ములు విడుదల చేయలేదు. టెస్టింగ్ కోసం అందరి ఖాతాలకు ఒక్క రూపాయి చొప్పున జమ చేశారు. త్వరలోనే డబ్బులు రిలీజ్ కాగానే అందరి అకౌంట్కు పూర్తి స్థాయిలో కానుక జమ అవుతుంది. కానుక విషయంలో ఎవరికి ఎలాంటి మామూళ్లు ఇవ్వనసరం లేదు. ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తే యాక్షన్ తీసుకుంటాం. –సత్యసాయి శ్రీనివాస్,పీడీ, డీఆర్డీఏ -
నోట్ల రద్దు.. షాకింగ్ రిపోర్ట్
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దుకు సంబంధించి దిగ్భ్రాంతికి గురిచేసే నివేదిక ఒకటి బయటపడింది. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా ఓ పిటిషన్ దాఖలు చేయగా.. విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చెందిన ఓ బ్యాంకులో రద్దైన నోట్లు భారీగా డిపాజిట్ అయినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి ‘ది వైర్’ పూర్తి కథనం ప్రచురించింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లు ఏ మేర జమ అయ్యాయో తెలపాలంటూ ముంబైకి చెందిన మనోరంజన్.. నాబార్డ్కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన నాబార్డ్ పూర్తి లెక్కలతోసహా వివరాలను అందించింది. ముఖ్యంగా గుజరాత్లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను స్వీకరించినట్లు వెల్లడైంది. అందులో ఒకటి అహ్మదాబాద్ డీసీసీబీ కాగా, రెండోది రాజ్కోట్ డీసీసీబీ. ఐదు రోజుల్లోనే... అహ్మదాబాద్ డీసీబీకి అమిత్ షా 2000 సంవత్సరంలో చైర్మన్గా వ్యవహరించారు. గతకొన్నేళ్లుగా డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు కూడా ఇచ్చారు. అయితే కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే రూ.745. 59 కోట్ల విలువైన నోట్లు ఏడీసీబీలో డిపాజిట్ అయ్యాయి. విషయం ఏంటంటే కొన్నిరోజులకే డీసీసీబీల ద్వారా అనేక మంది నల్లధనాన్ని వైట్గా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో నవంబర్ 14 నుంచి కేంద్రం డీసీసీబీల్లో నోట్ల డిపాజిట్ను నిలిపివేసింది. అయితే అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగిపోగా... ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు కూడా. 2017 మార్చి 31 నాటికి అహ్మదాబాద్ డీసీసీబీలో మొత్తం డిపాజిట్లు రూ. 5050 కోట్లు. ఇది రాష్ట్ర సహకార బ్యాంకు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎంతలా అంటే ఎస్సీబీలో డిపాజిట్లు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. మరోవైపు రాజ్కోట్ డీసీసీబీలో కూడా రూ. 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఈ బ్యాంకు చైర్మన్ అయిన జయేష్ భాయ్ విఠల్భాయ్ రదాదియా.. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా బడాబాబులకే లబ్ధి చేకూరిందన్నది తేటతెల్లమైందని మనోరంజన్ అంటున్నారు. -
కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోని ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కి అన్ని రాష్ట్రాల్లో నిరాశే మిగిలుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పోటీ చేసిన 29 స్థానాల్లో ఆప్ ఆభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. తమ పార్టీకి కన్నడ ప్రజల్లో మంచి ఆదరణ లభించిదని, దానిని ఓటింగ్గా మార్చుకోవడంలో తమ అభ్యర్ధులు విఫలమయ్యరని కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వీరెడ్డి తెలిపారు. శ్రావన్నగర్ నుంచి పోటీ చేసిన పృథ్వీ కేవలం 1861 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. శాంతి నగర్ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి రేణుక విశ్వనాధన్ ఒక్కరే నోటాకి పడిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధులు సాధించిన ఓటింగ్ శాతం కేవలం 0.2 మాత్రమే. 2017 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో ఆప్ విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆప్ పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసింది. ముఖ్యంగా పంజాబ్లో పాగా వేయాలనుకున్న అరవింద్ కేజ్రివాల్కి పంజాబ్ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలనుకున్న ఆప్ కేవలం 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తరువాత జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలను సాధించలేకపోయింది. గోవా, నాగాలాండ్, మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క రాష్ట్రంలో కూడా ఖాతా తెరవలేకపోయింది. -
బ్యాంకు డిపాజిట్లు తగ్గుతున్నాయ్!
న్యూఢిల్లీ: మోదీ సర్కారు కొలువు తీరాక బ్యాంకింగ్ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిపాజిట్లకు చిక్చొచ్చి పడుతోంది. 2017–18లో బ్యాంకు డిపాజిట్లలో పెద్దగా పెరుగుదల లేకపోవటం దీన్ని కళ్లకు కడుతోంది. ఈ సారి గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం... బ్యాంకుల్లోకి వెళ్లే డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, బీమా, ఇతర మార్గాలవైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ గణాంకాలను గమనిస్తే... బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ల వృద్ధి 2017–18 లో 6.7 శాతమే. 1963 తర్వాత ఇదే తక్కువ వృద్ధి. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకోవటమే కాక... తిరిగి బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గిందని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘డీమోనిటైజేషన్ (2016 నవంబర్) తర్వాత డిపాజిట్లు పెరిగాయి. అందుకే ఆ సంవత్సరం బ్యాంకు డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంది. అయితే, ఈ డిపాజిట్లన్నీ గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇది బ్యాంకు డిపాజిట్ల వృద్ధిపై ప్రభావం చూపించింది’’ అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. డీమోనిటైజేషన్ తర్వాత మార్పు 2016 నవంబర్–డిసెంబర్ నెలల్లో బ్యాంకుల్లోకి రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. చలామణి నుంచి రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమే దీనికి కారణం. దీంతో బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 15.8% వృద్ధితో రూ.108 లక్షల కోట్లకు చేరాయి. ఈ వృద్ధి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.114 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లడం వృద్ధి క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో రూ.21.36 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. 2017 మార్చి నాటికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.17.55 లక్షల కోట్లుగానే ఉంది. ఇక 2016 మార్చికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.12.33 లక్షల కోట్లే. అంటే నాటి నుంచి 2017 మార్చికి 42% పెరిగినట్టు అర్థమవుతోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లోనూ పెరుగుదల అధికంగానే ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ద్వారా మొదటి ప్రీమియం ఆదాయం రూ.1.93 లక్షల కోట్లకు చేరింది. ఇది 2016–17లో రూ.1.75 లక్షల కోట్లు, 2015–16లో రూ.1.38 లక్షల కోట్లుగానే ఉంది. -
ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు ఢమాల్!
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లోని డిపాజిట్లు తగ్గిపోతున్నాయి. ప్రజల్లో నెలకొన్న కొన్ని రకాల భయాల కారణంగా బ్యాంకులపై ఖాతాదారుల్లో నమ్మకం సడలుతోంది. గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు రూ.32,000 కోట్ల డిపాజిట్లను ఖాతాదారులు వెనక్కి తీసుకుని ఉండవచ్చునని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు భయానికి తోడు.. వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలతో బ్యాంకులు విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు డిపాజిట్లపై వడ్డీరేట్లు రోజురోజుకీ తగ్గిపోతుండడం, అవసరాలకు సొంత డబ్బు తీసుకోవాలన్నా నగదు కొరతతో బ్యాంకులు ఆంక్షలు పెడుతుండటంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. ప్రతీరోజు మా బ్యాంకు నుంచి సగటున రూ. 20 లక్షల వరకు విత్డ్రాయల్స్ ఉంటాయని, ఇందులో తిరిగి రూ.10 నుంచి 15 లక్షలు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చేవని, కానీ.. గత రెండు నెలలుగా బ్యాంకు నుంచి డబ్బులు బయటకు వెళ్లడమేగానీ ఒక్క రూపాయి కూడా వెనక్కి రావడంలేదని తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు అధికారి ఒకరు ప్రస్తుత బ్యాంకుల పరిస్థితిని కళ్లకుకట్టారు. అలాగే, గతంలో ప్రతీ బ్యాంకు శాఖకు సగటున రూ.10 లక్షల వరకు రెండు వేల నోట్లు వచ్చేవని, ఇప్పుడా సంఖ్య రూ.4 లక్షలకు పడిపోయిందని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లువల్ల డిపాజిట్లకు ఎటువంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో విపరీతంగా జరిగిన వ్యతిరేక ప్రచారంతో ప్రజలు ప్రభుత్వ మాటలను విశ్వసించడంలేదని వారు చెబుతున్నారు. ఈసారి వృద్ధి 3 శాతానికే పరిమితం.. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా డిపాజిట్లలో రెండంకెల వృద్ధిరేటు నమోదవుతూ వస్తోంది. పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది 2016–17లో అయితే ఏకంగా 20.43 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆ ఏడాది డిపాజిట్లు భారీగా పెరిగి రూ.2,62,556 కోట్లకు పెరిగాయి. కానీ, 2017–18లో డిపాజిట్ల వృద్ధిరేటు మూడు శాతానికి పరిమితమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా బ్యాంకుల ఆడిట్ పూర్తికాకపోవడంతో అధికారికంగా డిపాజిట్లు సంఖ్య రాలేదని, కానీ.. 8 నెలల సగటును పరిగణనలోకి తీసుకుంటే 3 శాతం వృద్ధితో రూ.2,70,432 కోట్లకు పరమితమవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు వివరిస్తున్నారు. ఇదే సమయంలో రుణాలు రూ.2.80 లక్షల కోట్లుకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో డిపాజిట్ల కంటే రుణాల మొత్తం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ డిపాజిట్ (సీడీ) రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా గడిచిన నాలుగేళ్లుగా ఈ నిష్పత్తి సగటున 107 శాతంగా ఉంటోంది. రాష్ట్రంలో డిపాజిట్ల రేట్లు తగ్గిపోవడంతో డిపాజిట్లపై దృష్టి సారించాల్సిందిగా ఆర్బీఐ మొన్నటి సమీక్షలో పేర్కొన్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారీగా డిపాజిట్లు, విత్డ్రాయల్స్ను పరిశీలిస్తే.. ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్బీఐ బ్రాంచీలలో మొత్తం రూ.5,450 కోట్లు డిపాజిట్లు ఉండగా, గత ఆర్ధిక సంవత్సరంలో రూ.150 కోట్ల మేర కొత్త డిపాజిట్లు వచ్చాయి. ఇతర బ్యాంకుల బ్రాంచీలలో మొత్తం రూ.9,700 కోట్లు డిపాజిట్లు ఉండగా, గత ఆర్ధిక సంవత్సరంలో రూ.3,100 కోట్లు కొత్త డిపాజిట్లు వచ్చాయి. విత్డ్రాలు విషయానికొస్తే.. ప్రస్తుత మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులలో కలిపి మొత్తం రూ.380 కోట్ల డిపాజిట్లు విత్డ్రా అయ్యాయి. వీటిలో ఎస్బీఐ నుంచి కేవలం రూ.60 కోట్లు కాగా.. ఇతర అన్ని బ్యాంకుల నుంచి రూ.320 కోట్ల డిపాజిట్లు విత్డ్రా అయ్యాయి. ♦ శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.500 కోట్ల మేర డిపాజిట్లను ఖాతాదారులు విత్డ్రా చేశారు. కేవలం ఎఫ్ఆర్డీఏ బిల్లుపై ఆందోళన నెలకొనడంతో ఖాతాదారులు తమ డిపాజిట్ల్లను వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, డిపాజిట్లపై సంవత్సరానికి రూ.10 వేలు వడ్డీ ఆదాయ రూపంలో వచ్చిన ఖాతాదారులకు 20 శాతం పన్ను విధించడం కూడా డిపాజిట్లు విత్డ్రా చేయడానికి ఒక కారణం. ఈ నాలుగు నెలల్లో డిపాజిట్లు చేసిన మొత్తం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. ♦ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం రోజు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు డిపాజిట్లు ఉంటే విత్డ్రాయల్స్ రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటున్నాయి. ముఖ్యంగా నెలన్నరగా బ్యాంకుల నుంచి ఏటీఎంల నుంచి విత్డ్రా అయిన రూ.2 వేల నోట్లు మళ్లీ బ్యాంకులకు తిరిగి రావటం లేదు. ముఖ్యంగా గడిచిన మూడు నెలల్లో బ్యాంకుల్లో డిపాజిట్లు పూర్తిగా తగ్గిపోయాయి. విత్డ్రాయల్స్ భారీగా పెరిగాయి. ♦ గుంటూరు జిల్లాలో ఎఫ్ఆర్బీఐ బిల్లు భయంతో ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను వెనక్కు తీసేసుకుంటున్నారు. 2017 అక్టోబరు నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రూ.25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది బ్యాంకుల్లో 15–17 శాతం డిపాజిట్లు పెరిగేవి. ఎఫ్ఆర్బీఐ బిల్లు భయంతో 10 శాతం మేర డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. దీంతో డిపాజిట్ల వృద్ధి రేటు తగ్గిపోయింది. ♦ తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది సెప్టెంబర్ వరకు రూ. 24,600 కోట్ల మేర డిపాజిట్లు జరగ్గా అది డిసెంబర్ నాటికి అది రూ. 25,500కోట్లకు చేరిందని, ఇప్పుడది రూ.26వేల కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. నగదు కొరతకు డిపాజిట్లు కారణం కాదని లీడ్ బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ♦ కర్నూలు జిల్లాలో 2017 మార్చి 31 నాటికి జిల్లాలో ఉన్న డిపాజిట్లు రూ.15,273 కోట్లు. ఇదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఆ డిపాజిట్లు రూ.14,723కు తగ్గిపోయాయి. అంటే.. రూ.550కోట్ల రూపాయల డిపాజిట్లను ఖాతాదారులు వాపస్ తీసుకున్నారు. ♦ వైఎస్సార్ జిల్లాలో గత మూడు నెలల్లో విత్డ్రాల సంఖ్య పెరుగుతుండగా.. డిపాజిట్లు చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. విత్డ్రాల రూపంలో మూడు నెలల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రజలు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోగా.. కేవలం రూ.25 కోట్లు మాత్రమే బ్యాంకులకు డిపాజిట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెడుతుందనే వార్తలతో ఈ పరిస్థితి నెలకొంది. ♦ విజయనగరం జిల్లాలో.. గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన ఆరు మాసాల్లో తొలి మూడు మాసాలకు రూ.7,956 కోట్ల మేరకు డిపాజిట్లు రాగా.. చివరి మూడు మాసాలలో రూ.300 కోట్ల వరకు తగ్గి కేవలం రూ.7,656 కోట్లు మాత్రమే డిపాజిట్లు లభించాయి. తగ్గిన రూ.300 కోట్ల డిపాజిట్లలో కనీసం 50 శాతం విత్డ్రాలే ఉంటాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. -
అగ్రిగోల్డ్ కొంపముంచిన హాయ్ల్యాండ్ రిసార్ట్
-
మైత్రి బాధితుల వివరాల సేకరణ
జంగారెడ్డిగూడెం: మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. డిపాటిజ్దారులను, ఏజెంట్లను విచారించి ఎవరు ఎంతెంత కట్టింది సేకరించారు. మంగళవారం సీఐడీ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటనారాయణ, సిబ్బంది ఎస్.సుధాకర్ జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. మైత్రి సంస్థ నాలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.250 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి కంపెనీ ఎత్తివేసినట్టు ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ తెలిపారు. రోజు, వారం, నెలవారీ వసూళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకున్నారని, వీరికి బాండ్లు అయితే ఇచ్చారు గాని తిరిగి డబ్బు చెల్లించలేదన్నారు. డిపాజిట్దారులకు భూమి ఇస్తామని నమ్మించి కంపెనీ ఎత్తివేశారన్నారు. ఒంగోలు కేంద్రంగా ఈ సంస్థ పనిచేసిందని, పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో, కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరంలో బ్రాంచ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ నాలుగు బ్రాంచ్లు ఎత్తివేయడంతో వీటిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్టు గుర్తించామని పేర్కొన్నారు. బాధితులూ బయటకు రండి మైత్రి సంస్థకు చెందిన ఆస్తుల వివరాలు ఎవరిౖMðనా తెలిస్తే సీఐడీకి సమాచారం ఇవ్వాలని వెంకటరమణ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 1,500 ఎకరాల భూములు ఉన్నాయని, వీటిలో కొన్ని అటాచ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే మైత్రి ప్రతినిధులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. ఏజెంట్లు, డిపాజిట్దారులు, బాధితులు ఎవరైనా ఉంటే సీఐడీకి సెల్: 98482 11477 నంబర్లో తెలియజేయాలని కోరా రు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాం తాల్లో సుమారు రూ.4 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారన్నారు. -
టీటీడీ డిపాజిట్లు భద్రమేనా!?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోట్లాది రూపాయల డిపాజిట్ల భద్రతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, టీటీడీ ఇన్వెస్ట్మెంట్ కమిటీ సూచనల మేరకు భద్రత విషయంలోనూ, బ్యాంకుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ చెబుతున్నప్పటికీ భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు, రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి టీటీడీకి చెందిన రూ.4 వేల కోట్ల డిపాజిట్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కట్టబెట్టారని సంచలన ఆరోపణ చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును పక్కన పెట్టి దానికంటే తక్కువ కొటేషన్ దాఖలు చేసిన ఆంధ్రా బ్యాంకుకు రూ.3 వేల కోట్లు, ప్రైవేటు బ్యాంకు ఇండస్కు రూ.1,000 కోట్లు డిపాజిట్లు ఇవ్వడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇందులో పెద్దఎత్తున అవకతవకలు ఉన్నాయని నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు బ్యాంకుకు రూ.1000 కోట్లు టీటీడీకి చెందిన రూ.10,589 కోట్ల డిపాజిట్లలో ఈ మార్చి 31 నాటికి రూ.4 వేల కోట్ల విలువైన డిపాజిట్ల కాలపరిమితి ముగిసింది. వీటిని తిరిగి డిపాజిట్ చేసే క్రమంలో టీటీడీ అధికారులు వివిధ బ్యాంకుల నుంచి వడ్డీ రేట్లు కోరుతూ సీల్డు బిడ్ కొటేషన్లు ఆహ్వానించారు. తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులు, నాలుగు ప్రైవేటు బ్యాంకులు సమర్పించిన సీల్డు బిడ్ కొటేషన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు (వడ్డీ 7.32 శాతం), ఇండస్ బ్యాంకులో రూ.1,000 కోట్లు (వడ్డీ 7.66 శాతం) డిపాజిట్లు చేశారు. దీంతో కొటేషన్ల స్వీకరణ, బ్యాంకుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును కాదని దానికంటే తక్కువ వడ్డీ కోట్ చేసిన బ్యాంకులకు డిపాజిట్లు అప్పగిం చారని నవీన్కుమార్రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతా పారదర్శకమే.. టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఈ విషయమై మీడియాకు వివరణ ఇస్తూ.. టీటీడీ నగదును డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. సీల్డు కొటేషన్లు పరిశీలించాకే బ్యాంకుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను బట్టి డిపాజిట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికితోడు టీటీడీ ఇన్వెస్ట్మెంట్ కమిటీ సూచనల మేరకు కొటేషన్లు ఆహ్వానించగా 9 జాతీయ బ్యాంకులు, 4 ప్రైవేటు బ్యాంకులు తాము చెల్లించే వడ్డీ రేటును వెల్లడిస్తూ కొటేషన్లు పంపాయన్నారు. అదనపు వడ్డీ రాబట్టేందుకు రివైజ్డ్ కొటేషన్ల అడిగామన్నారు. తుది కొటేషన్లు పరిశీలించాకే ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు, ఇండస్ బ్యాంకులో రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశామన్నారు. విజయా బ్యాంకు 7.27శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తామని చెప్పిందన్నారు. -
టీటీడీలో డిపాజిట్ల గోల్మాల్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్ల గోల్మాల్ బయటపబడింది. నిబంధనలకు విరుద్ధంగా రూ. 4 వేల కోట్లను టీటీడీ ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. సీల్డ్ కవర్ టెండర్లను ఆహ్వానించకుండా, అధికారులు ఫోన్తో సంప్రదింపులు జరిపారని సమాచారం. 7.66 శాతం వడ్డీ పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్లో వెయ్యి కోట్లు డిపాజిట్ చేశారు. అంతే కాకుండా 7.33 శాతం వడ్డీ ఇస్తామన్న విజయాబ్యాంక్ని కాదని 7.32 శాతానికి ఆంధ్రా బ్యాంకును ఒప్పించిన టీటీడీ అధికారులు రూ. 3 వేల కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో టీటీడీలో జరిగిన ఈ గోల్మాల్పై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఇంటిలెన్స్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. -
కొత్త పంథాలో నకిలీ నోట్ల మార్పిడి..
సాలూరు: జిల్లాలో దొంగనోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అసలు నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తూ కొందరు వరుస మోసాలకు పాల్పడుతుండగా.. ఇంకొందరు ఎంచక్కా అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞాణాన్ని వినియోగించుకుంటూ బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏటీఎంల వద్ద బ్యాంకులు ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మిషన్లు (సీడీఎం)ను మార్పిడికి సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ మిషన్లు దొంగ నోట్లను గుర్తించలేకపోవడంతో అక్రమార్కులు ఎంచక్కా అందులో నగదును జమ చేసుకుని, వేరే ఏటీఎంల ద్వారా తీసేస్తున్నారు. స్థానికంగా కొంతమంది వ్యాపారులు ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గతంలో దొంగనోట్ల చెలామణీలో కీలకపాత్ర వహించి ఒక్కసారిగా లక్షాధికారులైన వారే ఈతరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీడీఎం మిషన్లలో వేసినవి అసలు నోట్లా.. నకిలీవా అని బ్యాంక్ సిబ్బంది తెలుసుకోవచ్చు. కాని మిషన్లలో జమ చేస్తున్న నగదు బ్యాంక్ సిబ్బందికి చేరడం లేదు. అక్రమార్కులు సొమ్ము డిపాజిట్ చేస్తుంటే అదే మిషన్ నుంచి మిగతా ఖాతాదారులు డబ్బులు విత్డ్రా చేస్తుండడంలతో నకిలీ నోట్లు వారికి చేరిపోతున్నాయి. పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, హోమ్గార్డు ఇదిలా ఉండగా విజయనగరంలో జీపు డ్రైవర్గా పనిచేస్తున్న హోమ్గార్డుతో పాటు సాలూరు గొర్లెవీధికి చెందిన శకుంతల, పెదకుమ్మరివీధి సమీపంలోని చెరువుగట్టుకు చెందిన శ్యామల దొంగనోట్ల చలామణి చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని ఏఎస్పీ దీపికాపాటిల్ విచారణ నిమిత్తం శుక్రవారం విజయనగరానికి తరలించినట్లు తెలిసింది. దొంగనోట్లు తెచ్చుకుందామని వెళ్లి... ఇచ్చిన డబ్బులకు రెట్టింపు దొంగనోట్లు తెచ్చుకునే క్రమంలో ఇద్దరు మహిళలు పట్టుబడినట్లు సమాచారం. ఇదే తరహా వ్యవహారంలో హోమ్గార్డు కూడా చిక్కుకోవడంతో వీరిని పోలీసులు విచారిస్తున్నారు. -
ప్రజల డిపాజిట్ల మీద కన్ను
విశ్లేషణ లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారిలో చెల్లించలేకపోయినవారు 7 శాతం ఉండగా, కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగగొట్టిన వారు 93% ఉన్నారు. ఇప్పుడు వారి ప్రతినిధులే బ్యాంకుల ప్రైవేటీకరణ డిమాండ్ చేయటం విచిత్రం. ఈ బ్యాంకుల కుంభకోణాలన్నీ డిపాజిటర్ల, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి జరుగుతున్నవే. ఈ ఆర్థిక నేరాలన్నీ బ్యాంకుల అత్యున్నత అధికారులు రుణాల ఎగవేతదారులతో చేతులు కలుపడంవల్ల జరిగినవే. నోట్ల రద్దు కుంభకోణాన్ని భారత ప్రజలు ఇంకా మరచిపోలేదు. ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఆ చర్యను నల్లధనంపై ఆకస్మిక దాడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారాన్ని చాలా రహస్యంగా ఉంచినట్లు, మంత్రులకు సైతం తెలియదన్నట్లు ఒక విధమైన అభిప్రాయాన్ని కలిగించారు. కాని పెద్దనోట్ల కట్టలు, కట్టలు తెంచుకొని ప్రవహించినట్టు స్వయంగా అధికార పార్టీకే చెందిన శాసనసభ్యుడు ప్రకటించడం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్య ప్రజలు నోట్లు మార్చుకోవడానికి చేంతాడు లాంటి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. అనేక మంది ఆ క్యూలలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది బ్యాంకుల ఖాతాదారులు ఏటీయంల ద్వారా గాని, చెక్కుల ద్వారా గాని తాము దాచుకున్న ధనాన్ని పొందలేకపోతున్నారు. దీని ప్రభావం ఇంకా సగటుజీవిని పీడిస్తూనే ఉన్నది. నల్లధనం మాత్రం బయటపడలేదు. మొన్న హర్షద్ మెహతా, నిన్న మద్యం చక్రవర్తి విజయ్ మాల్యా కేవలం ఒకే ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్కు రూ. 7,000 కోట్లు ఎగగొడితే, ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాక్ నుంచి నీరవ్ మోదీ తదితర గణం రూ. 14,000 కోట్లు ఎగగొట్టిన సంగతి వెల్లడైంది. ఈ బ్యాంకులోని అనేక అవకతవకలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఈ కుంభకోణాలకు సామాన్య గుమాస్తాలను (చిరుద్యోగులను) బాధ్యులను చేయాలని చూస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారికి తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. పరిశ్రమాధిపతుల సంఘం సైతం కుంభకోణాల ఆరోపణలను గుమాస్తాల మీదకు ¯ð డుతున్నారు. గ్యారంటీలను ఇచ్చినప్పటికి, ఒక లక్ష రూపాయల రుణం పొందటం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. రిజర్వ్బ్యాంక్ ప్రతి బ్యాంక్ నిర్వహణ, నిర్వాకాలపై తనిఖీ చేయాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ తనిఖీ జరగడం లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందరి జాతకాలు ఉన్నాయి అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం, అధికారుల సంఘాలు ఒక పుస్తకాన్ని ప్రచురించాయి. ఎంతమంది కార్పొరేట్ దిగ్గజాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఏ బ్యాంకు నుండి ఎన్ని కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకొన్నారు? వారు ఎన్ని సంవత్సరాల నుండి ఎంత చెల్లించాల్సి ఉంది వంటి వివరాలు అందులో వెల్లడించారు. ఈ పారు బాకీలు దాదాపు రూ. 15 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. ఇవన్నీ నిరర్ధక ఆస్తులుగా ప్రకటించే అవకాశముంది. వీటితోపాటు కార్పొరేట్ దిగ్గజాలు ప్రతి సంవత్సరం ఆరులక్షల కోట్ల రూపాయల రాయితీలు పొందుతున్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలే కుంభకోణాలకు చిరుద్యోగులను బాధ్యులుగా చిత్రీకరిస్తూ, ఈ సమస్యకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణే శరణ్యమని వాదిస్తున్నారు. రుణాల ఎగవేతదారుల పట్ల కఠినవైఖరి అవలంబించని వారంతా ఈనాడు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకులకు రుణాల ఎగవేతదారుల పట్ల సౌమ్యంగా వ్యవహరించే అధికారులే ఈనాడు బ్యాంకులకు నష్టాలు తేవడానికి బాధ్యులు. ఆర్థిక శాఖ, రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం, ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్యాంకు నష్టాలకు, అవకతవకలకు వీరందరి మౌనమే ప్రధాన కారణం. వీరంతా సామాన్య క్లర్కుల మీద తప్పిదాలను నెట్టివేయడానికి అసలు కారణమేమిటంటే బ్యాంక్ ఉద్యోగుల తరచు ఆందోళనలలో ఇలాంటి అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని, వీరిని అరెస్టు చేయాలని, పాస్పోర్టులను రద్దు చేయాలని, కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేయటమే. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే ఒక్క బ్యాంకుకే రూ. 7,000 కోట్లు ఎగవేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బీజేపీ రాజ్యసభ సీటు కేటాయించడం. మాల్యా, నీరవ్ మోదీ, ఆయన సోదరునితో సహా కుటుంబం మొత్తం దేశ సరిహద్దులను సౌకర్యంగా దాటి పోవడం దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. నీరవ్ మోదీ అయితే, ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని ప్రభుత్వానికి సవాలు విసరడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. 2016 లోనే బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి నీరవ్ మోదీ బ్యాంకులకు రుణాలు ఎగగొట్టాడని, అతన్ని అరెస్టు చేయాలని, పాస్పోర్ట్ రద్దు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఫలి తం లేకపోయింది. నీరవ్ ఈ జనవరిలోనే దేశం వదిలి పారిపోవడంతోపాటు, అదే నెల 23–26 తేదీలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో నరేంద్ర మోదీతో గ్రూపు ఫొటోకు పోజు ఇవ్వడం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. చిరుద్యోగులను బలి చేస్తారా? కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవడానికి చిరుద్యోగులే ఈ కుంభకోణానికి కారణమని, అందుకే ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని గోలపెడుతున్నది. అదే నిజమైతే బ్యాంకుల జాతీయీకరణకంటే ముందు 200 ప్రైవేటు బ్యాంకులు ఎందుకు మూతపడ్డాయి? అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్తో సహా అనేక కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు మూత పడ్డాయి. అమెరికాలో సైతం, లేమాన్ బ్రదర్స్, మెర్రిల్ లించ్, ఏఐడి, ఫ్రెడ్డి, మాక్ ఫాన్న్మాక్, హెచ్బీఓఎస్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ మూత పడ్డాయి. ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులే. అందువల్ల అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడటానికి ఫెడరల్ గవర్నమెంట్ 236 బిలియన్ల (1 బిలియన్=100 కోట్లు) డాలర్లను వెచ్చించింది. ఈ అర్థశతాబ్దకాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అత్యద్భుతంగా అభివృద్ధి చెందాయి. దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం శాఖలు విస్తరించాయి. ఈ బ్యాంకులు సన్నకారు రైతాంగానికి, చిరువ్యాపారులకు రుణాలిచ్చి ఆదుకుంటే కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం ఉమ్మడిగా వీటిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకులు, రాజకీయ జోక్యంతో, రుణమేళాలు పెట్టి బ్యాంకులను దివాలా తీయించారని ఆరోపిస్తున్నారు. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారిలో చెల్లించలేకపోయినవారు 7శాతం ఉండగా, కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగగొట్టిన వారు 93% ఉన్నారు. ఇప్పుడు వారి ప్రతినిధులే బ్యాంకుల ప్రైవేటీకరణ డిమాండ్ చేయటం విచిత్రం. ఈ బ్యాంకుల కుంభకోణాలన్నీ డిపాజిటర్ల, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి జరుగుతున్నవే. ఈ ఆర్థిక నేరాలన్నీ బ్యాంకుల అత్యున్నత అధికారులు రుణాల ఎగవేతదారులతో చేతులు కలుపడంవల్ల జరిగినవే. ప్రభుత్వరంగ బ్యాంకులలో అప్పులు తీసుకునే వారికి 90 రోజుల గడువుతోనే అవగాహనా పత్రాలను అందజేస్తారు. బ్యాంక్ నియమావళికి విరుద్ధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజ మాన్యం 365 రోజులకు ఈ అవగాహనా పత్రాన్ని అందజేసింది. ఈ బ్యాం కులో ఈ తతంగం అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నది. నిర్ధారిత కాలంలో అప్పుతీసుకొన్న వ్యక్తి డబ్బు చెల్లించకపోతే విదేశాలలోని బ్యాంక్ శాఖలు తిరిగి అప్పు ఇచ్చి ఉండాల్సిందికాదు. రుణం తీసుకొన్న వారి ఆస్తుల విలువ మొత్తం రుణం మొత్తం కంటే ఎక్కువ ఉందా లేదా అనేది సాధారణమైన పరిజ్ఞానంతో అంచనా కడతారు. దానివల్ల బ్యాంకుకు ఏమైనా నష్టం వస్తుందా అనే అంశంపై అంచనా వేస్తారు. ఆస్తుల రహస్యమేమిటంటే బ్యాంక్లో జరిగే ఆర్థిక నేరాన్ని అరికడితే మేనేజర్కు వచ్చే ప్రోత్సాహకాలు లేవు. కాబట్టి మేనేజర్ అప్పు తీసుకొన్నవారితో చేతులు కలిపితే అతనికి ముడుపులు ముట్టడం ఖాయం. ఆ బిల్లుతో ప్రజల డిపాజిట్లకు ఎసరు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పైనాన్షియల్ రిజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లును ముందుకు తీసుకొస్తున్నది. ఇదొక మోసపూరిత నల్లచట్టం. పార్లమెం ట్లో చెవులు, కళ్లు మూసుకొని మందబలంతో ఒకసారి ఈ బిల్లును ఆమోదిస్తే పట్టపగలు డిపాజిటర్ల సొమ్మును ప్రభుత్వం లాగేసుకొని డిపాజిటర్లను వీధిన పడేస్తుంది. డిపాజిటర్ల సొమ్ము నుండి కార్పొరేట్లకు రుణాలను అందజేస్తే వీరు విదేశాలకు వెళ్లి తందనాలాడుతుంటే తద్వారా బ్యాంక్లకు నష్టం వాటిల్లితే, ఆ బ్యాంక్ డిపాజిటర్ల సొమ్ముతో, పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో ఆదుకోవడం ఈ బిల్లు లక్ష్యం. వీటినే ‘బేల్ ఇన్’ అని అంటారు. ఇలాంటి బ్యాంకులను ప్రభుత్వ ఖజానా నుండి గాని డిపాజిటర్ల సొమ్ము నుండి గాని ఆదుకోవడానికి ఈ బిల్లు అధికారాన్ని ఇస్తుంది. ప్రభుత్వమే చెల్లిస్తే ‘బేల్ అవుట్’ అంటారు. ఈ వార్త బయటికి పొక్కగానే బ్యాంకుల నుండి డిపాజిట్లు ఉపసంహరించుకోవటం చకచకా జరిగిపోయింది. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకొనే యంత్రాలలో డబ్బులు లేని పరిస్థితి దాపురించింది. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ, ఫైనాన్షియల్ బిల్లు కానీ జవాబు కానేరదు. కానీ ఇలాంటి రుణ ఎగవేతదారుల పాస్పోర్టులను రద్దు చేయడం, వాళ్ల ఆస్తులను జప్తు చేయడం జరగాల్సిందే. రుణ ఎగవేతదారులందరిని వెంటనే అరెస్టు చేయాలి. వారిని జైళ్లకు పంపి కఠినంగా శిక్షించాలి. విదేశాలకు పారిపోయిన వీరిని వెంటనే ఇంటర్పోల్ సహకారంతో వెనక్కి రప్పించాలి. వారికి సహకరించిన బ్యాంకు ఉన్నతాధికారులను, బాధ్యతలను విస్మరించిన వారందరిని కఠినంగా శిక్షించాల్సిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిరక్షించాలి. ప్రైవేటీకరణ డిమాండ్ను నిరాకరించాలి. సురవరం సుధాకరరెడ్డి వ్యాసకర్త గౌరవాధ్యక్షులు, ఎ.పి., తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్టుపార్టీ మాజీ ఎంపీ -
డిపాజిట్లపైనా అపోహలేనా?
అభిప్రాయం డిపాజిట్దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి కూడా మోదీపైన బురద చల్లటం ఏమిటి? వరదలో కొట్టుకుపోతున్న ప్పుడు తెడ్డు దొరికినా చాలనిపి స్తుంది. దాన్ని వాడుకుని ఎలా గైనా బయటపడాలనిపిస్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రమాదం నుంచి గట్టెక్కాలనే ఆతృత సహజం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక తప్పును పట్టాలని, దాన్ని అడ్డం పెట్టుకుని బతకాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది. భారీ మెజార్టీతో ఎన్నికల్లో ప్రజామోదం పొంది, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదురుచూపులు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన చారిత్రక చర్య దగ్గర్నుంచి, సరిహద్దు వెంబడి మెరుపుదాడుల వంటి సున్నితమైన చర్యల వరకు ప్రతిదాన్నీ వివాదాస్పదం చేయాలని, ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని చూసింది. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అభినందించాలని, ఆమోదించాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ, ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా చెడ్డగా చిత్రీకరించే ప్రతి పక్షాలు ఉండటం మాత్రం సరికాదు. నల్లధనం అదుపు చేసే క్రమంలో వ్యక్తిగత బంగారంపై పకడ్బందీ నిబంధ నల్ని ప్రభుత్వం రూపొందిస్తే.. మహిళల బంగారాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుందని పుకార్లు పుట్టించటం ఎంత వరకు సమంజసం? దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు చట్టం తీసుకురావాలని పార్లమెంటు ముందుకు వస్తే.. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే సొమ్మును వాడేసుకుంటారంటూ వదంతులు ప్రచారం చేయటం ఎంతవరకు సబబు? వ్యక్తిగత బంగారం విషయానికొస్తే.. పెళ్లైన మహిళ అరకిలో బంగారం తన వద్ద ఉంచుకోవచ్చు. వారసత్వంగా వచ్చినదైతే ఎంతైనా అట్టిపెట్టుకోవచ్చు. వారస త్వంగా వచ్చిన బంగారాన్ని పక్కనబెడితే దేశంలో సామాన్య మహిళలు ఎంతమందికి అరకిలో బంగారం ఉంటుంది? అక్రమంగా ఆస్తులు కూడబెట్టే వాళ్లని పట్టుకునేందుకు ఉద్దేశించిన ఇలాంటి చర్యలను కూడా ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి వాడుకున్నాయి. ఇప్పుడు బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, వాటిలో దాచుకున్న నగదు విషయానికొద్దాం. ప్రతిపక్షాల పుణ్యమా అని చాలామంది ఈ అపోహల్ని నమ్మి బ్యాంకుల ఎదుట బారులుతీరి మరీ తమ నగదును వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అంటే కొంతవరకూ ప్రతిపక్షాలు విజయవంతమైనట్లే. ఎఫ్ఆర్డీఐ బిల్లులోని ‘బెయిల్ ఇన్’ అనే అంశం పైనే ప్రతిపక్షాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తు న్నాయి. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే నగదులో రూ. లక్షకు మాత్రమే ప్రభుత్వం బీమా చేస్తుంది. ఆపై నగ దుకు బీమా సదుపాయం ఉండదు. అంటే.. ఒకవేళ బ్యాంకు దివాళా తీస్తే.. రూ. లక్ష లోపు ఉన్న డిపాజిట్ దారులందరికీ నగదు సర్దుబాటు చేసి, ఆ తర్వాత రూ. లక్షపైన మొత్తాలకు నగదును సమకూరుస్తారు. అయితే, ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా చేర్చలేదు. 1961లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ చట్టం చేసింది. డిపాజిట్దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం. దీనికి మోదీపైన బురద చల్లటం ఏమిటి? ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయటమే తప్ప నీరుగార్చటం కాదు. దీనికీ డిపాజిటర్ల డబ్బులకు, మరీ ముఖ్యంగా రూ. లక్ష నగదుపై బీమాకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. రూ. లక్ష నగదుపైన బీమా నిమిత్తం దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 3వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నాయి. అసలు 1961లో చట్టం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా దివాళా తీయటం కానీ, ఈ చట్టాన్ని ఉప యోగించటం కానీ జరగలేదు. అలాంటిది.. కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా కాంగ్రెస్ హయాంలో బ్యాంకులకు టోపీ పెట్టిన మోసగాళ్ల నేరాలకు, రూపాయి.. రూపాయి కూడబెట్టుకునే సామాన్య ప్రజల డిపాజిట్లకు ముడిపెట్టి, అపోహలు సృష్టించి, ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటం క్షమించరాని నేరం కాదా? కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్ని అపవాదుల్ని సృష్టించినా, అపోహల్ని ప్రచారం చేసినా, అమాయకుల్ని చేసి ప్రజల్ని రెచ్చగొట్టినా.. నిజం నిలకడమీద తెలుసుకుని నరేంద్ర మోదీ చర్యల్ని సమర్థిస్తోంది ఈ దేశం. నిజాయితీగా దేశం కోసం మోదీ పడుతున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలను తిప్పికొట్టి, బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొత్త సంవత్స రంలో, కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనైనా కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ఆశిద్దాం. పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన దిగ్గజ బ్యాంకు
సాక్షి, ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. భారీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బీపీఎస్ పాయింట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఇటీవల వడ్డీరేట్లపెంపును ప్రకటించిన నేపథ్యంలో పీఎన్బీ కూడా వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. దేశీయ బల్క్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 4.5 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. కోటి రూపాయలు, ఆపైన ఒక సంవత్సరం,అంతకుపైన టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీరేటును వర్తింప చేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ఒకప్రకటనలో తెలిపింది. కోటి రూపాయల డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు 100 బేసిస్ పాయింట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
ఆ కంపెనీల అకౌంట్లలో భారీగా డిపాజిట్లు
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం పన్ను ఎగవేతదారులపై, షెల్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా కూడా ఝళిపిస్తోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు షెల్ కంపెనీల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు వెల్లువెత్తినట్టు ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన డేటాలో తెలిసింది. ప్రభుత్వం డేటా ప్రకారం 5,800 షెల్ కంపెనీలను ఈ ఏడాది మొదట్లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల(ఆర్ఓసీ) నుంచి తొలగించారు. ఈ 5,800 కంపెనీలకు 13,140 అకౌంట్లు ఉన్నట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. కొన్ని కంపెనీలకు వందకు పైగా అకౌంట్లు ఉన్నాయని, ఒక కంపెనీ అయితే ఏకంగా 2134 అకౌంట్లను కలిగి ఉన్నట్టు బ్యాంకు డేటా షీటు పేర్కొంది. ఈ డేటా షీటు ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించినప్పుడు, ఈ కంపెనీల్లో బ్యాలెన్స్ రూ.22.05 కోట్లు ఉన్నట్టు తెలిసింది. నవంబర్9 నుంచి అంటే పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రద్దైన కంపెనీల్లో మొత్తం రూ.4,573.87 కోట్లు డిపాజిట్ అయ్యాయని, అంతే మొత్తంలో రూ.4,552 కోట్లు విత్డ్రా కూడా అయినట్టు వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దు అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న కొన్ని షెల్ కంపెనీల అకౌంట్లలో భారీ మొత్తంలో డిపాజిట్ అయి, భారీ మొత్తంలో విత్డ్రా అయినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. -
ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు
బేల(ఆదిలాబాద్): వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల బేలతోపాటు మశాల(బి), దహెగాం, మణియార్పూర్, గూడ, కాంఘర్పూర్, బెదోడ, సాంగిడి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బేలలోని సబ్ మార్కెట్ యార్డులో జైనథ్ మార్కెట్ కమిటీ నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతు సమితులు దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియలో భాగంగా భూ ప్రక్షాళన కోసం పనిచేస్తాయని తెలిపారు. వచ్చే ఖరీప్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం ఆర్థిక చేయూత అందించడానికి ప్రారంభించనున్న పెట్టుబడి పథకానికి పరిశీలన కోసం ఈ సమితులు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆడపడుచులకు ప్రేమతో చీరలు పంపిణీ చేస్తోందని, ఎక్కడో ఒకట్రెండు చీరలు సరిగా లేకపోతే.. ఆ చీరలను కాల్చడం, ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇష్టముంటేనే ఆడపడుచులు ఈ చీరలను తీసుకోవాలని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రావుత్ మనోహర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి ప్రమోద్రెడ్డి, నాయకులు మస్కే తేజ్రావు, బండి సుదర్శన్, నిపుంగే సంజయ్, జక్కుల మధుకర్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తన్వీర్ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
పొదుపులకు చేటుకాలం
దేశంలోని అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హఠాత్తుగా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటులో 50 బేసిస్ పాయింట్ల కోత వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోటి రూపాయలకంటే తక్కువ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. 42 కోట్ల ఖాతాదార్ల పునాదిగల అతి పెద్ద బ్యాంకైన ఎస్బీఐని ఇతర వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా పరిగణించడం పరిపాటి. కాబట్టి పలు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా ఇదే బాట పట్టవచ్చని భావిస్తున్నారు. ఎస్బీఐ ఖాతాదార్లలో కోటికి పైగా ఉన్న సేవింగ్స్ డిపాజిటర్లు ఎక్కువగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, దినసరి కూలీలు వంటి చిన్న పొదుపరులే. వారందరికీ ఇది మింగుడు పడని చేదు వార్తే. ఈ ఖాతాల్లోని రూ. 9 లక్షల కోట్ల డిపాజిట్ల వల్ల ఎస్బీఐ నికర వడ్డీ లబ్ధి (ఎన్ఐఎమ్) గణనీయంగా పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల భారీ ఎత్తున డిపాజిట్లు పెరిగాయి కాబట్టి, ద్రవ్యోల్బణం తగ్గి, నిజ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసు కున్నామని ఎస్బీఐ తన చర్యను సమర్థించుకుంది. 2011లో సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేటుపై నియంత్రణను ఎత్తివేసినప్పటి నుంచి సూత్ర రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆ స్వేచ్ఛ లభించిన మాట నిజమే. కానీ, వాణిజ్య బ్యాంకుల మధ్య పోటీ వల్ల చిన్న పొదుపుదార్లకు ఎక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశాన్ని కల్పిం చాలనే ఆ స్వేచ్ఛను కల్పించించారు. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల నిజ వడ్డీ రేట్లు పెరి గితే అది చిన్న పొదుపరులకు మేలు చేయాలనే లక్ష్యానికి తోడ్పడేదే తప్ప, అవాం ఛనీయమైనది కాదు. కానీ ఎస్బీఐ నిర్ణయం, నియంత్రణ ఎత్తివేత అసలు లక్ష్యానికే విరుద్ధమైనది, చిన్న పొదుపరుల ప్రయోజనాలను దెబ్బతీసేది. అది దీర్ఘ కాలంలో మొత్తం పొదుపును తగ్గించి ఆర్థిక వ్యవస్థపైన, పొదుపులను బ్యాంకింగ్ రంగానికి దూరంగా మరల్చి బ్యాంకులపైన ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. సేవింగ్స్ వడ్డీ రేటు తగ్గింపు వల్ల ఆ ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను ఖాతాదార్లు మ్యూచ్యువల్ ఫండ్స్వంటి లాభదాయక ద్రవ్య సాధనాల రూపంలోకి మళ్లిస్తారని, అది వారికి, ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని మరో సమర్థన కూడా వినవస్తోంది. విద్యావంతులలో సైతం ద్రవ్య మార్కెట్ అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న మన దేశంలో, ఈ చిన్న పొదుçపుల క్యాపిటలైజేషన్ పగటి కలే. నష్టభయంలేని జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్సెడ్ డిపాజిట్ల వంటి ప్రత్యామ్నాయాలపై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించారు. కాబట్టి చిన్న మదుపరులు ఈ కోతకు తలూపడం తప్ప గత్యంతరం ఉండకపోవచ్చు. పైగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా తక్కువగా ఉన్నా, 2018 నాటికి 4 శాతం పైకి చేరుతుందని ఆర్బీఐ స్వయంగా చెబుతోంది. కాగా, ద్రవోల్బణం తిరిగి రెక్కలు చాచక తప్పదని కొందరు ఆర్థిక నిపుణులు చేస్తున్న హెచ్చరికనూ తోసి పారేయలేం. అదే జరిగితే 3.5 శాతం వడ్డీ సైతం మటు మాయమై పోతుంది. అల్ప వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధికి సోపానాలనేదే యూపీఏ నుంచి నేటి ఎన్డీఏ వరకు ఆర్థిక మంత్రులందరి మాట. ఆగస్టు 2న ఆర్బీఐ, రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మరింత వడ్డీ కోతను ఆశిస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా ‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా అదుపులో ఉంది. ఇప్పట్లో చమురు ధరలు తిరిగి ఆకాశాన్ని చేరే అవకాశం లేదు. కాబట్టి ఏ ఆర్థిక మంత్రి అయినా వడ్డీ రేట్లు కోతను ఆశిస్తాడు’ అన్నారు. వడ్డీ రేట్లను నియంత్రించే ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ఎన్సీ) సోమవారం సమావేశంలో ఆ కోత తప్పిపోయిందిగానీ, అక్టోబర్లో తప్పదని వినవస్తోంది. అందువల్లనే వడ్డీ రేట్లు మరింత తగ్గే అకాశం ఉన్నదనే సహేతుకమైన ఆందోళన చిన్న మదుపర్లను బెంబేలెత్తిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు పొదుపరులు, పెన్షనర్లపై అదనపు పన్ను విధింపులా పనిచేసి, వారి అదాయాలకు కత్తెర వేస్తాయి. మరోలా చెప్పాలంటే పెద్ద వయస్కుల ఆదాయాలను తగ్గించడం ద్వారా సాపేక్షికంగా యువ పౌరులకు తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తాయి. అయినా, వస్తు వినియోగం, డిమాండు పెరిగి ఉత్పత్తికి, వృద్ధికి ప్రోత్సాహం లభి స్తుందని మన విధానకర్తల సిద్ధాంతం. రెండు చేదు వాస్తవాలు దీన్ని ఆచరణకు కొరగానిదని తేల్చాయి. నేటి ప్రపంచ మాంద్య పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఉత్పాదక మదుపులను గణనీయంగా పెంచడానికి బదులు నిల్వ ఉన్న సరుకుల గుట్టలను వదిలించుకోడానికే చాలా వరకు పరిమితం అవుతోంది. రెండవది, కొత్త మదుపులు ఉద్యోగాలు లేని వృద్ధికి మాత్రమే దోహ దం చేస్తున్నది. అయినా తక్కువ వడ్డీ రేట్ల సిద్ధాంతాన్నే నమ్ముకుని ఆర్బీఐ 2015 నుంచి ఇంతవరకు మొత్తం 175 శాతం బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిం చింది. ఈ తగ్గింపు గణనీయమైనదే. కానీ పారిశ్రామిక వృద్ధి చెప్పుకోదగినంతగా పుంజుకోకపోగా, జీడీపీలో వస్తుతయారీ రంగం వాటా 16 శాతం వద్ద ఈడిగిలపడి ఉంది. కార్పొరేట్ బ్యాంకు రుణాల్లో పెరుగుదల ఆశించినంతగా లేదంటే.. అందుకు కారణం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కాదు, వస్తు డిమాండు తక్కువగా ఉండటమే. ఉపాధి కల్పన, కొనుగోలు శక్తి పెంపుదల వంటి దీర్ఘకాలిక పరిష్కా రాలు తప్ప, వడ్డీ రేట్ల చిట్కా పనిచేయదని... 2008 ఆర్థిక మాంద్యం తదుపరి కాలపు అమెరికా తదితర అభివృద్ధిచెందిన దేశాల అనుభవం రుజువు చేసింది. అల్ప వడ్డీ రేట్లతో చిన్న పొదుపరులను, పెన్షనర్లను ఆర్థిక వృద్ధి కోసం త్యాగాలు చేయమనడం సమంజసమే అనుకున్నా, ఈ సిద్ధాంతం ఆచరణలో బెడిసి కొట్టక తప్పదు. అల్ప వడ్డీ రేట్లు పెట్టుబడి మదుపులపై చూపే ప్రభావం సంగతి ఎలా ఉన్నా, తక్కువ వడ్డీకి రుణాలిచ్చి, రుణ ఆధారిత వినియోగంతో స్తోమతకు మించిన జీవనశైలిని అనుభవించేలా చేస్తాయి. దీంతో నేటి యువత రుణ భారంతో కుంగడానికి ఎంతో కాలం పట్టదు. ఎలాగో నెట్టుకు వచ్చినా, వయోభారంతో పాటూ రుణ భారాన్ని మోస్తూ వృద్ధాప్యంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఎలాంటి సామాజిక సంక్షేమ రక్షణ లేని మన దేశంలో ఇది ఎలాంటి దుస్థితో చెప్పనవసరం లేదు. అయినా వడ్డీ రేట్ల తగ్గింపు మంత్రం పఠిస్తూనే ఉందామా? -
మరో 5.56 లక్షల మందిపై ఐటీ శాఖ దృష్టి
♦ నోట్ల రద్దు తర్వాత భారీ డిపాజిట్లు ♦ ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) అనంతరం గత పన్నుల ప్రొఫైల్తో పొంతన లేకుండా భారీ స్థాయిలో నగదు డిపాజిట్లు చేసిన మరో 5.56 లక్షల మంది వ్యక్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. పన్నుల చెల్లింపునకు సంబంధించి సదరు వ్యక్తుల గత చరిత్ర, డీమోనిటైజేషన్ తర్వాత చేసిన డిపాజిట్ల సరళికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని గుర్తించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ వారికి ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపుతున్నట్లు పేర్కొంది. నల్లధనం చలామణీని అరికట్టే దిశగా ఏప్రిల్లో ప్రారంభించిన ’ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశ కింద ఆదాయ పన్నుశాఖ వీరిని గుర్తించింది. క్లీన్ మనీ తొలి దశలో ఈ–వెరిఫికేషన్ కోసం తమ బ్యాంకు ఖాతాలన్నింటి వివరాలు వెల్లడించని మరో 1.04 లక్షల మందిని కూడా గుర్తించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31న ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో.. భారీ డిపాజిట్లు చేసిన 17.92 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఈ–వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా.. 9.72 లక్షల మంది వ్యక్తులు తమ వివరణను ఆన్లైన్లో సమర్పించారు. -
స్విస్ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు వివిధ చర్యలు తీసుకోవడంతోపాటు విదేశాల్లో దాస్తున్న నల్లడబ్బును కూడా నియంత్రించేందుకు ఆయా దేశాలతో పాత చట్టాలను బలోపేతం చేసుకోవడం, కొత్త చట్టాలను తీసుకురావడం మంచి ఫలితాలనిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక జీఎస్టీ ప్రారంభోత్సవం రోజున (జూలై 1న) చెప్పారు. స్విస్ బ్యాంక్లో 2016 సంవత్సరానికి భారతీయుల డిపాజిట్లు అంతకుముందు సంవత్సరం కన్నా సగానికి సగం పడిపోవడమే అందుకు ఉదాహరణగా చూపారు. 2015 సంవత్సరంలో స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 8,135 కోట్ల రూపాయలు ఉండగా, 2016, జూన్ నాటికి 4,482 కోట్ల రూపాయలకు పడిపోయాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే స్విస్ బ్యాంక్లో మన భారతీయుల డిపాజిట్లు తగ్గాయా? ఏ ఏడాది నుంచి డిపాజిట్లు తగ్గుతున్నాయి? దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమైనా ఉందా? తగ్గటానికి ఇతరత్రా కారణాలు ఇంకేవైనా ఉన్నాయా? స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన భారతీయ డిపాజిట్లు 2016 జూన్ నెల నాటివి. అదే సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసినందున వాటి ప్రభావం ఉండే అవకాశమే లేదు. ఇక స్విట్జర్లాండ్ ఆటోమేటిక్గా ప్రతి ఏటా భారత ప్రభుత్వానికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్ల వివరాలను అందుజేసేందుకు ఆ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వానికి 2016, నవంబర్ 22న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. పైగా ఈ ఒప్పందంలో పెద్ద మెలిక ఉంది. 2018, సెప్టెంబర్ నెలకు ముందున్న బ్యాంకు డిపాజిట్ వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదు. 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే, అది అప్పటికున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను అందజేస్తుంది. అంటే మొదటిసారిగా ఖాతా వివరాలు 2019, సెప్టెంబర్ నెలలో మాత్రమే భారత్కు అందుతాయి. డిపాజిట్దారుల పేర్లను ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయమన్న షరతుతోనే స్విస్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. పైగా ఇలాంటి ఒప్పందం స్విట్జర్లాండ్తో ఒక్క భారత్ దేశమే కాదు. మొత్తం 40 దేశాలు చేసుకున్నాయి. 2016, జూన్ నాటికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్లు 4,482 రూపాయలకు పడిపోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకు సంబంధం లేదు. మరి డిపాజిట్లు ఎందుకు పడిపోతున్నాయి. గతంలో 2012లో ఒక్కసారి పడిపోగా ఆ తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాల్లో వరుసగా భారతీయుల డిపాజిట్లు పడిపోతూ వస్తున్నాయి. పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ సంస్థ ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్’ 2014లోనే స్విస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంపై భారత్ సహా 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ 50 దేశాలకు చెందిన ఖాతాదారుల లావాదేవీల వివరాలను స్విస్ బ్యాంక్ ఆయా దేశాలకు అందజేయాల్సి ఉంటుందని ఆ సంస్థ హెడ్ మోనికా భాటియా తెలిపారు. ఆ ఒప్పందం ప్రభావం వల్లనే భారతీయుల డిపాజిట్లు సగానికి సగం తగ్గి ఉంటాయని ఆర్థిక నిపుణుల భావిస్తున్నారు. -
డిపాజిట్లపై ఆర్బీఐ హెచ్చరిక
హైదరాబాద్: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లను స్వీకరించ వద్దని రిజర్వు బ్యాంకు సహకార సంఘాలను హెచ్చరించింది. అలాగే సహకార సంఘాలలో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుండి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. కొన్ని సహకార సంఘాలు / ప్రాధమిక సహకార క్రెడిట్ సొసైటీలు .. సభ్యులు కానివారు / నామినల్ సభ్యులు / అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నారని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిపై ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, ఆర్ బిఐ (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) శ్రీ ఆర్. సుబ్రమణియన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సహకార సంస్థలకు, బ్యాంకింగ్ వ్యాపారము చేయడానికి, రిజర్వు బ్యాంకు బి.ఆర్. యాక్ట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949) అనుసరించి ఎటువంటి లైసెన్స్ ను జారీ చేయలేదని, అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇంటువంటి సహకార సంఘాలలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్ లేదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి, సహకార సంఘాలతో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆర్. సుబ్రమణియన్ కోరారు. -
డిపాజిట్లు రాబట్టుకునేందుకు క్లైమ్ చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, ఆదోనిలో బ్రాంచీలు కలిగిన సమృధా జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పూణే మహారాష్ట్ర సంఘాన్ని మూసివేయుటకు న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ లిక్విడేటర్ను నియమించిందని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ సంఘంలో సభ్యులు ఎవరైనా డిపాజిట్లు చేసి ఉంటే వాటిని రాబట్టుకునేందుకు క్లయిమ్లు చేసుకోవచ్చని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. లిక్విడేటర్, సమృధా జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ , ఆఫీసు నెంబరు 502, 4వ అంతస్తు, ప్రాన్ పరిటిహైట్స్, సీటీఎస్ నంబరు 6769 మిత్రమండల్ చౌక్ ,పార్వాటి, పూణే మహారాష్ట్ర చిరునామాకు క్లయిమ్లు పంపుకోవాలని డీసీఓ సూచించారు. -
గుండెపోటుతో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
ప్యాపిలి : జలదుర్గం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ శ్రీనివాసులు (53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. 2009 నుంచి అగ్రిగోల్డ్ ఏజెంట్గా కొనసాగుతున్న ఆయన జలదుర్గం గ్రామంతో పాటు, పరిసర గ్రామాల వద్ద దాదాపు 100 మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం వివాదస్పదంగా మారడంతో డిపాజిట్లు చేసినవారు ఏజెంట్ వద్దకు వచ్చి తమ డబ్బు చెల్లించాల్సిందిగా ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిపాజిట్లు చేసిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం ఇంటివద్దే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. మృతుడికి భార్య సుగుణమ్మ, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉషారాణి ఉన్నారు. -
ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు
జన్ధన్ అకౌంట్లలో నెలకొన్న విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయింది. ఈ ఖాతాల్లోకి దాదాపు వెయ్యి కోట్ల మేర డిపాజిట్లు వచ్చి పడి ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి ఖాతాల్లో నగదు రూ.63,971.38 కోట్లగా నమోదైంది. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించబడిన ఈ అకౌంట్లలో మార్చి నెలలో నికర బ్యాలెన్స్ రూ.62,972.42 కోట్లగా ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ 7 వరకు ఈ అకౌంట్లలో డిపాజిట్లు రికార్డుస్థాయిల్లో నమోదయ్యాయి. అప్పడు రూ.74,610 కోట్లు వచ్చిచేరాయి. అనంతరం జన్ధన్ ఖాతాలపై కూడా అధికారులు తనిఖీలు విస్తృతంగా జరుపగా.. డిపాజిట్లు కొంతమేర క్షీణించాయి. ఈ బ్యాంకు అకౌంట్లను దుర్వినియోగానికి వాడితే, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రబుత్వం హెచ్చరించింది. ఈ అకౌంట్లలో నగదు డిపాజిట్ పరిమితిని కూడా రూ.50వేలుగానే నిర్దేశించింది. రద్దయిన పెద్ద నోట్లను జీరో అకౌంట్ ఖాతాల్లో జమచేసి, పన్నుల నుంచి తప్పించుకుంటున్నారని విచారణ సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ హెచ్చరికలతో ఆ అకౌంట్లలో డబ్బు భారీగా విత్ డ్రా కూడా అయింది. ప్రస్తుతం విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయి, మళ్లీ డిపాజిట్లు పెరిగాయి. -
రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్
న్యూడిల్లీ: ఆదాయ పన్ను శాఖ సీనియర్ సిటిజన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీమానిటైజేషన్ తరువాత కాలంలో 70 ఏళ్లపైబడిన వారు చేసిన రూ.5లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి పరిశీలన చేపట్టబోమని ఐటీ శాఖ ప్రకటించింది. అయితే రూ.2. 5 లక్షలకు మించిన ఇతర వ్యక్తిగత డిపాజిట్లపై విచారణ లేదా పరిశీలన ఎప్పటిలాగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు తరువాత 70సం.రాల వయసు పైబడిన వారు చేసిన డిపాజిట్లపై వెరిఫికేషన్ చేపట్టబోమని బుధవారం వెల్లడించింది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చింది. నవంబర్ 8 -డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలోని డిపాజిట్ల ధృవీకరణకు చాలా స్పష్టమైన మార్గాలను చేపట్టామని అయితే రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కర్నీ ఇబ్బంది పెట్టబోమని స్పష్టంచేసింది. కేవలం పరిశీలన మాత్రమే చేయనున్నట్టు సీనియర్ ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే 70 సం.రాల లోపు వ్యక్తులు రూ. 2.5 నుంచి రూ. 5 లక్షలవరకు చేసిన డిపాజిట్లపై ఆదాయ పన్నుశాఖ వెబ్ సైట్ లో ఆదాయ ఆధార వివరాలను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. అక్కడితో వెరిఫికేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ డిపాజిటర్ ఈ వివరాలను సమర్పించకపోయినా..లేదా ఆదాయ వివరాలతో సరిపోలకపోయినా, అనుమానాస్పదంగా అనిపించినా ఐటీ శాఖ తదుపరి ఇ వెరిఫికేషన్ కు పేర్కొన్నారు. దీనికి మించి ఎలాంటి విచారణ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉండబోదని స్పష్టం చేవారు. కాగా అనుమానాస్పద ఖాతాల పరిశీలనకు, నల్లధనం ఏరివేతకు గాను ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన 18 లక్షల మందిని వివరాలు కోరుతూ ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్ను ఆదాయపన్ను శాఖ పంపింది. వీరిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా బదులిచ్చారు. డీమోనిటైజేషన్ తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ అయిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింన సంగతి తెలిసిందే. -
ఐటీ వారికి మరో అవకాశమిచ్చింది
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ డిపాజిట్లపై ఫిబ్రవరి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ తేదీలను ప్రభుత్వం ప్రస్తుతం పొడిగించింది. నగదు డిపాజిట్లపై అసెసీలు అందించాల్సిన వివరాల తేదీలను మరో ఐదు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ''నగదు డిపాజిట్లపై ఆన్లైన్ స్పందనలు తెలిపే టైమ్ లిమిట్స్ను పొడిగిస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ మనీపై 2017 ఫిబ్రవరి 15 వరకు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు'' అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. జనవరి 31న ఆదాయపు పన్ను శాఖ ' ఆపరేషన్ క్లీన్ మనీ' ని ప్రారంభించింది. దీని కింద పెద్ద నోట్ల రద్దు అనంతరం నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.5లక్షలకు పైబడిన అనుమానస్పద డిపాజిట్లపై రూ.18 లక్షల మంది అసెసీలకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా వివిధ ప్రశ్నలను ఆదాయపు పన్నుశాఖ సంధించింది. వీరిని ఐటీ డిపార్ట్మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్లో సమాధానాలు తెలుపాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల నుంచి రూ.80 లక్షల వరకున్న డేటాను, రూ.80 లక్షలకు పైనున్న డేటాను ప్రభుత్వం విభజించింది. నగదు డిపాజిట్ల డేటానే, అసెసీ ప్రొఫైల్స్తో ఆదాయపు పన్ను శాఖ సరిపోలుస్తూ... వాటిలో అనుమానస్పద డిపాజిట్లు ఏమైనా తేలితే వారికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తోంది. -
13 లక్షల ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్లను వెలికి తీసే చర్యల్ని వేగవంతం చేసింది. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల భారీ డిపాజిట్లను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా మరింత చురుగ్గా కదులుతోంది. 18 లక్షల ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్ము రూ.4.7లక్షల కోట్లుగా తేల్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగింది.ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్ఎమ్మెస్లు, ఈ మెయిల్స్ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్ చంద్ర గురువారం వెల్లడించారు. ఇది ఆపరేషన్ క్లీన్ మనీ లో ఇది మొదటి దశ అని చెప్పారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా ఆన్ లైన్ లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 8 పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ/స్వచ్ ధన్ అభియాన్ అనే సాఫ్ట్వేర్ ప్రాజెక్టును ఆరంభించింది. రూ.5 లక్షలకు మించిన లావాదేవీలు అన్నింటినీ అనుమానాస్పద లావాదేవీలుగానే పరిగణించిన ఐటీ శాఖ ఇ- వెరిఫికేషన్ తరువాత సంతృప్తి చెందని ఖాతాలకు నోటీసులు పంపనున్నట్టు ప్రకటించింది. ఆ డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని సదరు ఖాతాదారులందరికీ ఈ-మెయిల్స్, ఎస్ఎంఎ్సలు పంపనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కోటి బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మిం చి నగదు జమ అయినట్లు తేల్చిన సంగతి తెలిసిందే. -
ఇంకెన్నాళ్లు.. ఎదురుచూపులు?
చేతికందని బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అప్పు చేసి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన నిరుద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్న అర్హులు కథలాపూర్ (వేములవాడ) : వారంతా ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్న నిరుద్యోగులు. సొంత కాళ్లపై నిలబడాలనేది వారి లక్ష్యం...కిరాణ దుకాణం.. గేదెలు, ఆవుల పెంపకం, వాహనాల కొనుగోలు.. ఇలా ఏదో ఒక దానిని ఏర్పాటు చేసుకోవాలనేది ఉపాధి పొందాలని వారి అభిమతం. ఈ క్రమంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందించే రుణాల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వూ్యలు సైతం పూర్తయి లబ్ధిదారుల జాబితాను సైతం అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అర్హులైన వారంతా నెలల తరబడి మండల పరిషత్, కార్పొరేషన్ల కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా రుణం చేతికందని పరిస్థితి. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్వయం ఉపాధి రుణాలకు 405 దరఖాస్తులు.. కథలాపూర్ మండలంలో 18 గ్రామాలుండగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరైనట్లు డిసెంబర్ 2015లో అధికారులు ప్రకటించారు. సుమారు 405మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీ కార్పొరేషన్కు 197, ఎస్సీ కార్పొరేషన్కు 159 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలన చేసి నిరుద్యోగులకు గతేడాది మార్చిలో బ్యాంకు అధికారులు, మండల పరిషత్ అధికారులు సమష్టిగా ఇంటర్వూ్యలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక జాబితాను రూపొందించారు. ఇంటర్వూ్యలు నిర్వహించిన అధికారుల బృందం బీసీ కార్పొరేషన్ యూనిట్లు 30, ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు 50 మంజూరుతో జాబితాను ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నా.. నేటికి నిరుద్యోగులకు రుణాలు అందకపోవడం గమనార్హం. పది నెలలుగా కాలయాపన బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన వారు బ్యాంకుల్లో ష్యూరిటీ పేరిట వేలాది రూపాయలు డిపాజిట్లు చేశారు. బ్యాంకు అధికారులు డిపాజిట్ చేయాల్సిందేనని ఒత్తిడి చేయడంతో అప్పు చేసి చెల్లించామని పలువురు వాపోతున్నారు. ఎప్పుడు అడిగిన ఇదిగో.. అదిగో అంటూ 10 నెలలుగా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. -
ఐటీ కన్ను
అధిక డిపాజిట్లపై ఆరా వివరాలు అందించాలని బ్యాంకులు, తపాలశాఖకు ఆదేశాలు ఏలూరు (మెట్రో) : నల్ల కుబేరుల భరతం పట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్లపై ఆరా తీస్తోంది. ఈ వివరాలను ఈ నెలాఖరులోగా తమకు అందించాలని బ్యాంకర్లను ఐటీ అధికారులు కోరారు. ఈనెల 31లోగా వివరాలు అందించకుంటే తామే బ్యాంకుల్లో తనిఖీలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఈనేపథ్యంలో బ్యాంకర్లు అత్యవసర విధులు తప్ప ఇతర సాధారణ పనులన్నీ ఆపేసి గత రెండునెలల డిపాజిట్ల వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా పంట, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర పనులను బ్యాంకులు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్కనే ఉన్న కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదాయపుపన్ను చెల్లించకుండా నగదు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి వారికి నోటీసులు ఇచ్చేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ రెండు జిల్లాలతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ పెద్దసంఖ్యలో భారీ డిపాజిట్లు జరిగినట్టు ఇప్పటికే ఐటీ శాఖ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో రూ.కోట్లు జమయ్యాయని ఐటీ శాఖ గుర్తించినట్టు సమాచారం. బ్యాంకులు వివరాలు ఇచ్చిన అనంతరం అనుమానం ఉన్న లాకర్లనూ ఆదాయపుపన్ను శాఖ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. రాత్రికిరాత్రే భారీ డిపాజిట్లు! పెద్దనోట్ల రద్దు తర్వాత పొదుపు ఖాతాల్లో రూ.2.50లక్షలలోపు, కరెంటు ఖాతాల్లో రు.12.50లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్బ్యాంకు సూచించింది. అంతకుమించి డిపాజిట్లు నమోదైతే వాటికి సబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే పెద్దనోట్ల ర్దు ప్రకటించిన నవంబరు 8వ తేదీ రాత్రే భారీ ఎత్తున నగదు డిపాజిట్ మిషన్ల ద్వారా జమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి వివరాలను ఈఫైలింగ్ ద్వారా అందించాలని ఐటీ అధికారులు బ్యాంకులకు సూచించారు. బ్యాంకర్లపైనా నిఘా బ్యాంకర్లపైనా ఐటీ శాఖ నిఘాపెట్టినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నగదు మార్పిడికి పాల్పడిన అక్రమ అధికారులపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే తణుకు స్టేట్బ్యాంకులోనూ, మేనేజర్, సిబ్బంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్పై జరిగిన దాడులూ దీనిలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఏలూరు వన్టౌన్లో బంగారు దుకాణాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఫిబ్రవరిలో ఐటీశాఖ దాడులు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది -
కోపరేటివ్ బ్యాంకులు ఆ డిపాజిట్లు స్వీకరించవు
న్యూఢిల్లీ : రద్దయిన నోట్ల డిపాజిట్కు గడువు ముగిసినప్పటికీ నల్లధనం వివరాల వెల్లడికి మరో అవకాశమిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద పాత నోట్లను డిపాజిట్ల చేసుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా నల్లకుబేరులు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ అనుమతి ఇప్పటినుంచి సహకార బ్యాంకుల్లో వర్తించదు. పీఎంజీకేవై కింద పాత నోట్లను కోపరేటివ్(సహకార) బ్యాంకులు స్వీకరించవని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు అనంతరం కోపరేటివ్ బ్యాంకుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ గుర్తించడమే. కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీఎంజీకేవై కింద స్వీకరించే డిపాజిట్లను కోపరేటివ్ బ్యాంకులు స్వీకరించవని ప్రభుత్వం తెలిపింది. పీఎంజీకేవై కింద డిపాజిట్ చేసే నగదుపై 50 శాతం పన్నును అకౌంట్ హోల్డర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదులో25 శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ స్కీమ్ను కూడా వాడుకోకుండా తమంతట తాముగా మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని కేంద్రం హెచ్చరించింది. -
ఆ డిపాజిట్లు.. నల్లధనమేనా?
సుమారు నాలుగు లక్షల కోట్లపై ఐటీ నజర్ పన్ను ఎగవేతలపై ముమ్మరంగా దర్యాప్తు న్యూఢిల్లీ: రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులలో నమోదైన డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) నజర్ పెట్టింది. నోట్ల ద్దు తర్వాత 50రోజుల గడువులోగా డిపాజిట్ అయిన మొత్తాలను సమగ్రం విశ్లేషిస్తోంది. దేశవ్యాప్తంగా డిపాజిట్ అయిన పాత నగదులో రూ. 3 నుంచి నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనం ఉండవచ్చునని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ నాలుగు లక్షల కోట్ల డిపాజిట్ల వివరాలు పరిశీలించి.. ఆయా డిపాజిటర్లకు నోటీసులు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటు ఐటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 'నోట్ల రద్దు తర్వాత దాదాపు 60 లక్షల బ్యాంకు ఖాతాలలో రూ. 2 లక్షలకు మించి డిపాజిట్లు నమోదయ్యాయి. వీటి వివరాలన్నీ విశ్లేషించగా.. నిశితంగా ఈ పరిశీలంచగా.. ఈ 60 లక్షల ఖాతాలలో రూ. 7.34 లక్షల నగదు డిపాజిట్ అయినట్టు తేలింది. ఇక ఈశాన్య రాష్ట్రాలలోని వివిధ బ్యాంకు ఖాతాలలో ఏకంగా రూ. 10,700 కోట్ల అనుమానిత డిపాజిట్లు నమోదైనట్టు ఐటీ గుర్తించింది. సహకార బ్యాంకులలో డిపాజిట్ అయిన రూ. 16వేల కోట్లపైనా ఐటీ, ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు' అని ఆయన వివరించారు. ఇక ఎప్పుడూ నిష్క్రియాత్మకంగా ఉండే ఖాతాలలో ఏకంగా రూ. 25వేల కోట్ల డిపాజిట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఇక, నవంబర్ 8న జరిగిన నోట్ల రద్దు తర్వాత ఏకంగా రూ. 80వేల కోట్లు రుణాలు బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరిగిందని ఆ అధికారి పీటీఐకి తెలిపారు. -
ఆత్మకూర్లో పన్నుల డబ్బు మాయం!
రూ.లక్ష వరకు గల్లంతు కారోబార్ను విధుల నుంచి తొలగింపు మెట్పల్లిరూరల్ : మెట్పల్లి మండలం ఆత్మకూర్ పం చాయతీ వసూలు చేసిన వివిధ పన్ను ల డబ్బులు సుమా రు రూ.లక్ష వరకు మాయమయ్యా యి. ఈ విషయం మంగళవారం సర్పంచ్, మండల ఉపాధక్షుడు, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఆరా తీయగా.. స్వాహా అయినట్లు వెలుగుచూసింది. గ్రామపంచాయతీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు.. పన్నుల డబ్బు స్వాహా విషయమై ఫోన్లో చర్చించుకున్న మాటలు బహిర్గతమయ్యాయి. ఇంటిపన్ను.. నల్లా డిపాజిట్లు, నల్లా పన్నులను వసూలు చేసిన కారోబార్.. నకిలీబిల్లుబుక్లనుంచి ప్రజలకు రశీదులు ఇచ్చినట్లు బయటపడింది. నకిలీబుక్ల ద్వారా ఎంతమంది నుంచి ఎంతమొత్తం వసూలు చేశారో నిర్ధరించేందుకు కమిటీ వేశారు. కారోబర్ శ్రీనివాస్ను విధుల నుంచి తప్పించారు. 2011 నుంచి అన్ని రశీదులను తనిఖీ చేయాలని, గతంలో ఇక్కడ పని చేసి ఉద్యోగ విరమణ పొందిన కార్యదర్శి రాజేశ్వర్ను కూడా ప్రశ్నించాలని తీర్మానించారు. గ్రామంలోని ఓ అంగన్వాడీ కార్యకర్త వద్ద స్థానిక నాయకులతో సన్నిహితంగా మెలిగే ఒకరు రూ.మూడువేలు, 30 గుడ్లను తీసుకున్నట్లు గుర్తించారు. సమావేశంలో సర్పంచ్ గంగుల బలరాంమూర్తి , వైస్ ఎంపీపీ రాచమల్ల సురేశ్, ఉపసర్పంచ్ దిలీప్, కార్యదర్శి రమేశ్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నోట్ల లొల్లి.. ఇక ఆర్బీఐ వద్ద
-
నోట్ల లొల్లి.. ఇక ఆర్బీఐ వద్ద
హైదరాబాద్: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గడువు ముగిసింది. ఇక కేవలం ఆర్బీఐ వద్ద మాత్రమే ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో.. హైదరాబాద్ ఆర్బీఐ వద్ద నోట్ల మార్పిడి కోసం శనివారం ప్రజలు ఎగబడ్డారు. అయితే ఆర్బీఐ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇక్కడకు రావాలంటూ గేటు వద్ద నుంచే వారిని తిప్పిపంపుతున్నారు. ఆర్బీఐలో నోట్లను ఎలా మార్చుకోవాలో తెలిపే కనీస సమాచారం కూడా లేదంటూ అక్కడకు వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్బీఐ మౌనం అందుకేనా!
ఢిల్లీ: పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గడువు ఎల్లుండితో ముగుస్తోంది. అయితే ఇప్పటివరకు బ్యాంకుల్లో ఎన్ని నోట్లు డిపాజిట్ అయ్యాయి అన్న విషయంపై ఆర్బీఐ మౌనం పాటిస్తోంది. డిసెంబర్ 10 వరకు డిపాజిట్ అయిన సొమ్ము 12.44 లక్షల కోట్లుగా వెల్లడించిన ఆర్బీఐ.. అనంతరం జరిగిన డిపాజిట్లపై స్పందించడం లేదు. నవంబర్ 8న రద్దయిన నోట్ల విలువ 14.2 లక్షల కోట్లు కాగా.. సుమారు 2 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ కాదని కేంద్రం అంచనా వేసింది. డిసెంబర్ 10 నాటికే 12 లక్షల కోట్లు డిపాజిట్ అయినందున కేంద్రం అంచనా తప్పింది. ఈ క్రమంలో రద్దయిన నోట్ల విలువ కంటే అధికంగా బ్యాంకుల్లో డిపాజిట్లు జరిగాయా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలు తప్పడం మూలంగానే ఆర్బీఐ మౌనం పాటిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కేడీసీసీబీ డిపాజిట్లపై ఆర్బీఐ ఆరా
- నవంబరు 10 నుంచి 14 వరకు రూ.26 కోట్ల డిపాజిట్లు - నల్లధనం డిపాజిట్ అయినట్లు అనుమానాలు కర్నూలు(అగ్రికల్చర్): రద్దయిన రూ.500, 1000 నోట్లకు సంబంధించి జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జమ అయిన డిపాజిట్లపై రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఆదాయపు పన్నుశాఖ దృష్టి పడింది. జిల్లాలో కేడీసీసీబీకి 22 బ్రాంచీలున్నాయి. కేంద్రప్రభుత్వం నవంబర్ 8వతేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. 9న బ్యాంకులు బంద్ అయ్యాయి. పదవ తేదీ నుంచి 14 వరకు జిల్లా సహకార బ్యాంకులో రూ. 26 కోట్ల రద్దయిన కరెన్సీ డిపాజిట్ అయింది. ఈ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల్లో 85శాతం మంది రైతులే. వరుస కరువులతో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు డిపాజిట్లు చేసే స్థాయిలో లేరు. దీన్ని బట్టి చూస్తే కేడీసీసీబీలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండటం వల్ల నల్లడబ్బును భారీగా డిపాజిట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పటికే ఆర్బీఐ జిల్లా కేంద్రసహకార బ్యాంకులో నవంబరు 10 నుంచి 14వ తేదీ వరకు వచ్చిన డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అధీనంలో ఉన్న సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లు డిపాజిట్లుగా వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని డీసీసీబీల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున వచ్చిపడ్డాయి. వీటిన్నిటిని ఆరాతీస్తున్న ఆర్బీఐ కర్నూలు సహకార బ్యాంకుకు వచ్చిన డిపాజిట్లను పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా సీఈఓ రామాంజనేయులు మాట్లాడుతూ... తమ బ్యాంకుకు రద్దయిన నోట్లు దాదాపు రూ.26 కోట్లు డిపాజిట్లుగా వచ్చాయని, ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ, ఆప్కాబ్కు పంపినట్లు తెలిపారు. కేడీసీసీబీకి 22 బ్రాంచీలుండగా సగటున రూ.1.10 కోట్ల ప్రకారం డిపాజిట్లు పడ్డాయన్నారు. ఇవన్నీ కూడా రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మొత్తంలో డిపాజిట్ అయినవేనని వెల్లడించారు. -
భారీగా ఎగిసిన ఆ డిపాజిట్లు ఢమాల్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లోకి వరదలా వచ్చి చేరిన డిపాజిట్లు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసిన ఈ డిపాజిట్లు ఇటీవల తగ్గడం ప్రారంభమయ్యాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు, హెచ్చరికలతో ఈ ఖాతాలోకి నగదు వెల్లువ తగ్గినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే సామాన్యుల జన్ ధన్ అకౌంట్లోకి భారీగా రద్దైన నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ అకౌంట్లలో డిపాజిట్లు నెమ్మదించాయని తెలిసింది. రూ.74,609 కోట్లు మాత్రమే డిపాజిట్ అయినట్టు గణాంకాలు పేర్కొన్నారు. అంతేకాక ట్రెండ్ కూడా రివర్స్ అయిందట. ఈ అకౌంట్ల నుంచి నగదును బయటికి వచ్చేస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైంది. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64 కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో జీరో బ్యాలెన్స్తో దేశంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించుకునే సదుపాయం కల్పించారు. కానీ బ్లాక్ మనీపై పోరాటంగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క రూపాయి కూడా లేని ఈ అకౌంట్లోకి భారీ మొత్తంలో నగదు వచ్చి చేరింది. సామాన్యుల ఈ ఖాతాలను అడ్డం పెట్టుకుని, బడాబాబులందరూ తమ నల్లధనాన్ని ఈ ఖాతాల్లోకి డిపాజిట్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
‘ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం..ఇక డిపాజిట్లకు చుక్కలే’
-
‘ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం..ఇక డిపాజిట్లకు చుక్కలే’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు డిపాజిట్ చేయడంపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. రూ.ఐదువేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ నిబంధన పెట్టింది. దీని ప్రకారం ఓ వ్యక్తి ఒక్కసారి మాత్రమే రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గతంలో ఈ పాత నోట్లను ఎందుకు జమ చేయలేదని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి, అది వారిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కేవైసీ పత్రాలు ఉంటేనే తీసుకోవాలని, లేదంటే కేవలం 50 వేలు మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అలాంటి పరిస్థితి ఏర్పడిన ఖాతాలను అధికారులు ఒకసారి పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. థర్డ్ పార్టీ ఖాతాలో డబ్బు వేయాలని భావించినప్పుడు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ఆధారం చూపించే జమ చేయాల్సి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. -
బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా
పాన్ నంబర్తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. నవంబర్ 9 తర్వాత రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాలను పాన్తో అనుసంధానం చేయాలని, లేదా ఫారం-60ని నింపి బ్యాంకులో సమర్పించాలని సూచించింది. అంతవరకు ఖాతాను ఆపరేట్ చేయకూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే, సమయంతో సంబంధం లేకుండా.. ఐదు లక్షల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు (నవంబర్ 9కి ముందు చేసిన డిపాజిట్లు) కూడా తమ ఖాతాలతో పాన్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని.. అలా లేని పక్షంలో ఫారం 60ని నింపి బ్యాంకులో సమర్పించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. లేదంటే వీరి ఖాతాను ఆపరేట్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పాన్ నెంబర్ అనుసంధానం చేయకుండా ఒకే వ్యక్తికి ఎక్కువ ఖాతాలు ఉంటే.. పరిమితులకు లోబడి ఒక్కో దాంట్లో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఖాతాకు పాన్ను అనుసంధానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లలో డబ్బులు వేసుకున్నా.. అవన్నీ కూడా కలిపి ఒకేసారి లెక్కలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా పంజాబ్లోని జలంధర్లో ఒక వ్యాపారవేత్త 85 బ్యాంకు ఖాతాలను నిర్వహించిన విషయం వెలుగులోకి రావడంతో రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
23 శాతం జన్ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత జన్ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు రాగా, ప్రతీ ఐదు ఖాతాల్లో ఒకటి (23 శాతం) ఇప్పటికీ సున్నా నిల్వలతోనే కొనసాగుతోంది. డీమోనిటైజేషన్ అనంతరం 30 రోజుల్లో జన్ధన్ ఖాతాల్లో రూ.29,000 కోట్లు జమ అయ్యాయి. దీంతో జన్ధన్ ఖాతాలన్నింటిలో డిపాజిట్ల విలువ డిసెంబర్ 7తో ముగిసిన వారానికి రూ.74,610 కోట్లకు పెరిగింది. తొలుత ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతూ రాగా, ఆ తర్వాత ఆ స్థాయిలో జమలు లేకపోవడం గమనార్హం. జన్ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో నగదు జమలను గమనించిన ప్రభుత్వం నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఖాతాదారులపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరించిన విషయం విదితమే. నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఐటీ చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఈ హెచ్చరికలు ఫలించినట్టు తెలుస్తోంది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు జన్ధన్ పథకాన్ని గతంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు. అదే సమయంలో గరిష్టంగా రూ.50వేలకు మించి డిపాజిట్ చేయడానికి కూడా అనుమతి ఉండదు. మొత్తం మీద 25.68 కోట్ల జన్ధన్ ఖాతాల్లో నవంబర్ 23వ తేదీ నాటికి ఉన్న నిల్వలు రూ.72,834 కోట్లు కాగా, డిసెంబర్ 7 నాటికి రూ.74,610 కోట్ల స్థాయికి చేరాయి. -
నో క్యాష్ విత్ డ్రాయల్స్
బోర్డులు పెట్టిన బ్యాంకర్లు బ్యాంకుల్లో జమ అయింది రూ.4500 కోట్లు...జిల్లాకు వచ్చింది రూ.600 కోట్లే – తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు –ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంపై అధికారులు మల్లగుల్లాలు కర్నూలు(అగ్రికల్చర్): రద్దయిన రూ. 1000, 500 నోట్లు ఇప్పటి వరకు బ్యాంకుల్లో దాదాపు రూ.4500 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు బ్యాంకులకు వెళ్లింది. తిరిగి అంతే మొత్తంలో నగదు వస్తే లావాదేవీలు అన్నీ సాఫీగా జరుగుతాయి. పెద్దనోట్లు రద్దు అయిన తర్వాత జిల్లాకు వచ్చిన కరెన్సీ రూ.600 కోట్లు మాత్రమే. పరిమితంగా నగదు రావడంతో ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం జిల్లాకు దాదాపు 107 కోట్ల కరెన్సీ వచ్చింది. ఎస్బీఐకి రూ.27 కోట్లు రాగా దీనిని ఆ బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుంటోంది. ఆంధ్రాబ్యాంకుకు రూ.80 కోట్లు వచ్చింది. ఈ మొత్తాన్ని 16 బ్యాంకులకు ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నగదు ఏ మూలకు సరిపోని పరిస్థితి. కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచీకి సోమవారం సాయంత్రం రూ.10 లక్షలు ఇచ్చారు. ఇది కేవలం 15 నిముషాల్లో అయిపోయిందంటే నగదుకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. మంగళవారం యథావిధిగా నో క్యాష్, నో విత్ డ్రాయల్ అంటూ బోర్డులు పెట్టారు. కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తామని, నగదు లేనందున చెల్లింపులు లేవని స్పష్టంగా చెబుతున్నారు. కరెన్సీ చస్ట్ ఉన్న ఎస్బీఐ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. సిండికేట్ బ్యాంకులో నగదు నిల్.... జిల్లాలో లీడ్ బ్యాంకుగా సిండికేట్ బ్యాంకు వ్యవహరిస్తోంది. ఈ బ్యాంకుకు జిల్లాలో 46 బ్రాంచీలు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకుకు వచ్చిన రూ.80 కోట్లు ఏఏ బ్యాంకుకు ఇవ్వాలో ఆర్బీఐ సూచించింది. ఇందులో సిండికేట్ బ్యాంకు పేరు లేకపోవడంతో కరెన్సీ కోసం ఆ బ్యాంకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల జీతాల సమస్య గట్టెక్కడంపై మల్లగుల్లాలు... న వంబరు నెల జీతం డిసెంబరు 1న ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. అయితే ట్రెజరీ బ్రాంచీలో నగదు కొరత తీవ్రంగా ఉండటంతో ఏమి చేయాలి అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఒకే సారి రూ.24వేలు తీసుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఉద్యోగుల జీతాల సమస్యను పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ రంగంలోకి దిగారు. ఉద్యోగుల జీతాల కోసం ట్రెజరీ బ్రాంచికి కనీసం మూడు కోట్లు నగదు ఇచ్చే విధంగా చూడాలని జేసీ ఎల్డీఎం నరసింహారావును ఆదేశించారు. ఈయన ఎస్బీఐ కరెన్సీ చస్ట్ ఏజీఎంతో మాట్లాడగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. కనీసం రూ.2 కోట్లు అవసరం: బి.కల్యాణ్ కుమార్, మేనేజర్. ట్రెజరీ బ్రాంచి. డిసెంబరు1ని ఎలా గట్టెక్కాలా అనే దానిపై ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులతో, జిల్లా కలెక్టర్తో చర్చించనున్నాము. కనీసం రూ.2 కోట్లు ఇస్తే ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ మేరకు మా బ్యాంకు అధికారులను కోరాము. మంగళవారం నగదు లేకపోవడంతో నో క్యాస్ నో విత్డ్రాయల్ అంటూ బోర్డులు పెట్టాం. -
రూ. 8.45 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: పెద్ద నోట్ల రద్దుతర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వెల్లువ కొనసాగుతోంది. నవంబరు 27 నాటికి మొత్తం రూ.8.45 లక్షల కోట్ల డిపాజిట్ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. డిపాజిట్ల విలువ రూ. 8,44,982 కోట్లకు చేరిందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ఆర్థిక వ్యవస్థనుంచి 86శాతం వాటావున్న పె ద్ద నోట్ల రద్దు తరువాత రూ 33.948 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి జరిగింది. రూ.14 లక్షల కోట్ల విలువైన రూ..500 నుంచి రూ .1,000 నోట్ల ఉపసంహరణ తరువాత వివిధ బ్యాంకులకు అందించిన డిపాజిట్లురూ. 8,11,033తో కలిపి తిరిగి వచ్చిన డబ్బు మొత్తం రూ 8,44,982 కోట్లకు చేరింది. నవంబరు 8 తరువాత నవంబరు 10 - 27తేదీల్లో బ్యాంకుల ద్వారా గానీ, ఏటీఎం ల ద్వారా ప్రజలు విత్ డ్రా చేసిన మొత్తం రూ. 2,16,617 లుగా ఆర్బీఐ వెల్లడించింది. -
బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు
వ్యవస్థలోకి రూ.3 లక్షల కోట్ల కొత్త నోట్లు : కేంద్రం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ తెలిపారు. వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో మొత్తం రూ.14.5 కోట్లు చెలామణిలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల విలువ మేర కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో రద్దరుున నోట్లు, కొత్త నోట్ల మధ్య అంతరం ఉందన్నారు. ప్రతి రోజూ రూ.25వేల కోట్ల విలువ మేర కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా వ్యవస్థలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి శనివారం ఇక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని, దేశవ్యాప్తంగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత నెలకొందన్నారు. ప్రజలు రూ.2,000 వేల నోటుకు చిల్లర పొందలేని పరిస్థితి ఉందని అంగీకరించారు. రూ.500 నోట్లను మరింత సంఖ్యలో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కొన్ని వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని గంగ్వార్ చెప్పారు. రూ.1,000 నోటును ఏ రూపంలో విడుదల చేయాలన్నది భవిష్యత్తులో నిర్ణరుుస్తామన్నారు. నల్ల ధనం నియంత్రణ దిశగా పెద్ద నోట్ల రద్దు తొలి నిర్ణయమని... ఈ విషయంలో భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కష్టాలు నల్లధనం కలిగిన వారికే గానీ సామాన్యులు ఆందోళన చెందక్కర్లేదన్నారు. -
ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
-
ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ రూపంలో తెరుచుకున్న జనధన యోజన ఖాతాల్లోకి కోట్ల కొద్దీ డబ్బు కుప్పలు తెప్పలుగా జమఅవుతోంది. నిన్న కాక మొన్న ఈ ఖాతాల్లోకి 21 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయినట్టు వెల్లడవగా.. ప్రస్తుతం ఈ డిపాజిట్లు మరింత పెరిగినట్టు తెలిసింది. నేటికి జన్ధన్ ఖాతాల్లోకి రూ.64,250 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా రూ.10,670.62 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నట్టు తెలిపింది. నవంబర్ 16వరకు 25.58 కోట్ల జన్ధన్ అకౌంట్లలో అగ్రిగేట్గా రూ.64,252.15 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఎకౌంట్లు లేని కోట్లాది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 23 కోట్ల మందిచే జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేపిస్తూ 2014 ఆగస్టు నెలలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు వాళ్లు బ్యాంకు ఖాతా తెరవడమే తప్ప.. అందులో పెద్దగా డబ్బులు వేసింది, తీసింది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే ఈ ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ కొనసాగుతోంది. మధ్య దళారులు అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి ఖాతాల్లోకి డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. తమ దగ్గర భారీ మొత్తంలో ఉన్న నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి ఈ ఖాతాలను వాడుకుంటున్నారని తెలిసింది. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ పథకం, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొంత మేర దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. -
సీడిఎంలలో 10 రోజుల్లో రూ.7384 కోట్ల డిపాజిట్లు
-
చిన్న మొత్తాలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు ఆర్బీఐ షాకిచ్చింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డిపాజిట్ అవుతున్నట్టు తెలియడంతో రిజర్వు బ్యాంకు తాజాగా మరో ఉత్తర్వును జారీ చేసింది. రద్దు చేసిన నోట్లను చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో జమ చేసుకోరాదని, అలాంటి నోట్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరాదని ఆదేశించింది. ఆ మేరకు బుధవారం రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8 నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ప్రతి రోజూ ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తూనే ఉంది. రద్దు చేసిన నోట్లు చెల్లుబాటు కాకపోవడం, బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ నేపథ్యం కావొచ్చు లేదా కొంత మంది తమ సొమ్మును మళ్లించడంవంటి ప్రయత్నాల్లో భాగంగా గడిచిన పక్షం రోజుల్లో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినప్పుడు ఆ వివరాలను బ్యాంకులు సరిగా నమోదు చేయడం లేదని తెలిసి మంగళవారం అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రద్దయిన నోట్లను ఎవరైతే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారో వారి బ్యాంకు ఖాతా వివరాలను, డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తం వివరాలను విధిగా నమోదు చేయాలని ఆదేశించింది. తాజాగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో రద్దు చేసిన నోట్లను తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. -
పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వానికి లాభమెంత?
2016 మార్చి నాటికి రూ.500, 1,000 నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు ♦ ఇందులో బ్యాంకులకు చేరనివి రూ.3.5 లక్షల కోట్లు ♦ మార్పిడి, డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరే ఈ మొత్తం ఆర్బీఐ నుంచి డివిడెండ్ రూపంలో కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం బిజినెస్ డెస్క్ ‘పెద్ద నోట్లను ఉపసంహరించడంతో సంపద ధ్వంసం కాదు.. సంపద బదిలీ అవుతుంది’ ఇదీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియం గత వారం చెప్పిన మాటలు. ఆయన అభిప్రా యంతో కొందరు ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ప్పటికీ, నోట్ల రద్దుతో ప్రభుత్వానికి భారీ ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు మార్పిడికి, డిపా జిట్లకు రాని డబ్బంతా రదై్దన నోట్ల రూపంలో ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చేరుతుం దన్నదే ఆ అంచనాల సారాంశం. అదేలా అంటే.. ► చెలామణీలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల విలువ 2016 మార్చి నాటికి రూ. 14.18 లక్షల కోట్లు ఉంది. మొత్తం కరెన్సీ నోట్లలో ఈ పెద్ద నోట్ల విలువ 80 శాతం వరకూ ఉంటుంది. మిగిలినవన్నీ చిన్న నోట్లే. ► సుమారు రూ.14 లక్షల కోట్ల విలువైన ఈ పెద్ద నోట్లలో దాదాపు 25 శాతం బ్యాంకుల వద్దకు చేరవని అంచనా. అంటే ఈ మొత్తం దాదాపు రూ.3.5 లక్షల కోట్లు. ► ఇలా బ్యాంకుల వద్దకు మార్పిడి, డిపాజిట్ కోసం చేరని రూ.3.5 లక్షల కోట్లు రిజర్వుబ్యాంక్కు వచ్చిన లాభంగా పరిగణిస్తారు. ► రద్దయిన నోట్ల స్థానంలో ఇప్పుడు రిజర్వుబ్యాంకు కొత్తగా రూ.500, రూ.2,000 నోట్లను ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల వద్దకు మార్పిడి కోసం, డిపాజిట్ల రూపంలో వచ్చిన పాత నోట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయి. కానీ బ్యాంకుల వద్ద జమకాని రూ.3.5 లక్షల కోట్ల విలువైన పాత నోట్లకు బదులుగా కూడా రిజర్వుబ్యాంక్ అంతే మొత్తం కొత్త నోట్లను అదనంగా ముద్రిస్తుంది. ► ప్రతీ ఏడాది రిజర్వుబ్యాంక్కు వివిధ కార్యకలాపాల ద్వారా వచ్చిన లాభాన్ని డివిడెండు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇదే ప్రక్రియలో భాగంగా కేంద్రానికి ఈ రూ. 3.5 లక్షల కోట్లు బదిలీ అవుతాయి. ఈ డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుంది? నిధుల సమస్యలతో వివిధ రంగాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవు తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రో సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలకు కోత విధిస్తోంది కూడా. ఇటువంటి సమయంలో హఠాత్తుగా సమకూరిన ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఏ రూపంలోనైనా వినియోగిం చుకోవచ్చు. అవి.. ఏమిటంటే.. ► అదనంగా వచ్చిన ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దాదాపు రూ.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ► మొండి బకాయిలతో మూలధనం కోసం అర్రులుచాస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధనాన్ని సమకూర్చవచ్చు. ► మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయవచ్చు. ► సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించవచ్చు. -
ప్రైవేట్ దిగ్గజానికి భారీ డిపాజిట్లు
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుగా పేరున్న ఐసీఐసీఐ బ్యాంకు, పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా డిపాజిట్లను ఆర్జించినట్టు ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ తెలిపారు. శుక్రవారం వరకు రూ.32వేల కోట్ల డిపాజిట్లు బ్యాంకులో నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. నోట్ల మార్పిడికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న భారీ రద్దీ, క్యూలైన్లపై స్పందించిన కొచ్చర్, ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా కోపంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త రూ.500 నోట్లను ఏటీఎంల ద్వారా ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తే, కస్టమర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకుని, పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని కొచ్చర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెల్లింపులన్నీ డిజిటల్ మార్గంలోకి పయనిస్తున్నాయని తెలిపారు. వర్తకుల నుంచి తమకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయని, సేల్ టెర్నినల్స్ను ఏర్పాటుచేయాలని వారు అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా వాడకుండా మూలన పడిఉన్న ఏటీఎం కార్డుల వాడకం కూడా పెరిగిందని చెప్పారు. బ్లాక్మనీపై ఉక్కుపాదం మోపుతూ, అవినీతిని నిర్మూలించడానికి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు బ్యాంకులకు రూ.5 ట్రిలియన్ వరకు డిపాజిట్లు నమోదయ్యాయి. బ్యాంకింగ్ డిపాజిట్ల వెల్లువ అటు ఉంచితే, ఎక్కువగా నగదు లావాదేవీలపైనే ఆధారపడిన మన దేశంలో పెద్ద నోట్ల రద్దుతో, బ్యాంకు నోట్లు ఎక్స్చేంజ్కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కరెన్సీ ఖాళీ
► డిపాజిట్లు మాత్రమే స్వీకరణ ► నిరాశలో ఖాతాదారులు ► రాజకీయ పార్టీల ఆందోళనలు ► మరో ఏడు నెలలు ► కరెన్సీ కష్టాలే: పి. చిదంబరం కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ అందకపోవడంతో బ్యాంకులన్నీ సదరు లావాదేవీలను నిలిపి వేశారుు. దీనిపై అనేక రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగారుు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం ఈనెల 8వ తేదీన రద్దు చేయగా, 10వ తేదీ నుంచి కొత్త కరెన్సీ పంపిణీ ప్రారంభమైంది. అరుుతే కేవలం రూ.2వేల నోటును మాత్రమే రిజర్వు బ్యాంకు సరఫరా చేయడంతో చిల్లర సంక్షోభం నెలకొని ఉంది. రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఎప్పుడు అందజేస్తారంటూ బ్యాంకుల వద్ద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాలా పరిమితమైన బ్యాంకుల్లోనే రూ.100 నోట్లు ఇస్తున్నారు. కరెన్సీ రద్దరుు పదిరోజులు అవుతుండగా కొత్త కరెన్సీ పొందేందుకు అనేక ఏటీఎంలు ఇప్పటికీ పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద క్యూను కట్టడి చేసేందుకు ఖాతాదారుల వేలిపై ఇంకు గుర్తు వేసే విధానం 10 శాతం బ్యాంకుల్లో మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా బ్యాంకుల వద్ద బారులు బారులుగానిలుస్తున్న ప్రజలందరికీ కొత్త నోట్లు దక్కడం లేదు. దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ కొత్త కరెన్సీ స్టాక్ అరుుపోవడం, రిజర్వు బ్యాంకు నుంచి వెంటనే సరఫరా కాకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చాంతాడంత క్యూలో నిలుచుని సరిగ్గా కౌంటర్ వద్దకు వచ్చేసరికి ఉన్న కాస్త కరెన్సీ అరుుపోరుుందంటూ బ్యాంకులను మూసివేస్తున్నారు. ఈ రోజు కరెన్సీ మార్పిడి లేదు అంటూ సుమారు 50 శాతం బ్యాంకుల ముందు బోర్డులు దర్శనమిస్తున్నారుు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ప్రజలు సజావుగా రూ. 2 వేల నోట్లను పొందగలిగారు. ఆ తరువాత నుంచి అష్టకష్టాలు ఆరంభమయ్యారుు. రూ.కోటి అవసరమైన బ్యాంకులకు కేవలం రూ.15లక్షలు మాత్రమే అందుతున్నారుు. దీంతో ప్రజలకు నచ్చజెప్పలేక ఆర్బీఐ నుంచి అందగానే మళ్లీ పంపిణీ చేస్తామని బ్యాం కు అధికారులు సర్దిచెబుతున్నారు. వేలిముద్ర వేసే ఇంకు రానందున కరెన్సీ మార్పిడి కుదరదని ఖాతాదారులను పంపించేశారు. తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు వచ్చి ఉదయం వేళ క్యూలోనే కూర్చుని టిఫిన్ చేస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈరోడ్ జిల్లాలో ఒక క్షయవ్యాధి గ్రస్తుడిని బంధువులు బ్యాంకు వద్దకు మోసుకొచ్చి కరెన్సీని మార్చుకున్నారు. సహకార బ్యాంకుల గతేమిటంటూ సహకార బ్యాంకు సహాయ రిజిస్ట్రార్ మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేయగా ఈనెల 28వ తేదీకి వారుుదాపడింది. పొన్నేరీలో ఒక చెత్తకుప్పలో రూ.500, రూ.1000 నోట్లతో కూడిన పెద్ద ఎత్తున కరెన్సీని కొందరు చింపిపారేశారు. కరెన్సీ రద్దును నిరసిస్తూ వర్తక, వాణిజ్య సంఘాలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారుు. కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు సాగారుు. కేంద్రప్రభుత్వ తొందరపాటు చర్య వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ విమర్శించారు. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులకు వచ్చే ప్రజలకు సహకరించాల్సిందిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు బంకుల నుంచి వారానికి రూ.2వేలు పొందేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 4,470 పెట్రోలు బంకులు ఉండగా, ఏఏ బంకుల్లో నగదు డ్రా చేసుకోవచ్చో? త్వరలో ఎస్బీఐ ప్రకటించనుంది. కష్టాలు తప్పవు:కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు మరో ఏడు నెలలపాటు తప్పవని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఒక వారానికి రూ.3వేల కోట్ల విలువైన కరెన్సీని మాత్రమే ముద్రించే వెసులు బాటు ఉందని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన అకస్మాత్తుగా ప్రకటించారు, అరుుతే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లను రద్దు చేసి పెద్ద తప్పు చేసిన ప్రధాని నేడు ఆ తప్పును దిద్దుకునేందుకు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లు సుమారు 2,100 కోట్లు ఉండగా, వీటిని రద్దు చేసినప్పుడు అదే స్థారుులో కొత్తవాటిని విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. అరుుతే ఆ స్థారుులో వెంటనే ముద్రించేందుకు అవకాశం లేదని, నెలకు రూ.300 కోట్లు మాత్రమే కేంద్రం ముద్రించగలదని తెలిపారు. ఈలెక్కన చూసుకుంటే పూర్తిస్థారుు అవసరాలకు మరో 7 నెలలు గడువు తప్పనిసరి, అంత వరకు ప్రజలకు తిప్పలు తప్పవని ఆయన తెలిపారు. -
'సహకార' సేవలకు బ్రేక్
- డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్బీఐ ఉత్తర్వులు - రైతుల పడిగాపులు ఎమ్మిగనూరు: ఆప్కాబ్ పరిధిలో డీసీసీబీ (జిల్లా సహకార పరపతి బ్యాంక్)ల్లో డిపాజిట్లు స్వీకరించరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం జిల్లాలోని 24 బ్రాంచ్ల్లో సేవలకు బ్రేక్ పడ్డాయి. డిపాజిట్లు చేసేందుకు వచ్చి రైతులు నిరాశ చెందారు. ఒక పక్క ఖరీఫ్ దిగుబడులు విక్రయించే కాలం, మరో పక్క బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు, లోన్లు చెల్లించే సమయం కావటంతో రైతులు కేడీసీసీ బ్యాంకుల ముందు క్యూ కట్టారు. రూ. 500, రూ. 1000 నోట్లతో బ్యాంకులకు వచ్చే రైతులను బ్యాంక్ సిబ్బంది వెనక్కి పంపించారు. మూన్నాళ్ల ముచ్చటే.. పెద్ద నోట్ల రద్దుతో జిల్లా సహకార బ్యాంక్కు మూడురోజుల్లోనే రూ. 35 కోట్లు డిపాజిట్ రూపంలో చేరాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు డిసెంబర్ 31 వరకు డిపాజిట్లు స్వీకరించే వెసలుబాటు ఉంది. రైతుల బ్యాంక్లకు మాత్రం నోట్ల డిపాజిట్లు మూన్నాళ్ళ ముచ్చటగానే సాగింది. జిల్లాలో మొత్తం 1.12 లక్షల మంది రైతులు సహకార బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారు. వీరందరికీ తాము పండించిన పంట ఉత్పత్తుల సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటు రైతులకు, అటు సహకార బ్యాంక్ల పటిష్టతను దృష్టిలో ఉంచుకొనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే సహకార బ్యాంకుల్లో రైతులు డిపాజిట్లు చేసుకొనే వెసలు బాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా రైతులు డిపాజిట్ చేసిన మొత్తంలో వ్యవసాయఖర్చులకు డబ్బులు విత్డ్రా చేసుకోవాలన్నా ఆయా బ్యాంక్లకు ప్రధాన బ్యాంక్లనుంచీ 1శాతం డబ్బులు కూడా ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఎమ్మిగనూరు కేడీసీసీ బ్యాంక్లో ఇప్పటికే రూ.2కోట్లుకుపైగా డిపాజిట్ చేస్తే మార్పిడి కోసం ఆ బ్యాంక్కు వచ్చిన కొత్తనోట్లు కేవలం రూ.2.5లక్షలే. -
ఐదు రోజుల్లో రూ.83,702 కోట్ల డిపాజిట్లు: ఎస్బీఐ
ముంబై: కేంద్ర ప్రభుత్వపు కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో గత ఐదు రోజుల్లో తమకు రూ.83,702 కోట్ల డిపాజిట్లు వచ్చాయని ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తెలిపింది. నవంబర్ 10 నుంచి 14 వరకు (సాయంత్రం 5 గంటల వరకు) రూ.4,146 కోట్ల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేశామని పేర్కొంది. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా బ్రాంచులు సోమవారం పనిచేయకపోరుునా కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ బ్యాంకులు పనిచేశాయని తెలిి పంది. నవంబర్ 10 నుంచి ఎస్బీఐ బ్యాంక్ శాఖల ద్వారా జరిగిన విత్డ్రాయెల్స్ రూ.9,342 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఏటీఎం విత్డ్రాయెల్స్ రూ.1,958 కోట్లుగా నమోదయ్యాయని తెలిపింది. క్యాష్ డిపాజిట్స్ మెషీన్ల ద్వారా జరిగిన కస్టమర్ల డిపాజిట్లు రూ.4,654 కోట్లు (పాత నోట్లు)గా ఉన్నాయని వివరించింది. -
ప్రకంపనలు
రూ.500, రూ.1000 నోట్ల నిషేధంపై షాక్ – విస్మయం వ్యక్తం చేస్తున్న వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు – కొంత సమయం ఇచ్చి నిషేధం విధించి ఉంటే బాగుండేదని మరికొందరి అభిప్రాయం – స్వాగతిస్తున్న బ్యాంకు వర్గాలు – ఏటీఎంల వద్ద పోటెత్తిన క్యూలు కర్నూలు(అగ్రికల్చర్): రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఇది షాక్ కలిగిస్తోంది. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని విధంగా నోట్ల నిషేధం తక్షణం అమల్లోకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ఈ నిర్ణయం మంచిదే అయినా ఎలాంటి సమయం ఇవ్వకుండా ఏకంగా నిషేధం విధించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నేడు చిన్న కుటుంబం మొదలుకొని, సంపన్నుల వరకు రూ.500, రూ.1000 నోట్లు ఉంటున్నాయి. వీటిని నేటినుంచి మార్చుకోవాలంటే విధిగా ఐడీ కార్డు చూపాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా వ్యాపార, పారిశ్రామికవేత్తలు మాత్రం షాక్కు గురవుతున్నారు. ఇక నుంచి బ్యాంకులు, పోస్టాఫీసులకు ఈ కరెన్సీ పోటెత్తే అవకాశం ఏర్పడింది. ఏకంగా రెండు రోజుల పాటు ఏటీఎం సేవలను నిలిపివేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో అత్యవసర పనులకు సైతం వీటినే ఉపయోగిస్తున్నారు. రెండు రోజులు వీటిని బంద్ చేస్తుండటం వల్ల వివిధ వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కోనున్నారు. ఏటీఎంలు బంద్ కావడం వల్ల మెడికల్ వంటి అత్యవసర పనులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలపై మంగళవారం రాత్రే ఒత్తిడి పెరిగింది. ఏటీఎం కేంద్రాలకు ఖాతాదారులు క్యూ కట్టారు. పెద్దనోట్లను బ్యాన్ చేయడానికి ముందు మార్పిడికి కొంత వ్యవధి ఇచ్చి తర్వాత నిషేధం అమలులోకి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త టెక్నాలజీతో రానున్న రోజుల్లో రూ.500, రూ.2000 నోట్లను అమల్లోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నా, ఉన్న నోట్లను నిషేధిస్తూ తక్షణం అమలులోకి తీసుకురావడం అనేకమందికి మింగుడుపడని విషయంగా మారింది. ప్రధాని నిర్ణయం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇంతవరకు పెద్ద నోట్లు చెలామణిలో ఉండటంతో బ్యాంకుల్లో రూ.100 నోట్ల సర్కులేషన్ తక్కువగా ఉంది. డిసెంబర్ చివరిలోగా వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఐడీ కార్డులు చూపించి మార్పిడి చేసుకోవాల్సి ఉండటంతో రూ.100 నోట్ల అవసరం పెరిగింది. ఇందుకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు వీటిని పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటీఎంలలో డిపాజిట్లు మొదలు ప్రధానమంత్రి నిర్ణయం వెలువడిన వెంటనే ఏటీఎంలలో పెద్ద నోట్లను డిపాజిట్లు చేయడం మొదలయ్యింది. మంగళవారం రాత్రే జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంలలో రూ.1000, రూ.500 నోట్లను జమ చేసినట్లు సమాచారం. మరోవైపు ఏటీఎంలలో నుంచి విత్డ్రాయల్ కూడా భారీగా పెరిగింది. ఒకవైపు డిపాజిట్లు మరోవైపు విత్డ్రాయల్లతో ఏటీఎం సెంటర్లు కిటకిటలాడాయి. నకిలీ, బ్లాక్ మనీ అరికట్టేందుకు ప్రధాని నిర్ణయం తోడ్పడుతుంది... : గోపాలకృష్ణ, డీజీఎం, ఆంధ్రా బ్యాంకు రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదే. దీనివల్ల నకిలీ కరెన్సీ, బ్లాక్ మనీని పూర్తిగా నిరోధించవచ్చు. బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిని మార్పిడి చేసుకోవాల్సి ఉండటం వల్ల బ్యాంకులకు పనిభారం పెరుగుతుంది. మొత్తంగా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది షాకింగ్ న్యూస్... : చంద్రశేఖర్, చైతన్య కెమికల్స్ అధినేత ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఇంత అకస్మాత్తుగా పెద్ద నోట్లను నిషేధించడం అన్ని వర్గాలను షాక్కు గురిచేసింది. కొంత వ్యవధి ఇచ్చి నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింటే బాగుండేది. సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారికి ఇది ఉత్కంఠను, ఆందోళనను కల్గిస్తోంది. అయినప్పటికీ దీనివల్ల నకిలీ కరెన్సీ, బ్లాక్ మనీని పూర్తిగా నివారించవచ్చు. ప్రతి లావాదేవీలు చెక్కుల ద్వారానే జరగాలి - మణికంఠ, ప్రొప్రైటర్, తులసయ్య జ్యువెలర్స్ పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. దీంతో పాటు బ్లాక్ మనీని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు నేరుగా నగదు చెల్లింపులు నిషేధించాలి. ప్రతి లావాదేవీలపై చెక్కులను అమలులోకి తీసుకువస్తే బ్లాక్ మనీని సులభంగా నివారించవచ్చు. బ్యాంకు లావాదేవీల వల్ల నకిలీ కరెన్సీకి కూడా తావు ఉండదు. -
జన్ధన్ 'బ్యాంకు' డిపాజిట్లపై విచారణ: జైట్లీ
న్యూఢిల్లీ: జన్ధన్ బ్యాంకు ఖాతాల్లో కొన్ని బ్యాంకులే స్వయంగా ఖాతాదారుల తరఫున డిపాజిట్లు చేశాయని వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పందించారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్యను తగ్గించేందుకు జన్ధన్ ఖాతాల్లో ఒక రూపాయి చొప్పున బ్యాంకులే డిపాజిట్ చేశాయని వచ్చిన ఆరోపణలపై సంబంధిత బ్యాంకులు విచారణ జరుపుతున్నాయన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన కొన్ని బ్రాంచిలపై ఆరోపణలు వచ్చాయని.. దీనిపై ఆయా బ్యాంకులు విచారణ జరిపి నివేదిక అందిస్తాయని వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మొత్తం 24 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఉన్నాయని, వీటిల్లో మొత్తం 42,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు. ఈ ఖాతాల్లో ఎక్కువ శాతం బలహీన వర్గాలకు సంబంధించినవే అని వెల్లడించారు. ఒకవేళ ఒక్కో ఖాతాలో ఒక రూపాయి చొప్పున డిపాజిట్ చేసినా ఆ మొత్తం 42,000 కోట్లకు చేరదని జైట్లీ తెలిపారు. -
డిపాజిట్లు గల్లంతైతే..
పాలక వర్గాల కనుసన్నల్లో కోఆపరేటివ్ బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్టంలోకి మార్చేందుకు బోర్డుల యత్నాలు ఈ చట్టపరిధిలోకి వెళితే ప్రభుత్వ నియంత్రణ శూన్యం ఎజెండాలో చేర్చిన ది ఇన్నీసుపేట ఆర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అదే దారిలో ది ఆర్యాపురం, ది జాంపేట బ్యాంకులు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లకు ఇక సర్కారీ రక్షణ కరువవనుంది. చాలా బ్యాంకుల పాలకవర్గాలు 1995లో చేసిన ఏపీఎంపీసీఎస్ చట్ట పరిధిలోకి మారాలనుకుంటుండడమే దీనికి కారణం. దీనివల్ల సహకరా బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కరువై పాలకమండళ్ల ఇష్టారాజ్యం మెుదలవుతుంది. అప్పుడు బ్యాంకుల్లో yì పాజిట్లు గల్లంతైతే బాధ్యులెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం : పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి, చిన్న వర్తకుల అభివృద్ధికి పరస్పర సహకార స్ఫూర్తితో స్థాపించిన సహకార బ్యాంకులపై పెద్దల కన్ను పడింది. వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్న బ్యాంకులను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు పాలక మండళ్లు పావులు కదుపుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో చిన్న, మధ్యతరగతి వర్తకుల ఆర్థిక అవసరాలు తీర్చాలన్న మహోన్నత ఆశయంతో స్వాతంత్య్రానికి పూర్వమే సహకార బ్యాంకులు వెలిశాయి. ప్రారంభంలో తమంతట తామే నిధులు సమకూర్చుకున్న ఈ బ్యాంకులకు అనంతరం కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహకార సంస్థల చట్టం (ఏపీసీఎస్–1964) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంకులపై నియంత్రణ కలిగిఉంది. ఈ చట్టంలో పొందుపరిచిన విధివిధానాల ఆధారంగా సహకార బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టం ఉండగానే ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం(ఏపీఎంపీసీఎస్–1995)ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం వల్ల పాలక మండళ్లకు బ్యాంకుల వ్యవహారాలపై పూర్తి అధికారం ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి 1964 చట్టంలో ఉన్న పలు బ్యాంకులను ఆయా పాలక వర్గాలు ఇప్పుడు 1995 చట్టం పరిధిలోకి మార్చాలని యత్నిస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ సున్నా... ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి సహకార బ్యాంకులు వెళ్లడం వల్ల బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పాలక మండళ్లే స్వేచ్ఛగా విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో డిపాజిటర్ల నగదుకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకులకు అందవు. పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో అంశాలపై నిబంధనలు రూపొందించే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. 1964 చట్టం ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి సహకార విభాగంలోని ఆడిట్శాఖ బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తుంది. అయితే 1995 చట్టం ప్రకారం ఆడిట్ వ్యవహారం పూర్తిగా పాలకమండళ్ల చేతిలో ఉంటుంది. పాలక మండలి నియమించిన ప్రైవేటు వ్యక్తి చేసే ఆడిట్లో మండలి కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. 1964 చట్టం ప్రకారం బ్యాంకుల విస్తరణ, వ్యాపారాభివృద్ధికి నిధులు వినియోగించాలంటే సహకార సంస్థల రిజిస్ట్రార్ అనుమతి తప్పనిసరి. 1995 చట్టం పరిధిలోకి వస్తే ఎంతమొత్తంలోనైనా నిధులు వినియోగించవచ్చు. ఉద్యోగుల నియామకం.. పాలక మండలి ఎన్నికలు... 1964 చట్టం పాలక మండలి ఎన్నికలు ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొంటోంది. అయితే 1995 చట్టం ప్రకారం అధికారంలో ఉన్న బోర్డు ఎన్నికలు నిర్వహించాలని తెలుపుతోంది. సభ్యత్వం మంజూరులో కూడా పాలక మండలిదే నిర్ణయం. ఉద్యోగులను కూడా పాలక మండలి నియమించుకునే అధికారం ఉండడంతో నియామకాల్లో అక్రమాలు జరిVó అవకాశం ఉంటుంది. అర్హులైన, సమర్థత కలిగిన ఉద్యోగులు వచ్చే అవకాశం ఉండదు. రుణాల మంజూరులోనూ పాలక మండలికి పూర్తి స్వేచ్ఛ ఉండడంతో అనర్హులకు రుణాలు మంజూరయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల డిపాజిటర్ల నగదుకు రక్షణ ఉందదు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే కృషి బ్యాంక్ తరహాలో ఈ బ్యాంకులు దివాళా తీసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో నగదు దాచుకున్న వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఉవ్విళ్లూరుతున్న పాలక మండళ్లు... జిల్లా వ్యాపారకేంద్రమైన రాజమహేంద్రవరంలో ది ఆర్యాపురం, ది జాంపేట, ది ఇన్నీసుపేట అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఏపీసీఎస్–1964 చట్టం ప్రకారం ఇవి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పలు శాఖలు ఉన్న ఈ బ్యాంకులు వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పాలక మండళ్లు ఈ బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులను ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి మార్చాలని పాలక మండలి సభ్యులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈనెల 28న(ఆదివారం) ది ఇన్నీసుపేట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్న సాధారణ మహాజనసభ సమావేశంలో బ్యాంకును 1995 చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. త్వరలో జాంపేట, ది ఆర్యాపురం బ్యాంకులను కూడా ఆయా పాలకమండళ్లు ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పాలక మండళ్లదే అధికారం బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి వెళితే ఆర్థిక, పాలన వ్యవహారాల్లో పాలక మండళ్లదే తుది నిర్ణయం. ఉద్యోగుల నియామకం కూడా మండలే చేపడుతుంది. ఒక ఏడాదిలో బ్యాంకుకు నష్టం వస్తే మరుసటి ఏడాదికి బదలాయించడానికి వీలుండదు. దాని కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రుణాలు ఇవ్వడంలో పాలక మండలిదే తుది నిర్ణయం. ప్రభుత్వ తనిఖీలు ఉండవు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే బ్యాంకు కుప్పకూలుతుంది. – సింగరాజు రవిప్రసాద్, సెక్రటరీ, ది జాంపేట కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ -
చిక్కుల్లో కెప్టెన్
సాక్షి, చెన్నై : కింగ్...కింగ్ అంటు పరుగులు తీసి చివరకు చతికిలబడ్డ డీఎండీకే అధినేత విజయకాంత్ మరో చిక్కుల్లో పడ్డారు. ఆయన పార్టీ కొత్తకష్టాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు ఆ పార్టీకి దూరం కానున్నది. అలాగే, వీసీకే, ఎండీఎంకేలకు కూడా అదే కష్టాలు బయలు దేరాయి.తమిళనాట ప్రత్యామ్నాయం తామేనంటూ మూడో కూటమిగా మెగా పార్టీలతో తెర మీదకు వచ్చిన డీఎండీకే అధినేత విజయకాంత్కు ఓటర్లు చావు దెబ్బ తగిలేలా చేశారు. ఇదే ఇప్పుడు ఆపార్టీకి కష్టాల్ని సృష్టించనున్నాయి. డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓ వైపు ఉంటే, మరో వైపు పార్టీకి ఎన్నికల యంత్రాంగం గుర్తింపు దూరం కానున్నది. పార్టీ ఆవిర్భావంతో పది, గత ఎన్నికల్లో ఎనిమిది శాతం మేరకు ఓటు బ్యాంక్ దక్కించు కున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతోపాటు 29 మంది ఎమ్మెల్యేల్ని తన ఖాతాలో వేసుకుని ఎన్నికల యంత్రాంగం గుర్తింపు సైతం విజయకాంత్ పొందారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నంగా ఢంకా ముద్ర కూడా వేసుకున్నది. అయితే, ఇప్పుడు ఆ ముద్ర కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధినేత ఓటమి చవిచూడడమే కాకుండా, అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో పీకల్లోతు కష్టాలను విజయకాంత్ కొని తెచ్చుకున్నారు. ఆ పార్టీ పోటీ చేసిన 104 నియోజకవర్గాల్లో వందలోపు నియోజకవర్గాల్లో కేవలం మూడు నుంచి ఐదు వేలలోపు ఓట్లు మాత్రమే రావడంతో చావు దెబ్బ తప్పలేదు. ఇంకా చెప్పాలంటే, ఎనిమిది శాతం మేరకు ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పడు రెండున్నర శాతంలోపు పడి పోయింది. ఐదున్నర శాతం మేరకు ఓటు బ్యాంక్ను కోల్పోయారు. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు కావాలంటే, ఆరు శాతం ఓట్లు తప్పని సరి, అయితే, కెప్టెన్ పార్టీకి వచ్చిన ఓట్లు మరీ దారుణంగా ఉండడంతో ఇక గుర్తింపు దూరం అయినట్టే. అదే విధంగా ఎండీఎంకే నేత వైగోకు కష్టాలు తప్పడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించడం, ఈ ఎన్నికల్లో 26 చోట్ల పోటీ చేసి కేవలం 0.9 శాతం ఓట్లను దక్కించుకోవడంతో ఆ పార్టీకి గుర్తింపుతో పాటుగా చిహ్నం దూరం అయ్యే అవకాశాలు ఎక్కువే. అలాగే, వీసీకే డిపాజిట్లు సైతం ఈ ఎన్నికల్లో గల్లంతు కావడం, 0.8 శాతం ఓట్లు మాత్రం దక్కడంతో పార్టీకి ఎన్నికల యంత్రాంగం వద్ద గుర్తింపు లేనట్టే. సీపీఎం 0.7 శాతం, సీపీఐ 0.8 శాతం ఓట్లను దక్కించుకుని రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఓ మూలన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయం...ప్రత్యామ్నాయం అంటూ వైగో ఇచ్చిన పిలుపుతో ఉరకలు తీసిన వీరికి ఈ సారి చావు దెబ్బ తగలడం గమనార్హం. అదే సమయంలో ఆలస్యంగా ఈ కూటమిలోకి చేరి ఎన్నికల గుర్తింపు పొందాలని తహ తహలాడిన తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్కు చెంప పెట్టే. తమిళ మానిల కాంగ్రెస్కు 0.5 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. ఇంకా, చెప్పాలంటే, ఈ ఆరు పార్టీలు తలా సాధించిన ఓట్ల కంటే, నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువే. అలాగే, వీరి కన్నా, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పార్టీ 1.1 శాతం ఓట్లను కైవశం చేసుకోవడం గమనార్హం. కాగా, తమకు కష్టాలు ఎదురైనా, ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆరు పార్టీల నాయకులు శుక్రవారం తెర ముందుకు వచ్చారు. డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్లు ప్రకటనల రూపంలో, ప్రెస్మీట్ల రూపంలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ సమరంలో....చివరకు ప్రజా స్వామ్యాన్ని నోట్ల కట్టలు రాజ్యమేళాయన్న కొత్త పల్లవితో డిఎంకే, అన్నాడీఎంకేల మీద దుమ్మెత్తి పోశారు. అలాగే, ఇప్పుడు ఓడినా, భవిష్యత్తు తమదే అంటూ , కలిసి కట్టుగానే ప్రజల కోసం తమ పోరాటం ఆగదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కలిసి కట్టు అన్నది స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయినా, నిలుస్తుందో లేదో అన్నది వేచి చూడాల్సిందే. -
వాసవీ బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు
హైదరాబాద్: వాసవీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిటర్లకు గురువారం చెల్లింపులు జరిగాయి. డిపాజిట్ దార్లకు వారు డిపాజిట్ చేసిన మొత్తం, డిపాజిట్ నుంచి ఈక్విటీ షేర్హోల్డర్లకు మారిన వారికి, ఇతర సంస్థల డిపాజిటర్లకు (పి.డి.ఐ) మొత్తంలో ఐదు శాతం చెల్లింపులు చేస్తున్నట్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.వేణుగోపాల్శర్మ తెలిపారు. గురువారం మలక్పేటలోని బ్యాంకులో రూ.లక్ష పైన డిపాజిట్ దార్లకు నగదు చెల్లింపులు చేశారు. ఈ సందర్భంగా చిత్తూర్టౌన్ బ్యాంకుకు రూ.71 లక్షలు, భీమవరం అర్బన్బ్యాంకుకు రూ. 62 లక్షలు, విజయనగరం బ్యాంకుకు రూ.20 లక్షలు, వైజాగ్ బ్యాంకుకు రూ. 20 లక్షలు, ఇతర వ్యక్తిగత డిపాజిటర్లకు ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రుణగ్రహీతలపై కఠిన చర్యలు చేపట్టి రికవరీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోర్టు కేసుల వలన ఆగిన వాటిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్లు చెల్లింపులు చేశామని, ఈ విడత రూ.7 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. డిసాజిటర్లు మే 31లోగా మలక్పేటలోని ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాగా, జూన్ 1 నుంచి సికింద్రాబాద్లోని ఎంజీఎం రోడ్డు శాఖ నుంచి బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. -
దేశంలోనే అతి పెద్ద బ్యాంకులో డబ్బుల్లేవంట..!
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంక్ ఇది. ఇటీవల ఎస్బీఐ ఏటీఎంలు జిల్లాలో తరచూ మూతపడుతున్నాయి. బ్యాంకు శాఖల్లోనూ నగదు విత్ డ్రాలకు సంబంధించి కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. ఎందుకంటే బ్యాంక్లో నగదు లేదంట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నిడదవోలు : జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు తరచూ మూతపడుతున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ఏలూరు సహా నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిడదవోలులో వారం రోజులుగా ఏటీఎంలలో నగదు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు బ్యాంక్ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విత్ డ్రా కోసం వెళితే వివిధ రకాల డిపాజిట్లు జమయ్యే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. జమైన మొత్తాలను విత్ డ్రా దరఖాస్తుదారులకు ఇస్తున్నారు. దీంతో ఆర్థిక అవసరాలు తీరక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితి ఎందుకంటే.. దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నగదును సరఫరా చేస్తుంది. అయితే ఇటీవల అక్కడి నుంచి సరఫరా మందగించినట్టు బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ కావడంతో ఖాతాదారుల సంఖ్య అత్యధికంగా ఉంటారు. అన్ని బ్యాంకులకు నగదు సరఫరా తగ్గినా స్టేట్ బ్యాంక్కు మాత్రం ఖాతాదారుల సంఖ్య ఎక్కువ కావడంతో అందరికీ సకాలంలో నగదు అందని పరిస్థితి ఏర్పడింది. మార్చి నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగియడంతో రిజర్వు బ్యాంక్లో ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఏటీఎం కార్యాలయాలకు ఆయా శాఖల నుంచి నగదును పంపించేవారు. అయితే గతేడాది నుంచి ఈ బాధ్యతను కొన్ని ప్రధాన శాఖలకు మాత్రమే అప్పగించారు. ఉదాహరణకు మొగల్తూరులో స్టేట్ బ్యాంక్ కు గతంలో దగ్గరలోని నరసాపురం స్టేట్ బ్యాంక్ బ్రాంచి నుంచి నగదు వచ్చేది. ఇప్పుడు పాలకొల్లు నుంచి వస్తోంది. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎంలకు పాలకొల్లు నుంచి నగదు రావాల్సి రావడంతో వారానికి ఒక్కరోజు మాత్రమే పంపిస్తున్నారు. దీంతో ఆ నగదునే మొగల్తూరు శాఖ అధికారులు పొదుపుగా వాడాల్సి వస్తోంది. దీంతో లక్ష రూపాయలు పైబడి నగదు చెల్లింపులు ఇవ్వడం లేదు. దీంతో వ్యాపారులు, ఖాతాదారులు ఘొల్లుమంటున్నారు. నిడదవోలులో వారం రోజులుగా నగదు నిల్ నిడదవోలు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలలో వారం రోజులుగా నగదు లేకపోవడంతో ఖాతాదారులు నానాఅవస్థలు పడుతున్నారు. పండగ పూట కూడా ఆర్థిక అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నాయి. ఏడు చోట్ల ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో కలిపి దాదాపు 20 వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఏడు రోజులుగా నగదు లేక ఏటీఎంలు మూతపడ్డాయి. బ్యాంకులో కూడా నగదు అరకొరగానే ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని స్టేట్ బ్యాంక్ శాఖల్లోనూ ఇంచిమించు ఇదే పరిస్థితి ఉంది. ఇక మిగిలిన బ్యాంకుల విషయానికి వస్తే వాటిల్లో కూడా కొన్ని బ్యాంక్లలో నగదు లావాదేవీలు బాగా ఆలస్యమవుతున్నాయని ఖాతాదారులు తెలిపారు. బ్యాంకులో నగదు లేదు బ్యాంకులో నగదు లేకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకులో నగదు కొరత ఏర్పడడంతో ఈ సమస్య తలెత్తింది. ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకు నుంచి ఎప్పుడు నగదు వస్తుందో కూడా సమాచారం లేదు. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా డిపాజిట్ చేసిన నగదును విత్డ్రాదారులకు అందజేస్తున్నాం. - వి.నరసింహరావు, స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, నిడదవోలు -
డిపాజిట్లపై ఓబీసీ వడ్డీరేట్ల తగ్గింపు
♦ పావు నుంచి అరశాతం శ్రేణిలో కోత ♦ సోమవారం నుంచీ అమలు... న్యూఢిల్లీ: కోటి రూపాయలలోపు డిపాజిట్ల విషయంలో పలు కాలపరిమితులకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించినట్లు ప్రభుత్వరంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. మార్చి 28వ తేదీ (సోమవారం) నుంచీ తగ్గించిన డిపాజిట్ రేట్లు అమల్లోకి వస్తాయని బీఎస్బీకి సమర్పించిన ఒక నోట్లో తెలిపింది. పలు మెచ్యూరిటీలపై పావుశాతం నుంచి అరశాతం మేర వడ్డీరేట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై కేంద్రం భారీగా వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో... రేటు కోత నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్గా ఓబీసీ నిలవడం గమనార్హం. రేటు కోత తీరును చూస్తే... ఏడాదిలోపు అర... ఆపై పావు.. ♦ 31 రోజుల నుంచి 45 రోజుల మధ్య డిపాజిట్ రేటు 5% నుంచి 5.5%కి దిగింది. ♦ 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య డిపాజిట్ రేటు అరశాతం తగ్గి 6 శాతానికి పడింది. ♦ 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య రేటుఅరశాతం తగ్గి 6.25కు చేరింది. ♦ ఏడాది నుంచి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్ల రేటు 7.75% నుంచి 7.5 శాతానికి తగ్గింది. ♦ 2-10 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లపై రేటు కూడా ఇంతే తగ్గి 7.25%కి చేరింది. -
పురోగతి నివేదిక సమర్పించండి
► అక్షయ గోల్డ్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం ► ఇకపై ప్రతి విచారణకు హాజరు కావాలని సంస్థ ఎండీకి స్పష్టీకరణ ► తదుపరి విచారణ 24కు వాయిదా సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన దర్యాప్తునకు సంబంధించిన పురోగతితో నివేదిక సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేగాక అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై ప్రతి విచారణకు స్వయంగా హాజరు కావాలని అక్షయ గోల్డ్ మేనేజింగ్ డెరైక్టర్ను ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు అక్షయ గోల్డ్లో ఉన్నారు.. ఏ ఏ సంవత్సరాల్లో వారు ప్రాతినిథ్యం వహించారు.. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిందితులెవరు.. డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి?.. తదితర వివరాలను తేల్చాలని, ఇందుకు అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)ను ఆశ్రయించాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా అక్షయగోల్డ్ యాజమాన్యం ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్, అక్షయగోల్డ్ తరఫు న్యాయవాది ధనుంజయ వాదనలు వినిపించారు. -
బ్యాంకుల్లోనూ క్యాష్ కటకట!
♦ శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర పరిస్థితి ♦ డిపాజిట్లను మించిపోయిన విత్డ్రాలు ♦ ఏటీఎంలు ఖాళీ, క్యూ కడుతున్న జనం ♦ మరికొన్నాళ్లు తప్పదంటున్న బ్యాంకర్లు ♦ ఆర్బీఐ నుంచి నగదు వస్తేనే పరిస్థితి కొలిక్కి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జేబులో డబ్బులు లేకపోవటం చూశాం. చేతిలో చిల్లిగవ్వ లేదనటం విన్నాం. కానీ బ్యాంకులో డబ్బు లేదనటం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఒక్క బ్యాంకు కాదు... ఒక బ్రాంచి కాదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటీఎం ముందూ జనాల బారులే. ఎంత లైన్లున్నా చాలా చోట్ల ఖాళీ ఏటీఎంలే కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేవు. పెపైచ్చు ఫిబ్రవరి నెలలో విత్డ్రాయల్స్ విలువ చాలా ఎక్కువగా ఉంది. పక్షం రోజులుగా జిల్లా వ్యాప్తంగా జాతరలు, తీర్థాలతో పాటు వివాహాలూ భారీగా జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద జనం డబ్బు కోసం క్యూ కడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాల్సి రావడం విత్డ్రాయల్స్ అధికమయ్యాయి. డబ్బు తీసుకున్న కొనుగోలుదారులు వాటిని ఇతర ప్రాంతాల్లో జమ చేస్తుండటం, స్థానికంగా డిపాజిట్లు తగ్గటం వంటివి పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. రెండు వారాల నుంచీ ఇదే పరిస్థితి... శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 281 బ్యాంకులు, 240 వరకు ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. బ్యాంకును బట్టి ఒక్కో ఏటీఎంలో వారం నుంచి నెలరోజుల వ్యవధిలో కనీసం రూ.10 నుంచి 20 లక్షల వరకు పెడుతుంటారు. ఖరీఫ్ చివర్లో మొదలైన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఫిభ్రవరి 15 నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి సుమారు రూ.150 కోట్ల అవసరం వచ్చింది. ఫిబ్రవరిలో ఫించన్ల చెల్లింపులు రూ.30 కోట్ల మేర జరిగాయి. ట్రెజరీల నుంచి వచ్చే బిల్లుల ఆధారంగా జీతాలకూ కనీసం రూ.20 నుంచి రూ.30 కోట్లు కావాలి. వివిధ ప్రాంతాల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తాలు ఆన్లైన్లోనే వస్తుంటాయి. పేమెంట్ల మొత్తాన్ని, డిపాజిట్ల మొత్తాన్ని సగటున లెక్కించి సొమ్ము అవసరమైన పక్షంలో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. అలా ఒక్క ఫిబ్రవరిలోనే విజయవాడ నుంచి ఎస్బీఐ సుమారు 80 కోట్ల రూపాయలు తెప్పించింది. ఆ మొత్తాన్ని 50-80 ఏటీఎంలలో సర్దేసరికి ఖాళీ అయిపోయింది. రోజుకు జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎస్బీఐలోనే రూ.10 కోట్ల డిపాజిట్లు ఉంటున్నాయి. కారణాలు తెలియరాలేదు గానీ... ఫిబ్రవరిలో ఈ మొత్తం తగ్గింది. దీంతో క్యాష్ కోసం జనం కిటకిటలాడాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా... ఫిబ్రవరిలో మరీ ఎక్కువయింది. శివారు ప్రాంతాల ఏటీఎంలలోనూ రద్దీ కని పించింది. ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎంల పరిస్థితీ అంతే. ఇతర బ్యాంకులపై ఎస్బీఐ ఆధారపడినా... అది కొంతవరకే ఉపయోగపడింది. ఆర్బీఐ నుంచి నిధులు రాకపోవడమే... నగదుకు కొరత వస్తే బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెప్పిస్తుంటాయి. చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేకపోయినా, తక్కువ చెల్లింపులు, ఎక్కువ పేమెంట్ల సమయంలో తమకు నిధులు అవసరమంటూ లేఖలు రాస్తాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఆంధ్రాబ్యాంకు రూ.40 నుంచి రూ.50 కోట్ల కోసం రిక్వెస్ట్ లెటర్లు పంపింది. ఎస్బీఐ కూడా రూ.100 కోట్లు కావాలని కోరింది. సమయానికి ఆర్బీఐ నుంచి డబ్బులు రాకపోవడంతో బ్యాంకులు చేతులెత్తేశాయి. ఎస్బీఐ ఏటీఎంలలో నిత్యం రూ.8 కోట్లు పెడుతుంటామని, ఈ సారి పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం, బ్యాంకు వద్ద డబ్బు లేకపోవడంతో ఆర్బీఐపైనే ఆధారపడాల్సి వచ్చిందని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ మేరీ సగయా ‘సాక్షి’కి చెప్పారు. మార్చి మొదటి వారంలో ఆర్బీఐ నుంచి నిధులొస్తాయని, పరిస్థితి సర్దుమణుగుతుందని ఆమె చెప్పారు. ‘‘ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాల్ని ఏటీఎంలలో సర్దాం. కొన్నాళ్లుగా నగదుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే’’ అన్నారామె. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంద ని, దీన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్ళామని లీడ్ బ్యాంకు మేనేజరు ఎల్.రామిరెడ్డి చెప్పారు. త్వరలోనే సమస్య నుంచి బయటపడతామన్నారు. -
రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా (పీఎంజేడీయూ)’ కార్యక్రమం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు రూ.30,000 కోట్లకు పైగా చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జనవరి 20 వరకు జన్ ధన్ యోజనా కింద దాదాపు 20.38 కోట్ల బ్యాంకు ఖాతాల ప్రారంభం జరిగింది. -
అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే
-
అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే: హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దని, డబ్బు ఇప్పించే బాధ్యత తమదే అని హైకోర్టు తెలిపింది. అగ్రిగోల్డ్ కేసును సోమవారం హైకోర్టులో విచారించారు. వచ్చే వారం లోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐడీని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను హైకోర్టు అకౌంట్కు మళ్లించాలని కోర్టు తెలిపింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ. 7.40లక్షలను కూడా తమ అకౌంట్కు జమ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. -
ఏంటా లాభాలు..
డిపాజిట్లు, డెట్ ఫండ్స్తో పోలిస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65 శాతం కంటే అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని ఈక్విటీ ఫండ్స్గానే పరిగణిస్తారు. దీంతో ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఏడాదిలోగా వైదొలిగితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభ పన్ను, ఆ పన్నుపై 3 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీ శ్లాబును బట్టి పన్ను భారం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. దీంతో డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజన ఆకర్షణను కోల్పోయాయి. -
ఏపీ విద్యామండలి ఖాతాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లోని ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాను బ్యాంకు అధికారులు (ఫ్రీజ్)నిలిపివేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చేసిన ఫిర్యాదుతో ఎస్బీహెచ్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని శాంతినగర్ ఎస్బీహెచ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలికి గురువారం లేఖ అందించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిర్యాదు మేరకు ఖాతాలు నిలిపివేస్తున్నామని, వివాదం ఏమైనా ఉంటే 2 విద్యామండళ్లూ పరిష్కరించుకొని వస్తేనే ఖాతాలను తిరిగి కొనసాగిస్తామని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలికి శాంతినగర్ బ్రాంచిలో రూ.25 కోట్ల వరకు వివిధ డిపాజిట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకు ఫ్రీజ్ చేసింది. ఈ పరిణామంపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు తీవ్రంగానే స్పందించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే బ్యాంకు అధికారులను నిలదీసిన మండలి అధికారులు.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి స్పందిస్తూ.. ఎస్బీహెచ్ తీరు తీవ్ర ఆక్షేపణీయమని, చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. కాగా, ఖాతాల నిలిపివేతతో వివిధ సెట్ల నిర్వహణ, ఏర్పాట్లు నిలిచిపోనున్నాయని మండలి అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీహెచ్ తీరును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించడంతోపాటు అవసరమైతే ఎస్బీహెచ్ను బ్లాక్లిస్టులో పెట్టే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు మండలి వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖలో ఎక్కడా ఫ్రీజ్ చేయాలని కోరకపోయినా.. ఎస్బీహెచ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రభుత్వం మండిపడుతున్నట్టు తెలిసింది. -
బ్యాంకులకు మస్కా
దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లను మింగేసిన మేనేజర్ వరదయ్యపాళెం ఎస్బీఐలోరూ.1.88 కోట్లను కొల్లగొట్టిన డెప్యూటీ మేనేజర్ ఇంటర్నల్ ఆడిట్లో లొసుగులే కారణమా ? సాక్షి ప్రతినిధి, తిరుపతి : మొన్న సత్యవేడు మండలం దాసకుప్పంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్పీజీబీ)లో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపి రూ.2.5 కోట్లను బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు కాజేశారు. నిన్న వరదయ్యపాళెం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డెప్యూటీ మేనేజర్ మహేంద్ర రూ.1.88 కోట్లను మింగేశారు. ఈ రెండు ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. బ్యాంకులపై విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోజువారీ ఆడిట్.. ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్లు పక్కాగా చేసి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసే అవకాశం ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం.. మింగిన సొమ్మును కక్కించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఏ రోజుకారోజు ఏ మేరకు రుణం ఇచ్చాం.. ఏ మేరకు డిపాజిట్లు వచ్చాయి.. ఎంత సొమ్మును వసూలు చేశారు అన్న లెక్కలు ప్రతి బ్యాంకులోనూ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేస్తారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్లోనూ ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్ బృందం లెక్కలను తనిఖీ చేస్తుంది. నిరర్ధక ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, వసూళ్లు లాభాలు వంటి అంశాలను ఆడిట్ నివేదికలో పొందుపరుస్తారు. ఆ నివేదిక ఆధారంగా బ్యాంకుల యాజమాన్యం చర్యలు తీసుకుంటాయి. రోజు వారీ ఆడిట్.. ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగా ఉంది. దాసకుప్పం ఎస్పీజీబీ, వరదయ్యపాళెం ఎస్బీఐలో చోటుచేసుకున్న ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా డొల్లతనం ఉందని ఎత్తి చూపాయి. ఆడిట్లో లోపాల వల్లే.. దాసకుప్పం ఎస్పీజీబీలో మేనేజర్ మనోహరుడు 2012 నుంచి 2014, జూలై వరకూ 85 మంది రైతులు, 75 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, 37 ఆర్వైఎస్ రుణాలు, 131 స్వయం సహాయక సంఘాల అధ్యక్షుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.2.5 కోట్ల రుణాలు ఇచ్చినట్టు చూపి ఆ మొత్తాన్ని కాజేశారు. ఈ ఉదంతం జూలై 25న బయటపడింది. బ్యాంకు యాజమాన్యం మనోహరుడిని సస్పెండ్ చేసి.. సత్యవేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. మనోహరుడి నుంచి డబ్బును రికవరీ చేయడంపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరదయ్యపాళెం ఎస్బీఐలో డెప్యూటీ జనరల్ మేనేజర్గా మహేంద్ర ఫిబ్రవరి, 2010 నుంచి 2014 ఆగస్టు వరకూ పనిచేశారు. అప్పట్లో డెయిరీ, మహిళా పొదుపు సంఘాల పేరిట 41 సంఘాలను సృష్టించి రూ.1,88,95,382 రుణంగా ఇచ్చినట్లు చూపి ఆ మొత్తాన్ని మింగేశారు. ఆ బ్యాంక్ మేనేజర్ ఈ నెల 16న గుర్తించి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఏ రోజుకారోజు ఆడిట్, ఆర్నెల్లకు ఓ సారి నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లు సక్రమంగా జరిగి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే చెక్ పడి ఉండేది. ఈ ఆడిట్లను సక్రమంగా చేయకపోవడంతోనే ఆ రెండు బ్యాంకుల్లోనూ ఆ ఇద్దరూ కోట్లను కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది. చర్యలు శూన్యం .. బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటే పోలీసు కేసు నమోదు చేయడంతోపాటూ సీబీఐతో కూడా విచారణ చేయిస్తారు. దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లు మింగేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహరుడిపై ఇప్పటిదాకా బ్యాంకు యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేయలేదు. పైగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సత్యవేడు పోలీసులకూ విచారణలో ఉన్నతాధికారులు సహకరించడం లేదనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో దాగిన మర్మమేమిటన్నది అంతుచిక్కడం లేదు. వరదయ్యపాళెం ఎస్బీఐలో అక్రమాలకు పాల్పడిన మహేంద్రపై మాత్రం యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేయడంతోపాటూ సస్పెండ్ చేసి, రికవరీపై దృష్టి సారించింది. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ యాజమాన్యం తరహాలోనే ఎస్పీజీబీ ఉన్నతాధికారులు ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అంశంపై బ్యాంకు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
సీఐడీకి ‘బొమ్మరిల్లు’ కేసు
కాశీబుగ్గ పోలీసుల నుంచి రికార్డుల స్వాధీనం పలాస : పలాస-కాశీబుగ్గ పట్టణంలో బొమ్మరిల్లు పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన కేసును సీఐడీ పోలీసులకు బదిలీ అయింది. ఈ మేరకు సీఐడీ సీఐ బి.స్వామినాయుడు, నర్సింగరావు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్స్టేషన్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఏడాది క్రితం 13 వేల మంది ఖాతాదారులకు శఠగోపం పెట్టి, సుమారు రూ.7 కోట్ల సొమ్మును కొల్లగొట్టిన బొమ్మరిల్లు యజమాని రోయల రాజారావుపై బాధితుల్లో ఒకరైన పొందూరు కూర్మారావు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ రామకృష్ణ వారిపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. తొలుత కొంతమంది ఖాతాదారులు బొమ్మరిల్లు యాజమాన్యంపై విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నలుగురు డెరైక్టర్లను అరెస్టు చేసిన విషయం వెలుగులోకి రావడంతో పలాస-కాశీబుగ్గ పట్టణంలో బొమ్మరిల్లు బ్రాంచిపై కలకలం రేగింది. ఈ సంస్థకు ఏలూరు సమీపంలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన ఆర్ఆర్ రాజా ఎమ్డీగా ఉన్న సమయంలో పలాసలో 2012 ఫిబ్రవరి ఐదో తేదీన బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ పరిధిలో ఒక ఏబీఎంతో పాటు ఎనిమిది మంది ఏజెంట్లు పనిచేశారు. పూండి ప్రాంతంలో కళింగరాజ్యం వెంచర్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్లాట్లను చూపిస్తూ పది శాతం వడ్డీతో ఏడాదికే మొత్తం సొమ్ము తిరిగి చెల్లిస్తామని సామాన్య ప్రజల నుంచి అత్యధిక శాతం డబ్బులు వసూలు చేశారు. అయితే గడువు పూర్తయినా వారికి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఐడీ పోలీసులు వీటిపై దృష్టిసారించి కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. -
అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
నెల్లూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ప్రజలను మోసగించిన అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న అక్షయ గోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్షయ్గోల్డ్ సంస్థ గొలుసుకట్టు వ్యాపారంతో సుమారుగా కోట్ల రూపాయలను వసూలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన అక్షయ్ గోల్డ్ సంస్థ ప్రజలను బురిడీ కొట్టించింది. తాము అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర పెట్టుబడులు పెడితే భారీ లాభాలను అందిస్తామని ప్రజలను మభ్యపెట్టారు. వారి నుంచి దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్లు సేకరించి భారీ మోసానికి తెరలేపారు. -
వెయ్యి కోట్ల డిపాజిట్లపై మహిళా బ్యాంక్ దృష్టి
ముంబై: భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) 2015 మార్చి నాటికి రూ.1,000 కోట్ల డిపాజిట్లు, రూ.800 కోట్లరుణ మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ (సీఎండీ) డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఇక్కడ శనివారం బ్యాంక్ 35వ బ్రాంచ్ ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లుకాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్వర్క్ సంఖ్యను 80కి పెంచాలన్నది కూడా లక్ష్యం. ముఖ్యంగా ఈ విషయంలో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో బ్రాంచీల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. -
వచ్చే వారం 'పీఎఫ్ పై వడ్డీ'కి కేంద్రం ఆమోదం!
న్యూఢిల్లీ: పీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీ చెల్లించాలన్న ఈపీఎఫ్వో నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే వారంలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆగస్టు 26న కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో పీఎఫ్ వడ్డీపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది. ఈపీఎఫ్వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. గతవారం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. -
ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై భారత్లో పన్ను ఉండదు. కానీ, కొందరు ఎన్నారైలకు తమ స్వదేశంలో డిపాజిట్లు, అద్దెల రూపంలో ఆదాయాలుంటాయి. ఇలాంటి ఆదాయం వార్షిక పరిమితి రూ.2 లక్షలు మించితే వారు విదేశాల్లో నివసిస్తున్నా ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్లు, అద్దెలే కాకుండా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలోనూ లాభాలొస్తే వాటికీ పన్ను చెల్లించాలి. ఎన్నారైలు రిటర్నులు దాఖలు చేయడానికి గడువు జూలై 31. రిటర్నుల దాఖలుకు ముందు ఎన్నారైలు గమనించాల్సిన కొన్ని అంశాలివీ... రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలంటే.. ఇండియాలో ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించినపుడు; చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ డిడక్ట్ చేసినపుడు; మూలధన నష్టాల(క్యాపిటల్ లాస్)కు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కారానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం విషయంలో వ్యక్తులకు కొన్ని మినహాయింపులుంటాయి. కొన్ని రకాల పెట్టుబడులు, గృహ రుణంలో అసలును చెల్లించడం మొదలైనవి. ఈ మినహాయింపులు ఎన్నారైలకు కూడా వర్తిస్తాయి. దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్నుల నుంచి రిఫండ్ కోసం బ్యాంకు అకౌంటు నంబరు, బ్రాంచ్ ఎంఐసీఆర్ కోడ్ వంటి మీ బ్యాంకు వివరాలను లోపరహితంగా అందించాలి. ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసినపుడు రిఫండ్ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది. ఆదాయ పన్ను శాఖ వారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఎన్నారైలు తమ రిటర్నులను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్యాక్స్ అడ్వైజర్ల సహాయాన్ని వారు పొందవచ్చు. లేదంటే ప్రైవేట్, పెయిడ్ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ ద్వారానూ రిటర్నులు పంపవచ్చు. ఎన్నారైలకు సంబంధించి... భారత్లో వారి ఆదాయమంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్, పెట్టుబడులపై ఆదాయం మాత్రమే ఉంటాయి. మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆదాయ స్థానంలోనే పన్ను తగ్గింపు జరిగినా రిటర్నులు సమర్పించనక్కర్లేదు. -
పీఎఫ్ డిపాజిట్లపై 9% వడ్డీ!
మెరుగుపడిన మార్కెట్ పరిస్థితుల ఫలితం న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఏడాది తొమ్మిది శాతం వడ్డీని అందజేసే అవకాశం కన్పిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తన ఐదు కోట్లకు పైగా చందాదారులకు ఈపీఎఫ్ఓ 8.75 శాతం వడ్డీని చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఈ వడ్డీని 0.25 శాతం మేరకు సులభంగా పెంచే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించారుు. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగుపడిన మార్కెట్ పరిస్థితులు.. సంస్థ పెట్టిన వివిధ రకాల పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు సమకూరవచ్చనే అంచనాలను పెంచాయని ఆ వర్గాలు వివరించారుు. ఈపీఎఫ్ఓ సాధారణంగా రూ.5 లక్షల కోట్ల మూలనిధిని నిర్వహిస్తూంటుంది. 2013-14లో వివిధ సామాజిక భద్రతా పథకాల కింద తన ఖాతాదారుల నుంచి రూ.71,195 కోట్ల ఇంక్రిమెంట్ల సంబంధిత డిపాజిట్లను స్వీకరించింది. ఇది అంతకుమునుపు ఏడాది (రూ.61,143 కోట్లు)తో పోల్చుకుంటే 16% అధికం. మరోవైపు ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్డీఎస్) కింద ఉన్న సుమారు రూ.55 వేల కోట్ల తన పెట్టుబడులను నగదుగా మార్చే యోచనలో ఈపీఎఫ్ఓ ఉంది. -
ఆంధ్రాకు రూ.7155 కోట్లు తెలంగాణకు 3756 కోట్లు
రెండు రాష్ట్రాల పీడీ ఖాతాల్లో నగదు నిల్వల లెక్కతేల్చిన అధికారులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యక్తిగత డిపాజిట్ల(పీడీ ఖాతా) లోని నగదు నిల్వలు రెండు రాష్ట్రాలకు జూన్ 2వ తేదీ నుంచి పంపిణీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పట్ణణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లోని నగదు నిల్వలను మరోసారి సరిచూసి ఈ నెలాఖరులోగా లెక్కలు తేల్చాల్సిందిగా అన్ని శాఖలను ఆర్థిక శాఖ శనివారం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిల్లో ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 72,547 పీడీ ఖాతాలున్నాయి. అందులో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 43,343 పీడీ ఖాతాల్లో రూ.7155.45 కోట్లు నిల్వ ఉండగా తెలంగాణలోని 10 జిల్లాల్లో 29,204 పీడీ ఖాతాల్లో రూ.3756.77 కోట్లు నిల్వ ఉన్నట్లు తేల్చారు. ఈ పీడీ ఖాతాల్లో నిల్వలను నెలాఖరులోగా సరి చూసి లెక్క తేల్చాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో నిల్వలను సరిచూసి జూన్ 2వ తేదీ నుంచి పీడీ ఖాతాల్లో కచ్చిత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 35 పీడీ ఖాతాలున్నాయని, ఆ ఖాతాలు జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త పీడీ ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్లు, కేంద్రాలకు చెందినవి 75 పీడీ ఖాతాలుండగా ఆ ఖాతాలు రెండు రాష్ట్రాలకూ చెందుతాయని పేర్కొన్నారు. -
సీపీఐ నిర్మాణం భ్రష్టుపట్టింది...
పోటీ చేసి ఉండాల్సింది కాదు.. నారాయణపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు సాక్షి, విజయవాడ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యవహారశైలి వల్ల పార్టీ నిర్మాణం భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి వ్యవహారశైలిని నిరసిస్తూ ఆయన నారాయణకు నాలుగు పేజీల లేఖ రాశారు. బూర్జువా పార్టీలతో నేస్తం, వాణిజ్య, పారిశ్రామిక, బడా కాంట్రాక్టు సంస్థలతో సంబంధాలు, నాయకుల ఆర్థిక అరాచకానికి తోడ్పాటు వల్లే గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీ వైఫల్యం చెందిందని ఆరోపించారు. పార్టీ ఎన్నడూ ఎరుగని రీతిలో డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా ఘోరమైన రీతిలో లభించిన ఓట్లు పార్టీ దిగజారుడుకు అద్దం పడుతోందన్నారు. దీన్ని రాజకీయ అంశాలపై జరిగిన నష్టం భావిస్తే పార్టీకి మరింత నష్టం చేసినవారవుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధినేతగా నిర్మాణ బాధ్యతలు నిర్వహించి, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్న చోట పోటీ చేయడం అవసరమే అయినా, రాష్ట్రవ్యాప్త సమన్వయంతోపాటు చాలెంజ్గా కేంద్రీకరించాల్సిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఏమాత్రం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల పార్టీ శ్రేణులు, ప్రజల్లో విభిన్న ధోరణులు మరిచిపోక ముందే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఒక రాష్ట్రంలో పోటీ చేయడం బాగోలేదని, కృష్ణాజిల్లాతో పాటు పలు జిల్లాల సమావేశాల నుంచి వచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. బహిరంగ విమర్శలు వచ్చినప్పుడైనా పార్టీ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొని ఉంటే రాష్ట్రవ్యాపితంగా కూడా పార్టీ గౌరవం పొంది కొంత నిలబడి ఉండేదన్నారు. ఎన్నికల తర్వాత ఖమ్మం పార్లమెంట్ స్థానంలో సీపీఎం నాయకుడిపై చేసిన ఆర్థిక ఆరోపణలు తొందరపాటు చర్య అన్నారు. తొందరపాటు, ఆ తర్వాత పశ్చాత్తాపాలు మీకు సహజం కాని, పార్టీ పట్ల ఏర్పడిన చులకన మరింత పెరుగుతోందన్నారు. కిందిస్థాయి సీపీఎం నాయకులు ప్రత్యారోపణలకు అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. తెలంగాణలో కేంద్ర పార్టీ విధానానికి విరుద్ధంగా ప్రత్యేక పరిస్థితుల పేరుతో దేశమంతా ఛీకొట్టిన కాంగ్రెస్తో జత కట్టినా మనకు ఒరిగింది లేకపోగా పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. వామపక్ష ఉద్యమ కేంద్రం, సీపీఐకి గుండెకాయ లాంటి విజయవాడలో చారిత్రాత్మక పరాజయానికి నారాయణ కూడా బాధ్యులేనన్నారు. 130 ఏళ్ల విజయవాడ మున్సిపాలిటీ, కార్పొరేషన్ చరిత్రలో పలుసార్లు పాలించిన సీపీఐకి మొదటిసారి ప్రాతినిధ్యం లేకుండా పోవడం, అగ్రనాయకత్వం పోటీ చేసిన డివిజన్లలో కూడా డిపాజిట్లు కోల్పోవడం అవమానకరమన్నారు. నగర కార్యదర్శిగా ఉన్న దోనేపూడి శంకర్ ఏకపక్ష విధానాల వల్ల పార్టీ నష్టపోయిందన్నారు. కౌన్సిల్ సభ్యుడైన తనను ఏనాడు సమావేశాలకు పిలవకపోగా, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అభ్యర్థుల ఎంపికలో భాగస్వామిని చేయలేదన్నారు. ఓటు వేసిన గుర్తు చెరగకముందే కార్పొరేటర్గా పోటీ చేసిన నగర కార్యదర్శిని ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేయడం వల్ల పార్టీకి మరెవ్వరూ దిక్కులేదనే భావన కలిగిందన్నారు. ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయిస్తానని తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్రస్థాయి నుంచి నగర స్థాయి వరకూ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సుబ్బరాజు డిమాండ్ చేశారు. -
పత్తాలేని క్రాంగెస్
విభజనతో ప్రజల్లో దోషి ఆరు దశాబ్దాల తర్వాత ప్రాతినిధ్యం లేకుండా పోయిన వైనం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ కళావిహీనమైంది. జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామమాత్రపు ఫలితాలు రాబట్టుకున్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడా డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొంది. 1952 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేని సందర్భం లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి జిల్లా నుంచి ఆ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీలు లేకుండాపోవడం గమనార్హం. సాక్షి, విజయవాడ : జిల్లా నుంచి గత ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రజారాజ్యం విలీనం కావడంతో ఆ పార్టీ నుంచి గెలి చిన ఇద్దరితో కలిపి కాంగ్రెస్ బలం ఎనిమిదికి చేరింది. ఈ సారి వారిలో ఎవరూ గెలుపొందలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉన్న ఐలాపురం వెంకయ్య, పాలడుగు వెంకట్రావ్లే దిక్కయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ పార్టీని నిలువునా ముంచేసింది. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసినా ‘హస్తం’ గుర్తుపై ఓటు వేయడానికి జిల్లా ప్రజలు ఇష్టపడకపోవడంతో తాజా మాజీలు కూడా డిపాజిట్లు కోల్పోవాల్సివచ్చింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ పూర్వ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక్కరే డిపాజిట్ దక్కించుకోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. తాజీ మాజీలకు తప్పని తిప్పలు.. విజయవాడ లోకసభకు పోటీ చేసిన దేవినేని అవినాష్ 39,746 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిరాగా, చివరివరకు అభ్యర్థి దొరకని మచిలీపట్నంలో శిష్ట్లారమేష్కు 14,111 ఓట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణాజిల్లాలో ముగ్గురు తాజా మాజీలు, ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. వీరిలో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు 8,744 ఓట్లు సాధించగా, పామర్రు మాజీ ఎమ్మెల్యే డి.వై.దాస్ 8,237 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు కేవలం 1,964 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాత్రం పదివేల సంఖ్యను దాటగలిగారు. ఆయనకు 12,911 ఓట్లు వచ్చాయి. పెనమలూరు అభ్యర్థి శోభన్బాబుకు 3,336 ఓట్లు రాగా, గుడివాడ నుంచి పోటీ చేసిన అట్లూరి సుబ్బారావుకు 3,103 ఓట్లు, అవనిగడ్డ నుంచి పోటీ చేసిన మత్తి వెంకటేశ్వరరావుకు 2,091 ఓట్లు, గన్నవరం నుంచి పోటీ చేసిన సుంకర పద్మశ్రీ భక్తాకు 2,500 ఓట్లు, పెడన నుంచి పోటీ చేసిన పిన్నింటి విశ్వేశ్వరరావు అతి తక్కువగా 950 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన వేముల నాగేశ్వరరావుకు 1,978, మచిలీపట్నం నుంచి పోటీ చేసిన చలమలశెట్టి ఆదికిరణ్కు 1,212 ఓట్లు, మైలవరం నుంచి పోటీ చేసిన అప్పసాని సందీప్కు 2,927 ఓట్లు, నందిగామ నుంచి పోటీ చేసిన వేల్పుల పరమేశ్వరరావుకు 1,997 ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైనట్టేనని చెప్పక తప్పదు. -
సీనియర్లకూ తప్పని ఓటమి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్లుగా, ఆ తరువాత కార్పొరేటర్లుగా వ్యవహరించిన పలువురు సీనియర్లు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. ఈ జాబితాలో సీనియర్ కౌన్సిలర్గా, నగర డిప్యూటీ మేయర్గా పని చేసిన సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లుతోపాటు సీనియర్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన పిండి సురేష్బాబు, షేక్ అబ్దుల్ మునాఫ్ (కాంగ్రెస్), స్వర్ణ వెంకయ్య (టీడీపీ) ఉండగా, దారా జయరాజ్, మండ్ల ఈశ్వరయ్య, సంక్రాంతి కల్యాణ్, వారి కు టుంబసభ్యులు గతంలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలుపొందినప్పటికీ ఈ సారి రిజర్వేషన్లు తారుమారు కావడం తో మళ్లీ వారి కుటుంబసభ్యులను ఎన్నికల బరిలో దింపినప్పటికీ ఓటమి తప్పలేదు. చావుతప్పి కన్నులొట్ట బోయినకాంగ్రెస్ నగరంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్పార్టీకి 54 డివిజన్లలో కేవలం 12వ డివిజన్ నుంచి ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్రెడ్డి మాత్రమే గెలుపొందారు. దీంతో ఆ పార్టీకీ నగరంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్లైంది. ఒకటి, రెండుచోట్ల మా త్రమే కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం లో నిలవగా అధికభాగం డిపాజిట్లు కో ల్పోవడం గమనార్హం. కాంగ్రెస్పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో తగిన శాస్తి జరిగిందంటూ నగరవాసులు అంటున్నారు. పలుచోట్ల ప్రధాన రాజకీయపార్టీల రెబల్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తా చాటారు. సీపీఎంకు కంచుకోటగా ఉండే నగరంలోని పలు డివిజన్లలో ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులంతా ఓటమిపాలుకాగా కేవలం 25వ డివిజన్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి బిరదవోలు పద్మజ ఒక్కరే గెలుపొందారు. బీజేపీ నుంచి నగరంలోని 23వ డివిజన్కు చెందిన ఎర్రబోలు అపర్ణ, 50వ డివిజన్ నుంచి కప్పిర ఉమామహేశ్వరి మాత్రమే గెలుపొందారు. టీడీపీ నుంచి సీటు ఆశించి చివరకు బీ-ఫారం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దొడ్డపనేని రాజా విజయం సాధించారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో పనిలేదు నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఒక్కోసారి ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ఈ సారి వారి అవసరం ఉంటుందని భావించినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలను చేజిక్కించుకోవడంతో ఇక వారితో పనిలేకుండా పోయింది. -
పరువు దక్కుతుందా!
బీజేపీ అంతర్మధనం ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయో లేదోనని సందిగ్ధం విశాఖపట్నం, న్యూస్లైన్: విశాఖలోని బీజేపీ నేతలను నైరాశ్యం వెన్నాడుతోంది. ఎన్నికలు పూర్తి కాగానే అన్ని పార్టీల అభ్యర్థులు తమకు వచ్చే మెజారిటీని ఊహించి చెబుతుంటే బీజేపీ నేతలు మాత్రం ఈసారి డిపాజిట్లు దక్కుతాయని సరిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కకపోయినా పరువు నిలుస్తుందని భావిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల సమయం ఉంటే తమకు అనుకూలంగా ఉండేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కాస్త ముందుగా ప్రకటించినా తమకు లాభించేదని, ఆఖరి నిమిషంలో ప్రకటించడం వల్ల ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయామని మధనపడుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన డి.వి.సుబ్బారావుకు దాదాపు 36 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లోనే ఉత్తర నియోజక వర్గానికి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.వి.ఎన్.మాధవ్కు దాదాపు 4 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడా ఓట్లను లెక్కల్లోకి తీసుకోనవసరం లేదని, అప్పుడు ఒంటరిగా బరిలోకి దిగామని, ఇప్పుడు పరిస్థితి వేరని చెబుతున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల మద్దతుతో బరి లోకి దిగిన బీజేపీ అభ్యర్థులపై ఈసారి ప్రధాని అభ్యర్థి మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినా పరువు దక్కించుకుంటామన్న భావనలో ఉన్నారు. -
పదవుల కోసం పార్టీ పెట్టలేదు : పవన్
అనకాపల్లిరూరల్, న్యూస్లైన్ : పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు పాల్పడిం ది సోనియాయేనని అన్నారు. మన్మోహన్ సోనియా చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందని, డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పీలా గోవింద్, పట్టణ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నీ కంత సీన్ లేదు బాబూ
-
డిపాజిట్ గల్లంతే..!