GST Bill
-
‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు!
GST reward scheme: జీఎస్టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్'(Mera Bill Mera Adhikar) పథకం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైంది. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్ల కార్పస్ను కేటాయించాయి. ‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని తెలిపారు. ఇదీ చదవండి: High Profit Farming Business: ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి.. పెట్టుబడీ తక్కువే! అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న ప్రయోగాత్మకంగా మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెలా 810 లక్కీ డ్రాలు ఉంటాయి. అలాగే ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. నెలవారీ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.10,000 చొప్పున 800 మందికి అందిస్తారు. రూ. 10 లక్షల బహుమతితో 10 డ్రాలు ఉంటాయి. ఇక ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.1 కోటి ఉంటుంది. -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
మండలిలో రెండు బిల్లులు పాస్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, వస్తు సేవల పన్ను సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సోమవారం మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినా, ఆ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సాధ్యపడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ సర్కారేనని, వారి అభిమానంతోనే మరోసారి విజయం సాధించామన్నారు. బీసీలకు ఏదో చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమని, మైనార్టీలు, బీసీలకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని వాపోయారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం మేరకు రిజర్వేషన్లు కల్పించినా.. మానవీయకోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ఉద్దేశించిన బీసీ(ఈ) వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉందని, ఈ అంశాన్ని బిల్లులో ఎలా పొందుపరుస్తారని రామచంద్రరావు (బీజేపీ) ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లలో వీటిని పరిగణనలోకి తీసుకోవడంపై సమీక్షించాలన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ఊరట రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే వస్తు, సేవల పన్ను విధింపును కేంద్రం సరళీకరించిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలిలో జీఎస్టీ–2019 బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. పన్ను ఎక్కువగా ఉంటే.. ఎగవేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే తమ వాదనను కేంద్రం అంగీకరించిందన్నారు. బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదని, ధూమపానం చేసేవారి సంఖ్య ను తగ్గించేందుకే భారీగా పన్ను వడ్డించామనే కేం ద్రం వాదన అర్థరహితమన్నారు. ఉత్తర తెలంగాణ లో సుమారు 5 లక్షల మంది పేదలు బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై భారీ పన్ను వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందంటూ సభ్యుడు రాజేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిచ్చారు. పెట్రోలియం, మద్యం అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా ధరల నియంత్రణ సాధ్యపడుతుందని మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని, భారీగా ఆదాయం సమకూరుతుందని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్సింగ్ టాక్స్ అని, రైతులు, చిన్న, మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. -
ఛాతీ పెద్దదే, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ : విశాలమైన ఛాతీ ఉందనే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా చిన్న హృదయం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ దార్శనికతను అర్థం చేసుకుని, అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నాయని ఆశించారని ప్రజలు ఆయన(మోదీ)కు పట్టం కట్టారు. నేడు అదంతా తలక్రిందులయ్యింది. ప్రతి వ్యక్తీ దొంగేనని ఆయన, ఆయన ప్రభుత్వం అనుకుంటున్నాయి’’ అని రాహుల్ ఆరోపించారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గురువారం నిర్వహించిన 112వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. డబ్బంతా నల్లధనం కాదని, అలాగని నల్లధనమంతా నగదు కాబోదని అని మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఛలోక్తులు విసిరాడు. పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంతా సవ్యంగా ఉందన్న ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నాడు. ప్రధాని మోదీ ప్రజలపై ఒకదాని వెంట మరోక(నోట్ల రద్దు, జీఎస్టీ) దెబ్బలు వేశారు. అవి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి అని రాహుల్ చెప్పారు. స్టార్టప్ ఇండియాకు తాను మద్ధతు తెలుపుతానని. కానీ, అది షట్ అప్ ఇండియా(మూసివేత)కు దారి తీసేలా ఉండకూడదని అన్నారు. నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్ల వర్థంతి దినం పాటిస్తామన్నారు. తాజ్ మహల్ వివాదంపై స్పందిస్తూ... ప్రజలంతా ఒకప్పుడు నేతల నుంచి నైతిక విలువలు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు చారిత్రక కట్టడాలను భారతీయులు కట్టారా? వేరే వాళ్లు కట్టారా? అంటూ నేతలు చేస్తున్న వాదనలు చూసి ప్రపంచం మొత్తం నవ్వుకుంటుందని చెప్పారు. ఈ మూడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘటనను ఎంఎండీ( మోదీ మేడ్ డిజాస్టర్- మోదీ చేసిన విధ్వంసం)గా రాహుల్ అభివర్ణించారు. నిరుద్యోగం పెరిగిపోయిందని.. చైనాలో రోజుకి 50,000 ఉద్యోగాల కల్పన అందిస్తుంటే.. ఇండియాలో కేవలం 458 మాత్రమే ఉందన్నారు. ఉద్యోగాల రూపకల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆక్షేపించారు. అంతకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ ట్విట్టర్ లో కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. పాతనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జైట్లీ మెడిసిన్లకు (ఆలోచనా శక్తికి) ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బును నయం చేసే శక్తి లేదని చురకలంటించారు. -
రైతు కోసం నిమిషం కేటాయించలేరా?
బన్స్వారా: జీఎస్టీ కోసం పార్లమెంట్ను అర్ధరాత్రి సమావేశపర్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతు సమస్యలపై చర్చకు ఒక్క నిమిషం కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. రాజస్తాన్లోని బన్స్వారాలో కిసాన్ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. చిన్న వ్యాపారుల ప్రయోజనాల్ని విస్మరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. ‘ప్రపంచం, అమెరికా అధ్యక్షుడి ముందు గొప్ప కోసం జీఎస్టీ బిల్లును అర్ధరాత్రి అమల్లోకి తెచ్చారు. అయితే భారత్ రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల దేశం. అంతేకానీ అమెరికాది కాదు’ అని పేర్కొన్నారు. -
ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
జీఎస్టీకి నిరసనగా కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న జీఎస్టీకి నిరసనగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీకి నిరసనగా గురువారం ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు ధర్నా చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా మాజీ విప్ జగ్గారెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
'కొత్త మార్పులకు జీఎస్టీ నాంది'
విశాఖపట్నం: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు జీఎస్టీ ఉపయోగపడుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే వ్యవస్థ జీఎస్టీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ.. రకరకాల పన్నుల విధానం వల్ల అధికారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీఎస్టీతో పన్ను ఎగవేత దారులకు చెక్ పెట్టొచ్చు. దేశంలో రాబోయే కొత్త మార్పులకు జీఎస్టీ నాంది పలుకుతుంది. వస్తుసేవల పన్ను విధానం పై అవగాహన కల్పించాలి తప్పితే వేధింపులకు గురిచేయవద్దు. వివిధ వర్తక వ్యాపార వర్గాల ప్రతినిధులు జీఎస్టీ వల్ల తాము ఎదుర్కొనే సమస్యల పై పీయూష్ గోయల్ కు రిప్రజంటేషన్స్ అందజేశారు. -
జీఎస్టీతో లాభమా ? నష్టమా ?
-
ఇండియా ఫస్ట్
సంస్కరణలతోనే విదేశీ పెట్టబడులను ఆకర్షించగలమని మోదీ ప్రభుత్వం విశ్వాసం. అందుకే దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే దృఢ సంకల్పంతో... ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీఎస్టి బిల్లు తెచ్చింది. రాష్ట్రాలను ఒప్పించి అమలు దశకు చేర్చింది. ఎఫ్డీఐలకు అనుమతులు, వ్యాపార అనుమతులను సరళతరం చేసింది.lమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... భారత్ పట్ల ప్రపంచదేశాల దృక్పథం బాగా మారింది. భారత్ బలమేమిటో, బలహీనతలేమిటో... మోదీకి స్పష్టంగా తెలుసు. అందుకే ‘మేకిన్ ఇండియా’ నినాదంతో విదేశీ పెట్టుబడులను, సాంకేతికతను ఆహ్వానించారు. అదే సమయంలో భారత ఉత్పత్తులకు మార్కెట్లను చూడటం అనేది కూడా భారత విదేశాంగ విధానంలో భాగమైంది. యాపిల్ లాంటి పెద్ద సంస్థ ఎంతగా ఒత్తిడి తెచ్చినా... మోదీ ప్రభుత్వం ఆ సంస్థ ఫోన్లను మరోచోటి నుంచి భారత్లోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో భారత్లో ఫోన్ల తయారీ యూనిట్ను పెట్టడానికి యాపిల్ ముందుకు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 21 రంగాల్లో 87 ఎఫ్డీఐ నిబంధనలను మార్చారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్లు (3,93,000 కోట్ల రూపాయలు) ఎఫ్డీఐలు వచ్చాయి. ఇరుగుపొరుగుకు స్నేహహస్తం... పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ప్రగతి సాధ్యమని భావించి భారత్... ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చింది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. చిన్న, పెద్ద దేశాలనే తేడా లేకుండా స్నేహహస్తం చాచింది. ప్రధానిగా మోదీ దేశాధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరపడం, పర్యటనలు చేయడం మూలంగా ప్రాంతీయ సంబంధాలు బలపడ్డాయి. ఇటీవలే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలకడానికి మోదీ ప్రొటోకాల్ను పక్కనబెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. బంగ్లాదేశ్తో మిత్రుత్వానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పారు. దశాబ్దాలపాటు కొన్ని దేశాలకు భారత్ దూరంగా ఉంది. మోదీ ప్రధాని అయ్యాక అలాంటివేమీ లేకుండా... మనకు ప్రయోజనం అనుకున్న ప్రతి దేశంతోనూ సంబంధాలు నెరుపుతున్నారు. దక్షిణాసియా దేశాల కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిన జీశాట్–9ను ఈ నెల 5న ప్రయోగించారు. 12 ఏళ్లపాటు సార్క్ దేశాలకు ఉచిత సేవలందించే ఈ ఉపగ్రహం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. అలాగే ఆఫ్గనిస్థాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది. ప్రపంచ సమస్యలపై... ప్రపంచం ముందున్న సవాళ్లపై చర్చల్లో భారత్ చొరవ తీసుకుంటోంది. బరువు బాధ్యతలు తీసుకుంటోంది. వివిధ అంశాలపై అగ్రరాజ్యాలతో, పలు ప్రపంచ, ప్రాంతీయ సంస్థలతో భారత్ కలిపి పనిచేస్తోంది. వాతావరణ మార్పు, సాంకేతిక సహకారం, తీవ్రవాదం, నైపుణ్య శిక్షణ, వాణిజ్య, సేవల ఒప్పందాలు, ఇంధన స్వాలంబన... అంతర్జాతీయ స్థాయిలో భారత్ చురుకుగా పనిచేస్తున్న రంగాలు. సాంస్కృతిక వారధి... ఆయా దేశాలతో మనకుగల సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలు, సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడటం ద్వారా మోదీ చారిత్రకంగా ఇరుదేశాల మధ్య అనుబంధం ఉందనేది గుర్తుచేస్తూ బంధాలను బలోపేతం చేస్తున్నారు. జపాన్, చైనా, మంగోలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలకు వెళ్లినపుడు... మోదీ అక్కడి విఖ్యాత సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు. గత ఏడాది జూన్ 21న ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచదేశాలన్నీ యోగా డేను జరుపుకొన్నాయి. ఎన్ఆర్ఐలతో సన్నిహిత సంబంధాలు... మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐలు) చేరువయ్యేందుకు, వారిలో విశ్వాసం పాదుకొల్పడానికి గట్టి ప్రయత్నమే చేశారు. అమెరికా, బ్రిటన్లలో పెద్ద స్టేడియాల్లో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా... వారు చేస్తున్న విజ్ఞప్తులపై విదేశాంగ శాఖ సత్వరం స్పందిస్తోంది. ఏ దేశానికి వెళ్లినా... అక్కడుండే భారతీయులను కలవడం మోదీ ఒక అలవాటుగా చేసుకొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములయ్యేలా ఎన్ఆర్ఐలను ప్రొత్సహిస్తున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వపరంగా నిబంధనలను సరళతరం చేస్తామని వారిని కోరుతున్నారు. (మరిన్ని వివరాలకు చదవండి) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) (మోదీ ప్రజల ప్రధానే..!) -
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ
- నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఆమోదం - ఏకపక్షంగా మరో బిల్లుకూ ఆమోదముద్ర - రైతు సమస్యలపై చర్చకు విపక్షం పట్టు - పోడియంలో వైఎస్సార్ సీపీ ఆందోళన - గందరగోళం మధ్యే సీఎం చంద్రబాబు ప్రసంగం సాక్షి, అమరావతి: ఒకపక్క రోజురోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు. మరోపక్క గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. అసెంబ్లీ చేరువలోని కృష్ణానదిలో దూకి ఇటీవలే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నా కళ్లులేని కబోదిలానే ప్రభుత్వం వ్యవహరించింది. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీలో గళమెత్తితే.. ఎప్పటిలాగే తమ అధికార బలంతో దానిని నొక్కేసింది. ప్రస్తుతం ధరల పతనంతో అల్లాడిపోతున్న తమను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ప్రకటన చేస్తారేమో నని ఆశగా ఎదురుచూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీని కేవలం 42 నిమిషాల్లోనే ప్రభుత్వం ముగించింది. జీఎస్టీ బిల్లుతో పాటు మరో బిల్లును ఆమోదించడానికి మాత్రమే పరిమితమైంది. మంగళ వారం ఉదయం స్పీకరు కోడెల శివప్రసాదరావు సభలోకి ప్రవేశించగానే రైతుల సమస్యలు, మిర్చి, పసుపు అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టాలు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలపై అత్యవసరంగా చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘విహార యాత్రల్లో ముఖ్యమంత్రి.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు.., మిరప రైతులను ఆదుకోవాలి. పసుపు రైతుల బాధలు సర్కారుకు పట్టవా? వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రికి రైతుల బాధలెందుకు పడతాయి? మిర్చి రైతుల వ్యతిరేక సీఎం డౌన్డౌన్.. ఎన్నికల హామీని నెరవేర్చాలి. రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి..’ అంటూ సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ప్రతిపక్షసభ్యులు పోడియంలో నినాదాలు కొనసాగించారు. రైతు సమస్యలపై విపక్షసభ్యులు ఇంత ఆందోళన చేసినా ముఖ్యమంత్రి రెండుసార్లు సాగించిన ప్రసంగంలో ఎక్కడా అన్నదాతల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణ: సీఎం ఆర్థిక సంస్కరణల తర్వాత జీఎస్టీనే విప్లవాత్మక సంస్కరణని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని విపక్ష ఆందోళన, నినాదాల మధ్యే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రసంగం పూర్తికాగానే స్పీకరు సూచన మేరకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ‘ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ బిల్లును ప్రతిపాదించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. గందరగోళం మధ్యే బిల్లు పాసైంది. సింధుకు డిప్యూటీ కలెక్టరు కోసం చట్ట సవరణ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇచ్చేందుకు వీలుగా చట్టసవరణకు అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసుల నియామకాల నియంత్రణ బిల్లును మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించినట్లు స్పీకరు ప్రకటించారు. రైతుల ఇక్కట్లపై నోరు మెదపని పాలకపక్షం సభ ప్రారంభం నుంచి రైతు సమస్యలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే వచ్చారు. రైతుల ఇక్కట్లపై ప్రకటన చేయడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై ఎదురుదాడికి మాత్రం సమయం కేటాయించడం గమనార్హం. విపక్షం విపరీత పోకడలు పోతోందని విమర్శించారు. సంతాప తీర్మానాలు, ఆ వెంటనే బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిపై ఒకరిద్దరు మాట్లాడడం, మూజువాణి ఓటుతో ఆమోదించడం అసెంబ్లీలో చకచకా జరిగిపోయాయి. -
ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేకి సర్కార్
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒకే దేశం...ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. -
దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
-
రైతు సమస్యలపై వాయిదా తీర్మానం
అమరావతి: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర శాసనసభతో పాటు శాసనమండలి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు మండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. అంతకు ముందు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశాలను నాలుగు రోజులు జరపాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి ఒక్కరోజులోనే అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్ సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతుల కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సభలో ప్రస్తావించనున్నారు. -
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
-
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
- ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, 10.15 గంటలకు మండలి సమావేశం - జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం భేటీ సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగానే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. -
జీఎస్టీ బిల్లుకు ఆమోదం
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: జీఎస్టీృ2017 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలని గతంలో మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. 2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అం దుకుంటూ రూ.12 వేల కంటె తక్కువ వేత నం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుం ది. ఈ విధానం ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీంతోపాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. -
కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా
అమరావతి: ఈనెల 17, 18వ తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు జీఎస్టీపై అవగాహన కల్పించనున్నారు. -
16న అసెంబ్లీ సమావేశం
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది. -
నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
-
14, 15 తేదీల్లో ‘ప్రత్యేక’ అసెంబ్లీ
స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడి తెనాలి: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మే నెల 14, 15 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. బుర్రిపాలెం రోడ్డులో రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు నివాసానికి శనివారం స్పీకర్ కోడెల, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో కోడెల మాట్లాడారు. -
నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణల కోసం నిర్వహణ - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. సాయంత్రం 3 గంటలకు మండలి భేటీ - బీఏసీలో నిర్ణయం.. సభ రెండు రోజులు జరపాలని కోరిన జానారెడ్డి - మిర్చి ధరలు, అన్నదాతల సమస్యలపై చర్చించాలని పట్టు - రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ - ఖమ్మం మార్కెట్ ఘటన ఓ కల్పిత ఆందోళన అని వ్యాఖ్య - బీజేపీ, టీడీపీలకు అందని బీఏసీ సమావేశం పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన మేరకు సవరణలు చేయడం కోసం శాసనసభ, శాసన మండలి ఆదివారం సమావేశం కానున్నాయి. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు హాజరైన ఈ భేటీలో ఆదివారం జరగనున్న ఉభయసభల ఎజెండాను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలుకానుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన బీఏసీ భేటీ జరిగింది. మండలి సమావేశం సాయంత్రం 3 గంటలకు జరపాలని అందులో నిర్ణయించారు. ఇక గత శాసనసభ సమావేశాల్లో సస్పెండైన టీడీపీ, బీజేపీ సభ్యులను బీఏసీకి ఆహ్వానించకపోవడంతో వారు హాజరుకాలేదు. కేసీఆర్, జానా మధ్య ఆసక్తికర చర్చ! బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించలేదని... 2013 చట్టాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపేది కాదని జానారెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ చట్టం కంటే ఉన్నతమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఆదివారాల్లో సమావేశాలు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రశ్నించగా... మిగతా ఆరు రోజుల్లో పాలనాపరమైన అంశాలపై దృష్టి పెడుతున్నామని, అందుకే ఆదివారం సమావేశం పెడుతున్నామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఏయే సవరణలు పెడుతున్నారనే దానిపై తమకు సమాచారం ఇవ్వలేదేమని జానారెడ్డి ప్రస్తావించగా.. శాసనసభ కార్యదర్శి ఆ వివరాల కాపీలను పంపిస్తారని తెలిపినట్లు సమాచారం. రైతులు సంతోషంగా ఉన్నారన్న సీఎం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా మిర్చి ధరలపై చర్చించడానికైనా రెండు రోజులపాటు సభ జరపాలని భేటీలో జానారెడ్డి కోరారు. అయితే రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇక మిర్చి ధరలు, ఖమ్మం మార్కెట్పై దాడి అంశాలు ప్రస్తావన వచ్చిందని సమాచారం. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘అసలు రైతుల్లో ఎలాంటి ఆందోళనా లేదు. రాజకీయ పార్టీలే ఎక్కువగా ఆందోళన పడుతున్నాయి. మిర్చి రైతులు ఇప్పటికే 70 శాతం పంటను అమ్మేసుకున్నారు. ఖమ్మంలో జరిగినది ఫేక్ (కల్పిత) ఆందోళన. ఎవరెవరు దాడి చేశారో, దాని వెనక ఎవరున్నారో అన్నీ సీసీ కెమెరాల ఫుటేజీల్లో బయటపడతది. రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారు..’’అని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కనీసం మిర్చి రైతుకు బోనస్ అయినా ప్రకటించాలని జానా కోరినట్లు తెలిసింది. బోనస్ చెల్లింపు కేంద్రం చేతిలో ఉందని, అయినా ఇప్పటికే రూ.500 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం ఇస్తే ఆలోచిస్తామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. బీఏసీ భేటీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్రావు, ఎంఐఎం పక్షాన ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, శాసనసభ కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు. మూడు సవరణలివీ.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టాన్ని పరిశీలించిన కేంద్రం.. కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు సూచించింది. ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు సవరణలు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ మూడు సవరణలు ఇవే. చట్టం అమల్లోకి వచ్చే తేదీ (మొదటి సవరణ) రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో 2014 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అమల్లోకి వస్తుందని మరోచోట పేర్కొన్నారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే చట్టంలో రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దీంతో కేంద్ర సూచనకు మేరకు కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన 2013 జనవరి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందంటూ సవరణ ప్రతిపాదించారు. మార్కెట్ విలువ (రెండో సవరణ) భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఉండగా.. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగానే నిర్ధారించి ఉన్న మార్కెట్ విలువ కాకుండా.. భూసేకరణ సమయంలో మార్కెట్ విలువను సవరించి, పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భూసేకరణకు ముందు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేలా నిబంధన పొందుపర్చనున్నారు. మెరుగైన పరిహారం చెల్లింపు పదాల్లో మార్పులు (మూడో సవరణ) కేంద్ర చట్టం కంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన చట్టంలో పేర్కొంది. కానీ దానికి సంబంధించిన పదాల్లో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సూచించింది. ఈ మేరకు సవరణలను ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం కోసం భూసేకరణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. -
మే రెండోవారం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ
అమరావతి: ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మే రెండోవారం తర్వాత ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కోడెల పేర్కొన్నారు. మహిళా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డిక్లరేషన్ను రూపొందిస్తున్నామని, ఇందుకోసం కోర్ కమిటీ, సలహా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 30 నాటికి అమరావతి డిక్లరేషన్ను రూపొందిస్తామని స్పీకర్ తెలిపారు. కాగా స్పీకర్ కార్యాలయానికి రాజీనామాలు ఏమైనా వచ్చాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, స్పీకర్ మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. -
రెండు రోజుల పాటు అసెంబ్లీ: యనమల
సాక్షి, అమరావతి: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో గానీ రెండు రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహిస్తామని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అనంతరం రాష్ట్రం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో జీఎస్టీ సన్నద్ధత, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వ్యయంపై సమీక్ష నిర్వహించారు. -
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
-
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
♦ మూజువాణి ఓటుతో 4 జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం ♦ జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు మార్గం సుగమం ♦ ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించడమే తరువాయి న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 1 నుంచి ఒక దేశం– ఒక పన్ను పాలనకు మార్గం సుగమం చేస్తూ జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ)2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించినా సభ వాటిని తిరస్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ సవరణ ప్రతిపాదించినా.. మాజీ ప్రధాని మన్మోహన్æ సలహా మేరకు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుల్ని లోక్సభ ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే.. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఆమోదం అందరి ఘనత: జైట్లీ రాజ్యసభలో జీఎస్టీపై సుదీర్ఘ చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిస్తూ... జీఎస్టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందన్నారు. ఇది అందరి ఘనతని ఒప్పుకునేందుకు తాను సంకోచించడం లేదన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందని చెప్పారు. శిక్షల తీవ్రత తగ్గించాలి: ప్రతిపక్ష సభ్యులు అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఇక ఏం హక్కులు ఉంటాయని ప్రశ్నించారు. జీఎస్టీ మొదటి సంవత్సరం ఏదైనా నేరానికి పాల్పడితే దానిని నాన్ బెయిలబుల్గా పరిగణించ వద్దంటూ బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా కోరారు. ఆమోదాన్ని ప్రశంసించిన మన్మోహన్ జీఎస్టీ బిల్లును ఆమోదించడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రశంసించారు. బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని, అయితే అమలులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ పన్ను రద్దు బిల్లుకు ఆమోదం పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను, వివిధ సేవలపై సేవా పన్ను, వస్తువుల అమ్మకాలు, కొనుగోలుపై వ్యాట్ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ఎక్కువ శాతం ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఎక్కువ శాతం ఉత్పత్తులపై పన్ను ఉండదని, మిగతా వాటిని 5, 12, 18, 28 శాతాల శ్లాబుల్లో చేరుస్తామని జైట్లీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తామని, అనుబంధ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై పన్ను లేదని, జీఎస్టీలోనూ విధించమన్నారు. ఇతర నిత్యావసర వస్తువుల్ని తక్కువ పన్ను పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక విలాస వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు పన్ను విధించి.. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాల్ని భర్తీ చేస్తామన్నారు. జీఎస్టీ నెట్వర్క్(ఐటీ)పై పలువురు సభ్యులు ఆందోళనకు సమాధానమిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ ఐటీ విభాగం అత్యుత్తమంగా ఉందని, ప్రతీ నెల వందల కోట్ల రసీదుల్ని పరిశీలించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
ఈ జీఎస్టీ అసమగ్రం
♦ 40 శాతం ఆదాయం జీఎస్టీకి బయటే ♦ రాజ్యసభలో విపక్షాల మండిపాటు ♦ ద్రవ్య బిల్లుగా తీసుకురావడంపై అభ్యంతరం ♦ నాలుగు జీఎస్టీ బిల్లులపై చర్చ ప్రారంభం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ మొదలైంది. కేంద్ర (సీజీఎస్టీ), సమీకృత (ఐజీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ లపై కాంగ్రెస్ ఉప నేత ఆనంద్ శర్మ చర్చ ప్రారంభిస్తూ జీఎస్టీ అసమగ్రంగా ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పేర్కొన్న ఆదా యంలో 40శాతం జీఎస్టీకి బయటే ఉందని, అలాంటప్పుడు అది ఎలా ఆదర్శప్రాయమ వుతుందని ప్రశ్నించారు. మద్యం, పెట్రోలు, డీజిల్, రియల్ ఎస్టేట్ తదితరాలకు ఇచ్చిన మినహాయింపులు ఆందోళనకరంగా ఉన్నా యన్నారు. అక్రమ లావాదేవీలు, నల్లధనంపై పోరాడుతున్నా మన్న ప్రభుత్వం రియల్ ఎస్టే ట్ను ఎందుకు దీని పరిధిలోకి తీసుకు రాలేదని ప్రశ్నించారు. జీఎస్టీ అమలుకు ముం దు పన్ను చెల్లింపు దారులకు అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ (కాంగ్రెస్) మాట్లా డు తూ.. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించా రని, ఫలితంగా ప్రభుత్వఖజనాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తాము ఈ బిల్లు లకు మద్దతిస్తూనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతు న్నామన్నారు. ‘జీఎస్టీ భావన మాజీ ప్రధాని వీపీ సింగ్ 1986లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తెరపైకి వచ్చింది. ప్రస్తుత ప్రధా నికి ఎంత ఘనత దక్కాలో పాత ప్రధానులూ అంత ఘనతకు అర్హులు’ అని రమేశ్ అన్నారు. జీఎస్టీని ద్రవ్య బిల్లుగా తీసుకురావడాన్ని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. రాజ్యసభ శాసన నిర్మాణ అధికారాల పునరు ద్ధరణకు ఆర్థిక మంత్రి జైట్లీ కృషి చేయాలని, రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని కోరారు. ‘హనుమంతునికి తన శక్తి గురించి ఇతరులు చెప్పాకే తెలిసింది. మీరు మా హనుమాన్. ఈ సభ నాయకులు’ అని అన్నారు. కార్మిక పరిహార బిల్లుకు ఆమోదం పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, వృత్తి సంబంధ వ్యాధులకు గురయ్యే కార్మికులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారాన్ని అందిం చేందుకు ఉద్దేశించిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు–2016ను లోక్సభ సవరణలతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ గత ఏడాది ఆమోదించగా, రాజ్యసభ రెండు సవరణలతో ఆమోదించింది. దీంతో మళ్లీ లోక్సభ ముందుకొచ్చింది. సవరణలు ప్రతిపాదించవద్దు: సోనియా రాజ్యసభలో జీఎస్టీ బిల్లులకు ఎలాంటి సవరణలనూ ప్రతిపాదించకూడదని బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర విపక్షాలు తెచ్చే సవరణలకు మద్దతిచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై గురువారం జరిగే సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంలపై రాజ్యసభలో రగడ ఈవీఎంలను బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ట్యాంపర్ చేస్తున్నారని విపక్షాలు రాజ్యసభలో ఆరోపించాయి. వచ్చే ఎన్నికలను బ్యాలట్ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశాయి. విపక్ష ఆరోపణలను ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి.. ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో ఈవీఎంలను పరీక్షిస్తున్నప్పుడు ఓట్లు ఎవరికి వేసినా బీజేపీకే పడ్డాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించారు. సభాకార్యక్రమాలను నిలిపేసి ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఎస్పీ నాలుగు నోటీసులు ఇవ్వగా, అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దగాకోరు అని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. దీనిపై అధికార సభ్యులు గొడవ చేశారు. ఆమె దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని మంత్రి నక్వీ అన్నారు. బీజేపీ ఓడిన 2004, 2009 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవలి బిహార్, పంజాబ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్కు ఏ అభ్యంతరమూ కనిపించలే దన్నారు. మాయావతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సింది ఈసీనే అంటూ సభను వాయిదా వేశారు. లోక్సభకు ‘ఓబీసీ’ బిల్లు వెనకబడిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ అధికారాలతో సాధికారిక కమిషన్ను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగ(123వ సవరణ) బిల్లును సామాజిక న్యాయ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్ను రద్దు చేసేందుకు మరో బిల్లునూ సభ ముందుంచారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) అధీకృత మూలధనాన్ని ఆరు రెట్లు పెంచి రూ.30వేల కోట్లుకు చేర్చేందుకు ప్రతిపాదించిన నాబార్డ్ సవరణ బిల్లును–2017ను ప్రభుత్వం సభ ముందుంచింది. -
సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఓకే
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులకు చేసిన 5 సవరణలతోపాటుగా చట్టంలోని మిగిలిన 4 నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 13వ సమావేశంలో.. జీఎస్టీ బిల్లులకు సంబంధించి లోక్సభ చేసిన సవరణలను ఆమోదించారు. జీఎస్టీకి సంబంధించిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్, వస్తువులు–సేవల సప్లై వాల్యుయేషన్, లెవీ విధింపుపై నిర్ణయం, మధ్యంతర నిబంధనలకు మండలి మౌలికంగా ఆమోదించారు. సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్లు సంబంధింత అధికారి డిజిటల్ సంతకంతోనే జరగాలని, ఏకీకృత గుర్తింపు నెంబరును ఇవ్వటం, రద్దు చేయటానికి సంబంధించిన విధివిధానాల సవరణకూ ఓకే చెప్పింది. కొన్ని కేటగిరీల్లోని వ్యక్తులు ప్రతిఏటా రిటర్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని జైట్లీ అన్నారు. తుది ముసాయిదాను రూపొందించాక ఇండస్ట్రీ ముందుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించించారు. -
ఐదేళ్ల తర్వాత నష్టాలు ఎవరు భర్తీ చేస్తారు?
జీఎస్టీ బిల్లుపై ఎంపీ వెలగపల్లి సాక్షి, న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలున్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంమై నిర్ణయం తీసుకోవాలని కోరారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని వరప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే అప్పటికి పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని కూడా పునః పరిశీలించాలని కోరారు. -
ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ ఆమోదం
ఆర్థిక మంత్రి జైట్లీ ఆశాభావం న్యూఢిల్లీ: ఏకాభిప్రాయం ద్వారానే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సదస్సు తర్వాత పార్టీ ఎంపీల్ని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్టీ మండలిలో సుదీర్ఘంగా చర్చించాకే బిల్లుల్ని రూపొందించామన్నారు. సవరణలు చేయాల్సిందే: కాంగ్రెస్ ప్రస్తుత రూపంలో జీఎస్టీ బిల్లుల్ని అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు జీఎస్టీపై చర్చించారు. జీఎస్టీపై ప్రజల ఆందోళనల్ని సభలో లేవనెత్తాలని, తప్పకుండా అవసరమైన సవరణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
-
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
► రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ ► రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని సూచన ► ఈ సమావేశాల్లోనే జీఎస్టీ ఆమోదం పొందాలన్న జైట్లీ న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి నిధులిచ్చి మరో రాష్ట్రానికి మొండిచేయి చూపే విధానాన్ని ఆవలంబించబోమని పేర్కొన్నారు. ‘పలు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నాయి. అందుకు ఆయా రాష్ట్రాలే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంపై కేంద్రం ఓ విధానంతో ముందుకెళ్తోంది. రైతు రుణాల వడ్డీలో కొంత భరిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. రుణమాఫీ చేయాల్సిందేనని సంకల్పిస్తే దానికి ఆయా రాష్ట్రాలే నిధులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అక్కడి రైతులకు యోగి సర్కారు రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. 2006లో యూపీఏ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేదంటే పరోక్షపన్ను కోల్పోతాం! ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని జైట్లీ రాజ్యసభలో చెప్పారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పరోక్షపన్నును నష్టపోతాయని ఆయన తెలిపారు. జీఎస్టీకి అనుబంధంగా ఉన్న నాలుగు బిల్లులను తర్వలోనే లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ ‘అక్రమ’ జాబితా తిరస్కరణ అమెరికాలో 271 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఆ దేశం ఇచ్చిన జాబితాను భారత్ తిరస్కరించింది. సరైన ధ్రువీకరణ జరిగేంతవరకు అమెరికా నుంచి భారతీయులను తరలించేది లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు సుష్మ సమాధానం ఇచ్చారు. ‘మేం ఆ జాబితాను అంగీకరించటం లేదు. అందుకే మరిన్ని వివరాలడిగాం. వాటిని ధ్రువీకరించుకున్నాకే వారిని తరలించేందుకు అత్యవసర సర్టిఫికెట్ జారీచేస్తాం’ అని సుష్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ పునియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
జీఎస్టీ బిల్లు రేపు లోక్సభలో
న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవలపన్ను(జీఎస్టీ) బిల్లు లోక్సభకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును రేపు (శుక్రవారం)లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఈ సోమవారం ఈబిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన అయిదు ముసాయిదా చట్టాలకు జీఎస్ టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం దీన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్సభ లో ఆమోదం కోసం రేపు సభముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీని సాధ్యమైనంత త్వరగా అమలులోకి త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 1, 2017 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నసంగతి తెలిసిందే. -
జీఎస్టీ బిల్లు సవరించే వరకూ పోరాటం
మధురానగర్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లు సవరించే వరకు పోరాడతామని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ స్థానిక విజయవాడ ధర్నా చౌక్లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎక్తా డిప్యూటీ జనరల్ సెక్రటరీ తోట రాజశేఖర్ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయాలని కోరారు. కేంద్రం అధికారాలను తమ వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీన పరుస్తోందని విమర్శించారు. కేంద్రlప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో వాణిజ్య పన్నుల శాఖల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ శేఖర్, రఘునాథ్ మాట్లాడుతూ వస్తు సేవల చట్టవ్యవస్ధలో రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్ర ఎకై ్సజ్ శాఖ సిబ్బందితో సమానంగా విధులు, అధికారాలు, జీతభత్యాలు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయవాడ రెండో డివిజన్ కార్యదర్శి కే నాగరాజు, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఎస్ఎస్ఎన్ ప్రసాద్బాబు, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విజయవాడ రెండో డివిజన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
-
జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రధాని మోదీ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు మరో అడుగు ముందుకు పడింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కాగా, త్వరలో దీనిపై పన్ను రేటు, సెస్, సర్చార్జీలు నిర్ణయించనున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను. ఆగస్టు 8న ఈ బిల్లు ఆమోదానికి కేంద్రం అన్ని రాష్ట్రాల అంగీకారం కోరింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లును మొదట 17 రాష్ట్రాలకు పంపించగా, అస్సాం మొట్టమొదట అంగీకరించింది. అనంతరం ఏపీ, బిహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నాగాలాండ్, మహారాష్ట్ర, హరియాణా, సిక్కిం, మిజోరం, తెలంగాణ, గోవా, ఒడిశా, రాజస్తాన్ ఆమోదించాయి. -
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిపై సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కనీసం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే, 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆగస్టు నెలలోనే లోక్సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. -
నిరసన మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి.. తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తుండగానే నాలుగు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. జీఎస్టీ బిల్లుతో పాటు అగ్రికల్చరల్, హార్టికల్చర్ రంగాల్లో ప్రైవేటు కాలేజీల బిల్లును ఆమోదించింది. హోటళ్లలో వ్యాన్ మినహాయింపు బిల్లును, డబుల్ రిజిస్ట్రేషన్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి ముందే చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది. శాసనసభ కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈ ఆందోళన మధ్యే నాలుగు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. -
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
-
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన నాలుగు బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. విజయవాడలో మంగళవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. కర్నూలులో ఇండ్రస్టీయల్ హబ్ కోసం ఏపీఐఐసీకి 7 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్కో, ఏపీఐఐసీకి కలిపి సుమారు 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ పాలసీ సవరణ, కార్మిక సంస్కరణలు, కాకినాడలో గెయిల్ గ్యాస్ స్టోరేజ్ ఫెసిలిటీని పెంచే ప్రతిపాదనలకు కేబినేట్ అంగీకరించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. కేబినేట్ ఆమోదించిన బిల్లుల వివరాలు ► జీఎస్టీ బిల్లు ► ఎన్జీ రంగా వర్శిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బిల్లు ► రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించే బిల్లు ► కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోని వ్యాట్ సవరణ బిల్లు. -
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
విజయవాడ : ఈ నెల నుంచి 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలు, రాయలసీమ కరువు, పుష్కరాలు తదితర అంశాలపై చర్చినున్నారు. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించనుంది. అలాగే ‘ఓటుకు కోట్లు’ కేసును ప్రతిపక్షం లేవనెత్తితే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా కేబినెట్ చర్చించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇక సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ వ్యూహ కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. -
మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-తొలిరోజు జీఎస్టీ బిల్లు ఆమోదం -మిగిలిన రెండు రోజులు కరవుపై ప్రత్యేక చర్చ -ఇతర అంశాలు చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎత్తుగడ సాక్షి, అమరావతి ఈ నెల ఎనిమిది నుంచి మూడు రోజులపాటు జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా కరవుపై చర్చించాలని ఆదివారం హైదరాబాద్లో జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభ వ్యూహ కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎనిమిదో తేదీన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఇదే ప్రతిపాదన చేయనున్నారు. ఆదివారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్బాబు, చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు, విప్లు కూన రవికుమార్, యామినీబాల, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాపితంగా కరవు తొండవిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రతిపక్షం కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నందున ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో చర్చను ప్రభుత్వం ప్రతిపాదించనుంది. దీంతో కృష్ణా జలాల వివాదం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెయిన్స్గన్స్తో పంటలను కాపాడటం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమావేశంలో భావించారు. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే ఆలోచన తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు కేసుల నుంచి బైట పడేందుకు మేనేజ్ చేసుకోవటం అలవాటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతంలో జగన్మోహన్రెడ్డి శాసనసభలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థను కించ పరిచే విధంగా జగన్మోహన్రెడ్డి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా కోర్టును ఆశ్రయించాలని వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యే లేదా నేతతో కోర్టులో కేసు వేయించనున్నారు. సమావేశం అనంతరం విప్ కూన రవి విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్విప్ కాలువ విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అభివృద్ధి ఆయనకు ఇష్టం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేలా సహకరించాలన్నారు. -
మరో మైలు రాయిని అధికమించిన GST
-
జీఎస్టీకి మండలి ఆమోదం
♦ బిల్లు ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ♦ మద్దతు తెలిపిన అన్ని పక్షాలు ♦ అనుమానాలు నివృత్తి చేయాలి: కాంగ్రెస్, ఎంఐఎం ♦ ధరలు తగ్గుతాయి.. ఆదాయం పెరుగుతుంది: బీజేపీ సాక్షి, హైదరాబాద్: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును రాష్ట్ర శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఉదయం మండలిలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ ప్రారంభం కాగానే కరువు, రైతు సమస్యలపై చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లు తర్వాత బీఏసీ సమావేశంలో ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చైర్మన్ స్వామి గౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించడంతో వారు శాంతించారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అల్తాఫ్ హైదర్ రజ్వీ, ఎస్.రామచందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూల రవీందర్, కె.యాదవరెడ్డి, భానుప్రసాద రావు తదితరులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో చెప్పాలి: పొంగులేటి(కాంగ్రెస్) జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో జీఎస్టీతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బిల్లును ఆమోదిస్తూనే ప్రజ ల్లో నెలకొన్న అనుమానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. ఆర్ఎన్ఆర్ 18 శాతం మించకుండా కేంద్రం తీసుకునే నిర్ణయంపై కూడా స్పష్టత రావాలి. మన వాటా ఎంత?: అల్తాఫ్ హైదర్ రజ్వీ (ఎంఐఎం) జీఎస్టీలో వసూలయ్యే మొత్తంలో రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందో చెప్పాలి. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే అనేక రకాల పన్నుల ఆదాయాన్ని కోల్పోతాం. దీన్ని పరిహారం రూపంలో ఐదేళ్ల పాటు ఇస్తామంటున్నారు. దీనిపై స్పష్టత రావాలి. పన్ను ఎగవేతలు తగ్గుతాయి: ఎస్.రాంచందర్ రావు (బీజేపీ) జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను విధానంతోపాటు పన్ను ఎగవేతలకు కళ్లెం పడుతుంది. ధరలు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడుల కారణంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. సేవారంగం వృద్ధి చెందుతుంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) జీఎస్టీతో ఉత్పత్తి రంగంతో పాటు సేవారంగం కూడా వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మీద పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జీఎస్టీలో ఉత్పత్తి అయిన వస్తువును ఉపయోగించినప్పుడు, సేవ పొందినప్పుడే పన్ను చెల్లించడం జరుగుతుంది. పన్ను శాతం ఎంత?: యాదవరెడ్డి (టీఆర్ఎస్) జీఎస్టీ అమలులోకి వస్తే వినియోగించే వస్తువుపై ఎంత శాతం పన్ను పడుతుందనే విషయంలో స్పష్టత లేదు. 22 శాతం, 18 శాతం అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రానికి లాభమో, నష్టమో ఇప్పుడే చెప్పలేం: కడియం జీఎస్టీ వల్ల తెలంగాణకు లాభమో, నష్టమో ప్రస్తుత పరిస్థితుల్లో తేల్చి చెప్పడం కష్టమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. ‘‘జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ఉభయసభలు ఆమోదించాయి. దేశంలోని 50 శాతం రాష్ట్రాలు ఆమోదిస్తే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉండే ఈ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. 2015-16లో రూ.31,117 కోట్ల పన్ను వసూలైతే... అందులో పెట్రోల్, మద్యంపై వచ్చిన ఆదాయం రూ.14,654 కోట్లు. భవిష్యత్తులో కూడా ఇది రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. వృత్తి పన్ను మినహాయిస్తే.. మిగతా రూ.16,077 కోట్లు జీఎస్టీ పరిధిలోకి వెళ్తుంది. రెవెన్యూ న్యూట్రల్ రేషియో (ఆర్ఎన్ఆర్)ను కూడా ఇప్పుడే నిర్ణయించలేం. జీఎస్టీ వల్ల నష్టపోతామన్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పింది. సేవారంగం ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో జీఎస్టీ వల్ల లాభమే జరుగుతుంది. సర్వీస్ టాక్స్లో 50 శాతం మేర రూ.4 వేల కోట్లు రాష్ట్రానికి సమకూరుతుంది. ఆహార ధాన్యాలపై పన్ను ఎత్తివేసే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి మంచే జరుగుతుంది’’ అని కడియం అన్నారు. -
జీఎస్టీ బిల్లుపై అవగాహన పెంచుకోవాలి
కోదాడఅర్బన్ : దేశంలో ఒకే రకమైన పన్ను విధానాన్ని అవలంబించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుపై కామర్స్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని రిటైర్డ్ అధ్యాపకులు మంత్రిప్రగడ భరతారావు, ప్రముఖ అకౌంటెంట్ శేషుప్రసాద్లు కోరారు. జీఎస్టీ బిల్లుపై మంగళవారం కోదాడ పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కామర్స్ విద్యార్థులకు నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. వస్తు సేవల పన్నులకు సంబంధించిన విషయాలను శేషుప్రసాద్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సైదేశ్వరరావు, ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ
-
పన్నుల ఎగవేత నివారణకే జీఎస్టీ: కేసీఆర్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పన్నుల ఎగవేతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ వల్ల ఏ రాష్ట్రానికైనా ఇబ్బంది కలిగితే ఐదేళ్లు ఆ నష్టాన్ని భరిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ పై జీఎస్టీ ప్రభావం ఉందన్నారు. -
'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'
హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కోరారు. సోమవారం హైదరాబాద్లో మూడున్నర గంటల పాటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సంపత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు కూడా చర్చకు రానున్న సందర్భంగా.. అసెంబ్లీ కేవలం జీఎస్టీ బిల్లు కోసమే అంటే సరికాదన్నారు. సభను ఎక్కువ రోజులు నిర్వహించే అంశంపై అధికారపక్షాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు. -
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్లో మంత్రివర్గం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. అలాగే గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం. -
అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులపాటు జరగనున్నాయి. అసెంబ్లీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు సమావేశాలను ఈ నెల 30, 31, సెప్టెంబర్ 1న జరపనున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపేందుకు ఒక రోజు అసెంబ్లీ, మండలి సమావేశం కావాలని ప్రభుత్వం తొలుత పేర్కొన్నప్పటికీ మరో రెండ్రోజులు కూడా సమావేశాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాల తొలి రోజైన 30న జీఎస్టీ బిల్లుపై, 31న కొత్త జిల్లాల ఏర్పాటుపై, సెప్టెంబర్ 1న గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఉభయ సభలు చర్చిస్తాయని సమాచారం. -
30నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
30నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు సవరణ బిల్లును ఆమోదించనుంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జీఎస్టీ బిల్లను ఆమోదించడానికి ఈ నెల 30న శాసనసభను సమావేశపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్ రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తదితరులతో సీఎం సమావేశం అయ్యారు. రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంట్ జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమల్లోకి రావడానికి దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీని సమావేశపర్చాలని స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కూడా స్పీకర్ ను ఈ సందర్భంగా సీఎం కోరారు. -
30న అసెంబ్లీ!
* అదే రోజున శాసన మండలి భేటీ కూడా.. * ఒకే రోజు సమావేశం.. జీఎస్టీ ఆమోదమే ఎజెండా * సభలను సమావేశపర్చాలని మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ను కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఈనెల 30న శాసనసభ, శాసనమండలిని సమావేశపరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలని శుక్రవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలను కోరారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశపరచాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావడంతో సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి ఏజీ రామకృష్ణారెడ్డిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కోరారు. ఇక ప్రతిపక్షాలు కోరితే వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఖరారవుతుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు * గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
-
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికే ఈ సమావేశాలని ప్రభుత్వం మాట్లాడటం దురదృష్టకరమని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్తో పాటు అనేక కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు. కాగా శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. -
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
-
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నాలుగైదు రోజులపాటు నిర్వహించే అవకాశం - జీఎస్టీ ఫోకస్ పాయింట్ గా సమావేశాలు - సభలో చర్చించే సమస్యలు పెద్దగా లేవు - ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల అమలాపురం రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమై, నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును వచ్చే నెల 8 తేదీ నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లును మన శాసన మండలి, శాసనసభలు ర్యాటిఫై చేయాల్సి ఉందన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలు జీఎస్టీని మండలి, శాసనసభల్లో ఆమోదించాల్సి ఉందని, 2017 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం రోడ్డు మ్యాప్ తయారు చేసింది’ అని యనమల చెప్పారు. దీనిలో భాగంగా వచ్చేనెల 8వ తేదీలోపు జీఎస్టీని ర్యాటీఫై చేయాలని సూచించిందన్నారు. జేఎస్టీ ఆమోదానికి ప్రతిపక్షం కూడా సహకరించాల్సిన అవసరముందన్నారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏఏ సబ్జెక్టులు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్టీ పరిహారం కేటాయింపులపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.935 కోట్లు బకాయి రావాల్సి ఉందన్నారు. -
జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్
హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జీఎస్టీ వల్ల నష్టపోయే రెవెన్యూను ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని కేటీఆర్ అన్నారు. -
జీఎస్టీ బిల్లుకు జార్ఖండ్ ఆమోదం
రాంచి: అస్సాం, బిహార్ తర్వాత జీఎస్టీ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాం ముందుగా జిఎస్టీ బిల్లును ఆమోదించింది. జీఎస్టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేయేతర పార్టీల పాలిత రాష్ట్రంగా బిహార్ నిలిచింది. బిహార్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో మంగళవారం దీన్ని ఆమోదించారు. కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు. -
జీఎస్టీపై టీ.అసెంబ్లీ సమావేశం
హైదరాబాద్: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ త్వరలో సమావేశం కానుంది. ఈ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ సెషన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీటీఐకి చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని తెలిపారు. ఈ సమావేశం సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చి అత్యవసరంగా బిల్లును ఆమోదానికి పెట్టాలని నిర్ణయించిందనీ రాజేందర్ చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు బిల్లుకు మద్దతిచ్చారనీ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్ బహిరంగ సభలో బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాగా ఆగస్టు 8న పార్లమెంటు ఆమోదం లభించిన జీఎస్ టీ బిల్లును బీహార్ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. దీంతో ఈబిల్లును ఆమోదించిన తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా బీహార్ అవతరించిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ బిల్లును ఆమోదించండి
సీఎంకు అరుణ్జైట్లీ లేఖ సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపాలని కేంద్ర విత్త మంత్రి అరుణ్జైట్లీ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించే ముందు 122వ రాజ్యాంగ సవరణ బిల్లును సగం రాష్ట్రాలు తమ చట్ట సభల్లో ఆమోదించాలి. అస్సాం, బిహార్లు తమ చట్ట సభల్లో జీఎస్టీని ఆమోదించాయి. -
‘జీఎస్టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం
గువాహటీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అస్సాం అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ సవరణ బిల్లును అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వకర్మ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘‘పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లును అస్సాం అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది’’ అని స్పీకర్ రంజిత్కుమార్ దాస్ సభలో ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి. -
ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరం
* వెంటనే ఏపీకి హోదా ఇవ్వాలని వామపక్షాల డిమాండ్ * హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఏచూరి * ఫిరాయింపుదారులపై అనర్హత విధించే అధికారం స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండాలి * వామపక్షాల నేతలతో వైఎస్ జగన్ భేటీ * హోదా సహా పలు అంశాలపై చర్చ.. మద్దతు కోసం వినతి * జీఎస్టీ బిల్లు తర్వాత హోదా మరింత అవసరం: వైఎస్ జగన్ * అది మన హక్కు.. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు * సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా తక్షణావసరమని, కుంటిసాకులు చెప్పకుండా వెంటనే హోదాను ప్రకటించాలని సీపీఐ రాజ్యసభ పక్ష నేత డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని.. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఏపీకి హోదాతో పాటు ఇతర అంశాలపై చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం వారిరువురిని విడివిడిగా కలిశారు. ఉదయం 10 గంటలకు డి.రాజాను ఆయన నివాసంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, విజయసాయి రెడ్డి, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్రెడ్డి, పి.వి.మిథున్రెడ్డి, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిశారు. ఈ సమావేశంలో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మూడు పేజీల వినతిపత్రాన్ని వారిరువురికీ అందజేశారు. ప్రత్యేక హోదా సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, క్షేత్రస్థాయిలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వై.ఎస్.జగన్ ఈ సమావేశంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ పోరాటాలకు వామపక్షాల మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. సమావేశాల అనంతరం రాజా, సీతారాం ఏచూరి, జగన్ విలేకరులతో మాట్లాడారు. హోదా కోసం కార్యాచరణ: డి.రాజా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని, ప్రభుత్వం హామీలు ఇస్తే.. తదుపరి ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వాళ్లు కూడా పట్టుపట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. వెంకయ్య నాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆనాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నేడు రాజ్యసభ సభా నాయకుడిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. మోదీ తిరుపతిలో ఈమేరకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ విషయంలో వారు చెబుతున్న కారణాలు ప్రజలు అంగీకరించేలా లేవు. దీనిపై ఇతర వామపక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం. నేను జగన్మోహన్రెడ్డికి ఇదే హామీ ఇచ్చాను. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ విషయంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుక్కోవాలి. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం: ఏచూరి ప్రత్యేక హోదా ఏపీకి తక్షణావసరం. ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలా లేదా? దాని వల్ల ఏపీకి ఇవ్వలేమన్నది అర్థం లేని వాదన. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. చేసిన వాగ్దానాలను అమలుచేయరని స్పష్టమవుతోంది. తిరిగి ఈ అంశాన్ని పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోరాటాన్ని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించాం. నీటి పంపకం రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలన్న అంశంపై చర్చించాం. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యమాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల మధ్య సమస్య ఏర్పడుతోంది. జాతీయస్థాయిలో ఎలా చేయాలో చర్చించాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ నుంచి ఎన్నికల సంఘంలోకి రావాలన్న ప్రతిపాదన చేశారు. దీనిని ఇతర పార్టీలతో చర్చిస్తాం. ఆ అధికారం ఒక స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండడం అవసరం. రాజీ పడితే చరిత్ర హీనులుగా మిగులుతారు: జగన్ జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అన్నది అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో సేల్స్టాక్స్ అంశం ఉండేది. కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ టా క్స్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సేల్స్ టాక్స్ అన్న అంశం కూడా జీఎస్టీ రావడం వల్ల కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. సేల్స్ టాక్స్పై ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి మినహాయింపులు లేనప్పుడు ఎవరైనా కూడా కొత్త రాష్ట్రం, ఏ మౌలిక వసతులు లేని ఏపీకి రావడానికి ఏ పారిశ్రామికవేత్తయినా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో పోవడానికి ఉత్సాహం చూపుతారు. ఒకవైపు హైదరాబాద్ పోయింది.. ఇతర రాష్ట్రాలతో సమాన బలం లేకుండా పోయిం ది.. సేల్స్టాక్స్ మినహాయింపులు ఇచ్చే అవకాశం పోయింది. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావడం తప్పనిసరి అయింది. హోదా కలిగిన రాష్ట్రాలకే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలకు ఉండదు. రూ. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ మూటకట్టి ప్యాకేజీగా చూపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వందేళ్లు పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. ఏదైనా పోరాడితేనే సాధిస్తాం. రాజీపడకుండా గట్టిగా పోరాటం చేస్తేనే హోదాను మరిచిపోలేరు. హోదా మన హక్కు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడాలంటే హోదా తప్పనిసరి. ఎవరైనా కూడా రాజీ పడకూడదు. పడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదా అన్న అంశంపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అంశం. ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చించదగ్గ అంశం. పార్లమెంటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే... ప్రజల్లో ప్రజాస్వామ్య విశ్వసనీయతను కాపాడాలంటే... ప్రతిఒక్కరు అడగాల్సిన అంశం. ఈ విషయంలో ఏచూరి ఇంతవరకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాష్ట్రంలోనూ, పార్లమెంటులో కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేయాలి. ఇతర పార్టీలను కూడా కలుపుకుని హోదా సాధించే దిశగా అడుగులు వేస్తాం. సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని ఘంటాపథంగా చెబుతున్నాం. నేడు రిషికేష్కు వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రిషికేష్కు వెళుతున్నారు. అక్కడ విశాఖ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులను ఆయన తీసుకుంటారు. ఏపీకి హోదా ఇచ్చేలా కేం ద్రం మనసు మారాలని, రాష్ట్రం సుభిక్షం గా ఉండాలనే ఆకాంక్షతో జగన్ అక్కడికి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి
జీఎస్టీ బిల్లుపై చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల అంతిమంగా వినియోగదారులకు లబ్ధి చేకూరాలని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. సోమవారం లోక్సభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ‘సిద్ధాంతపరంగా ఈ బిల్లు పన్నుల మీద పన్నులను తొలగించి వినియోగదారులకు మేలు చేకూర్చేలా కనిపిస్తోంది. అయితే ఇది జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంది. కేంద్రం తన ఎక్సైజ్, సర్వీసు పన్నుల వసూళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కోల్పోకుండా ఉండాలని భావిస్తూ, రాష్ట్రాలు కూడా తమ ఆదాయాన్ని కోల్పోరాదని భావిస్తే జీఎస్టీ అమలుకు ముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు జీఎస్టీ వల్ల వినియోగదారుడు ఏరకంగా ప్రయోజనం పొందుతాడు? అమలైతే తమపై పన్ను భారం తగ్గుతుందని సామాన్యుడు ఆశిస్తున్నాడు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి..’ అని మేకపాటి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేకపాటి ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. ‘అప్పటి ప్రధానమంత్రి హామీ అమలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిరీక్షిస్తున్నారు. కేంద్రం హోదాను ఇవ్వాలి..’ అని కోరారు. జీఎస్టీకి మద్దతిస్తున్నాం: రవీంద్రబాబు జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు కోరారు. జీఎస్టీ బిల్లుపై చర్చలో పాల్గొంటూ.. ‘తాము జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నందున, తాము అడుగుతున్నది కూడా ఇవ్వాలని, తాము ఎప్పటికీ క్రమశిక్షణ కలిగిన సైనికుల వంటి వాళ్లమే..’నని రవీంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం కోల్పోయే నష్టాన్ని కేంద్రం పూర్తిగా భర్తీ చేయాలన్నారు. -
'ఇక ట్యాక్స్ టెర్రరిజం నుంచి విముక్తి'
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సోమవారం జీఎస్టీ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు ద్వారా ట్యాక్స్ టెర్రరిజం నుంచి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. టీమిండియా దిశగా ముందడుగు పడిందని అన్నారు. జీఎస్టీ బిల్లు తీసుకురావడమనేది భారత్ తీసుకున్న అతిగొప్ప నిర్ణయమని, పెద్ద ముందడుగు అని మోదీ అన్నారు. ఈ బిల్లు పాసచేయడం ద్వారా 'వినియోగదారుడే రాజు' అనే సందేశం పంపిన వాళ్లం అవుతామని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ మోదీ జీఎస్టీ బిల్లుపై ప్రసంగాన్ని ప్రారంభించారు. -
నేడు లోక్సభకు జీఎస్టీ బిల్లు
-
జీఎస్టీ బిల్లుకు ఓటేయండి: టీఆర్ఎస్
హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎంపీలు జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కోరింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. కాగా సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదానికి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ తొలి పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జీఎస్టీకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు లోక్సభకు జీఎస్టీ బిల్లు
చర్చలో పాల్గొననున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ఆమోదం కోసం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకట్రెండు మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలపడంతో ఏ ఇబ్బందీ లేకుండా బిల్లుసభ ఆమోదం పొందనుంది. నేడు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. గతేడాదే బిల్లును లోక్సభ ఆమోదించినా... రాజ్యసభలో కొన్ని సవరణలు చేయడంతో మళ్లీ దిగువసభలో ప్రవేశపెడుతున్నారు. జీఎస్టీకి కాంగ్రెస్ మద్దతిస్తుందని, నేడు సభకు అందరూ ఎంపీలు హాజరుకావాలంటూ విప్ జారీచేశామని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీజేపీతో పాటు పలు పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. -
ముందున్నది మహా కష్ట కాలం
అవలోకనం జీఎస్టీ తదుపరి ఇంకా ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవని ప్రధాని స్పష్టంగా వివరించాలి. రాబోయే పదేళ్లలో ఆరు లేదా ఏడు శాతం వృద్ధి రేటును అధిగమించలేం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టం అవుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి పది శాతం వృద్ధిని ఆశించలేం. బయటి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి పరిస్థితి సైతం మన దేశానికి అనుకూ లంగా లేదు. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి, చరిత్రలో ఎన్నడూ ఎరుగ నంతగా ఉద్యోగాలు మటుమాయమైపోతున్నాయి. వస్తు తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని మనం చాలా కాలంగానే అంచనా వేస్తున్నాం. ఇప్పుడది జరుగుతోంది. డ బ్బును రుణంగా తీసుకోడానికి అయ్యే వ్యయం కంటే శ్రమకు అయ్యే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల శ్రమకు ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను చేపడుతున్నారు. ఆటోమేషన్ (యాంత్రీకరణ) సేవారంగంలోని ఉద్యోగాలను సైతం దెబ్బతీస్తోంది.‘‘ఐటీ రంగంలో పెరగాల్సిన ఉద్యోగాలలో 10 శాతం అదృశ్యమౌతాయి. అంటే ఐటీ రంగం ఏటా 2 నుంచి 2.5 లక్షల ఉద్యో గాలను సృష్టించేట్టయితే వాటిలో 25,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు మాయమౌతాయి’’ అని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. దేశంలోని 45 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులలో 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు. వారి పనిని యాంత్రీకరించడం వల్ల వారిలో సగం మంది (2,25,000) వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలను కోల్పోతారు. ‘‘నేడు చాలా మంది (మధ్యస్త స్థాయి మేనేజర్లు) ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారిలో సగం మంది వచ్చే పదేళ్లలో ఉద్యోగాలను కోల్పోతారు’’ అని పాయ్ చెప్పారు. బెంగళూరు, ముంబై, గుర్గావ్, పూణె, హైదరాబాద్ వంటి మన నగరాలకు ఇది చాలా పెద్ద దుర్వార్త. ఈ నగరాల వృద్ధికి సేవారంగ ఉద్యోగాలు వెన్నెముకగా ఉన్నాయి. సేవారంగ ఉద్యోగాల యాంత్రీకరణ అంటే ఈ పనిని ఇక భారత్కు పంపరని అర్థం. మన పట్టణ మధ్యతరగతి యువత ఉపాధిని కొనసాగించడానికి మనం కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలుగా లేని కొత్త సమస్య ఇది. ఇంగ్లిష్ భాష ద్వారా లభించే సేవారంగ ఉద్యోగాలు పేదలు, మధ్యతరగతిలో చేరడానికి ఉన్న తేలిక మార్గం. ప్రవేశస్థాయిలోని ఈ ఉద్యోగాలే మటుమాయం కావడం అంటే సామాజిక గమనశీలత ముగిసిపోవడమే. ప్రసుత్తం చిన్న చిన్న నగరాలలో సామాజిక అశాంతి పెరుగుతోంది. గుజరాత్ పాటిదార్ల ఆందోళన, హరియాణా జాట్ల ఆందోళన వంటివి ముందు ముందు తీవ్రతరమౌతాయని భావించాలి. ఈ వాస్తవాలను ఎదుర్కోడానికి ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేస్తున్నదని నేను అనుకోవడం లేదు. అది చూపుతున్న భవిష్యత్ చిత్రం అసాధారణమైనంతటి ఆశావహమైనదిగా ఉంటోంది. వివిధ సామాజిక అసంతృప్తులను పెంపొందుతున్న ఒక జాతీయ సంక్షోభంగా గాక స్థానికమైనవిగా వివరిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనదిగా పలువురు భావిస్తున్న ఆర్థిక సంస్కరణ క్రమాన్ని భారత్ ఇప్పుడే ప్రారంభించింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశంలోని పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేస్తుంది. కేవలం ఈ సంస్కరణే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు మరో రెండు పాయింట్లను చేర్చగలదని సైతం కొందరు భావిస్తున్నారు. ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చునేమో గానీ, అందరూ ఈ సంస్కరణ కీలకమైనదని విశ్వసిస్తున్నారు. ఇంకా ఏ సంస్క రణలను ప్రవేశపెడతారని మనం ఆశించవచ్చు? ఎన్నో ఏం లేవు, జీఎస్టీ స్థాయి సంస్కరణలు అసలుకే లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాటకీయమైన మార్పును సాధించే దిశగా పలు చట్టాలను చే స్తుందని ఆశించి ఉంటే... ఆయన ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు. పెద్ద సంస్కరణగా ముందుకు తెచ్చిన జీఎస్టీ బిల్లు సైతం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా మోదీ దాన్ని వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఆయన తన వైఖ రిని మార్చుకున్నారు. ఇది చాలా మంచి, తెలివైన రాజకీయమని అనుకుంటాను. కొంత కాలం క్రితం ‘వాస్స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ... చట్టాలు చేయాల్సి ఉన్న పెద్ద సంస్కరణలు ఇంకా ఏమున్నాయో తనకు తెలియ దని అన్నారు. ‘‘నేను ప్రభుత్వంలోకి వచ్చాక నిపుణులందరితో కలసి కూచుని, ‘‘మహా విస్ఫోటనం’’ (భారీ ఆర్థిక సంస్కరణల వెల్లువ) అంటే వారి దృష్టిలో ఏమిటో నిర్వచించమని కోరేవాడిని. అవేమిటో ఎవ్వరూ చెప్ప గలిగేవారు కారు’’ అని తెలిపారాయన. ఇంకా తేవాల్సి ఉన్న సంస్కరణలలో అత్యధిక భాగం రాష్ట్రా లకు సంబంధించినవ నీ, కీలకమైన, వివాదాస్పదమైన కార్మిక చట్టాలను రాష్ట్రాలు మరింతగా సరళీకరిస్తాయని ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘‘కార్మిక సంస్కరణ లంటే పారిశ్రామికరంగ ప్రయోజనాలేనని అర్థం కాదు. అవి కార్మికుల ప్రయోజ నాల కోసం కూడా ఉద్దేశించినవి’’ అని ఆయన తెలిపారు. మోదీ ఈ విషయంలో చాలా జాగ్రత ్తతో వ్యవహరిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి. ప్రధాని చెప్పింది పూర్తిగా సరైనదని భావిస్తున్నాను. ఇకనెంత మాత్రమూ సోషలిస్టు దేశంగా లేని దేశంలో ఇంకా తేవాల్సిన మహా సంస్కరణలు ఏము న్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆర్థిక సరళీకరణకు అనుకూలమైనవే. పరిస్థితి ఇదైనప్పుడు చట్టపరమైన మార్పులు పెద్దగా జరుగుతాయని ఆశించ జాలం. మన ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మధ్యస్త కాలికంగా, అంటే దాదాపుగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న ఆరు లేదా ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును మనం అధిగమించలేమని నా నమ్మకం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టంగా మారుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి 10 శాతం వృద్ధిని ఆశించలేం. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. చట్టపరంగా తన ప్రభుత్వం చేయగలగినది ఇంకా ఏమి మిగిలి ఉన్నదనే దాని స్వభావాన్ని మోదీ చక్కగానే వివరిస్తారు. అయితే, ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏవీ లేవని, ఏదైనా మార్పంటూ వస్తే అది బహిర్గత పరిస్థితులు భారత్పై కలుగజేసేదే కావాలనే విషయాన్ని ఆయన మరింత స్పష్టంగా వివరించాలి. మన ముందున్నది మహా కష్ట కాలం. అదృష్టవశాత్తూ మనల్ని విశ్వాసంతో ముందుకు తీసుకుపోగల ప్రజామోదం గల ప్రభుత్వమూ ఉంది, ప్రజాదరణ గల నాయకుడూ ఉన్నారు. ( వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
ఓకే దేశం .. ఒకే పన్ను..
-
జీఎస్టీతో విద్యారంగంపై ప్రభావం
దోమలగూడ: నాణ్యమైన విద్యను అందించాలనే ప్రజల అకాంక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత విద్యా విధానాన్నే అవలంబిస్తే తెలంగాణ సాధించుకుని ఏం లాభమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ బడుల మూసివేతను వ్యతిరేకిస్తూ, ‘రేషనలైజేషన్ను అడ్డుకుందాం.. విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం’ పేరుతో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసేలా ఉందన్నారు. తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక టాక్స్ విధించి విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ బిల్లు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా బోధన సరిగా జరగదని కార్పొరేట్, మార్కెట్ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వీసీలను నియమించకుండా, నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ కె చక్రధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రైవేట్ విద్యా సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్ధిక లావాదేవీలు జరిగే రంగాలనే ప్రోత్సాహిస్తుందని, విద్యరంగం బలోపేతం పట్ల నిబద్దత లేదని అన్నారు. కేంధ్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణను, విదేశీ సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు హిందూత్వ ఆలోచనలను రుద్దాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కామన్ స్కూలు విధానాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?
♦ సందేహాలున్నాయి: నాస్కామ్ ♦ బిల్లింగ్, రివర్స్ చార్జీపై స్పష్టతకు డిమాండ్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు 2017 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ ప్రకటించింది. దిగుమతి చేసుకునే సేవలపై విధించే రివర్స్ చార్జీ... ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉండరాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో జీఎస్టీ ఆమోదంపై హర్షం ప్రకటిస్తూ... నూతన బిల్లు పన్నుల వ్యవస్థను గాడిలో పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, దీన్ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరింది. నాస్కామ్ అభ్యంతరాలు ⇔ దేశవ్యాప్తంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రం వద్ద నమోదు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. ⇔ క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాల కారణంగా ఐటీ రంగం ఎగుమతి పోటీతత్వంపై ప్రభావం పడుతుంది. ⇔ ఎగమతి చేసే సేవల కోసం దిగుమతి చేసుకునే సర్వీసులపై విధించే రివర్స్ చార్జీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పన్ను రూపంలో చెల్లింపులతో మూలధనం వినియోగించుకునే వీలు లేకుండా పోతుంది. బిల్లులో ఏమున్నదో చూడాలి ‘ఎగుమతి ఆధారిత కంపెనీలు దిగుమతి చేసుకునే సేవలపై (ఈఆర్పీ లెసైన్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ) సేవాపన్ను పడుతుంది. అయితే, తర్వాత ఈ పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇది సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రివర్స్ చార్జీ కేవలం సేవలపైనే ఉంది. జీఎస్టీతో ఇది సరుకులకూ విస్తరిస్తుంది. అయితే, ఏవి సరుకులు, ఏవి సేవలు అనే దానిపై ఏం చెప్పారో చూడాల్సి ఉంది’ - సలోనీ రాయ్, డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ వినియోగదారుడు.. పరిశ్రమకూ మేలే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల మాట న్యూఢిల్లీ: జీఎస్టీతో సరఫరా వ్యవస్థ స్థీరీకరణ చెందుతుందని, సరుకుల రవాణా భారం తగ్గుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారులు పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ మరింత సులభంగా మారుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమ) తెలిపింది. లావాదేవీల ఖర్చు, రవాణా వ్యయం తగ్గడం ద్వారా స్థానిక తయారీ రంగం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రయోజనం.. పన్ను రేటు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఇది క్రమంగా వినియోగదారుడికి బదిలీ అవుతుంది. సరఫరా వ్వవస్థ్థీరీకరణకు, రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు మా వంటి బ్రాండెడ్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. - మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ వినియోగదారుడికి లాభం.. ధరల పరంగా వినియోగదారుడికి ప్రయోజనం. పరిశ్రమకు సానుకూల పరిణామం. - ఎరిక్ బ్రగాంజా, హెయర్ ఇండియా ప్రెసిడెంట్ వృద్ధి పెరుగుతుంది: మూడిస్ న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వృద్ధికి అనుకూలమని, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. అయితే, రెవెన్యూ న్యూట్రల్ శ్రేణికి అనుగుణంగా పన్ను రేట్లున్నపుడే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. రెవెన్యూ న్యూట్రల్ శ్రేణి అంటే... కొత్త పన్ను వ్యవస్థను అమలు చేసినా కేంద్రం, రాష్ట్రాలు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కోల్పోకుండా ఉండేంత స్థాయి. అదే సమయంలో ఇతర వివాదాస్పద సంస్కరణల్లో ప్రగతి నిదానంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం... సంస్కరణల్లో ప్రగతి... కాస్త నిదానంగా రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్న తమ అంచనాల ప్రకారమే జరుగుతున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మారీ డిరోన్ అన్నారు. . ఒకే పన్నుతో ‘ఆటో’ జోరు... స్వాగతమన్న ఆటోమొబైల్స్ జీఎస్టీ విషయంలో ఆటోమొబైల్ రంగం యావత్తూ సానుకూలంగా స్పందిం చింది. ప్రస్తుత భిన్న రకాల పన్నుల వ్యవస్థ స్థిరీకరణ చెందుతుందని ఈ రంగం అభిప్రాయపడింది. ఆటోమోటివ్ పరిశ్రమ ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో లబ్ధి పొందుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుగాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రస్తుతం వాహనం కొలతలు, ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఆటో పరిశ్రమపై నాలుగు శ్లాబుల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. చిన్న కార్లపై (నాలుగు మీటర్లలోపు పొడవు ఉన్నవి) 12 శాతం ఎక్సైజ్ పన్నుంటే... అంతకు మించిన పొడవున్న పెద్ద కార్లపై 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవన్నీ 1500 సీసీ సామర్థ్యంలోపున్నవే. ఈ సామర్థ్యం దాటిన వాటిపై పన్ను ఇంకా అధికంగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి చక్కని అవకాశం... జీడీపీలో తయారీ రంగం నుంచి 45 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతమున్న భిన్న రకాల పన్నుల వ్యవస్థను స్థిరీకరణ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. - యోచిరో యునో, హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ పన్నుల భారం తగ్గుతుంది... వాహన పరిశ్రమపై అధిక పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ భారం తగ్గి, సులభతరమైన, పారదర్శక విధానం వస్తుంది. సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలతో పోటీపడగల అతిపెద్ద ఏకైక మార్కెట్గా అవతరిస్తుంది. - రాకేష్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్ను మరింత బలోపేతం చేస్తుంది దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలమైన, ఓపెన్ మార్కెట్గా జీఎస్టీ చేయగలదు. అంతర్జాతీయంగా మరింత పోటీపడేలా చేస్తుంది. - పవన్ ముంజాల్, చైర్మన్, ఎండీ, హీరోమోటోకార్ప్ ఈ- కామర్స్ వృద్ధికి విఘాతం: పరిశ్రమ మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) జీఎస్టీ నిబంధన ఈ కామర్స్ పోర్టళ్ల (మార్కెట్ ప్లేస్ మోడల్) అభివృద్ధికి పెద్ద విఘాతమని, చిన్న వర్తకులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వేదిక ద్వారా... వినియోగదారులు ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే మొత్తం నుంచి టీసీఎస్ రూపంలో కొంత మినహాయించాల్సి ఉంటుంది. విక్రయదారులు తమ పన్నులో ఇది సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే, దీని కారణంగా తక్కువ లాభంపై పనిచేసే చిన్న వ్యాపారస్తులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా వ్యాపారం చేసే వారిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కామర్స్ రంగానికి జీఎస్టీ మంచి ఉత్ప్రేరకమని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. టీసీఎస్పై పునఃపరిశీలన అవసరం ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణల స్ఫూర్తి అమలులో కనిపించాలి. ప్రస్తుత చిక్కుముళ్ల స్థానంలో కొత్త అడ్డంకులను సృష్టించరాదు. - కునాల్ భాయ్, సీఈవో, స్నాప్డీల్ సంస్కరణలకు జోష్: ఫిచ్ న్యూఢిల్లీ: ‘వాణిజ్య పరంగా ఉన్న అడ్డంకులను జీఎస్టీ తొలగిస్తుంది. ఇదొక కీలక సంస్కరణ. ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే, స్వల్ప కాలంలో ద్రవ్యలోటు పరంగా ఏమంత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందడంతో కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వ సామర్థ్య పరంగా సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయిందని అభివర్ణించింది. జీఎస్టీ అమలుతో ప్రభుత్వానికి అధిక పన్ను ఆదాయం సమకూరుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. పన్ను రేటును ఎంత నిర్ణయిస్తారు వంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తన నివేదికలో ఫిచ్ తెలిపింది. -
జీఎస్టీపై బి-టౌన్ టాక్
ముంబై: సుదీర్ఘ కాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుకు బుధవారం పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పరిణామాలపై హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దర్శకులు, ఇతర నటులు సోషల్ మీడియాలో స్పందించారు. బాలీవుడ్ కు చెందిన ఆయుష్మాన్ ఖురానా, బాలాజీ టెలీ మాజీ సీఈఓ తనూజ్ గార్గ్ తదితరులు ట్విట్టర్ లో తమ అభప్రాయాలను పోస్ట్ చేశారు. నటుడు పూరబ్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ తాము ఇంకా జిఎస్టి బిల్లు తరువాత స్వచ్ఛ్ భారత్ పన్ను చెల్లించవలసి ఉంటుందా తెలుసుకోవాలని ఉందన్నారు. జీఎస్ టీ బిల్లు విప్లవాత్మక సాహసోపేతమైన అడుగు అని ఆయుష్మాన్ ట్విట్ చేశారు. 1992 నుంచి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అనీ, ఇదొక "వీర విప్లవ అడుగు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం... ఒకపన్ను స్వాతంత్ర్యం అనంతరం ఇది అతిపెద్ద సంస్కరణ అంటూ తనూజ్ గూర్గ్ ప్రశంసించారు. జీఎస్టీ ఫైనల్లీ.. ఆహ్వానించ దగిన పరిణామమని దర్శకుడు కునాల్ కోహ్లీ తన సంతోషాన్ని షేర్ చేశారు. అయితే హాస్యనటుడు అశ్విన్ ముష్రాన్ తనకు సంబంధించి జీఎస్టీలో ప్రధాన లోపం అధిక సేవా పన్ను కావచ్చన్నారు. కానీ మిగతా అంతా ప్రామాణీకరింబడిందని ట్విట్ చేశార. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. పెద్దగా ఏమీ తెలియకపోయినా... చాలా ఉత్సాహంగా అనిపించిందని ట్విట్ చేశారు. కాగా రాజ్యసభ అమోదంతో జీఎస్టీ బిల్లు చట్టం రూపం దాల్చడానికి ఒక ప్రధాన అడుగు ముందుకు పడినట్టు అయింది. ఇక ఇది బిల్లుగా మారడానికి లోకసభలో గ్రీన్ సిగ్నల్ పడడమే తరువాయి. -
స్వామిగారు ఎందుకు సైలెంటయ్యారంటే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయ, ఆర్థిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. దుమారం రేపే బీజేపీ ఫైర్బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. చరిత్రాత్మకమైన జీఎస్టీ బిల్లుపై మాత్రం మౌనం దాల్చారు. బుధవారం రాజ్యసభ ఆమోదించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు యోగ్యతాయోగ్యతల గురించి తనకు మాట్లాడాలని ఉన్నా... తన ఆర్థిక ప్రావీణ్యం, పార్టీ విధేయత మధ్య ఇది ఘర్షణకు దారితీసే అవకాశముండటంతో తాను మౌనంగా ఉన్నట్టు స్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు. ' జీఎస్టీ పాత్ర, అవసరం ఎంతవరకు ఉందనే అంశంపై దేశభక్తులైన నెటిజన్లు ఎవరైనా సమగ్రంగా అధ్యయనం చేశారా?' అంటూ ఆయన ట్విట్టర్లో అడిగారు. ఓ ఫాలోవర్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థపై ఈ బిల్లు ప్రభావం గురించి మీ అభిప్రాయాలను మీడియాకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. స్వామి స్పందిస్తూ.. 'నా ఆర్థికశాస్త్ర ప్రావీణ్యం, పార్టీ విధేయత పట్ల ఘర్షణకు దారితీస్తుందనే నేను మౌనంగా ఉన్నాను' అని స్వామి చెప్పారు. తన అభిప్రాయాలు చెప్పడం వల్ల సొంత పార్టీ బీజేపీ ఎక్కడ నొచ్చుకుంటుందోనన్న అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తంచేశారు. అంతేకాకుండా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగాలంటే అందుకు అధిక పెట్టుబడులు, మూలధనం, అధిక కార్మిక ఉత్పాదకత మాత్రమే మార్గమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!!
భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన గొప్ప బిల్లు జీఎస్టీ... దేశమంతా ఒకే పన్ను ఉండేలా రూపొందిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. అతిపెద్ద పన్నుల సంస్కరణగా భావిస్తున్న ఈ బిల్లుపై రాజకీయ నాయకులే కాదు.. చాలామంది ప్రముఖులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కానీ, 2007లో యూపీఏ ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ బిల్లు గురించి బాలీవుడ్ టాప్ హీరోలకు అసలేమీ ఏమీ తెలియదంట. వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓవైపు జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని కీరిస్తూనే.. అబ్బే ఈ బిల్లు గురించి మాకేం తెలియదండి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. 'ఆర్థిక విషయాల గురించి నాకు పరిమిత జ్ఞానమే ఉంది. అయినప్పటికీ జీఎస్టీ బిల్లు దేశ బలోపేతానికి గొప్ప ముందడుగు. కాబట్టి అందరికీ అభినందనలు' అని షారుఖ్ ట్వీట్ చేయగా.. ఇటూ బిగ్ బీ కూడా తనకు ఆ బిల్లు గురించి ఏమీ తెలియదంటూ సెలవిచ్చాడు. 'జీఎస్టీ బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చించి ఎట్టకేలకు ఆమోదించారు. ఈ బిల్లు ఏమిటో నాకు తెలియదు. కానీ అందరిలాగే ఎక్సైట్ అయ్యాను' అని బిగ్ బీ ట్వీటారు.