Maruti suzuki
-
13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..
ఆటో రంగ దిగ్గజాలు వచ్చే నెల(ఏప్రిల్) నుంచి వాహన ధరలను పెంచే సన్నాహాల్లో ఉన్నాయి. పెరిగిన ముడిసరుకుల వ్యయాలను కొంతవరకూ సర్దుబాటు చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ధరలు పెంచనున్నట్లు చెబుతున్నాయి. ప్రధానంగా కార్ల తయారీ కంపెనీలు ధరల పెంపు(car prices) యోచనను వెల్లడించాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 4 శాతం వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) వెల్లడించింది. ఈ బాటలో హోండా కార్స్ సైతం ధరల పెంపువైపు చూస్తున్నట్లు తెలియజేసింది. వెరసి కొత్త ఏడాది(2025)లో రెండోసారి ధరల పెంపును చేపట్టనున్నాయి.ముడివ్యయాల సర్దుబాటుముడిసరుకులతోపాటు నిర్వహణ వ్యయాలు పెరగడంతో కార్ల ధరలను సవరించనున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. మోడల్ ఆధారంగా గరిష్టంగా 4 శాతంవరకూ ధరల పెంపు ఉండొచ్చని తెలియజేసింది. కస్టమర్లపై వ్యయ ప్రభావాన్ని కనీసస్థాయికి పరిమితం చేసే బాటలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం మారుతీ ఎంట్రీలెవల్ ఆల్టో కే10సహా ఎంపీవీ.. ఇన్విక్టో వరకూ పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు(ఢిల్లీ ఎక్స్షోరూమ్) రూ. 4.23 లక్షల నుంచి రూ. 29.22 లక్షలవరకూ ఉన్నాయి. ఇదీ చదవండి: జీడీపీలో ఎంఎస్ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటుఫిబ్రవరి 1 నుంచి మారుతీ కార్ల ధరలను గరిష్టంగా రూ. 32,500 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో టాటా మోటార్స్ సైతం ఏప్రిల్ నుంచి వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక హోండా కార్స్ ఇండియా సైతం వాహన ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
పెరగనున్న కార్ల ధరలు: ఎప్పటి నుంచి అంటే?
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.మోడల్ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
ఎక్కువమంది ఆ బ్రాండ్ కార్లనే కొనేస్తున్నారు
ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్ వెహికిల్స్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.➤హ్యుండై మోటార్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్కు అవసరమైన డిమాండ్ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ అన్నారు.➤టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤ఎస్యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి. -
బాలెనో ధరల పెంపు
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య మారుతీ సుజుకి(Maruti Suzuki) తన కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పాపులర్ మోడల్ అయిన బాలెనో(Baleno) ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో పెట్రోల్, సీఎన్జీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కారు 88 హెచ్పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)తో వస్తుంది. ఎంటీ కలిగిన పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఏఎంటీతో ఉన్న కార్లు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ ఆధారిత వర్షన్ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెప్పింది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్, జీటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్ నిపుణులు అంటున్నారు. -
కొత్త ఏడాది.. మంచి బోణీ మారుతీ సుజుకీదే..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి. -
జపాన్కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుతో.. కీర్తి సురేష్ (ఫోటోలు)
-
కార్ కొనేవారికి అలర్ట్.. మారుతి సుజుకి ధరల పెంపు
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki) ధరలను పెంచింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా పలు మోడళ్లలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల (Car Prices) పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు సెలెరియో మోడల్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని ధర రూ. 32,500 వరకు పెరుగుతుందని ఎక్స్ఛేంజీలకు మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావం వల్ల ధరలు పెరిగాయని మారుతి సుజుకి వివరించింది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మోడళ్లపై ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.ముడిసరుకు, లాజిస్టిక్స్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీదారులు అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ సప్లయి చైన్లో అంతరాయాలు, పెరుగుతున్న డిమాండ్లే ముడిసరుకు ధరల పెరుగుదల కారణమని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబల్ అభిప్రాయపడింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సుంకాల అవకాశం కూడా అనిశ్చితిని జోడించింది. ఇది పరిశ్రమలో ఖర్చు ఒత్తిడిని మరింత పెంచుతుంది.ఏ కారు ఎంతెంత పెరుగుతాయి?సెలెరియో అత్యధికంగా రూ. 32,500 వరకు, ఇన్విక్టో రూ. 30,000 వరకు, గ్రాండ్ విటారా రూ. 25,000 వరకు పెరుగుతాయి. ఇక బాలెనో ధర పెంపు రూ. 20,500 వరకు ఉంటుంది. ఆల్టో కె10 ధర రూ. 19,500 వరకు పెరుగుతుంది. ఎర్టిగా ధర రూ.15,000 వరకు, ఎస్-క్రాస్ ధర రూ.12,500 వరకు, ఎక్స్ఎల్6 ధర రూ.11,000 వరకు పెరగనుంది.డిజైర్ రూ. 10,550 వరకు, సూపర్ క్యారీ రూ. 10,000 వరకు, బ్రెజ్జా రూ. 9,000 వరకు, వ్యాగన్-ఆర్ రూ. 8,000 వరకు పెరగనున్నాయి.అదే సమయంలో, ఇగ్నిస్ రూ. 6,000 వరకు, ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో రెండూ రూ. 5,000 వరకు పెరగనున్నాయి. సియాజ్, జిమ్నీ స్వల్పంగా రూ. 1,500 వరకు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. -
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్తో కూడిన డిజిటల్ కాక్పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదే
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (MSIL) తన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్ట్రాటజీ 'ఈ ఫర్ మీ' (e For Me) ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా తీసుకురానుంది. ఇందులో భాగంగానే సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారా (e Vitara) ప్రారంభించనుంది.కంపెనీ లాంచ్ చేయనున్న మారుతి గ్రాండ్ ఈ విటారా.. 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025' ((Bharat Mobility Global Auto Show 2025)) లో కనిపించనుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. దీని ఉత్పత్తిని సంస్థ తన గుజరాత్ ప్లాంట్లో 2025 మార్చి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది తరువాత మారుతి సుజుకి.. తన ఎలక్ట్రిక్ విటారాను యూరప్, జపాన్లలో కూడా ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇ ఫర్ మీ అనేది భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనలో ఒక గొప్ప క్షణాన్ని సూచిస్తుంది. మారుతి సుజుకి నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశానికి విశ్వసనీయ మొబిలిటీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, నేడు.. కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీకి విప్లవాత్మక విధానాన్ని పరిచయం చేస్తున్నామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు.మారుతి ఈ విటారాప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటి వరకు కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి.. గ్రాండ్ విటారాను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?ఈ విటారా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో భారత్లోకి అరంగేట్రం చేస్తుందని, కొంతకాలం తర్వాత దాని లాంచ్ అవుతుందని సమాచారం. కాజీ ఈ కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. ఈ కార్ల ఉత్పత్తి భారతదేశంలో జరిగినప్పటికీ.. ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతాయి. మారుతి సుజుకి న్యూఢిల్లీలోని భారత్ మండపం, హాల్ నంబర్ 5 వద్ద తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇది మాత్రమే కాకుండా.. సంస్థ డిజైర్, స్విఫ్ట్, ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బ్రెజ్జా వంటి లేటెస్ట్ మోడల్స్ కూడా ప్రదర్శించనుంది. రెండేళ్లకో సారి జరిగే ఈ ఆటో షోలో.. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందులో బీవైడీ వంటి చైనా కంపెనీలు, జపాన్, జర్మనీ కంపెనీలు.. భారతీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలన్నీ కనిపించనున్నాయి. వాహన ప్రేమికులను ఆకర్శించనున్నాయి. -
2025 ఆటో ఎక్స్పోలో ‘ఈ–విటారా’
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్íÙప్లు, సరీ్వస్ టచ్ పాయింట్లలో ఫాస్ట్ చార్జర్ల నెట్వర్క్, హోమ్ చార్జింగ్ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్వర్క్ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
జిమ్నీ కార్లు వెనక్కి.. మారుతి సుజుకి కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన జిమ్నీ ఆఫ్-రోడర్ కారుకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన అన్ని వేరియంట్లు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి.మారుతి సుజుకి జిమ్నీ కారు 80 కిమీ వేగంతో వెళ్తున్న సమయంలో బ్రేక్ వేస్తే వైబ్రేషన్స్ వస్తున్నట్లు, వేగం 60 కిమీకి తగ్గితే ఈ వైబ్రేషన్ పోతుందని చాలామంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించుడనికి రీకాల్ ప్రకటించింది. కారులో సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది.మారుతి సుజుకి దేశీయ విఫణిలో.. ఆఫ్-రోడ్ విభాగంలో కూడా తన హవాను చాటుకోవడానికి, 'మహీంద్రా థార్'కు ప్రత్యర్థిగా నిలువడానికి జిమ్నీ ఎస్యూవీని లాంచ్ చేసింది. ప్రారంభంలో ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందినప్పటికీ.. క్రమంగా అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కారు కొంత చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే కూడా ధర కొంత ఎక్కువగా ఉండటం అనే తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..మారుతి జిమ్నీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్.. 104.8 పీఎస్ పవర్, 134.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
రోజుకు 1000 మంది కొన్న కారు ఇదే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో 61% వాటాను కలిగి ఉంది.అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్బ్యాక్ల నుంచి ఎస్యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
100 దేశాలు 17 కార్లు.. అగ్రరాజ్యాల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' ఎట్టకేలకు 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసింది. భారతదేశంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన ఏకైక కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.1986 నుంచి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించిన మారుతి సుజుకి.. ప్రారంభంలో 500 కార్లను ఎగుమతి చేసింది. 2013 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 లక్షల యూనిట్లను విజయవంతంగా ఎగుమతి చేయగలిగింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు (FY21) మరో 10 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయి. మరో 10 లక్షల కార్లను కంపెనీ ఎగుమతి చేయడానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో కూడా మారుతి సుజుకి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు స్పష్టమైంది.కంపెనీ ఎగుమతి చేసిన కార్లలో సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్-ప్రెస్సో మొదలైన కార్లు ఉన్నాయి. నేడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వాహనాల్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.మారుతి సుజుకి దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ వంటివి కంపెనీకి ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఎగుమతుల్లో కంపెనీ సాధించిన విజయానికి మారుతి సుజుకి ఎండీ అండ్ సీఈఓ హిసాషి టేకుచి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన జబర్దస్త్ వర్ష (ఫొటోలు)
-
వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం 'డిజైర్' కారును భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును నాలుగు ట్రిమ్లలో రూ.6.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ఇప్పటికే సంస్థ ఈ సెడాన్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది.2024 డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇతర మారుతి కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా ఇప్పటికే మారుతి డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: లాంచ్కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్కొత్త డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన ఈ మారుతి డిజైర్ కారు సింగిల్ పేన్ సన్రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఇది 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
లాంచ్కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే..
భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న 'మారుతి సుజుకి' ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ టయోటాతో కలిసి 'ఈవీఎక్స్' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి ఇండియా రెండూ కలిసి మొదటి ఎలక్ట్రిక్ కారును 2025లో ఈవీఎక్స్ కారును లాంచ్ చేయనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గుజరాత్లోని తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనుంది.మారుతి సుజుకి తయారీ కర్మాగారం.. గుజరాత్ హన్సల్పూర్లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ప్రస్తుతం ఇక్కడ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ వంటి మోడల్లు తయారవుతున్నాయి. ఈ కార్లను సంస్థ దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలుమారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ నుంచి 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈవీఎక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందనున్నట్లు సమాచారం. లాంచ్కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్!.. అప్పుడే 2 లక్షల మంది కొనేశారు
ఏప్రిల్ 2023లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం 17 నెలల్లో రెండు లక్షల అమ్మకాలను చేరుకుంది. మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి 10 నెలల్లో 100000 యూనిట్లు.. మరో నాలుగు నెలల్లో 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 14 నెలల్లోనే 1.50 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.1.50 లక్షల సేల్స్ సాధించిన తరువాత.. మరో మూడు నెలల్లో 50వేల విక్రయాలను పొందింది. అంటే మొత్తం 17 నెలల్లో రెండు లక్షలమంది కస్టమర్లను ఆకర్శించి అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది.ఇదీ చదవండి: కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయంమారుతి ఫ్రాంక్స్ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ), జీటా, ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
మారుతీ ఈవీ రేంజ్ 500 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్సైజ్ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. -
మారుతి సుజుకి చిన్న కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. ఇటీవలి నెలల్లో నిస్తేజంగా ఉన్న మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (S-Presso LXI) పెట్రోల్ మోడల్పై రూ.2,000, ఆల్టో కే10 వీఎక్స్ఐ (Alto K10 VXI) పెట్రోల్ వేరియంట్పై రూ. 6500 మారుతి సుజుకి తగ్గించింది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఎక్స్షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఇక మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.తగ్గిన విక్రయాలుఈ ఏడాది ఆగస్ట్లో మారుతి సుజుకి మొత్తం వాహన విక్రయాలు 3.9 శాతం తగ్గాయి. ఈ ఆగస్టు నెలలో 181,782 యూనిట్లను విక్రయించగా గతేడాది ఇదే నెలలో 189,082 యూనిట్లను విక్రయించింది. వీటిలో స్థానిక మార్కెట్ విక్రయాలు 145,570 యూనిట్లు కాగా, ఎగుమతులు 26,003 యూనిట్లుగా ఉన్నాయి.ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో అమ్మకాలు గతేడాది ఆగస్ట్లో 84,660 ఉండగా ఈ ఆగస్ట్లో 68,699కి తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 20% తగ్గి 58,051 యూనిట్లకు పడిపోయాయి.గత సంవత్సరం ఇదే నెలలో ఇవి 72,451 యూనిట్లుగా ఉన్నాయి. -
భారత్లో ఎప్పటికీ చిన్నకార్లదే హవా
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటుందని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. భారత ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ధరకు లభించే చిన్న కార్లు అవసరమని విశ్వసిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘చిన్న కార్ల డిమాండ్లో తాత్కాలికంగా ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. అయితే ఇది కంపెనీ వ్యూహాన్ని మార్చబోదు. స్కూటర్ వాడుతున్న వారు దేశంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో వీరు కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండే చిన్న కార్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. భారత్లో పెద్ద, విలాసవంత వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విక్రయాలు, సేవా నెట్వర్క్ను కంపెనీ మరింత బలోపేతం చేస్తోంది’ అని తెలిపారు.ఆరు ఈవీ మోడళ్లు..కంపెనీ నుంచి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లు 2030–31 నాటికి భారత్లో రంగ ప్రవేశం చేస్తాయని భార్గవ వెల్లడించారు. ‘కొన్ని నెలల్లోనే భారత్లో మారుతీ సుజుకీ తొలి ఈవీ రానుంది. ఈ కార్లను యూరప్, జపాన్కు ఎగుమతి చేస్తాం. 2030–31 నాటికి 40 లక్షల యూనిట్లకు తయారీ సామర్థ్యం పెంచుకుంటాం. 7.5–8 లక్షల యూనిట్లు ఎగుమతి చేస్తాం. 2024–25లో 3 లక్షల యూనిట్లు ఎగుమతులు జరగొచ్చు. హరియాణాలో 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రూ.18,000 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటులో 2025–26లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. -
మారుతీ సుజుకీ నెక్సా విస్తరణ
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్వర్క్ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.నెక్సా వాటా 37 శాతం.. మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. -
మారుతి సుజుకి ఇండియాకు షోకాజ్ నోటీసు
ప్రముఖ వాహన తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి' రూ.3.81 కోట్లకు పైగా డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కస్టమ్స్ అథారిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కంపెనీ ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ కస్టమ్స్ (దిగుమతి), కమీషనర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది.ఈ షోకాజ్ నోటీసులో.. నిర్దిష్ట కేటగిరీ వస్తువుల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి & వడ్డీ, జరిమానాతో పాటు రూ.3,81,37,748 డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించడానికి గల కారణాలను అందించాల్సిందిగా అధికార యంత్రాంగం కంపెనీని కోరింది. -
ఆల్టో కే10 కార్లకు రీకాల్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.స్టీరింగ్ గేర్ బాక్స్లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్షాప్లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది. -
తక్కువ ధరలో కార్లు.. దిగ్గజ కంపెనీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కువమంది ప్రజలు సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇండియా బడ్జెట్ కార్లను తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.మార్కెట్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. దేశ ఆర్థిక స్థితిని తీర్చడానికి.. పౌరులు సురక్షితమైన & సౌకర్యవంతమైన కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో తక్కువ ధరలో చిన్న కార్లను తయారు చేయడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని భార్గవ పేర్కొన్నారు.ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనపరిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో మారుతి సుజుకి విక్రయాలు 2,22,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన కార్లు 2,54,973 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 12.8 శాతం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు భార్గవ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చేరుకోవడంలో మారుతి సుజుకి గణనీయమైన వృద్ధి సాధించింది. కంపెనీ సర్వీస్ కూడా అద్భుతంగా ఉందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. మా అమ్మకాలు మొత్తంలో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని అన్నారు.మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు. కానీ త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ విభాగంలో కూడా సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ విభాగంలో లాంఛ్ అయ్యే మొదటికారు ఈవీఎక్స్ (eVX) అని తెలుస్తోంది. -
రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్
2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది.కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది. -
వాహన అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా జూన్లో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. మొత్తంగా ఈ జూన్లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,28,710 యూనిట్లతో ఇవి కేవలం 3.67 శాతం అధికం. మారుతీ సుజుకీ, మహీంద్రాఅండ్మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, కియా మోటార్స్ కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ నెలవారీగా కంపెనీ చరిత్రలో అత్యధికంగా 27,474 వాహనాలకు విక్రయించింది. టాటా మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్ మోటార్స్ అమ్మకాలు తగ్గాయి. ⇒ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 21,68,512 వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 తొలి ఆరు నెలల్లో అమ్ముడైన 20,15,033 యూనిట్లతో పోలిస్తే ఇవి 7.6 శాతం అధికం. ఏప్రిల్ పండుగ సీజన్ డిమాండ్ తర్వాత మే, జూన్లో వాహన పరిశ్రమ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత చూసింది. సార్వత్రిక ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతలు ఇందుకు కారణాలు. గత రెండు నెలల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎంక్వెరీలు బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో విక్రయాలు ఊపందుకునే వీలుంది.– పార్థో బెనర్జీ, మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ హెడ్ -
మీకు తెలుసా? ఈ కారును భారత్లో 30లక్షల మంది కొన్నారు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి స్విఫ్ట్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా కంపెనీ 2005లో తన స్విఫ్ట్ కారును ప్రారంభించింది. ఆ తరువాత ఇప్పటివరకు అనేక అప్డేట్స్ పొందూతూ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. దీంతో భారతదేశంలో స్విఫ్ట్ సేల్స్ 30లక్షల యూనిట్లకు చేరుకుంది.అమ్మకాల్లో స్విఫ్ట్ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. లక్షలాది మంది స్విఫ్ట్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్విఫ్ట్ యజమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. త్వరలో CNG రూపంలో కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే.. 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.4 Bhp పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం. ఈ మోడల్ కేవలం మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే!
భారతదేశంలో 7 సీటర్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నా.. ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కారుకు ఓ ప్రత్యేకమైన డిమాండ్, ఆదరణ ఉంది. ఈ కారును గత నెలలో (మే 2024) ఏకంగా 13,893 మంది కొనుగోలు చేశారు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన 7 సీటర్ కారుగా ఎర్టిగా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసింది.దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం ఏఋ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఈ కారు ఉత్తమ ఎంపిక.మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది CNG రూపంలో కూడా లభిస్తుంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు నాలుగు ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర కూడా పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో ఇనోవా క్రిష్టా, కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుల్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్మెంట్లను కలిగి ఉంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది. -
సింగిల్ ఛార్జ్.. 230 కిమీ రేంజ్!.. మారుతి ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మారుతి సుజుకి తన 'వ్యాగన్ఆర్'ను ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ దీనిని 'ఈడబ్ల్యూఎక్స్' (eWX) పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది.2023 ఆటో ఎక్స్పోలో మొదటిసారి కనిపించిన ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు సీ షేప్ లైట్ క్లస్టర్లతో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ పొందుతుంది. ప్లాస్టిక్ క్లాడింగ్ బంపర్ ఉంటుంది. వీల్స్, సైడ్ స్కర్ట్లపై పసుపు రంగుతో ఉండటం చూడవచ్చు. ఇది ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. అయితే కచ్చితమైన గణాంకాలు లాంచ్ తరువాత తెలుస్తాయి.మారుతి సుజుకి ఈ కారును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి హైబ్రిడ్ కార్లను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే స్విఫ్ట్ వంటి కార్లను హైబ్రిడ్ వెర్షన్లలో పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్కి టీకేఎం వెర్షన్గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!
రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ను హెలికాప్టర్గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన. ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు. ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k — Priya singh (@priyarajputlive) March 17, 2024 (చదవండి: పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!) -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్షాప్స్ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్బ్యాక్స్కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
మారుతీ సుజుకీ డీలర్లకు బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. డీలర్ నెట్వర్క్ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది. -
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్కి అప్పీల్కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
నేటి నుంచి పెరిగిన కార్ల ధరలు.. ఎంతంటే..?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుందని సంస్థ పేర్కొంది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
2023లో భారీగా పెరిగిన కార్ సేల్స్ - ఆ కంపెనీ కార్లకే డిమాండ్!
భారతదేశంలో రోజు రోజుకి వాహన విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 కంటే కూడా 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనల్లో వివరంగా తెలుసుకుందాం. 2023 లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్యూవీల అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగాయి. 2022లో సగటున కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో సరాసరి రూ.11.5 లక్షలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి హవా జోరుగా సాగింది. భారతీయ ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నట్లు.. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవస్తవ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ కార్ల అమ్మకాల్లో ఎస్యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో ఈ సంఖ్య 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. 2023లో సెడాన్స్ విక్రయాలు 11 శాతం నుంచి 9.4 శాతానికి పతనం కాగా, మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు యధాతథంగా 8.7 శాతం వద్ద కొనసాగాయి. దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా ఎగుమతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఏడాది 2,69,046 యూనిట్లను ఎగుమతైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 లక్షల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయాలు 4.68 లక్షల యూనిట్లుగా నిలిచాయి. -
ఈ కారుని 10 లక్షల మంది కొనేశారు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
వాహనదారులకు మారుతి సుజుకీ ప్రత్యేక డిస్కౌంట్లు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్యూవీ మోడల్ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది. జిమ్నీ ఎస్యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్స్ వచ్చేశాయ్!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. ఇక రానున్నది విజయ దశమి. ఈ సందర్భంగా చాలామంది వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్స్ అందిస్తున్న కార్ల కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా వంటివి ఉన్నాయి. హోండా కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ వంటి కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా సిటీ కారు మీద రూ. 75,000 వరకు ప్రయోజనాలు, అమేజ్ మీద రూ. 57,000 బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, ఇప్పుడు సంస్థ ఐ10 ఎన్ లైన్ మీద రూ. 50000, గ్రాండ్ ఐ నియోస్ మీద రూ. 43000, ఆరా మీద రూ. 33000, వెర్నా అండ్ అల్కజార్ మీద వరుసగా రూ. 25000 & రూ. 20000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? మారుతి సుజుకి కూడా ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్ కింద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో మారుతి ఇగ్నీస్, బాలెనొ అండ్ సియాజ్ ఉన్నాయి. వీటి మీద కంపెనీ వరుసగా రూ. 65000, రూ. 55000 & రూ. 53000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. Note: హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్తో బడ్జెట్ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
రాష్ట్రాల్లో అధికారుల తీరు మారటంలేదు..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్ రాజ్)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు. తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు. ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్ రాజ్ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు. -
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
అమ్మకాల్లో పెరిగిన మారుతి జోరు.. తగ్గిన టాటా మోటార్స్ సేల్స్
Car Sales 2023 August: 2023 ఆగష్టు నెల ముగియగానే దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఈ డేటా ప్రకారం దాదాపు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తున్నాయి. గత నెలలో ఎక్కువ కార్లు విక్రయించిన సంస్థ ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కార్ల అమ్మకాలలో 2022 ఆగష్టు నెల కంటే 2023 ఆగష్టు నెలలో మారుతి సుజుకి 16.4 శాతం (165402 యూనిట్లు), మహీంద్రా అండ్ మహీంద్రా 19 శాతం వృద్ధి పొందినట్లు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో మొత్తం 70350 యూనిట్లను విక్రయించింది. ఇందులో 37270 యూనిట్లు దేశీయ విక్రయాలు కాగా.. మిగిలినవి విదేశీ ఎగుమతులు. మొత్తం మీద మహీంద్రా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో 78,010 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఆగష్టు నెలలో 78,843 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇక టూ వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్స్ 5 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. కాగా బజాజ్ ఆటో 31 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం మీద అమ్మకాల పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లు, సీఎన్జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్గా భారత్ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు. మార్కెట్ వాటా మళ్లీ పెంచుకుంటాం.. చిన్న కార్లకు డిమాండ్ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. 2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీము పొడిగింపు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది. దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
పాత కార్ల అమ్మకాల్లో కనీవినీ ఎరుగని రికార్డ్ - అట్లుంటది మారుతి అంటే!
న్యూఢిల్లీ: ఆటోమొబై ల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) గత రెండు దశాబ్దాల్లో రికార్డు స్థాయిలో పాత కార్లను విక్రయించింది. సంస్థలో భాగమైన ట్రూ వేల్యూ 22 ఏళ్లలో 50 లక్షల వాహనాలను అమ్మింది. ట్రూ వేల్యూ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం 281 నగరాల్లో 560 అవుట్లెట్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ‘మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పరిశ్రమలో విజయవంతంగా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 లక్షల మంది కొనుగోలుదారులకు సంతోషాలను పంచింది. వారి ప్రథమ ఎంపికగా ఎదిగింది‘ అని ఎంఎస్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ నెలకు సంబంధించి కార్ల కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్బాక్స్తో పెట్రోల్, CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో అన్ని వేరియంట్లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడిన వేరియంట్లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు) మారుతీ సుజుకీ ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వ్యాగన్ ఆర్ మోడల్స్పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్షిప్ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45 లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?
Maruti Alto: మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ప్రకటించింది. ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) దేశంలో మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సిఎన్జిలను విడుదల చేసింది. 2012 నాటికి 20 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లోఆల్టో 30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గత ఏడాది కంపెనీ మూడవ తరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్జీ పవర్ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) -
మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో
మారుతి సుజుకి చెందిన పాపులర్ వెహికల్ 5-డోర్ మారుతీ జిమ్నీని ఒక క్యాంపింగ్ బెడ్గా మార్చేసిన వైనం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. యూట్యూబర్స్ జంట మారుతి సుజుకి జిమ్నీని సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను Xreme Moto అడ్వెంచర్ షేర్ చేసింది. ఈ వీడియోలో దశల వారీగా మొత్తం ప్రక్రియను పొందుపర్చింది ఈ జంట. ఇది నెటిజనులను ఆశ్చర్య పరుస్తోంది. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!) యూట్యూబర్ , అతని భార్య తమ మారుతి సుజుకి జిమ్నీ కారు లోపలి భాగాన్ని పరుపుకు అనుగుణంగా మార్చి, హాయిగా క్యాంపింగ్ సెటప్ను సృష్టించారు. ఇందుకోసం ఆగానే కష్టపడ్డారు. కారు వెనుక తలుపు తెరిచి కవర్ను తీసి వేయడం, ఇంటి నుండి 6-అంగుళాల సింగిల్ బెడ్ కోసం మధ్య సీటును తీసివేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో, వారు మధ్యలో నుండి నాలుగు బోల్ట్లను తీసివేయడానికి ప్రయత్నించి, విఫలమై, మరుసటి రోజుకు వాయిదా వేయడం, మరుసటి రోజు మధ్య వరుస సీట్లలోని పైభాగాన్ని విప్పడంతో వారి పని ఈజీ అవుతుంది. (శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!) మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో కూడా క్యాంపింగ్ సెట్ను అందంగా మర్చుకోవడం క్రియేటివ్గా నిలిచింది. సెటప్ పూర్తయిన తర్వాత, దంపతులు తమ కొత్త క్యాంపింగ్ ఏర్పాటును తమ తల్లికి ఆసక్తిగా చూపించడంతో వ్యక్తిగతంగా ఎనలేని సంతోషాన్ని, అటు కుటుంబ ఆమోదాన్ని కూడా పొందింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?) -
87,599 కార్లకు రీకాల్ ప్రకటించిన దిగ్గజ కంపెనీ - కారణం ఇదే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో సుమారు 87,599 ఎస్-ప్రెస్సో & ఈకో కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తన ఎస్ ప్రెస్సో అండ్ ఈకో కార్లలో స్టీరింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇది వెహికల్ స్టీరబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021 జులై 05 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైన ఎస్ ప్రెస్సో & ఈకో కార్లకు మాత్రమే రీకాల్ ప్రకటించడం జరిగింది. కావున కస్టమర్లు ఈ సమస్యను సంబంధిత డీలర్షిప్లలో చెక్ చేసుకుని తగిన పరిష్కారం పొందవచ్చు. ఈ సర్వీస్ మొత్తం ఉచితంగానే లభిస్తుంది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) మారుతి సుజుకి ఈ సంవత్సరంలో రీకాల్ చేయడం ఇది నాలుగవ సారి కావడం గమనార్హం. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 1,23,351 యూనిట్లను రీకాల్ చేసింది. కార్లను రీకాల్ చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా వంటి కంపనీలు కూడా రీకాల్ ప్రకటించాయి. -
మొన్న విడుదలైన కారు అప్పుడే విదేశాలకు..
గత కొన్ని రోజులకు ముందు భారతీయ మార్కెట్లో విడుదలైన 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు దేశీయ తీరాలు దాటి విదేశాల్లో అడుగుపెట్టడానికి సన్నద్దమయిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి కొత్త కారు ఫ్రాంక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చేరుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి 556 వాహనాలు మొదటి బ్యాచ్గా ఎగుమతికానున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలా కంపెనీలు ఈ విధంగా ఎగుమతి చేశాయి. 2023 ఇండియన్ ఆటో ఎక్స్పోలో కనిపించిన మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదలైంది. ఈ SUV ధరలు రూ. 7.47 లక్షల నుంచి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!) మారుతి ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. -
మారుతి మరో సూపర్కారు వచ్చేసింది..మీరూ ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
-
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ను హైబ్రిడ్ మోటార్తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
మొదటి సారి కనిపించిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు
Maruti Suzuki eVX: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ విఫణిలో విడుదల చేసిన మంచి అమ్మకాలను పొందుతున్నాయి. కాగా మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలో నేను సైతం అంటూ 2023 ఆటో ఎక్స్పోలో 'ఈవీఎక్స్' (eVX) కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఈ కారు ఇప్పుడు ఎట్టకేలకు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్పోలో కనిపించిన తరువాత ఈవీఎక్స్ రోడ్లమీద కనిపించడం ఇదే మొదటి సారి. ఈ కారు ఫోలాండ్ కాకో వీధుల్లో టెస్టింగ్ దశలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వైరల్గా మారింది. మారుతి సుజుకి ఇప్పటికే జపాన్కు చెందిన టయోటాతో ఇప్పటికే అనేక సెగ్మెంట్లలో ఒప్పందాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఓ కొత్త ప్లాట్ఫార్మ్ను రూపొందిస్తున్నాయి. దీని ఆధారంగా 'ఈవీఎక్స్' పుట్టుకొస్తోంది. ఇది 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ & రేంజ్ మార్కెట్లో విడుదలకానున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బానెట్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, వీ షేప్ డీఆర్ఎల్స్, మౌంటెడ్ ఓఆర్వీఎంలు, అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్లైట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కానీ ఆధునిక కాలంలో వినియోగించడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో కూడిన డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్తో 550 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు ధర రూ. 18 - 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
రూ. 25 వేలకే ఇన్విక్టో బుకింగ్స్ - లాంచ్ ఎప్పుడంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతీ సుజుకీ సరికొత్త యుటిలిటీ వెహికిల్ ఇన్విక్టో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వినియోగదార్లు రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూలై 5న ఈ కారు భారత్లో ఎంట్రీ ఇవ్వనుంది. ధర రూ.20 లక్షలకుపైగా ఉండనుంది. ఇన్విక్టో రాకతో మూడు వరుసల్లో లభించే ప్రీమియం వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అవుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్ లక్షణాలతో కూడిన ప్రీమియం మూడు–వరుసల వాహనాన్ని కోరుకునే వినియోగదారులను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మూడు వరుసలున్న స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్స్ 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారంగా ఇన్విక్టో రూపుదిద్దుకుంది. Experience a new realm of luxury with the all-new Invicto. Bookings are now open for you to join this exclusive group. To know more : https://t.co/nuzitvde47#Invicto #Bookingsopen #Nexa #CreateInspire *Creative visualization pic.twitter.com/Zt9CuluXBN — Nexa Experience (@NexaExperience) June 19, 2023 -
మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?
Mahindra Thar vs Maruti Jimny: భారతీయ మార్కెట్లో చెప్పుకోదగ్గ అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ ఏది అనగానే టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీకి చెందిన థార్. అయితే థార్ ఎస్యువికి అసలు సిసలైన ప్రత్యర్థిగా 'మారుతి జిమ్నీ' ఇటీవలే దేశీయ విఫణిలో అడుగెట్టింది. ఈ రెండు ఆఫ్ రోడర్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ మారుతి సుజుకి జిమ్నీ బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్పై ఆధారపడి ఉంటుంది. అంటే బాడీ ప్రత్యేక ఛాసిస్పై నిర్మించబడి ఉంటుంది. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్ లైట్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, స్కేల్డ్-డౌన్ జి-వ్యాగన్ మాదిరిగానే బాక్సీ డిజైన్తో నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా భారతీయ భూభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్ పొందుతుంది. ఇది ఆఫ్-రోడింగ్ చేయడానికి అనుకూలమైన వాహనం. ఇది సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్ అనే రెండు ఆప్షన్స్ పొందుతుంది. ఫీచర్స్ ఫీచర్స్ పరంగా రెండూ కూడా ఉత్తమంగా ఉంటాయి. మంచి పట్టుని అందించడానికి అనుకూలంగా ఉండే స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే, అద్భుతమైన సీజింగ్ పొజిషన్, క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. వీటితో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో మహీంద్రా థార్ 4 స్టార్ స్కోరింగ్ సొంతం చేసుకుని భారతదేశంలో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కాగా జిమ్నీ కూడా మంది సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది, అయితే సేఫ్టీ రేటింగ్ ఇంకా తెలియాల్సి ఉంది. కలర్ ఆప్షన్ మహీంద్రా థార్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి న్యాపోలీ బ్లాక్, రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, ఆక్వా మెరైన్, ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ కలర్స్. ఇక జిమ్నీ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది మిడ్ నైట్ బ్లాక్ రూప్తో రెడ్ కలర్, బ్లూయిష్ బ్లాక్ రూప్తో రెడ్, బ్లూయిష్ బ్లాక్ రూప్తో కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, నెక్సా బ్లూ కలర్స్ పొందుతుంది. డైమెన్షన్ మారుతి జిమ్నీ కొలతల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 3850 మిమీ, వెడల్పు 1645 మిమీ, ఎత్తు 1730 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ, వీల్ బేస్ 2550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా థార్ పొడవు 3985 మిమీ, వెడల్పు 1820 మిమీ, ఎత్తు 1970 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 219 మిమీ, వీల్ బేస్ 2450 మిమీ వరకు ఉంటుంది. మహీంద్రా థార్ 3 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణం పరంగా జిమ్నీ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్యువి 1.5-లీటర్ K-సిరీస్ ఇంజన్ కలిగి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్బాక్స్ సహాయంతో 102 bhp పవర్ 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) మహీంద్రా థార్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 150 bhp పవర్ 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఇందులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130 bhp పవర్ 300 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ కూడా లీటరుకు 15.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) ప్రాక్టికాలిటీ మారుతి జిమ్నీ 5 డోర్స్ మోడల్ అయినప్పటికీ పరిమాణంలో మహీంద్రా థార్ కొంత పెద్దదిగా ఉంటుంది. రెండూ కూడా అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో మహీంద్రా థార్ సంచలన అమ్మకాలను పొందింది. జిమ్నీ కూడా విడుదలకు ముందే దాదాపు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కావున జిమ్నీ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మొదలైన విషయాల్లో దేనికదే సాటిగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇవన్నీ బేరీజు వేసుకుని నచ్చిన మోడల్ కొనుగోలు చేసుకోవచ్చు. -
రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
మారుతి సుజుకి జిమ్నీ 2023 ఆటో ఎక్స్పో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది. విడుదలకు ముందే 30,000 బుకింగ్స్ పొందిన ఈ ఆఫ్ రోడర్ ఇప్పటికి కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను 2023 జూన్ 7న అధికారికంగా ప్రకటించింది. జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు ప్రకటించడానికి ముందు కంపెనీ ఈ SUV కోసం రోజుకి దాదాపు 92 బుకింగ్స్ పొందింది. కాగా ధరలు ప్రకటించిన తరువాత రోజుకి 151 బుకింగ్స్ వస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సేల్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డిజైన్ పరంగా నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్ల్యాంప్లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు కలిగి ఉన్న ఈ ఆఫ్ రోడర్ 195/80 సెక్షన్ టైర్లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. లోపలి భాగంలో 9 ఇంచెస్ స్మార్ట్ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. జిమ్నీ ఎస్యువి 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి తన జిమ్నీ కారుని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయ విఫణిలో డెలివరీలను కూడా ప్రారంభించింది. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత మార్కెట్లో మారుతీ ఎంపీవీ ఇన్విక్టో.. ధర ఎంతంటే
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా త్వరలో మార్కెట్లోకి తేనున్న మల్టీపర్పస్ వెహికిల్కు ఇన్విక్టో అని నామకరణం చేసింది. జూలై 5న భారత విపణిలో ఇది రంగ ప్రవేశం చేయనుంది. జూన్ 19 నుంచి బుకింగ్స్ ప్రారంభం. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. టయోటా, మారుతీ సుజుకీ సంయుక్తంగా ఈ మోడల్ను అభివృద్ధి చేశాయి. కొత్త మోడల్ రాకతో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసే విభాగంలో సుస్థిర స్థానం దక్కించుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15–20 లక్షల ధరల విభాగంలో మారుతీ సుజుకీ అగ్రగామిగా నిలిచిందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. పోటీపడాలని నిర్ణయించాం.. మూడు వరుసల ఎస్యూవీ/ఎంపీవీ విభాగంలో 2022–23లో అన్ని కంపెనీలవి కలిపి భారత్లో 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని శ్రీవాస్తవ వెల్లడించారు. ‘మూడు వరుసల ప్రీమియం ఎంపీవీ/ఎస్యూవీల కోసం మార్కెట్ ఉందని భావిస్తున్నాం. మూడు వరుసలున్న ఎంపీవీ లేదా ఎస్యూవీ లేదా రెండింటి లక్షణాలను కలిగి ఉండే ప్రీమియం వాహనం కోసం చూస్తున్న కస్టమర్లు ఉన్నారు. ఈ విభాగం అభివృద్ధి చెందుతోంది. అలాగే చాలా పెద్దదిగా మారుతోంది. ఈ సెగ్మెంట్లోని వినియోగదార్లు ప్రత్యేకంగా ఎస్యూవీ లేదా ఎంపీవీ కోసం చూడటం లేదు. వారికి కావాల్సింది చాలా స్థలం, మంచి డ్రైవింగ్ పనితీరు, ఫీచర్లు, సాంకేతికతతో కూడిన మూడు వరుసల ప్రీమియం వాహనం. కాబట్టి ఈ విభాగంలో పోటీపడాలని నిర్ణయించాం’ అని వివరించారు. -
ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!
Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించవచ్చు. -
మారుతి టూర్ హెచ్1 - దుమ్మురేపే మైలేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా టూర్ హెచ్1 పేరుతో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. భారత్లో అధిక మైలేజీ ఇచ్చే ప్రారంభ స్థాయి కమర్షియల్ హ్యాచ్బ్యాక్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిలోమీటర్లు, సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.46 కిలోమీటర్లు ఇస్తుందని వెల్లడించింది. ధర రూ.4.8 లక్షల నుంచి ప్రారంభం. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు. ఆల్టో కే10 ఆధారంగా టూర్ హెచ్1 రూపొందింది. కె–సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ పొందుపరిచారు. రెండు ఎయిర్బ్యాగ్స్, ప్రిటెన్షనర్, ఫోర్స్ లిమిటర్తో ముందు సీట్ బెల్ట్లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి హంగులు జోడించారు. -
మారుతి జిమ్నీ బుక్ చేసుకున్నారా? ఇది మీ కోసమే..
Maruti Jimny Deliveries: మారుతి సుజుకి ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 5 డోర్ జిమ్నీ డెలివరీలు అప్పుడే మొదలయ్యాయి. విడుదలకు ముందే 30వేల బుకింగ్స్ పొందిన ఈ SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం.. ఈ డెలివరీ పంజాబ్ ప్రాంతంలో జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇందులో గ్రానైట్ గ్రే కలర్ జిమ్నీ డెలివరీలను చూడవచ్చు. కంపెనీ ఈ కారుకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే దేశ వ్యాప్తంగా డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే మారుతి జిమ్నీ బుక్ చేసుకున్న కస్టమర్ ఫ్యామిలీ మొత్తం డీలర్షిప్లో కనిపిస్తారు. కారుని డెలివరీ చేసుకోవడానికంటే ముందు కేక్ కట్ చేయడం వంటివి కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే మోడల్ జిమ్నీ ఎండ్ జీటా వేరియంట్ అని తెలుస్తోంది. మారుతి జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇందులో నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్ల్యాంప్లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, టెయిల్గేట్ మౌంటెడ్ స్పేర్ టైర్ వంటి వాటితో పాటు 195/80 సెక్షన్ టైర్లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవన్నీ మారుతి జిమ్నీ SUV ని మరింత హుందాగా చూపించడంలో సహాయపడతాయి. మారుతి జిమ్నీ ఆటోమాటిక్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, 9 ఇంచెస్ స్మార్ట్ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. ఇంటీరియర్ డ్యాష్బోర్డ్ ఆల్-బ్లాక్ థీమ్ను కలిగి, ప్యాసింజర్ వైపు డ్యాష్బోర్డ్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్, ఫాక్స్ ఎక్స్పోజ్డ్ బోల్ట్లతో చాలా కఠినమైనదిగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) మారుతి సుజుకి ఈ కారుని కేవలం భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. కావున జిమ్నీ త్వరలోనే ఖండాంతరాలు దాటడానికి సిద్దమవుతోంది. ఈ ఆఫ్-రోడర్ 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
జూలై 5న విడుదలకానున్న కొత్త కారు ఇదే - మారుతి సుజుకి
రోజు రోజుకి దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జిమ్నీ ఆఫ్-రోడర్ విడుదల చేసిన మారుతి సుజుకి వచ్చే నెలలో మరో MPV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి 2023 జులై 05న విడుదల చేయనున్న సరికొత్త ఎంపివి పేరు 'ఎంగేజ్' (Engage). ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జులై చివరి నాటికి నెక్సా డీలర్షిప్ల ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఎంగేజ్ భిన్నమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ ఎంపివి ముందు భాగంలో హానీ కూంబ్ మెష్ గ్రిల్, గ్రిల్ మధ్యలో క్రోమ్ బార్లు, ఇరువైపులా హెడ్ల్యాంప్లు ఉండనున్నాయి. ఫ్రంట్ బంపర్ ట్వీక్ చేసిన విధంగా కనిపిస్తుంది, స్కిడ్ ప్లేట్ మాదిరిగా కనిపించేలా చేయడానికి ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ పొందుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 77712 వద్ద హోండా డియో హెచ్-స్మార్ట్ - పూర్తి వివరాలు) మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) నిజానికి 2017 లో టయోటా & మారుతి సుజుకి మధ్య సత్సంబంధం ఏర్పడినప్పటి నుంచి బాలెనొ, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా వంటి ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కావున ఇప్పుడు రానున్న ఈ ఎంపివి కూడా రెండు కంపెనీల కలయికతో రీబ్యాడ్జ్ చేసిన టయోటా ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి కొత్త ఎంపివి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
మారుతి సుజుకీ జిమ్నీ వచ్చేసింది.. ప్రత్యర్తులకు దబిడి దిబిడే (ఫొటోలు)
-
సర్వీస్ సెంటర్లలో మారుతీ సుజుకీ రికార్డ్! ఏకంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీని భారత్లో నెక్సా షోరూమ్ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్ల్యాంప్లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు -
ధర తెలియకుండానే దూసుకెళ్తున్న బుకింగ్స్.. అట్లుంటది జిమ్నీ అంటే..
Maruti 5 Door Jimny: మారుతి సుజుకి భారతదేశంలో విడుదల చేయనున్న '5 డోర్ జిమ్నీ' గురించి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడించింది. ఈ SUV జూన్ 7న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. జిమ్నీ ఆఫ్-రోడర్ బుకింగ్స్, డెలివరీలు వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 3 డోర్స్ జిమ్నీ ఇప్పుడు 5 డోర్స్ జిమ్నీ రూపంలో విడుదలకావడనికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే ధరలు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ధరలు కూడా అధికారికంగా వెల్లడి కాకముందే ఈ ఎస్యువి ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. బుకింగ్స్ దాదాపు మ్యాన్యువల్ & ఆటోమాటిక్ వేరియంట్లకు సమానంగా వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఈ 5 డోర్ జిమ్నీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్న ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా తయారైంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?) డెలివరీలు.. 5 డోర్ మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ 1000 యూనిట్లను రూపొందించినట్లు సమాచారం. కావున డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు సరికొత్త ఎడిషన్లో.. ధర ఎంతో తెలుసా?) మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించన్నప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్లో ఎస్యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్యూవీల్లో కాంపాక్ట్ ఎస్యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్స్టైల్ ఎస్యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే
2023 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్శించిన 'మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ' (Maruti Suzuki Jimny) లాంచ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ SUV విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాహన ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ మారుతి సుజుకి దేశీయ విఫణిలో జిమ్నీ ధరలను అధికారికంగా జూన్ 07న ప్రకటించనుంది. ఈ కారు జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో టాప్-స్పెక్ ఆల్ఫా ట్రిమ్కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ ఆఫ్-రోడర్ మైలేజ్ గణాంకాలను కూడా వెల్లడించింది. 105 hp పవర్, 134.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగిన ఈ ఎస్యువి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. మైలేజ్ డీటైల్స్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: 5 డోర్స్ జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు) ఫీచర్స్ విషయానికి వస్తే 5 డోర్స్ జిమ్నీ 9-ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా జిమ్నీ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. అంచనా ధరలు జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు
Maruti Jimny: మారుతి సుజుకి తన జిమ్నీ SUVని ఎప్పుడెప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ ఈ కారుని వచ్చే నెలలో విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కానీ అంత కంటే ముందు ఈ కారు మైలేజ్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించిన 5 డోర్స్ జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఈ ఆఫ్ రోడర్ 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. మైలేజ్ వివరాలు మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎస్యువి వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మాన్యువల్ వేరియంట్ల కోసం ఆరు నెలల, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం ఎనిమిది నెలల వరకు ఉంటుంది. కాగా సంస్థ ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్లోని తన ప్లాంట్ నుంచి 5 డోర్స్ జిమ్నీ విడుదల చేసింది. కావున ధరలు కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అంచనా ధర & ప్రత్యర్థులు మారుతి సుజుకి జిమ్నీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలవుతుందని అంచనా. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వ్యాగన్-ఆర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా హ్యాచ్బ్యాక్ వేగన్–ఆర్ 30 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు నమోదు చేసింది. 1999లో ఈ మోడల్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. 2008లో 5 లక్షల యూనిట్లు, 2012 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది. ఆ తర్వాత అయిదేళ్లలోనే అమ్మకాలు రెండింతలయ్యాయి. 2021 నాటికి మొత్తం 25 లక్షల కార్లు రోడ్డెక్కాయి. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ వేగన్–ఆర్ మార్కెట్లో ఉంది. ధర ఎక్స్షోరూంలో రూ.5.54–7.42 లక్షల మధ్య పలుకుతోంది. కె–సిరీస్, డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ 1.0, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో లభిస్తోంది. మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రూపుదిద్దుకుంది. సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేగన్–ఆర్ కస్టమర్లలో 24 శాతం మంది ఇదే మోడల్కు అప్గ్రేడ్ అవుతున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2021–22లో 1,89,000 యూనిట్లు, 2022–23లో 2,12,000 యూనిట్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా వేగన్–ఆర్ స్థానం దక్కించుకుంది. -
భారత్లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్కి ఫిదా అవ్వాల్సిందే!
Maruti Suzuki: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కొత్త XL7 ఎస్యువిని విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త 7 సీటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త ఎక్స్ఎల్7 ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎక్స్ఎల్6 కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది టయోటా ఇన్నోవా క్రిష్టాకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో పరిచమైన ఈ ఎస్యువి మంచి ప్రజాదరణ పొందుతోంది. కాగా ఇక భారతీయ తీరాలకు రావడానికి సన్నద్ధమవుతోంది. మారుతి ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ చాలా కొత్తగా ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ డ్యాష్బోర్డ్, స్టాండర్డ్ మిడిల్ ఆర్మ్రెస్ట్లు, లెదర్డ్ స్ట్రీరింగ్ వీల్, పుష్ బటన్, స్టాప్ కీలెస్ ఎంట్రీ, రియర్వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్ఎల్7 ఎస్యువిలో 1.5 లీటర్ కే15బి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,400 rpm వద్ద 138 Nm టార్క్ & 6000 rpm వద్ద 104 bhp పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 5 మ్యాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుందని ఆశిస్తున్నాము. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్యువి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
మారుతి జిమ్నీ ఫస్ట్ కారు వచ్చేసింది - ఇక లాంచ్ అప్పుడే!
2023 ఆటో ఎక్స్పోలో 'మారుతి జిమ్నీ' 5 డోర్ వెర్షన్ కనిపించినప్పటినుంచి ఈ SUV కోసం ఎంతో మంది వాహన ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మారుతి సుజుకి ఈ కారు గురించి ఒక అప్డేటెడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక విక్రయాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా. మార్కెట్లో ఈ కారు ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్బాక్స్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) భారతీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి జిమ్నీ ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్'కి ప్రత్యేతిగా నిలబడుతుంది. కావున అమ్మకాల పరంగా కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!
మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 24,500 పైగా బుకింగ్లు దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. రూ. 10 లక్షల నుంచి ప్రారంభం లీక్ అయిన డీలర్ ఇన్వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్ల ద్వారా బుకింగ్లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
తగ్గేదేలే అంటున్న మారుతి సుజుకి - గత నెల అమ్మకాలు ఇలా!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు. మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది. (ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?) మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
కొనసాగిన ఆటో అమ్మకాల జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటి వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్(5% క్షీణత) మినహా టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎంఎస్ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి. ► విద్యుత్ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ ఏప్రిల్లో 62,581 యూనిట్లకు తగ్గాయి. -
మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే..
ఫేవరెట్ కార్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న కస్టమర్లకు వాహన సంస్థలు శుభవార్త చెప్పాయి. మే నెలలో పలు ప్రముఖ కార్లు లాంచ్ అవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్ఎక్స్ వంటి కొన్ని కార్లు ఏప్రిల్ నెలలోనే విడదలయ్యాయి. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు! చాలా కాలంగా ఊరిస్తున్న జిమ్నీని మే నెలలో విడుదల చేయడానికి మారుతి సుజికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన సీఎన్జీ లైనప్ను రెండు కొత్త మోడళ్లతో విస్తరిస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా రెండు మోడళ్లను లాంచ్ చేస్తోంది. కొన్ని కార్లకు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమయ్యాయి. మారుతీ సుజుకి జిమ్నీ మారుతీ సుజుకి జిమ్నీ (Jimny) కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. మారుతి జిప్సీకి వారసత్వంగా ఇది వచ్చేస్తోంది. భారత్ కోసం ప్రత్యేకంగా ఐదు-డోర్ల బాడీ స్టైల్తో దీన్ని రూపొందించారు. దీని నో-నాన్సెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నిచ్చెన-ఫ్రేమ్ చట్రం, తక్కువ-శ్రేణి 4x4 ఫీచర్లతో లైఫ్ వాహనంగా గుర్తింపు పొందుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో నడుస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా . బీఎండబ్ల్యూ ఎం2 బీఎండబ్ల్యూ రెండవ తరం M2 (G87)ని భారత్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి కానుంది. టాప్-రంగ్ కాంపిటీషన్ రూపంలో వచ్చే ఈ లగ్జరీ కార్ అంతకుముందున్న కార్ మాదిరిగా కాకుండా కొత్త M2 ప్రామాణిక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ 460 హార్స్ పవర్ను, 550Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో ఇన్లైన్ సిక్స్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్గా 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అయితే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. M2 ఎక్స్-షోరూమ్ అంచనా ధర సుమారు రూ. 1 కోటి. టాటా ఆల్ట్రోజ్ CNG దేశంలో సీఎన్జీ అత్యంత ఆదరణ పొందడంతో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNGని విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్తో వస్తున్న దేశంలోని మూడవ ప్రీమియం హ్యాచ్బ్యాక్ అవుతుంది. ఆల్ట్రోజ్ CNG కోసం బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తం రూ. 21,000. మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఇదివరకే ప్రకటించింది. CNG కిట్ ఆల్ట్రోజ్ XE, XM+, XZ, XZ+ ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో AC, సన్రూఫ్, ఆరు ఎయిర్బ్యాగ్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్తో ఈ కార్ నడుస్తుంది. ఇది సీఎన్జీ మోడ్లో 77 హార్స్ పవర్, 97Nm టార్క్ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఉంటుంది. బీఎండబ్ల్యూ X3 M40i బీఎండబ్ల్యూ X3 M40i అనేది X3 కార్లలో హై పర్ఫార్మెన్స్ వేరియంట్. ఇది BMW M340i సెడాన్తో దాని పవర్ట్రెయిన్ను పంచుకుంటుంది. ఇది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్తో 360 హార్స్ పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉంటుంది. X3 M40i M స్పోర్ట్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్లు, M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్ వంటి హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ కోసం బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! -
BS6: మారుతి లవర్స్కు గుడ్ న్యూస్, మారుతీ వాహనాలన్నీ అప్గ్రేడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలు రెండవ దశ కింద అన్ని మోడళ్లను అప్గ్రేడ్ చేసినట్టు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎంపీవీలు, ఎస్యూవీలతోపాటు వాణిజ్య వాహనాలు సైతం వీటిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ20 ఇంధనం వినియోగానికి అనువుగా వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. కాలుష్యం ఏ స్థాయిలో వెలువడుతుందో ఎప్పటికప్పుడు తెలిపే ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) సిస్టమ్ను వాహనంలో అమర్చినట్టు వివరించింది. అన్ని మోడళ్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రకటించింది. కంపెనీ ఖాతాలో ప్రస్తుతం 15 మోడళ్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్ ) -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్లు, కార్మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
ఎట్టకేలకు భారత్లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' (Maruti Suzuki Fronx) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త ఎస్యువి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & బుకింగ్స్: దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైన కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ట్రిమ్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 7.47 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 13.14 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంక్స్ 15 వేలకంటే ఎక్కువ సంక్యలో బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్: మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్లైన్ వంటి వాటితో పాటు సైడ్ ప్రొఫైల్లో 17 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఈ SUV చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ, ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. లెదర్తో చుట్టిన స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందిస్తుంది, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్: కొత్త మారుతి ఫ్రాంక్స్ ఆర్కిటిక్ వైట్, ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు రంగులలో లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయల్-టోన్ ఎంపికలుగా ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ అందుబటులో ఉంటాయి. పవర్ట్రెయిన్స్: ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్లో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్తో లభిస్తుంది. పనితీరు పరంగా ఈ కొత్త ఎస్యువి ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
విడుదలకు ముందే లీకైన జిమ్నీ ధరలు - ఇలా ఉన్నాయి
మారుతి సుజుకి తన 5 డోర్స్ జిమ్నీ SUVని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి ఎక్కువ మంది దీని కొనుగోలుకు వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిమ్నీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. కాగా ఈ ఆఫ్ రోడర్ ధరలు విడుదలకు ముందే వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ 5-డోర్ మోడల్కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న మారుతి జిమ్నీ త్వరలోనే అధికారికంగా విడుదలకానుంది. 2023 ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసిన ఈ ఎస్యువి ధరలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. షాన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. ఇది K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. -
భారత సైన్యం కోసం మారుతి జిప్సీ ఎలక్ట్రిక్ వెహికల్ - పూర్తి వివరాలు
ఇండియన్ ఆర్మీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగానే ఆర్మీ కమాండర్స్ కాన్ఫిరెన్స్ (ACC) నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 2023 ఏప్రిల్ 17 నుంచి 21 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆర్మీ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులు డిజిటల్ సెషన్లో పాల్గొన్నారు. ఈ కాన్ఫిరెన్స్ చివరి రోజు మారుతి సుజుకి జిప్సీ రెట్రోఫిట్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ దర్శనమిచ్చింది. నిజానికి ఇది ఇండియన్ ఆర్మీ సెల్, ఐఐటీ ఢిల్లీ & టాడ్పోల్ ప్రాజెక్ట్స్ అనే స్టార్టప్ పాతకాలపు మిలిటరీ జిప్సీ SUVని ఎలక్ట్రిక్ వెహికల్ మాదిరిగా మార్చడానికి సహకరించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో భాగంగానే ఇది పుట్టుకొచ్చింది. (ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..) ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అదే సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపొందించే క్రమంలో బిజీగా ఉన్నాయి. పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడానికి స్టార్టప్ ఇంజిన్ను తీసివేసి మార్చాల్సి ఉంటుంది. ఇది వాహనం జీవిత కాలాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) ఇటీవల కాలంలో అమలులోకి వచ్చిన మోటారు వెహికల్ యాక్ట్ కింద వ్యక్తిగత కారును 15 సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు. ఆ తరువాత స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ-ఎన్సిఆర్ హైవేలపై 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలను అనుమతించరాదని ప్రకటించింది. Retrofitted Electric #Gypsies were showcased at the ongoing #Army Commanders Conference in New Delhi. #IADN pic.twitter.com/1N1oKrzPMv — Indian Aerospace Defence News - IADN (@NewsIADN) April 21, 2023 -
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!
2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకాకముందే 13,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కంపెనీ గతంలో ఈ కారు డిజైన్, ఫీచర్స్ గురించి వెల్లడించింది, అయితే తాజాగా ఇప్పుడు మైలేజ్ గురించి ప్రస్తావించింది. ఇంజిన్ ఆప్షన్స్: మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ డ్యూయల్జెట్ పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇవి రెండూ వరుసగా 88.5 బిహెచ్పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ & 98.6 బిహెచ్పి పవర్, 147.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ పొందుతాయి. మైలేజ్: మారుతి ఫ్రాంక్స్ 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ 21.79 కిలోమీటర్స్/లీటర్ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 1.0 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ 21.5 కిమీ/లీ & ఆటోమాటిక్ వేరియంట్ 20.01 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయి. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) డిజైన్ & ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్ కలిగి, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ పొందుతాయి. సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ కూడా ఉంటుంది. ఈ కొత్త SUV ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అంచనా ధరలు & లాంచ్ డేట్: మారుతి ఫ్రాంక్స్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 8 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ SUV ఈ నెల చివరి నాటికి మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్లో సిట్రోయెన్ C3, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
వాహన అమ్మకాలు రికార్డ్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్ 19 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమవ్యాప్తంగా... చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్ 30.62 లక్షలు. రిటైల్గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు. మార్చిలో చూస్తే... మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. -
మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..
మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో కొత్త జిమ్నీ ఎస్యువిని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఆఫ్ రోడర్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాకముందే ఇటీవల డీలర్ యార్డ్లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న జిమ్నీ 3-డోర్స్ ఎడిషన్, ఇండియన్ మార్కెట్లో 5-డోర్స్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. ఈ SUV ఆటో ఎక్స్పో 2023లో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. అదే సమయంలో కంపెనీ ఈ కారు కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డీలర్ యార్డ్లో కొత్త మారుతి జిమ్నీ, స్విఫ్ట్ పక్కన పార్క్ చేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 18,000 బుకింగ్స్ పొందిన ఈ కారు నెక్సా షోరూమ్లలో కస్టమర్ల సందర్శనార్థం ప్రదర్శించారు. డెలివరీలు ఈ నెల చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. దీని పొడవు 3,985 మిమీ, 1,720 వెడల్పు, వీల్బేస్ 2,590 మిమీ వరకు ఉంటుంది. కావున ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. త్వరలో విడుదలకానున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?) జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 9.99 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్యువి డెలివరీలను వేగవంతం చేయడానికి సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది. (తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!) అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్డ్రైవింగ్ ట్రాక్టర్) -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో.. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్టేక్లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్పై స్పాయిలర్ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లంబోర్ఘిని ఉరస్ ఎస్: ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది. ఎంజి కామెట్ ఈవీ: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. -
‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును ఇకపై కొనలేరు. ఎందుకంటే తన ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలిపివేసింది. దీంతో మధ్యతరగతివారికి సైతం అందుబాటు ధరలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ ఆల్టో 800 కారు కస్టమర్లకు దూరం కానుంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) బీఎస్6 (BS6) ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో ఆ కార్ల ఉత్పత్తిని ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర రకాల పన్నులు కూడా వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో కీలక అంశం ఆల్టో కె10కి డిమాండ్ పెరగడం. ఆల్టో 800 ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ తగ్గుముఖం పడుతోందని, ఈ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) ఆల్టో 800 నిలిపివేత తర్వాత ఆల్టో K10 మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకీ వెబ్సైట్ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ 5.13 లక్షల మధ్య ఉంది. 2000 సంవత్సరంలో లాంచ్ అయిన ఆల్టో 800 కారులో 796 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 2010 వరకు దాదాపు 18 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో K10 భారత మార్కెట్లో విడుదలైంది . 2010 నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో K10 కార్లను కంపెనీ విక్రయించింది. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్) -
మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో త్వరలో జిమ్నీ SUVని అధికారికంగా విడుదల చేయనుంది, ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం 23,500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. కాగా ఎంపిక చేసిన నెక్సా అవుట్లెట్లలో ఈ కొత్త కారు డిస్ప్లే కూడా ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అవుట్లెట్లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. 2023 ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసిన జిమ్నీ మే నెలలో విక్రయానికి రానున్నట్లు సమాచారం, కానీ అంతకంటే ముందు ఏప్రిల్ 7 నుంచి భారతదేశంలో మరికొన్ని నగరాల్లోని డీలర్షిప్లలో కనిపించనుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్, చండీగఢ్, మొహాలి, లూథియానా, రాయ్పూర్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రదర్శన మొదలైపోయింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు అక్కడ జిమ్నీ కారుని పరిశీలించవచ్చు. మారుతి జిమ్నీ ఉత్పత్తి గురుగ్రామ్ ప్లాంట్లో జరుగుతుంది. ఇక్కడ నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించనుంది. కంపెనీ సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రతి నెల 7,000 యూనిట్లను భారతీయ మార్కెట్లో, మిగిలినవాటిని విదేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్తో 6,000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యువి ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. -
మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 25 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. 1986–87 నుంచి కంపెనీ పలు దేశాలకు వాహనాల సరఫరా ప్రారంభించింది. తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్కు ఈ కార్లు అడుగుపెట్టాయి. ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు ఇక్కడ తయారైన కార్లు ఎగుమతి అవుతున్నాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు వీటిలో ఉన్నాయి. భారత తయారీ శక్తి సామర్థ్యాలకు ఈ మైలురాయి నిదర్శనమని తెలిపింది. అధిక నాణ్యత, ఉన్నత సాంకేతికత, విశ్వసనీయత, పనితీరుతోపాటు అందుబాటు ధరలో లభించడంతో కంపెనీ తయారీ కార్లు విదేశీ కస్టమర్ల ఆమోదం, ప్రశంసలను పొందాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. భారత్ నుంచి అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న సంస్థగా నిలిచామన్నారు. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి మరోసారి తన వినియోగదారులకు షాకిచ్చింది. మారుతి అన్ని మోడల్ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచేందుకు నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: సీఈవో సుందర్ పిచాయ్కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యయాలే కారణమని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వివిధ అంశాల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ధరల పెంపు తప్పడం లేదని తెలిపింది. ఏప్రిల్ 2023 నుండి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన కంపెనీ, ఎంత శాతం పెంచేదీ స్పష్టం చేయలేదు. మోడల్ను బట్టి ఈ పెంపు ఉంటుందని తెలుస్తోంది. హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్ఝున్వాలా ఎంట్రీ! సూపర్! -
Top Car News of The Week: ఒక్క కథనం.. అన్ని వివరాలు!
భారతదేశం ఆటోమొబైల్ రంగంవైపు రోజురోజుకి వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత వారం మార్కెట్లో కొత్త ఉత్పత్తులు విడుదలయ్యాయి, కొన్ని కార్ల ధరలు కూడా పెరిగాయి. గత వారం దేశీయ మార్కెట్లో అడుగెట్టిన కార్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు. మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి: వాహన ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మారుతి బ్రెజ్జా సిఎన్జి రూ. 9.14 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సిఎన్జి వెర్షన్ కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్న బ్రెజ్జా సిఎన్జి మైలేజ్ విషయంలో అద్భుతంగా తయారైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. 2023 కియా కారెన్స్: ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా కారెన్స్, రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారైంది. ఈ అప్డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. 2023 కియా కారెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. సిట్రోయెన్ సి3 కొత్త ధరలు: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి3 కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఈ తరుణంలో కంపెనీ ఈ హ్యాచ్బ్యాక్ ధరలను రూ. 45,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత సి3 రూ. 6.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. సిట్రోయెన్ సి3 కొత్త ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. పెరిగిన జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు: దేశీయ విఫణిలో మంచి ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి జీప్ కంపెనీకి చెందిన గ్రాండ్ చెరోకీ. ఈ SUV ధరలు ఇటీవల లక్ష వరకు పెరిగింది. కావున దీని ధర ఇప్పుడు రూ. 78.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో 268 బిహెచ్పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ గ్రాండ్ చెరోకీ కొత్త ధరలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. టయోటా హైలెక్స్ డిస్కౌంట్: భారతదేశంలో అతి పెద్ద వాహనంగా గుర్తింపు పొందిన టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కు కొనుగోలు మీద కంపెనీ రూ. 3.59 లక్షల (స్టాండర్డ్ వేరియంట్) తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో హై వేరియంట్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ ధరలను భారీగా పెంచింది. హైలెక్స్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
భారత్లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు
సిఎన్జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ & ధరలు: మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ. వేరియంట్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి మూడు వేరియంట్స్లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ & ఫీచర్స్: బ్రెజ్జా సిఎన్జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) పవర్ట్రెయిన్: కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్జెట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్లో 101 హెచ్పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్లో 88 హెచ్పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!) ప్రత్యర్థులు: మారుతి సిఎన్జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్జి పవర్ట్రెయిన్ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా. -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు..ఇవే!
భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా కీర్తి గడించిన మారుతి సుజుకి రానున్న నాలుగు నెలల్లో మరో మూడు కొత్త కార్లను విడుదల చేయనుంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ 5-డోర్, బ్రెజ్జా CNG ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్పోలో ఎంతోమంది మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది మారుతి నెక్సా అవుట్లెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 'సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా' అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. అంతే కాకుండా ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ (బూస్టర్జెట్ ఇంజిన్), 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్: దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ ఎస్యువికి ప్రధాన ప్రత్యర్థిగా రానున్న మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటికే డీలర్షిప్కి చేరుకోవడం కూడా ప్రారంభించింది. ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ ఆఫ్-రోడర్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎస్యువి కోసం 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఇది K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. మారుతి సుజుకి బ్రెజ్జా CNG: మారుతి సుజుకి సిఎన్జి విభాగాన్ని విస్తరించడంతో భాగంగా తన బ్రెజ్జా సిఎన్జి విడుదల చేయనుంది. కంపెనీ ఈ మోడల్ కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో లభిస్తుంది. మారుతి బ్రెజ్జా సిఎన్జి ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగానే అదే 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మోడ్లో 100 హెచ్పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్లో 88 హెచ్పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. -
Maruti Suzuki Brezza CNG.. ఇప్పుడే బుక్ చేసుకోండి!
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే కార్ బ్రాండ్లలో ఒకటైన 'మారుతి సుజుకి' దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, అప్డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. CNG విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ త్వరలో తన బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్యువిని ఈ విభాగంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బుకింగ్ ప్రైస్ & డెలివరీలు: మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త బ్రెజ్జా సిఎన్జి కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే ఇది మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా డెలివరీలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది. (ఇదీ చదవండి: 2023 Royal Enfield 650: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా) వేరియంట్స్: మొదటి సారి 2023 ఆటో ఎక్స్పోలో కనిపించిన ఈ సిఎన్జి వెర్షన్ మొత్తం నాలుగు ట్రిమ్లలో విడుదల కానుంది అవి LXI, VXI, ZXI, ZXI+. ఈ మోడల్ ఇతర మారుతి సిఎన్జి కార్ల మాదిరిగా కాకుండా.. ICE బేస్డ్ వెర్షన్ మాదిరిగా అన్ని ట్రిమ్లలో అందుబటులో ఉంటుంది. కాగా ఆటోమేటిక్ గేర్బాక్స్తో విడుదలయ్యే మొదటి సిఎన్జి బ్రెజ్జా కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది సిఎన్జి అని గుర్తించడానికి ఇందులో S-CNG బ్యాడ్జ్ చూడవచ్చు. బూట్లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికీ వస్తే, ఇందులో స్మార్ట్ప్లే ప్రో+తో కూడిన 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్బ్యాగ్లు, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. పవర్ట్రెయిన్: కంపెనీ బ్రెజ్జా సిఎన్జి గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగా 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది పెట్రోల్ మోడ్లో 100 హెచ్పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్లో 88 హెచ్పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. (ఇదీ చదవండి: NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!) ధర & ప్రత్యర్థులు: మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా సిఎన్జి ధరలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. కావున దీని ధర రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో విక్రయాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. -
డీలర్షిప్కి చేరుకున్న మారుతి జిమ్నీ.. ఇక డెలివరీలు అప్పుడే!
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త మారుతి జిమ్నీ 5-డోర్స్ వెర్షన్ ఎట్టకేలకు షోరూమ్లకు వచ్చేసింది. ఇప్పటికే బుకింగ్స్ స్వీయకరించడం ప్రారంభించిన కంపెనీ త్వరలోనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకి తన ఫైవ్ డోర్స్ జిమ్నీ SUVని 2023 ఆటో ఎక్స్పో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం ఇప్పటికి 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా ఇప్పుడు వాహన ప్రేమికుల సందర్శనార్థం నెక్సా షోరూమ్లలో జిమ్నీ ప్రదర్శిస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంటుంది. జిమ్నీ ప్రొడక్షన్ 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ధర, డెలివరీలకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా కంపెనీ ప్రతి నెలా కనీసం 7,000 యూనిట్లను డెలివరీ చేస్తూ.. సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలో ముందుకుసాగనుంది. డెలివరీలు మే చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్తో 6,000 ఆర్పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. -
దుమ్మురేపిన బాలెనొ.. అమ్మకాల్లో మారుతి సుజుకి కొత్త రికార్డ్
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' గత నెలలో (2023 ఫిబ్రవరి) మంచి అమ్మకాలను పొందింది. అమ్మకాల పరంగా కంపెనీ 2022 ఫిబ్రవరి కంటే కూడా 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మారుతి సుజుకి అమ్మకాల్లో బాలెనొ 18,592 యూనిట్లను విక్రయించి మునుపటి ఏడాది ఇదే నెలకంటే 47.91 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 12,570 యూనిట్లు. తరువాత వరుసలో 18,114 యూనిట్ల అమ్మకాలతో స్విఫ్ట్ నిలిచింది. అయితే స్విఫ్ట్ అమ్మకాలు మునుపటి సంవత్సరం కంటే 4.11 శాతం తగ్గాయి. 56.82 శాతం పెరుగుదలతో మారుతి ఆల్టో మూడవ స్థానంలో నిలిచింది. ఆల్టో అమ్మకాలు గత నెలలో 18,114 యూనిట్లు. వ్యాగన్-ఆర్ అమ్మకాలు 16,889 యూనిట్లు కాగా, డిజైర్ సేల్స్ 16,798 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. డిజైర్ అమ్మకాలు 2022లో 3.67 శాతం తగ్గాయి. (ఇదీ చదవండి: SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!) బ్రెజ్జా, ఈకో అమ్మకాలు వరుసగా 15,787 & 11,352 యూనిట్లు. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలైన గ్రాండ్ విటారా ఏకంగా 9,183 యూనిట్ల అమ్మకాలతో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఎర్టిగా, ఇగ్నిస్ రెండూ 6472 యూనిట్లు, 4749 యూనిట్లను విక్రయించి తొమ్మిది, పదవ స్థానాల్లో నిలిచాయి. -
భారత్లో విడుదలకానున్న కొత్త కార్లు, ఇవే!
భారతదేశంలో ప్రతి రోజూ ఏదో ఒక వెహికల్ ఏదో ఒక మూలన విడుదలవుతూనే ఉంది. కాగా త్వరలోనే దేశీయ మార్కెట్లో అరంగేట్ర చేయడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ వెర్నా, ఇన్నోవా క్రిస్టా డీజిల్ మొదలైనవి ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెర్నా: హ్యుందాయ్ కంపెనీ గత కొన్ని రోజులుగా తన కొత్త వెర్నా సెడాన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా సమాచారం వెల్లడైంది. అయితే ఇది మార్చి 21న గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్: దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఇన్నోవా క్రిస్టా త్వరలోనే డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో విడుదలకానున్నట్లు సమాచారం. ఇది 2.4 లీటర్ డీజిల్ పవర్ట్రెయిన్తో మాత్రమే అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా ఇది అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు కూడా నివేదికల ద్వారా తెలుస్తోంది. లెక్సస్ ఆర్ఎక్స్: 2023 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించిన చాలా కార్లలో 'లెక్సస్ ఆర్ఎక్స్' ఒకటి. ఇది మొదటి చూపుతోనే ఎంతోమంది వాహనప్రేమికుల మనసు దోచింది. ఈ SUV దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది. ఇది RX 350h లగ్జరీ, RX 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ట్రిమ్లలో లభిస్తుంది. అదే సమయంలో 2.5 లీటర్, 2.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి: సిఎన్జి వాహనాలను పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇప్పటికే చాలా కార్లను ఈ విభాగంలో విడుదల చేసింది. కాగా ఇప్పుడు బ్రెజ్జాను కూడా సిఎన్జి రూపంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది 1.5 లీటర్ కె15సి డ్యూయెల్ జెట్ ఇంజిన్ పొందుతుంది. ఈ కారు కూడా త్వరలో విడుదలయ్యే కొత్త కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇక మన జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది 2023 ఆటో ఎక్స్పోలో మొదటిసారిగా కనిపించింది. ఈ SUV 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్తో విడుదల కానుంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి మరెన్నో రోజులు లేదని తెలుస్తుంది. -
కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి, కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్తను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం 2023 మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 54,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ లభిస్తాయి. మారుతి సుజుకి బాలెనో: అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి బాలెనొ మీద కంపెనీ ఈ నెలలో రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం మాన్యువల్ వేరియంట్కి మాత్రమే వర్తిస్తాయి. ఆటోమేటిక్, CNG మోడల్స్ కొనుగోలుపైన ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి ఇప్పుడు సియాజ్ కొనుగోలుపై రూ. 28,000 తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్స్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్లకి వర్తిస్తుంది. ఇందులో రూ. 25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. (డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ఖచ్చితమైన ఆఫర్స్ కోసం స్థానిక డీలర్ను సందర్శించి తెలుసుకోవచ్చు). మారుతి సుజుకి ప్రస్తుతం డిస్కౌంట్స్ అందించడం మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, మారుతి జిమ్నీ 5-డోర్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కార్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. -
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ ఏదో తెలుసా?
సాక్షి, ముంబై: మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్లను వెనక్కి నెట్టేసింది బాలెనో. అప్డేటెడ్గా వచ్చిన బాలెనో మోడల్ రాక గేమ్ ఛేంజర్గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి బాలెనో ఇంజీన్ బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్స్పేస్ని కలిగిఉంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్బ్యాగ్లు, రియర్ AC వెంట్స్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. -
మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్జి మోటార్: సేల్స్లో టాటా స్థానం ఎంతంటే?
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఇటీవల గత నెల కార్ల విక్రయాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం వాహన అమ్మకాలు మునుపటికంటే కొంత పురోగతిని కనపరిచినట్లు తెలుస్తోంది. టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో ఎంజి మోటార్స్ చోటు సంపాదించింది. 2023 ఫిబ్రవరిలో 2,82,799 యూనిట్ల వాహనాలను విక్రయించి మునుపటి ఏడాది ఫిబ్రవరి (2,58,736 యూనిట్లు) నెలకంటే 13.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో 1,18,892 యూనిట్ల కార్లను విక్రయించిన మారుతి మొదటి స్థానంలో నిలిచి, అమ్మకాల పరంగా 2022 ఫిబ్రవరి కంటే 8.47 శాతం వృద్ధిని పొందింది. రెండవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఫిబ్రవరి 2022 కంటే 1.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు గత నెలలో 39,106 యూనిట్లు. టాటా మోటార్స్ 38,965 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్తో 450 కి.మీ రేంజ్!) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరి కంటే 11,092 యూనిట్లను ఎక్కువ విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 29,356 యూనిట్లు. కియా మోటార్స్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి, మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే 43.54 శాతం పెరుగుదలను పొందింది. ఇక తరువాత స్థానాల్లో టయోట, స్కోడా, హోండా, రెనాల్ట్, ఎంజి మోటార్స్, నిస్సాన్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కార్ల అమ్మకాలు 2022 ఫిబ్రవరి కంటే కూడా ఉత్తమంగా ఉన్నట్లు ఫాడా నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వారాగాలు ఆశిస్తున్నాయి. -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్షిప్ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
మారుతి ఇగ్నిస్ కొత్త ధరలు.. ఇక్కడ!
భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలకు అనుకూలంగా తమ వాహనాలను అప్డేట్ చేయడానికి చాలా కంపెనీలు ఇప్పుడు తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది. మారుతి సుజుకి తన ఇగ్నిస్ హ్యాచ్బ్యాక్ను 'రియల్ డ్రైవింగ్ ఎమిషన్' నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా అందిస్తోంది. ఈ కారణంగా ఇగ్నిస్ పెరిగాయి. ఆధునిక అప్డేట్స్ పొందిన తరువాత ఇగ్నిస్ ధరలు రూ. 27,000 పెరిగాయి, కావున ఈ హ్యాచ్బ్యాక్ ధర, ధరల పెరుగుదల తరువాత రూ. 5.55 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరుకుంది. ఇందులో ఇప్పుడు E20 ఫ్యూయల్ కూడా పొందుతుంది. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!) మారుతి ఇగ్నిస్ మొత్తం తొమ్మిది కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఇక డిజైన్, ఇంటీరియర్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటివి అద్భుతంగా ఉన్నాయి. ఇది K-సిరీస్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలిగి 83 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇగ్నిస్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉంది. మారుతి ఇగ్నిస్ ప్రస్తుతం సిగ్మా, డెల్టా, ఏఎంటి డెల్టా, జీటా, ఏఎంటి జీటా, ఆల్ఫా, ఏఎంటి ఆల్ఫా అనే మొత్తం 7 వేరియంట్లలో విక్రయించబడుతోంది. మారుతి సుజుకి ఇటీవల 'సెడాన్ టూర్ ఎస్' ను కూడా అప్డేట్ చేసింది. దీని ధరలు రూ. 6.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. -
తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు అధికారికంగా ప్రకటించక ముందే భారీ సంఖ్యలో బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఇప్పటికీ 90,000 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీంతో డెలివరీ పీరియడ్ భారీగా పెరిగింది. మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్లో (ఆరు మోనోటోన్ & మూడు డ్యూయల్ టోన్) లభిస్తుంది. గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 103 హెచ్పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?) ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 92 హెచ్పి పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్తో కలిపి 79 హెచ్పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీద ఇది 115 హెచ్పి పవర్ అందిస్తూ, 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా డెలివరీలను ప్రారంభించింది, ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారు మరిన్ని ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంది. -
2023 ఆటోకార్ అవార్డ్స్: సత్తా చాటిన కార్లు, బైకులు.. ఇవే!
ఇటీవల ఆటోకార్ అవార్డ్స్ 2023లో కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా సొంతం చేసుకోగా, బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 'జాజ్ పల్సర్ ఎన్160' దక్కించుకుంది. మొత్తం 22 అవార్డులలో ఏ వాహనం ఏ అవార్డ్ దక్కించుకుందో ఇక్కడ చూడవచ్చు. మారుతి గ్రాండ్ విటారా అగ్ర గౌరవం అందుకోవడం మాత్రమే కాకుండా.. మిడ్సైజ్ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాయి. లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్, ఎగ్జ్క్యూటివ్ ఇయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా హ్యుందాయ్ టక్సన్, ఎంపివి ఆఫ్ ది ఇయర్గా ఇన్నోవా హైక్రాస్, లగ్జరీ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ విన్నర్గా ఆడి క్యూ3, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ టాటా టియాగో ఈవి, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ విన్నర్ సుజుకి కటన, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని టాటా మోటార్స్ సొంతం చేసుకున్నాయి. ఆటోకార్ అవార్డ్స్ 2023లో కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భగా మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కూడా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమకు సంబంధించి, 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ సొంతం చేసుకున్నారు -
ఈకో 10 లక్షల యూనిట్ల మార్కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈకో వ్యాన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2010లో భారత మార్కెట్లోకి ఈకో ప్రవేశించింది. 5, 7 సీట్లు, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వ్యాన్స్ విభాగంలో 94 శాతం వాటా ఈకో కైవసం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తొలి 5 లక్షల యూనిట్లకు ఎనమిదేళ్లు పట్టింది. మిగిలిన 5 లక్షల యూనిట్ల విక్రయాలు అయిదేళ్లలోపే పూర్తి చేశామన్నారు. 1.2 లీటర్ అడ్వాన్స్డ్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్తో ఈకో రూపుదిద్దుకుంది. మైలేజీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.2 కిలోమీటర్లు, ఎస్–సీఎన్జీ వేరియంట్ కేజీకి 27.05 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
మారుతి సుజుకి ఈకో గత కొన్ని సంవత్సరాలు మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో పరుగులు పెడుతోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నివేదికల గణాంకాల ప్రకారం 'ఈకో' 10 లక్షల యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో మారుతి ఈకో కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే కాకుండా, వ్యాపార వినియోగాలకు కూడా ఉపయోగపడుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన వ్యాన్గా రికార్డ్ సృష్టించింది. ఇది 5 సీటర్, 7 సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి దాదాపు 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో వ్యాన్ అమ్మకాలలో మారుతి ఈకో 94 శాతం వాటా కలిగి ఆ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి 5 లక్షల యూనిట్లను విక్రయించడానికి 8 సంవత్సరాలు పడితే, మరో 5 లక్షల కార్లు విక్రయించడానికి ఐదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈకో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. (ఇదీ చదవండి: ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్) మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలిగి 80 బిహెచ్పి పవర్ & 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CNG వెర్షన్ 71 బిహెచ్పి, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ మోడల్ 20.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తే, CNG మోడల్ 27.05 కిమీ/కేజీ అందిస్తుంది. 'మారుతి ఈకో'లో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి 11 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. -
ఎలక్ట్రిక్ కారుగా సుజుకి జిమ్ని, ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ నుంచి పెద్ద కమర్షియల్ వాహనాల వరకు ఎలక్ట్రిక్ వెర్షన్స్లో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి తమ పాపులర్ ఆఫ్ రోడర్ జిమ్నీని ఎలక్ట్రిక్ రూపంలో విడుదలచేయడానికి సన్నద్ధమవుతోంది. మారుతి సుజుకి తన జిమ్నీ ఎస్యువిని 2026 నాటికి ఎలక్ట్రిక్ కారుగా తీసుకురానుంది. ఇది డిజైన్ పరంగా ఎక్కువ మార్పులకు లోనయ్యే అవకాశం లేదు. అయితే జిమ్ని ఎలక్ట్రిక్ కారు కావున ఫ్రంట్ బంపర్ కొత్తగా ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ అమర్చిందట. (జిమ్ని, ఫైల్ ఫోటో) గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జిమ్ని 3-డోర్స్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా మొదట యూరప్ దేశాలలో విడుదలవుతుంది. కంపెనీ అనుకున్నట్లుగానే జిమ్ని ఎలక్ట్రిక్ విడుదల చేస్తే అమ్మకాలలో తప్పకుండా చరిత్ర సృష్టిస్తుంది. జిమ్ని ఇటీవల 2023 ఆటో ఎక్స్పోలో 5 డోర్స్ రూపంలోవిడుదలైంది. రాబోయే జిమ్నీ ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా రీ-డిజైన్ చేయడం సులభమైన పని కాదు. పెట్రోల్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా రోపుదిద్దుకునే సమయంలో ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ వంటి వాటిని అమర్చడం ఇతర మార్పులు ఇందులో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2026 నాటికి విడుదల చేయనున్న తెసులుస్తోంది. జిమ్నీ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికె ఆటో ఎక్స్పోలో కనిపించిన eVX కాన్సెప్ట్లో ఉపయోగించిన అదే 60kWh బ్యాటరీ ఉపయోగించే అవకాశం ఉంది. కంపెనీ ఇంజనీర్లకు మరింత స్థలం అవసరమైతే డబుల్-డెక్ బ్యాటరీ మాడ్యూల్ ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
తగ్గని డిమాండ్! హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతి జిమ్నీ
2023 ఆటో ఎక్స్పోలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన 5-డోర్స్ 'మారుతి సుజుకి జిమ్నీ' ప్రారంభం నుంచి భారత్లో మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికి ఈ ఆఫ్-రోడర్ 16,500 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజూ 700 మందికంటే ఎక్కువ కస్టమర్లు ఈ ఎస్యువీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా తన 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన జిమ్ని బుకింగ్ ప్రైస్ రూ. 25,000 కు పెరిగింది. బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుక్ చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్లోని K15B పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్లో లభిస్తుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కొత్త మారుతి జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. ఈ ఎస్యువీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్ కలిగి ఉండటం వల్ల నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఆఫ్ రోడర్ బాద్షా జిమ్నీ డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది -
కొత్త మారుతి సియాజ్ వచ్చేసింది..సూపర్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, ముంబై: మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'సియాజ్' లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ పొందటంతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది కేవలం ఆల్ఫా ట్రిమ్కి మాత్రమే పరిమితం చేయబడింది. మారుతి సియాజ్ సెడాన్ ఇప్పుడు పెర్ల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండ్యుర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ మరియు డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.14 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర 12.34 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). అప్డేటెడ్ సియాజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్ వంటి 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సియాజ్ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 103 బిహెచ్పి పవర్ , 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ & 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంది. ఈ సెడాన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్లలో బుక్ చేసుకోవచ్చు. -
మారుతీ సుజుకీ టూర్–ఎస్.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త టూర్–ఎస్ సెడాన్ను ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ సెడాన్స్ ట్యాక్సీల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ సీఎన్జీ కేజీకి 32.12 కిలోమీటర్లు, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.15 కిలోమీటర్లు ఇస్తుందని తెలిపింది. పాత సీఎన్జీ వేరియంట్తో పోలిస్తే 21 శాతం అధిక మైలేజీ. అత్యాధునిక 1.2 లీటర్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్ను పొందుపరిచారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి హంగులు ఉన్నాయి. వేరియంట్నుబట్టి ధర ఎక్స్షోరూంలో రూ.6.51–7.36 లక్షలు ఉంది. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 83 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది. -
మారుతీ కుటుంబం 2.5 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో భారత్లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్ 1983 డిసెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది. జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్జీ వాహనాలను విక్రయించింది. -
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ రైడ్
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2029–30 నాటికి భారత్లో ఆరు ఎలక్ట్రిక్ వెహికిల్స్ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఆ సమయానికి మొత్తం మోడళ్లలో ఈవీల వాటా 15 శాతం ఉంటుందని వెల్లడించింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలు 60 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ 25 శాతం ఉంటాయని తెలిపింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పో సందర్భంగా ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని కంపెనీ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ 2025లో భారత్లో రంగ ప్రవేశం చేయనుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్షాప్స్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. -
టాటా, హ్యుందాయ్కి పోటీ: మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో రెండో రోజు దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి జిమ్నీ (5డోర్)ను ఆవిష్కరించింది. వీటి బుకింగ్లను కూడా షురూ చేసింది కంపెనీ. కస్టమర్లకు అధునాతన ఫీచర్లు, ఇంజన్ ఎంపికలతో స్పోర్టీ అండ్ స్టైలిష్ వాహనాలను అందించాలని లక్ష్యంతో మారుతి సుజుకి వీటిని లాంచ్ చేసింది. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనుంది. స్పోర్టీ అండ్ స్టైలిష్ డిజైన్తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఎంపికలతో ఇది లాంచ్ అయింది. 99 హార్స్పవర్, 147 Nm టార్క్ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ బూస్టర్జెట్ ఇంజన్, 89 హార్స్పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో ఇది లభ్యం.కారు ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా, బాలెనో మోడల్లు పోలి వుంది. కూపే లాంటి C-పిల్లర్ను LED స్ట్రిప్ , సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్ లైట్లను జోడించింది. కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్,ఆరు ఎయిర్బ్యాగ్లఇతర ఫీచర్లు. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , ఏఎంటీమూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. -
ఈవీ సెగ్మెంట్లోకి మారుతి, ఆటోఎక్స్పోలో ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్ ఎంట్రీ
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రేటర్ నొయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో బుధవారం (జనవరి 11) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ‘మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్’ ఎలక్ట్రిక్ కారు 2025లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అద్బుతమైన బ్యాటరీ పవర్డ్ ఆప్షన్తో ఫస్ట్ మోడల్ను తీసుకొస్తున్నట్టు మారుతి సుజుకీ గ్రూప్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. గరిష్టంగా 550 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధితో 60kWh బ్యాటరీని ఇందులో అందించింది. మారుతి eVX SUV కాన్సెప్ట్ హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా 2700mm పొడవైన వీల్బేస్ను అందిస్తుంది. టయోటా 40PL గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ 27PL ప్లాట్ఫారమ్కు పునాదిగా పనిచేస్తుంది,. ముందు భాగంలో పదునైన గ్రిల్, హెడ్ల్యాంప్ల కోసం LED DRLలను కలిగి ఉంది. అదనంగా, EV కాన్సెప్ట్లో పెద్ద వీల్ ఆర్చ్లు, అల్లాయ్ వీల్స్, కూపేని పోలి ఉండే రూఫ్లైన్ ,మినిమల్ ఓవర్హాంగ్తో కూడిన షార్ప్లీ యాంగిల్ రియర్ ఉన్నాయి. మారుతి కొత్త మారుతి కాన్సెప్ట్ eVX ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ EVతో పోటీపడనుంది. మారుతి కాన్సెప్ట్ eVX బేస్ మోడల్ ధర రూ. 13 లక్షలు ,టాప్ వేరియంట్ల ధర ఎక్కువగా రూ. 15 లక్షలుగా ఉండనుంది. ఈవీఎక్స్ ఎస్యూవీ కాన్సెప్ట్ తోపాటు, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, సియజ్, ఎర్టిగా, బ్రెజా, వాగనార్ ఫ్యుయల్ ఫ్లెక్స్ ఫ్యుయల్, బలెనో, స్విఫ్ట్ ను ఇక్కడ ప్రదర్శించనుంది. -
సీఎన్జీ వేరియంట్, అదిరిపోయే లుక్తో ఎస్యూవీ గ్రాండ్ విటారా విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారా మోడల్లో రెండు రకాల సీఎన్జీ వేరియంట్లను పరిచయం చేసింది. ధర రూ.12.85 లక్షల నుంచి ప్రారంభం. 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 26.6 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ధర వేరియంట్ను బట్టి రూ.10.45–19.49 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ శ్రేణిలో గ్రాండ్ విటారాతో కలిపి మొత్తం 14 మోడళ్లు ఉన్నాయని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ విధానంలో నెల ఫీజు రూ.30,723 మొదలుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
న్యూఇయర్కి ముందే.. ఈ కార్ల కొనుగోలుపై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలు మెరుగుపడి కార్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ నాలుగేళ్లుగా పేరుకున్న డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. దీనికి సంవత్సరాంతం కూడా తోడు కావడంతో కొన్ని విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. చాలా మటుకు సంస్థలు డిసెంబర్లో 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకటించిన 2 – 2.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. డీలర్లు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 దాకా విలువ చేసే ప్రయోజనాలు అందిస్తామంటూ కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ఎంట్రీ–లెవెల్ కార్ల సెగ్మెంట్లోనూ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు సంబంధించి పెట్రోల్ సెగ్మెంట్లోనూ ఇలాంటి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్సే్చంజ్ బోనస్ ప్రయోజనాలు, బీమా కంపెనీలు ఓన్ డ్యామేజీ ప్రీమియంను తగ్గించడం, డీలర్లు నిర్వహించే స్కీములు మొదలైన వాటి రూపాల్లో ఇవి ఉంటున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా 2018–19 స్థాయిలోనే రూ. 17,000 – రూ. 18,000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎన్జీకి, సాంప్రదాయ ఇంధనాల రేట్లకు మధ్య వ్యత్యాసం తగ్గిపోతుండటంతో సీఎన్జీ మోడల్స్ వైపు కొనుగోలుదారులు దృష్టి పెట్టడం తగ్గుతోంది. దీంతో సీఎన్జీ మోడల్స్ను విక్రయించేందుకు కంపెనీలు అత్యధికంగా రూ. 60,000 వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ విక్రయాలు పటిష్టంగా ఉన్నాయని, నవంబర్తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా విక్రయాలు ఉండొచ్చని భావిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న నిల్వలతో ఒత్తిడి.. డీలర్ల దగ్గర నిల్వలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరినట్లు ఎస్అండ్పీ మొబిలిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 45–50 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నాయి. దీంతో డిస్కౌంట్లు ఇచ్చి అయినా వాహనాలను అమ్మేసేందుకు డీలర్లు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటం కూడా సమస్యాత్మకంగా మారుతోంది. అటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. టాటా మోటార్ ఈ–నెక్సాన్కి ఇటీవలి వరకూ కొద్ది నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ ప్రస్తుతం డీలర్షిప్లో బుక్ చేసుకుని అప్పటికప్పుడే కారుతో బైటికి వచ్చే పరిస్థితి ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్పై ఆచి తూచి.. ప్రస్తుతం దాదాపు 4,17,000 వాహనాల ఆర్డర్లతో కార్ల కంపెనీల ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. దీంతో కొంత ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడటం లేదు. అయితే, భవిష్యత్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మార్కెట్ సెంటిమెంట్ మొదలైన వాటిని బట్టి డిమాండ్ పరిస్థితి ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వర్గాలు తెలిపాయి. 2018–19కి భిన్నంగా ప్రస్తుతం సంవత్సరాంతపు డిస్కౌంట్లు కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే పరిమితంగా ఉంటున్నాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
భవిష్యత్లో ఆ కార్లకే డిమాండ్.. వచ్చే ఏడాది పెరగనున్న సేల్స్!
త్వరలో ఆటో మొబైల్ మార్కెట్లో ట్రెండ్కు తగ్గట్లు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కార్ల మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోట్రాఫిక్ రద్దీలో వాహనదారులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా మారుతి సుజుకీ మరిన్ని మోడళ్లలో ‘ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్)’ సిస్టంను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఏజీఎస్ సిస్టమ్ వల్ల డ్రైవర్గా గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గేర్ మారుతూ ఉంటుంది. 2013-14లో సెలేరియోతో ఏజీఎస్ సిస్టమ్ను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఆల్టో కే-10, వ్యాగనార్, డిజైర్, ఇగ్నిస్, బ్రెజా, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బాలెనో మోడల్ కార్లలో అమర్చింది. వచ్చే ఏడాదిలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ కార్ల సేల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీవాత్సవ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రీ లెవల్ కారు మోడళ్లలో సాధారణ ట్రాన్స్మిషన్ లేదా ఏజీఎస్ వేరియంట్ కార్లలో తేడా కేవలం రూ.50 వేలు మాత్రమేనని అన్నారు. ఖర్చు తక్కువ కాబట్టే భవిష్యత్లో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తాజాగా స్క్రాపింగ్, రీసైక్లింగ్ కంపెనీ మారుతీ సుజుకీ టొయొట్సుతో చేతులు కలిపింది. హోండా కార్ల యజమానులు తమ వాహనాలను సులభంగా స్క్రాపింగ్, పాత వాహనాల డీరిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పొందవచ్చు. ఇందుకోసం హోండా డీలర్షిప్ కేంద్రాలను వినియోగదార్లు సంప్రదించాల్సి ఉంటుంది. గడువు తీరిన వాహనాల స్క్రాపింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మారుతీ సుజుకీ టొయొట్సు ఆమోదం పొందింది. చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
ఆల్టోకే10 సీఎన్జీ కారు వచ్చేసింది... అందుబాటు ధరలో
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్లో మరిన్ని సీఎన్జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆల్టో కే10 సీఎన్జీ ఇంజీన్ డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్తో కూడిన ఎయిర్ కండీషనర్తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం పోర్ట్ఫోలియోలో 13 ఎస్- సీఎన్సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్లో ఇంకా సీఎన్జీ వేరియంట్ రాలేదు. -
భారత్లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్లెట్ను శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్యూవీలను పరిచయం చేస్తాం. ఎస్యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చార్జింగ్ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు. మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ వెల్లడించారు. భారత్లో ఇంత విస్తృత నెట్వర్క్ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు -
మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: దేశీయ కార్మేకర్ మారుతి సుజుకి తన హ్యాచ్బ్యాక్ మారుతి స్విఫ్ట్ మోడల్లో కొత్త వెర్షన్ను తీసుకొస్తోంది. కొత్త డిజైన్, అప్డేట్స్, ఇంటీరియర్ అప్గ్రేడ్స్తో 2023 జనవరి నాటికి కొత్త తరం సుజుకి స్విఫ్ట్ను గ్లోబల్గా లాంచ్ చేయనుంది. అంతేకాదు 2023లో జరగనున్న ఆటోఎక్స్పోలో దీన్ని ప్రదర్శించవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. రానున్నమారుతి స్విఫ్ట్ 2023లో గణనీయమైన కాస్మెటిక్ మార్పులు , ఫీచర్ అప్గ్రేడ్లు చేసే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ద్వైవార్షిక ఆటోమోటివ్ ఈవెంట్ జనవరి 13 నుండి ప్రారంభం కానుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త సీ-ఎయిర్ స్ప్లిటర్లతో అప్డేట్ చేసిన బంపర్, కొత్త LED ఎలిమెంట్స్తో కూడిన స్లీకర్ హెడ్ల్యాంప్లు , ఫ్రంట్ ఎండ్లో.. కొత్త ఫాగ్ ల్యాంప్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ ప్యానెల్స్, వీల్ ఆర్చ్లపై ఫాక్స్ ఎయిర్ వెంట్లు, బ్లాక్ అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్తో రివైజ్ చేసినట్టు సమాచారం. దాదాపు కొత్త బాలెనో హ్యాచ్బ్యాక్ మాదిరిగానే, హార్ట్టెక్ ప్లాట్ఫారమ్లో డిజైన్ చేసిందట. ఇంకా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ,లెదర్ సీట్లుతొపాటు ఆపిల్ కార్ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి వాయిస్ అసిస్ట్ , OTA (ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు)తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (కొత్త స్మార్ట్ప్లే ప్రో+) ఉండవచ్చు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్-కీప్ అసిస్ట్ ,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఇతర ఇంటీరియర్ అప్డేట్స్ను అందించనుంది. ఇక ఇంజీన్ విషయానికి వస్తే..1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్బాక్స్తో ఉండవచ్చు. దీంతో పాటు యూరప్తో సహా ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్న 1.4 లీటర్ల బూస్టర్జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్తో, కొత్త తరం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ను కూడా ఇండియాలో ఆ విష్కరించనుందని అంచనా. అయితే కొత్త స్విఫ్ట్ అరంగేట్రంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. -
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి.. లాభాల్లో మారుతీ స్పీడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు జంప్చేసి రూ. 2,112 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 487 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,551 కోట్ల నుంచి రూ. 29,942 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 5,17,395 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 4,54,200 వాహనాలను విక్రయించగా.. 63,195 యూనిట్లు ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ఉత్పత్తిలో 35,000 వాహనాలవరకూ ప్రభావం పడినట్లు మారుతీ వెల్లడించింది. ఇందువల్లనే గత క్యూ2 లోనూ మొత్తం వాహన విక్రయాలు 3,79,541 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రస్తావించింది. పండుగల ప్రభావం ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, కోవిడ్–19 సవాళ్లు గతంలో వృద్ధిని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు జోరందుకున్నట్లు వర్చువల్గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రధానంగా పండుగల సీజన్ అమ్మకాలకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కస్టమర్ల పెండింగ్ ఆర్డర్లు 4.12 లక్షల యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. వీటిలో ఇటీవల ప్రవేశపెట్టిన గ్రాండ్ వితారా, కొత్త బ్రెజ్జా తదితర మోడళ్ల కోసమే 1.3 లక్షల ముందస్తు బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత, వ్యయ నియంత్రణ, ఉత్తమ ధరలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. తద్వారా మెరుగైన మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో మొత్తం 9,85,326 వాహనాలు విక్రయించగా.. పూర్తి ఏడాదిలో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భార్గవ తెలియజేశారు. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 7,33,155 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం జంప్చేసి రూ. 9,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 9,550 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
సుజుకీ గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నుంచి మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య ఉంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. ఆరు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్లో లభిస్తుంది. మైలేజీ వేరియంట్నుబట్టి లీటరుకు 21.1 కిలోమీటర్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్కు ఇది పోటీ ఇవ్వనుంది. 57 వేల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేశాయి. మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్ విధానంలో నెలకు రూ.27 వేల చందాతో గ్రాండ్ విటారా సొంతం చేసుకోవచ్చు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..
న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్బ్యాక్లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు. యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ప్రైవేట్పై నమ్మకమే అభివృద్ధికి దన్ను
గాంధీనగర్: దేశ పురోగతి, అభివృద్ధి సాధనలో ప్రైవేట్ రంగంపై నమ్మకం ఉంచడం కీలకమని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని విశ్వసించిందని, దేశ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి.. ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో ఉండేలా పరిశ్రమను ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. అలాగని ప్రైవేట్ రంగంలో లోపాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ .. ప్రైవేట్ రంగాల సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని చూస్తే ప్రైవేట్ వైపే సానుకూలాంశాల మొగ్గు కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఈ 60–65 ఏళ్లు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను చూసిన మీదట .. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంపై ఆధారపడటం ద్వారా భారత్ ముందుకు వెళ్లగలదు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు‘ అని భార్గవ చెప్పారు. మారుతీ సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాబోయే 10–20 ఏళ్లలో దేశీయంగా ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై స్పందిస్తూ భార్గవ ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అంత సమర్ధమంతంగా లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిమితులు, లీగల్ విధానాలు, అలాగే నియంత్రణలు.. పర్యవేక్షణ మొదలైన అంశాలు కారణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు భార్గవ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, దివాలా కోడ్, జీఎస్టీ అమలు, కార్పొరేట్ ట్యాక్స్లను తగ్గించడం మొదలైన సంస్కరణలు ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ‘కొన్నేళ్ల క్రితం దేశీయంగా పారిశ్రామిక వృద్ధిపై నేను నిరాశావాదంతో ఉన్నాం. బోలెడన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏదీ జరిగేది కాదు. కానీ ఒక్కసారిగా సంస్కరణల రాకతో భారత్ మారుతోందని నాకు తోచింది. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని అనిపించింది‘ అని భార్గవ తెలిపారు. ఈసారి అత్యధిక ఉత్పత్తి.. సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డులు నమోదు చేయగలదని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ‘భారత్లోను, కార్ల పరిశ్రమలోను 2022–23లో ఉత్పత్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. నేను కేవలం మారుతీ గురించి మాట్లాడటం లేదు. మొత్తం కార్ల పరిశ్రమ గురించి చెబుతున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. 2018–19లో దేశీయంగా రికార్డు స్థాయిలో 33,77,436 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 30,69,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. -
త్వరలో అన్ని కార్లలో హైబ్రీడ్ టెక్నాలజీ: మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వచ్చే 5–7 ఏళ్లలో తమ అన్ని కార్ల మోడల్స్లోనూ హైబ్రీడ్ సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లు, ఇథనాల్.. బయో సీఎన్జీ అనుకూల ఇంజిన్లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ తెలిపారు. రాబోయే అయిదు నుంచి ఏడేళ్లలో ప్రతీ మోడల్లో ఎంతో కొంత గ్రీన్ టెక్నాలజీ ఉంటుందని చెప్పారు. -
సీఎన్జీ వాహనాలకు డిమాండ్..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, వాటితో పోలిస్తే చౌక ఇంధనమైన సీఎన్జీతో (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో సీఎన్జీ వాహనాల వాటా దాదాపు అయిదో వంతుకు చేరింది. సరఫరాపరమైన సమస్యలు లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వాహన విక్రయాల గరిష్ట స్థాయిని (4,74,953) సీఎన్జీ విభాగం దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,30,000 పైచిలుకు సీఎన్జీ వాహనాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా మోడల్ కోసం 8–9 నెలల పైగా వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అమ్మకాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఈ ఏడాది సగటున నెలవారీగా చూస్తే సీఎన్జీ వాహనాల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చని సంస్థ ఆశిస్తోంది. గతేడాది మొత్తం మీద 37,584 సీఎన్జీ వాహనాలను అమ్మిన హ్యుందాయ్ ఈ ఏడాది తొలి అయిదు నెలల్లో ఇప్పటికే 24,730 పైగా సీఎన్జీ వాహనాలను విక్రయించింది. మూడు దిగ్గజాలు.. గతేడాది ఆగస్టులో జరిగిన భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా.. డీజిల్ వాహనాలను తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ సూచించారు. తద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగానే దేశీ ఆటొమొబైల్ సంస్థలు తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ కలిసి సీఎన్జీకి సంబంధించి 14 వాహనాలను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సీఎన్జీ వాహన విక్రయాలు 2,61,000 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటర్స్ ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టిగోర్, టియాగో వాహనాలకు సంబంధించి ఈ వేరియంట్ అమ్మకాలు 52 శాతానికి చేరినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తమ మొత్తం పోర్ట్ఫోలియోలో సీఎన్జీ వాహన శ్రేణి వాటా 10 శాతం దాకా ఉంటుందని వివరించాయి. నిర్వహణ వ్యయాలు తక్కువ.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలను నడిపే వ్యయాలు తక్కువగా ఉంటున్నాయి. ద్రవ ఇంధనాలతో నడిచే వాహనాలకు సంబంధించిన ఖర్చు ప్రతి కిలోమీటరుకు రూ. 5.30–5.45గా ఉంటోంది. అదే సీఎన్జీ వాహనాల వ్యయం అందులో సగానికన్నా తక్కువగా ప్రతి కిలోమీటరుకు రూ. 2.1–2.2 స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా సీఎన్జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్జీ డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 3–4 ఏళ్ల క్రితం 1,400 అవుట్లెట్లు ఉండగా ప్రస్తుతం 3,700కు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
హరియాణాలో మారుతీ సుజుకీ ప్లాంట్
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ హరియాణాలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కేంద్రం కోసం తొలి దశలో రూ.11,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. హరియాణా స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోనిపట్ జిల్లాలో ఐఎంటీ ఖర్ఖోడ వద్ద 800 ఎకరాలను మారుతీ సుజుకీ కోసం కేటాయించింది. సామర్థ్యం పెంపునకు మరిన్ని తయారీ యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు సరిపడ స్థలం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది. తొలి దశ 2025 నాటికి పూర్తి కానుంది. తొలుత ఏటా 2.5 లక్షల యూనిట్ల కార్లను తయారు చేయగల సామర్థ్యంతో ఇది రానుంది. హర్యానా, గుజరాత్లో ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 లక్షల యూనిట్లు. చదవండి: ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం.. -
రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు
► కారులో వేగంగా వెళ్తున్నారు.. ఉన్నట్టుండి ఎదురుగానో, పక్కనుంచో ఓ బస్సు దూసుకొచ్చింది.. మీకు అప్పటికే ఆ బస్సు వస్తున్న విషయం తెలిసింది.. మీ కారు వేగం తగ్గించి భద్రంగా ఓ పక్కకు జరిగారు. ► మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. సిగ్నల్, జీబ్రాక్రాసింగ్ వంటివి లేకున్నా ఓ చోట కొందరు రోడ్డు దాటుతున్నారు. కొంత దూరం నుంచే మీ కారు దీనిపై అలర్ట్ చేయడంతో వేగం తగ్గించారు. .. ఇదంతా ‘వీ2ఎక్స్ (వెహికల్ టు ఎవ్రీథింగ్) కమ్యూనికేషన్ టెక్నాలజీ మహిమ. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ ఐఐటీ, జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకి మోటార్ కార్పొరేషన్, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీలు సంయుక్తంగా ఈ టెక్నాలజీని రూపొందించాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో.. ఐదు వాహనాలను వీ2ఎక్స్ టెక్నాలజీతో నడుపుతూ టెక్ షో నిర్వహించారు. 2025 నాటికి ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ప్రాజెక్టు ప్రతినిధులు ప్రకటించారు. రహదారి భద్రతకు ఎంతో ఉపయోగపడే వీ2ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని రహదారులపై పరీక్షిస్తే.. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సుజుకి, మారుతి సుజుకి సంస్థల ప్రతినిధులు, కేంద్ర టెలికం శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘వీ2 ఎక్స్’అంటే.. ‘వెహికిల్ టు ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’..రోడ్డుపై వెళ్తున్న అన్నిరకాల వాహనాలు, పాదచారులతో అనుసంధానమవుతుంది. చుట్టూ ఉన్న వాహనాలు, వాటివేగం, సమీపంగా రావడం వంటివాటిని గమనిస్తూ..ప్రమాదాలు జరగకుండా డ్రైవ ర్ను అప్రమత్తం చేస్తుంది. ఐఐటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ టెక్నాలజీ పనితీరును ప్రాజెక్టు ఇన్చార్జి ప్రత్యూష వివరించారు. ప్రధానంగా ఆరు ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. ప్రయోజనాలివీ.. 1.అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ: అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు కారుకు సమీపంలోకి వస్తున్నప్పుడు.. వాటికి దారి ఇచ్చేలా డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. అంబులెన్స్ ఎన్ని నిమిషాల్లో తన వాహనాన్ని సమీపిస్తుంది, ఎక్కడ దారి ఇవ్వాలనేది కూడా సూచిస్తుంది. 2.పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: పాదచారులు రోడ్లపై కారుకు అడ్డుగా వచ్చే అవకాశముంటే వెంటనే గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. ఢీకొట్టకుండా ముందుగా జాగ్రత్త పడేందుకు సహాయం చేస్తుంది. 3. బైక్ అలర్ట్ సిస్టమ్: రోడ్డు సందులు, మూల మలుపుల్లో అకస్మాత్తుగా వచ్చే ద్విచక్ర వాహనాలను కార్లు ఢీకొనడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీ2ఎక్స్ టెక్నాలజీని ద్విచక్ర వాహనాలకు కూడా అనుసంధానిస్తే.. బైక్ ఎంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తుందనే విషయాన్ని కారు డ్రైవర్కు చేరవేస్తుంది. 4. రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్: రోడ్డు సరిగ్గా లేనిచోట్ల డ్రైవర్ను హెచ్చరిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని అప్రమత్తం చేస్తుంది. 5. చాలా దూరం నుంచే పసిగట్టి: ఒక్కోసారి రాంగ్ రూట్లో వచ్చే వాహనాలు కారు దగ్గరికి వచ్చే వరకు గుర్తించలేం. అలాంటి వాహనాలను చాలా దూరం నుంచే పసిగట్టి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. 6. కారు కంప్యూటర్గా: కారును డ్రైవింగ్కు ఉపయోగించనప్పుడు.. అందులోని మైక్రో ప్రాసెసర్ను కంప్యూటింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి