Mission Bhagiratha
-
అడుగంటిన పాలేరుకు జీవం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
పాముకాటుతో అటెండర్ మానస మృతి
వరంగల్ :పాముకాటుతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బండి మానస (30) నర్సంపేట మిషన్భగీరథ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన సాయంత్రం ఇంట్లో పని చేస్తున్న క్రమంలో మానసను పాము కాటు వేసింది. దీంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు. -
జీతం చాలడంలేదని లేఖ.. మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య
నల్లగొండ క్రైం: నెల వారి జీతం సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిషన్ భగీరథ 35 ఎంఎల్డీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న సింగం పుష్పలత ఆత్మహత్య చేసుకుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గత 6నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈమేరకు నల్లగొండ ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. పుష్పలత ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ను వారికి అందజేశారు. పుష్పలత భర్త మహేష్ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు భార్య ఆత్మహత్య చేసుకుందన్నారు. చిన్నారుల అనాథలుగా మారారన్నారు. కార్మికుల వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.9వేలు ఇవ్వడం అన్యామన్నారు. కార్మికుల పొట్ట కొడుతున్నప్పటికీ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాలియా: మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హాలియా మున్సిపాలిటీలోని సాయిప్రతాప్ నగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత(26)కి చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ అయిన జోలం సాంబయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. పుష్పలతను ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండలోని పానగల్కు చెందిన సింగం మహేష్కి ఇచ్చి వివాహం జరిపించాడు. మహేష్ పానగల్లోని మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో కంట్రోల్ రూం ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తె సాన్విత, కుమారుడు సాయినందన్ ఉన్నారు. మహేష్కు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో గతేడాది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందడంతో పుష్పలతకు హాలియా మిషన్ భగీరథలో కాంట్రాక్టు ఉద్యోగిగా అవకాశం కల్పించారు. ఈమె 6 నెలల క్రితం హాలియా పట్టణంలోని సాయిప్రతాప్ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఇంటి యజమాని గమనించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలు మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. కాగా.. ఏడాది క్రితం తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. చావుకు ఎవరూ కారణం కాదు.. సూసైడ్ నోట్లో ఇలా ఉంది.. పుష్పలత మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, మిషన్ భగీరథలో చేసే ఉద్యోగానికి తనకు వచ్చే జీతం రూ. 9,500లు సరిపోకపోవడం, అది కూడా రెండు, మూడు నెలల వరకూ రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొని ఉంది. తన కడుపులో గడ్డ కావడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్కు రూ. 2లక్షలు ఖర్చు అవుతుందనడంతో ఆర్థిక స్థోమత లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. -
‘భగీరథ’కు అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు అంశం రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా వివాదం రాజేసింది. ఈ పథకానికి జాతీయ అవార్డు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. కేసీఆర్ సర్కార్ పేర్కొన్నట్లుగా జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకాన్ని తాము మదింపు చేయలేదని.. తెలంగాణలో 100% నల్లాల ద్వారా క్రమబద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొందని వివరించింది. కేవలం ఫంక్షనాలిటీ అసెస్మెంట్–2022 కింద జాతీయ జల్ జీవన్ మిషన్ నిబంధనలను అనుసరించి రోజుకు 55 లీటర్ల తలసరి తాగునీరు అందుతోందో లేదోనని పరిశీలించడంతోపాటు నీటి నాణ్యత బీఎస్ఐ 10,500 ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదోనని మాత్రమే పరిశీలించామని కేంద్ర జలవనరుల శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా 8% నివాసాలకు నిత్యం తలసరి 55 లీటర్లకన్నా తక్కువ తాగునీరు అందుతోందని, మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జాతీయ జల్జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లు వివరించింది. అవార్డు ఆ విభాగంలోనే.. గ్రామీణ గృహసముదాయాలకు క్రమబద్ధమైన నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసిన ఆదివారం బహూకరిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ వివరణ ఇచ్చింది. నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం పనితీరు మదింపు కోసం స్వీకరించే అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనని స్పష్టం చేసింది. 100% నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన గ్రామ పంచాయతీల ద్వారా ధ్రువీకరణ జరగలేదని తెలిపింది. పదేపదే అబద్ధాలెందుకు?: ఎర్రబెల్లి ‘గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నది మిషన్ భగీరథ ద్వారానే. తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందుతోందని మీ జలజీవన్ మిషన్ వెబ్సైట్లోనూ ఉంది. గ్రామీణ గృహసముదాయాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే అది మిషన్ భగీరథకు కాకుండా మరి దేనికి వచ్చినట్లు అవుతుంది?’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. కేంద్రం తీరును తప్పుబడుతూ శనివారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. గ్రామ పంచాయతీలన్నీ ధ్రువీకరించాలని తీర్మానాలు చేయలేదని కొత్త మెలిక పెట్టడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అబద్ధాలు పదేపదే చెప్పడం వల్ల అవి నిజాలు కావనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ కాన్వాయ్లో షాకింగ్ ఘటన.. -
‘బోగస్ ప్రాజెక్టుకు కేంద్రం అవార్డులా?’
జోగిపేట (ఆంధోల్): మిషన్ భగీరథ బోగస్ ప్రాజెక్టు అని, ఈ పథకానికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో చేపట్టగా పెద్దమొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్కు ఎందుకు అవార్డులిస్తోందని ఆమె ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికిరణ్ ఏనాడూ ప్రశ్నించలేదని షర్మిల విమర్శించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఈ ఎమ్మెల్యే నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆయన చంటి క్రాంతికిరణ్ కాదని, కంత్రీ కిరణ్ అని షరి్మల ఎద్దేవాచేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
వణికిపోతున్న భద్రాద్రి వాసులు.. మిషన్ భగీరథ అధికారుల కీలక ప్రకటన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. చదవండి: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు -
భద్రాచలంలో మిషన్ భగీరథ నీరు కలుషితం
-
ప్రశంసలు సరే.. పైసలివ్వండి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిం దంటూ కేంద్రం ప్రశంసించినందుకు ధన్యవాదాలని.. ప్రశంసలతో పాటు నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ అమలుకు వెంటనే రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తి, పీఆర్ శాఖలు, ఎన్ఐఆర్డీ, యూని సెఫ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ వాటర్ శానిటేషన్ హైజిన్ కాంక్లేవ్–2022 సదస్సులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ప్రశంసించారు. కేంద్రమంత్రి ప్రశంసలకు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందిస్తూ ధన్యవా దాలు తెలిపారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రం లోని 100 శాతం గ్రామీణ ఆవాసాలకు తాగు నీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇంటింటికీ నల్లా పథకంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. -
మిషన్ భగీరథ పైపులైన్ను ఢీకొట్టిన లారీ
మిషన్ భగీరథ పైపులైన్ను లారీ ఢీకొన్న ఘటనలో నీరు భారీగా ఎగసిపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఈద్గామ్ చౌరస్తా నుంచి భైంసా వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ వద్ద నిలిపి ఉన్న లారీని, భైంసా నుంచి వస్తున్న టిప్పర్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ ముందు భాగం పైపును ఢీకొట్టడంతో ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అక్కడికి చేరుకుని త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. – నిర్మల్ చైన్గేట్ -
Photo Feature: ఐడియా అదిరింది సారు...
ఇవి నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశువులు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించే పశువులపై మున్సిపల్ సిబ్బంది ఎంసీఎన్ అని రాస్తారు. దీంతో వాటిని సదరు పశువుల యజమానులు మళ్లీ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అవే పశువులు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే వాటిని కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని గోశాలకు తరలిస్తారు లేదా అడవిలో వదిలేస్తారు. గేదెలు, మేకల వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ చెప్పేందుకు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఇలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్. అవ్వకెంత కష్టం.. చేతితో చిల్లిగవ్వలేదు.. ఉన్న ఒక్క కొడుకు బతుకుతెరువు కోసం వెళ్లి వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్లో ఉంటున్న కన్న కూతురును చూడాలనిపించింది ఈ అవ్వకు. అయితే, ప్రయాణానికి డబ్బులు లేవు.. కానీ కూతురును చూడాలనే కోరిక ముందు ఇదేమీ కష్టం అనిపించలేదు. దీంతో ఇలా కాలినడకన నెత్తిన బట్టలమూటతో బయలుదేరి వెళ్తూ సాక్షి కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, మంచిర్యాల వినూత్న యంత్రం.. పనిలో వేగం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన రైతు ముత్తినేని సత్యం పవర్ వీడర్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి మరింత సులభంగా సాగు పనులు చేస్తుండడం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. పత్తి, మిరప పంటల సాగు చేసే సత్యం రూ.55 వేలతో పవర్ వీడర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. స్వతహాగా మెకానిక్ అయిన ఆయన యంత్రానికి కొన్ని మార్పులు చేశాడు. నడుస్తూ పనిచేయాల్సిన పవర్ వీడర్ను బైక్లా మార్చేందుకు ముందు భాగంలో మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వెనుక భాగంలో ట్రాక్టర్ మాదిరి గొర్రు పైకి.. కిందకు లేపేలా బిగించాడు. దీంతో ఎన్ని ఎకరాలైనా సరే.. కూర్చుని మరీ పత్తి, మిరప తోటలో గుంటుక తీయడం, కలుపు తీయడం సులభమవుతోందని తెలిపాడు. పత్తి, మిరప, కూరగాయల సాగు చేసే రైతులకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని సత్యం వెల్లడించాడు. ఉప్పొంగిన ‘భగీరథ’ మహబూబ్నగర్ మండలంలోని మన్యం కొండ స్టేజీకి సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ వాల్వ్ నుంచి గురువారం నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ఎత్తున నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీనిపై మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణను వివరణ కోరగా.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి, మహబూబ్నగర్ మండలం రాంరెడ్డి గూడెంలోని వాల్వులు కొంత కాలంగా లీక్ అవుతున్నాయని, వాటికి మరమ్మతు చేయడానికి వీలుగా మన్యంకొండ వద్ద నీరు విడిచామని తెలిపారు. నీరు మొత్తం ఖాళీ అయితేనే వాల్వు మరమ్మతు చేయడానికి వీలవుతుందని, నీరు ఖాళీ అయ్యాక తాను వాల్వ్లను పరిశీలించి లీకేజీలను సరిచేయించానని ఆయన వివరించారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) -
ఎగిసిపడిన ‘భగీరథ’
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ – తోటపల్లి రాజీవ్ రహదారి సమీపంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. పెద్దలైన్ కావడం.. ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో రాజీవ్ రహదారికి ఇరువైపులా నీళ్లు విరజిమ్మాయి. దీంతో కొంతసేపు ప్రయాణానికి ఆటంకం కలిగింది. సమీపంలోని శనగ పంట పూర్తిగా నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) -
‘కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథాకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించడం సంతోషంగా ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో బుధవారం దయాకర్రావు మాట్లాడుతూ.. రాష్టంలోని ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ నాలుగేళ్ళ క్రింద విషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. దీనికి 46 వేల 123 కోట్లు అంచనాతో చేపట్టినట్లు పేర్కొన్నారు. కానీ ఈ బడ్జెట్ కంటే తక్కువగా బడ్జెట్ ఖర్చు జరిగిందన్నారు. 33 వేల కోట్ల ఇప్పటికే ఖర్చు చేశామని, కేంద్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని మిషన్ భగీరథ పేరు మార్చి జలజీవన శక్తి మిషన్ పేరుతో ఈ పథకం అమలు చేస్తోందన్నారు. చదవండి: ‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం ‘మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వటం లేదు. కేంద్రానికి సీఎం లేఖలు రాశారు.. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథను అమలు చేస్తోంది. 40 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.. గుజరాత్ కంటే మంచి పథకం ఇది. దేశంలో మిగితా రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణలో మిషన్ భగీరథను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణను మార్చలన్న ఉద్దేశ్యంతో పెట్టింది. కేంద్రం బోర్ నీళ్లతో నీళ్లు ఇస్తోంది. ఇక్కడ కృష్ణ గోదావరి నీళ్లని మంచి నీటిని ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో నిధులు ఇస్తూ ఇక్కడ మాత్రం ఇవ్వటం లేదు. చదవండి: త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త రాష్ట్రంలో 23 వేల 787 అవాసాలకు నీరు అందిస్తున్నాం. రెండేళ్లుగా అడుగుతున్న నిధులు రాలేదు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా కేంద్రం ప్రకటించింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో గొప్పగా తెలంగాణను పొగిడారు. మిగితా రాష్ట్రాలకు ఇచ్చే 2000 కోట్లు ఇక్కడ కూడా మెయింటనెన్స్ కోసమైన ఇవ్వాలని ఆడిగాం. మా ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారు. మా మిషన్ భగీరథను కాపీ కొట్టి పథకం అమలు చేస్తున్నారు.. నిధులు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. -
కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే మిషన్ భగీరథ సామాగ్రి దగ్ధమైంది. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత గదుల్లో మిషన్ భగీరథ మీటర్లు, పైప్ లైన్ సామాగ్రి నిల్వచేశారు. అందులో అర్థరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఉవ్వెత్తున ఎగిసి పడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేసరికే మిషన్ భగీరథకు సంబంధించిన సామాగ్రి బుగ్గిపాలు అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్లు. ఫ్లోరైడ్ రక్కసి కాటుకు బలైన కుటుం బాలెన్నో.. జీవచ్ఛవాలుగా బతుకులీడ్చినవారెందరో.. ఇది ఒకప్పుడు. మరిప్పుడో? దాని పీడ విరగడైంది. ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దాని కోసం ‘భగీరథ’ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్న 967 ఆవాసాలకు ఊరట కలిగింది. ‘మిషన్ భగీరథ’పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్ ఒకటి నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా.. గత నెల ఒకటో తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది. తొలిసారి దర్శిలో గుర్తింపు భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉపరితల నీటివనరుల సేవనమే మార్గమని శాస్త్రవేత్త డాక్టర్ ఎంకే దాహూర్ అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించినా వర్షాభావ పరిస్థితులు, కరువుతో అవి రానురాను అడుగంటిపోయాయి. దీంతో ఫ్లోరోసిస్ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో బట్లపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే సేవించాల్సి వచ్చింది. 2003లో పోరుయాత్రలో భాగంగా మర్రిగూడకు వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి 2017 చివరి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించారు. మిషన్ భగీరథ ఫలితంగానే.. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారేం దుకు మిషన్ భగీరథ పథకమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలం గాణ ఆవిర్భావానికి ముందు కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణాలకు మిషన్ భగీరథ రక్షిత మంచినీరందుతోందని చెప్పారు. భగీరథ నీటితో ఫ్లోరైడ్ విముక్తి మిషన్ భగీరథ నీరు రాకమునుపు ఊరంతా ఫ్లోరైడ్ నీరే శరణ్యం. ఫ్లోరైడ్ నీరు తాగి, ఒంటి నొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు. ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. గతేడాది నుంచి రక్షిత నీరు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం. –కొట్టం మాధవిరమేష్ యాదవ్, సర్పంచ్ తమ్మడపల్లి, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా ఆరోగ్యం కుదుటపడింది ఫ్లోరైడ్ వల్ల చాలామంది మా మండలంలో వికలాంగులుగా మారారు. ఈ నీరు తాగినప్పుడు కాళ్లు, చేతులకు నొప్పులు ఉండేవి. ఏ పనీ చేయలేని పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలు పోయాయి. –అల్వాల అంజయ్య, తిరుగుండ్లపల్లి, మరిగూడ మండలం -
‘భగీరథ’ గుట్టపై కలకలం
గజ్వేల్: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కోమటిబండ మిషన్ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. తమను విధుల నుంచి తొలగించారని ఆగ్రహంతో ఉన్న భగీరథ పథకం ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లేలా తమ నిరసనకు వ్యూహాత్మకంగా గజ్వేల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ దారుల్లో తరలివచ్చి ఒక్కసారిగా మిషన్ భగీరథ హెడ్వర్క్స్కు చేరుకొని మెరుపు ఆందోళనకు దిగారు. ఓవర్హెడ్ ట్యాంకులపైకి ఎక్కి తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. సుమారు ఏడు గంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగడంతో పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని, ఆందోళన చేపట్టినందుకు కేసులు ఉండవని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. ఆ తర్వాత వారందరినీ బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మిషన్ భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేయడానికి 2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని ఎంపిక చేశారు. ఇందులో 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరి పోస్టులను ఏడాదికోసారి రెన్యువల్ చేస్తుంటారు. ఈసారి మార్చి 31న వీరిని రెన్యువల్ చేయాల్సి ఉండగా అది జరగలేదు. జూన్ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించారు. ఆ తర్వాత జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తమను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే కనీసం ఈ ఏడాదైనా కొనసాగించి వచ్చే ఏడాది తొలగించాలని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వీరికి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సమస్యను తెలపాలన్న భావనతో వ్యూహాత్మకంగా గజ్వేల్ను ఆందోళనకోసం ఎంచుకున్నారు. -
కనీస మట్టం..ఇది నీటి కష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. సాగర్ ఒక్కటే దిక్కు..? ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి. కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు.. మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్లోని 15, గోదావరి బేసిన్లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి. -
తెలంగాణ దేశానికే ఆదర్శం
నాంపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం రెడ్హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజన్ తెలంగాణ’ ఇంటరాక్టివ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన గుజరాత్, కేరళ రాష్ట్రాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను తీసుకువస్తామని మేనిఫెస్టోలో పార్టీలు పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారని, మిషన్ భగీరథ అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథం లో పయనింపజేస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ కింద 1.70 లక్షల పైపులైన్లు వేసి ఇంటింటికి తాగేందుకు మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మంత్రి కేటీఆర్ నిత్యం తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, పరిశ్రమల స్థాపనతో ఉపాధి, ఉత్పత్తులను పెంపొందించుకోవడానికి వీలుంటుందని పదే పదే చర్చిస్తున్నారని వివరించారు. భూసేకరణతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయ నున్న టెక్స్టైల్ పార్కు ఆలస్యమవుతోందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి కొద్ది నెలల్లోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వానికి పారిశ్రామిక వేత్తలు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్య క్షుడు కరుణేంద్ర జాస్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు రమకాంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా మిషన్ ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నదని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని (సీవరేజ్) ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతిభవన్లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపథకం గురించి షెకావత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆర్థిక సహకారం ఇవ్వండి.. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ‘తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకక పోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో ‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తోంది. కాబట్టి మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. 11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథకు జాతీయ జల్ మిషన్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : నీటి యాజమాన్య పద్ధతులు, జల సంరక్షణ, నీటి వినియోగంలో ఉత్తమ విధానాల అమలుకుగానూ జాతీయ జల్ మిషన్ ప్రదానం చేసే అవార్డుల్లో తెలంగాణకు 3 అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్ల తాగు నీటి సామర్థ్యం 20% పెంపుదల విభాగంలో మొదటి బహుమతి కింద రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి అందుకున్నారు. జలవనరుల సమాచారం, నిర్వహణ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నడిచే తెలం గాణ వాటర్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం రెండో స్థానంలో నిలవగా ఆ అవార్డును రాష్ట్ర సాగు నీటి శాఖ తరఫున సీఏడీఏ కమిషనర్ మల్సూర్ అందుకున్నారు. ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలాల పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలకుగాను రాష్ట్ర భూగర్భ జల విభా గం 3వ స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అందజేశారు. -
అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు
సాక్షి, వికారాబాద్: మిషన్ భగీరథ పథకంలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అధికారులు. తాజాగా బిల్లులు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని తాండూరులో మంగళవారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువయ్య మిషన్ భగీరథ కాంట్రాక్టర్. అతనికి రూ.20 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. అందుకోసం నెలరోజులుగా డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లులు చెల్లించడానికి ముందు తమ జేబులు తడపాలని శ్రీనివాస్ కోరాడు. రూ.30 వేలు ముట్టచెపితేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ డీఈ శ్రీనివాస్కు రూ.30 వేలు డబ్బులు ఇవ్వబోయాడు. అతను వారించి వర్కింగ్ ఇన్స్పెక్టర్ మహేందర్కు ఇవ్వాలని సూచించడంతో అతనికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ ఇద్దరి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
కేంద్రం కరుణించలేదు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : మాటలు కోటలు దాటతాయి గానీ చేతలు గడప కూడా దాటవన్నట్లుంది రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఈ దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించినా కేంద్రం మాత్రం వీటికి పైసా విదిల్చడం లేదు. పురోగతిలో ఉన్న ఈ ప్రాజెక్టు, పథకాల అమలుకు కేంద్ర సాయం కోసం ఎదురుచూసి విసుగెత్తిన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు దృష్టి సారించింది. ఆ దిశగా అవసరమైన వనరు లను గుర్తించే పనిలో పడింది. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు తగిన ఆర్థిక సహాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం కోరినట్లుగా తగినన్ని నిధులు కేటాయిస్తే మిగతా ప్రాజెక్టులకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.30 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.15 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అయ్యే ఖర్చు దీనికి అదనం. వీటితో పాటు చిన్నా చితకా ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు అవసరం. ప్రాజెక్టులు, పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణం పొందింది. దీంతో మళ్లీ రుణానికి వెళ్లడం కంటే సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది. భూముల వేలం ద్వారా రూ.10 వేల కోట్లు! ఈ ఏడాది ప్రాజెక్టులు, ఇతరత్రా పనులు చేపట్టడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను భూములను వేలం వేయడం ద్వారా రాబట్టుకోవాలని భావిస్తోంది. కోకాపేటలో హెచ్ఎండీఏకు ఉన్న 140 ఎకరాలు, రాయదుర్గంలో టీఎస్ఐఐసీకి ఉన్న 180 ఎకరాలను వేలం వేస్తే రూ.10 వేల కోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కోకాపేట, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు రాజధానిలో అత్యంత విలువైన ప్రాంతాలు. వేలం వేస్తే ఎకరాకు కనిష్టంగా రూ.30 కోట్లు గరిష్టంగా రూ.40 కోట్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూములు వేలం వేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తాయని తద్వారా ప్రభుత్వానికి వచ్చేఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని భూమి బ్యాంక్లుగా నిర్ధారించింది. ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన వాటిని అభివృద్ధి చేసి పారిశ్రామిక, గృహ అవసరాలకు వినియోగించాలని నిర్ణయంతీసుకుంది. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించనే లేదు. మూడేళ్లుగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. కేంద్రం పట్టించుకోకపోయినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని బ్యాంక్ల కన్సార్టియం ద్వారా నిధులు సేకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.80 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇటీవలే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తి స్థాయిలో నీటిని తోడటం ప్రారంభిస్తే తెలంగాణలోని సగం జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు పట్ల కేంద్రం స్పందించిన తీరు పూర్తి నిరాశజనకంగా ఉందని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నీతి అయోగ్ సిఫారసు చేసినా.. మిషన్ భగీరథ బాగుందని ప్రశంసించిన నీతి అయోగ్ ఈ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు దోహదపడేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు కూడా రూ. ఐదు వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే, కేంద్రం మాత్రం ఇప్పటివరకూ ఈ పథకాలకు గానీ, ప్రాజెక్టులకు గానీ పైసా విదల్చలేదు. నీతి అయోగ్ సిఫారసు చేసినా రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులు, పథకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మా ప్రయత్నం మేం చేస్తున్నాం ‘‘మేం ప్రాజెక్టులు చేపడుతున్నాం, వాటిని పూర్తి చేసేందుకు త్రికరణశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. కేంద్రం తగిన తోడ్పాటు అందిస్తే బాగుండేది. అయినా మేము ఎక్కడా వెనకడుగు వేయకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం’’–టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
వారం, పది రోజుల్లో సర్పంచ్లకు చెక్పవర్
సాక్షి, హైదరాబాద్: వారం, పదిరోజుల్లో సర్పంచ్లకు చెక్ పవర్తోపాటు అధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిపై మంత్రి శుక్రవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షాసమావేశంలో ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్హెడ్ ట్యాంక్లు, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. మిగిలిపోయిన పనులకు జూలై 15 డెడ్లైన్ ‘మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్లకు చెక్పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పనులు కీలకం. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మతులుండాలి.. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి’’అని అధికారులకు మంత్రి దయాకర్రావు సూచించారు. -
భగీ‘వ్యథ’..
సాక్షి, కొత్తగూడెం: ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం.. భగీ‘వ్యథ’గా మారింది. వరుసగా పైపులైన్లు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్ తరచూ లీకవుతుండడంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తిప్పలు తప్పడం లేదు. పలుచోట్ల పౌరులు గాయాలపాలవుతున్నారు. 16 నెలల క్రితం పైపులైన్ పనుల సమయంలో పాల్వంచ మండలంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అనేక చోట్ల పైపులు లీకవుతూనే ఉన్నాయి. ఇక ఇంట్రావిలేజ్ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని మూలమలుపు వద్ద జాయింట్ వాల్వ్ లీక్ అయి ఇటీవల నీరు ఏరులై పారింది. చండ్రుగొండలోని బొడ్రాయి సెంటర్, మసీదు వద్ద భగీరథ పైపులు పగిలాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన మండల కేంద్రంలోని బాలాజీస్వామి ఆలయం ఎదురుగాగల హోటల్ ముందు పైపు పగిలిపోవడంతో హోటల్ ధ్వంసమైంది. రేకులు మొత్తం కూలిపోయి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంట్లోకి మొత్తంనీరు వెళ్లింది. చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి నీళ్లు వృథాగా పోయాయి. కలివేరు, పూజారిగూడెంలలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయగా, కుదునూరులో పగిలిన పైపులైన్కు ఇంకా మరమ్మతులు చేయలేదు. ములకలపల్లి మండలంలో మిషన్ భగీరథ పథకంలో గత ఏడాది మే 20వ తేదీన పాల్వంచ నుంచి మండల పరిధిలోని రామచంద్రాపురం వరకు ట్రయల్రన్ చేయగా, మాదారం అటవీ ప్రాంతంలో పైపులైన్ లీకయింది. ఫౌంటెన్లా నీరు విరజిమ్మింది. సంబంధిత అధికారులు మరమ్మతులు నిర్వహించారు. 2018 జూలై 31వ తేదీన చుంచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్లైన్ ఒక్కసారిగా లీకై పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో రహదారి నీటి ప్రవాహంగా మారింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పంచాయతీ తోగ్గూడెం–జగన్నాధపురం గ్రామాల మధ్య మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనుల్లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో.. 2017 అక్టోబర్ 7వ తేదీన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.వారు పైపులు బిగిస్తుండగా వర్షం కురిసింది. ఆ సమయంలో లోతులో పనిచేస్తున్నవారు పైకి వచ్చే పరిస్థితి లేక.. మట్టి పెళ్లలు పడడంతో ముగ్గురూ మృతి చెందారు. -
కాళేశ్వరంతో రైతులకు మేలు
కాళేశ్వరం/ధర్మారం(ధర్మపురి)/సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్ లహరి, రీటా లహరి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆర్థిక సంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్థిక సంఘం సభ్యులు మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ పనులను పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు పురోగతిని ఫొటో ఎగ్జిబిట్ ద్వారా వారికి వివరించారు. 80 శాతం వరకు పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, త్వరగా నిర్మించి రైతులకు సాగు నీటిని అందించాలని అన్నారు. ప్రాజెక్టుకు ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం భేష్! తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని సభ్యులు ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. 6వ ప్యాకేజీలోని విద్యుత్ సబ్స్టేషన్, పంప్హౌస్, సర్జిపూల్ పనుల గురించి తెలుసుకున్నారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపులనుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తం 36 లక్షల ఎకరాలకు సాగు నీరిందిస్తామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, కాలువలు ప్రవహించే దారిలోని గ్రామాల తాగునీటి అవసరాలను సైతం తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6వ ప్యాకేజీ పనులను రూ.5,046 కోట్లతో ప్రారంభించి ఇప్పటి వరకు 95 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. జూన్ నెలాఖరులోగా వందశాతం పనులు పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 టీఎంసీలను తరలించటానికి అవసరమైన సివిల్ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగునీటికి ప్రాధాన్యం కల్పిస్తూ, మత్స్య పరిశ్రమ, టూరిజం పెరిగేలా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ పనుల పరిశీలన: రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం బాగుందని వారు కితాబిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అగ్రహారం వద్ద చేపట్టిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆదివారం వారు సందర్శించారు. రాష్ట్రంలో 1.3 లక్షల కిలోమీటర్ల పైపులైన్ను భగీరథలో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం సభ్యులు అరవింద్ మెహతా, రవి కోట, ఆంటోని ఫిరాయిక్, సీఎస్ ఎస్కే జోషీ, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, మిషన్ భగీరథ సీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. శంషాబాద్లో స్వాగతం: రాష్ట్ర పర్యటనకోసం వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులకు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వాగతం పలికారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు. -
ఇదేం చిత్రం సారూ..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు. ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఆసిఫాబాద్ జిల్లాలో మషన్ భగీరధ పైప్ లీక్
-
మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఎవరు కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తి చేయడంలో ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సీ. కృపాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునీత, రాజేందర్రెడ్డి, కె.విద్యాసాగర్రావు, ఎన్.భాస్కర్రావుతో పాటు వివిధ జిల్లాల సీఈలు, ఈఈలు హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు.. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా... మిషన్ భగీరథతో ప్రస్తుతం 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం నీరు అందుతోందని, మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘దళితవాడలు, ఆదివాసీగూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథతోనే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు... ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలకూ కష్టమైనా, ఆర్థికంగా భారమైనా‡ మిషన్ భగీరథతోనే మంచినీరు సరఫరా చేయాలి. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటీ మిగలొద్దు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఒకసారి భగీరథతో శుద్ధి చేసిన నీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు నీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సందేహాలు తొలగాయి... ‘మిషన్ భగీరథ చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఇంజనీరింగ్ పరంగా అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణకు గర్వకారణం. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు’’అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పర్యటన వాయిదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారాల్లో ఆయన కాళేళ్వరం ప్రాజెక్టును, పంప్హౌజ్లను సందర్శించాల్సి ఉంది. అయితే తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తారు. -
‘భగీరథ’లో సీఎంకు 6% వాటా
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కమిషన్ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్ డబ్బుతోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్హౌస్కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు. సూట్కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కేసీఆర్కు సూట్కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్లాగా తాను బ్రోకర్లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు. విభజన హామీలపై గళమెత్తరేం? టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ అమలును కేసీఆర్ అటకెక్కించారన్నారు. గెలిచినా ఓడినా నాదే బాధ్యత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్లో ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్కు రాను’అని అన్నారు. ఉత్తమ్కుమార్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉత్తమ్ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు. -
పైపుల కొనుగోళ్లలో కేసీఆర్ కమీషన్ ఎంత?
రేగోడ్ (మెదక్): రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయలేని సీఎం కేసీఆర్, మిషన్ భగీరథ పథకానికి మాత్రం రూ.50 వేల కోట్ల అప్పు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ నుంచి సుమారు యాభైమంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. మిషన్ భగీరథకు అంత అప్పు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ పథకం పైపుల కొనుగోళ్లలో ఎంత కమీషన్ ముట్టిందని నిలదీశారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని ప్రజలు ఎన్నో కలలుకన్నారని, అయితే వాటన్నిటినీ కేసీఆర్ కాల రాశారని అన్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని దామోదర మండిపడ్డారు. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే ఉంటుందని తెలిపారు. సిం గూరు నుంచి ఎన్నడూ జరగని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 16 టీఎంసీల నీళ్లను అక్రమంగా తరలించిందని అన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు లక్ష ఎకరాల్లో నష్టం జరిగిందని తెలిపారు. -
ఇంటింటికీ నల్లా నీళ్లు వచ్చాయా?
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు వచ్చినట్లు నిరూపిస్తారా అని టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో తాను చేసిన పనేంటో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, కేసీఆర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. పేద ప్రజలు బర్లు, గొర్లు పెంచాలి గానీ కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యం ఏలుతానంటోందన్నారు. కేసీఆర్లో ఆత్మవిశ్వాసం తగ్గిందని, ఆయన మాటలు కాలక్షేపం కోస మే వినాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో చనిపోయిన అమరులకు ఇంతవరకు న్యాయం జరగలేదని, అమరులను గుర్తించడానికి 51 నెలల సమయం సరిపోలేదన్నారు. సమైక్యవాది అయిన హరికృష్ణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వం.. చనిపోయిన తెలంగాణ ఉద్యమకారులకు ఆ విలువ ఇవ్వడం లేదన్నారు. గ్రామాల్లో మొహం చెల్లకే.. రాష్ట్ర ప్రజలు ఢిల్లీకి గులాములం కారాదంటున్న కేసీఆర్.. తరచూ ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారని రేవంత్ ప్రశ్నిం చారు. ‘కాంగ్రెస్ కార్యాలయం ఢిల్లీలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఢిల్లీలోనే నిర్ణయించా రు. అందుకే మాకు ఢిల్లీ ఇష్టం. ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గతంలో అన్నారు. ఇప్పుడు వారి ఎంపీలను పార్లమెంటుకు ఎందుకు పంపుతున్నారు. తన ఫాం హౌస్లోనే పార్లమెంటు కట్టుకోవచ్చు కదా’ అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మొహం చెల్లకే కేసీఆర్ హైదరాబాద్లో సభ పెట్టి చీకట్లో వచ్చి ప్రసంగించి వెళ్లారన్నారు. -
కాకతీయ, భగీరథలతో వివక్ష దూరం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతాలు తాగునీటికి ఇబ్బందులు పడుతూనే ఉండేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథలతో ఈ పరిస్థితిలో మార్పు వస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు పథకాల వల్ల సాగునీటి సమర్థ నిర్వహణతోపాటు కుల, మత, లింగ వివక్షలు లేకుండా అన్ని ఇళ్లకు తాగునీటిని అందించడం సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్లోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లో సోమవారం జరిగిన వర్క్షాప్నకు సీఎస్ ఎస్.కె.జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీటి యాజమాన్య పద్ధతులు, లింగ వివక్ష లేమి అన్న అంశాలపై సాగునీటి ఇంజనీర్ల కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళల హక్కులను కాపాడటం ఎంతైనా అవసరమని అన్నారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పనులు చేపడుతున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వివరించారు. భవిష్యత్ అంతా నీటి మీదే ఆధారపడి ఉందని జెండర్, వాటర్ మేనేజ్మెంట్పై టెరీ, ఈపీటీఆర్ఐ కలసి పనిచేస్తాయని తెలిపారు. అనంతరం ఈపీటీఆర్ఐలో సీఎస్ మొక్కలు నాటారు. మహిళలకు ప్రాధాన్యం.. తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ‘ద ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజీవ్సేథ్ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడో మొదలైందని, దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతోందన్నారు. తెలంగాణలో ఏర్పాటైన ఈ రెండు రోజుల వర్క్షాప్ ఆ దిశగా వేసిన తొలి అడుగు అని తెలిపారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ బి.కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నీటి సమస్యల పరిష్కారానికి ఇంజనీర్లు వినూత్నమైన పరిష్కారాలను ఆవిష్కరించాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకుపోవడం ద్వారా లింగ వివక్షను అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఈ డబ్ల్యూఆర్ఎం వార్మ్ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ ఐయాన్ రీడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ నరేన్, ప్రొఫెసర్ సుచిత్రాసేన్, సోల్ ఫౌండర్ డాక్టర్ జస్వీన్ జైరత్, ఇరిగేషన్ అండ్ క్యాడ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు బలమివ్వండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణకు పునరంకితమవుతున్నామని, ప్రజలు ఎప్పటికప్పుడు తగిన బలాన్ని అందించాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారమిక్కడ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతి అంశాలను వివరిస్తూ ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్నాయి. అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ అంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే సంపూర్ణంగా నిమగ్నమైందని ప్రకటించారు. ప్రధాని చెప్పినట్లుగానే మనం చిల్లర మల్లర రాజకీయాలతోనో, వ్యర్థ వివాదాలతోనో పొద్దు పుచ్చలేదు. ఈ నాలుగేళ్ల సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నం. నాలుగేళ్లలో రాష్ట్రం ఏడాదికి సగటున 17.12 శాతం ఆదాయ వృద్ధి రేటును సాధించింది. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. పెరుగుతున్న సంపదనంతా పేదరిక నిర్మూలనకు ఉపయోగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని పేర్కొన్నారు. నాడు జలదృశ్యంలో ఉద్యమానికి ఉద్యుక్తుడినవుతూ.. పోరాటాన్ని మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టండని ప్రతిజ్ఞ చేశానని, అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసేవరకు విశ్రమించలేదని చెప్పారు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితమవుతున్నట్టు వివరించారు. ‘‘ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండ దండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇలాగే కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు. వివిధ రంగాల అభివృద్ధికి, పురోగతికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం, రైతులపై.. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంది. రూ.17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని ‘రైతుబంధు’ పేరుతో అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలను ఈ పథకం ద్వారా అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 49.49 లక్షల మంది రైతులకు రూ.5,111 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంత భారీ బడ్జెట్ నేరుగా రైతుల చేతికి అందించటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. వచ్చే నవంబర్లో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. రాష్టంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడవద్దని ప్రభుత్వం యోచించింది. ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించి, భరోసా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తెస్తోంది. దేశంలో ఇంత పెద్దఎత్తున రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతీ ఏటా ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోపే వారి కుటుంబానికి బీమా మొత్తం అందేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సీడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో యూనిట్కు రూ.80 వేలు కేటాయించింది. కోటి ఎకరాలకు నీరిస్తాం కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.25 వేల కోట్లను కేటాయిస్తున్నాం. బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అదనపు నిధులు సమకూరుస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రాజెక్టులు పూర్తి కావడానికి రాత్రింబవళ్లు అంకితభావంతో పనిచేస్తున్న నీటి పారుదల శాఖకు అభినందనలు. భగీరథపై 11 రాష్ట్రాల ఆసక్తి.. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన అద్భుతం మిషన్ భగీరథ పథకం. శుద్ధి చేసిన నదీ జలాలను ప్రతీ ఇంటికీ, ప్రతీ రోజు అందించడానికి 1.40 లక్షల కిలో మీటర్ల పొడవైన భారీ పైపులైన్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే 19 వేల పైచిలుకు ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నదీ జలాలు చేరుతున్నాయి. మిగతా గ్రామాల్లో పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అనుకున్న సమయం కన్నా ముందే ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడానికి కృషి చేస్తున్న మిషన్ భగీరథ యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నా. మిషన్ భగీరథ కార్యక్రమం దేశ ప్రధానితోపాటు అందరి ప్రశంసలు పొందింది. తెలంగాణ చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల బృందాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. తాగునీటి వసతి కల్పనలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. విద్యుత్ వెలుగులు విద్యుత్ రంగంలో మన రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంది. బీసీలకు అండగా.. బీసీ కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా తగిన ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్ధిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బీసీ కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. ప్రగతి భవన్లో జెండా వందనం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, ముఖ్య కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు. అనంతరం గోల్కోండ కోట వద్దకు చేరుకున్నారు. జోనల్ ఆమోదం తర్వాత భారీగా నియమాకాలు తెలంగాణ సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షణ కోసం, ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ కేడర్ ఉద్యోగాల్లో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించేలా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్ కేడర్తోపాటు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించడానికి సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. విశ్వనగరానికి ప్రత్యేక ప్రణాళిక హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో రైలు మొదటి దశ ప్రారంభమైంది. రోజుకు లక్ష మందికిపైగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఆనందాన్ని కల్గిస్తోంది. ప్రస్తుతం నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కి.మీ. మేర మెట్రో రైలు పరుగులు పెడుతోంది. వచ్చే నెల నుంచి అమీర్పేట నుంచి ఎల్బీనగర్ వరకు, నవంబర్లో అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు మెట్రో రైలు నడిపించడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సంక్షేమంలో మనం నంబర్ వన్ దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. రూ.40 వేల కోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆసరా పెన్షన్ల రూపంలో 41.78 లక్షల మందికి రూ.5,367 కోట్లను ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందించేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రారంభించింది. ఇప్పటివరకు 4 లక్షల మంది లబ్ధి పొందారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. ఇప్పటి వరకు 12,974 ఎకరాలు కొనుగోలు చేసి, 5,065 మంది దళితులకు పంపిణీ చేశాం. దళితులకు మూడెకరాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. మైనారిటీ ఐటీ పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్లో త్వరలోనే ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, షీ టీమ్స్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి, భద్రతకు దోహదపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. రైతు బీమా షురూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కోండ కోటలో ప్రారంభించారు. రైతుల బీమాకు సంబంధించిన మాస్టర్ ఇన్సూరెన్స్ బాండ్ను ఎల్ఐసీ దక్షిణ మధ్య విభాగం జోనల్ మేనేజర్ సుశీల్కుమార్ సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథికి అందించారు. బీసీల ఉపాధి పథకాలు బీసీ వృత్తి కులాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసే పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఎస్.రాజేశ్వరీ(తిరుమలగిరి), చిప్పోలు నిర్మల(ఆసిఫ్నగర్), పోలంపల్లి స్వప్న(ముషీరాబాద్), బర్రోతు లక్ష్మణ్రావు(ముషీరాబాద్), ముదగుల శ్రీనివాస్(షేక్పేట)లకు సీఎం ఈ పత్రాలను అందజేశారు. అధికారులకు అవార్డులు ఐదుగురు అఖిలభారత సర్వీసు అధికారులను ప్రభుత్వం ఉత్తమ సేవ పతకాలకు, ప్రశంసా పత్రాలకు ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్ వీరికి అవార్డులు, పత్రాలను అందజేశా>రు. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎప్ ఆర్.ఎం.డోబ్రియాల్, మత్స్యశాఖ కమిషనర్ సి.సువర్ణలు ఉత్తమ సేవాపత్రాలు అందుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీ టి.ప్రభాకర్రావు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ డీఐజీ రాజేశ్కుమార్లు ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. ఫొటోలు; గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు -
పథకాల కన్నా కేసీఆర్కే ఆదరణ
-
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదం ఇదే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆరే మా సారు’అనే నినాదంతో రానున్న ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకాలు, ప్రజల్లో వాటి ప్రభావంపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సర్వే చేయించారు. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా కేసీఆర్కే అన్నివర్గాలు ఆదరణ చూపించినట్లు సర్వే ఫలితాలు రావడంతో ఆ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఎక్కువగా ఆదరణ ఉన్న పథకాన్ని లేదా అంశాన్ని రానున్న ఎన్నికల్లో నినాదంగా చేసుకోవాలనే యోచనతో ఈ సర్వే చేయించినట్లు సమాచారం. మిషన్ భగీరథ, రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి అన్ని అంశాలపైనా నిర్దిష్టమైన సర్వే జరిపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనా తీరు వంటివి సర్వే చేయించి, సమగ్ర వివరాలు తీసుకున్నారు. అన్ని పథకాల కంటే కూడా సీఎం కేసీఆర్కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు సర్వే ఫలితాలు వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కల్యాణక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు వంటి ముఖ్యమైన పథకాల కంటే కేసీఆర్ నాయకత్వంపైనే ఎక్కువమంది విశ్వాసాన్ని చూపించినట్లు సర్వే ఫలితాలు వచ్చినట్టుగా తెలిపారు. దీంతో కేసీఆర్ నాయకత్వమే ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో కేసీఆర్కు సరితూగే నాయకుడెవరూ లేరని అన్నివర్గాలు ఆమోదిస్తున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వంపైనే ప్రజలు విశ్వాసంతో ఉన్నారని వచ్చిన సర్వే ఫలితాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడికి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్లో బహుళ నాయకత్వం, సరైన సయోధ్య లేకపోవడం, అంతర్గత వైరుధ్యాలతో ఆ పార్టీని ఎవరూ నమ్మట్లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. -
ఊరంతా వరదేనండి..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద శుక్రవారం ఉదయం మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో సింగూరు జలాలు గ్రామాన్ని ముంచెత్తాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. సమీపంలోని పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు రావడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి. కోళ్లు, రెండు గొర్రెలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని పొలాల్లోకి నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. అందుకు పైప్లైన్ పనులు చేస్తున్న కంపెనీ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. – నిజాంసాగర్ -
గడువులోగా భగీరథ పూర్తవడం గగనమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఆగస్టు నెలాఖర్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పటిలోగా పూర్తిచేస్తారనే విషయంపైనా అంచనా దొరకడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, గూడేలతో సహా ప్రతీ ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రతీ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్క్ ఏజెన్సీలతో భగీరథ పనులపై అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తికావడం లేదు. రాష్ట్రంలో 49 వేల కిలోమీటర్ల పైపులైన్లు మిషన్ భగీరథకు అవసరమవుతున్నాయి. ఇప్పటిదాకా 52 శాతం అంటే 25 వేల కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. కేసీఆర్ నిర్దేశించిన గడువు ఆగస్టులోగా మిగిలిపోయిన 48 శాతం పనులను పూర్తిచేయడం, తాగునీటిని అందించడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సీఎం ప్రకటించిన నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే సంకేతాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ భగీరథను గడువులోగా పూర్తి చేయలేకున్నా, వీలైనంత వేగంగా పూర్తిచేయడం ఎలా అనే దానిపై ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన 24 వేల కిలోమీటర్ల పైపులైన్లను పూర్తి చేయడానికి మరో నాలుగైదు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంట్రా పనులదీ ఇదే స్థితి... ప్రధాన పైపులైన్లు పూర్తికావడానికి కనీసం నాలుగు నెలలైనా కావాలని అధికారులు చెబుతుండగా, ఇంట్రా పనులు(గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు) కూడా పూర్తికాలేదు. రాష్ట్రంలోని సుమారు 25వేల గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణాలు చేపట్టాలని ‘భగీరథ’కింద నిర్ణయించారు. వీటిలో అంతర్గత పైపులైన్లు 50 వేల కిలోమీటర్ల మేరకు వేయాల్సి ఉంది. ఈ పనులను ఆయా గ్రామ, మండలాల్లోని స్థానిక కాంట్రాక్టర్లకు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అప్పగించింది. అయితే పనులను దక్కించుకోవడానికి పోటీలు పడిన కాంట్రాక్టర్లు, వాటిని పూర్తిచేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని పూర్తిచేయడానికి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో కూలీలు, మేస్త్రీలు దొరకడం లేదని గ్రామీణ స్థాయిలోని స్థానిక కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఇప్పటిదాకా వీటిలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇంకా ఇంట్రా పైపులైన్ల పనులనే మొదలుపెట్ట లేదని తెలుస్తోంది. పలు గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కసారిగా గ్రామాల్లో ఇంట్రా పనులు ప్రారంభం కావడంతో మేస్త్రీలు, కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వ్యవసాయ పనులు కూడా ఉండటంతో కూలీలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్టుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు టెండర్లు వేసినప్పటి ధరలకు, ఇప్పటి ధరలకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడిందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇసుక కొరతతో పాటు స్టీల్ ధరలు, సిమెంటు ధరలు చాలా పెరిగాయని కాంట్రాకర్లు మొర పెట్టుకుంటున్నారు. అటు కూలీల కొరత, ఇటు ధరల్లో భారీ పెరుగుదలతో కొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కాంట్రాక్టర్లు వెనుకాడి చేతులెత్తేస్తున్నట్టుగా చెబుతున్నారు. పనులు తీసుకున్న కాంట్రాక్టర్లపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇంట్రా పనులైతే ఆరునెలలైనా పూర్తయ్యే పరిస్థితి చాలా గ్రామాల్లో లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గిడ్డంగుల వినియోగంలో రాష్ట్రం నంబర్వన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వంద శాతం నిల్వలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 10.64 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గిడ్డంగులు ఉండగా, 86 శాతం మాత్రమే వినియోగం ఉండేదని, ప్రస్తుతం 20.43 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యము న్న గిడ్డంగులుండగా, వంద శాతం వినియోగం ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల బోర్డు సమావేశం శనివారం లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్, ఎండీ జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు గిడ్డంగులు నిండుగా ఉండి, ప్రభుత్వ గిడ్డంగులు ఖాళీగా ఉండేవన్నారు. ప్రస్తుతం పరిస్థితి తారుమారై నాయకుల గిడ్డంగులు ఖాళీగా, ప్రభుత్వ గిడ్డంగులు నిండుగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా మార్కెటింగ్ శాఖ 364 గిడ్డంగులను రూ.1024 కోట్లతో చేపట్టగా, 320 పూర్తయినట్లు తెలిపారు. ధాన్యం నిల్వల కోసం గిడ్డంగులను పౌర సరఫరాల శాఖ, మార్క్ఫెడ్, నాఫెడ్ సంస్థలు గతంలో ప్రైవేటు గోదాముల్లో నిల్వలు చేస్తే.. బస్తాకు రూ.4.30 పైసలు చెల్లించేవని ఇప్పుడు ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వకు బస్తాకు రూ.3.25 పైసల చొప్పునే కేటాయించడంతో రూ.18.17 కోట్ల మేర ఆదా అవుతోందని తెలిపారు. 2017–18 ఏడాదిలో గిడ్డంగుల సంస్థకు రూ.140.91 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువని వెల్లడించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఆర్థిక పురోగతిలో రాష్ట్రం నంబర్వన్గా ఉందని, గిడ్డంగుల్లోనూ నంబర్వన్గా మారి కొత్త చరిత్ర సృష్టించామన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ మాట్లాడుతూ.. గిడ్డంగుల సంస్థలో ఉద్యోగుల కొరత ఉందని, వారిని భర్తీ చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. -
ఆగస్టులోగా పట్టణ భగీరథ పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రక్షిత తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ‘అర్బన్ మిషన్ భగీరథ’ప్రాజెక్టు పనులను వచ్చే ఆగస్టులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో పైపు లైన్ల కోసం తవ్వుతున్న రహదారులను పూడ్చేయాలని చెప్పా రు. మంగళవారం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జరిపిన మంత్రి.. పట్టణాల వారీగా పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనేక పట్టణాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా పనులు పూర్తి చేస్తామని మంత్రికి కాంట్రాక్టర్లు తెలిపారు. సివిల్ (నిర్మాణ) పనులు కొలిక్కి వచ్చాయని, వర్షాలు ఆరంభమైనా ఆటంకాలు ఉండకపోవచ్చని చెప్పారు. వచ్చే ఆగస్టు నాటికి పైపు లైన్ల నిర్మాణం పూర్తవుతుందని, పనులు ఆలస్యమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కొత్త పురపాలికలకు సిబ్బంది ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెరిగిన మున్సిపాలిటీలు, పట్టణాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన మేరకు సిబ్బందిని అనుమతించాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో పట్టణాల్లో చేపట్టనున్న పనుల డీపీఆర్లను మంత్రి పరిశీలించారు. ఆ పనులకు సంబంధించిన టెండర్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇందుకు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ను ఆదేశించారు. ప్రత్యేక నిధులతో చేపట్టే కార్యక్రమాలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని టెండర్లలో గడువు విధించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటవనున్న పురపాలికల్లో మౌలిక వసతులు, మానవ వనరులను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు. -
‘విజిలెన్స్’పై సర్కారు గుర్రు
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్ విభాగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విజిలెన్స్ పనితీరుపై అసంతృప్తితో ఉంది. పలు కేసుల్లో అధికారులు తప్పుడు నివేదికలిచ్చారని ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ విభాగాల్లో అంతర్గత విచారణలు, ప్రాజెక్టులు, పథకాల అమల్లో ఉన్న లొసుగులపై ఎప్పటికప్పుడు నివేదికివ్వాల్సిన విజిలెన్స్ విభాగం అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగేళ్లు కుడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన ప్రధాన దర్యాప్తుల్లో ఏ ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ పనితీరులో డొల్లతనం ఉందా? లేక విజిలెన్స్ పంపిన నివేదికలపై చర్యలకు ప్రభుత్వంలో జాప్యం జరుగుతోందా.. అన్న విషయాలపై సందిగ్థత నెలకొంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే నివేదికివ్వాలని విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతి లేదని పేర్కొంటూ తప్పుడు నివేదికలు పంపించినట్టు తెలిసింది. దీనితో ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో నాణ్యతాలోపాలు తదితర అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే అందులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారని విచారణలో బయటపడింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు, మిల్లర్ల అక్రమాలు, ఎరువులు, విత్తనాల కంపెనీలు, డీలర్ల మోసాలపై తప్పుడు నివేదికలు పంపించారని ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ వెంచర్లు, నిర్మాణాలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు భూముల అమ్మకాలు జరిపిన వ్యవహారంపై నివేదికిస్తే ఇప్పటికీ కమిషన్ గానీ, ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోలేదని విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 8 ప్రధాన వ్యవహారాల్లో నివేదికిచ్చినా.. ఎందుకు స్పందించరంటూ అంతర్గతంగా ఎదురుదాడికి సైతం దిగినట్టు తెలుస్తోంది. నిజాలు బయటపెట్టిన ఏసీబీ... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పోస్టింగ్ కోసం కొంతమంది అధికారులు కొద్దిరోజుల క్రితం జరిగిన బదిలీల్లో లక్షలు ఖర్చు పెట్టినట్టు ఏసీబీ విచారణలో బయటపడింది. ఇటీవలి దాడుల్లో ఓ మిల్లర్ నుంచే రూ.లక్ష లంచం తీసుకున్నట్టు గుర్తించారు. రైసుమిల్లులు, ఫర్టిలైజర్లు, విత్తన కంపెనీలు, రేషన్ బియ్యం, కల్తీ, అక్రమ వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కమీషన్ పద్ధతిలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. విజిలెన్స్ విభాగాన్ని ఎత్తేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక తరహాలో అవినీతి నిరోధక శాఖలోనే విజిలెన్స్ను విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని హోంశాఖ, ఏసీబీ అధికారులను ఆదేశించినట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఏసీబీలోనే మరో యూనిట్ విజిలెన్స్ వింగ్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ సీనియర్ ఐపీఎస్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్
-
‘ప్రతి ఇంటికి జూలై చివరకు నీరు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి జూలై ఆఖరు నాటికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి పారుదల (మిషన్ భగీరథ) కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. సోమ వారం అన్ని జిల్లాల మిషన్ భగీరథ ఎస్ఈలతో ఆమె సమీక్ష నిర్వహించారు. నల్లగొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో నీరు సరఫరా జరగని గ్రామాలకు 25న ట్రయల్రన్ నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 28న ట్రయల్రన్ ప్రారంభించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. -
ఎల్లంపల్లి ఎండుతోంది .!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాగునీటితో పాటు హైదరాబాద్కు తాగునీరు అందిస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. 20.175 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 8 గంటలకు 6.980 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతిరోజు 1,300 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళుతుండటంతో వేగంగా నీటి మట్టం తగ్గుతోంది. దీంతో ఇప్పటికే గూడెం లిఫ్ట్కు సరఫరా చేసే 290 క్యూసెక్కుల నీటిని ఈనెల 26 నుంచి నిలిపివేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు పంప్హౌస్కు నీటి సరఫరాను ఆపేశారు. ఈ పంప్హౌస్కు ప్రతిరోజు 500 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేసే అధికారులు 26వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు తగ్గించి సోమవారం పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్, ఎన్టీపీసీ, సింగరేణికి నీటి సరఫరాలో ఆటంకం కలగకుండా ఉండేందుకే గూడెం, వేమునూరులకు నీటిని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్కు నీటి కష్టాలు తప్పవా..? ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికన్నా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్బోర్డుకు ప్రతిరోజు 248 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, సింగరేణికి అవసరాన్ని బట్టి 225 క్యూసెక్కుల నుంచి 400 క్యూసెక్కుల వరకు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజులుగా 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం 400 క్యూసెక్కులు రిలీజ్ చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లిలో గోదావరి నీటిమట్టం అతివేగంగా తగ్గే అవకాశం ఉంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి ఎల్లంపల్లికి నీరు రావడం జూన్ నెలాఖరు వరకు గానీ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. అంటే ఇంకా రెండు నెలల పాటు ఈ 6.8 టీఎంసీల నీటిని కాపాడుకోవలసి ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు కృష్ణా, ఎల్లంపల్లితో పాటు అక్కంపల్లి (కృష్ణా), మంజీరా, సింగూరు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుంచి ప్రతిరోజు 516 మిలియన్ గ్యాలన్ల నీరు (ఎంజీడీ) అవసరం కాగా ప్రస్తుతం 387 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. అందులో 86 ఎంజీడీ ఎల్లంపల్లి నుంచే సరఫరా కావలసి ఉంది. ఎల్లంపల్లి నీటి మట్టం ఇదే వేగంతో తగ్గితే హైదరాబాద్కు నీటి కష్టాలు తప్పవని ప్రాజెక్టు అధికారులు చెపుతున్నారు. భగీరథకు తప్పని తిప్పలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న మిషన్ భగీరథకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సరఫరా అయ్యే నీరే ప్రధానం. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలలోని అనేక గ్రామాలకు మిషన్ భగీరథ కింద ఎల్లంపల్లి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఫిల్టర్బెడ్స్, పంప్హౌస్లు ఏర్పాటు చేశారు కూడా. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటి సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు ట్రయల్ రన్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు నీటి కొరత ఏర్పడి పాత పంప్హౌస్ నుంచి మంచిర్యాల మునిసిపాలిటీకి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ద్వారా వేమునూరు గ్రామం వద్ద పంప్హౌస్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సాగునీరుతో పాటు సమీప గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా జరగనుంది. సోమవారం నుంచి వేమనూరుకు కూడా నీటిని నిలిపివేశారు. గత ఏడాదితో పోలిస్తే వేగంగా తగ్గిన నీటి మట్టం ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీకి 10.860 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సరిగ్గా ఏడాదికి సోమవారం నాడు 6.980 టీఎంసీలకు పడిపోయింది. అంటే గత ఏడాది కన్నా 4 టీఎంసీల లోటు. ఇప్పటి వరకు రెండు నెలలుగా ప్రతి రెండు వారాలకు 3 టీఎంసీల చొప్పున నీటి మట్టం తగ్గుతూ రావడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి ఎగువ వరకు నిల్వ ఉన్న గోదావరి నీరు వెనక్కు వెళ్లిపోయింది. ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 148 మీటర్ల నుంచి 141 మీటర్లు తగ్గింది. మంచిర్యాలకు నీటి సరఫరా చేసే పంప్హౌస్ కూడా బయటకు తేలిపోయింది. దీంతో మంచిర్యాల మునిసిపాలిటీకి నీటి సరఫరా రెండు రోజులకోసారి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని పొదుపుగా విడుదల చేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. -
వాటికి నిధుల కొరత లేదు : మంత్రి పోచారం
సాక్షి, కామారెడ్డి : ఇంటింటింకి నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మిషన్ భగీరథకు నిధుల కొరత ఏమాత్రం లేదని, తగినన్ని నిధులు ఉన్నాయని మంత్రి తెలిపారు. మిషన్ భగరథ పూర్తి అయ్యే వరకు ఎక్కడ అలసత్వం వహించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. రాత్రి పగలు కష్టపడి చెప్పిన గడువులోగా ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించాలని ఆదేశించారు. మే 10 నాటికి బల్క్ వాటర్ ప్రతి గ్రామానికి నీరు చేరాలని, జూన్ 30 నాటికి ప్రతి ఇంటికి 100శాతం నల్లాల ద్వారా తాగునీరు సరఫరా అయ్యేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. -
ఎన్నికలకు ముందే మిషన్ భగీరథ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమన్న సవాల్కు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకన్నా నాలుగైదు నెలల ముందే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మిషన్ భగీరథ పనులపై ఆదివారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలున్న జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, మల్లారెడ్డి, నల్లా మల్లారెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్.డబ్లు్య.ఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా నాటికి పూర్తి పనులు... ‘‘మిషన్ భగీరథలో ప్రధానమైన ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్లతో కూడిన మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా 75 శాతం ప్రాజెక్టు పని పూర్తయింది. ఇప్పటికే చాలా గ్రామాలకు నీరు అందుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తున్నారు. వచ్చే నెల చివరికి ప్రతి గ్రామానికీ నీరందాలి. ఈ సందర్భంలో తలెత్తే సమస్యలను జూన్ 10 నాటికి పరిష్కరించాలి. దసరా నాటికి అంతర్గత పనులు పూర్తి చేయాలనే గడువు విధించుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. డిసెంబర్ నెలాఖరుకల్లా వందకు వంద శాతం ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు చేరాలి. దీంతో ప్రభుత్వం చేసిన సవాల్ను సాధించి చూపడంతోపాటు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన వారమవుతాం. అంతకు మించి ప్రజల ఆరోగ్యాలు కాపాడిన వారమవుతాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. మారుమూల జిల్లాలకు ప్రత్యేక వ్యూహం... ‘‘నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఆ ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి. అక్కడ పనులు చేయడానికి కూలీలు దొరకరు. మెటీరియల్ సరఫరా చేయడం కష్టం. అక్కడ పనులు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే అవకాశాన్ని పరిశీలించాలి. చెంచుగూడేలు ఎక్కువగా ఉండే అచ్చంపేట లాంటి నియోజకవర్గాలతోపాటు 10–15 నివాస ప్రాంతాలుండే అటవీ ఆవాస ప్రాంతాలకూ మంచినీరు అందించాలి. స్థానిక వనరులను గుర్తించి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి వారికి సురక్షిత మంచినీరు అందించే బాధ్యతను స్వీకరించాలి’’అని కేసీఆర్ సూచించారు. దేశానికి మనమే మార్గదర్శనం... ‘‘మిషన్ భగీరథపై ఇప్పుడు యావత్ దేశం ఆసక్తి కనబరుస్తున్నది. జాతీయ పార్టీలూ దేశానికంతా తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టాలని ఆలోచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు మన పథకాన్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వారందరికీ మనమే ఆదర్శం. రేపు దేశమంతటికీ మంచినీటిని సరఫరా చేసే పథకానికి మనమే మార్గదర్శకం వహించబోతున్నాం’’అని సీఎం అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు ఏ ఆటంకం లేకుండా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని కేసీఆర్ అన్నారు. -
బడ్జెట్పై కోటి ఆశలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సరిపడేన్ని నిధులు కేటాయిస్తుందని అంచనాలు వేసుకుంటోంది. గడిచిన మూడేళ్లు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకపోవటం తెలంగాణను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు తగినంత ఆర్థిక సాయం చేయాలని పదే పదే కేంద్రానికి విన్నవించినప్పటికీ ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగడం లేదు. ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవటం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు వస్తాయనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. నీతి ఆయోగ్ సిఫారసులు అమలయ్యేనా? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ అధికారుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలసి విన్నవించింది. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ను కలసి రాష్ట్రానికి నిధుల అవసరాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ గతేడాదిలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు సాయమందించాలని సూచించింది. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాళేశ్వరానికి సాయమందేనా.. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల సాయమందించాలని రాష్ట్రప్రభుత్వం ఇదివరకే కేంద్రాన్ని కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధులు సైతం దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఈటల అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలకు, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్కు తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో చూడాలి. బడ్జెట్లో తెలంగాణకు ఈ సారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. -
అమ్ముడుపోతే ఏం చేయగలం?
మనసులోమాట పాలకుల దిగజారుడుతనం, ప్యాకేజీలకు, ప్రలోభాలకు లోబడి అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యే వారి క్షీణ రాజకీయాలే ఫిరాయింపులకు ముఖ్యకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలు చూపలేం కాని పార్టీలు మారిన వారిలో ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారని.. ఏ పార్టీ తరపున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయిందన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే వారికి అమ్ముడుపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఫిరాయింపుల నిరోధక చట్టం ఇంత నిర్వీర్యమైపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని భయమేస్తుందని చెప్పారు. ప్రజలు దేన్నయినా సహిస్తారు కానీ పాలకుల అహంకారాన్ని, అమానవీయ దృక్పథాన్ని సహించరంటున్న ఉత్తమ్ కుమార్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాజకీయాల్లోకి రాకముందు మీ హోదాల గురించి చెబుతారా? నేను 16 సంవత్సరాల వయస్సులోనే పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందాను. భారతీయ వాయుసేనలో పైలట్ ఆఫీసర్గా క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్గా చేరాను. అధునాతన టెక్నాలజీ కలిగిన విమాన పైలట్గా పనిచేయడంతో పూర్తి సంతృప్తి పొందాను. బోర్డర్ సమీపంలో ఫ్లైయింగ్ చేస్తున్నప్పుడు విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలట్ విమానం. విమానంలో నేను కూర్చుని ఉండగానే పేలిపోయింది. అయితే యుద్ధవిమానంలో ఎజెక్షన్ అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్తో సహా పైలట్ను బయటకు షూట్ చేస్తుంది. దాంతో పారాచూట్ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డాను. తర్వాత రష్యన్ వైమానిక నిపుణులు వచ్చి చూశారు. ఇలాంటి ప్రమాద ఘటనల్లో పది లక్షల్లో ఒకరు కూడా బతికి బయటపడటం కష్టం. నీకు ఇది బోనస్ జీవితం అనుకో అన్నారు వారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక విరిగింది. మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆసుపత్రిలో ఉండి కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. ఆ తర్వాత కూడా కొంత కాలం పైలట్ గానే పనిచేశాను. అయితే మళ్లీ ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే వెన్నెముక పూర్తిగా డామేజ్ అవుతుంది కాబట్టి, పైలట్ బాధ్యతల నుంచి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని రష్యన్ నిపుణులు సూచించారు. దాంతో ఎయిర్ చీఫ్ మార్షల్ నాటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్ను సంప్రదించి పీస్ పోస్టింగ్ –రిస్క్ లేని ఉద్యోగం–లో భాగంగా ఆయన వద్ద ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నా మిలిటరీ హోదాను ఐఏఎస్ హోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారు. ఎంపీలు కూడా ఫిరాయించడానికి ప్రాతిపదిక ఏంటి? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎవరైనా కావచ్చు మరోపార్టీకి అమ్ముడుపోతే, అమ్ముడు పోదల్చుకుంటే మనం ఏం చేయగలం? సుఖేందర్ గుప్తా ఎందుకు అమ్ముడు పోయారు అంటే ఏం చెప్తాం. ఒకటి మాత్రం నిజం. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆరే. కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మేం ఊహించలేదు. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారు. గుప్తాకు, ఆయన కుటుంబానికి కూడా ప్యాకేజీలు వచ్చాయి. కావాలంటే ఆ టెండర్ కాపీలు మీకు పంపుతాను. ఇంతస్థాయిలో పార్టీ మార్పిడి కార్యక్రమం జరగడానికి రెండే రెండు కారణాలు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు, అమ్ముడుపోవడానికి సిద్ధమైన వారి రాజకీయాలు. కానీ అన్నిపరిణామాలను ప్రజలు చూస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని నా నమ్మకం. పార్టీ మారితే రాజీనామా చేస్తే బాగుండేది కదా? ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ దేశంలో అమలే కాకుంటే, భవిష్యత్తులో ఏం జరుగబోతుంది అనేది భయపెడుతోంది. తెలంగాణా టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే, వారిలో 12 మంది పార్టీనుంచి ఫిరాయిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏమి అర్థమున్నట్లు? పార్టీ సింబల్కి ఏమి అర్థం? ఏ పార్టీ తరఫున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దానికి అమ్ముడుపోతున్నారు. 24 గంటల విద్యుత్ క్రెడిట్ కేసీఆర్దా లేక కాంగ్రెస్దా? రెండో ప్రపంచయుద్ధ కాలంలో గోబెల్స్ అనే మంత్రి.. జర్మనీ గెలవబోతోంది అంటూ ఎప్పుడూ ఒకే ప్రచారం చేసేవాడు. ఆ ప్రచారాన్ని హిట్లర్ అంతటివాడు కూడా చచ్చేంతవరకు నమ్మాడు. అలాగే కేసీఆర్ తప్పుడు ప్రచారంతో, మీడియాలో వందలకోట్లు ప్రకటనలకు తగిలేసి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో విద్యుత్ మిగులు ఉంది కాబట్టి 24 గంటలేమిటి ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు. ఎరువుల కోసం రూ. 4 వేలు ఇస్తే, రైతులంతా సంతృప్తి చెందుతారా? స్వాంతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో ఎక్కువమంది రైతుల ఆత్మహత్యలు జరిగింది కేసీఆర్ పాలిస్తున్న తెలంగాణలోనే అని గుర్తుంచుకోవాలి. మిర్చిపంటకు మంచి ధర కావాలని ఖమ్మం రైతులు వీధుల్లోకొస్తే వాళ్ల కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి మరీ జైల్లో కుక్కించిన దుర్మార్గ పాలన కేసీఆర్ది. రైతులను సంకెళ్లతో రోడ్డు మీద నడిపించారు. కేసులు పెట్టారు. రైతులను నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసి వాళ్లు వాతపెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసి ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు జిమ్మిక్కులకు సిద్ధమవుతున్నాడు కేసీఆర్. మిషన్ భగీరథ పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు కదా? మిషన్ భగీరథలో ఆరు శాతం కమీషన్ గ్యారంటీ. అందుకే అది కమీషన్ భగీరథ. నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్నారు కదా. అయితే దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానన్నారు. ఇవ్వలేదు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు. చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. మరి వీళ్లెవరినీ ఓట్లడగొద్దు. తెలంగాణ ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం జరగనుంది చూస్తూ ఉండండి. ప్రజలు సహించని విషయం ఏమిటంటే అహంకారం. తెలంగాణను పాలిస్తున్న వాళ్లు కళ్లు నెత్తికెక్కి, చిన్నా, పెద్దా, మంచీ చెడూ, డిగ్నిటీ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కొడుకు నియోజకవర్గంలో దళితులను తీసుకుపోయి పోలీస్ టార్చర్ చేస్తే కనీసం దానిమీద చర్యలుండవు. అంటే ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జగ్జీవన్ రాం బిడ్డ మీరా కుమార్ తెలంగాణకు వచ్చి వారిని చూసి కంట తడిపెడితే వీళ్లు హేళన చేస్తూ మాట్లాడతారు. ఉస్మానియాలో బీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీస పరామర్శ కూడా ఉండదు. కామారెడ్డిలో బీసీకి చెందిన వీఆర్ఎను ఇసుక ట్రాక్టర్ కింద తొక్కించి చంపితే వీళ్లు పట్టించుకోరు. ఇదా వీరి పాలన. ఇంత అమానవీయం, ఇంత అహంకారం ఎన్నడైనా చూశామా.. వీళ్లను ప్రజలు తరిమి తరిమి కొడతారు చూస్తూ ఉండండి. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయనకు మా శుభాకాంక్షలు. -
సింగరేణికి ‘మిషన్ భగీరథ’
గోదావరిఖని(రామగుండం) : గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లకు, గుడిసె ప్రాంతాలకు గోదావరినది ఒడ్డున ఉన్న ఫిల్టర్బెడ్ ద్వారా తాగునీటిని అందించిన యాజమాన్యం ఇక నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని తీసుకోబోతున్నది. రామగుండం మండలం కుక్కలగూడూరు–మద్దిర్యాల నుంచిరామునిగుండాల గుట్టపై నిర్మించిన సంప్ వరకు వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని గోదావరిఖనిలోని శారదానగర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్ వరకు గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తారు. అక్కడి నుంచి సింగరేణి సంస్థ గంగానగర్లోని సింగరేణి ఫిల్టర్బెడ్ వరకు పైపుల ద్వారా నీటిని మళ్లించి కార్మికుల క్వార్టర్లకు తాగునీటిని అందించనున్నది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో.. సింగరేణి సంస్థ తన పరిధిలో ఉన్న ఆర్జీ–1 డివిజన్లోని గోదావరిఖనిలో 7,300 క్వార్టర్లు, ఆర్జీ–2 డివిజన్లోని ౖయెటింక్లయిన్కాలనీలో 5,600 క్వార్టర్లు, ఆర్జీ–3 డివిజన్లోని సెంటినరీకాలనీలో మరో ఐదు వేల క్వార్టర్లకు గోదావరిఖని ఇంటెక్వెల్ నుంచి నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. దీనికితోడు మొన్నటి వరకు నడిచిన సింగరేణి పవర్హౌస్కు కూడా నీటిని అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా సుందిళ్ల వద్ద బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరినదిలో సుందిళ్ల నుంచి గోలివాడ పంప్హౌస్ వరకు నీరు నిల్వ ఉండనున్నది. పట్టణంలోని మురికినీరంతా నిల్వ నీటిలో చేరనుండడంతో ఆ నీటిని శుద్ధి చేసే పరిస్థితి లేకుండా పోతుంది. కాగా ప్రభుత్వం ఇంటింటికి తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా రామగుండం కార్పొరేషన్ పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నది. ఇదే క్రమంలో కార్పొరేషన్కు వచ్చే నీటి నుంచి సింగరేణి క్వార్టర్లకు కూడా 20 మిలియన్ లీటర్స్ ఫర్డే (ఎంఎల్డీ) తాగునీటిని అందించాలని సింగరేణి యాజమాన్యం విన్నవించింది. సెంటినరీకాలనీ ఏరియాకు మంథని నుంచినీటిని కేటాయిస్తున్న నేపథ్యంలో గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ ఏరియాల క్వార్టర్లతో పాటు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు, భూగర్భ గనులకు కూడా ఈ నీటినే వాడేందుకు సింగరేణి సిద్ధమైంది. దీంతో ఈ నెల 12న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో సింగరేణి ఆశించిన మేరకు 20 ఎల్ఎల్డీ నీటిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇక శారదానగర్ నుంచి గంగానగర్ వరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన మేరకు పైపులైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కాలనీల ప్రజలు కొత్త కనెక్షన్లు తీసుకోవాల్సిందే... సింగరేణి క్వార్టర్ల ఏరియాకు నీటిని సరఫరా చేసేందుకు పైపులు బిగించగా, పలుకార్మిక కాలనీలలో ఆ పైపులకే కనెక్షన్లు ఇచ్చుకుని అక్రమంగా నీటిని వినియోగిస్తున్నారు. ఇలా సింగరేణి నీటిని వాడుతున్న కనెక్షన్లు 22 వేల వరకు ఉంటాయి. కాలనీలకు సుమారుగా 6 ఎంఎల్డీ నీటిని సింగరేణి సరఫరా చేసేది. కాగా... మిషన్ భగీరథ ద్వారా నీటిని ఉపయోగించే క్రమంలో ఈ కనెక్షన్లకు నీటి సరఫరా నిలిచిపోనున్నది. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 45 వేల నివాసుండగా, అందులో 16 వేల నల్లా కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమృత్ స్కీమ్ కింద అనేక కాలనీలలో తాగునీటి పైపులైన్లను అమర్చిన నేపథ్యంలో మిగిలిన ఇళ్ళకు నల్లా కనెక్షన్లు తీసుకునే వీలుంది. త్వరలో సింగరేణి అందించే నీటి సరఫరా నిలిచిపోతున్న క్రమంలో ఆయా ఇళ్ళ యజమానులు అనివార్యంగా కార్పొరేషన్ నుంచి కొత్తగా నల్లా కనెక్షన్లను పొందాల్సి ఉంటుంది. -
ఆ రాష్ట్రాలకు చేయూతనివ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు నిదర్శనంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఈటల అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రూ.85 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందని పేర్కొన్నారు. భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి రూ.19,205 కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలతో పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలకు సహకారం ఇచ్చేలా కేంద్రం బడ్జెట్ రూపొందించాలని సూచించారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐరన్ ఓర్ పరిశ్రమ, గిరిజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్కు నిధులు, వ్యవసాయ పెట్టుబడి పథకానికి నిధులివ్వాలని కోరామని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్పై పన్ను తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ అంగీకరించింది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న డ్రిప్ ఇరిగేషన్పై గతంలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించింది. బీడీలపై పన్ను తగ్గింపును మాత్రం ఫిట్మెంట్ కమిటీ పట్టించుకోలేదు. ఈవే బిల్లుల విషయంలో పాత విధానాన్ని అమలు చేసుకొనే అధికారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయని ఈటల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు నెలలు పూర్తయిన నేపథ్యంలో పేద ప్రజలకు భారంగా పరిణమించిన వివిధ వస్తువులపై పన్ను స్లాబ్లను పున:సమీక్షించాలని కోరినట్లు చెప్పారు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఇవ్వకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సూచించామన్నారు. ఇక తెలంగాణకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్)లో కేంద్రం సభ్యత్వం ఇచ్చింది. అది కామన్సెన్స్కు సంబంధించిన విషయం.. హైదరాబాద్లో పన్ను చెల్లిస్తున్న 40 శాతం మంది ఆంధ్రా ప్రజలే అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఈటలను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందింస్తూ.. ‘అమెరికాలో ఉన్న వారు అమెరికాలో పన్ను చెల్లిస్తారు. ఢిల్లీలో ఉన్న వారు ఢిల్లీలో కడతారు. హైదరాబాద్లో ఉన్న వారు హైదరాబాద్లోనే చెల్లిస్తారు. ఆయన వ్యాఖ్యలు కామన్ సెన్స్కు సంబంధించినవి. అంత ఉన్నత వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై మనం ఏం మాట్లాడతాం’అని వ్యాఖ్యానించారు. -
భక్తులకు ‘భగీరథ’ నీళ్లు
ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకంలో భాగంగా తొలిసారిగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేస్తోంది. జాతరలోని ప్రధాన ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా నీటిని అందించనుంది. రోజుకు 20 లక్షల లీటర్లు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే వారం రోజులపాటు రోజుకు 20 లక్షల లీటర్ల చొప్పున తాగునీటిని అందించనున్నారు. ఇందుకుగాను ఇంగ్లిష్ మీడియం పాఠశాల వెనుకాల 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. నీటిని భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు క్యూలైన్లు, చిలుకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగువంటి ప్రధాన ప్రాంతాల్లో నల్లాల ద్వార సరఫరా చేయనున్నారు. దీంతోపాటు ఆలయం లోపలి భాగంలో ఉన్న క్యూలైన్లలో 50 డ్రమ్ములను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చనున్నారు. ఇందుకుగాను ఈ కూడళ్లను కలిపి 6 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్న సరఫరా చేసే నీటిని భక్తులు తాగునీటికి కాకుండా అన్ని రకాల అవసరాలకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటని అధికారులు పునరాలోచిస్తున్నారు. నేడు ట్రయల్ రన్ మిషన్ భగీరథ పథకంలో భాగంగా వాజేడు మండలం పూసూరు వద్ద మెయిన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నీళ్లను రొయ్యూరు సమీపంలో ట్యాంకుకు మళ్లిస్తారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అందిస్తారు. అయితే మిగతా మండలాలు కాకుండా ప్రస్తుతం కేవలం మేడారం జాతరకు వచ్చే భక్తులకు నీళ్లను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నీళ్లను ఇతర పాయింట్లకు వెళ్లకుండ రొయ్యూరు నుంచి చిన్నబోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారానికి మళ్లించనున్నారు. ఇందుకోసం అధికారులు గురువారం పూసూరు మెయిన్ పాయింట్ నుంచి ట్రయల్రన్ చేయడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మేడారానికి నీరందేలా చేసి 25వ తేదీలోపు జాతర పరిసరాల్లో ట్రయల్ రన్ చేయాలని భావిస్తున్నారు. మహాజాతర 31న ప్రారంభం కానున్న దృష్ట్యా లోపాలను ముందే సవరించుకోవాలని భావిస్తున్నారు. -
కోళ్ల పరిశ్రమకు భగీరథ నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, ముఖ్యమంత్రి తో మాట్లాడి కోళ్ల పరిశ్రమకు కూడా అందేలా చూస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్ హామీ ఇచ్చారు. పౌల్ట్రీ ఇండియా–2017 ప్రదర్శనను బుధవారం ఆయన హైటెక్స్లో ప్రారంభించారు. ఈ ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, కోళ్ల పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. చిన్న రాష్ట్రమే అయినా ఏడాదికి 110 కోట్ల గుడ్లను ప్రభుత్వపరంగా విద్యార్థులు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మధ్యా హ్నం భోజనంలో చికెన్ పెట్టాలని సీఎం యోచిస్తున్నారని చెప్పారు. జీఎస్డీపీలో రూ.10 వేల కోట్లు కోళ్ల పరిశ్రమ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎండాకాలంలో ఒక్క రోజు కరెంటు పోతే లక్షలాది కోళ్లు చనిపోయేవని, ఇప్పుడు కేసీఆర్ ముందుచూపు వల్ల 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని, దీంతో పరిశ్రమలకు ఉపశమ నం లభించింద న్నారు. పౌల్ట్రీని వ్యవసాయ పరిశ్రమ గా పరిగణించాలని కేంద్రాని కి లేఖ రాసిన తొలి రాష్ట్రం తెలం గాణనే అని తెలిపారు. కరెంట్ యూనిట్కి రూ.2 సబ్సిడీ ఇచ్చి రైతులకు సీఎం చేయుతని చ్చారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదని, చిన్న పరిశ్రమలు గ్రామస్థాయిలో పెట్టిం చడం ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని ఈటల అన్నారు. ఐటీ, పరిశ్రమల ద్వారా కేవలం 2–3 శాతం మాత్రమే ఉపాధి లభిస్తుందని, కోళ్ల పరిశ్రమ ద్వారా 1–2 శాతం ఉపాధి లభి స్తుందని చెప్పారు. గుడ్డు ధర పెరిగిందని, సామాన్యుడికి దూరమైందని అంటున్నారే కానీ.. ఈ పరిశ్రమతో అనుబంధం ఉన్న వారి సాధక బాధకాలు కూడా తెలుసు కోవాలని వ్యాఖ్యానించారు. గుడ్డు సాధా రణ ధర 2016–17లో రూ.3.43 ఉంటే, 2017–18లో రూ.3.23 ఉందని చెప్పారు. ఓ చాయ్ రూ.10, ఓ గుట్కా, ఓ సిగరెట్ రూ.10 ఉన్నాయని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమ కోసం పెడుతున్న పెట్టుబడి, మానవ వనరులు, దాణా, మందుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందో గుడ్డు ధర ఆ స్థాయిలో పెరగలేదని, కాబట్టి దీనికి ప్రభు త్వాల మద్దతు అవసరమని చెప్పారు. ఈ ప్రదర్శనలో 40 దేశాలకు చెందిన కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 305 స్టాళ్లు ఏర్పాటు చేశారని కోళ్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. సేవ పోల్చమ్ లిమిటెడ్ కంపెనీ ‘ట్రాన్స్మూన్ ఐబీడీ’, ‘వెక్టార్మూన్ ఎన్డీ’ వ్యాక్సిన్లను ఆవిష్క రించింది. కార్యక్రమంలో పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంకల్పం గొప్పది
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఒక్కరికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం గొప్పదని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి మెగ్వెల్ అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. హైదరాబాద్లో గురువారం ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ‘తాగునీటి పథకాల నిర్వహణ’పై వర్క్షాప్ జరిగింది. పాత ఆదిలాబాద్, మహబూబ్ న గర్, కరీంనగర్ జిల్లాల్లో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన తాగునీటి పథకాల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల, పెద్దపల్లిలోని తాగునీటి పథకాలను పరిశీలించామని, పనులు బాగా చేశారని మెగ్వెల్ ప్రశంసించారు. మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెండింగ్లోని తాగునీటి పథకాలపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేశామన్నారు. ప్రతీ ఇంటికి నీటిని అందించాలన్న కేసీఆర్ ఆశయం మేరకు మిషన్ భగీరథ చేపట్టామన్నారు. మిషన్ భగీరథపై పవర్ పాయింట్, వీడియో ప్రజెంటేషన్ ఇచ్చా రు. పథకం నిర్వహణలో తలెత్తే సమస్యల పరిష్కారానికి తమ సహకారం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ మరో ప్రతినిధి రాఘవ తెలిపారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములు నాయక్, చీఫ్ ఇంజనీర్ విజయపాల్రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్తో భేటీ అయ్యారు. తెలంగాణ తాగునీటి పథకాలకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంపై ఎస్పీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. -
రక్షిత నీరందించే తొలి రాష్ట్రం తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ నల్లాతో రక్షిత మంచినీటిని అందించే తొలి రాష్ట్రం తెలంగాణే అవుతుందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి ఎస్.ఎస్ అహ్లూవాలియా అన్నారు. 2022 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అయితే అంతకంటే ముందే తెలంగాణ ఆ ఘనతను సాధించడం అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ పనులను పరిశీలించడానికి బుధవారం రాష్ట్రానికి వచ్చిన అహ్లూవాలియా ముందుగా మిషన్ భగీరథ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ హెడ్వర్క్స్ను సందర్శించారు. ఆ రెండు చోట్ల కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథపై తెలంగాణ ఎంపీలు తనకు తరచూ సమాచారం అందిస్తుంటారని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా తనకు భగీరథ స్వరూపం, లక్ష్యాలపై పూర్తి అవగాహన కలిగిందన్నారు. అపరిశుభ్ర తాగునీరు, పరిసరాలతో దేశంలో ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, అధికారుల పట్టుదలతో ఈ డిసెంబర్ చివరినాటికి అన్ని ఆవాసాలకు నీళ్లు అందుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే ప్రతిఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాన్ని నెరవేర్చే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందన్నారు. కేసీఆర్ను కేంద్రమంత్రులంతా డైనమిక్ సీఎం అంటూంటారని, మిషన్ భగీరథతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఆ మాట నిజమనే అంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న విధానాల నుంచి ఎంతో కొంత నేర్చుకునే తాను తిరిగి ఢిల్లీ వెళతానన్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటిశుద్ధి కేంద్రాల్లో జరిగే వృథాను అరికట్టడం కూడా ముఖ్యమన్నారు. మిషన్ భగీరథలో దీని గురించి ఏమైనా ఆలోచించారా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈఎన్సీ సురేందర్ రెడ్డి భగీరథలో తాము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వృథాను రెండు మూడు శాతానికే పరిమితం చేశామన్నారు. ఇక ఫ్లో కంట్రోల్ వాల్వ్లతో సమానమైన ప్రెజర్తో అందరికి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ రెండు అంశాలను అహ్లూవాలియా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సురేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ముందు భగీరథ.. తర్వాత యాసంగి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలో మిషన్ భగీరథ అవసరాలకు పోగా మిగతా నీటిని యాసంగి పంటలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, ఎల్ఎండీ, సింగూరులో తాగునీటి అవసరాల మేర పక్కనపెట్టి మిగతా నీటిని పంటలకు మళ్లించడానికి అంగీకరించారు. లభ్యతగా ఉన్న నీటితో ఆయా ప్రాజెక్టుల కింది ఆయకట్టుతోపాటు ఘనపూర్ ఆనికట్, గుత్ప, అలీ సాగర్, లక్ష్మికెనాల్ కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ నీటితో రెండో పంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు మళ్లించాలని ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, చీఫ్ విప్లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బి.వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకు నీరందేలా.. నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు, తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. వీలైనంత మేరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల వెంట పడి పనులు చేయించుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరందేలా ఏర్పాటు జరగాలని స్పష్టం చేశారు. రామగుండం ప్రాంతంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని సూచించారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎస్సారెస్పీ కాల్వల సామర్థ్యం పెంచాలని, అన్ని రకాల కాల్వలకు మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. కాల్వలు సిద్ధం చేయండి.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునేలా కాల్వలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున ఈ లోపుగానే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులే ఈ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యారేజీ నిర్మిస్తున్నామని, అక్కడ 1,700 టీఎంసీల సగటు నీటి లభ్యత ఉందని చెప్పారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు చిన్న నీటి వనరుల్లో 265 టీఎంసీల వాటా ఉందని 1974లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు ధ్వంసం కావడంతో అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పూర్తి నీటి లభ్యత ఉంటుందని, అన్ని చెరువులు నింపుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. -
రెండు దసరాలు పాయె..‘డబుల్’ ఇళ్లు పూర్తి కాలేదాయె..
-
రెండు దసరాలు పాయె..
సాక్షి, హైదరాబాద్: రెండు దసరా పండుగలు దాటినా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో గృహ ప్రవేశాల బాజాలు మోగడం లేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సహా ఇతర పథకాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నా.. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేదు. ఇసుకను ఉచి తంగా.. సిమెంటు, స్టీల్ను తక్కువ ధరలకే ప్రభుత్వం ఇస్తున్నా ముందుకు రావట్లేదు. యూనిట్ కాస్ట్– నిర్మాణ వ్యయం మధ్య పెద్దగా తేడా లేక పనులు గిట్టుబాటు కావని వెనుకంజ వేస్తుండటంతో డబుల్ బెడ్రూం పనులు శంకుస్థాపన దశలోనే ఉన్నాయి. 2015లో అన్ని జిల్లాల్లో ఒకేసారి.. 2015 దసరా నాడు అన్ని జిల్లాల్లో ఒకేసారి డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల యినా 18 జిల్లాల్లో ఇప్పటికీ ఒక్క ఇంటి గృహ ప్రవే శం జరగలేదు. కొందరు మంత్రులు కాంట్రాక్టర్లతో సమావేశమై వారిని ఒప్పించేందుకు చేస్తున్న యత్నా లు ఫలిస్తుండటంతో ఆ జిల్లాల్లో పనులు జరుగు తున్నాయి. మిగతా చోట్ల మాత్రం ఎక్కడ వేసిన గొం గళి అక్కడే అన్న చందంగా ఉంది. ‘డబుల్’ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ తాజాగా సీఎం కేసీఆర్కు నివేదిక అందజేసింది. మెరుగైన పనితీరు, సాధారణ పురోగతి, తక్కువ పురోగతి కేటగిరీలుగా జిల్లాలను విభజించి నివేదిక రూపొందించింది. అనుమతులు ఇచ్చిన, టెండర్లు ఫైనల్ చేసిన ఇళ్ల సంఖ్యను ప్రాతిపదికగా చేసుకుని పనితీరును మదించింది. జీహెచ్ఎంసీలో 40,362 ఇళ్ల పనులు మొదలు తాజా నివేదికలో సిద్దిపేట జిల్లా తొలి స్థానంలో, జీహెచ్ఎంసీ రెండో స్థానంలో ఉన్నాయి. సిద్దిపేటకు ప్రభుత్వం 11,960 ఇళ్లు కేటాయించగా.. 10,647 ఇళ్లకు అనుమతులిచ్చింది. వీటిలో 9,330 ఇళ్లకు గానూ 9,035 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇందు లో 8,137 ఇళ్ల పనులు మొదలయ్యాయి. జీహెచ్ ఎంసీలో లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు పరిపాలన అనుమతులిస్తే.. 69,564 ఇళ్లకు టెండర్లు ఖరారవగా, 40,362 ఇళ్ల పనులు మొదలయ్యాయి. తర్వాతి స్థానాల్లో కరీంనగర్, కామారెడ్డి జిల్లాలున్నాయి. సగం కంటే ఎక్కువ జిల్లాల్లో సున్నా.. టెండర్లు ఖరారు కావటమే పనితీరుకు గీటురాయిగా భావిస్తూ జాబితా రూపొందించిన అధికారులు.. 18 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా సిద్ధమవని విషయం విస్మరించారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని పేర్కొన్న అధికారులు.. టెండర్లు ఖరారైన ఇళ్ల సంఖ్య మెరుగ్గా ఉందని మెరుగైన పనితీరున్న జిల్లాల జాబితాలో చూపారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్ అర్బన్, మెదక్, మహబూ బాబాద్, సంగారెడ్డి, జనగామ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, నాగర్ కర్నూలు, వనపర్తి, నిర్మల్, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క ఇల్లూ సిద్ధం కాలేదన్నారు. వచ్చే దసరాకైనా.. కొత్తగా శంకుస్థాపన చేసిన కలెక్టరేట్ భవనాలు వచ్చే దసరా లోపు పూర్తవుతాయని అధికారులు గట్టిగా చెబుతున్నారు. కానీ.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో మాత్రం వారి నుంచి ఆ భరోసా రావటం లేదు. ఇళ్లకు శంకుస్థాపనల తర్వాత ఇప్పటికే రెండు దసరాలు వెళ్లిపోయాయి. కనీసం వచ్చే దసరా నాటికైనా సింహభాగం ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు చెప్పలేకపోతున్నారు. సీఎం దత్తత గ్రామాల్లో సిద్ధం.. గజ్వేల్ నియోజకవర్గంలో.. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఇప్పటికే పూర్తి ఇళ్లను సిద్ధం చేయటం, సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ చొరవ తీసుకోవడంతో పనులు మెరుగ్గా జరుగుతున్నాయి. దుబ్బాక పనితీరులో ముందంజలో ఉంది. జీహెచ్ఎంసీలోనూ మంచి స్పందన వస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లలో జోగుళాంబ గద్వాల జిల్లా వెనుకబడి ఉంది. జిల్లాకు 2,800 ఇళ్లు మంజూరైతే 600 ఇళ్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో అన్ని ఇళ్లకు టెండర్లు పిలిస్తే 40కి మాత్రమే ఖరారయ్యాయి. అందులోనూ 20 ఇళ్ల పనులే మొదలయ్యాయి. కుమురం భీం, వికారాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, వనపర్తి, జగిత్యాల, నాగర్కర్నూల్ జిల్లాలు చివరి కేటగిరీలో నిలిచాయి. ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లు : 2,68,245 పరిపాలన అనుమతులు జారీ అయినవి : 2,06,518 టెండర్లు పిలిచినవి: 1,78,913 ఖరారైనవి : 1,19,422 పనులు మొదలైనవి: 68,564 పూర్తయినవి: 2,771 విడుదల / వ్యయం అయిన నిధులు : రూ.529 కోట్లు -
మిషన్ భగీరథకు నీళ్లు కష్టమే!
► సాగర్లోకి నీరు రాకుంటే జనవరి నుంచి నీటి సరఫరాకు తంటాలు ► భగీరథ, ఇతర తాగునీటి అవసరాలకు 59 టీఎంసీలు అవసరం సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా వచ్చే జనవరి 1న రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకూ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు ల్లో నీటి కొరత పెద్ద అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కోటి మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చే నాగార్జున సాగర్లో నీటి మట్టాలు పడిపోవ డం, ఎగువ నుంచి దిగువకు నీటి విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధత రాష్ట్రాన్ని కలవరపె డుతోంది. శ్రీశైలానికి వచ్చిన నీటిని వచ్చినట్లు గా వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రూపొందిస్తుండటం, రాష్ట్ర తాగునీటి అవసరాలను సమస్యల్లోకి నెడుతోంది. భగీరథకు ఏటా 16 టీఎంసీ.. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి పది శాతం నీటిని రిజర్వాయర్ల నుంచి తీసుకోవాలని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి వచ్చే జనవరికే 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క సాగర్ పరిధిలోని అక్కంపల్లి, ఉదయ సము ద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారానే సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం సాగర్లో నీటి కొరత దృష్ట్యా ఈ నీటిని సరఫరా చేయడం గగనంగా మారిపోయింది. సాగర్ వాస్తవ నీటిమట్టం 590 అడుగులు కాగా.. కనీస నీటిమట్టం 510 అడుగులు. ఎనిమిది నెలలుగా కనీస నీటి మట్టానికి దిగువకు వెళ్లి నీటిని తోడేస్తుండ టంతో ప్రస్తుతం సాగర్లో 500.90 అడుగుల మట్టానికి నిల్వలు పడిపోయాయి. ఎగువ నుంచి రావడం కష్టమే.. సాగర్ ఆశలన్నీ ఎగువ శ్రీశైలం పైనే ఉన్నా యి. ప్రస్తుతం శ్రీశైలానికి భారీ ప్రవాహాలు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు 215 టీఎంసీలకుగానూ 90 టీఎంసీలకు చేరాయి. మరో 125 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకుగానూ 854 అడుగులకు చేరడం తో ఏపీ తన అవసరాలకు నీటి విడుదలపై దృష్టి పెట్దింది. ఇప్పటికే ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకుంటున్న ఏపీ.. అదనంగా హం ద్రీనీవా, పోతిరెడ్డిపాడులకు చెరో 5 టీఎంసీ చొప్పున 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద మరో 7 టీఎంసీలు కావాలని బోర్డుకు లేఖ రాసింది. ప్రస్తుతం శ్రీశైలంలోకి నీటి ప్రవాహం ఉన్న దృష్ట్యా బోర్డు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. శ్రీశైలానికి వచ్చి న నీటిని ఎగువే వాడేస్తుంటే దిగువ సాగర్కు నీరు రావడం సమస్యగా మారనుంది. 55 టీఎంసీలు అవసరమంటున్న రాష్ట్రం.. తెలంగాణ తాగునీటి అవసరాలు, సాగర్లో గతంలో కనీస నీటిమట్టానికి దిగువకు వెళ్లి చేసిన నీటి వినియోగాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలోని పవర్హౌస్ ద్వారా సాగర్ కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాల ని తెలంగాణ కృష్ణా బోర్డుకు సోమవారం లేఖ రాసింది. ప్రస్తుతం శ్రీశైలానికి ఎగువ జూరాల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొన సాగుతుండటం, ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు చేరినందున, సాగర్లో పూర్తిగా పడిపోయిన నిల్వలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటే జనవరి నుంచి ఉండే మిషన్ భగీరథ అవసరాలకు 16 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో 16, నల్ల గొండ, ఖమ్మం అవసరాలకు 4, కల్వకుర్తి కింది అవసరాలకు 4 టీఎంసీ కలిపి మొత్తం గా 55 టీఎంసీలు కావాలని బోర్డుకు లేఖ రాసింది. అయితే ఈ అవసరాలకు బోర్డు ఓకే చెబుతుందా? బోర్డు ఓకే అన్నా ఏపీ అభ్యంతరం పెట్టకుండా ఊరుకుంటుం దా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై చర్చించేందుకు త్వరలోనే బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. -
మంచినీళ్లకే ప్రాధాన్యం
- అందుకు తగ్గట్టుగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటిమట్టాలుంచాలి: సీఎం కేసీఆర్ - గ్రామాలకు నీళ్లివ్వడం మొదలుపెట్టాక ఆపొద్దు - ప్రాజెక్టుల వారీగా చార్టులు తయారు చేయాలి - ఈ ఏడాది చివరి వరకు గ్రామాలకు నీళ్లందించాలి - ‘మిషన్ భగీరథ’పై అధికారులకు దిశానిర్దేశం - మూడో విడత హరితహారంపై సమీక్ష.. వికారాబాద్ అడవుల్లో ఔషధ మొక్కలు పెంచాలని సూచన సాక్షి, హైదరాబాద్ నదీ జలాల వినియోగంలో మంచినీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఇందుకు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగ మట్టాలను (మినిమమ్ డ్రా డౌన్ లెవల్స్–ఎండీడీఎల్) పాటించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథకు నీటి అవసరాలపై సోమవారం ప్రగతిభవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, మిషన్ భగీరథ ఈఎన్సీ సురేందర్ రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈ జగన్మోహన్రెడ్డి, సీఎంవో అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంటికి ప్రతిరోజూ నిరంతరాయంగా మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ అనే బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. ఒకసారి మంచినీరు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత ఒక్కరోజు కూడా సరఫరా ఆపలేం. ఆపవద్దు కూడా. అందుకు నదీ జలాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ నిర్వహించాలి. ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే సరిపోదు. అవసరమైనప్పుడు ఆ నీటిని విడుదల చేసుకోవడానికి అనువుగా ఉండేలా నీటిని నిల్వ ఉంచుకోవాలి. అప్పుడే అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసుకుని మంచినీటి కొరత లేకుండా చూడగలం. మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను మనం రిసోర్స్లుగా పెట్టుకున్నాం. ఏ రిసోర్స్ వద్ద ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేసి, అందుకు 25 శాతం అదనంగానే నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా చార్ట్ రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలి. అందుకు అగుణంగానే ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలి. నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలి’’అని చెప్పారు. ‘‘ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. వీటిలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేస్తున్నాం. కాబట్టి ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణ హక్కు. కాళేశ్వరంతోపాటు ఇతర కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ లాంటి వనరులున్నాయి. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ నీటిని అందించడానికి ప్రస్తుత వనరులనే వాడాలి. వాటి నుంచే నీటిని అందించాలి. ఇందుకోసం మొదటి దశ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలి. అందుకు మొదటి దశ ప్రణాళికను అమలు చేయాలి. నీటి పారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలి’’అని సీఎం ఆదేశించారు. వికారాబాద్ను మరో ఊటీ చేయాలి అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ అడవుల్లో ఎంపిక చేసిన ఔషధ మొక్కలు పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. మూడో విడత హరితహారం కార్యక్రమంపై ఆయన సీఎంవో అధికారులతో సమీక్షించారు. నిజాం కాలంలో వికారాబాద్ ప్రాంతంలో సహజమైన ఔషధ మొక్కలతో కూడిన అడవి ఉండేదని, అందుకే అక్కడ టీబీ హాస్పిటల్ కూడా పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే వికారాబాద్ ప్రాంతాన్ని మరో ఊటీ మాదిరిగా తీర్చిదిద్దగల అవకాశాలున్నాయన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 29 కోట్ల మొక్కలు నాటామని అధికారులు చెప్పారు. మరో పదికోట్ల మొక్కలను ఈ నెలాఖరులోగా నాటాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ చుట్టూ మొక్కల పెంపకం జోరందుకోవాలని సూచించారు. సంచార పశు వైద్యశాలలు సిద్ధం కావాలి.. రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు వైద్యశాలలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన గొర్రెలతో పాటు ఇతర పశువులకు కూడా ఎక్కడికక్కడే వైద్యం అందించడానికి ఈ సంచార పశు వైద్యశాలలను ఉపయోగించాలని చెప్పారు. 18 నుంచి బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేదలందరికీ చీరలు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే సగానికిపైగా చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో మిగతావి చేరుతాయని అధికారులు చెప్పారు. జిల్లాలకు చేరిన చీరలను గ్రామాలకు చేర్చాలని, 18వ తేదీ నుంచి మూడ్రోజులపాటు పంపిణీ చేయాలని కలెక్టర్లను కోరారు. చుక్క కూడా వదులుకోమని చెప్పండి – నదుల అనుసంధానంపై మంత్రి హరీశ్కు కేసీఆర్ సూచన మహానది–గోదావరి నదుల అనుసంధానంలో తమకు నష్టం జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని కేంద్ర జల వనరుల శాఖకు కచ్చితంగా చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్రానికి ఉన్న నికర జలాల కేటాయింపుల్లో చుక్క నీటిని వదులుకోమని స్పష్టం చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న నదుల అనుసంధాన సమావేశానికి హాజరుకానున్న మంత్రి హరీశ్రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సోమవారం సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లుగా తెలిసింది. ‘‘మహానది విషయంలో తమ దగ్గర మిగులు జలాలు లేవని ఒడిశా చెప్పింది. వారిని ఒప్పించే ప్రయత్నాల్లో కేంద్రం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపింది. మహానది నుంచి 230 టీఎంసీలు గోదావరికి వస్తాయి. అవి ధవళేశ్వరం వద్ద కలుస్తాయి. అయితే వచ్చే నీళ్ల కంటే పోయే నీళ్లు ఎక్కువగా ఉంటాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ వద్దంది. కానీ ఇప్పుడు విడిపోయాక స్వాగతిస్తోంది. తెలంగాణకు గోదావరిలో మిగులు జలాలు లేవు. కేంద్రం వద్ద ఉన్న లెక్కలు ఎప్పుడో 20, 30 ఏళ్ల కిందటివి. అప్పుడు తెలంగాణ కట్టిన ప్రాజెక్టులే లేవు. ఇప్పుడు తుపాకులగూడెం, కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టులన్నీ కడుతున్నాం. అప్పుడు నీళ్ల లభ్యత ఉన్నందున మిగులు అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులు మొదలుపెట్టినందున బచావత్ కేటాయింపులను ఒక చుక్క కూడా వదులుకునేది లేదు. పాత లెక్క ప్రకారం 1,440 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని అవార్డు ఇచ్చింది. ఏపీకి సుమారు 500 టీఎంసీలు, తెలంగాణకు 954 టీఎంసీలు వస్తాయి. మన 954 టీఎంసీల వినియోగానికి తగ్గట్లు ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఆ నీళ్లలో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదు. ఇదే విషయాన్ని కేంద్రం వద్ద చెప్పండి’అని సీఎం చెప్పినట్లుగా నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
భగీరథ జ(ఫ)లాలు
వచ్చేస్తున్నాయ్.. ఇంటింటికీ నీళ్లు.. ♦ మిషన్ భగీరథ పనుల్లో జనగామ జిల్లా ఫస్ట్ ♦ వందశాతం పురోగతితో రాష్ట్రంలో తొలిస్థానం ♦ తరువాతి స్థానాల్లో మేడ్చల్, వనపర్తి, సిద్దిపేట ♦ చివరి స్థానంలో నిలిచిన కొమురంభీం జిల్లా ♦ తొలి విడతలో మరో 12 జిల్లాలపై ఫోకస్ ♦ డిసెంబర్ చివరి నాటికి పనుల పూర్తే లక్ష్యం జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : ప్రతి జనావాసానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిం చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఫలాలు ప్రజలకు అంద బోతున్నాయి. మిషన్ భగీరథ పనుల పురోగతిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైద రాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో భగీరథ పను లను చేపట్టారు. ఇందులో జనగామ ప్రజలకు తొలి ఫలితాలు అందుతుండగా తరువాత సిద్దిపేట జిల్లాకు చేరుతున్నాయి. పైపులైన్ నిర్మాణంతోపాటు ట్యాంకు ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ల పనుల తదితర అంశాల్లో జనగామ మొదటి స్థానంలో ఉంది. 12 జిల్లాలపై ఫోకస్.. భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసం తొలి విడతలో 12 జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తొలి విడతలో జనగామ, సంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కామారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ జిల్లాల్లో 60 శాతం వరకు పనులు కావడంతో మిగిలిన పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు కంటే ముందే నీళ్లు.. గడువు కంటే ముందే భగీరథ జలాలు ఇంటింటికీ వస్తున్నాయి. మూడు నెలల ముందుగానే జనగామలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట, మేడ్చల్, వనపర్తి జిల్లాల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. జనగామలో 704 ఆవాసాలకు తాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 704 గ్రామాల్లో ట్రయల్ రన్ పనులను నిర్వహించారు. ఇందులో 684 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తు న్నారు. స్టేషన్ ఘన్పూర్లో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనుల కారణంగా 20 గ్రామాలకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు మూడు గంటల పాటు నీటి సరఫరా.. మిషన్ భగీరథ ద్వారా ట్రయల్రన్ చేస్తున్న గ్రామాల్లో రోజుకు మూడు గంటల చొప్పున నీటిని పంపింగ్ చేస్తున్నారు. పంప్ హౌస్ల నుంచి నేరుగా గ్రామాలకు నీటిని తరలిస్తు న్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విడతల వారీగా నీటిని వదులుతున్నారు. కరెంటుతో సంబంధం లేకుండా పంప్హౌస్ల నుంచి నీటిని వదులుతున్నారు. గతంలో కరెంటు ఉంటేనే మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని వదిలి పెట్టేవారు. కానీ ఇప్పుడు పంప్హౌస్ల నుంచే నీటిని గ్రామాలకు అందిస్తున్నారు. ట్రయల్ రన్ చేస్తున్న గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బాధ తప్పినట్టయింది. విద్యుత్ బిల్లులు ఆదా.. జనగామ మున్సిపాలిటీకి తాగునీటిని అందించడం కోసం నెలకు రూ.8 లక్షల మేర కరెంటు చార్జీల రూపంలో బిల్లు వస్తుండేది. కానీ రెండు నెలల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండానే భగీరథ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తుండడం విశేషం. మిషన్ భగీరథ పథక వ్యయం రూ.45,000 కోట్లు ఇప్పటికి వరకు పథకం పూర్తి అయినది 65% . తాగునీరు అందనున్న ఆవాసాలు 24,215 రూ.35,000 కోట్లు మెయిన్ గ్రిడ్ వ్యయం 39,509 కి.మీ ఇంట్రా విలేజ్ పైపులైన్ 95,000 కి.మీ మెయిన్ గ్రిడ్ పైపులైన్ ఇంట్రా విలేజ్ వ్యయం రూ.10,000 కోట్లు -
పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్
-
పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్
- ‘భగీరథ’ పైప్లైన్లతో పాటే ఆప్టిక్ ఫైబర్: కేటీఆర్ - ఇంటింటికీ ఇంటర్నెట్తో విప్లవాత్మక మార్పులు - నిర్ణీత సమయానికే మిషన్ భగీరథ పూర్తి - వారానికోసారి అర్బన్ భగీరథపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామని ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వాటర్ పైప్లైన్తో పాటు ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్తో పాటు, వాటర్ వర్క్స్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనుల్లో ప్రతి పైప్ లైన్ వెంట ఇంటర్నెట్ లైన్లు వేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక అంచనాలు సిద్ధం చేయాలన్నారు. టీ–ఫైబర్ ద్వారా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులొస్తాయని వివరించారు. మిషన్ భగీరథ, టీ–ఫైబర్ పనులపై శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ (పబ్లిక్ హెల్త్) అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో భాగంగా కార్పొరేషన్లలో పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు నగరాలకు ప్రత్యేకంగా నిధులూ ఇచ్చామని పేర్కొన్నారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటు టీ–ఫైబర్ ప్రాజెక్టు సమన్వయం చేసుకునేందుకు ఐటీ, మున్సిపల్ శాఖలు కలసి పనిచేయాలన్నారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డక్ట్ వ్యయం ప్రభుత్వానిదే.. గతంలో వేసిన పైపులైన్లు తవ్వాల్సిన అవసరం లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆప్టిక్ ఫైబర్ లైన్ వేయాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. పైప్లైన్ నెట్వర్క్తో పాటు, ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ మ్యాపుల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల న్నారు. ఇప్పటికే రూరల్ మిషన్ భగీరథలో డక్ట్ వేయడానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గద ర్శకాలను పాటించాలని ఏజెన్సీలను కోరారు. పైప్లైన్లతో పాటు డక్ట్ వేసేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఈ మేరకు లిఖితపూర్వకంగా ఈఎన్సీ (పీహెచ్) ఆదేశాలు జారీ చేస్తారన్నారు. అర్బన్ భగీరథ కోసం మున్సిపల్ శాఖ సన్నద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం నిర్మాణాలు, ప్రణాళిక రూపకల్పన, నిధుల సమీకరణ అంశాల వివరాలను మంత్రికి అధికారులు అందజేశారు. ప్రాజెక్టు కోసం టెండర్లు పూర్తయ్యాయని, పలు చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తే వచ్చే వేసవికి పట్టణ, నగర ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని, ఇందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు పనిచేయాలని మంత్రి చెప్పారు. వారానికోసారి అర్బన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
మిషన్ భగీరథపై బేస్ లైన్ సర్వే
- 200 మంది విద్యార్థులు, పరిశోధకులతో నిర్వహణ - 12 వేల ఇళ్లకు వెళ్లి అభిప్రాయసేకరణ - సామాజిక, ఆర్థిక మార్పులపై పరిశీలన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ వల్ల కలిగే సామాజిక, ఆర్థిక మార్పులపై వివిధ కళాశాలల విద్యార్థులు బేస్ లైన్ సర్వే చేశారు. తాగునీటి సరఫరాతో పాటు గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లోని పారిశుధ్య పరిస్థితులు, పరిశ్రమలకు అందుబాటులో ఉన్న నీటి వనరుల స్థితిపై కూడా ఈ సర్వే నిర్వహించారు. యూనిసెఫ్–సెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు, పరిశోధకులు నిర్వహించారు. ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు సర్వే చేశారు.1,424 గ్రామాలతో పాటు వివిధ నగర పంచాయతీలకు చెందిన 76 వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రతీ గ్రామంలోని 8 ఇళ్ల చొప్పున మొత్తంగా 12 వేల ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) చరిత్రలోనే ఇది అతి పెద్ద సర్వే అని నిర్వాహకులు తెలిపారు. సర్వేలోని సమాచారాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు విశ్లేషణ చేస్తారు. ముసాయిదా నివేదికను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తిచేస్తారు. తుది నివేదికను నవంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ మధ్య తయారు చేస్తారు. బేస్లైన్ సర్వే తర్వాత మిడ్ టర్మ్ సర్వే నిర్వహిస్తారు. చివరగా ఫైనల్ సర్వే జరుగుతుంది. కాగా, ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సర్వే ఫలితాలను విశ్లేషించి మధ్యంతర నివేదికలను యునిసెఫ్–సెస్ తయారు చేస్తుంది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఉన్నతస్థాయి కమిటీ ఈ నివేదికలను విశ్లేషించి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ఆవాసాలకు సంబంధించి ప్రత్యేక సర్వే ఫలితాన్ని విడుదల చేస్తారు. నివేదిక స్వరూపంపై సలహా కమిటీ భేటీ సురక్షిత మంచినీటి సరఫరాతో పాటు సురక్షిత నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ అభిప్రాయపడింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో మరింత ప్రభావవంతంగా తాగునీటిని సరఫరా చేయడానికి బేస్ లైన్ సర్వే నివేదిక ఉపయోగపడుతుందని కమిటీ పేర్కొంది. మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. బేస్ లైన్ సర్వే ముగియడంతో నివేదిక స్వరూపం, ఏయే అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయాలపై చర్చించారు. ప్రస్తుతమున్న తాగునీటి వనరులు, వినియోగం, నాణ్యతతో పాటు నీటి సంబంధిత వ్యాధుల విషయాలను నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నీటి కొరతతో మహిళలు, విద్యార్థినులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు యునిసెఫ్ రూపొందించిన ‘సుస్థిర అభివృద్ధి’ లక్ష్యాలను ఈ నివేదికలో పొందుపరచనున్నారు. ఈ సమావేశంలో సెస్ డైరెక్టర్, సర్వే సమన్వయకర్త డాక్టర్ గాలెబ్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, కన్సల్టెంట్ నందారావు, సెస్ ప్రొఫెసర్ రేవతి, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
-
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర కానుకగా వచ్చే జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అం దించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అందుకోసం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఇంటేక్ వెల్స్ నుంచి నీటిని తీసుకుని.. ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా మంచినీటిని పంపింగ్ చేయాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయిం బవళ్లు పనిచేసి అయినా లక్ష్యాన్ని చేరుకోవా లని సూచించారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిషన్ భగీరథపై గురువారం ప్రగతి భవన్లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇది జీవన్మరణ సమస్య మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. అనుకున్న సమయంలో ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించటం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందిం చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాలు చేసి మరీ మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎవరూ తీసుకోని సవాల్ స్వీకరించా మని.. దానికి తగినట్లు పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. రూ.43 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని ఇకపై స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షిం చాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం 19 ఇంటెక్వెల్స్లో ఇప్పటికే 16 పూర్త య్యాయని, మిగతావి త్వరలోనే పూర్తవుతా యని అధికారులు వివరించారు. 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 27 పూర్తికావచ్చాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 49,238 కి.మీ.కు గాను 43,427 కి.మీ. (88 శాతం) పైపులైన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు. ముప్పై ఏళ్ల ముందస్తు ప్లాన్ ఇది.. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ రూపొందించామని.. అప్పటికి ప్రజలకు సరిపడే నీటిని అందించేలా ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరోసారి మదింపు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని... ప్రతి జిల్లాలో మం త్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యే నాటికే వాటికి కావలసిన విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల నిర్మాణం జరగాలన్నారు. ఆ పనుల పర్య వేక్షణకు ట్రాన్స్కో, డిస్కంల నుంచి ముగ్గురు అధికారులను నియమించాలని సూచించారు. తాగునీటికి ప్రాధాన్యం జలాశయాల నీటిని వాడుకునే విషయంలో మంచినీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు కేటాయిస్తామని.. అందుకు చట్టం కూడా తెచ్చామని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని తీసుకోగల కనీస మట్టం (ఎండీడీఎల్) ఉండేలా చూసుకోవాలని.. దీనిపై నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్ను మార్చాలని సూచించారు. రాష్ట్రంలో 19 ప్రాంతాల్లోని నీటి వనరుల్లో కేవలం దుమ్ముగూడెం వద్ద మాత్రమే 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని.. మిగతా 18 నీటి వనరులలో నిరంతరం నీరు అందుబాటులో ఉండేందుకు ఇది ఎండీడీఎల్ పాటించడం అవసరమని పేర్కొన్నారు. వర్కింగ్ ఏజెన్సీలకు గొప్ప అనుభవం పథకం వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించాలని... ఈ పథకం వర్కింగ్ ఏజెన్సీలకు కూడా ప్రతిష్టాత్మకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోందని, సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి 1.5 శాతం ఇన్సెంటివ్ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాప్యం చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీల నుంచి పనులను తప్పించడానికి ప్రభుత్వం వెనుకాడదని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. మూడు కీలక పథకాలూ విజయవంతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు మూడు అని.. ఒకటి నిరంతర విద్యుత్ సరఫరా, రెండోది రైతులకు సాగునీరు అందివ్వడం, మూడోది ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘‘విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించాం. 45 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే వంద శాతం పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. పనులు అనూహ్యంగా జరుగుతున్నాయి. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు సమకూరుస్తున్నాం. మొత్తం ఏడాదికి రూ.58 వేల కోట్ల వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుండే గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి.. అదే సమయంలో ఇంటింటికీ మంచినీరు అందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి జీఎస్టీ వల్ల తమపై అధిక భారం పడుతుందని సమీక్ష సందర్భంగా వర్కింగ్ ఏజెన్సీలు ప్రస్తావించాయి. పరికరాలు, మెటీరియల్ కొనుగోలు సందర్భంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందని.. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... ప్రజోపయోగ పనులపై జీఎస్టీ తగ్గించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమా వేశంలో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిం చకుంటే వర్కింగ్ ఏజెన్సీలకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఇంటింటికీ సురక్షిత నీరు
త్వరలోనే అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ ఫలాలు ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు ఔటర్ లోపల ఉన్న 190 గ్రామాల ప్రజలకు లబ్ధి మూడేళ్లు వర్షాలు పడకున్నా ఎలాంటి ఇబ్బందీ లేదు కోటి ఎకరాల మాగాణమే కేసీఆర్ ధ్యేయం: కేటీఆర్ కొంపల్లిలో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ 1,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన హైదరాబాద్ ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథ అని, దీని ఫలాలు త్వరలోనే అన్ని గ్రామాలకూ అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మిషన్ భగీరథ పూర్తయితే మూడేళ్ల పాటు వర్షాలు పడకపోయినా మంచినీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకు అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. కొంపల్లి గ్రామంలో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా రూ.628 కోట్లతో చేపట్టిన పైపులైన్ పనుల పైలాన్ను మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 మున్సిపాల్టీలు, 12 మండలాల్లో ఈ పనులు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 7 మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా అవుతుండగా మరో ఏడాదిలోపు నాలుగింతలు అదనంగా 30 మిలియన్ గ్యాలెన్ల నీటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు లభిస్తుందని, ఔటర్ గ్రామాల్లో ఉన్న 10 లక్షల జనాభాకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అదనంగా మరో 1.50 లక్షల కొత్త నీటి కనెక్షన్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోటి వరకు జనాభా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, ఇది పూర్తయితే నగరం, శివారు ప్రాంతాలో నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. కోటి ఎకరాల మాగాణం.. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. అదే స్ఫూర్తితో నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు’’అని కేటీఆర్ చెప్పారు. గోదావరి నీటితో బీడు భూములకు నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, పరిశ్రమలు తరలిపోతాయని కొందరు దుష్ప్రచారం చేసి భయాలు, అనుమానాలు సృష్టించారని, సీఎం కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ నిరంతరం విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. దేశంలోనే నాణ్యమైన నీటిని సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ సిబ్బంది పనితీరు వల్ల ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించిందన్నారు. రూ.1,900 కోట్లతో శివారు ప్రాంతాలకు తాగు నీరు అందించేందుకు 57 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పటి వరకు 30 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్, పలువురు ఉన్నతాధికారులు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ‘డబుల్’ఇళ్లకు శంకుస్థాపన.. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.18 వేల కోట్లను దీనికి కేటాయించామని కేటీఆర్ చెప్పారు. డి.పోచంపల్లిలో 1,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 9,400 బెడ్రూమ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. గత పాలకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి.. కుటుంబాన్ని మొత్తం ఒకే గదిలో పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే ఇంటి నిర్మాణానికి రూ.8.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఇది బహిరంగ మార్కెట్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే షాపూర్నగర్లో రూ.6.5 కోట్లతో నిర్మించిన 6 ఎంఎల్ రిజర్వాయర్ను కేటీఆర్ ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో మరో ఐదు రిజర్వాయర్లు ప్రారంభిస్తామని చెప్పారు. -
అపోహలను పంటాపంచలు చేశాం: మంత్రి
కుత్బుల్లాపూర్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి ఏ మాట అయితే అన్నాడో.. నా తెలంగాణ కోటి రతనాల వీణతో పాటు కోటి ఎకరాల మాగాణి కూడా కావాలన్న బృహత్తర కార్యక్రమంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుకు సాగుతున్నారని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో కాలేశ్వరం నది నుంచి ప్రాణహిత గోదావరి నీటితో తెలంగాణలోని బీడు భూములను నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. కొంపల్లి గ్రామంలో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా రూ.628 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు మంచి నీటి పైపులైన్ పనుల పైలాన్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 160 కీలోమీటర్ల విస్తీర్ణంలో 7మున్సిపాలిటీలు, 12 మండలాల్లో ఈ పనులు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం 7 మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా అవుతుండగా మరో ఏడాదిలోపు నాలుగింతలు అదనంగా 30 మిలియన్ గ్యాలెన్ల నీటిని, ప్రతి ఇంటికి రోజుకు 135 లీటర్ల సురక్షిత నీటిని అందజేస్తామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, పరిశ్రమలు తరిలిపోతాయని కొందరు దుష్రచారం చేసి భయాలు, అనుమానాలు, అపోహలు సృష్టించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ నిరంతరం విద్యుత్ ఇస్తున్నారన్నారు. దేశంలోనే నాణ్యమైన నీటిని సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ సిబ్బందికి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. -
ఐదేళ్ల ‘అభివృద్ధి’కి మిగిలేవి మూడేళ్లే!
♦ పట్టణ ఆరోగ్యంపై సదస్సులో మంత్రి కేటీఆర్ ♦ పాలన అర్థం చేసుకునే లోపే తొలి ఏడాది గడిచిపోతుంది ♦ ఎన్నికల్లో గెలిచేందుకు చివరి ఏడాది పోతుంది ♦ ఈ మూడేళ్లలోనే ప్రభుత్వ శాఖలన్నీ కలసికట్టుగా పనిచేయాలి సాక్షి, హైదరాబాద్ : ‘‘ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. పరిపాలనను అర్థం చేసుకోవడంలోనే మొదటి ఏడాది గడిచిపోతుంది. మళ్లీ పోరాడి ఎన్నికలు గెలవడానికి చివరి ఏడాది పోతుం ది. మధ్యలో మిగిలిన మూడేళ్లలోనే అభివృద్ధి పనులు చేసుకోవాలి. ప్రభుత్వ శాఖలు ఎవరికి వారుగా కాకుండా సమన్వయంతో కలసికట్టుగా పని చేస్తేనే ఈ మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్లో త్వరలో 2 వేల కి.మీ మేర పైప్లైన్ నిర్మాణం కోసం రోడ్ల తవ్వకాలు జరపాల్సి ఉందని, తవ్విన రోడ్ల స్థానంలో వెంటనే మరమ్మతులు చేసే పనుల టెండర్లు పూర్తయిన తర్వాతే తవ్వకాలకు అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో నగరంలో రోడ్ల తవ్వకాలు ఇబ్బందికరంగా మారాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జాతీయ పట్టణ ఆరో గ్య పథకం (ఎన్హెచ్యూఎం) అమలుపై పురపాలికల అధికారులకు గురువారం నగరంలోని ఓ హోటల్లో జరిగి న అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, మరో 15, 20 ఏళ్లలో దేశంలోని అత్యధిక జనాభా పట్టణాల్లో ఉండనుందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు పట్టణాలకు తరలివస్తు న్నా రని, ఏ రకమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయో ఆలోచిం చాలని ఆయన అధికారులకు సూచించారు. మార్పు వెంటనే రాదు..: ‘వెంటనే మార్పు రాదు..సమయం పడుతుంది..మార్పు ప్రారంభమైందన్న విషయాన్ని గమనించాలి’అని మీడియాకు మంత్రి కేటీఆర్ సూచించారు. బంగారు తెలంగాణ నినాదంలో ఆరోగ్య తెలంగాణ అంతర్భాగమన్నారు. ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ మరో 18 నెలల్లో పూర్తి అవుతుందని, దీంతో ప్రజల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అన్నారు. గర్భిణి, శిశు మరణాల రేటును తగ్గించుకోవడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ కిట్ పేరుతో రూ.12 వేలు విలువ చేసే సరుకులను బాలింతలకు అందజేస్తుండడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగాయన్నారు. రాష్ట్ర పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని త్వరలో సిరిసిల్ల నుంచి శ్రీకారం చుట్టనున్నామన్నారు. ఆగస్టు 16న మహబూబ్నగర్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలను జీహెచ్ఎంసీకి అప్పగిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలు అందిస్తామని, ఈ విషయాన్ని పరిశీలించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, వైద్య శాఖ డైరెక్టర్ వాకాటి కరుణ, పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ ఘటననే రోజంతా చూపెట్టి ‘‘రాష్ట్రం అంతటా లక్షల మొక్కలు నాటే మంచి కార్యక్రమం జరుగుతుంటే, ఎక్కడో జరిగిన ఓ సంఘటనను దేశం అంతటా టీవీ చానళ్లు రోజంతా పదేపదే చూపించాయి. చెట్లు నాటే కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్రుడి మీద ఒక మచ్చ ఉంటే మొత్తం చంద్రుడికి మచ్చలున్నాయని అనడం సరికాదు’’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మీడియా చానళ్ల స్పందన పట్ల మంత్రి కేటీఆర్ పరోక్షంగా పై వ్యాఖ్యలు చేశారు. -
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన మంత్రి
మర్రిగూడ: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ పనులను మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మునుగోడ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డ ఉన్నారు. -
మిషన్ స్లో
► ముందుకు సాగని భగీరథ ఇంట్రావిలేజ్ పనులు ► ఓహెచ్ఎస్సార్ ట్యాంకుల నిర్మాణాలకు స్పందన సగమే ► 756లో 389 ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు ఫైనల్ ► మిగిలిన 50 శాతం ప్యాకేజీ పనులపై అధికారుల కుస్తీ ► మూడు మాసాల నుంచి కాంట్రాక్టర్ల కోసం గాలింపు ► బతిమిలాడి మరీ పనులకు ఒప్పిస్తున్న వైనం ► పైపులైన్ పనులకు ఇప్పుడి ప్పుడే సిద్ధమైన యంత్రాంగం నల్లగొండ : భగీరథుడు శ్రమిస్తే కానీ దివి నుంచి గంగమ్మ భువకి రాలేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం శరవేగంగా సాగాలంటే భగీరథుడి రూపంలో ఏదైనా శక్తి రావాల్సిందేనా.. అంటే అధికారుల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తోంది. మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన ప్రధాన పైపులైన్ పనులు వేగంగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. వాటికి అనుసంధానంగా గ్రామాల్లో చేయాల్సిన అంతర్గత పైపులైన్ పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. మూడు మాసాలు కావొస్తున్నా.. అంతర్గత పనులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించి మూడు మాసాలు కావొ స్తున్నా టెండర్ల ప్రక్రియ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. అదేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంతర్గత పనులు మొదలు పెట్టడంతో కాంట్రాక్టర్లు కరువయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రధాన పైపులైన్ ని ర్మాణాల ధరలకు, అంతర్గత పైపులైన్ నిర్మాణాల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 50 శాతం పనులకు మాత్రమే కాంట్రాక్టర్ల నుంచి స్పందన వచ్చింది. మిగతా 50 శాతం పనులకు కాంట్రాక్టర్లు దొరక్కపోవడంతో వారి కోసం పొరుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే 20 మంది కాంట్రాక్టర్లను పొరుగు రాష్ట్రం నుంచి రప్పించిన అధికారులు మిగతా 50 శాతం పనులకు ఎక్కడి నుంచి రప్పించాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇదీ పరిస్థితి.... మూడు జిల్లాల్లో అంతర్గత పనుల్లో భాగంగా ముందుగా గ్రామాల్లో ఓహెచ్ఎఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 2,424 ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. ఈ మొత్తం పనులను 756 ప్యాకేజీలుగా ఏప్రిల్లో టెండర్లు పిలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 800 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారు. కానీ, టెండర్ల దశకు వచ్చేనాటికి 389 మంది కాంట్రాక్టర్లు మాత్రమే పోటీలో నిలిచారు. దీంతో 389 ప్యాకేజీలకు టెండర్లు పూర్తి చేశారు. టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో నిర్మించాల్సిన ట్యాంకులు 1,263. కాగా మిగతా 367 ప్యాకేజీలకుగాను నిర్మించాల్సిన 1,161 ట్యాంకుల పైన సందిగ్ధత నెలకొంది. ప్రతి వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అధికారులకు సైతం ఏంచేయాలో పాలుపోవడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లను రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. ట్యాంకుల నిర్మాణాలకు వినియోగించే స్టీలు, ఇసుక అతి తక్కువ ధరలకే ఇప్పిస్తామని అధికారులు ప్రకటించారు కూడా. అయితే మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ ధరలకు అంతర్గత పనుల్లో లీటరు రేటు ప్రకారం ఖరారు చేసిన ట్యాంకుల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లోనే పోటీ.. టెండర్లు పూర్తయిన 389 ప్యాకేజీల్లో పనుల కోసం ఎక్కువ మంది పోటీ పడిన కాంట్రాక్టర్లు మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. అధికార పార్టీలో గ్రూపులు కూడా అందుకు ఒక కారణమని తెలుస్తోంది. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్యాంకులు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు అంత తేలిగ్గా ముందుకు రావడం లేదు. దీంతో అధికారులే పూనుకుని ఆయా నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లను బతిమాలడి మరీ పనులకు ఒప్పిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు లేని ప్రాంతాల్లో టెండర్లు ప్రక్రియ సాఫీగానే సాగుతోందని, కొన్ని చోట్ల మాత్రమే రాజకీయపరమైన ఒత్తిళ్లుతీవ్రంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. గడువు ఆరు మాసాలే.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భగీరథ పనులన్నీ పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మే రకు పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే డిసెంబర్ నాటికి 25 శాతం పనులు మాత్రమే పూర్తవుతాయని అంటున్నారు. ఈ మేరకు జిల్లాలో మిషన్ భగీరథ లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైపులైన్ పనులకు సన్నద్ధం.. ట్యాంకుల సమస్య పరిష్కారం కాకముందే పైపులైన్ పనులకు యంత్రాగం సన్నద్ధమవుతోంది. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 4,217 కి.మీ మేర పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో 2,700 కి.మీ మేర పైప్లైన్లు నిర్మించి 3.26 లక్షల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. అలాగే సూర్యాపేట జిల్లాలో 1,150 కి.మీ పైపులైన్ వేసి లక్షా 26 వేల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. యాదాద్రి జిల్లాలో 367 కి.మీ పైపులైన్ వేయడంతో పాటు లక్షా 14 వేల నల్లాలు ఏర్పాటు చేయాలి. వారం, పది రోజుల్లో పైపులు వస్తాయని అధికారులు అంటున్నా రు. అదే జరిగితే గ్రామాల్లో పైపులైన్లు వేసేందుకు తవ్వకం పనులు ప్రారంభిస్తారు. దీని కంటే ముందు పైప్లైన్ పనులను కూడా ప్యాకేజీలు మార్చి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన వారికే అప్పగిస్తారు. ఇదంతా జరిగేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. త్వరలో టెండర్లు పిలుస్తాం డిసెంబర్ నాటికి ఇంట్రావిలేజ్ పనులు పూర్తవుతాయి. 50 శాతం ప్యాకేజీల పనులకు కాంట్రాక్టర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. టెండర్ల దాఖలుకు ప్రతి వారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. ఏదేని సమస్య ఎదురైనట్లయితే ఇప్పుడున్న కాంట్రాక్టర్లతోనే మిగితా 50 శాతం పనులు కూడా చేపడతాం. పైపులకు ఆర్డర్ ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. – పాపారావు, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ -
11,000 కోట్ల భారం
► సాగు, తాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ ఎఫెక్ట్ ► తగ్గించాలంటూ కేంద్రంపైఒత్తిడి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపనుంది. నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ తాగునీటి పనులు, డబుల్ బెడ్రూం ఇళ్లపై దాదాపు రూ.11 వేల కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుత వ్యాట్ ప్రకారం వర్క్స్ కాంట్రాక్టులపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో జమవుతుండటంతో ప్రాజెక్టులపై రూ.వేలాది కోట్లు వెచ్చించినప్పటికీ అందులో 5% తిరిగి ఖజానాకు వచ్చి చేరేది. కానీ జీఎస్టీలో ఖరారు చేసిన పన్ను స్లాబ్ల ప్రకా రం వర్క్స్ కాంట్రా క్టులపై 18% పన్ను పడినట్లయింది. దీంతో ప్రాజెక్టులకయ్యే వ్యయం రూ.లక్ష కోట్లలో రూ.18 వేల కోట్లు జీఎస్టీకి జమ చేయాల్సి ఉంటుంది. అందులో సగం రాష్ట్ర ఖాతాకు, మిగతా సగం కేంద్రానికి జమవుతుంది. దీంతో దాదాపు రూ.9 వేల కోట్లు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెరిగిందనే కారణంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలూ పెరిగే ప్రమాదముందని పేర్కొంటున్నాయి. వరుసగా కేంద్రంపై ఒత్తిడి మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టుల పనుల ను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలు మార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖలు రాశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేం దుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ఆర్థిక మంత్రికి నివేదించారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం.. మరోసారి ఆర్థిక మంత్రిని కలసి ప్రాజెక్టులకు జీఎస్టీ పన్నును కనిష్ట స్లాబ్కు తగ్గించాలని విన్నవించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
మిషన్ భగీరథకు ‘బోర్డెక్స్’ సాంకేతికత!
నీటి నిర్వహణకు బోర్డెక్స్ సహకారం తీసుకుంటామన్న ప్రశాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నిర్వహణకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఫ్రాన్స్లోని బోర్డెక్స్ మెట్రోపాలిటన్ యంత్రాంగం అంగీకరించిందని రాష్ట్ర తాగునీటి సరఫరా కార్పొరేషన్ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రశాంత్రెడ్డి.. గురువారం బోర్డెక్స్ మెట్రోపాలిటన్ అధికారులు, సాంకేతిక సంస్థల ప్రతి నిధులతో సమావేశమయ్యారు. అంతకుముందు మెట్రోపాలిటన్ నిర్వహించే మురు గునీటి శుద్ధి కేంద్రం, వరదనీటి మానిటరింగ్ సెంటర్ను పరిశీలించారు. ఈ మురుగునీటి శుద్ధికేంద్రం నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, దాని నుంచి విద్యుదుత్పత్తి జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. నగరం మధ్యలో ఉన్నా కూడా ఎలాంటి దుర్గంధం రాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యవస్థను మూసీ నది శుద్ధిలో ఉపయోగించే అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్తానని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆదివారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి అధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మేయర్లు బొంతు రామ్మోహన్, నన్నపునేని నరేందర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై ఎమ్యెల్యేలతో చర్చించారు. నీటి పారుదల కాల్వల నిర్మాణం, మరమ్మతులు, మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పనుల్లో ఎక్కడైన జాప్యం జరిగినా, ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పనులు వేగవంతం జరిగేలా చూడాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజి, పంపుహౌజ్ల నిర్మాణం పూర్తయ్యే లోపు నీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకం లేక పూడుకుపోయిన ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరకల్లా రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
నాగర్కర్నూల్: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయ పడ్డారు. బిజినేపల్లి మండలం వెల్గొండ ఆవులకుంట చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు. కూలీలతో పాటు మంత్రి జూపల్లి ట్రాక్టర్ వరకు మట్టి మోశారు. పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడంపై మంత్రి వారిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మిషన్కాకతీయతో తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. -
‘మిషన్ భగీరథ’ సర్వే అడ్డగింత
నర్సయ్యగూడెం(నేరేడుచర్ల) : కొంతకాలంగా వివాదస్పదంగా మారిన మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణానికి సంబంధించి సోమవారం అధికారులు రైతులు పోలాల నుంచి సర్వే ప్రారంభించడంతో రైతులు అడ్డుకున్నారు. తమ పంట పోలాల నుంచి కాకుండా ఆర్అండ్బీ రోడ్డు వెంట వేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్వే పనులను అడ్డుకున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో సర్వే పనులు చేస్తుండగా రైతులు, మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు రైతులను అరెస్టు చేసి నేరేడుచర్ల గ్రామ శివారు నుంచి నర్సయ్యగూడెం గ్రామ శివారు వరకు పైప్లైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ మధుబాబు, డీఈ వెంకటరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, సీఐ రజితా రెడ్డి, ఎస్ఐలు గోపి, యాదవేందర్రెడ్డిలు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ అభినందనీయం
- యూనిసెఫ్ లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది - రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ కార్యక్రమంలో యునిసెఫ్ ప్రతినిధి నల్లీ - సామాజిక, ఆర్థిక ప్రభావంపై బేస్లైన్ సర్వేకు సెస్ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన లక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ యునిసెఫ్ వేదికగా 2015లో నిర్దేశించుకున్నాయని, ఆ లక్ష్యాలలో అందరికీ సురక్షితమైన తాగునీరు అందించడం కూడా ఒకటని యూనిసెఫ్ ప్రతి నిధి ఎస్.ఆర్.నల్లీ అన్నారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సాధించాల్సి ఉండగా, ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా 2017 లోనే పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారా ఒనగూరే సామాజిక, ఆర్థిక ఫలితాలను అంచనా వేసేందుకు సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), యూనిసెఫ్ సంయుక్తంగా బేస్లైన్ సర్వేను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. సర్వే నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసిన రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్లకు మంగళవారం సెస్ ఆడిటోరియంలో శిక్షణను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్. నల్లీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తాగునీటి సంబంధి త సమావేశాల్లోనూ మిషన్ భగీరథను అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రశంసిస్తు న్నారన్నారు. ఆర్డబ్లు్యఎస్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథను జాతీయ మోడల్గా ప్రధాని మోదీ పరిగణిస్తున్నారన్నారు. తెలంగాణ తాగునీటి ఎద్దడికి ‘మిషన్ భగీరథ’ శాశ్వత పరిష్కారంగా సీఎం కేసీఆర్ భావించారని చెప్పారు. తెలంగాణలోని 24,248 ఆవాసా లకు సురక్షితమైన తాగునీటిని అందించే భగీరథ ప్రాజెక్ట్ను కేవలం మూడేళ్లలోనే (ఈ డిసెంబరు నాటికి) పూర్తి చేయబోతు న్నామని చెప్పారు. సెస్ డైరెక్టర్ ఎస్.గాలబ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ తెలంగాణకి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నందారావుతో సెస్ ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. బేస్లైన్ సర్వే చేసేది ఇలా.. ఈ నెల 14నుంచి ‘సెస్’ చేపట్టనున్న బేస్లైన్ సర్వే ప్రక్రియకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 1500 గ్రామాలలో 12వేల కుటుంబాలను సర్వే చేయనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఎనిమిది కుటుంబాల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రధానంగా సర్వేకు ఎంచుకున్న గ్రామాలలో ప్రస్తుతం తాగునీటి సదుపాయం, నీటి లభ్యత, దూరం, పరిమాణం, నాణ్యత, విశ్వసనీ యత, సుస్థిరత.. తదితర అంశాలపై వివరా లను సేకరించనున్నారు. అలాగే కొన్ని గ్రామాలలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పరిశ్రమలలోనూ శాంపిల్ సర్వే నిర్వహిస్తారు. ఆయా గ్రామా లు, సంస్థలలో నీటి వినియోగం, పరిశుభ్రత కోసం పాటించే పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. సర్వేకు వెళ్లే ప్రతి బృందం లోనూ ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు (రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్లు)తో పాటు, సీనియర్ ఫ్యాకల్టీ ఒకరు బృందానికి నాయకత్వం వహిస్తారు. -
‘ప్రాణహిత’కు అటవీ భూమి
వన్యప్రాణి సంరక్షణ బోర్డు గ్రీన్సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు ప్రధాన కాలువ, తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 622 హెక్టార్ల అటవీ భూములను మళ్లించేందుకు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు భూములు కాగజ్నగర్, ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సచివాలయంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన రాష్ట్ర స్థాయి వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలకమైన నిర్ణ్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక కొత్తగూడెం, మైలవరం కాపర్ మైన్స్ నుంచి రాజాపురం ఉల్వనూర్ రహదారి విస్తరణ కోసం కిన్నెరసాని వన్యపాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని 38.798 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతినిచ్చింది. భద్రాద్రి జిల్లాలో ట్రాన్స్కో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి, మణుగూరు సబ్స్టేషన్కు, ఖమ్మం జిల్లా కిన్నెరసాని వద్ద మిషన్ భగీరథ పనులకు ఓకే చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా భారీ వాహనాల రాకపోకల అనుమతిపై అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించారు. -
వృద్ధి బాట పట్టినం: సీఎం కేసీఆర్
-
కుట్రలు ఛేదించినం
♦ వృద్ధి బాట పట్టినం: సీఎం కేసీఆర్ ♦ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలె ♦ బమ్మెర, రాఘవాపురాల్లో సీఎం పర్యటన సాక్షి, జనగామ: ‘‘తెలంగాణ ఏర్పడినంక రాజకీయ అస్థిరతను సృష్టించి తెలంగాణను దెబ్బ తీయాలని కొన్ని శక్తులు కుట్రలు చేసినై. నాలుగు రోజులకో, పది రోజులకో ఈ ప్రభుత్వం పడిపోతదంటూ తర చూ స్టేట్మెంట్లు వచ్చినై. మీరంతా చూసిండ్రు. ఆ కుట్రలను ఛేదించి ఇప్పుడు అభివృద్ధి బాట పట్టినం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఆదర్శ గ్రామ మైన రాఘవాపురం, సహజ కవి పోతన జన్మస్థల మైన బమ్మెర గ్రామాల్లో సీఎం శుక్రవారం పర్యటించా రు. రాఘవాపురంలో మిషన్ భగీరథ నల్లా నీటిని ప్రారంభించారు. 30డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బమ్మెరలో పోతన సమాధి, వ్యవసాయ బావులను పరిశీలించారు. రాఘవాపురం, బమ్మెరల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. పోతనను కూడా సొంతం చేసుకునేం దుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నించారని సీఎం దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ బిడ్డయిన పోతనది కడప జిల్లా ఒంటిమిట్ట అని చాలా దుర్మార్గంగా మాట్లాడిండ్రు. మహాకవి శ్రీనాథునికి, పోతనకు చుట్టరికముంది. అందుకే కాకతీయుల హయాంలో శ్రీనాథుడు ఇక్కడికి వచ్చిపోయిండంతే. ఇట్ల సమైక్య రాష్ట్రంలో ఏదీ మనది కాకుండా పోయింది. మనుషు లు మనుషులు కాకుండా పోయిండ్రు. కవులు కవులు కాలేదు. నీళ్లు నీళ్లు కాకుండా పోయినై. దేవుళ్లు దేవుళ్లు కాకుండా పోయిండ్రు. అన్నీ నిరాదరణకు గురైనై. అందుకే ఒక ఉప్పెనలా విప్లవం పొంగింది. పోతన వారసులం గనుకనే మనకా పౌరుషముంది’’ అన్నారు. ఇతర కవులంతా తమ రచనలను రాజుల కు అంకితమిచ్చి భోగభాగ్యాలు అనుభవిస్తే పోతన మాత్రం ‘నా కావ్య కన్యకను రాజులకిచ్చి పడుపు కూడు తినే దౌర్భాగ్యం వద్దు’అంటూ వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగించిన మహాకవి అని ప్రస్తుతించారు. ‘‘అలతి అలతి పదాలతో తేటతెలుగు కవిత్వాన్ని, మహాద్భుతంగా మహా భాగవతాన్ని తెలుగువారికి అందించిన పోతన వారసులం మన మంతా. అది మరిచిపోవద్దు’’అని సూచించారు. బమ్మెరను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. జనగామ జిల్లాలో చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి రూ.40 కోట్లు కేటా యిస్తున్నట్టు ప్రకటించారు. బమ్మెరకు రూ.7.5 కోట్లు, పెంబర్తికి రూ.5కోట్లు, వల్మీడికి రూ.5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, జఫర్గఢ్ కోటకు రూ.6 కోట్లు, ఖిలాషాపూర్ కోటకు రూ.4.5కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.2కోట్లు ప్రకటించారు. బమ్మెరకు బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి రూ.176కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పా రు. పాలకుర్తిలో మహిళా డిగ్రీ కళాశాలతో పాటు నియోజకవర్గానికి అదనంగా 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రక టించారు. రాఘ వాపురం చిన్న గ్రామమైనా అభివృద్ధిలో గంగదేవిపల్లి తో పోటీపడడం అభినంద నీయమన్నారు. దయాకర్ పదవి వద్దన్నడు... కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బాగుచేసు కోవడం కోసం టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్లోకి ఆహ్వానించానని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎర్రబెల్లిని పిలిపించి మాట్లాడిన. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తానొక్కడినే కాక అందరమూ వస్తమని చెప్పి దయాకర్ లీడ్ తీసుకుని వచ్చారు. అలా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. సీనియర్ నాయకుడైన దయాకర్రావుకు టీఆర్ఎస్లో కీలక పదవి ఇద్దా మనుకున్నం. ఆయన మాత్రం తనకు పదవి వద్దని, తన నియోజకవర్గానికి రూ.100 నుంచి రూ.150కోట్ల అభివృద్ధి పనులు కావాలని అడిగిం డ్రు. ఈ విషయాన్ని మీ నియోజకవర్గంలోనే చెప్పాలని నేనిక్కడికి వచ్చిన’’అని వివరించారు. సభలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు అజ్మీరా సీతారాం నాయక్, పసునూరి దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్లు శ్రీదేవసేన, ఆమ్రపాలి, ప్రీతి మీనా, ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఎప్పుడూ నాకే ఫస్ట్ ప్రైజు బమ్మెర సభలో ప్రసంగం సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజుల్లోకి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. ‘‘నాకు ఒక జ్ఞాపకం వస్తున్నది. మెదక్ జిల్లా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా గురువు పరాశరం గోపాలకృష్ణమూర్తి తెలుగు సాహిత్యంపై పోటీలు పెట్టెటోళ్లు. అప్పట్ల తెలుగు పద్యం గానీ, వ్యాసం గానీ, రచనల్లో గానీ నాకే ఫస్ట్ ప్రైజు వచ్చేది. నా సోదరులు, తోటోళ్లంతా ‘ఏందీ అన్యాయం సార్? ఎప్పుడూ చంద్రశేఖర్కే ఫస్ట్ ప్రైజా?’అంటే ఆయన ‘నాకు నచ్చిన గ్రంథం’ అంశంపై వ్యాసరచన పోటీ పెట్టిండ్రు. అయితే పోటీలున్న విషయం 45 నిమిషాల ముందే గుర్తుకు వచ్చింది. వెంటనే కాలేజీకి పోయిన. కానీ పెన్ను మరిచిపోయాను. మా దోస్తు వినోద దగ్గర పెన్ను అడుక్కున్న. పోతన కవిత్వంపై సి.నారాయణరెడ్డి రాసిన మందార మకరందం పుస్తకం సదివిన. 30 నిమిషాల్ల వ్యాసం రాసిచ్చిన. మళ్లా నాకే ఫస్ట్ ప్రైజొచ్చింది. దాంతో అంతా పంచాయతీ పెట్టిండ్రు. కాలేజీ ప్రిన్సిపాల్ రంగారెడ్డిని, తెలుగు హెడ్ను పిలి చిండ్రు. ‘మిగతా వాళ్లంతా నవలల గురించి రాస్తే చంద్రశేఖర్ మాత్రమే పోతన గురించి రాసిండు. అందుకే బహుమతి తనకిచ్చినం’అని సార్లు చెప్పిం డ్రు’’అంటూ సభికుల చప్పట్ల మధ్య సీఎం గుర్తు చేసుకున్నారు. ‘సత్కవుల్ హాలికులైన నేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై’, ‘ఇందుగలడందులేడను సందేహం వలదు.. ఎందెందు వెదికిచూసినా అందందే గలడు దానావాగ్రణి వింటె’అంటూ పోతన పద్యాలను స్వయంగా పాడి వినిపించి సభికులను అలరించారు. -
రాష్ట్రానికి మూడు హడ్కో అవార్డులు
- మిషన్ భగీరథకు వరుసగా రెండో ఏడాదీ అవార్డు - హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో వినూత్న ఆలోచనలను అమలు చేసినందుకు పలు సంస్థలకు, ప్రభుత్వ పథకాలకు ప్రదానం చేసిన అవార్డుల్లో తెలంగాణకు మూడు అవార్డులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మంచి నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకంగా భగీరథకు వరుసగా రెండో ఏడాది కూడా లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య చేతుల మీదుగా చీఫ్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. భగీరథ పనులు 60–65 శాతం పూర్తయ్యాయని, త్వరలో మలివిడత పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభింపజేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు అవార్డు లభించింది. హడ్కో సాయంతో సుమారు 14 వేల ఎకరాల్లో చేపడుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీకి, అలాగే 12,500 ఎకరాల్లో చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కలిపి ఈ అవార్డు దక్కింది. వెంకయ్య చేతుల మీదుగా టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థికాభివృద్ధిని సాధించినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం సురేందర్ రాజు అవార్డు అందుకున్నారు. -
‘ఇంట్రావిలేజ్’లో ఇతర రాష్ట్రాలకు అవకాశం
మిషన్ భగీరథపై సమీక్షలో వైస్చైర్మన్ ప్రశాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇంట్రా విలేజ్ పను లు చేయడానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని,రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కొరత ఉన్న సెగ్మెంట్లలో వారికి అవకాశం కల్పించా లని ప్రభుత్వం భావిస్తోందని మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇంట్రా విలేజ్ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చిం చారు.ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి ప్రతి ఆవాసానికి సురక్షిత మంచినీటి ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నందున, స్థానిక కాంట్రాక్టర్లతో పాటు మిగతా రాష్ట్రాల వారికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్ల అర్హతలు, గతంలో చేసిన పనులను తెలుసుకోవడానికి బిహార్, ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో పర్యటించేందుకు కన్సల్టెంట్ల బృందాన్ని పంపాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ను ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. కాంట్రాక్టర్ల రిజి స్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన... ఇంట్రా పనులు ప్రారంభమై 45 రోజులవు తున్నా ఓహెచ్ఆర్ల నిర్మాణాలు ఊపందు కోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇంట్రా పనుల ఆలస్యం, కాంట్రాక్టర్లు తగినంత లేకపోవడానికి సంబంధిత చీఫ్ ఇంజనీర్ వైఫల్యమే కారణమంటూ ప్రశాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు..
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఐదు సెగ్మెంట్స్ ద్వారా మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వాన్ని గాని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల అధికారులతో అబివృద్ది కార్యక్రమాల ప్రగతిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ఈ సందర్బంగా మిషన్ భగీరథ పనులు ఎక్కడివరకు వచ్చాయి, ప్రజలకు ఎప్పటిలోపల మంచినీటిని అందజేయగలం అనే విషయంపై చర్చించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, నగర మేయర్ నరేందర్, శాసన సభ్యులు దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, శంకర్నాయక్, రెడ్యా నాయక్, రాజయ్య, వినయ్ భాస్కర్, ఎంపీలు సీతారాం నాయక్, దయాకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మ, ‘కుడా’ చైర్మన్ యాదవరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ పనుల వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పాత మెదక్ జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జరుగుతున్న భగీరథ పనులను గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమీక్షిం చారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయితే ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన జిల్లాగా సిద్దిపేటకు దేశంలో ప్రథమ స్థానం లభిస్తుందన్నారు. ఇకపై ప్రతివారం పనులను సమీక్షించాలని, స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయపర్చుకుని భాగస్వాములను చేసుకో వాలని అధికారులను ఆదేశించారు. కనీసం రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున పనులు పూర్తి చేస్తేనే పురోగతి ఊపందుకుంటుందన్నారు. సిబ్బంది కొరత ఉన్నచోట అధికా రులను సర్దుబాటు చేయాలని, అవసరమైతే పంచాయతీరాజ్శాఖ రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఒక కార్యాచరణ ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్చైర్మన్ ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ప్రభాకర్, మదన్రెడ్డి, బాబూమోహన్ పాల్గొన్నారు. -
ప్రజలు మెచ్చే పనులే చేస్తాం
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన భీమ్గల్(బాల్కొండ): తూతూ మంత్రంగా కాకుండా నాణ్యతతో ప్రజలు మెచ్చే విధంగా పనులు చేసి వారి మన్ననలు పొందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆయన బాటలోనే తాము నడస్తున్నామని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన భీమ్గల్ మండలంలోని చేంగల్లో రూ. 57 లక్షలతో, బడాభీమ్గల్లో రూ. 51.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో ఎంపీ కవితతో కలిసి తాను చేంగల్కు ప్రచారానికి వచ్చినపుడు ఇక్కడి కాలనీలోని రోడ్లు చూసి ఆశ్చర్యపోయామన్నారు. రోడ్డంతా గుంతలుగుంతలుగా ఉండేదన్నారు. ఆ రోజే తాము నిర్ణయించుకున్నామని ఎనికల్లో గెలిస్తే ఎలాగైనా గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మించాలనుకున్నామని పేర్కొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో నిధులు మంజూరు చేశామన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో శిథిలమైన మార్కెట్ యార్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ గోదావరి ప్రకాశ్గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు బాదావత్ లక్ష్మీ శర్మనాయక్, కేఎంసీ చైర్మన్ దొనకంటి నర్సయ్య, కన్వీనర్ గున్వీర్ రెడ్డి, స్థానిక సర్పంచ్లు ఆర్మూర్ మహేశ్, ములుగూరి స్వప్న గణేశ్, ఏశాల కృష్ణ, తాంస రవీందర్, కొమ్ము నరేశ్, బుర్ర దేవేందర్ గౌడ్, జిన్న శోభన్, పుప్పాల రాజేశ్వర్, కోలి బాల్ రెడ్డి, కుమ్మరి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనుల పరిశీలన మోర్తాడ్(బాల్కొండ): మండలంలోని శెట్పల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను బుధవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండకూడదని ఆదేశించారు. పైప్లైన్ ఏర్పాటు నిబంధనల ప్రకారం సాగాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నర్సయ్య, బాల్కొండ నాయకుడు సామ వెంకట్రెడ్డి, సర్పంచ్ లింబన్న తదితరులు పాల్గొన్నారు. -
వాటర్గ్రిడ్ పనుల్లో వేగం పెంచండి
► పదేళ్ల వరకు నిర్మాణ సంస్థలదే బాధ్యత ► వాటర్గ్రిడ్ రిజర్వాయర్ ► శంకుస్థానలో మంత్రి తుమ్మల దమ్మపేట: వచ్చే ఉగాది నాటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికి ఉచితంగా సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గండుగులపల్లి శివారులో దుర్గమ్మగట్టుపై మిషన్ భగీరథ(వాటర్గ్రిడ్)లో భాగంగా నిర్మాణం చేస్తోన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిలతో కలసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. గండుగులపల్లి దుర్గమ్మగట్టు నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందించేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. అందుకుగాను రెండు మండలాల్లో 182 మంచినీటి ట్యాంకులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.4500 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత పదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యతలను ఆయా సంస్థలే నిర్వహిస్తాయని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయా అధికారులకు సూచించారు. గుండాల, చర్లతో పాటు, భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలాల్లో చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ రవీందర్, డీఈ శివరామప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ షకిలాభేగం, డీసీసీబీ డైరక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జెడ్పీటీసీ దొడ్డాకుల సరోజని, మార్కెట్ కమిటీ చైర్మన్ తానం లక్ష్మి, వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, పైడి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యానారాయణ, పోతినేని శ్రీరామవెంకటరావు తదితరులున్నారు. -
భగీరథలో అవినీతిని నిరూపిస్తా: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకంలో అవినీతిని నిరూపిస్తానని టీడీఎల్పీ నేత ఎ.రేవంత్రెడ్డి సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవినీతి లేకుండా చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మిషన్ భగీరథపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ చేశారు. అవినీతిని నిరూపించలేకుంటే ప్రభుత్వం, ప్రజలు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని రేవంత్రెడ్డి ప్రకటించారు. మిషన్ భగీరథతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అవినీతి బాగోతాన్ని శాసనసభలో బయటపెడతాననే భయంతోనే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. సభ నుంచి బయటకు పంపితే, ప్రజాక్షేత్రంలోనే అవినీతిని ఎండగడ్తామని హెచ్చరించారు. అవినీతిపై బహిరంగంగా చర్చించడానికి కేసీఆర్ స్వగ్రామం చింతమడక అయినా, తోటపల్లి అయినా సిద్ధమని రేవంత్ సవాల్ చేశారు. -
టీఆర్ఎస్పై దూకుడే..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిగ్విజయ్ హితవు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల అవి నీతిని సభలో ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ సూచించారు. గురు వారం అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్ శాస నసభాపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఈ భేటీలో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరిం చాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. సీఎం మాటలకు చేతలకు పొంతన లేదన్నది అన్ని వర్గాల ప్రజల్లోకి బాగా పోయిందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, వాటి అమ లులో వైఫల్యం, కేసీఆర్ కుటుంబ అవినీతి తదితరా లపై సభలో దూకుడుగా పోరాడా లని సూచించారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిం దని, ఆ పథకంపై ప్రజల్లో టీఆర్ఎస్ కలిగిం చిన భ్రమలను తొలగించా లని భావన వ్యక్తమైంది. భగీరథపై సమ గ్రంగా అధ్యయనం చేసి ఆధారాలతో సహా సభలోనే ఎండ గట్టాలని సభ్యులు ప్రతిపాదిం చారు. సబ్ప్లాన్ నిధులు, బీసీలకు సబ్ప్లాన్, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితరాలపై సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయిం చారు. అయితే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టా ల్సిన అవసరం లేదని నిర్ణయించారు. బడ్జెట్ పైనే ఓటింగుకు అవకాశమున్నప్పుడు కొత్తగా అవిశ్వాసం అవసరంలేదనే ఈ నిర్ణయం తీసు కున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. భేటీలో ఆర్.సి.కుంతియా, ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. వైఫల్యాలపై ఎండగడతాం: టీఆర్ఎస్ వైఫల్యాలను సభలోనే ఎండ గట్టాలని నిర్ణయించినట్టు సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించామన్నారు. ‘రీ డిజైన్ వల్లే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కోల్పోయాం. నిర్వాసితులకు భూ సేకరణ చట్టం–2013 ప్రకారమే పరిహారమి వ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కార్పొరేషన్ల నుంచి సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని పట్టుబడతాం. ధర్నాచౌక్ను తరలించాలన్న కుట్రపై పోరాడతాం. రైతులకు రుణమాఫీ చేయకుండామోసగించిన వైనం పైనా ఎండగడతాం’ అన్నారు. సమస్యలపై పోరాడండి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిగ్విజయ్సింగ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో గురువారం మైనారిటీ, గిరిజన, మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలను పెంచాలని సూచించారు. ఏప్రిల్ 9నుంచి 30వరకు గిరిజన పోరాటాలు చేయాలని నిర్ణయిం చామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో గిరిజన గర్జన, 13న దామరచర్లలో గిరిజనులతో బహిరంగసభ, 23న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో గిరిజన బహిరంగ సభ, ఏప్రిల్ 30న ఆదిలాబాద్లో గిరిజన సభ నిర్వహిస్తాం’’ అని ప్రకటించారు. యూపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ ఫలితాలను విశ్వసించబోనని దిగ్విజయ్ అన్నారు. -
అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు
► ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి డిండి : మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2017 చివరి నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తాగు నీరందిస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపన్కుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వలన డిండి మండలంలో వానలు కురవక కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రజల ఆకాంక్ష మేరకు కనీసం తాగు నీటి వసతి కోసం కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. వారు వెంటనే స్పందించి సంబంధిత నీటి పారుదల శాఖా మంత్రిహరీశ్రావుతో మాట్లాడి అందించిన నీటిని డిండి మండల పరిధిలోని కుంటలకు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల రైతులను సోమవారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో మొదటగా సింగరాజుపల్లి వద్ద ప్రారంభమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డిండి ఎత్తిపోతల పథకంలో నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు శాశ్వతంగా తాగు, సాగు నీటి సమస్య లేకుండా పోతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ వీరకారి నాగమ్మ, ఎంపీపీ ముఖ్య సలహాదారుడు రాంకిరణ్, వైస్ఎంపీపీ తుమ్మల నీతు, కోఆప్షన్ అల్లాహుద్దిన్, టీఆర్ఎస్ మండల నాయకులు రాజీనేని వెంకటేశ్వరరావు, యదగిరిరావు, బల్ముల తిర్పతయ్య, శ్రీనువాసులు, కృష్ణయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నేను.. నాపాలన.. నాఇష్టంగా’ మారింది
జనగామ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం..నేడు నేను.. నాపాలన.. నాఇష్టంగా మారిందని విమర్శించారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణగా మారిందన్నారు. రైతులు, ఉద్యోగులు, పోలీసులు స్తెతం ఆత్మహత్యలకు పాలుపడుతుడండం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రుణమాఫీ పథకం వడ్డీ మాఫీ పథకంగా, మిషన్ భగీరథ కాస్త మిషన్ కల్వకుంట్లగా మారిందన్నారు. మిషన్ భగీరథ పథకంప్తె బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలపై ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. -
వాటర్ ట్యాంకర్ బోల్తా : డ్రైవర్ మృతి
మాడ్గుల: మండలంలోని ఆర్కపల్లి నల్లకుంటచెరువులో మిషన్ కాకతీయ పనులు చేస్తుండగా ఆదివారం చెరువుకట్టపై నుంచి వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సంజునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కలకొండ పంచాయితీ పరిధిలోని గోప్యాతండాకు చెందిన ఇస్లావత్ సంజునాయక్ (25) అన్నెబోయిన్ పలి్లకి చెందిన ఓ వాటర్ ట్యాంకర్పై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నల్లకుంట చెరువులో మిషన్ భగీరథ పనుల కాంట్రాక్టర్ ఆరోగ్యరెడ్డి ఈ వాటర్ ట్యాంకర్ లీజుకు తీసుకున్నాడు. చెరువుకట్టను క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ కట్టపై నుంచి బోల్తాపడింది. డ్రైవర్ సంజునాయక్ ఇంజన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య జ్యోతి, కుటుంబసభ్యులు, బంధువుల సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం చూసి రోదించారు. బంధువుల అందోళన.. ట్యాంకర్ బోల్తాపడి మృతిచెందిన డ్రైవర్ సంజునాయక్ కుటుంబానికి న్యాయం చేసే వరకు శవాన్ని తీసేది లేదని మృతుడి బంధువులు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. గిరిజన నాయకుల పెద్దలు మిషన్ భగీరథ కాంట్రాక్టర్, ట్యాంకర్ యజమానులతో రాత్రి 7గంటలవరకు చర్చించగా రూ.4లక్షల పరిహారం అందిస్తానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో బంధువుల శాంతించారు. జేసీబీ సహాయంతో మృతదేహం తీశారు. మృతుడికి భార్యజ్యోతి, రెండేళ్ల కూతురు ఉంది. -
రూ.4వేల కోట్లతో భగీరథ పనులు
► ఇంటింటికీ నల్లా నీరందిస్తాం ► రెండు జిల్లాల్లో 1645 గ్రామాలకు.. ► మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.4వేల కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇంటింటికీ నల్లా నీరందివ్వడమే ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సర్పంచులతో తాగునీటి పనులపై సమీక్ష నిర్వహించా రు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి ఓ మండలాన్ని ఎంపిక చేసి, పైప్లైన్ల నిర్మా ణం చేపడుతున్నట్లు చెప్పారు. సింగూరు నుంచి వేస్తు న్న పైప్లైన్తో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వేస్తున్న పైప్లైన్తో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు. మొత్తం 1645 గ్రామాలకు నీరందుతుందని వెల్లడించారు. మెయిన్, సబ్ ట్యాంకుల నిర్మా ణం ప్రారంభమైందని, ఇంట్రా పైప్లైన్ పనులను ప్రా రంభిస్తామన్నారు. నల్లా కనెక్షన్లు ఉచితంగా ఇసామని, గ్రామ పంచాయతీలో డిపాజిట్లు కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్లలో పైప్లైన్ల కోసం రూ.26కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలోనే మొదటిసారిగా బాన్సువాడ పట్టణంలో పైప్లైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అందరికీ స్వచ్ఛమైన జలాలు ఇవ్వడమే ధ్యేయంగా వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్, నాయకులు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, అంజి రెడ్డి, గంగాధర్, అలీముద్దీన్బాబా, ముఖీద్, శ్రీధర్ ఉన్నారు. మంత్రికి ఘన సన్మానం.. అంగన్వాడీలకు, ఆయాల వేతనాలను పెంచేందుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డికి గురువారం బాన్సువాడలో అంగన్వాడీ కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. కార్యకర్తలు లక్ష్మీ, విజయ, బాలమణి, స్వరూప, అరుణ పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యత.. ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు మార్కెట్ యార్డులను వినియోగించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.5 కోట్లతో నిర్మించిన 2500 మెట్రిక్ టన్నుల గోదాంను గురువారం మంత్రి ప్రారంభించారు. రూ.70 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, ప్రహరీ, రూ.35 లక్షలతో నిర్మించే మార్కెట్ కమిటీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమం, అభివృద్ధికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్ కమిటీ సేవలకు రైతుల ముంగిట్లోకి తీసుకురావడానికి కొత్త మార్కెట్లను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 180 మార్కెట్ కమిటీలు ఉండగా, 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల గోదాంల సౌకర్యం ఉందన్నారు. ఇటీవల నాబార్డు సహకారంతో రూ.1024 కోట్లతో 17 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ఆదనపు గోదాంలను నిర్మించామని వెల్లడించారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నారోజీ గంగారాం, వైస్ చైర్మన్ మేక వీర్రాజు, జెడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్రెడ్డి, ఎంపీడీవో సురేందర్, తహసీల్దార్ గంగాధర్ ఉన్నారు. వైద్యుల గైర్హాజర్పై మండిపాటు మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పోచారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని స్థానికులు కొంద రు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రిజిష్టర్ను పరిశీలించారు. సి బ్బంది గైర్హాజర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పరుచుకోకుంటే చర్యలు కఠినంగా ఉంటాయ ని హెచ్చరించారు. అంతకు ముందు కళాశాల అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇసుక నాణ్యతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా లేకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ప్రజల సహకారంతో ‘భగీరథ’
అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో ప్రజల సహకారం తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి శాఖ సమష్టి భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతంగా ముందుకు సాగుతోందని, ఈ తరహాలోనే గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పైప్లైన్ల పనులు జరపాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై బుధవారం తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ప్రధాన కార్యాలయంలో సీఎస్ సమీక్ష జరిపారు. గ్రామాల్లో అంతర్గతంగా చేపట్టే భగీరథ పనుల్లో సెర్ప్ సిబ్బందిని ఉపయోగించుకునేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్ను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో అంతర్గత పైప్లైన్ పనులు ప్రారంభమవుతాయని, ఈ పనులకు వాడే పైపుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భగీరథ పథకానికి అవసరమైన నిధుల సమీకరణ, నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డిని ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన మంకుపట్టు!
► సాక్షి కథనానికి స్పందించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ ► వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ► నట్లు, బోల్టులు సమకూర్చిన అధికారులు ► శరవేగంగా సాగుతున్న నెల రోజులుగా నిలిచిన పనులు నారాయణపేట : ఎల్అండ్టీ, మిషన్ భగీరథ అధికారులు మంకుపట్టు వీడారు. నెల రోజులుగా నిలిచిన సమస్యకు పరిష్కారం లభించింది. కలెక్టర్ ఆదేశాలకు ముందు అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... మిషన్ భగీరథ పథకం కింద పైప్లైన్ వేసేందుకు రోడ్డుమార్గన కాలువ తవ్వకాలు చేస్తుండగా సత్యసాయి పైప్లైన్ పలుప్రాంతాల్లో ధ్వంసమైంది. దీంతో నెలరోజులగా మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో తమకు సామాగ్రిని అందించాలని కోరడంతో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎల్అండ్టీ నిర్వాహకులకు దాదాపు 10వేల విలువ చేసే సామాగ్రిని అందించారు. కానీ పైప్లైన్ జాయింట్ వేసే దగ్గర బిగించే నట్, బోల్ట్లను అందించలేదు. ఆ కాస్త మీరు తెచ్చుకోలేరా అని ఒకరిపై ఒకరు వేసుకుంటూ నెలరోజులు ఎవరికి వారు మొండిగా వ్యవహరించారు. దీంతో మరమ్మతుల్లో జాప్యం నెలకొంది. ఈ పరిస్థితితో నీటిసమస్య తీవ్రమై ఆయా గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోయారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో సమస్యను సాక్షి దృష్టికి తెచ్చారు. ఈ మేరకు నట్టు, బోల్టులపై మంకుపట్టు! శీర్షికన శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్ రోనాల్డ్రోస్ స్పందించారు. ఇటు మిషన్ భగీరథ, అటు సత్యసాయి యంత్రాంగాన్ని కదిలించారు. అసలే ఎండకాలం.. అందులో నీటిసమస్య తీవ్రంగా ఉంది. నీటిని ప్రజలకు అందించే విషయంలో చిన్నపాటి సమస్యను పరిష్కరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆశాఖ అధికారులు వెంటనే సత్యసాయి, మిషన్భగీరథ అధికారులతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో పైప్లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేపట్టారు. సింగారం చౌరస్తా నుంచి అప్పక్పల్లి వరకు 8 లీకేజీలకు సంబంధించి జాయింట్ వేసేందుకు పూర్తి సామాగ్రిని మిషన్ భగీరథ అధికారులు అందజేశారు. అలాగే రెండు పైపులు ధ్వంసం కావడంతో వాటి స్థానంలో నూతన పైపులను వేసి జాయింట్ వేసినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. అప్పక్పల్లి లైన్లో లీకేజీలకు మరమ్మతులు చేపట్టి శనివారం రాత్రి ట్రయల్రన్ చేశారు. అయితే జాజాపూర్ హనుమాన్ మందిర్ దగ్గరలో మరో లీకేజీ బయటపడింది. దీంతో ఆ పైప్లైన్ పూర్తిచేసే పనిలో సత్యసాయి సిబ్బంది నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో శాసన్పల్లి, పేరపళ్ల, జాజాపూర్, అప్పక్పల్లి, సింగారం గ్రామాలకు తాగునీరు అందనుందని సత్యసాయి అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సాక్షికి ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ఆయాగ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.14 లక్షల విలువైన భగీరథ పైపులు చోరీ
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించిన పైపులను దుండగులు అపహరించుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. దొంగలించిన పైపుల విలువ రూ.13,90,569 లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
ఉప ప్రణాళిక స్థానంలో అమలుకు ఎస్సీ, ఎస్టీ కమిటీల తీర్మానం చట్ట సవరణలకు సిఫారసు... పథకాల్లో మార్పులు రెండ్రోజుల్లో ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు ఇకపై ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్), ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్)గా మారనున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. బడ్జెట్ లో పద్దుల మార్పు నేపథ్యంలో సబ్ప్లాన్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అధ్యక్షతన ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు... తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశమయ్యాయి. ఈ క్రమంలో చట్ట సవరణలపై చర్చ నిర్వహించిన కమిటీ సభ్యులు, అధికారులు పది అంశాలపై తీర్మానాలు చేశారు. వీటిని ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణ యించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీఎస్ డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్లలో తలపెట్టనున్న పథకాలSపైనా సుదీర్ఘ చర్చ నిర్వహించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎస్టీఎస్డీఎఫ్కు సంబంధించి పథకాల్లో మార్పులు, కొత్త పథకాలపై సూచనల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత రాలేదు. చట్ట సవరణలపై తీర్మానాలివి: సబ్ప్లాన్ అమలులో ప్రస్తుతమున్న పదేళ్ల కాలపరిమితిని తొలగించి.. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తీర్మానించారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్కు ఎస్సీ అభివృద్ధి శాఖ/ఎస్టీ అభివృద్ధి శాఖల సీనియర్ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్గా నియమించాలని తీర్మానించారు. సవరణలపై ముసాయిదా ప్రకటించిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిటీలు చట్ట సవరణలపై చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తుంది. గిరిజనాభివృద్ధి పథకాలపై ప్రధాన సిఫార్సులు... ► గిరిజనుల అక్షరాస్యతను పెంచేందుకు సాక్షరభారత్ పథకానికి అదనపు నిధులు ► బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో సీట్ల సంఖ్య 2 వేలకు పెంచాలి ► పదివేల మంది గిరిజన డ్రాప్అవుట్లకు ఒపెన్ వర్సిటీ ద్వారా పట్టభద్రులుగా తీర్చిదిద్దాలి ► హాస్టళ్లలో మెస్ చార్జీలను ప్రస్తుతం 25 శాతం పెంచడంతో పాటు ఏటా 5శాతం పెంచాలి. ► కొత్తగా మరో 50 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ► ‘ఓన్ యువర్ కార్’ కింద ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మరో 500మందికి అవకాశం కల్పించాలి ► గిరిజన భూఅభివృద్ధి పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది గిరిజన రైతులకు గాను 30వేల ఎకరాల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేయాలి ► గుడుంబా బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి ► మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు మంజూరు. ► ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి ► వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గిరిజనులకు వందశాతం రాయితీతో యంత్రాలు ► కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1.01 లక్షలకు పెంచి, పెళ్లి రోజు నాటికే అందించాలి ► 42 శాఖల పరిధిలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -
సబ్ప్లాన్ చట్టానికి ఎసరు పెడుతున్నారు
మహాజన పాదయాత్రలో తమ్మినేని పాల్వంచ రూరల్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి ఎసరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించబోమని, ఆ చట్టం నిధులు రూ.10 వేల కోట్లు ఇతర పథకాలకు మళ్లించలేదని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం పాల్వంచ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్ప్లాన్ నిధులు రూ.10 వేలకోట్లలో రూ.9 వేల కోట్లు మిషన్ భగీరథకు, రూ.1,000 కోట్లు రవాణా శాఖకు మళ్లీంచారని విమర్శించారు. -
జూన్లోగా ‘భగీరథ’ పనులు ముగించండి
-
జూన్లోగా ‘భగీరథ’ పనులు
జూన్లోగా ముగించండి ‘మిషన్ భగీరథ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం • ఈ పదకొండు నెలలు అత్యంత కీలకం • నిధుల కొరత లేదు.. వర్షాలు పడేలోపు పనులన్నీ కావాలి • ఈ పథకం దేశానికే ఆదర్శం కాబోతోంది • మార్చి నాటికి 3,811 గ్రామాలకు నీరందించాలి.. • పనుల తీరుపై ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష • పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారుల ను ఆదేశించారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. డిసెంబర్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. జూన్లోగానే పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరగవని, అందుకే ఇప్పట్నుంచి వర్షాలు పడేలోపు చాలా వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న ఈ కార్యక్రమాన్ని అధికారులు రేయింబ వళ్లు కష్టపడి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అభినందించారు. ‘‘మంచినీరు గ్రామాలకు చేరడంతోపాటు, గ్రామాలకు చేరిన నీళ్లు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా అందించడం చాలా ముఖ్యమైన పని. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు వేయడం కీలకం. అవసరమైన సామగ్రిని తెప్పించడం తోపాటు వాటిని గ్రామాల్లో అమర్చాలి. రాష్ట్రమంతా ఒకేసారి సమాంతరంగా ఈ పనులు జరగాలి. అధికారులు సవ్యసాచిలా పని చేయాలి. పనులు వేగంగా జరిపించాలి. ఈ 11 నెలలే అత్యంత కీలకం’’ అని సీఎం అన్నారు. ప్రగతిభవన్లో మంగళవారం మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ నుంచి డీఈల వరకు రాష్ట్రంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారాలు సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో చర్చించాలని, సీఎం కార్యాలయం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, ఈఎన్సీ సురేందర్రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, డిస్కంల సీఎండీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. మంగళవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర విద్యుత్తు సరఫరా మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని సీఎం చెప్పారు. ‘‘ఆర్థిక సంస్థల నుంచి రూ.30 వేల కోట్ల రుణం లభించింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగడమే ఇప్పుడు ప్రధా నం. పైపులైన్ల నిర్మాణానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే క్రాసిం గ్లు, కెనాల్ క్రాసింగ్లు, రివర్, రివర్ లెట్ క్రాసింగ్స్కు సంబంధించి ఆ శాఖలతో సమావేశమై అనుమతులు పొందాలి. అటవీ శాఖ అనుమతుల విషయంలో వేగం పెంచాలి. జిల్లా కలెక్టర్లు ఇందుకు చొరవ తీసుకోవాలని ఆదేశించాం. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల నిర్మాణం తదితర పనులు వేగంగా జరగాలి. ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా చేయాలి. మంచినీటి సరఫరాకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి’’ అని ఆదేశించారు. 48 గంటల్లోనే అంచనాల మార్పు వర్కింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేస్తే ఇచ్చే ఇన్సెంటివ్ను ఉపయోగించు కోవాలని సీఎం పేర్కొన్నారు. ‘‘ఏజెన్సీలు చాలాచోట్ల పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చాయి. సబ్ కాంట్రాక్టర్లతో సకాలంలో పనులు చేయించే బాధ్యత ఏజన్సీలదే. నేల స్వభావాన్ని బట్టి పైపులైన్ల నిర్మాణం అంచనాల్లో మార్పులు చేర్పులు అనివార్యం. అంచనాల మార్పు 48 గంటల్లో జరగాలి. దీనికి సంబంధించి నిర్ణీత–ప్రామా ణిక రేట్లను వర్తింపచేయాలి’’ అని సూచించారు. క్రాసింగ్స్ పనులపై సీఎస్కు ఆదేశం... క్రాసింగ్స్ వద్ద పనులకు అనుమతులు పొందేందుకు సంబంధిత శాఖల అధికారుల తో వెంటనే సమావేశం కావాలని ముఖ్య మంత్రి సీఎస్ను ఆదేశించారు. ‘‘మొత్తం 148 చోట్ల పైపులైన్ను నదులు దాటించాల్సి ఉంది. 53 చోట్ల పనులు పూర్తయ్యాయి. 1,477 చోట్ల కెనాల్స్ దాటాలి. 164 చోట్ల పనులు జరిగాయి. ఈ వేసవిలో మిగతా పనులు పూర్తవుతాయి. 237 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. 207 చోట్ల అనుమతులు వచ్చాయి. 44 చోట్ల పనులు పూర్తయ్యాయి. 442 చోట్ల జాతీయ రహదారులు దాటాలి. 418 క్రాసింగ్స్కు అనుమతి వచ్చింది. 57 చోట్ల పనులు పూర్తయ్యాయి. 4,447 చోట్ల ఆర్అండ్డీ రోడ్లు క్రాస్ చేయాలి. 590 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. 19 ఇన్టేక్ వెల్స్లో 11 పూర్తవగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి మార్చి నాటికి పూర్తవుతాయి. ఏప్రిల్ నుంచి ఇన్టేక్ వెల్స్ అన్నీ నీటిని పంప్ చేస్తాయి. 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 3 పూర్తవగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి’’ అని అధికారులు సీఎంకు వివరించారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమని చెప్పాం.. మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం కాబోతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘అన్ని రాష్ట్రాలూ మనవైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాల ప్రతినిధులు ఇక్కడకొచ్చి అధ్యయనం చేశారు. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించాం. అధికారులపై నమ్మకంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వర్కింగ్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. తాజా లక్ష్యాలు ఇవీ.. ⇔ 2017 జూన్ నాటికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి ⇔ మార్చి నాటికి 3,811 గ్రామాలకు నీటి సరఫరా ⇔ డిసెంబర్ నాటికి మరో 20,366 గ్రామాలకు నీరు ⇔ 2017 మార్చి నాటికి 2,671 ఓహెచ్ఎస్ఆర్లు పూర్తి ⇔ డిసెంబర్ నాటికి 15,602 ఓహెచ్ఎస్ఆర్ పూర్తి ⇔ 2017 మార్చి నాటికి 8,547 కి.మీ. మెయిన్ పైప్లైన్ ⇔ డిసెంబర్ నాటికి 42,780 కి.మీ. పైప్లైన్ పూర్తి ⇔ 2017 మార్చి నాటికి 9,79,245 గృహాలకు నీరు ⇔ డిసెంబర్ నాటికి 42,38,980 గృహాలకు నల్లా నీరు -
ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నడిపిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప డ్డారు. శనివారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అన్నట్టుగా సమావేశాలు జరిగాయన్నారు. టీఆర్ఎస్ గొప్పలను చెప్పుకోవ డానికి తప్ప ప్రజా సమస్యలను చర్చించలేదన్నారు. 94 గంటలపాటు సమావేశాలు జరిగితే 50 గంటలపాటు టీఆర్ఎస్ వాళ్లే మాట్లాడారన్నారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ వంటి పథకాలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిం దని అన్నారు. జీహెచ్ఎంసీలో అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానమే ఇవ్వలేదన్నారు. -
రైతులతో నేరుగా చర్చలు
రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో సమావేశాలు ► సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ► పలు కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో నేరుగా చర్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. త్వరలో ‘జనహిత’లో ఆయా వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎక్కువ మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయం– అనుబంధ రంగాలు, గొర్రెల పెంపకం, మత్స్య శాఖల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని సీఎం ఉద్ఘాటించారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటి పారుదల, మత్స్యశాఖ, గొర్రెల పెంపకం తదితర అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయాలు, చేయాల్సిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు రూపొందించి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన ప్రజల భాగస్వామ్యంతో, వారికి అవసరమైన రీతిలో జరగాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం తమ అభివృద్ధి, సంక్షేమం కోసం చేస్తున్నదే అన్న విశ్వాసం ఆయా వర్గాల్లో కలగాలన్నారు. లాభమంతా మత్స్యకారులకే.. ఇంతకాలం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యానికి గురైందని, చేపలు దిగుమతి చేసుకునే దుస్థితి నెలకొందని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని, చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్, వసతుల కల్పన, నిర్వహణ భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిర్వహణ వ్యయం పోగా మిగిలిన లాభం అంతా మత్స్యకారులకే దక్కేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. చేపలు పట్టుకుని జీవించే కులాలు, కుటుంబాలకు మేలు జరిగేలా కార్యక్రమం రూపొందిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో కూడా మనకు వాటాలు దక్కుతాయన్నారు. చేపల పెంపకం కోసం ప్రాజెక్టులను బాగా ఉపయోగించుకోవాలని, ప్రాజెక్టుల వద్దే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కోసం ప్రతి ప్రాజెక్టు వద్ద 10 శాతం నీళ్లు నిల్వ ఉంచాలని నిర్ణయం తీసుకున్నందున నీటి కొరత ఉండదన్నారు. గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం.. రాష్ట్రంలోని యాదవులు, కుర్మల ను ప్రోత్సహించి గొర్రెల పెంప కాన్ని విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా గొర్రెల పెంపకం ఉండాలన్నారు. ఏడాదికి లక్ష చొప్పున కనీసం రెండు లక్షల మందికి గొర్రె పిల్లలు కొనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనికి అనుగుణంగా గొర్రె పిల్లల పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అవసరాలకు తగ్గట్టు ప్రణాళిక ‘ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నీటిపారుదల రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్రంలో సాగుభూమి పెరుగుతుంది. రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, నేల స్వభావానికి ఏ రకమైన పంటలు అనుకూలమైనవి? ఏ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? ఏ నేలలో ఏ పంట వేయాలి? పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? వ్యవసాయదారుల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలేంటి? వ్యవసాయ యాంత్రీకరణ, గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ సాగు విధానాల ద్వారా ఎలాంటి పంటలు పండించవచ్చు? తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు, కార్యక్రమాలుండాలి’ అని సీఎం ఆదేశించారు. -
తాగునీటి సమస్యకు త్వరలో విముక్తి
► నిర్ణీత సమయంలో ‘భగీరథ’ పూర్తి చేస్తాం ► రాష్ట్రంలోని ప్రతి పల్లెకు మంచి నీరు ఇస్తాం: కేసీఆర్ ► ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నాం ► సీఎంతో కేంద్ర బృందం భేటీ ► ‘భగీరథ’ అద్భుత పథకమన్న కేంద్ర బృందం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని అంచెలను పటిష్టంగా అమలుచేస్తే గ్రామీణ వ్యవస్థ అభివృద్ధిలో పురోగమిస్తుందని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలను తాగునీటి సమస్య నుంచి విముక్తి చేస్తామని..ఇందుకోసం మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ‘భగీరథ’ పైపులతోపాటు ఇంటర్నెట్ కేబుల్ వేసి, ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించనున్నామని తెలి పారు. మిషన్ భగీరథతో పాటు రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పనితీరును పరిశీలిం చేందుకు కేంద్ర తాగునీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వ ర్యంలోని బృందం రాష్ట్రానికి వచ్చింది. గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో మర్యాద పూర్వకం గా భేటీ అయింది. ఈ భేటీలో తాగునీటి సరఫరాకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. దేశంలోనే ఇది అద్భుతం: మిషన్ భగీరథ పథకం దేశంలోనే అద్భుతమైన పథకమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ స్వయంగా తమకు ఈ విషయాన్ని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామీణ నీటి సరఫరా కార్యాచరణను పరిశీలించడానికి తాము వచ్చామన్నారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్లతో పరమేశ్వరన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. పనులు పూర్తయి పథకం అమల్లోకి వస్తే..తాగునీటిని అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నందుకు కేంద్రం ఇవ్వా ల్సిన రూ.800 కోట్ల నిధులను త్వర లో విడుదల చేస్తామన్నారు. పనులు పూర్తయిన తర్వాత ఇన్సెంటీవ్గా మరిన్ని నిధులను అందిస్తామన్నారు. వివిధ దేశాల్లో తాగునీటి సరఫరా కోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న కార్య క్రమాలను సీఎంకు వివరించిన అయ్యర్... చైనా, వియత్నాం, కెనడా వంటి దేశాలు కూడా ఇంత పకడ్బందీగా అమలు పర్చలేకపోయాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, జగదీశ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు
♦ రూ.900 కోట్ల గ్రాంటు కేటాయించండి ♦ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చే వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధిని రెండింతలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించాలని కోరింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్లుగా ఇస్తున్న రూ.450 కోట్ల నిధిని రూ.900 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రంలో పది జిల్లాలున్నాయి. అందులో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కు చేరిందని.. గతంలో ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పడిన 30 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపాదిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కొత్త రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2015–16లో రాష్ట్రంలోని వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేం ద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో రెండో విడత రూ.450 కోట్లు గత నెలలోనే కేటాయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పను లను మరింతగా విస్తరించాల్సిన అవసరమేర్ప డిందని, ఈ నేపథ్యంలో 2017–18లో వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే గ్రాంటును రూ.900 కోట్లకు పెంచాలని కోరింది. రూ.24,205 కోట్లకు కొర్రీ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెర్వుల పునరుద్ధరణకు కేం ద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మేరకు మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు కేటాయించాలని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవని, ఎప్పుడో పూర్తవుతాయో తెలియదంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిధులివ్వకుండా కొర్రీ వేసింది. వచ్చే రెండు మూడేళ్ల వ్యవధిలో వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలో వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర బడ్జెట్లో నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మేరకు నిధుల కోటాను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. స్థానిక సంస్థల కోటా ఏమైంది.. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను విధిగా విడుదల చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాని కి గుర్తు చేసింది. 2015–16లో పదమూడో ఆర్థిక సంఘం నిర్ధేశించిన మేరకు ఈ గ్రాంట్లు విడుదలయ్యాయి. ఆ ఏడాది రావాల్సిన రూ.778.73 కోట్లను కేంద్రం చివర్లో నిలిపేసింది. వాటిని ఆపేయడం సరైంది కాదని, వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు ఉన్నారు. -
ఇద్దరు మిషన్ భగీరథ కార్మికుల మృతి
వరంగల్ రూరల్: నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను పాకాల కొత్తగూడెం మిషన్ భగీరథ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట!
టెండర్లన్నీ ముందస్తు ఒప్పందంపై జరిగాయంటూ కాంగ్రెస్ ఫైర్ ► సభా సంఘం లేదా సీవీసీతో విచారణ జరిపించాలి: భట్టి ► నీళ్ల కోసం పైపులా.. పైపుల కోసం నీళ్లా ► టెండర్లు అంత తక్కువ లెస్కు ఎందుకు వచ్చాయి? ► ఇందులో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోంది ► అంచనాలు, టెండర్లను సభ ముందుంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న ‘మిషన్ భగీరథ’ పథకం అక్రమాల పుట్ట అని.. టెండర్ల ప్రక్రియ అంతా ముందస్తు ఒప్పందంపై జరిగినట్లుగా సందే హాలున్నాయని శాసనసభలో విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సభా సంఘం వేయా లని లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు ఈ పథకం డీపీఆర్పైనే అనేక అనుమానాలు ఉన్నాయని.. పనుల అంచనాలను రెండు మూడు రెట్లు పెంచి టెండర్లు పిలిచారనే ఆరో పణలున్నాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్ర మార్క పేర్కొన్నారు. స్థానిక వనరులను విని యోగించుకోకుండా ఎక్కడో రిజర్వాయర్లు నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీళ్లివ్వడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఇలా కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీళ్లివ్వడం ద్వారా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ల పరిధిలోనే రూ.110 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. చెరువులను ఎందుకు వినియోగించుకోరు? రాష్ట్రవ్యాప్తంగా చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తున్నప్పుడు.. వాటి ల్లో పెద్ద వాటిని రిజర్వాయర్లుగా మార్చి నీటిని సరఫరా చేయవచ్చు కదా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు ఖర్చు పెడుతు న్నారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లకు రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా రని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.1.4 లక్షల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ మొత్తం నీటిని పారిస్తామంటున్న ప్రభుత్వం... మళ్లీ రూ.45 వేల కోట్లతో ‘మిషన్ భగీరథ’ను ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయని ప్రభుత్వం భావించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నీళ్లు వస్తాయనుకుంటే ఈ 45 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్ హయాంలో నిర్మించిన శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్లైన్ నుంచే నీటిని తీసుకుని ‘మిషన్ భగీరథ’గా చెబుతూ గజ్వేల్ నియోజకవర్గానికి మళ్లించారన్నారు. పైగా దానిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించి, తమ ఘనతేనని చెప్పుకొంటున్నారని భట్టి ఎద్దేవా చేశారు. టెండర్లలో గోల్మాల్ మిషన్ భగీరథ టెండర్లలోనే గోల్మాల్ జరిగిందని, ముందస్తు అవగాహనతో ఇంటి దగ్గర కూర్చుని టెండర్లు రాసుకున్నట్టు ఉందని భట్టి ఆరోపించారు. మిషన్ కాకతీయకు 20–35 శాతం వరకు లెస్కు టెండర్లు వస్తే.. ‘భగీరథ’కు కేవలం 0.2 – 0.5 శాతం వరకు మాత్రమే లెస్ టెండర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పైనే తమకు అనుమానాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన వివరాలన్నీ సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కోసం 11 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నట్లుగా కాగ్ నివేదికలో పేర్కొందని.. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఏటా రూ.4,500 కోట్లు అవసరమని భట్టి పేర్కొన్నారు. ఈ వడ్డీతోపాటు అసలు చెల్లించేందుకు, పథకం నిర్వహణకు కలిపి ఏటా సుమారు రూ.12 వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. ఇంత భారాన్ని ప్రజలపై మోపితే ఎలాగని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు ఏం చేయాలని నిలదీశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.62 వేల కోట్ల అప్పులుంటే ఈ రెండేళ్లలో అవి రూ.1.25 లక్షల కోట్లకు పెరిగాయని... ఇంత అడ్డగోలుగా ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. దీనిపై హౌజ్ కమిటీ వేయాలని లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భగీరథ మంచిదే మిషన్ భగీరథ పథకం మంచిదని.. రాజకీయాల కోసం దీనిని విమర్శించడం మంచిది కాదని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్కు నీరిచ్చే జంట జలాశయాల వద్ద అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సింగూరు ద్వారా నీళ్లివ్వాలని మజ్లిస్ సభ్యుడు ముంతాజ్ఖాన్ కోరారు. ఉత్పాదక రంగాలపై ఖర్చు పెడితే ఫలితం ఉంటుందని, మిషన్ భగీరథలాంటి అనుత్పాదక పథకాన్ని కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో దశలవారీగా పూర్తి చేయా లని.. ఇన్ని వేల కోట్లు ఆ పథకానికి ఖర్చు చేయడం మంచిది కాదని టీడీపీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సూచించారు. పారదర్శ కతతో వేగంగా పథకాన్ని అమలు చేయాలని.. గిరిజన ఆవాసాలన్నింటికీ నీరందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. ఈ పథకం దళితుల ఆత్మగౌరవ పథకమని అధికార పక్ష సభ్యుడు రసమయి పేర్కొన్నారు. ఆయన విపక్ష సభ్యులనుద్దేశించి విమర్శలు చేయడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. -
ప్రత్యేక సాయం రూ.450 కోట్లు
రెండో విడత నిధుల విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక సాయం కింద మంగళవారం రూ.450 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం (పాత) జిల్లాలకు 2016–17 ఆర్థిక సంవత్స రానికి ప్రత్యేక సహాయంగా ఈ నిధులు విడుదల చేసింది. గతేడాది మొదటి విడతగా కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.900 కోట్లు ప్రత్యేక సాయం అందింది. ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు వీటిని ఖర్చు చేయాలని కేంద్రం నిర్దేశించింది. హైదరాబాద్ మినహా తొమ్మిది పాత జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఈ నిధులను మంజూరు చేసింది. కేంద్రం ప్రత్యేక సాయం కింద నిధులు విడుదల చేయడం పట్ల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి హర్షం వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాదిలో ప్రతి జనావాసానికీ నీళ్లు
‘మిషన్ భగీరథ’పై మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్ ► తర్వాత ఇంటింటికీ కచ్చితంగా మంచి నీరు అందిస్తాం ► పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళుతున్నాం ► విపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. వచ్చే సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ప్రతి జనావాసానికీ మంచి నీరు అందేలా చూస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కచ్చితంగా నీరందిస్తామని తెలి పారు. మంగళవారం అసెంబ్లీలో ‘మిషన్ భగీ రథ’పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. గొప్పఆలోచనల వెనుక తీవ్ర గాయాలుంటాయని, సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అయిన గాయాలకు మందు పూసే విధంగా దేశానికే ఆదర్శవంతంగా ‘మిషన్ భగీరథ’ను ముందుకు తీసుకెళుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో తాగునీటి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మంచి నీటి పథకాలేవీ పనిచేయడం లేదని.. బోర్లు, ఇతర మంచినీటి పథకాలకు నీటి లభ్యత లేక నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచించినట్టుగా కృష్ణా, గోదావరిల నుంచి తెలంగాణ వాటాగా వచ్చే 1,200 టీఎంసీల నీటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ ఇబ్బంది ఉండదన్నారు. అపోహలు వద్దు: మిషన్ భగీరథ విషయంలో అపోహలు అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అయినా అపోహలు ప్రజాక్షేత్రంలో లేవని, ప్రతిపక్షాల మనసులో మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేసిన పనుల్లోనూ కాంట్రాక్టర్లు తక్కువకు, ఎక్కువకు టెండర్లు వేశారని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తే.. తాము తెలంగాణ కాంట్రాక్టర్లను తయారుచేసే పనిలో ఉన్నామని చెప్పారు. గతంలో జరిగిన పనులపై కూడా తాము అనుమానాలు వ్యక్తం చేయగలమని, అయితే తమకు సంస్కారం అడ్డువస్తోందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ విషయంలో తాము తక్కువ (లెస్)కు టెండర్లు ఇస్తే రూ.122 కోట్ల ప్రజాధనం మిగిలిపోయిందనేది కాంగ్రెస్ నేతల బాధ అని, నల్లాల్లో నీళ్లు వస్తే తమ పని అయిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆదాయమూ వస్తుంది: గతంలో ఉన్న మంచినీటి పథకాల కోసం తవ్విన పైపులైన్లను, ఇతర నిర్మాణాలను మిషన్ భగీరథ కోసం ఉపయోగించుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. ‘మిషన్ భగీరథ’ద్వారా వచ్చిన నీళ్లను పరిశ్రమలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సరఫరా చేయడం ద్వారా ఏటా రూ.1,900 కోట్ల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకెళుతున్నామని.. కేశవాపూర్, మల్కాపూర్ల వద్ద 20 టీఎంసీల చొప్పున రిజర్వాయర్లను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో వినూత్న పథకమని హడ్కో అభినందించిందని, మన్ కీబాత్లో ప్రధాని మోదీ కూడా మిషన్ భగీరథను అభినందించారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్తో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించాయన్నారు. పూర్తిస్థాయి అవగాహనతో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తూ మిషన్ భగీరథను ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా దానిని పూర్తి చేసి తీరుతామని చెప్పారు. -
మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్
-
మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్
హైదరాబాద్: ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటింటికి మంచి నీటితోపాటు ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం మిషన్ భగీరథ పైప్లైన్లతోపాటు ఫైబర్ గ్రిడ్ కేబుల్ను ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కేటీఆర్ చెప్పారు. అయితే మిషన్ భగీరథ డీపీఆర్పై అనుమానాలున్నాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. కొన్నిచోట్ల అవసరం లేకపోయినా పైప్లైన్లు వేస్తున్నారని, కేవలం డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. -
ఈ గోస తీరేదెన్నడు?
నగదు కోసం జనం అవస్థలు సాక్షి నెట్వర్క్: నగదు కష్టాలు సామాన్య జనానికి చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. రైతులు, మహిళలు, చిరువ్యాపారులే కాదు.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. చాలా చోట్ల బ్యాంకుల వద్ద అర్ధరాత్రి నుంచే జనం బారులు తీరుతున్నారు. ఉదయం బ్యాంకుల గేట్లు తెరవడంతోనే తోపులాటలు, తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వృద్ధులు, పలువురు ఖాతాదారులు గాయాలపాలవుతున్నారు. గంటలు గంటలు క్యూలో నిలబడలేక స్పృహతప్పి పడిపోతున్నారు. ‘గ్రేటర్’ కష్టాలు..: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో కరెన్సీ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. శుక్రవారం కూడా జనం బ్యాంకులు, ఎక్కడో ఓ చోట తెరచుకున్న ఏటీఎంల వద్ద కిలోమీటర్ల మేర బారు లు తీరారు. వారిలో కొందరికే నగదు లభ్యంకాగా పెద్ద సంఖ్యలో నిరాశతో వెనుదిరిగారు. పలు బ్యాంకుల్లో ‘నో క్యాష్’ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగుట్టలోని ఓబీసీ బ్యాంకు వద్ద క్యూలైన్లో నిల్చున్న ఖాతాదారుల మధ్య తోపులాట జరిగి.. బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు ఖాతాదారులతోపాటు సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాలు.. రాస్తారోకోలు.. నోట్ల రద్దుతో నల్లధనం బయటపడడం ఏమోగానీ, తాము మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎస్బీహెచ్ ఎదుట ఖాతాదారులు రాస్తారోకో చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లోని ఎస్బీఐకి ఉదయమే పెద్ద సంఖ్యలో ఖాతాదారులు చేరుకున్నారు. కానీ బ్యాంకులో నగదు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడి నాందేడ్– అకోలా రహదారిపై రాస్తారోకో చేశారు. ఇక రోజూ లైన్లో నిలబడుతున్నా డబ్బులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలోని సిండికేట్ బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు రాస్తారోకో చేశారు. మిషన్ భగీరథ పథకం పైపులను రోడ్డుపై అడ్డంగా పెట్టి ఆందోళన చేయడంతో.. గంటకుపైగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్నగర్ స్టాఫ్కాలనీలోని స్టేట్బ్యాంక్ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడ్డ కన్నాల గ్రామానికి చెందిన వృద్ధుడు కాల్వ కొంరయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. బ్రష్ పట్టుకొని లైన్లోకి.. నగదు విత్డ్రా కోసం బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్న ఖాతాదారులు.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని ఎస్బీహెచ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రజలు బారులు దీరారు. అందులో కొందరు క్యూలో నిలబడే పళ్లు తోముకుని, టీ తెప్పించుకుని తాగారు. నగదు కోసం రోడ్డెక్కిన రైతన్న ధాన్యం అమ్మినా.. ఆ డబ్బులు చేతికందక రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై రైతులు, మహిళలు రాస్తారోకో చేశారు. ఇక్కడి కేడీసీసీబీ బ్రాంచీ వద్ద నగదు విత్డ్రా చేసుకునేందుకు ఉదయం నుండే రైతులు, మహిళలు బారులు తీరారు. అయితే బ్యాంకులో మధ్యాహ్నం ఒంటి గంటకే నగదు అయిపోయింది. దీంతో అప్పటికే గంటల తరబడి క్యూలైన్లో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, బ్యాంకర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిడ్డ పెళ్లికి డబ్బులివ్వండి ‘ఉపాధి కోసం కొన్నేళ్లుగా దుబాయ్లో ఉంటున్నా.. నాకు ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు ఈ నెల 28న వివాహం జరుగనుంది. సెలవుపై దుబాయ్ నుంచి వచ్చా.. ఇక్కడ పెద్ద నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు బిడ్డ పెళ్లి ఎలా చేయాలి..?’ జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నేరెళ్ల నడ్పి నర్సయ్య ఆవేదన ఇది. శుక్రవారం కోరుట్ల ఎస్బీఐ మేనేజర్ను కలసి, పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు విత్డ్రా చేసుకుంటామని కోరారు. పెళ్లి ఖర్చుల చెల్లింపులు స్వీకరించేవారి ఖాతా నంబర్లు ఇస్తే నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని మేనేజర్ చెప్పారు. కానీ పెళ్లి పనులు చేసే వారు ఖాతాల్లో డబ్బు వేస్తామంటే ఒప్పుకోవడం లేదని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను సొమ్ము అందక బ్యాంకు వద్దే కన్నుమూత కర్నూలు జిల్లా డోన్లో వృద్ధురాలు మృతి డోన్ టౌన్: పింఛను సొమ్ము అందక ఓ పండుటాకు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా డోన్లో శుక్రవారం చోటు చేసుకుంది. డోన్ మండలం మల్యాలకు చెందిన బాణాల సుంకులమ్మ (75) వితంతు పింఛనుపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీల పాట పాడుతున్న ప్రభుత్వం అంద రు పింఛనుదారులకులాగానే సుంకులమ్మ పిం ఛన్ను కూడా డోన్ ఆంధ్రాబ్యాంక్లో ఎప్పుడో తెరిచిన ఆమె పొదుపు ఖాతాలో జమ చేసింది. కొంతకాలంగా లావాదేవీలు లేకపోవడంతో ఆ ఖాతా రద్దయ్యింది. వారం పాటు బ్యాంకు చుట్టూ తిరిగి ఖాతాను పునరుద్ధరించుకుంది. శుక్రవారం డబ్బులు తీసుకుందామని వెళ్లిన సుంకులమ్మకు బ్యాంకు సిబ్బంది ఖాతాలో కనీస మొత్తం ఉంచనందుకు చార్జీల కింద రూ.688 మినహాయించుకున్నామని, అవి పోగా రూ.312 మాత్రమే ఖాతాలో ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పుడు ఇచ్చేందుకు వీల్లేదని చెప్పడంతో షాక్తో బ్యాంకులోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఇదో రకం ‘చిల్లర’ కష్టం.. బ్యాంకుల్లో నగదు లేదు.. ఖాతాదారులేమో అత్యవసరం, డబ్బు కావాలి అంటున్నారు.. దీంతో పలు చోట్ల బ్యాంకుల సిబ్బంది రూ.10, రూ.5 చిల్లర నాణాలను ఖాతాదారులకు ఇస్తున్నారు. ఇలా శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎస్బీహెచ్లో నలుగురు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు రూ.20 వేల విలువైన పది రూపాయల నాణాలు ఇచ్చారు. వారు దాదాపు గంట పాటు బ్యాంకు ఆవరణలో కూర్చుని.. ఆ నాణాలను లెక్కబెట్టి పంచుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన బోరెడ్డి జీవన్రెడ్డికి కూడా బ్యాంకు సిబ్బంది రూ.20 వేల విలువైన పది రూపాయల నాణాలు ఇచ్చారు. ఆయన వాటిని ఓ సంచీలో నింపుకొని వెళ్లారు. వాటి బరువుతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
టీఆర్ఎస్ సాధించిన విజయమిది: కేటీఆర్
బాలారిష్టాలను అధిగమించడానికే ఏడాది పట్టింది ఇప్పటిదాకా 62వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పుంజుకుంటుంది కేంద్రం నుంచి కొన్ని అంశాల్లో సహకారం అందుతోంది 2019 ఎన్నికల్లో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్తోనే పోటీ ప్రజలు దీవిస్తే మరో ఐదేళ్లు కొనసాగుతామని వెల్లడి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి సాక్షి, హైదరాబాద్ రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక సుస్థిరత సాధించామని, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్పై భరోసా కల్పించామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్లో నేరాల సంఖ్య తగ్గిందని, పెట్టుబడులు పెరిగాయని, హైదరాబాద్ బ్రాండ్ఇమేజ్ పెంచామని చెప్పారు. కొత్త రాష్ట్రాలు కుదురుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నాయని వివరించారు. తెలంగాణకు తొలి ఎనిమిది, తొమ్మిది నెలల పాటు అధికారులే లేరని, బాలారిష్టాలను అధిగమించడానికే ఏడాది పట్టిందని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయిన సందర్భంగా కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు, విపక్షాల విమర్శలు, వచ్చే రెండున్నరేళ్లకు పెట్టుకున్న లక్ష్యాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేటీఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... సంక్షేమంలో ముందున్నాం ‘‘యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోంది. మిషన్ భగీరథపై అధ్యయనానికి 8 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి వెళ్లారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. సమగ్ర కుటుంబ సర్వే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శి అయింది. సంక్షేమ రంగంలో ఎవరూ చేయలేని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పని వాటినీ అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సన్న బియ్యం వంటివి అలాంటివే. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొంత మందకొడిగా జరుగుతోంది. ఇతర నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లే గృహ నిర్మాణంలో ఉండడంతో కొంత సమస్య ఎదురైంది. వేగం పెంచేందుకు రూ.5 వేల కోట్లు అందుబాటులో పెట్టాం. దళితులకు మూడెకరాల భూమి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమిస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానంతో సరిపెట్టం. చెల్లప్ప, సుధీర్ కమిటీల నివేదికలను ముందు పెట్టి కేంద్రాన్ని ఒప్పిస్తాం. ఒక్క రాత్రిలో విశ్వనగరం కాదు హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలంటే కనీసం ఏడెనిమిదేళ్ల సమయం పడుతుంది. రాత్రికి రాత్రే విశ్వనగరం కాదు. రెండేళ్లలో గుర్తించదగిన రీతిలోనే అభివృద్ధి చేసి చూపుతాం. మెట్రో రైలు వాస్తవానికి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి కావాలి. ఏడాది ఆలస్యంగా 2018లో అందుబాటులోకి వస్తుంది. 2017 మే నాటికి మొదటి దశ అందుబాటులోకి వస్తుంది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు అభివృద్ధి చేస్తాం. నాలుగు స్కైవేల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నాం. పరిశ్రమలకు ఊతం పారిశ్రామిక రంగంలో దూకుడుతో పనిచేస్తాం. టీఎస్ ఐపాస్ ద్వారా మెరుగైన పారిశ్రామిక విధానం తెచ్చాం. కేవలం ఇరుగు పొరుగు రాష్ట్రాలతోనే కాదు మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స వంటి దేశాలతోనూ పోటీ పడుతున్నాం. ఇప్పటికే నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ హామీ విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 2 వేల కిలోమీటర్లు కేబుల్స్ వేశాం. మొత్తం 50 వేల కిలోమీటర్లు వేయాల్సి ఉంది. ఇలా భూగర్భంలో కేబుల్స్ వేస్తోంది దేశంలో తెలంగాణ ఒక్కటే. ఫార్మా సిటీని కూడా 2018 వరకు ప్రారంభిస్తాం. కేంద్రం కొన్ని విషయాల్లో సహకరిస్తోంది. కానీ ఐటీఐఆర్, పోలవరం, హైకోర్టు విభజన వంటి విషయాల్లో ఇబ్బందిగానే ఉంది. జాతీయ రహదారుల విషయంలో సానుకూలత వచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి - సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తాం. ఇప్పటిదాకా 62 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. నోట్ల రద్దుతో రాష్ట్రం కుదేలు నోట్ల రద్దు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్లు పెరుగుతాయనుకున్నాం. కానీ దీనితో రిజిస్ట్రేషన్లు కుదేలు అయ్యారుు. నెలకు రూ.1,500 కోట్ల నుంచి రూ. 2వేల కోట్ల దాకా ఆదాయానికి గండిపడినట్లే. రద్దును మొదట్లో వ్యతిరేకించాం, వాస్తవమే. ఇక తప్పదని తేలాక దానికి అనుగుణంగా వెళుతున్నాం. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ముందు ముందు అందరూ ఆదాయపన్ను పరిధిలోకి వస్తే దేశ ఆదాయంతో పాటు మన వాటా కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ తరపున టీఎస్ వ్యాలెట్ను సిద్ధం చేస్తున్నాం. అయితే తొందర పడడం లేదు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. సిద్ధిపేట ఫలితాలు చూశాక టీఎస్ వ్యాలెట్పై ముందడుగు వేస్తాం. రాష్ట్రంలో అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు కృషి చేస్తున్నాం. కోదండరాం స్థాయి తగ్గించుకుంటున్నారు.. ‘‘కోదండరాం తన స్థాయి తానే తగ్గించుకుంటున్నారు. ఎవరు టెంట్ వేస్తే వారి దగ్గరకు వెళుతున్నారు. ములుగు ప్రత్యేక జిల్లా కావాలంటూ రేవంత్రెడ్డితో వేదిక పంచుకున్నారు. జయశంకర్ పేరున జిల్లా ఉండడం ఇష్టం లేదా? జయశంకర్, కేసీఆర్లతో వేదిక పంచుకున్న కోదండరాం చివరకు రేవంత్ స్థాయికి పడిపోయారా? ఆయన ప్రతిపక్షాల ఉచ్చులో పడ్డారు. సీఎం అధికారిక నివాసం కేసీఆర్ సొంతానికి కట్టుకున్నారా? అది రాష్ట్ర ప్రజలదే. ఎవరు సీఎం అయితే వారుంటారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు విలాసాలకు ఖర్చు పెడితే నిలదీయండి. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు కట్టరు. అన్నీ ఒకేసారి చేస్తూ పోవడం తప్పా. ‘ఓటుకు నోటు’లో ఎలాంటి రాజీ లేదు కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలి. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై దృష్టి పెట్టాం. ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా దృష్టి పెడతాం. ‘ఓటుకు నోటు’కేసులో ఎలాంటి రాజీ లేదు. అది కోర్టులో ఉన్న విషయం. ఇక పార్టీల మార్పిడి ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన విషయం. ఆయా పార్టీల నేతలు వారి రాజకీయ భవిష్యత్ను ఆలోచించుకునే వస్తరు. ఒత్తిడికి గురిచేసి తెస్తే తప్పు. 2019 ఎన్నికల్లో మాకు పోటీ అవసాన దశలో ఉన్న కాంగ్రెస్తోనే ఉంటుంది. మేం అసలు అధికారంలోకి వస్తం, మంత్రులమవుతం అనుకోలేదు. ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో విలీనం అవుతం అనుకున్నం. కేసీఆర్ను ప్రజలు దీవించారు. ఐదేళ్ల కోసం ఎన్నికయ్యాం. ప్రజలు దీవిస్తే మరో ఐదేళ్లు కొనసాగుతం. -
2018నాటికి ‘భగీరథ’కు 41.31 టీఎంసీలు
► 2033కి 50.6 టీఎంసీలు, 2048కి 60.75 టీఎంసీలు ► రాష్ట్ర తాగునీటి అవసరాలపై లెక్కలేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల నుంచి రాష్ట్ర తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ఏ మేర నీటి అవసరాలు ఉంటాయన్న అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టింది. నిజానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని మొదట నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్కు కేటాయించింది. కృష్ణా బేసిన్లో 19.59 టీఎంసీలు, గోదావరి 19.67 టీఎంసీలు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని సవరించింది. కృష్ణాలో 18.20 టీఎంసీలు, గోదావరిలో 23.11 టీఎంసీల నీటిని తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. 2018నాటికి మొత్తంగా 41.31 టీఎంసీలను వినియోగించాలని నిర్ణయించింది. ఇక 2033 నాటికి రాష్ట్ర నీటి అవసరాలు కృష్ణాలో 21.49, గోదావరిలో 29.11 టీఎంసీ కలిపి మొత్తంగా 50.6 టీఎంసీలకు పెరుగుతాయని లెక్కలేసింది. 2048లో కృష్ణాలో 24.98, గోదావరిలో 35.77 టీఎంసీలు కలిపి మొత్తంగా 60.75 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా వేసింది. ఈ అవసరాలకు తగ్గట్లు నీటిని తీసుకునేలా సహకరించాలంటూ రెండ్రోజుల కిందట గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) నీటి పారుదల శాఖను కోరింది. నీటిపారుదల శాఖ అందుకు సమ్మతం తెలుపుతూ మెమో జారీ చేసింది. -
‘గ్రేటర్ మిషన్’కు మోక్షం
శివార్లకు మంచినీటి భాగ్యం మిషన్ భగీరథకు జీహెచ్ఎంసీ అనుమతులు 2700 కి.మీ పైప్లైన్ పనుల కోసం రోడ్కటింగ్కు ఓకే 2017 మే నాటికి పనుల పూర్తికి చర్యలు సిటీబ్యూరో: మహా నగరంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు ఉద్దేశించిన గ్రేటర్ మిషన్ భగీరథ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 2700 కి.మీ మేర మంచినీటి సరఫరా పైప్లైన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ రహదారుల కోత(రోడ్ కటింగ్)కు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం రెండు విభాగాల ఉన్నతాధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్లు సమావేశం నిర్వహించి ఈ పనుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇందులో 2000 కి.మీ మార్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను జలమండలి సొంత నిధులతో పూర్తిచేయనుంది. మరో 700 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్న భారీ మైల్డ్స్టీల్ పైపులైన్ల కారణంగా దెబ్బతినే రహదారుల పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీకి జలమండలి చెల్లించనుంది. పైప్లైన్ పనులు పూర్తరుున వెంటనే రహదారుల మరమ్మతులు పూర్తిచేయాలని ఈ సమావేశంలో నిర్ణరుుంచారు. కాగా 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో ఏర్పాటు చేయాల్సిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులకు ఏడాది తర్వాత అనుమతులు లభించడం విశేషం. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను వచ్చే ఏడాది మే నాటికి దశలవారీగా పూర్తిచేసి 250 మిలియన్ లీటర్ల తాగు నీటిని వీటిల్లో నింపనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపారుు. వచ్చే ఏడాది మే నాటికి గ్రేటర్ మిషన్ భగీరథ పథకం పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ఈ పథకం పూర్తితో శివార్లలో సుమారు 35 లక్షలమంది దాహార్తి తీరనుందని పేర్కొన్నారు. గ్రేటర్ మిషన్ భగీరథ పనుల పూర్తి ఇలా... రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం {పాంతాన్ని బట్టి ఒక మిలియన్ లీటర్ సామర్థ్యం నుంచి 22.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం వరకు స్టోరేజి రిజర్వాయర్లున్నారుు. కౌకూర్, జొన్నబండ రిజర్వాయర్లు మినహా 54 స్టోరేజి రిజర్వాయర్ల పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. వీటిలో 10 రిజర్వాయర్లను జనవరి, 2017, మరో పదింటిని ఫిబ్రవరి, మరో పదింటిని మార్చి, మరో పదింటిని ఏప్రిల్, మిగిలిన వాటిని మే 2017 నాటికి పూర్తిచేయనున్నారు. అన్ని స్టోరేజి రిజర్వాయర్లకు నీటిని నింపే ఇన్లెట్ పైపులైన్ల ఏర్పాటు పనులను డిసెంబరు నాటికి పూర్తిచేయనున్నారు. స్టోరేజి రిజర్వాయర్ల నుంచి సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలకు మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన పంపిణీ పైప్లైన్లను మే 2017 నాటికి ఏర్పాటుచేయనున్నారు. మంచినీటి సరఫరాకు 100 డయా వ్యాసార్థం గల డకై ్టల్ ఐరన్పైపులు..స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపేందుకు 1300 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్స్టీల్ పైప్లైన్లను ఏర్పాటు చేయనున్నారు. పనుల పూర్తి అనంతరం గ్రేటర్ (625 చ.కి.మీ)పరిధిలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయనున్నారు -
అవినీతికి పాల్పడితే కాల్చేయండి: మంత్రి తుమ్మల
కమ్మర్పల్లి: తాము అవినీతికి పాల్పడితే నడి బజారులో కాల్చివేయాలని రోడ్డు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం తప్ప అన్యాయం చేయడానికి కాదన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో రూ.2.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే కమ్మర్పల్లి భీమ్గల్ రోడ్డు రెన్యూవల్ పనులు, భీమ్గల్తో పాటు బడాభీమ్గల్లో రూ.30కోట్లతో పలు రోడ్ల విస్తరణ పనులకు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ అధికారం కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వ పాలనపై ఏడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వానలు పడినా, చెరువులు నిండినా, ప్రతిపక్షాలకు ఏడ్పుగోలే ఉందన్నారు. -
మిషన్ భగీరథ పనుల్లో జాప్యం
-వర్క్ ఏజెన్సీల ప్రతినిధులపై టీడీడబ్ల్యుఎస్సీ వైస్ చైర్మన్ ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు నాలుగు సెగ్మెంట్లలో నత్తనడకన సాగుతున్నాయని తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయా సెగ్మెంట్లలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ-జనగాం, శ్రీశైలం-రంగారెడ్డి, పరకాల-వరంగల్, సంగారెడ్డి-మెదక్ సెగ్మెంట్లలో పనుల్లో జాప్యంపై వర్క్ ఏజెన్సీల ప్రతినిధులను ఆయన వివరణ కోరారు. సిబ్బంది సంఖ్యను భారీగా పెంచుకోవాలని, కావాల్సిన మేరకు యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. సాంకేతిక అనుమతుల విషయమై ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పనులు జరిగిన వెంటనే బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ, జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. సకాలంలో పనులు చేయని వర్క్ ఏజెన్సీలపై కఠిన చర్యలు చేపడతామని ప్రశాంత్రెడ్డి హెచ్ఛరించారు. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా భగీరథ పనులన్నీ పూర్తి కావాల్సిందేనన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్కుమార్, కృపాకర్రెడ్డి, జగన్ మోహన్రెడ్డి తదితరులున్నారు. -
భగీరథకు భెల్ సాంకేతికత
పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం సర్కారు సంప్రదింపులు 2,900 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్ల కొనుగోలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్లో పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు నిమిత్తం అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్.. భెల్) నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి గురువారం సచివాయలంలో బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్కు అవసరమైన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాల నిమిత్తం బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 1,066 మోటార్లు అవసరమని, 10 నుంచి 2,900 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లను తయారు చేసి సకాలంలో అందించాలని ప్రశాంత్రెడ్డి బీహెచ్ఈఎల్ అధికారులను కోరారు. అంతకు మునుపు భగీరథ ప్రాజెక్ట్ లక్ష్యం, పురోగతి, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును అధికారులకు ప్రశాంత్రెడ్డి వివరించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై అవగాహనతోనే, కాంటూర్ల ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారని చెప్పారు. రాష్ట్రంలోని 26 సెగ్మెంట్లలో, 250 ప్రదేశాల్లో ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. బీహెచ్ఈఎల్ అధికారులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్ట్కు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని, ప్రాజెక్ట్ యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను అందిస్తామన్నారు. త్వరలోనే సమగ్ర ప్రొడ క్షన్ ప్లాన్తో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, ప్రభుత్వ సలహా దారు జ్ఞానేశ్వర్, ఓఎస్డీ సత్యపాల్, బీహెచ్ఈఎల్ జనరల్ మేనేజర్లు నరేంద్ర కుమార్, జీకే హెడూ, అదనపు జీఎం పంకజ్ రస్తోగి, మార్కెటింగ్ నిపుణుడు గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం
70 శాతం పూర్తయిన ప్రధాన పైప్లైన్ పనులు బాన్సువాడ : మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్లైన్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్బెడ్ పనులు పూర్తయ్యాయి. పైప్లైన్, ఇంటెక్వెల్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దే హసన్పల్లిలో ఫిల్టర్ బెడ్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్లైన్ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్లైన్ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్స్టోరేజీ వాటర్ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్ వద్ద నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. పైప్లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్ ఓపెన్ చేస్తే నిజామాబాద్ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాగుతున్న పైప్లైన్ పనులు ప్రధాన పైప్లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్లను డంప్ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మిషన్ భగీరథ పై సీఎం సమీక్ష
-
భళా.. భగీరథ!
► దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది: సీఎం కేసీఆర్ ► కేంద్రం అమలు చే యాలని యోచిస్తోంది ► ఇప్పటికే ఆరు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి ► వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ‘భగీరథ’ లక్ష్యం పూర్తికావాలి ► అధికారులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబు సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోందని, ఆరు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్ భగీరథను అధ్యయనం చేశాయని చెప్పారు. వివిధ ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథకు రూ.22 వేల కోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం వస్తుందని తెలిపారు. ఇంకా అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సీఎం కితాబిచ్చారు. 2017 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పూర్తి కావడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైనవిగా భావించాలన్నారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను అధిగమించాలని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతిని అందరూ గుర్తించాలన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్ల నిరా్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధుల కొరత లేదని, బిల్లులు కూడా వెంటనే చెల్లిస్తున్నందున పనులు వేగంగా జరిగేలా వర్క్ ఏజెన్సీలతో మాట్లాడాలని చెప్పారు. పనులు సకాలంలో చేస్తే ప్రోత్సాహకం గ్రామాల్లో అంతర్గత పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేస్తే 1.5 శాతం ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందులోనే వేయాలని, దీనికి ఐటీ శాఖ నుంచి సాంకేతిక అంశాలపై సలహా తీసుకోవాలని సూచించారు. తక్కువ జనాభా ఉన్న ఆవాస ప్రాంతాల్లో హెచ్డీపీఈ పైపులు వేయాలా? పీవీసీ పైపులు వేయాలా? అన్న అంశంపై నిర్ణయాధికారాన్ని ఈఈలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు 365 రోజులపాటు 24 గంటలూ అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖకే ఉంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనులు కూడా చేయాల్సి ఉన్నందున ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందని, అందుకే ఆర్డబ్ల్యూఎస్ శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పని విభజన పకడ్బందీగా జరగాలన్నారు. ప్రశాంత్రెడ్డి మంత్రితో సమానం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మంత్రితో సమానమని సీఎం అన్నారు. ‘‘మిషన్ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. వైస్ చైర్మన్గా నియమితులైన వేముల ప్రశాంత్రెడ్డికి కేబినెట్ హోదా కల్పించినం. ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఉంది. స్వయంగా ఇంజనీర్ అయిన ప్రశాంత్రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు’’ అని కేసీఆర్ చెప్పారు. -
ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’
‘మిషన్’పై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించే కార్యక్రమం ఎస్సీ కాలనీల నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. దళిత వాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు సహా ప్రతి ఇంటికీ తప్పక నీరు చేరేలా చూడాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని, అందువల్ల మంచినీటి పథకం వారితోనే ప్రారంభం కావాలన్నారు. ఆ తర్వాతే మిగతా ఇళ్లకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా జలాలు సరఫరా అయ్యేలా పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నీటిని అందించాలన్నారు. నల్లాల బిగింపు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యచరణతో పనులు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఎస్డీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సీఈ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, మోటర్ల ఫిట్టింగ్ తదితర పనులన్నీ 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు... అన్ని జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది అయినందున మంత్రులు, కలెక్టర్లు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. రైల్వే క్రాసింగ్లు దాటుకుని, అటవీ అనుమతులు సాధించి, ప్రైవేటు భూముల యజమానులను ఒప్పించి రికార్డు సమయంలో పైపులైన్లు నిర్మించడాన్ని దేశమంతా గుర్తించి అభినందిస్తుందని సీఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు జరగాలని, ఎక్కడైనా పనులు నెమ్మదిగా సాగితే వెంటనే వర్కింగ్ ఏజెన్సీతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన విద్యుత్ను నిరంతరంగా అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పది శాతం నీటిని తాగునీటికి రిజర్వ్ చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని, ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లోనూ కొంత కేటాయిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో పనులు చేసిన ఏజెంట్లకు ఇన్సెంటివ్లు ఇచ్చే విధానం కూడా ఉన్నందున దాన్ని వినియోగించుకోవాలన్నారు. బీహెచ్ఈఎల్ ద్వారా కొనుగోళ్లు... మిషన్ భగీరథకు అవసరమయ్యే ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద ఎత్తున మోటర్లు, పంపింగ్ సామగ్రి అవసరమున్నందున బీహెచ్ఈఎల్ ద్వారానే వాటిని సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో బీహెచ్ఈఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్ భగీరథలోనూ అలాగే జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థతో పని వల్ల అనవసర రాద్ధాంతాలేవీ ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు. బీహెచ్ఈఎల్ సీఎండీ అతుల్ సోమ్టితో సీఎం ఫోన్లో మాట్లాడారు. మిషన్ భగీరథ కోసం 50 హెచ్పీ నుంచి 1000 హెచ్పీల వరకు మోటర్లు కావాలని, వాటిని సమకూర్చాలన్నారు. దీనిపై ప్రభుత్వాధికారులు, బీహెచ్ఈఎల్ ప్రతినిధులు త్వరలో సమావేశమై స్పష్టమైన అవగాహనకు రావాలని సీఎం ఆదేశించారు. -
'వాటర్ గ్రిడ్'పై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: దళిత వాడల నుంచే ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వాటర్ గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ కోసం అన్ని మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. 2017 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇంటింటికి చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుకున్న వేగంతో పనులు జరగని చోట వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేయాలన్నారు. నీరు పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని వాడాలని కేసీఆర్ సూచించారు. -
35 పట్టణాలకు మిషన్ భగీరథ
► రూ.4,403 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం ► మూడు ప్యాకేజీలుగా పనులకు టెండర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు రూ.4403 కోట్ల అంచనా వ్యయమయ్యే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంజీ గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా ఎంచుకుంది. అమృ త్ పరిధిలో ఉన్న 10 పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 50% నిధులను అందించనుండగా మిగతా 25 పట్టణాలకు సైతం తాగునీరు అందించేందుకు వీలుగా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఏడేళ్ల వ్యవధిలో నిధులు చెల్లించేలా యాన్యుటీ మోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ప్రాజెక్టును కాంట్రాక్టు కంపెనీలకు అప్పగిస్తుంది. మూడు ప్యాకేజీలుగా పనులను విభజించింది. మొదటి ప్యాకేజీలో కరీంనగర్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మహబూబ్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీలున్నాయి. రెండో ప్యాకేజీలో వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్, ఆదిలాబాద్, మూడో ప్యాకేజీలో కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగాం, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణాలకు తాగునీటిని అందించే పనులను పొందుపరిచారు. ఈ మూడు ప్యాకేజీలకు రూ.2,296 కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు పిలువాలని నిర్ణయించారు. ప్యాకేజీ పనులకు తోడుగా ద్రవోల్బణం, వడ్డీ తదితర ఖర్చులన్నీ కలిపి మరో రూ.2,707 కోట్లు అవుతుందని, మొత్తం రూ.4,152 కోట్లు అవుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ లెక్కలేసింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టేందుకు అవసరమయ్యే భూసేకరణకు రూ.51 కోట్లు, వనరుల సమీకరణ, రవాణాకు రూ.25 కోట్లు, జాతీయ రహదారులు, ఆర్ అండ్బీ, రైల్వే పరిధిలోని క్రాసింగ్ల్లో తవ్వకాలు, వాటి పునరుద్ధరణకు రూ.175 కోట్లు అంచనా వేసింది. మొత్తం రూ.4,403 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
'చంద్రబాబుకు మోదీ లాలీపప్ ఇచ్చారు'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..స్పెషల్ కేటగిరీ ఇవ్వలేం కాబట్టి పోలవరాన్ని మీరే నిర్మించుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ లాలీపాప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. పోలవరంతో ముంపునకు గురయ్యేవి గిరిజన గ్రామాలే కావున ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు భూసేకరణ- 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. మల్లన్నసాగర్ కోసం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్నవి భూస్వామ్య జమీందారీ రోజులు కావని..ఇవి ప్రజాస్వామ్య రోజులని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేలకోట్ల అవినీతికి కేసీఆర్ సర్కార్ పాల్పడుతోందన్నారు. ఆ అవినీతి సొమ్ముతో ఇతర పార్టీల నేతలను కొంటున్నారని ఆయన మండిపడ్డారు. సొంత కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్కు శ్రద్ధ లేదని అన్నారు. -
కోటి ఇళ్లకు నల్లా నీరు
⇒ 2017 డిసెంబర్కల్లా అన్ని గ్రామాలకు తాగునీరు ⇒ మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి సంతృప్తి ⇒ జరుగుతున్న పనులపై కేసీఆర్ సమీక్ష ⇒ ‘తాగునీటి’పై ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేలా మిషన్ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు కోటి ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. నదుల నుంచి నీరు గ్రామాలకు చేరే నాటికి అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. మిషన్ భగీరథలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 66,800 ఇళ్లకు నల్లాల ద్వారా నీరందిస్తున్నామని, గతంలో చేసిన ప్రయత్నాలతో సిద్ధిపేట నియోజకవర్గంలోనూ తాగునీరు అందుతోందని సీఎం చెప్పారు. క్యాంపు కార్యాలయంలో ‘భగీరథ’పై ఆదివారం కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పైపులైన్ల నిర్మాణం జరగాలని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుతుందని, అప్పటివరకెల్లా పల్లెల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇళ్లలో నల్లాలు బిగించే పనులు జరగాలని చెప్పారు. ‘భగీరథ’ పనులను చేపట్టే ఏజెన్సీలే పదేళ్ల వరకు నిర్వహించే నిబంధన పెట్టినందున పనుల్లో నాణ్యత ఉంటున్నదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. తాగునీటి కోటాపై ప్రత్యేక జీవో... నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి పది శాతం నీటిని వాడుకోవాలనే విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున, దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పాత ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీటిని... ఎక్కడ వాడుకోవాలనే విషయంలో స్పష్టత కావాలని, అందుకు ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని మంత్రి హరీశ్రావును ఆయన ఆదేశించారు. నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ శాఖ తరఫున తాగునీటి సరఫరా జరుగుతోందని, కొత్తగా నగర పంచాయతీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్డబ్ల్యుఎస్ ద్వారానే నీటి సరఫరా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ‘భగీరథ’ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, హనుమంతు షిండే, జలగం వెంకట్రావు, ఆర్డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సీఈలు సురేశ్కుమార్, జగన్మోహన్రెడ్డి, కృపాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్భగీరథ అవినీతిమయం
చౌటుప్పల్: ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్లోని రాజీవ్స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50 శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు. రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరధ అవినీతి మయం: పాల్వాయి
ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లోని రాజీవ్స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు. రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథకు రూ.2వేల కోట్ల రుణం
సూత్రప్రాయంగా అంగీకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మంగళవారం హైదరాబాద్లో ఈ అంశంపై పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్తో బ్యాంకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పారదర్శక విధానాలు, నమూనాలతో మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలన్నీ మిషన్ భగీరథలో భాగస్వాములయ్యాయని వివరించారు. కాగా రుణం మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ వినోద్ జోషి, తెలంగాణ విభాగం హెడ్ రాజీవ్ పురి తదితరులు పాల్గొన్నారు. -
నీరందించేందుకు చర్యలు
అధికారులతో సమీక్ష వేల్పూర్ : ఫిబ్రవరి వరకు మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం వేల్పూర్లోని ఆయన స్వగృహంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాల్కొండ, కామారెడ్డి సెగ్మెంట్లలో పనుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించారు. జలాల్పూర్, ఆర్గుల్లో నిర్మిస్తున్న రెండు డబ్ల్యూటీపీలను త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైన యా„ý న్ ప్లాన్పై సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి నల్లాల ద్వారా నీరందించేందుకు అవసరమైన 24 ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణాన్ని, 200 కిలోమీటర్ల పైప్లైన్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. హెడ్వర్క్స్ పనులను పూర్తిచేస్తూనే, సమాంతరంగా ఇంట్రా పనులూ చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రాజెక్టు మేనేజర్తో పాటు నలుగురు ఇంజినీర్లను నియమించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. జలాల్పూర్ ఇన్టెక్వెల్ నుంచి బాల్కొండ గుట్ట, అక్కడి నుంచి మోర్తాడ్కు నీటిని సరఫరా చేసేందుకు కొత్త పైప్లైన్ వేయాలన్నారు. సెగ్మెంట్లో ఉన్న అన్ని విద్యాసంస్థలతో పాటు, స్పైస్పార్కుకు కూడా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. బాల్కొండ మండలంలో 24 ఓహెచ్ఎస్ఆర్లు, డబ్ల్యూటీపీ నుంచి గ్రామాలకు సెకండరీ పైపులైన్ పనులు, కమ్మర్పల్లి మండలంలో పైప్లైన్లను డిసెంబరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మోర్తాడ్ మండలంలో సెకండరీ, ఓహెచ్ఎస్ఆర్ పైప్లైన్ పనులు డిసెంబరులో ప్రారంభించి, జనవరికి పూర్తిచేయాలన్నారు. వేల్పూర్ మండలంలో సెకండరీ పైప్లైన్ను నవంబరులో పూర్తిచేయాలని, 11 అంతర్గత ఓహెచ్ఎస్ఆర్, 51 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్ పనులు నవంబరులో ప్రారంభించి, జనవరిలో పూర్తిచేయాలని ఆదేశించారు. భీమ్గల్ మండలంలో సెకండరీ పైప్లైన్ డిసెంబరు వరకు, 36 అంతర్గత ఓహెచ్ఎస్ఆర్లు,101 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బాల్కొండ మండలంలో రూ. 25 కోట్లు, కమ్మర్పల్లి మండలంలో రూ. 20 కోట్లు, వేల్పూర్ మండలంలో రూ. 10 కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నిరంతరం పనులు పర్యవేక్షించేందుకు బాల్కొండకు ప్రత్యేక ఇంట్రా విలేజ్ సబ్డివిజన్ ఏర్పాటు చేసినట్లు ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సమావేశంలో వాటర్గ్రిడ్ ఎస్పీ ప్రసాద్రెడ్డి, ఓఎస్డీ సత్యపాల్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వాన
నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో కుండపోత - నీటమునిగిన పంటపొలాలు... తెగిన కల్వర్టులు.. రాకపోకలు బంద్ - లోతట్టు ప్రాంతాలు జలమయం.. జలదిగ్బంధంలో పలు కాలనీలు నల్లగొండ/మహబూబ్నగర్: అల్పపీడన ప్రభావంతో మంగళవారం నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా హుజూ ర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, హాలియా నియోజకవర్గాల్లో పంట పొలాలు నీటమునిగాయి. హుజూర్నగర్లో 180 మి.మీటర్ల వర్షం కురవడంతో ఆవాస కాలనీలు, కోదాడ రోడ్డులోని దద్దనాల చెరువు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో ఉన్న పాలేరు వాగు, మూసీ నదిలోకి భారీగా వరదనీరు చేరింది. వర్షాలకు కల్వర్టులు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలగడప సమీపంలో మూసీనదిలో మిషన్భగీరథకు సంబంధించిన రూ.30 లక్షల విలువైన మెటీరియల్ కొట్టుకుపోయి పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, పులిచింతల మునకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ చేయడంతోపాటు మంగళవారం తెల్లవారు జామునుంచి కురిసిన భారీ వర్షానికి పులిచింతల జలాశయంలో ఉదయం వరకు ఉన్న 9 టీఎంసీలు నీటి నిల్వ.. మధ్యాహ్నం ఇన్ఫ్లో పెరగడంతో 10 టీఎంసీలకు చేరింది. దీంతో మునక గ్రామాలైన నెమలిపురి, వెల్లటూరు, అడ్లూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేయించేసేలా ప్రజలను రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు ఒప్పించారు. తమకు రావాల్సిన ప్యాకేజీ రాలేదని అది ఇస్తేనే ఖాళీ చేస్తామని కొందరు గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం ఖాళీ చేయించేందుకు ప్రజలను ఒప్పించారు. అలాగే, మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ కేసరి సముద్రం చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. లింగాల మండలం దారారం చీకటి చెరువు, రాయవరం దావకుంట, పెద్దకుంట, దారారం సమీపంలో ఊరకుంటలు అలుగులు పారుతున్నాయి. బిజినేపల్లి శివారులోని నల్లవాగు పొంగింది. కొల్లాపూర్ మండలం రామాపురం వాగు తెగిపోవడంతో కొల్లాపూర్-పెబ్బేరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. పిడుగుపాటుకు ముగ్గురు మృతి మునగాల/ చిలుకూరు: నల్లగొండ జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మునగాల మండలం నేలమర్రికి చెందిన రాంపంగు బాలకృష్ణ(27), చిలుకూరు మండలం రామాపురానికి చెందిన మీసాల వీరబాబు (34), ఇదే గ్రామానికి చెందిన బారు భిక్షంలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు. కొల్లాపూర్లో 16 సెం.మీ. కుండపోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో అత్యధికంగా 16 సెం.మీ. వర్షం కురవగా, నాగర్కర్నూలులో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, మక్తల్లలో 7 సెం.మీ., తిమ్మాపూర్, మధిరల్లో 5 సెం.మీ., చెన్నూరు, అశ్వారావుపేట, తిమ్మాజీపేటలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో 3 సెం.మీ., రామన్నపేటలో 2 సెం.మీ., మిర్యాలగూడలో 1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
ఫైబర్ డక్ట్ వేయకుంటే బిల్లులు నిలిపేస్తాం
‘మిషన్ భగీరథ’పై సమీక్షలో వైస్చైర్మన్ ప్రశాంత్రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: పైప్లైన్లతో పాటు ఫైబర్ డక్ట్ను ఖచ్చితంగా వేయాలని, లేనిపక్షంలో వర్క్ఏజెన్సీలకు బిల్లులను నిలిపివేయాలని‘మిషన్ భగీరథ’ కార్పొరేషన్ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘మిషన్ భగీరథ’ పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీరందించడంతో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్కు సంబంధించి దశల వారీగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను, ప్రధాన పైప్లైన్ల ఏర్పాటును 2017 డిసెంబరులోగా పూర్తి చేయాలన్నారు. 2018 ఆఖరుకల్లా అన్ని గ్రామాల్లో అంతర్గత పైప్లైన్లను పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. అంతర్గత పైప్లైన్ల్ల ఏర్పాటు విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాప్యానికి కారణమయ్యే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ మాట్లాడుతూ..ఆర్డబ్ల్యుఎస్ అధికారులు, వర్క్ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తేనే పనులు వేగంగా పూర్తవు తాయన్నారు. త్వరలోనే ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్ట్ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా సమీక్షిస్తారని, అన్ని అంశాలకు సంబంధించి తాజా సమాచారంతో స్టేటస్ రిపోర్ట్, యాక్షన్ప్లాన్లను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్రెడ్డి, భగీరథ చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్రెడ్డి, కృపాకర్రెడ్డి, ఓఎస్డీ సత్యాపాల్రెడ్డి, అన్ని జిల్లాల ఎస్ఈలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘భగీరథ’కు తక్కువ వడ్డీ రుణాలు: ఎస్పీ సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. శనివారం బ్యాంకుల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో కొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.6,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా, తాజాగా మరికొన్ని వాణిజ్య బ్యాంకులు రూ.3,200 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. కెనరా బ్యాంక్ రూ. 2వేల కోట్లు, విజయా బ్యాంక్, ఎస్బీహెచ్ బ్యాంకులు రూ.600 కోట్ల చొప్పున రుణమిచ్చే విషయమై ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. ఆయా బ్యాంకులిచ్చిన రుణాలను సెగ్మెంట్ల వారీగా ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించాక సెగ్మెంట్లకు ఇవ్వాల్సిన రుణాల విషయమై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ, శ్రీధర్, ఆర్డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు సమయంలో గజ్వేల్ సెగ్మెంట్ పనులు
-ఒకే విధమైన ప్రెషర్ కోసం ఫిక్స్డ్ ఫ్లో వాల్వ్ టెక్నాలజీ వినియోగం సాక్షి, హైదరాబాద్ మిషన్ భగీరథ పనులను మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ సెగ్మెంట్ పనులను ఎంఈఐఎల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 24 నెలల సమయం ఉండగా, నిర్ణీత సమయం కన్నా ముందుగానే ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 66,837 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 1,520కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం పూర్తిచేసింది. ఎల్లంపల్లి వద్ద గోదావరి పైప్లైన్ నుంచి కొండపాక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకునే ఈ ప్రాజెక్ట్లో అన్ని కుళాయిలకు ఒకే రకమైన నీటి సరఫరా ఉండేలా ఫిక్స్డ్ ఫ్లో వాల్వ్ అనే అధునాతన టెక్నాలజీని వినియోగించారు. రూ.548కోట్ల ప్రాజెక్ట్లో భాగంగా కోమటిబండ వద్ద 1.40కోట్ల లీటర్ల సామర్థ్యంతో గ్రాండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దీనికి అనుబంధంగా 1.50లక్షలు, 5.50లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించింది. -
మోదీ చేత్తో అట్టహాసంగా..
-
మోదీ చేత్తో అట్టహాసంగా..
హైదరాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గజ్వేల్ లోని నెమటూర్ హెలిప్యాడ్కు చేరుకున్న ఆయన హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కోమటిబండ చేరుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి పథకానికి అంకురార్పణ చేశారు. ఆ వెంటనే గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపును స్విచ్ తో ప్రారంభించారు. అలాగే, మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభిస్తారు. దీంతోపాటు మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు. అలాగే, ఇదే వేదిక నుంచి 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ను జాతికి అంకితం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారి ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుడుపెట్టారు. సరిగ్గా మ2.15గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాల విశేషాలు.. మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. సింగరేణి విద్యుత్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్లో జూన్ నుంచి, రెండో యూనిట్లో జూలై 27 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 1,600 మెగావాట్ల ప్లాంట్ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేశారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. -
మోదీజీ వెల్కమ్
-
మోదీజీ వెల్కమ్
► నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు నగరానికి రాక ► ప్రత్యేక హెలికాప్టర్లలో గవర్నర్, సీఎంతో కలసి 3 గంటలకు సభాస్థలికి ► మెదక్ జిల్లా కోమటిబండలో భారీగా ఏర్పాట్లు ► తొలుత ‘మిషన్ భగీరథ’ ప్రారంభం.. తొలి నల్లాకు నీటి విడుదల ► అక్కడే మరో ఐదు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ► అనంతరం బహిరంగ సభలో ప్రసంగం ► నగరంలోని బీజేపీ మహాసమ్మేళనంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ► నాలుగున్నర గంటల పాటు పర్యటన.. సాయంత్రం 6.15కు ఢిల్లీకి.. ప్రధానమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం.. సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు మరో ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన వెంట ఐదుగురు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్కుమార్, బండారు దత్తాత్రేయ తదితరులూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశల మధ్య ప్రధాని మోదీ రాక రాష్ట్ర రాజకీయ శ్రేణుల్లో, అధికారవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మందిని బహిరంగ సభకు తరలించేందుకు సన్నాహాలు చేసింది. వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభాస్థలిని ఏర్పాటు చేసింది. ఘనంగా స్వాగతానికి ఏర్పాట్లు ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచే గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులతో కలసి మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో మెదక్ జిల్లా కోమటిబండకు బయలుదేరుతారు. ప్రధానికి సంప్రదాయంగా స్వాగతం పలకడంతో పాటు వివిధ కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోమటిబండలో ప్రారంభోత్సవాలు, సభ అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో మోదీ తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొని... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటనపై భారీ ఆశలు ప్రధాని మోదీ తొలిసారిగా రాష్ట్రానికి రానుండటంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు మొదలు ప్రత్యేక ప్యాకేజీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని స్వయంగా కలసి విజ్ఞప్తి చేశారు. మరో రూ.1,000 కోట్ల రుణసాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వీటిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రూ.24,650 కోట్లు విడుదల చేయాలని ఇటీవలే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ)కు రూ.5,000 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని తన తొలి పర్యటనలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు తమవంతుగా ఎలాంటి సాయం ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది. నాలుగున్నర గంటల్లో.. రాష్ట్రంలో మోదీ పర్యటన పూర్తి వివరాలివే.. 2.20: బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ రాక 2.25: బేగంపేట నుంచి హెలికాప్టర్లో గజ్వేల్ పయనం 2.50: గజ్వేల్లోని నెమటూర్ హెలిప్యాడ్కు చేరుకుంటారు 2.55: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం 3.00: ప్రారంభోత్సవం జరిగే కోమటిబండ వద్దకు చేరుకుంటారు 3.01: మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ 3.03: గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపు ఆవిష్కరణ 3.04: మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభం 3.05: మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన 3.10: బహిరంగసభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు 3.15 నుంచి 3.24 వరకు: 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ను జాతికి అంకితం చేస్తారు. 3.25: బహిరంగసభ వేదిక పైకి రాక 3.27: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం 3.30-3.37: సీఎం కేసీఆర్ ప్రసంగం 3.37-4.10: ప్రధాని మోదీ ప్రసంగం 4.13: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ 4.20: కోమటిబండ నుంచి బయలుదేరుతారు 4.25: నెమటూర్ హెలిప్యాడ్కు చేరుకుంటారు 4.30: హెలికాప్టర్లో హైదరాబాద్కు పయనం 4.55: బేగంపేటకు చేరుకుంటారు 5.00: బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ స్టేడియానికి వస్తారు 5.15-6.15: బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొంటారు 6.20- 6.35: ఎల్బీ స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు 6.40: ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు ఘనంగా స్వాగతిద్దాం ఏర్పాట్లపై సమీక్షలో కేసీఆర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన సీఎం కేసీఆర్... ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలువురు మంత్రులు, పార్టీ నాయకులతో సమీక్షించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నందున ఘనంగా స్వాగ తం తెలపాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల నుంచి కనీసం రెండు వేల మంది చొప్పున తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా తరలించాలన్నారు. భద్రతా కారణాల రీత్యా సభా వేదికపైకి కొందరికే అనుమతి ఉంటుందని... అవకాశం రాని మంత్రులు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది. కండువాలు, జెండాలకు అనుమతి లేదు సభాస్థలిలో పార్టీల కండువాలకు, జెండాలకు, బ్యానర్లకు, ఫ్లెక్సీలకు అనుమతి లేదు. వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించినట్లు మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతోపాటు ఎక్కువ మందిని తీసుకువచ్చే పరిస్థితి లేదని.. వారికోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రారంభించే పథకాల విశేషాలివే.. మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. సింగరేణి విద్యుత్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్లో జూన్ నుంచి, రెండో యూనిట్లో జూలై 27 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో (800్ఠ2) 1,600 మెగావాట్ల ప్లాంట్ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేయనున్నారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేక ఏర్పాట్లు సభా స్థలంలో 1.5 లక్షల మందికి సరిపోయేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు, మరో 50వేల మందికి సరిపోయేలా సాధారణ టెంట్లు వేశారు. 160 ఎకరాలను ఎనిమిది సెక్టార్లుగా విభజించి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేం దుకు 4,500 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. 4 వేల మందికిపైగా కేంద్ర, రాష్ట్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను శనివారం బండారు దత్తాత్రేయ, హరీశ్రావు పరిశీలించారు. స్వల్ప మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. వేదికపై పరిమిత సంఖ్యలో.. ప్రధాని ప్రసంగించే ప్రధాన వేదికపై దాదాపు 20 మంది ప్రముఖులు మాత్రమే ఉండనున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్కుమార్, బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, లక్ష్మారెడ్డి, పి.మహేందర్రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజారాణి తదితరులు వేదికపై ఉంటారు. ఇక కుడివైపు ఏర్పాటు చేసిన మరో వేదికపై మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమ వైపు వేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఇక ముగ్గురు మాత్రమే ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడాక.. ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. చివరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ వందన సమర్పణ చేస్తారు. అనంతరం ప్రధాని హైదరాబాద్కు బయలుదేరుతారు. -
పాత ప్రాజెక్టులకే శంకుస్థాపనలు
ప్రధానిని అగౌరవ పర్చడమే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంకమ్మతోట : పాత ప్రాజెక్టులకే ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు నీరివ్వకుండా గజ్వేల్కు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే సుజల స్రవంతి ద్వారా హైదరబాద్కు నీరు తీసుకెళ్తున్నారని..అక్కడి నుంచి మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్కు తరలించేందుకే ప్రధానితో శంకుస్థాపనలు చేయిండం ఆయన్ని అవమానించడమేనన్నారు. 2005లో యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్కు రైలుమార్గాన్ని శంకుస్థాపన చేసిందని, మళ్లీ ప్రధానితో చేయించడం బాధాకరమన్నారు. హెల్త్ మిషన్కు నిధులు లేక ప్రజలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతి రైలును పూర్తిస్థాయిలో ప్రతీరోజు నడపాలని కోరారు. కాంగ్రెస్ లీగల్సెల్ జిల్లా చైర్మన్ వొంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్, వీరారెడ్డి పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్ని పూర్తిచేశామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభం చేయిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1200 మెగావాట్ల విద్యుత్ ఉతప్పత్తి ప్లాంట్ను మోదీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు.రరామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని ముఖ్యమంత్రి కే సీఆర్తో కలిసి పునః ప్రారంభిస్తారిన అన్నారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వేలైన్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారన్నారు. ప్రధాని సభా ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రధాని వేదిక పై 18 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
నీళ్ల పండుగకు తరలుదాం
వర్గల్:ఈ నెల 7న జరిగే నీళ్ల పండుగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి జయప్రదం చేద్దామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధి, కార్యకర్త మహోత్సవంలా సాగే సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. మండలం నుంచి ఏడు వేలకు తగ్గకుండా ప్రజలను సభకు తరలించాలన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ కలల స్వప్నం మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సంబరాలు ప్రజల సమక్షంలో ఘనంగా జరిపించుకుందామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ పోచయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ వేలూరి వెంకట్రెడ్డి, నాయకులు తోట ముత్యాలు, విద్యాకుమార్గౌడ్, సుల్తాన్, బాల్రెడ్డి, కృష్ణారెడ్డి, అజీజ్, కనకయ్య, జింక మల్లేషం తదితరులు పాల్గొన్నారు -
మిషన్ భగీరథను ప్రధాని ప్రారంభించడం గర్వ కారణం
-
7న మిషన్ భగీరథ ప్రారంభం
-
ప్రధాని మోదీకి ఉత్తమ్ బహిరంగ లేఖ
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిషన్ భగీరథను ప్రారంభించవద్దని ఆయన ఈ సందర్భంగా తన లేఖలో కోరారు. ప్రధాని తెలంగాణ పర్యటనను కేసీఆర్ తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి-హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్ట్ను మిషన్ భగీరథగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.3,350 కోట్లతో ఆ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని, నిధులు కేటాయిస్తున్నట్లు తన పర్యటనలో ప్రకటించాలని ఉత్తమ్ తన లేఖలో డిమాండ్ చేశారు. -
ప్రధాని సభ ఖర్చు రూ.50 కోట్లు
-
ప్రధాని సభ ఖర్చు రూ.50 కోట్లు
గజ్వేల్ మండలం కోమటిబండలో ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రూ. 7 కోట్లతో వేదిక: కోమటిబండ గుట్ట దిగువ భాగంలోని 80 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా సభావేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక నిర్మాణంలో అల్యూమినియంరేకులు, స్టెయిన్లెస్స్టీల్ రాడ్స్ వాడుతున్నారు. ప్రధాని ప్రసంగించే వేదికను 80/60 అడుగుల వైశాల్యంతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. సభి కుల కోసం 900/700 అడుగుల వైశాల్యంతో రెయిన్ ప్రూఫ్ షెడ్, 500/700 వైశాల్యంతో సన్ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. 50కిపైగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక ఖర్చు రూ.7 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రూ.19.5 కోట్లతో రోడ్లు కోమటిబండకు అనుసంధానంగా రోడ్డు నిర్మాణాలు ఊపందుకున్నాయి. చౌదరిపల్లి-నెంటూరు మధ్య 4.5 కిలోమీటర్ల రోడ్డును, నెంటూరు-కోమటిబండ మధ్య 11.5 కిలోమీటర్ల వరకు యుద్ధప్రాతిపదికన రెండు లేన్ల తారురోడ్లు వేస్తున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లటానికి వీలుగా కోమటిబండ గుట్ట కింద నుం చి గుట్ట మీదికి 700 మీటర్ల పొడవునా రెండు లేన్ల రోడ్డు వేస్తున్నారు. రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ కోటితో పైలాన్.. 50 లక్షలతో హెలిపాడ్లు రూ. కోటితో ‘మిషన్ భగీరథ’ ప్రారంభ సూచిక పైలాన్, దాని చుట్టూ అందమైన గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. కోమటిబండ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ వద్ద 32 అడుగుల ఎత్తు, 40/40 అడుగుల వెడల్పుతో పైలాన్ నిర్మిస్తున్నారు. పైలాన్పై మిషన్ భగీరథ చిహ్నం, ప్రవహిస్తున్న జలధారచిత్రాలు ఉన్నాయి. వర్గల్ మండలం నెంటూరు శివారులో 3 హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాని హెలిపాడ్, రెండు కేంద్ర సైనిక హెలిపాడ్లు రానున్నాయి. వీటికి 1.5 కి.మీ. దూరంలో కోమటిబండ ఉంటుంది. వీటి కోసం రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. రవాణా, భోజనాల కోసం రూ. 8 కోట్లు ప్రధానమంత్రి మోదీ సభకు జనాన్ని తరలించే బాధ్యతను మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సభకు 2,800 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 14 గంటల పాటు 320 కిలోమీటర్ల ప్రయాణించేలా రూ. 11,400కి ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన బస్సులకే రూ 3.20 కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరో 10 వేల వరకు కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో తరలివస్తారని అంచనా. వీటికి మరో రూ 3 కోట్ల వరకు ఖర్చవుతోంది. రె ండు లక్షల మందికి ఒకపూట భోజనానికి కనీసం రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, పార్కింగ్ స్థలాల కోసం రూ. 30 లక్షలు, పోలీసు బలగాలు, అధికారుల రవాణా ఖర్చులు రూ.2 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 5 కోట్లు అవుతుందని అంచనా. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇవే ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలసి గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్స్ ప్రాంగణంలో పథకం ప్రారంభ సూచికగా నల్లాను ఆన్ చేస్తారు. అంతకుముందు పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ఆపై ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల పవర్స్టేషన్ , ఎఫ్సీఐఎల్కు చెందిన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు శంకుస్థాపన చేస్తారు. -
పైప్లైన్లతో సమాంతరంగా ఫైబర్ కేబుల్స్
ఫైబర్గ్రిడ్పై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పైప్లైన్లతో సమాంతరంగా ఫైబర్గ్రిడ్ కేబుల్స్ను వేయాలని ఐటీ మంత్రి కె.తారక రామారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఫైబర్గ్రిడ్ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులను చేపట్టిన వర్క్ ఏజెన్సీలతోనూ ఆగస్టు 2న సమావేశం నిర్వహించి రెండు రకాల(పైప్లైన్లు, కేబుల్స్) పనులు సమన్వయంగా జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఫైబర్గ్రిడ్లో ఉపయోగించే పరికరాలను పరిశీలించారు. మిషన్ భగీరథ పైపులతో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే తీరును ఐటీ(ఎలక్ట్రానిక్స్) డెరైక్టర్ సుజయ్.. మంత్రికి వివరించారు. ఫైబర్గ్రిడ్ పనులు చేపట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయని, అది పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా లభించే ప్రయోజనాలన్నీ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం సాఫ్ట్నెట్(మనటీవీ)కు సంబంధించిన అంశాలపైనా మంత్రి సమీక్షించారు. సాఫ్ట్నెట్ పేరును తక్షణం మార్చాలని సీఈవో శైలేశ్రెడ్డిని ఆదేశించారు. మనటీవీ ఛానల్ ద్వారా యువతకు, విద్యార్థులకు రైతులకు, గృహిణులకు ఉపకరించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సూచించారు. ‘పురపాలన’పై రేపు సమీక్ష రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం సమావేశం కానున్నారు. కరీంనగర్లో ప్రతీమ కాంప్లెక్స్లో ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశంలో కీలకంగా 8 అంశాలను చర్చించనున్నారు. ఆదర్శ వార్డు/ఆదర్శ మునిసిపాలిటీ నిర్మాణంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ప్రజెంటేషన్తో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం ఆయా పురపాలికల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను స్థానిక మేయర్లు, చైర్మన్లు ఇతరులతో పంచుకోనున్నారు. అనంతరం పారిశుద్ధ్యం, హరిత హారం, నీటి సరఫరా, వర్షాకాల కార్యాచరణ, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పురపాలికల ఆదాయం పెంపు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. -
రోడ్డెక్కిన గోదావరి జలాలు
పైప్ లీకేజితో వృథాగా పోతున్న నీరు జగన్గూడ మూలమలుపు వద్ద లీకేజీ శామీర్పేట్: శామీర్పేట్ మండలం జగన్గూడలో గోదావరి జలాల కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్ లీకేజీతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా శామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరాస్తా నుంచి యాదాద్రి(యాదగిరి గుట్ట) వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైప్లైన్ జగన్గూడ వద్ద గురువారం ఉదయం లీకేజీ అయింది. దీంతో గోదావరి జలాలు రోడ్డుపై పారుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సబ్ కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పైప్లైన్ లీకైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పైప్లైన్ను పరిశీలించి లీకేజీని అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గజ్వేల్కే పరిమితం కానున్నప్రధాని పర్యటన
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎంవోకు అధికారికంగా సమాచారం అందింది. వచ్చే నెల 7వ తేదీన ప్రధాని తెలంగాణలో తొలిసారి పర్యటించనున్నారు. ఆయన పర్యటన మెదక్ జిల్లా గజ్వేల్కు మాత్రమే పరిమితం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఏడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ చేరుకుంటారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం అదే రోజు సాయంత్రం 4.15కి హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు. హైదరాబాద్లో సాయంత్రం అయిదు గంటలకు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరనున్నారు. -
యుద్ధ ప్రాతిపదికన ‘మిషన్ భగీరథ’ పూర్తి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అధికారులకు కలెక్టర్ రోనాల్డ్రోస్ ఆదేశం గజ్వేల్లో సమీక్ష సమావేశం గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలని కలెక్టర్ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్లోని ‘గడా’ కార్యాలయంలో ‘మిషన్ భగీరథ’ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్రెడ్డితో కలిసి ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతోపాటు ఆర్అండ్బీ అధికారులతో గజ్వేల్లో జరుగుతున్న ‘మిషన్ భగీరథ’, రోడ్డు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆగస్టు 7లోగా పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి గజ్వేల్లో రెండు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు మూడు నెలలుగా పూర్తి చేయకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. వాటర్గ్రిడ్ పైప్లైన్ల నిర్మాణం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని ఆర్అండ్బీ అధికారులు కలెక్టర్కు వివరించారు. పైప్లైన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి రోడ్డు పనుల విస్తరణకు సహకరించాలని వాటర్గ్రిడ్ అధికారులకు సూచించారు. రెండు శాఖల మధ్య మున్ముందు ఇలాంటి సమన్వయం లోపం రాకూడదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 12 ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం పెండింగ్లో ఉన్నాయన్నారు. అవసరమైతే పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించి సత్వరం పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పనులను వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, మిషన్ భగీరథ సీఈ కపాకర్రెడ్డి, ఎస్ఈ విజయప్రకాశ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, గజ్వేల్ మిషన్ భగీరథ ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్కు ‘మిషన్ భగీరథ’ తొలిఫలం
దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘మిషన్ భగీరథ’ తొలి ఫలాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ అందుకోబోతోంది. రూ.1055 కోట్లతో చేపట్టిన ఈ పథకం గజ్వేల్లో తుది దశకు చేరుకోగా...దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ కొద్ది నెలల్లోనే పూర్తి చేయడానికి యంత్రాంగం కృషి చేస్తోంది. ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని గజ్వేల్లో ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. గజ్వేల్ దాహార్తి తీరుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినం కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్గ్రిడ్కు(గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించే పైప్లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందించాలన్నది లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్లైన్ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 గ్రామాలు, గజ్వేల్ నగర పంచాయతీతో కలుపుకుని మరో 65 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. - 14 మండలాలు.. 3 మున్సిపాలిటీలు గోదావరి జలాలను గజ్వేల్తో పాటు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, మరో 3 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో 793.76 కిలోమీటర్ల పొడవునా పైప్లైన్ల నిర్మాణం జరిగింది. 67, 275 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా ఉండగా ఇప్పటి వరకు 60,724 కనెక్షన్లను ఇవ్వగలిగారు. ప్రస్తుతం 106 గ్రామాల్లో న్యితం నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 213 గ్రామాలకుగానూ 63,517 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7,450 కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 134 గ్రామాల్లో 42,168 నల్లా కనెక్షన్లకుగానూ ఇప్పటి వరకు 2,623 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పనులు పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశముంది. దేశం దృష్టిని ఆకర్షించిన పథకం... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ పథకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పథకం తీరును పరిశీలించేందుకు ఎంతో మంది ప్రముఖులు గజ్వేల్కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రెండ్రోజుల క్రితం గజ్వేల్లో పథకం తీరును ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించడం...ఆయన సానుకూలంగా స్పందించటం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఆగస్టు 7న ఇక్కడ పర్యటించి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. -
ఇంటి ముంగిటకు ‘భగీరథ’
♦ ఆగస్టు 7న ముహూర్తం ♦ ఆ రోజు నుంచి ‘గజ్వేల్’లో ఇంటింటికీ నీళ్లు ♦ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ♦ 5 నెలల్లోనే పనులు పూర్తి చేయడం రికార్డు ♦ ఏడో తేదీనే సుదర్శనయాగం మంత్రి హరీశ్రావు వెల్లడి గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందించే ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. అదేరోజు సుదర్శనయాగం చేపడుతారన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్లోని అటవీశాఖ నర్సరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ‘మిషన్ భగీరథ’ ద్వారా 67,551 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జాతీయ రికార్డుగా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక మండలాల్లోగల 243 గ్రామాలకుగాను 231గ్రామాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా... 144 గ్రామాల్లో ప్రజలు ప్రస్తుతం నీటిని తాగుతున్నారన్నారు. 78గ్రామాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గంలో 150 ఓవర్హెడ్ ట్యాంకులకుగాను 120 ట్యాంకుల నిర్మాణం పూర్తయినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల కృషి ఫలితంగానే ఈ రికార్డు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నాటికి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ ‘మిషన్ భగీరథ’ ద్వారా పూర్తి స్థాయిలో నల్లా నీటిని అందిస్తామన్నారు. హైదరాబాద్తోపాటు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మంచినీటిని అందిస్తున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇప్పటికే నిండుతోందని చెప్పారు. గతేడాది 9టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్ను నింపడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈ రిజర్వాయర్లోకి 20టీఎంసీల నీరు రాబోతుందన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని వెల్లడించారు. ఫలితంగా మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, వాటర్గ్రిడ్ ఎస్ఈ విజయప్రకాశ్, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.