Ramya Krishna
-
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనాయికిగానూ, విలన్గానూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప నటి. ఒక హీరోయిన్ విలన్ పాత్రలో నటిస్తే తన విలువ పడిపోతుందేమోనని చేసేందుకు ముందుకు రాని ఆ కాలంలో అలవోకగా చేసి ఆ అపోహను పారద్రోలింది. ఇలా రెండు పాత్రల ద్వారా ఎక్కువ ఆఫర్లు అందుకుని విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో తల్లిపాత్రల్లోనూ కూడా అంతే గ్లామర్గా అదే ఫిట్నెస్తో అలరిస్తోంది. కుర్ర హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ అందాల భామ వన్నెతరగని అందం వెనుకున్న రహస్యాన్ని ఆమె కుటుంబ సభ్యుడు, డాక్టర్ గుగనాథ్ శివకదక్షమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అదెంటో తెలుసుకుందామా..!.ఐదు పదుల వయసు దాటిన తర్వాత లీన్ కండరం అనేది బంగారం కంటే విలువైనదని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ వైద్యుడు శివకదక్షమ్(Guganath Sivakadaksham). మెడిటేరియన్ డైట్(అడపాదడపా ఉపవాసం)తో బాడీని ఫిట్గా ఉంచుతుందని చెప్పారు. అందాల బామ రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ డైట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. అలాగే నటి రమ్య యోగా, తేలికపాటి కార్డియో వెయిట్ ట్రైనింగ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటుందట. అలాగే వర్కౌట్లలో తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందని అన్నారు. ఇవి ఆమె కండరాలను బలోపేతం చేసి మజిల్స్(muscle) స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయట. అందువల్ల ఆమె బాడీ షేప్అవుట్ అవ్వకుండా ఉందని చెప్పారు. అలాగే యాభై ఏళ్లు దాటక బాడీలో లీన్ కండర ద్రవ్యరాశి తగ్గి ఎముకలు పటుత్వం కోల్పోయి శరీరం ఆకృతి మారిపోతుందట. అందువల్ల ఇలాంటి శక్తిమంతమైన వ్యాయమాలతో కండరాలను బలోపేతం చేసుకుంటే ఎముకలకు సంబంధించిన గాయాలను నివారించగలుగుతామని అన్నారు. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ(menopause)లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ఇవి తప్పనరిగా చేయాల్సిన పవర్ఫుల్ వ్యాయామాలు. అంతేగాదు ప్రతి సెషన్లో ఈవ్యాయామాలు కనీసం 6-12 సార్లు రిపీట్ చేయాలన్నారు. తద్వారా కండరాల క్షీణతను నివారించగలమని తెలిపారు. దీంతోపాటు అందుకు తగ్గా డైట్ కూడా ఉండాలన్నారుడైట్(diet)..పోషకాహారం పరంగా కండరాల మరమత్తు, పెరుగుదలకు తోడ్పడేలా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కోళ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తప్పనిసరిగా డైట్లో భాగమయ్యేలా చూడాలి. ఈ వ్యాయామాలను శిక్షగా కాకుండా శరీరాన్ని పిట్గా ఉంచేలా ఎంజాయ్ చేస్తూ చేయాలని చెబుతున్నారు. ఎక్కువ కండరాల ద్రవ్యరాశి అనేది కీళ్ల పనితీరు, కదలిక సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుందట. అంతేగాదు ఇది మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను దూరం చేస్తుందని చెబుతున్నారు వైద్యుడు శివకదక్షమ్ . కాబట్టి యాభైలలో కూడా ఫిట్గా, గ్లామర్గా ఉండేలా అందాల భామ రమ్య కృష్ణలా వర్కౌట్లే చేసేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. View this post on Instagram A post shared by Guganath Sivakadaksham (@idoctorg)s (చదవండి: మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!) -
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)
-
మాతృత్వం.. ఓ మధురానుభూతి!
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. జపాన్లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు. -
రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది. కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్కుమార్, ఉపేంద్ర సరసన నటించారు. -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్గా సాగుతుంది. లేడిస్తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా..?
-
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సినీనటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి రోజాకు పలువురు ప్రముఖులు అండగా నిలవగా, తాజాగా రమ్యకృష్ణ సైతం స్పందించారు. ‘మంత్రి రోజాని మాజీ మంత్రి బండారు అసభ్యంగా దూషించడం దారుణం.మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం. అలాంటి దేశంలో ఓ మహిళ పై ఇంత నీచంగా మాట్లాడతారా?, బండారు సత్యనారాయణని క్షమించకూడదు. pic.twitter.com/fsuJ7aa9Wk — Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023 మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా. ఈ దేశంలో మహిళలపై రేప్ లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరం. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బండారు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు రమ్యకృష్ణ. బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్ కౌర్ -
రమ్యే ఆర్డర్ ఇస్తే నేను చేయాల్సిందే : దర్శకుడు కృష్ణ వంశీ
-
జీవితంలో అదొక్కటే పర్మినెంట్: రమ్యకృష్ణ
‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ అంటూ కుర్రాళ్లు ఫ్లాట్ అయ్యేంత గ్లామర్...మితి మీరిన ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి చిరునామా... ఓ నీలాంబరి. భక్తులను రక్షించే తల్లి... ఓ అమ్మోరు. నా మాటే శాసనం.. ఓ శివగామి... ఇలా ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడే ‘నరసింహ’లో నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి, ‘అమ్మోరు’లో అమ్మవారిగా మెప్పించారామె. ఇక ‘బాహుబలి’లో శివగామిగా కనబర్చిన నటన అద్భుతం. ఇటీవల రిలీజైన ‘జైలర్’లో రజనీకాంత్ భార్యగా నటించారు. అలాగే భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగ మార్తాండ’ చేశారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► ‘పడయప్ప’ (‘నరసింహ’)లో నీలాంబరిగా నరసింహ (రజనీకాంత్ పాత్ర)ని ఎదిరించారు. చాలా ఏళ్ల తర్వాత ‘జైలర్’లో రజనీ కాంబినేషన్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం గురించి.. ఇన్నేళ్ల తర్వాత రజనీగారి కాంబినేషన్లో ‘జైలర్’ చేయడం, అది సూపర్ హిట్ కావడం నా జీవితంలో మరచిపోలేను. ‘జైలర్’లో ఎందుకంత సున్నితమైన పాత్ర చేశారని అందరూ అనుకోవచ్చు. అయితే మళ్లీ రజనీగారితో నీలాంబరిలాంటి పాత్ర వస్తేనే చేయాలనుకుని ‘జైలర్’లో విజయలాంటి మంచి పాత్రని వదులుకోలేను కదా. ► ఈ 24 ఏళ్లలో రజనీగారు, మీరు ఆర్టిస్టులుగా ఎదిగారు.. వ్యక్తులుగా మారారు. ఆయనలో మీరు గమనించిన మార్పు? ‘జైలర్’ షూటింగ్ మొదటి రోజే ‘పడయప్ప’ చేసి అప్పుడే 24 ఏళ్లు అయిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అవునన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం, అదే నిరాడంబరత, అంతే నిశ్శబ్దం. ► ‘జైలర్’ తెలుగు–తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ హిట్ మీ కెరీర్కి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? యాక్టర్స్ కెరీర్కి హిట్ అనేది వంద శాతం అవసరం, తప్పనిసరి. అయితే హిట్ మాత్రమే కెరీర్ కాదు. మంచి పాత్రలు కూడా కావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలుంటాయి. అభినందనలు వస్తాయి కానీ వసూళ్లు ఉండవు. అలాగే ఓ కాంబినేషన్ మన కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ముఖ్యం. వంద శాతం నా కెరీర్కి రజనీకాంత్గారి కాంబినేషన్, ‘జైలర్’ హిట్ ఉపయోగపడతాయి. ► ‘రంగ మార్తాండ’, ‘జైలర్’ సినిమాల్లో పాత్ర పరంగా మీకు సంతృప్తి ఇచ్చిన మూవీ ఏది? ‘రంగ మార్తాండ’ లాంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమా హిట్ అయినా, అవకపోయినా మనసుకు సంతృప్తి ఉంటుంది. అయితే ‘జైలర్’లాంటి హిట్స్ వస్తే ‘రంగ మార్తాండ’ లాంటి సినిమాలు చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.. నా కెరీర్ కూడా మరింత విస్తరిస్తుంది. అయితే ‘రంగమార్తాండ’ లాంటి సినిమాలు కూడా హిట్ కావాలి. కొన్నిసార్లు అలాంటి సినిమాలకు ఎక్కువ అభినందనలు వస్తాయి.. వసూళ్లు రాకపోవచ్చు. ఆర్టిస్ట్లకు అభినందనలూ కావాలి.. కలెక్షన్స్ కూడా కావాలి (నవ్వుతూ). ► ఓటీటీ ΄్లాట్ఫామ్లో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తర్వాత కొత్త సిరీస్లు చేయడం లేదు. ఎందుకు? ‘క్వీన్’ తర్వాత ‘క్వీన్ 2’ షూటింగ్ 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన 30 శాతం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ‘క్వీన్’ కంటే ‘క్వీన్ 2’ అద్భుతంగా వచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వేరేవి ఒప్పుకోలేకపోతున్నాను. ► అప్పట్లో మీ తరం వాళ్లకి సినిమాలు తప్ప వేరే ఏమీ లేవు. కానీ, ఈ తరం వాళ్లకి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, టీవీ షోలు.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తోంది? సోషల్ మీడియాలోని చాలామంది ఇన్ఫ్లుయర్స్లో నటీనటులకంటే ఎక్కువ పాపులర్ అవుతున్నవాళ్లు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంతలా మారింది? అనిపిస్తోంది. మనం కూడా మారుతున్న ప్రపంచంతో ΄ోటీ పడుతూ ముందుకు సాగాలి. ► అయితే ఇప్పుడొస్తున్న కథానాయికలకు మీలా 20, 25 ఏళ్లు లాంగ్విటీ ఉండటంలేదు కూడా... మాకు తప్పులు చేయడానికి, దిద్దుకోవడానికి టైమ్ ఉండేది. ఇప్పుడు ఆ టైమ్ లేదు. వస్తున్నారు.. వెళుతున్నారు.. కానీ మేం అన్ని సంవత్సరాలకు సంపాదించుకున్నది ఇప్పుడు సక్సెస్ అయితే తక్కువ టైమ్కే సంపాదించుకుని వెళ్లిపోతున్నారు. టైమ్ ఎలా మారుతుందో దాన్నిబట్టి అన్నీ మారుతున్నాయి. దాంతో పాటు మనం మారాలి. జీవితంలో స్థిరమైనది ఏది అంటే.. అది మార్పు మాత్రమే. ఆ మార్పుకి మనం అడ్జస్ట్ అవ్వాలి. దాంతో పాటు కొనసాగాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి అది మారుతుంది. ఒకవేళ దుఃఖంలో ఉన్నాం అనుకోండి అది కూడా మారుతుంది. సో.. ఏదీ నిరంతరంగా ఉండదు.. మార్పు సహజం. ► మీ అబ్బాయి రుత్విక్ ఏం చేస్తున్నాడు... హీరో అవుతాడా? తన నాన్న (కృష్ణవంశీ)లా డైరెక్టర్ అవుతాడా? రుత్విక్కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతానికి ఫోకస్ అంతా చదువు మీదే. వాడికేం అవ్వాలో వాడికే తెలియదు.. నాకేం తెలుస్తుంది (నవ్వుతూ). తనేం కావాలో రుత్విక్ తెలుసుకుని, మాతో చెబితే మేం స΄ోర్ట్ చేస్తాం. ► ఈ మధ్య రోజాగారు, మీరు కలుసుకున్నారు.. మీ ఇద్దరి అనుబంధం గురించి? రోజా నాకు ఎప్పట్నుంచో తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలానే ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతి వెళ్లాను. తనే నాకు దర్శనం ఏర్పాటు చేసింది. అద్భుతమైన దర్శనం దక్కింది. సో.. తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లాను. ► ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? రెండింటి గురించి మాట్లాడుకోలేదు. లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. నా అబ్బాయి ఏం చేస్తున్నాడు.. తన పిల్లలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇంత బిజీగా ఎలా ఉండ గలుగుతున్నావ్ అని అడిగాను. ఇలాంటివే... ► రోజాగారితో మాట్లాడాక మీక్కూడా పాలిటిక్స్ పై ఏమైనా ఆసక్తి కలిగిందా? మీరూ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ అనేది ఒకర్ని చూసి వచ్చేది కాదు. ఎవరికి వాళ్లకి ఉండాలి. కొందరికి ఇంట్రస్ట్ ఉంటుంది.. కొందరికి ఉండదు. బట్.. రోజా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను కళ్లారా చూశాను. ► భవిష్యత్తులో ఏదైనా పార్టీ నుంచి మీకు ఆఫర్ వస్తే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? ఏమో.. నాకు తెలియదు. వచ్చినప్పుడు చూద్దాం. -
ఆ ఆపజయాల వల్లే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ: రమ్యకృష్ణ
రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు. అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్లాల్, శివరాజ్కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్లాల్కు రూ.8 కోట్లు, శివరాజ్కుమార్కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
చెమటతో తడిసిపోయిన పాయల్.. బీచ్ ఒడ్డున అతుల్య
కెనడా ట్రిప్లో హీరోయిన్ రీతూవర్మ వర్కౌట్ దెబ్బకు పాయల్కు చెమటలు పలుచటి చీరలో మీనాక్షి మెరుపులు బీచ్ ఒడ్డున హీరోయిన్ అతుల్య పోజులు పొట్టి స్కర్ట్లో అరియానా హాట్ స్టిల్స్ తమన్నా పాటకు రమ్యకృష్ణ స్టెప్పులు ఐశ్వర్యా రాజేశ్ హీటెక్కించే ఫొటోలు కేజీఎఫ్ బ్యూటీ కనువిందు చేసే పోజుల్లో View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) #payalrajput pic.twitter.com/DimV0vWESL — 🎭 (@MrXholic69) July 29, 2023 View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by ✨Prakruthi Ananth 💄🎨✨ (@prakatwork) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
హీరోలా ఉన్న రమ్యకృష్ణ కొడుకు...!
-
రమ్యకృష్ణ అందరి ముందు నా మీద అరవడం కరెక్ట్ కాదు..
-
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్రాజ్కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఆమాత్రం దానికి మేమెందుకు?: రమ్యకృష్ణ ఫైర్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? అదే సూపర్స్టార్ కృష్ణ చివరి సినిమా! -
బహు భాషా కోవిదురాలు రమ్యకృష్ణ గోవర్ధన్పై ప్రశంసలు
హైదరాబాద్ బాలిక రమ్యకృష్ణ గోవర్ధన్పై తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. దశాబ్దకాలంగా తెలంగాణ, దక్షిణ కొరియా భాష, సంస్కృతి, సంగీత, చలనచిత్రాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి విద్యార్థిగా ‘తూర్పు ఆసియా - కొరియన్ భాష, సాహిత్య, చరిత్ర అధ్యయనం’ చేసేందుకు అమెరికాకు చెందిన ఆరు యూనివర్సిటీలు రమ్యకు స్కాలర్షిప్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. రమ్యకష్ణ ప్రతిభాపాటవాలపై మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఆమె 11 సంవత్సరాల వయస్సు నుండి కొరియన్ భాషను అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించారని చెప్పారు. 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్లో ‘హైదరాబాద్ కెపాపర్స్’ పేరుతో భారత- తెలంగాణ- కొరియా సాంస్కృతిక సంస్థను స్దాపించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ - భారత- కొరియా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిన ఆమె బహు భాష కోవిదురాలని అన్నారు. చైనీస్, జాపనీస్, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం మరువ లేనిది తెలంగాణలో కొరియన్ భాష, సంస్కృతి, కళల ప్రోత్సాహానికి మామిడి హరికృష్ణ అండగా నిలిచారని రమ్యకృష్ణ చెప్పారు. తనకు తోడ్పాటు అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్ఫాంపై తాజాగా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుంది, నేనేమో హైదరాబాద్లో..: కృష్ణవంశీ
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్. ఎంతైనా క్రాస్బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్ అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సమాధానమిచ్చారు. -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. రిలీజ్కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. అయితే ఈ లైగర్ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్తో పాటు లైగర్లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్పై వస్తోన్న రూమర్స్పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
బంగార్రాజు: ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్తో మెస్మరైజ్
Krithi Shetty And Other 8 Heroines Adds Bangarraju Glamour : 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి హిట్ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒకరు కాదు.. ఏకంగా 8మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్స్ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, దక్ష నాగార్కర్, సిమ్రత్ కౌర్ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలోని ఒక పాటలో ఏకంగా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. -
ఆసక్తికర అప్డేట్: మెగాస్టార్ వాయిస్తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’
ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠిలో సూపర్ హిట్గా నిలిచిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘గాడ్ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి గొంతు ఇచ్చినట్లు తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు. చదవండి: 'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు ఆయన 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్తో పాటు రమ్యకృష్ణ కీ రోల్ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ThQ annyya for ur generocity n unconditional kindness ...one more crowned lightening on #rangamarthandas sky ... THE MEGA VOICE........ @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV — Krishna Vamsi (@director_kv) October 26, 2021 -
రమ్యకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్లో త్రిష, ఖుష్భూ..
Ramya Krishna Celebrates 51st Birthday: ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు.. ఇలా కథానాయికగా గ్లామరస్, ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు రమ్యకృష్ణ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్నారామె. ఈ బ్యూటీ తన 51వ పుట్టినరోజు (సెప్టెంబర్ 15)ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) చదవండి: రమ్యకృష్ణ బర్త్డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్ సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని -
రమ్యకృష్ణ బర్త్డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్
ప్రముఖ నటి రమ్యకృష్ణ బర్త్డే 51 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బుధవారం(సెప్టెంబర్ 15) ఆమె బర్త్డే సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు రిప్లబిక్ మూవీ టీం. సాయి ధరమ్ తేజ్హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పాత్ర లుక్, పేరును ప్రకటించారు. ఇందులోని ఆమె విశాఖ వాణి అనే సీరియస్గా పవర్ ఫుల్ మహిళ రాజకియ నాయకురాలిగా కనిపించారు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. Wishing #VishakhaVani a.k.a @meramyakrishnan A very Happy & Joyous Birthday #REPUBLIC #RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @IamJagguBhai #ManiSharma @mynnasukumar @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/xgZJrMO4Q5 — BA Raju's Team (@baraju_SuperHit) September 15, 2021 -
హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్డే
సాక్షి, హైదరాబాద్: నీలాంబరి.. అలియాస్.. శివగామి.. అలియాస్ రమ్యకృష్ణ. సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని అందాల నటి రమ్యకృష్ట. రమ్యకృష్ణ ఉంటే ఆ సినిమా ఫ్లాప్ ఖాయం అన్న స్థాయినుంచి ఆమె నటిస్తే చాలు విజయం అదే వస్తుందన్న భరోసా కల్పించిన లెవల్ ఆమెది. నీలాంబరిగా సవాల్ విసిరినా, రాజమాత శివగామిగా రాజ్యాన్ని పాలించినా ఆమెకే చెల్లు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరితోనూ సూపర్ డూపర్ మూవీల్లో నటించిన ఘనత రమ్యకృష్ణ సొంతం. పాత్ర ఏదైనా దాంట్లో ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. కన్నులలో సరసపు వెన్నెల కురిపించే రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే అంటోంది సాక్షి.కామ్ -
నటి ఆరోపణలు.. డీసెంట్గా స్పందించిన రమ్యకృష్ణ
వనితా విజయ్కుమార్.. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్ విజయ్ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. Thank you @vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW @bbsureshthatha sorry I had to do this..❤️🙏 pic.twitter.com/E0c95POaoD — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 2, 2021 అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. చదవండి: ఆ కామెంట్ నచ్చకే విడిపోయా- హీరోయిన్ -
సలార్: ప్రభాస్కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్ పేరు!
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఒకటి. ఈ మూవీని డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రూమర్స్ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ పాత్రపై ఇంతకాలం రకారకాల వార్తలు వినిపించగా.. తాజాగా ప్రభాస్కు సోదరి పాత్ర గురించిన రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రభాస్కు అక్కగా ప్రముఖ నటి రమ్మకృష్ణ నటించనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో తాజాగా అక్క పాత్రకు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో ప్రభాస్ సోదరి పాత్రకు జ్యోతికను అనుకున్నంటున్నట్లుగా ఫిలిం ధూనియాలో టాక్. అంతేగాక ఇప్పటికే మూవీ మేకర్స్ జ్యోతికను కలిసి కథ వివరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటి రావాల్సి ఉంది. అంత ఒకే అయితే ఆమెను తెలుగు, తమిళం వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్లో మాత్రం నటి ప్రియాంక త్రివేదిని సంప్రదించినట్లు సమాచారం. కాగా, జ్యోతిక తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’, నాగార్జునతో ‘మాస్’ సినిమాలో హీరోయిన్గా నటించారు. అలాగే చంద్రముఖిలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ‘కేజీఎఫ్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శృతీ హాసన్ ఈ మూవీతో మొదటి సారిగా డార్లింగ్తో జతకడుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటు ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేస్తుండగా... రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క! -
అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క!
‘బాహుబలి’ వంటి బ్రహ్మాండమైన హిట్ తర్వాత హీరో ప్రభాస్, పవర్ఫుల్ యాక్టర్ రమ్యకృష్ణ మరోసారి కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్కు అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి.. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్కు అమ్మ (పవర్ఫుల్ శివగామి పాత్ర)గా నటించిన రమ్యకృష్ణ...‘సలార్’లో అక్క పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాల్సిందే. మరోవైపు ‘బాహుబలి’ తర్వాత ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అది కూడా తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట ప్రభాస్. ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. -
అధికారం మాత్రమే శాశ్వతం అంటున్న రమ్యకృష్ణ
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇందులో శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్ర చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేశారు. ‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని రాసిన వాక్యాలతో ఆమె లుక్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రను సాయితేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనున్నారు’’ అన్నారు. -
విజయ్ దేవరకొండ సినిమా డేట్ ఫిక్స్
‘లైగర్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ బాక్సర్గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వా మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబయ్లో గురువారం మొదలైంది. ‘‘ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విజయ్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలియజేసింది. -
చిరంజీవి సోదరిగా?
మలయాళ సూపర్హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్లో చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మలయాళ సినిమాలో మోహన్లాల్ హీరోగా నటించారు. ఆయన పాత్రను చిరంజీవి చేస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఓ సోదరి ఉంటుంది. ఈ పాత్రకు రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ‘లూసిఫర్’లో మోహన్లాల్ సోదరిగా మలయాళ నటి మంజూ వారియర్ నటించారు. గతంలో ‘ఇద్దరు మిత్రులు, అల్లుడా మజాకా’ వంటి సినిమాల్లో హీరోహీరోయిన్గా నటించారు చిరు, రమ్యకృష్ణ. మరి.. ‘లూసిఫర్’ లో అన్నా చెల్లెళ్లుగా నటిస్తే అది కచ్చితంగా విశేషమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఫ్యాబులెస్ 50 అంటున్న శివగామి
ప్రముఖ నటి రమ్యకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యుల మధ్య మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు శివగామి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఫ్యాబులస్ 50 వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో నటించిన రమ్యకృష్ణ తన నటనా చాతుర్యంతో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి'లోని శివగామి పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే జయలలిత బయోపిక్ క్వీన్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. బాలీవుడ్లోనూ 'ఖల్ నాయక్', 'క్రిమినల్', 'షాపాత్', 'బడే మియాన్ చోటే మియాన్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా పెద్దగా కథలు నచ్చలేదని, అందుకే బాలీవుడ్లో సినిమాలు చేయలేదు అని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా దక్షిణాది సినిమాల వైపే ఉందని చెప్పుకొచ్చారు. (మా పిల్లలు ప్రతిభావంతులు) Fifty and fabulous n what better than a FAMJAM to bring it on!!!! #Familylove #birthday #thankyougod pic.twitter.com/aaMalghhp6 — Ramya Krishnan (@meramyakrishnan) September 14, 2020 -
ఐఏఎస్ ఆఫీసర్
త్వరలో ఐఏఎస్ ఆఫీసర్గా చార్జ్ తీసుకోబోతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారట సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట సాయిధరమ్. ఫిట్గా కనిపించేందుకు బరువు తగ్గేలా వర్కౌట్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. నార్త్ ఇండియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. -
రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్ట్
చెన్నై: సీనియర్ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా మద్యాన్ని, కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేశారు. అయితే ఈ కారులో అక్రమంగా తరలిస్తున్న 96 బీర్ బాటిళ్లు, 8 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో కారును, మద్యం బాటిళ్లు సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుపై డ్రైవర్ సెల్వకుమార్ను పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా తమిళనాడులో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది. -
చిరంజీవి కూడా వెబ్సిరీస్లో..
‘పరుగులు లేవు. మేకప్ లూ.. పేకప్లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్ గ్రీన్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గతేడాదే వెబ్సిరీస్లో కూడా నటించారు. క్వీన్ పేరుతో రూపొందిన ఆ వెబ్సిరీస్ తెలుగులో డబ్ అయి జీ తెలుగు చానెల్లో ప్రసారం కానుంది. ఒక వెబ్సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సినిమాల్లో బిజీ బిజీ.. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న చిత్రం, సాయిధరమ్ తేజ్ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్ సీజన్–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్డౌన్ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ లైఫ్లో దొరకలేదు. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను. ‘క్వీన్’ను ఆమెతో పోలుస్తున్నారు.. నేను నటించిన తొలి వెబ్సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్లో ఏమవుతుందీ చెప్పలేం కదా.. ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ప్రేక్షకుల హృదయాల్లో వెబ్.. డబ్ ప్రస్తుతం వెబ్సిరీస్ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్సిరీస్కి మరీ డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్సిరీస్ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్సిరీస్లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్సిరీస్లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్సిరీస్లో సాంగ్స్ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్కంటే వెబ్సిరీస్లో కంటెంటే పెద్ద ఆకర్షణ. -
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ఫండ్ రైసింగ్ కార్యక్రమం
-
వేసవిలో రొమాంటిక్
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అనిల్ పాడూరి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. వేసవి సెలవుల్లో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లు మా సినిమాను చూడొచ్చు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్లో నితిన్ నటిస్తారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
రొమాంటిక్కి గెస్ట్
రామ్ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్ప్రైజ్గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారట రామ్. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. -
పవర్ఫుల్ పాత్రలో
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్బస్టర్హిట్ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో విజయ్ హీరోగా ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మళ్లీ శాకాహారం
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. -
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
గోవాలో...
గోవా మంచి హాలిడే స్పాట్. అది మాత్రమే కాదు.. షూటింగ్స్కి కూడా మంచి స్పాట్. అందుకే ‘రొమాంటిక్’ టీమ్ గోవా వెళ్లింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పణలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గోవాలో 30 రోజులపాటు జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. -
అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్బాస్ హిట్ అయ్యేదే..!
ప్రేక్షకులను వంద రోజులకు పైగా అలరించిన బిగ్బాస్ తెలుగు సీజన్ 3 నిన్న(ఆదివారం) ఘనంగా ముగిసింది. అయితే, కంటెస్టెంట్లకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన బిగ్బాస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లను బీట్ చేస్తుందనుకున్న బిగ్బాస్ సీజన్ 3 ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకుంది. విన్నర్ ఎంపికలో ఈసారి బిగ్బాస్ న్యాయం చేయలేకపోయాడని కొందరు వాదిస్తున్నారు. ఏ ప్రాతిపదికన రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కూడా కెప్టెన్గా ఎంపికవ్వని రాహుల్కి టైటిల్ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్న కొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఈక్రమంలో బిగ్బాస్ తెలుగు సీజన్-3 హైలైట్స్ ఓసారి పరిశీలిస్తే.. బిగ్బాస్ 3 కొనసాగిందిలా.. 1. హోస్ట్గా కింగ్ నాగార్జున 2. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 3. దంపతుల జంట వరుణ్, వితికలు రావడం 4. ఆరోవారంలో రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించడం స్పెషల్ అట్రాక్షన్ 5. ఆరోవారం నో ఎలిమినేషన్ 6. ఎనిమిదో వారంలో స్పెషల్ గెస్ట్గా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ రావడం 7. తొమ్మిదో వారం రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అండ్ రీఎంట్రీ 8. పన్నెండోవారం హౌస్లో బిగ్బాస్ బర్త్డే వేడుకలు 9. బిగ్బాస్ హౌస్లో పలువురు సెలబ్రిటీల సందడి ‘గ్యాంగ్ లీడర్’ తారాగణం నాని, వెన్నెల కిశోర్ ‘గద్దలకొండ గణేష్’ చిత్ర యూనిట్, వరుణ్ తేజ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర యూనిట్ రామ్, నిధి అగర్వాల్ ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ దీపావళికి యాంకర్ సుమ బిగ్బాస్ హౌస్లో సందడి 10. పదమూడోవారం కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్బాస్ హౌస్లోకి పంపించడం 11. బిగ్బాస్ 105 రోజుల పాటు కొనసాగింది.(జూలై 21న ప్రారంభమై నవంబర్ 3న ముగిసింది) 11. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం 12. టైటిల్ విజేతగా రాహుల్, రన్నరప్గా శ్రీముఖి నిలవటడం మైనస్గా మారినవి.. 1. మెప్పించని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2. టాస్క్లు పదేపదే రద్దు చేయడం 3. ఎమోషన్స్ను ఎలివేట్ చేస్తూ సాగదీయడం 4. గత సీజన్ల టాస్క్లు కాపీ కొట్టడం 5. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం 6. లీకులు అరికట్టలేకపోవడం 7. చుట్టుముట్టిన వివాదాలు -
రాజకీయ రాణి
రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్. ఈ చిత్రంలో ఎమ్జీఆర్గా నటుడు ఇంద్రజిత్ కనిపిస్తారట. అలాగే యంగ్ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ నటించారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు. -
జయలలిత బయోపిక్ టైటిల్ ఇదే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె కథను వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేవలం సినిమాగానే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్లోనూ జయ కథ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్ఎక్స్ ప్లేయర్ జయ బయోగ్రఫిని వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్వీన్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్లో జయ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ను మాత్రమే రివీల్ చేసిన చిత్రయూనిట్, జయ వేలాది మంది అభిమానులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రమ్యకృష్ణ ముఖం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. -
హౌస్మేట్స్కు బిగ్బాస్ ఇచ్చిన క్యాప్షన్స్ ఏంటంటే..?
ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వచ్చే వారం మన కింగ్ మళ్లీ వస్తాడు.. అందర్నీ ఎంటర్టైన్ చేస్తాడంటూ రమ్యకృష్ణ తెలిపింది. ఈ వీకెండ్ను రమ్యకృష్ణ తన భుజాలపై మోసింది. ఇక ఆదివారం నాటి కార్యక్రమంలో.. సీన్ చేయండి టాస్క్లో హౌస్మేట్స్ అందరూ రెచ్చిపోయి నటించారు. ఇంటి సభ్యులందరూ తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అలీ-రవి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లోంచి పూలకుండి సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. అనంతరం బాబా భాస్కర్-శ్రీముఖి.. చంద్రముఖి పాటకు డ్యాన్స్కు చేశారు. వరుణ్-వితికా ఎఫ్2 సినిమాల్లోంచి వెంకటేష్-తమన్నా గొడవపడే సన్నివేశాలను నటించి చూపించారు. మహేష్-శివజ్యోతి-హిమజ.. రంగస్థలంలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. రంగమ్మత్తగా శివజ్యోతి, సమంతగా హిమజ, రామ్చరణ్ పాత్రలో మహేష్ నటించారు. నామినేషన్లో ఉన్న ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారో.. వాళ్లకి ఓ గులాబీ పువ్వు ఇచ్చి కారణం చెప్పాలని తెలిపింది. దీంతో మహేష్కు నాలుగు, పునర్నవి, హిమజకు రెండేసి గులాబీ పూలు వచ్చాయి. అయితే మహేష్ సేవ్ అయినట్లు రమ్యకృష్ణ ప్రకటించింది. అనంతరం హౌస్లోకి రమ్యకృష్ణ వచ్చింది. హౌస్మేట్స్ అందరికీ బిగ్బాస్ టీ షర్ట్స్ను పంపించారు. వాటిపై వారందరికీ సరిపోయే ఓ క్యాప్షన్ను కూడా ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. అలీ-హ్యూమన్ బుల్డోజర్, వరుణ్- మేడమ్ వాళ్ల ఆయన, రాహుల్- పట్టుపట్టని విక్రమార్కుడు, బాబా భాస్కర్- మాస్క్ మ్యాన్, రవికృష్ణ- ఉదయించని సూర్యుడు, శ్రీముఖి-పంచాయితీ స్పెషలిస్ట్, పునర్నవి-లేడీ మోనార్క్, మహేష్-బాబా గారి బంటు, హిమజ- మిస్ ఆరాటం, వితికా- సర్ వాళ్ల ఆయన, శివజ్యోతి- సిల్లీ సిస్టర్.. అంటూ క్యాప్షన్స్ ఇవ్వగా.. వాటిపై బాబా భాస్కర్ కామెంట్లు చేస్తూ ఉన్నాడు. అనంతరం వినాయక చవితి సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి.. ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ రమ్యకృష్ణ ప్రకటించింది. అయితే.. కన్ఫెషన్ రూమ్కు వెళ్లిన అలీ, రవిలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన క్లూ ఇవ్వడానికే పిలిచినట్లు అనిపిస్తోంది. శిల్పా చక్రవర్తి హౌస్లోకి స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతోందని ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లోనే ఎంట్రీ ఇస్తుందా? లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. (బిగ్బాస్.. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఎవరంటే?) -
బిగ్బాస్ హౌస్లోకి రమ్యకృష్ణ..
-
బిగ్బాస్.. రెచ్చిపోయిన హౌస్మేట్స్
-
బిగ్బాస్.. రెచ్చిపోయిన హౌస్మేట్స్
బిగ్బాస్ హోస్ట్గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆరో వారాంతానికి నాగార్జున అందుబాటులో లేనందున స్పెషల్ గెస్ట్తో షోను నడిపించారు. ఇక ఫస్ట్ టైమ్ తన హోస్టింగ్తో హౌస్మేట్స్తో పాటు ఆడియెన్స్ను రమ్యకృష్ణ ఆకట్టుకుంది. హౌస్లో అన్యాయానికి గురైన మహిళలకు, న్యాయం చేసింది. తన రాజ్యంలో మహిళల పట్ల చిన్న చూపు తగదన్నట్లు తీర్పునిచ్చింది. వరుణ్ సందేశ్ మొహంపై కాఫీ పోయడం, రాహుల్ బట్టలను కత్తిరించడం, రవికి సంబంధించిన బెడ్ను నీటితో తడపటంలాంటి ఆదేశాలను జారీ చేసింది. ఇక నేటి ఎపిసోడ్లో మరో ఆట ఆడించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. సీన్ చేయండి అనే ఈ గేమ్లో శ్రీముఖి కాస్తా.. చంద్రముఖిగా మారిపోయింది. ఇదే వరుసలో రాహుల్-పునర్నవి లవ్ ట్రాక్ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో వీరిద్దరే హైలెట్గా నిలిచారు. ఇక వితికా తన బాధను వ్యక్తపరిచేలా నటిస్తుంటే.. వరుణ్ ఆ సీన్ను కామెడీ చేయడంతో హౌస్మేట్స్ అంతా పగలబడి నవ్వుకుంటున్నారు. హోస్ట్గా ఉన్న రమ్యకృష్ణ.. హౌస్మేట్స్ను కలిసేందుకు బిగ్బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. అక్కడా కూడా పంచ్లు వేస్తూ.. బాబా భాస్కర్ను బెదిరిస్తూ..ఆటపట్టిస్తూ.. ఎంటర్టైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆరోవారంలో ఎలిమినేషన్ లేదనే విషయం దాదాపుగా ఖరారైపోయింది. అయితే మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో యాంకరింగ్ చేసి క్రేజ్ను సొంతం చేసుకున్న శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గత వారంలో కూడా ఇలాగే ఈషా రెబ్బా హౌస్లోకి ఎంటర్ అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అవన్నీ వట్టి రూమర్స్గానే మిగిలాయి. మరి ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాలి. -
గోవా బీచ్లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి
-
గోవా బీచ్లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి
జగ్గయ్యపేట: గోవా బీచ్కి వెళ్లిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వైద్యురాలు మంగళవారం మృత్యువాత పడింది. అలల తాకిడికి యువతి సముద్రంలోకి కొట్టుకుపోయింది. జగ్గయ్యపేటలోని మార్కండేయ బజార్కు చెందిన ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ కొంత కాలం క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె రమ్యకృష్ణ (25) ఎంబీబీఎస్ పూర్తి చేసి జగ్గయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత కాలం పని చేసింది. మూడేళ్ల క్రితం గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్కు వెళ్లింది. బీచ్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గోవా బీచ్లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్మేన్’ సినిమాలతో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలను ఆడియన్స్కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్స్క్రీన్ కపుల్. ఆన్స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్లో సూర్య–జ్యోతికలది సూపర్హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మరోచిత్రం
తమిళసినిమా: నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఆకాశగంగ–2 చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు వినయన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన కోలీవుడ్లో ఇంతకు ముందు విక్రమ్ హీరోగా కాశీ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడీయన. అదే విధంగా ఆ తరువాత ఈయన తెరకెక్కించిన ఎన్.మన వానిల్, అర్పుత దీవు వంటి తమిళ చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. కాగా మలయాళంలో వినయన్ ఇటీవల దివంగత నటుడు కళాభవన్మణి జీవిత ఇతివృత్తంతో తెరకెక్కించిన సాలక్కుడిక్కారన్ సంగాది చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆకాశగంగ–2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ఆకాశగంగ చిత్రానికి సీక్వెల్. హర్రర్ కామెడీ చిత్రాలకు పేరు గాంచిన వినయన్ ఈ ఆకాశగంగ–2 చిత్రాన్ని ఆదే బాణీలో రూపొందిస్తున్నారు. ఇందులో ఆసీప్ అలీ, సిద్ధిక్, సలీమ్కుమార్, శ్రీనాథ్బాషీ, విష్ణు గోవింద్, హరీశ్కన్నన్, ధర్మరాజన్, ఆరతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞనంతో భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. బీజీపాల్ సంగీతం, ప్రకాశ్కుట్టి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై, పాలక్కాడు, కొ చ్చి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. ఓనం పండగ నాటికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
21 ఏళ్ల తర్వాత...
50 ఏళ్ల సినీ కెరీర్లో తొలిసారి ఓ తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. 21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలసి నటించనున్నారు. అమితాబ్ బచ్చన్, యస్.జె.సూర్య ముఖ్య పాత్రల్లో తమిళవానన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉయంర్ద మణిదన్’. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్కు జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 1998లో రిలీజైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో అమితాబ్– రమ్యకృష్ణ జోడీగా కనిపించారు. 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
బిగ్బీతో రమ్యకృష్ణ
సినిమా: బాలీవుడ్ బిగ్బీ అమితాబచ్చన్ సరసన దక్షిణాది సంచలన నటి రమ్యకృష్ణ జత కట్టబోతోందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కథానాయకిగా నటించిన గ్లామరస్ పాత్రలను ఇరగదీసిన ఈమె, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి మరోసారి తన సత్తా చూపిస్తోంది. బాహుబలి రాజమాతగా నటించి ఆ పాత్రకు హోదాను తీసుకొచ్చిన రమ్యకృష్ణ ఆ తరువాత పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తోంది. కాగా ఇటీవల కోలీవుడ్లో సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర పలు విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా అమితాబ్బచ్చన్తో జత కట్టడానికి రమ్యకృష్ణ సిద్ధం అవుతోందని సమాచారం. నటుడు ఎస్జే సూర్య హీరోగా నటించనున్న చిత్రం ఉయర్నద మనిదన్. ఇంతకు ముందు ఈయన హీరోగా కల్వనిన్ కాదలి చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్వానన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఇది ఉయర్నద మనిదన్. తమిళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కాగా ఆయనకు జంటగా రమ్యకృష్ణ నటించనున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్ కోలీవుడ్లో నేరుగా నటిస్తున్న చిత్రం ఇదే అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు రజనీకాంత్ విడుదల చేయడం మరో విశేషం కాగా ఆయన నటుడు అమితాబ్ బచ్చన్ను కోలీవుడ్కు ఆహ్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్తో నటించడానికి సహకరించిన రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
37 టేకులు తీసుకున్నా!
నటిగా రమ్యకృష్ణ ప్రూవ్డ్. విభిన్నమైన పాత్రలు చేశారు. పాజిటివ్, నెగటివ్.. ఏ షేడ్స్ అయినా స్క్రీన్ని షేక్ చేశారు. అయితే నటిగా నిరూపించేసుకున్నాం కదా అని రిలాక్స్డ్గా ఉండటం ఆమెకు నచ్చదు. కొత్త కొత్త చాలెంజ్లను స్వీకరిస్తూ తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేటెస్ట్గా తమిళంలో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో నటించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం తమిళంలో భారీ అంచనాలు చుట్టుముట్టిన సినిమా అది. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ పాజిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమారరాజ దర్శకుడు. ఇందులో రమ్యకృష్ణ శృంగార తార పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పోషించిన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో నేను చేసిన చాలెంజింగ్ పాత్ర ఇది. కొన్ని పాత్రలు డబ్బు కోసం, మరికొన్ని పాపులారిటీ కోసం , పేరుకోసం చేస్తాం. ఈ సినిమా ప్యాషన్ కోసం చేశాను. ఓ సన్నివేశాన్ని ఏకంగా 37 సార్లు షూట్ చేయాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఒకే షాట్ కోసం 37 టేకులు చేశాం. నా కంటే నా అసిస్టెంట్స్ చాలా షాక్ అయ్యారు’’ అని పేర్కొన్నారామె. ‘‘37 టేకులే ఎక్కువనుకుంటే ఈ సినిమా కోసం 100, అంతకుమించి టేకులు తీసుకొని షూట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తారా? చేయరా? అనుకున్నాం. కానీ ఆమె చాలా కూల్. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పుష్ చేస్తున్నట్టు కష్టపడ్డారామె’’ అని దర్శకుడు త్యాగరాజ కుమారరాజన్ తెలిపారు. -
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్బాబు డి) శరత్బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
పోర్న్ స్టార్గా రమ్యకృష్ణ..!
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆకట్టుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్న రమ్య, ఓ తమిళ సినిమా కోసం పోర్న్స్టార్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్లో కనిపించనున్నాడు. ఇదే సినిమాలో రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనుంది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ముందుగా ఈ పాత్రకు నదియాను సంప్రదించగా ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్మేన్గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
నవ్వుల పార్టీ
జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్రాజ్, శివ, చంద్రన్ ముఖ్య తారలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పార్టీ’. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించారు. ప్రేమ్జీ అమరన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘సత్యరాజ్సార్ లాగా చాలా రోజుల తర్వాత డ్యూయెట్లు పాడాను. సినిమా మొత్తం నవ్వుతూ చేశాం. ప్రేక్షకులు కూడా నవ్వుకునేలా ఈ సినిమా సరదాగా ఉంటుంది’’ అన్నారు. ‘‘పార్టీ’ లాంటి ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. ఈ డైరెక్టర్తో మరిన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ’’ అన్నారు టి. శివ. ‘‘పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులతో ‘పార్టీ’ చిత్రం తెరకెక్కింది. ప్రధానమంత్రి మోదీగారి స్పీచ్తో మొదలవుతుంది. ఇదే బ్యానర్లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వెంకట్ ప్రభు అన్నారు. ‘‘రమ్యకృష్ణగారిని రియల్గా చూడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా.. భయం కాదు కానీ బిడియంగా ఉంది’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. ‘‘పార్టీ’ చిత్రం ద్వారా మా మనవడిని పరిచయం చేస్తున్నారు. తప్పక ఆదరించాలి. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే. ఒరిజినల్గా అలా ఉండను’’ అన్నారు సత్యరాజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్జీ, నటి సంచిత తదితరులు పాల్గొన్నారు. -
శివగామి పాత్రలో బాలీవుడ్ మోడల్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్గా ఓ వెబ్ సీరీస్ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్సీరీస్లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనున్నారట. సిల్వర్ స్క్రీన్పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్ భాగ్య సీరియల్లో బుల్ బుల్ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ 30లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : శైలజా రెడ్డి అల్లుడు జానర్ : రొమాంటిక్ యాక్షన్ కామెడీ తారాగణం : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : మారుతి దాసరి నిర్మాత : ఎస్ రాధకృష్ణ, నాగవంశీ ఎస్, పీడీవీ ప్రసాద్ వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెర ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మరి హిట్ ఫార్ములా నాగచైతన్య కెరీర్లో మరో హిట్గా నిలిచిందా..? రమ్యకృష్ణ అత్త పాత్రలో ఏమేరకు ఆకట్టుకున్నారు..? మారుతి తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేశారా..? కథ : చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ. నటీనటులు సినిమాలో తెర నిండా నటులు ఉన్నా సినిమా అంతా ముఖ్యంగా నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్ల చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్తోనూ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావటంతో డ్యాన్సులు, ఫైట్స్కు కూడా మంచి అవకాశం దక్కింది. ఇక కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భరించలేనంత ఈగోతో అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో రమ్యకృష్ణ నటన అందరిని అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) సెకండాఫ్లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్లోనూ తన ఎక్స్పీరియన్స్ను చూపించారు. ఈగో విషయంలో అమ్మతో తలపడే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణతో పోటి పడి నటించే సీన్స్లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్లో ఈగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. విశ్లేషణ గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్టర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విపరీతమైన ఈగోతో అందరిని ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్ల లవ్ స్టోరి, రొమాటింక్ సీన్స్తో సాగదీసిన దర్శకుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. (సాక్షి రివ్యూస్) ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. మారుతి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. క్లైమాక్స్లో శైలజ రెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత కన్విన్సింగ్గా అనిపించదు. గోపిసుందర్ తన ట్యూన్స్తో మరోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువల్గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య, రమ్యకృష్ణ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : పాత కథ రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’
వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుంటున్నాడు చైతూ. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్లో తనకు బాగా నచ్చిన నచ్చని సినిమాలు వెల్లడించాడు చైతూ. ప్రేమమ్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమా అన్న నాగచైతన్య.. దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు రేపు (13-09-2018) రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించారు. -
వినుమా వినాయక సినిమా కోరిక
కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా కోరికలు కోరికలే.కొన్ని సినిమా కోరికలు చిత్రంగా ఉంటాయి.చూసేవాళ్లలో చోద్యం కలిగిస్తాయి. విజయానికి ‘కీ’గా మారిన సినీ కోరికలు ఇవి. చదువులు కావాలంటే ఇస్తావు. స్కూటర్ కొనిపెట్టమంటే పెడతావు. ఫలానా పొరుగమ్మ మెడలో ఉన్నట్టున్న మామిడి పిందెల గొలుసు కావాలంటే పోనీలే పాపం అని ప్రసాదిస్తావు. కొడుకును అమెరికా పంపించమంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా శాంక్షన్ చేసి శాన్ప్రాన్సిస్కో ఫ్లయిట్ ఎక్కిస్తావు. చిన్న చాక్లెట్ కావాలన్నా పెద్ద మినిస్టర్ పోస్ట్ కొట్టాలన్నా ఆ కోరికలన్నీ తీర్చల్సిన దేవుడివి తీర్చే దేవుడివి నీవే.వినాయకునివే. సిద్ధి వినాయకునివే.ప్రతి మనిషిలో కోరికలు కామన్. సినిమాల్లో కోరికలు కోరుకునే క్యారెక్టర్లూ కామన్. కాని అన్ని సినిమాలు ఒక్కలా ఉండవన్నట్టే అన్ని కోరికలూ వొక్కలా ఉండవు. ఈ సినీ వింత కోరికలు నీకు గుర్తున్నాయా స్వామీ. ఈ కోరికలే కాసులు కురిపించాయి కదా స్వామీ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే ‘చేసుకో అనో.. చేసుకోవద్దు’ అనో తండ్రి అంటాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కూడా తండ్రి ప్రకాష్రాజ్ తన కొడుకు సిద్ధార్థ ప్రేమ సంగతి విని ఆ మాటే అంటాడు.దానికి సదరు పుత్రరత్నం తిరగబడాలి. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరిన ఆర్యసమాజ్లో ఆర్భాటం లేకుండా మూడుముళ్లు వేసి ఆటో ఎక్కి అద్దె పోర్షన్కు చేరుకోవాలి.కాని కొడుకు ఒక వింత కోరిక కోరుతాడు.‘ఆ అమ్మాయిని తెచ్చి వారం రోజులు ఇంట్లో పెడతాను. నీకు నచ్చేలా చేస్తాను. ఛాన్స్ ఇవ్వు నాన్నా’ అంటాడు.ఇలాంటి కోరిక ఇంతకు ముందు నిజ జీవితంలో ఎవరూ కోరలేదు.సినిమాలోనూ కోరలేదు.అందుకనే ఈ కోరిక పండింది. బాక్సాఫీస్ బొజ్జ కలెక్షన్లతో నిండింది. అదేం చిత్రమో ప్రేమ అనేసరికి వింత వింత కోరికలే వస్తాయి. ‘మరో చరిత్ర’లో అరవ బాలు కమలహాసన్, తెలుగు స్వప్న సరిత ప్రేమించుకోలేదూ? వాళ్లు మరో మాట లేనట్టుగా పెళ్లి చేసుకుంటాము మొర్రో అంటే పెద్దలు కోరిన వింత కోరిక ఇంతకు మునుపు విన్నామా కన్నామా? ‘మీరిద్దరు సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. లవ్ లెటర్స్ రాసుకోకూడదు. ఇలా చేసిన తదుపరి కూడా మీలో ప్రేమ ఉన్నచో అప్పుడు పెళ్లి’ అంటారు. ఈ కోరిక విని అంత పెద్ద దేవుడుని నీవు కూడా కలవర పడి ఉంటావు కదూ. ఏవో పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఫలితంగా సిరిసంపదలు కోరుకుంటే వాటిని నువ్వు నెరవేరుస్తే అర్థముంది. స్ట్రయిట్ కోరికలకు స్ట్రయిట్ రిజల్ట్సు. కాని ‘లేడిస్ టైలర్’లో బట్టలు కొట్టే సుందరం కోరుకునే కోరిక ఏమిటి? ‘తొడ మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని’ కదూ. అదేం కోరిక. అట్లాంటి అమ్మాయిని ఎలాగని వెతికేదిక. సెర్చ్ వారెంట్ తీసుకొని బయలుదేరితే అరెస్టు వారెంటు వస్తుందే. చివరకి అతడికి అలాంటి అమ్మాయిని ఇవ్వకనే నువ్వు బుద్ధొచ్చేలా చేస్తావు. దారిలో పెడతావు. అంతేనా? మరుజన్మలో అతడే ‘ఆ ఒక్కటి అడక్కు’లో హస్తరేఖను నమ్ముకొని సంవత్సరం తర్వాత నేనే కింగ్ని అని విర్రవీగితే అలాంటి వెర్రి కోరికతో కలలు గంటూ కూర్చుంటే నష్టమేనని శ్రమ కంటే మించిన వరం లేదని తెలిసొచ్చేలా చేసి ట్రాక్ ఎక్కిస్తావు. సరే. ‘ఏప్రిల్ ఒకటి విడుదల’లో ఇతని గర్ల్ఫ్రెండ్ కోరిన కోరిక చాలా తమాషా. నోరు తెరిస్తే అడ్డమైన అబద్ధాలు కూసే ఇతణ్ణి దారిలో పెట్టడానికి స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి సైన్ చేయించి ‘నెల రోజులు పాటు ఒక్క అబద్ధం చెప్పకూడదని’ కోరితే ఆ కోరికలోంచి కోటి నవ్వులు పుట్టడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకోవాలిలే. అసలు ఈ వింత కోరికలు కోరే జాడ్యం మన హీరోలకు ముందు నుంచీ ఉంది. రాజ్యాభిషేకం చేస్తూ నీ కోరిక ఏమిటి నాయనా అని ‘జగదేక వీరుని కథ’లో ఎన్టీఆర్ను ముక్కామల అడిగితే ‘మీ పాద సేవ చేసుకోవడలై తండ్రీ’ అని అనకుండా అతడు గొప్పలు పోతూ ‘వెన్నెల రాత్రిలో కలువపూల పాన్పు మీద తాంబూలం సేవిస్తూ ఉంటే ఒక చెంత ఇంద్ర కుమార్తె, మరో చెంత వరుణ కన్య, కనుల ముందు నాగకన్య, ఎదుట నాట్యం చేస్తూ అగ్నికూమారి’ఇలా నలుగురు సావాసకత్తెలు కావాలనే వింత కోరిక కోరి నీ దయ వల్ల క్లయిమాక్స్ సమయానికి ‘శివశంకరీ’ పాడి సాధిస్తాడనుకో. అక్కినేని మాత్రం తక్కువ తిన్నాడా. ‘తెనాలి రామకృష్ణ’లో మీ అమ్మ కాళికాదేవి దయతలిచి ఒక గిన్నెలో పాల రూపంలో ‘జ్ఞానం’, మరో గిన్నెలో పెరుగు రూపంలో ‘ధనం’ ఇచ్చి ఏది కావాలో కోరుకో అంటే చిటికెలో రెండూ మిక్స్ కొట్టి తాగి ‘నాకు రెండూ కావాలి ఇవ్వు’ అని రెటమతం కోరిక కోరితే ఆమెకు తిక్కరేగి ‘వికటకవిగా మిగులుతావు పో’ అని శపిస్తే ఆ వికటత్వంలో నీకెంతో ఇష్టమైన హాస్యాన్ని ఆ మహా కవి పుట్టించాడు కదా స్వామీ. ఆ నవ్వులు నేటికీ తలుచుకుంటున్నాము. అందుకు నీకు ఎన్ని అహ్హహ్హలూ ఓహ్హొహ్హోలు చదివించాలో. సరే పోనీ... నిన్న మొన్న ‘బాహుబలి’లో ఏమైంది. ‘నేను ప్రేమించిన దేవసేనను నాకే ఇవ్వు రాజమాతా’ అని శివగామి విఎఫ్ఎక్స్ ఎలివేటెడ్ కళ్లలోకి బాహుబలి సూటిగా చూస్తూ కోరితే ఆమె ఏమి కోరింది.‘నీకు రాచపదవి కావాలా? ఆ దేవసేన కావాలా తేల్చుకో’ అని ఎదురు కోరింది. కోరికకు కోరికే సమాధానం అయినప్పుడు బాహుబలి దేవసేన చిటికెన వేలినే చటుక్కున పట్టుకున్నాడు రాజ్యం పోతుందన్న చీకూ చింత చీమంతైనా లేకుండా. అందుకే సాహోరే బాహుబలి అనిపించుకున్నాడు. ఇలాంటి సీరియస్ కోరికలే కాకుండా గిలిగింతలు పెట్టే సిల్లీ కోరికలు కూడా ఉంటాయనుకో. ‘పడమటి సంధ్యారాగం’ సినిమా గుర్తుందిగా. అందులో ఐస్క్రీమ్ పార్లర్ ఆసామికి పుట్టిన బకాసురుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దొరికే అన్ని ఆహార పదార్థాల మీదా దాడి చేసి గుటకాయ స్వాహా చేస్తుంటే ఆ తండ్రి కోరే కోరిక ఏమిటో తెలుసా? ‘కులాసా అని ఎవరైనా అడిగితే కులాసే. అంటే కుమారుడి వల్ల లాసు’ అని జవాబు చెప్పే పరిస్థితి కల్పించవద్దని. ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి కోరిక కూడా చిన్నదే. ‘నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా’ అని వ్రాసే ఆమె యొక్క కవితా ఖండికల్ని అచ్చులో చూసుకోవాలనేగా.‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అలీ కోరిక కూడా చిన్నది. ‘ఎంద పరంద ఇన్న చేటా’ అంటూ అతడు బ్యాంకు మేనేజర్ బ్రహ్మానందం చుట్టూ తిరిగి అర్థం కాని భాషలో కోరే కోరిక ఒక్కటే –‘చేటల వ్యాపారం చేసుకుంటాను. లోను ఇమ్మని’.స్వామీ. సినిమాల్లో ఎన్నో కోరికలు చూశాము.ఆ కోరికలు తీరుతుంటే సంతోషపడ్డాము.కాని కొన్ని కోరికలు మాత్రం నువ్వు తీర్చనందుకు కొంచెం నిష్టూరం కూడా ఉంది. ‘అంతులేని కథ’లో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకున్న జయప్రద కోరిక నువ్వు తీర్చలేదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ఢిల్లీలో డాన్స్ చేయాలన్న కమలహాసన్ కోరికను ‘సాగర సంగమం’లో నువ్వు తీర్చలేదు. భర్త చనిపోయాక పిల్లలను తానుగా చూసుకుందామనుకున్న మాధవి కోరికను ‘మాతృదేవోభవ’లో నువ్వు తీర్చలేదు. అన్న ఆది పినిశెట్టిని నాయకుడిగా చూసుకోవాలనుకున్న తమ్ముడు రామ్చరణ్ కోరికను ‘రంగస్థలం’లో నువ్వు తీర్చలేదు. లేటెస్టుగా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ముప్పై అడుగుల నీ బొమ్మను తయారు చేసి మార్కులు కొట్టేయాలనుకున్న నత్తి రామ్మూర్తి కోరికను నువ్వు తీర్చలేదు. ఇక మీదట సినిమాల్లో ఏ కోరికకూ విఘ్నం కలిగించవద్దు. అవిఘ్నంగా సినిమా కోరికలన్నీ తీరే వరం ప్రసాదించు స్వామీ. -
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్లో సడెన్గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్ను శుక్రవారం విడుదల చేశారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్ వీడియో టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్లో విడుదల చేశాం. కృష్ణకాంత్ రాశారు. అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఐదు భాషల్లో శివగామి
రమ్యకృష్ణ కెరీర్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో చేసిన శివగామి పాత్రలు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఆ పాత్రల్లో ఆమె నటనను ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాణి శివగామి’. మధు మిణకన్ గుర్కి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను బోనాల పండగ సందర్భంగా విడుదల చేశారు. చిత్రనిర్మాత మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ డ్రామాతో సోషియో ఫాంటసీగా రూపొందిన చిత్రమిది. గ్రాఫిక్స్కి ప్రాధాన్యత ఇచ్చాం. రమ్యకృష్ణను కొత్త కోణం లో ఆవిష్కరించే చిత్రం ఇది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘9వ శతాబ్దంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్దం వరకు ఉంటుంది. ఈ కాలంలో జరిగే సంఘటనలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు మధు మిణకన్ గుర్కి. ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్రెడ్డి, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్కుమార్ యాదవ్. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్