revenue officials
-
బాబు సర్కార్ 'బరితెగింపు'
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదువిజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడి గ్రామంలోని శ్రీముకికృష్ణంరాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. కూటమి మితృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయకట్టుకు చెందిన గొలజాం బీజేపీ నాయకుడు కోన మోహన్రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయనను నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెను వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బరితెగించింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ దౌర్జన్యకాండకు దిగింది. రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాష్ట్రంలో సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను చేజిక్కించుకోవడానికి అరాచకాలకు తెరలేపింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇతర పార్టీల మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దుర్నీతికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. దీంతో అధికార కూటమి నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. జి.పెదపూడిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి సాగునీటి సంఘం ఎన్నికలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించిన అభ్యర్థిని రైతులు వ్యతిరేకించి.. సూర్య వెంకట కృష్ణారావును గెలిపించుకున్నారు.ఎటు చూసినా అరాచకమే..⇒ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్కు చేరుకుని మాపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ⇒ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా.. ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. పార్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సీసీఎస్ సీఐ ఇబ్రహీం ఇది చేతకాని దద్దమ్మ రాజకీయంనిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి కడప (కార్పొరేషన్)/పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి అప్రజాస్వామ్యంగా జరిగాయని, ప్రభుత్వం చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజులుగా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. రైతులెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. నీటి బకాయిలు లేనట్టు వీఆర్వో నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అని, ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన వీఆర్వోలందరినీ మండల కార్యాలయాలకు తరలించి జైల్లో ఖైదీల్లా బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు బీటెక్ రవికి చొక్కా, ప్యాంటు విప్పి నిలబెట్టేవారని హెచ్చరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం, తెగువ వారికి ఉన్నాయా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టే చేతగాని దద్దమ్మలు ఎవరో అందరికీ తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ‘1978 నుంచి ఉన్న మా ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాడట. ఓసారి మొహం అద్దంలో చూసుకో. జమ్మలమడుగులో వీఆర్వోలందరినీ వాహనంలో ఎక్కించి దేవగుడిలో బంధించారు. ఓడిపోతామనే భయం వల్లే కదా? వీటికి ఎన్నికలని పేరుపెట్టి గెలుపు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి’ అని రవిపై ధ్వజమెత్తారు. కాగా, ఎంపీ అవినాశ్రెడ్డిని శనివారం (రెండో రోజు) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
మహబూబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్కర్నూల్లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం
పెనమలూరు: మిత్రులంతా కలసి సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్నగర్లోని జారా రెస్టారెంట్ యజమాని అబ్దుల్రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్ నిర్వహించే షేక్ ఖలీషా అలియాస్ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్ వద్దకు వచ్చారు. వీరు ఘాట్ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఉదయం వెలుగు చూసిన ఘటన.. కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్ ఆచూకీ తెలియలేదు. గల్లంతైన కిరణ్ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. -
సారా మరణం కాదు.. అనారోగ్యంతో చనిపోయాడు
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లాలో సహజ మరణాలను నాటు సారా మరణాలంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మరోసారి రూఢి అయింది. మొన్న జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ మరణాన్ని సారా మరణంగా చిత్రీకరించి టీడీపీ నానా హంగామా చేసింది. అయితే, తమ తండ్రికి అసలు మద్యం అలవాటే లేదంటూ సత్యనారాయణ కుమారుడు, కుమార్తె స్పష్టంగా చెప్పడంతో పచ్చ బ్యాచ్ ఖంగుతింది. ఇప్పుడు ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన బొంతు అప్పారావు మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అప్పారావు నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొన్ని పత్రికల్లో వచ్చిన ఈ కథనాలపై రెవెన్యూ అధికారులు అప్పారావు కుటుంబీకులను విచారించగా, అదంతా ఉత్తి అబద్ధమేనని తేలింది. అప్పారావు అనారోగ్యంతో చనిపోయాడని తేటతెల్లమైంది. గురువారం ఉణుదుర్రుకు వెళ్లి అప్పారావు భార్య పర్లమ్మ, కుమారుడు అప్పన్నతో మాట్లాడినట్లు డిప్యూటీ తహసీల్దార్ వీరాస్వామినాయుడు చెప్పారు. ఈ నెల 2న అప్పారావు, మరికొందరు మినప కోతలకు గుడివాడ వద్దనున్న పతిపర్రు వెళ్లారన్నారు. 11న అప్పారావు కడుపునొప్పితో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, అయినా తగ్గకపోవడంతో 12వ తేదీ ఉదయానికి ఉణుదుర్రుకు వచ్చాడని తెలిపారు. అదేరోజు అప్పారావును తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఏలూరుకు తరలించారన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించినా అప్పటికే అప్పారావు ఆరోగ్యం విషమించడంతో రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. కుటుంబీకుల వద్ద తీసుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. నా తండ్రి అనారోగ్యంతో మరణించాడు బొంతు అప్పారావు అనారోగ్యంతోనే చనిపోయాడని ఆయన కుమారుడు అప్పన్న చెప్పారు. తన తండ్రి నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ‘నా తండ్రి మినప కోతలకు వెళ్ళి అనారోగ్యం పాలయ్యాడే తప్ప నాటుసారా తాగి కాదు. ఆయన, గ్రామానికి చెందిన మరికొందరు ఈ నెల 2న గుడివాడ వద్ద గల పతిపర్రుకు మినప కోతలకు వెళ్ళారు. ఈ నెల 11న నాన్నకు యూరిన్ బ్లాడర్ సమస్యతో కడుపునొప్పి వచ్చిందని అక్కడ వైద్యం చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మా గ్రామస్తుని సహకారంతో 11వ తేదీ రాత్రి బయల్దేరి 12వ తేదీ ఉదయానికి ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. యూరిన్ పూర్తిగా బంద్ కావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకువెళ్లాం. అయితే చికిత్స పొందుతూ వెళ్లిన కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు. ఆయన మరణాన్ని ఇలా రాజకీయం చేసి మమ్మల్ని అల్లరిపాలు చేయడం చాలా బాధగా ఉంది’ అని అప్పన్న చెప్పారు. – బొంతు అప్పారావు కుమారుడు అప్పన్న -
తిరుపతిలో టీడీపీ నేత చదలవాడ రౌడీయిజం
-
రూ.500 కోట్ల స్థలం కబ్జా.. అధికారులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ.. దౌర్జన్యకాండకు దిగాడు. కబ్జా స్థలం పరిశీలనకు వెళ్లిన రెవిన్యూ అధికారులను బెదిరించారు. స్థలంలో అడుగుపెడితే కొడతామంటూ హెచ్చరించాడు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. తన వెనుక పదివేల మంది జనం ఉన్నారంటూ చదలవాడ బెదిరింపులకు దిగాడు. రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణమూర్తి 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలం విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. -
మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్ ప్లాన్తోపాటు అప్పగించాలని గత జూన్ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
మల్లన్నసాగర్ ముంపు ఇళ్ల కూల్చివేతలో విషాదం
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్లో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి. ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు ఎర్రవల్లిలో విషాదం ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
టీడీపీ కబ్జాపై కొరడా!
అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్ ఎఫ్ బ్లాక్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్పీసీఎల్, ఎల్అండ్టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్) 430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు. టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... – టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్ బండ్తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. – ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్లో స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. – టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. – టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన విశ్వనాధ విద్యాసంస్థల నుంచి ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను
ఇచ్ఛాపురం రూరల్: ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. దానిని చదును చేసి.. ప్లాట్లుగా విభజించి విక్రయించాలన్న దురాలోచనతో పొక్లెయిన్తో రంగంగలోకి దిగాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ పరిధిలోని ఇన్నేశుపేట పొలిమేరలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శీర పురుషోత్తం చెట్లు నాటి గ్రామస్తుల సహకారంతో ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేశాడు. ఆయనను స్థానికులు పూజారిగా పిలుచుకుంటారు. దీనికి పక్కనే ప్రభుత్వం విశ్రాంతి భవనం నిర్మించింది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణంలో ఉంది. ఆ స్థలం పక్కనే బలరాంపురం గ్రామానికి చెందిన లండ సూర్యనారాయణ (బగ్గేడు)కు స్థలం ఉంది. దీన్ని టీడీపీ నేత దుక్క వెంకటేష్ ఇటీవల ప్లాట్లుగా విభజించి విక్రయించే నిమిత్తం కొనుగోలు చేశాడు. రోడ్డు పక్కనే విలువైన ఆధ్యాత్మిక స్థలం ఉండటంతో దాన్ని ఆక్రమించేందుకు ఇటీవల పొక్లెయిన్తో చెట్లు పడగొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్లిన పురుషోత్తంపై దౌర్జన్యం చేసి కొట్టాడు. దీంతో గ్రామపెద్దలు, మహిళలు టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది కూడా దుక్క వెంకటేష్కు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశా గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అభివృద్ధి చేశాను. కార్తీక మాసంలో మహిళలు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు. రోడ్డు పక్కన ఉండటంతో ఈ స్థలాన్ని వెంకటేష్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. చెట్లను ధ్వంసం చేశారు. అడ్డుకుంటే నాపై దాడి చేశారు. – శీర పురుషోత్తం, ఇన్నేశుపేట -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ను స్వాధీనం చేసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు
-
విశాఖలో ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన వారిపైనా అధికారులు చర్యలు చేపట్టారు. గంటా బంధువు చెరలోని భూమి స్వాధీనం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తోడల్లుడు.. ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్రావు ఆక్రమణలో ఉన్న భూముల్ని ఆర్డీవో పెంచల్ కిషోర్ నేతృత్వంలో అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం అడవివరం – శొంఠ్యాం రోడ్డులో ఉన్న విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లో మొత్తం 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4.86 ఎకరాలు పరుచూరి భాస్కర్రావుకు చెందినవని తేలింది. ఈ భూమి సహా ఇతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న మొత్తం 64 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో ఉన్న రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.256 కోట్లు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ని సీజ్ చేస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధీనంలో... ఆనందపురం మండలంలోని వేములవలస, ఆనందపురం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూముల్లోని కొంత జిరాయితీ భూమిని విశ్వనాథ ఎడ్యుకేషనల్ సంస్థ 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేసింది. ఆ స్కూల్ని ఆనుకొని ఉన్న ఆనందపురం సర్వే నంబరు 283–3 లోని 1.68 ఎకరాల గయాళు భూమిని, వేములవలస సర్వే నంబరు 123 లో 34 సెంట్లు, 122–1, 122–2, 122–3లలో 76 సెంట్లు వాగు పోరంబోకుని సంబంధిత యాజమాన్యం కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా ప్రాంగణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టింది.. శనివారం ఈ నిర్మాణాల ప్రహరీ గోడలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని, హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్లీజ్కు.. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సిరిపురంలోని ఫ్యూజన్ çఫుడ్స్ అండ్ రెస్టారెంట్ను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్ధ (వీఎంఆర్డిఏ) ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన టి.హర్షవర్ధన్ ప్రసాద్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిలో వీఎంఆర్డీఏ కి చెందిన 10,842 చదరపు అడుగుల స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. 2015లో ఏటా రూ.33 వేల చొప్పున చెల్లించేలా ఫ్యూజన్ ఫుడ్స్ పేరుతో తొమ్మిదేళ్ల లీజుకు తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నం.56 ప్రకారం మూడేళ్లు మాత్రమే లీజుకి ఇవ్వాల్సి ఉండగా.. అప్పటి వుడా అధికారులు టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఏకంగా తొమ్మిదేళ్లకు రాసిచ్చేశారు. ఇదిలావుండగా ఈ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ కన్య కంఫర్ట్స్ అనే సంస్థకు సబ్ లీజుకు ఇచ్చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజు కారణంగా వీఎంఆర్డీఏకి ప్రతి నెలా లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని భావించిన కమిషనర్ పి.కోటేశ్వరరావు చర్యలకు ఆదేశించారు. ఆదివారం ఉదయం వీఎంఆర్డీఏ కార్యదర్శి గణేష్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు హోటల్ను సీజ్ చేశారు. ఆక్రమణలపై చర్యలు కొనసాగిస్తాం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తిస్తున్నాం. సర్వే నంబర్లు, పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఆక్రమణలుంటే అక్కడ భూములు స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు దీనిని ప్రత్యేక డ్రైవ్లా ఇకముందు కూడా కొనసాగిస్తాం. –– ఆర్డీవో పెంచల్ కిశోర్ -
బుద్ధుందా.. గాడిద కొడుకుల్లారా..
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది (భీమిలి): మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్డీవో, ఆ నా..... సస్పెండ్ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్.. ఆ నా..... సస్పెండ్ చెయ్యాలి’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్ మూర్తి కోరితే కేటాయించారని అయ్యన్న చెప్పడం గమనార్హం. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి కక్షపూరిత చర్య అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గీతం కళాశాలపై ప్రభుత్వ కక్ష సాధింపును అంతా ఖండించాలన్నారు. దమ్ముంటే విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’ విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
కోస్తాను ముంచెత్తిన వాన
సాక్షి, అమరావతి: రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృత రూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. వాగుల్లా మారిన రహదారులు – భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. – విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. – భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలింపు – వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు తెలిపారు. – రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. – ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. – సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లలో 24 గంటలూ కంట్రోల్ రూమ్లు – వరద ప్రభావిత జిల్లాల్లోని కలెక్టరేట్లలో రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్లు పని చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. – నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో జలవనరులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం – నర్సాపూర్ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. -
పేదల భూమిపై పెద్దల కన్ను
ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం సుమారు 83 దళిత కుటుంబాలకు పట్టాలిచ్చిన డీకేటీ భూములపై స్థానిక పెద్దల కన్ను పడింది. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సుమారు 20 ఎకరాలను ఆక్రమించేశారు. అదును చూసి జేసీబీలతో చదును చేశారు. రాత్రికి రాత్రే బోరు డ్రిల్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత దళితులు పట్టాదారు పాసుపుస్తకాలతో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన కేవీబీపురం మండలం పెరిందేశంలో కలకలం రేపింది. కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సర్వే నం.254 (బ్లాకు)లో అదే గ్రామానికి చెందిన 83 దళిత కుటుంబాలకు 2003లో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరా చొప్పున పట్టాలిచ్చింది. అధికారులు సర్వేచేసి భూములను లబ్ధిదారులకు చూపించలేదు. అదే భూమిపై స్థానిక పెద్దల కన్ను పడింది. శ్రీకాళహస్త్రికి చెందిన ఓ వ్యాపారికి సదరు భూమి తమ స్వాధీనంలో ఉన్నట్టు నమ్మబలికారు. అందులో 20ఎకరాలు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. సదరు వ్యాపారి, స్థానిక పెద్దలు కొందరు మూడు రోజులుగా రాత్రి పూట జేసీబీలతో చదును చేయడం ప్రారంభించారు. ఎవరికీ తెలియకుండా బోరు కూడా డ్రిల్ చేయడంతో బాధిత దళితులు ఉలిక్కిపడ్డారు. సంబంధిత భూమిలో పట్టాలు చేతబట్టి ఆందోళనకు దిగారు. ఆ భూమి దళితులదే ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి దళితులదేనని తేల్చారు. త్వరలో అధికారిక సర్వేలు జరిపి ఎవరి భూములను వారికి చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దళిత, ప్రభుత్వ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన తాజా మాజీ టీడీపీ సర్పంచ్ భర్త గతంలో ఆ భూములకు పాసు పుస్తకాలు చేయిస్తానని నమ్మబలికినట్టు తెలుస్తోంది. ప్రతి పట్టాదారు నుంచి రూ.500 వసూలు చేసి మొండిచేయి చూపించినట్టు బాధితులు తహసీల్దార్కు ఫిర్యాదుచేశారు. ఇదే భూమిలో ఆయనకున్న ఎకరా భూమిని అడ్డుపెట్టుకుని సుమారు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం చేస్తాం పెరిందేశం గ్రామ పరిధిలోని బ్లాకు నం.254లో ప్రభు త్వం ఇచ్చిన పట్టాల ప్రకారం అర్హులకు కచ్చితంగా న్యాయం చేస్తాం. దళితులు, ప్రభుత్వ భూములు ఎవరి చెరలో ఉన్నా స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –జీ.మోహన్, తహసీల్దార్ కేవీబీపురం -
తహసీల్ సిబ్బందిపై పెట్రో దాడి
చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పెట్రోల్ దాడి ఘటన కలకలం సృష్టించింది. పట్టా పాసు పుస్తకంలో తన పూర్తి భూమి నమోదు కాలేదని ఆగ్రహించిన ఓ రైతు సిబ్బందిపై పెట్రోల్తో దాడి చేశాడు. అగ్గి పుల్ల అంటించేలోపే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని లంబాడిపల్లికి చెందిన జీల కనుకయ్యకు ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 1142, 1145, 1146లో 4.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 0.19 గుంటలు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైంది. మిగతా 4.0 ఎకరాల కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం లేనిదే వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రెండ్రోజుల క్రితం వీఆర్ఓ శంకర్ను సంప్రదించగా.. 4.19 ఎకరాలకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చాడు. సింగిల్ విండో అధికారికి చూపించగా.. ఇది చెల్లదని చెప్పడంతో రైతు కనుకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం తహసీల్దార్ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించగా.. గేటు వద్ద వీఆర్ఏ అడ్డుకున్నాడు. దీంతో బయటకు వెళ్లిన ఆయన రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి సీని యర్ అసిస్టెంట్ రాంచందర్రావు, వీఆర్ఏలు నర్స య్య, అనిత, అటెండర్ దివ్యలపై పోశాడు. అగ్గి పెట్టె తీసేలోపే సిబ్బంది కనుకయ్యను బయటకు లాక్కెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్కుమార్, రూరల్ ఏసీపీ పార్థసారథి, ఎల్ఎండీ సీఐ మహేశ్గౌడ్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏనాడూ కలవలేదు : తహసీల్దార్ ఫారూక్ తాను వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా తనకు పట్టాదారు పాసు పుస్తకం రావడం లేదని రైతు కనుకయ్య కలవలేదు. సదరు వీఆర్ఓ కూడా తనకు ఏనాడూ ఈ విషయంపై చెప్పలేదు. సర్వే చేసినోళ్ల మీద పోసేందుకే..: కనుకయ్య రైతుబాట కార్యక్రమంలో ఇంటింటా సర్వే చేసిన రెవెన్యూ అధికారుల మీద పెట్రోల్ పోసేందుకు తెచ్చాను. కానీ కోపం ఆపుకోలేక వీరిపై పోశాను. అగ్గి పుల్ల అంటించలేదు. కాగా, రికార్డుల ప్రకారం ఒక ఎకరానికి మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే వీలుందని ఆర్డీవో తెలిపారు. బాధిత రైతు జీల కనుకయ్య -
మహాత్మా.. మన్నించు!
సాక్షి, గుర్రంకొండ, చిత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు చేయరాదు. అంతేకాకుండా మద్యం సేవించడం చేయకూడదు. అయితే, గుర్రంకొండలో ఈ నియమాలకు రెవెన్యూ అధికారులు తిలోదకాలు వదిలారు. ఎంచక్కా మందు పుచ్చుకుని తమదైన సంబరాల్లో తూలారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలు సీజ్ చేసినా నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. వివరాలు..స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు తమ కార్యాలయం ఎదుట సహోద్యోగులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మధ్యాహ్నం వేళకు సీను మారిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం సేవించరాదనే విషయం తెలుసో, తెలియదోగానీ గ్రామానికి చెందిన ఓ మద్యం దళారిని పిలిపించుకుని వారికి కావాల్సినంత మద్యం బాటిళ్లను గుర్రంకొండలో తెప్పించుకున్నారు. గ్రామానికి వెలుపల ఓ బహిరంగ ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని అడ్డుగా ఉంచుకుని మద్యం సీసాలను కాసేపటికే ఖాళీ చేశారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది స్థానికలు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఎక్సైజ్ అధికారులకే తెలియాలి. గుర్రంకొండలో పట్టపగలే అధికారులు మద్యం సేవించడం చర్చనీయాంశమైంది. -
రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు
తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరిగాయంటూ సామాన్యులు సంతృప్తి చెందే పరిస్థితి కల్పించాలి.. అవినీతి రహిత పారదర్శక పాలన ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ అధికారులను ఆదేశిస్తున్నారు. గత పాలనలో అలవాటు పడిన తమ పాత ధోరణిని అధికారులు ఇంకా వదులుకోలేకపోతున్నారు. ఇంకా పైసలు ఇవ్వందే ఫైళ్లు ముట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చుక్కల భూముల సమస్యే ఇందుకు నిదర్శనం. క్లెయిమ్స్ పరిష్కారంలో మన జిల్లా రాష్ట్రంలో అట్టడుగున ఉండడం బాధాకరం. సాక్షి, కడప: నాటి బ్రిటీషు ప్రభుత్వం రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ చేపట్టినపుడు భూములు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆర్ఎస్ఆర్లో ఆ సర్వే నెంబర్ల వద్ద కాలమ్–16లో చుక్కలు పెట్టారు. పట్టాదారు పేర్లు లేవు గనుక అలాంటి చుక్కల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపి వేసింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఆ భూములు విక్రయించుకోవాలన్నా రైతులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అలాంటి భూములను సేకరించినా పరిహారం అందక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. చివరకు గత ప్రభుత్వం ఇలాంటి భూములపై 12 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్న రైతుల పేరిట క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. 2017 జులై 17న జీఓ ఎంఎస్ నెంబరు 298 జారీ చేసింది. అదేనెల 28వ తేది సీసీఎల్ఏ సర్క్యులర్ కూడా విడుదల చేశారు. మామూళ్లు ముట్టజెప్పందే.... చుక్కల భూముల సమస్య రెవెన్యూ అధికారులకు కల్పతరువుగా మారింది. భూముల విలువను బట్టి రేట్లు నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపకు ఆనుకుని ఉన్న సీకే దిన్నె పరిధిలోని మామిళ్లపల్లె, పాపాసాహెబ్పేట, కొప్పర్తి వంటి చోట్ల ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నూరు, వల్లూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోం ది. గతంలో ఒంటిమిట్ట, కొండాపురం తహసీల్దార్లపై ఈ విషయంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా ఖాజీపేట మండలంలో రెవెన్యూ అధికారుల లంచగొండి వ్యవహారాలు వెలుగు చూశాయి. చుక్కల భూముల విషయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న అభియోగంపై వీఆర్వో శ్రీనివాసులురెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ తహసీల్దార్గా పనిచేసి ప్రస్తుతం చిత్తూరుజిల్లా కలకడలో ఉన్న పార్వతి కొందరు వీఆర్వోల ద్వారా రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చుక్కల భూమిని క్రమబద్దీకరించుకునేందుకు పుల్లూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని బోసిరెడ్డిపల్లెలో ఓ మహిళా రైతు తాను రూ.75 వేలు సమర్పించినట్లు చెబుతున్నారు. కేఆర్ఆర్సీ డెప్యూటీ కలెక్టర్ మధుసూదన్రావు ఇటీవల ఈ ఆరోపణలపై విచారణ నిర్వహించారు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు తాను రూ.10 వేలు వీఆర్వోకు, రూ.28 వేల తహసీల్దార్ పార్వతికి సమర్పించాల్సి వచ్చిం దని విచారణ అధికారి దృష్టికి తెచ్చారు. ఇలా 26 మంది రైతులు రాత పూర్వకంగా తహసీల్దార్పై ఫిర్యాదు చేశారు. సన్నపల్లె గాంధీనగర్, త్రిపురవరం, తుడుములదిన్నె తదితర గ్రామాల్లోని రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చుక్కల భూములు అధికంగా ఉన్న చాపాడు, దువ్వూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, సీకే దిన్నె మండలాల్లో రెవెన్యూ అధికారులు మామూళ్ల కోసం రైతులను పీడిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పరిష్కారంలో జాప్యం చుక్కల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు అంటున్నారు. ఆర్ఎస్ఆర్లోని 16వ కాలమ్లో చుక్కలు ఉన్నప్పటికీ 17వ కాలమ్లో కొండపొరంబోకు, గయాళు, వంక పొరంబోకు అనే రిమార్క్స్ ఉన్నాయని కొన్ని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అడంగల్, ఈసీ, రిజిష్టర్ ఆఫ్ ఫోల్డింగ్స్ తదితర డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఏదో ఒక నెపం చూపుతూ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 1801 దరఖాస్తులు తిరస్కరించారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు జిల్లాలో 9708 దరఖాస్తులు రాగా 90 మాత్రమే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో 1003 దరఖాస్తులు రాగా 30 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లాలో ఇంకా 7817 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో చుక్కల భూములు లేవు. మిగిలిన ఏడు జిల్లాలలో క్లెయిమ్ల పరిష్కారంలో గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా, వైఎస్సార్ కడప మాత్రం చివరిస్థానంలో ఉంది. -
రెవ్వెన్యూ అధికారులు అవకతవకలు చేశారని ఆవేదనతో..
-
ఎందుకో ఈ మౌనం.. ఏమిటో ఆ అంతరార్థం
పేదలు గూడు కోసం ఓ చిన్నపాక వేసుకుంటే హడలెత్తిస్తారు రెవెన్యూ అధికారులు. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు శోత్రియ భూముల్లో 200కు పైగా గుడిసెలు అక్రమంగా వేసుకున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్న వారందరూ ఈ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. షికారీల పేరిట గుడిసెలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్న మాఫియా లీడర్లు గుడిసెకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. పైగా ఇంటి స్థలం మొదలు సాగుభూమి వరకు తీసిస్తామని భరోసా ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మౌనముద్రలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరదయ్యపాళెం: జిల్లాలో చిన్న పాండూరు పేరు వింటూనే నూతనంగా నిర్మించే అపోలో టైర్ల పరిశ్రమ, హీరో ద్విచక్ర వాహనాల పరిశ్రమలు గుర్తుకొస్తాయి. దీంతో ప్రస్తుతం రియల్టర్ల చూపంతా ఈ ప్రాంతం వైపే ఉండడంతో భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీన్ని అదునుగా భావించిన అక్రమార్కులు ఎంచక్కా ఇంటి స్థలాల పేరిట వందలాది ఎకరాల ఆక్రమణకు పన్నాగం పన్నుతున్నారు. షికారీలను రంగంలోకి దించి చిన్న పాండూరు శోత్రియ భూముల్లో ఏడాదిన్నర కాలంలో 200కుపైగా గుడిసెలు ఏర్పాటు చేశారు. భూముల నేపథ్యమిలా.. చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలో సర్వే నెంబర్లు 1 నుంచి 84లలో 1,060 ఎకరాలు శోత్రియ భూములు ఉన్నాయి. చిన్న పాండూరు, వడ్డిపాళెం, పాదిరికుప్పం, రామలక్ష్మ మ్మకండ్రిగ గ్రామాలకు చెందిన స్థానికులు సంబంధిత భూములను అనధికారికంగా సాగుచేసుకుంటూ అనుభవదారులుగా కొనసాగుతున్నారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ కోర్టులో తీర్పు వెలువడడంతో సంబంధిత భూములు ప్రభుత్వానికి చెందినవిగా బోర్డులు కూడా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. ప్రైవేటు వ్యక్తులు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కేసు కొనసాగుతోంది. మౌనముద్రలో రెవెన్యూ శాఖ.. శోత్రియ భూముల్లో అక్రమార్కులు గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నా రెవెన్యూ శాఖ తమకేమీ పట్టనట్లు ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆక్రమించిన వారు ఏకంగా ఆ ప్రాంతా నికి నక్కలమిట్టగా నామకరణం చేయడం, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రతివారమూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలకు దిగడం షరా మామూలుగా మారింది. ఏడాది క్రితం ఆక్రమణల తొలగింపు.. శోత్రియ భూముల్లో వెలసిన గుడిసెల తొలగింపుకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ 13న సుమారు 100మంది పోలీసు బలగాలతో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మండల రెవెన్యూ యంత్రాంగం అక్రమ గుడిసెలను బలవంతంగా తొలగించింది. అయితే ఆక్రమణకు పాల్పడిన వారు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా అక్కడే ఉన్నారు. పది రోజుల పాటు ఆ భూములలో ప్రవేశించకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా కాపలా ఉంది. ఆపై పర్యవేక్షణ గాలికొదిలేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరో మారు అక్రమ గుడిసెలు ఏర్పాటు కొనసాగుతోంది. అక్రమ గుడిసెల ఏర్పాటు తగదు.. సంవత్సరాల తరబడి తమ అనుభవంలో ఉన్న భూములలో గుడిసెలు ఏర్పాటు చేయడం తగదని చిన్న పాండూరు ప్రాంత అనుభవదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలం బించడం వల్లే గుడిసెలు పుట్టుకొస్తున్నాయంటున్నారు. అడవిగా ఉన్న భూములను సొంత ఖర్చులతో చదును చేసి, సాగులోకి తెచ్చుకున్నామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పూర్వీకులు ఇక్కడ ఉండేవారు.. 40 సంవత్సరాల క్రితం చిన్నపాండూరు సమీపంలోని శోత్రియ భూముల్లో ఒకచోట తమ పూర్వీకులు పది కుటుంబాల వారు ఉండేవారని ప్రస్తుతం గుడిసెలు ఏర్పాటు చేసుకున్న కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని నక్కలమిట్ట అని కూడా అనేవారని పేర్కొంటున్నారు. వివిధ కారణాలతో క్రమేణా వేరే ప్రాంతాలకు తమ పూర్వీకులు వలస వెళ్లారని, వారి కుటుంబ సభ్యులుగా తమకు ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నేనొచ్చాక.. తీరిగ్గా మీరొస్తారా
టేక్మాల్(మెదక్) : రెవెన్యూ అధికారులపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సీరియస్ అయ్యారు. పనితీరు బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10:15 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా వచ్చారు. ఆ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్, అంటెడర్లు తప్ప ఏ ఒక్క అధికారి కార్యాలయానికి రాలేదు. కలెక్టర్ వచ్చిన విషయాన్ని ఫోన్లలో సమచారం అందుకున్న వీఆర్ఓలు, తహశీల్దార్ ఒక్కొక్కరుగా 11 గంటల తర్వాత హాజరుకావడంతో సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనొచ్చాక.. తీరిగ్గా మీరు వస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రైతుబంధు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన భూ సవరణ వివరాలు ఆన్లైన్ ఎంత మేరకు చేశారని వీఆర్ఓలను ప్రశ్నించగా ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేదు. చేసిన వారిలో కూడా తప్పుల సవరణ సరిగ్గా చేయలేదని మండిపడ్డారు. రికార్డులను పరిశీలించిన అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన 39 వేల భూ సమస్యలను పరిష్కరించామని పంపగా 28వేల సమస్యల్లో ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఒక్క అధికారి కూడా ఫీల్డ్ లెవల్ పనులు చేయడం లేదన్నారు. వీఆర్ఓ సస్పెన్షన్ విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల సవరణ పూర్తి చేయని ఎల్లుపేట, వెల్పుగొండ వీఆర్ఓ సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న తహసీల్దార్పై చర్యలు తీసుకుంటామన్నారు. భూ సమస్యలను పరిష్కరించడంలో టేక్మాల్ మండలం అట్టడుగున ఉందన్నారు. ఇంకా 11వేల దరఖాస్తులకు పైగా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని బొడ్మట్పల్లి గ్రామాన్ని సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు. రికార్డు సవరణలు ఫీల్డ్కు రాకుండా చేశారని వీఆర్ఓ ఖదీర్పై మండిపడ్డారు. ప్రజల నుంచి ఎటువంటి భూ సమస్యలు తమ దృష్టికి రాకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి పథకం పనులపై ఆగ్రహం మెదక్ అర్బన్ : పట్టణానికి తాగునీరు అందించే పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెదక్ పట్టణానికి తాగునీరు అందించే పథకంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి పథకం పనుల్లో గత పదిహేను రోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ప్రతినిత్యం 300 నల్లాలు బిగించాల్సి ఉండగా ఇప్పటి వరకు మొత్తం 275 నల్లాలు మాత్రమే బిగిస్తే ఎన్నిరోజులు సమయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ వీరప్ప, డిప్యూటీ ఇంజినీర్ గోపాల్, మెదక్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పశువుల్లంక రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు
-
భూ ఆక్రమణ కేసులో టీడీపీ నేతల అరెస్టు
మదనపల్లె టౌన్: మాజీ సైనికుడి పేరుతో నకిలీ పట్టా సృష్టించి డీకేటీ భూమిని విక్రయించి సొమ్ము చేసుకున్న 9 మంది టీడీపీ నేతలను మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ ఎస్పీ సతీష్కుమార్, డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ రమేశ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కామిశెట్టి వెంకటరమణకు ప్రభుత్వం 1990లో సర్వే నంబర్ 691–2లో 1.90 సెంట్ల డీకేటీ భూమి ఇచ్చింది. దీనిపై టీడీపీ నేతలు కన్నేశారు. అప్పటి వీఆర్వో రెడ్డి శేఖర్ సహకారంతో ఈ డీకేటీ పట్టాను మాజీ సైనికుడి పేరిట మార్పు చేసి నకిలీ పట్టా సృష్టించారు. భూమిని విక్రయించుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చినట్లు నకిలీ ఎన్ఓసీని సైతం తయారుచేశారు. 2016 పిబ్రవరి 18న ఆ భూమిని పుంగనూరుకు చెందిన రాచమడుగు రాయల్కుమార్కు రూ.55 లక్షలకు విక్రయించారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో 2016 అక్టోబర్ 15న అప్పటి సబ్ కలెక్టర్ కృతికాబాత్రా విచారణకు ఆదేశించారు. నకిలీ పట్టా సృష్టించి భూమిని విక్రయించినది వాస్తవమేనని విచారణలో తేలింది. ఈ క్రమంలో టీడీపీ సింగిల్విండో మాజీ డైరెక్టర్ గంగారపు నాగ వెంకటస్వామినాయుడు అలియాస్ సిమెంటు బాబురెడ్డి (58), జీవి.రంగారెడ్డి(56), పఠాన్ ఖాశీఖాన్(60), కామిశెట్టి సుభద్రమ్మ (67), జి.లీలావతి (45), శరణ్కుమార్ (50), జి.వెంకరమణ (50), బాగేపల్లె నాగరాజు (50), బాగేపల్లె శకుంతల(48)ను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
పంచని పుస్తకాల్లో తప్పులెన్నో!
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల పంపిణీ తప్పుల తడకని తేలిపోయింది. ముద్రణ సమయంలోనే 3 లక్షల పాస్ పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పేరు తప్పుల నుంచి ఆధార్ నంబర్ల వరకు, విస్తీర్ణంతోపాటు ఫొటోలు కూడా తప్పులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఇది ఒక ఎత్తయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా అదే స్థాయిలో తప్పులు వస్తుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అయితే పాస్ పుస్తకాల్లో తప్పులకు క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అడ్డగోలుగా రికార్డులు సరిచేయడం, ఎలాంటి పరిశీలన లేకుండా ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాల వివరాలను ముద్రణకు పంపడమే ఇంతటి గందరగోళానికి కారణమైందని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మళ్లీ ముద్రించేందుకు సిద్ధమయ్యారు. 14 రకాల తప్పులు పంపిణీ చేయకుండా నిలిపివేసిన పుస్తకాల్లో మొత్తం 14 రకాల తప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో రైతుకు అత్యంత కీలకమైన భూమి విస్తీర్ణం నమోదులోనే ఎక్కువ పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. మొత్తం 93 వేల పుస్తకాల్లో రైతుకు ఉన్న భూమి కన్నా ఎక్కువో, తక్కువో నమోదయ్యాయి. వీటికితోడు పట్టాదారుకు బదులు వేరొకరి ఫొటో ఉన్న 37 వేలకు పైగా పుస్తకాలను అధికారులు గుర్తించారు. వాటిని నిలిపివేశారు. చనిపోయిన వారి పేర్ల మీద, పాత పట్టాదారుల పేర్లతో, ఆధార్ తప్పులతో, పట్టాదారు పేరు, తండ్రి పేర్లలో తప్పులతో వేల సంఖ్యలో పుస్తకాలను ముద్రించారు. నాలా భూములకు, ప్రభుత్వ భూములకు కూడా పాస్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఒక్కో రైతుకు ఒక ఖాతా ఉండాల్సి ఉండగా, ఒకే ఖాతా నంబర్ను ఇద్దరు, ముగ్గురు రైతులకు వచ్చేలా దాదాపు 34 వేల పుస్తకాలు ముద్రించారంటే రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వే నంబర్లలో తప్పులు, అసైన్డ్ భూములకు, అటవీ శాఖతో వివాదాలున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ముద్రించడం గమనార్హం. పంపిణీ చేసిన వాటిలోనూ.. పంపిణీ చేసిన 39 లక్షల పుస్తకాల్లోనూ అదే స్థాయిలో తప్పులు రావడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు, ఫొటోలు, ఆధార్ నంబర్లలో వచ్చిన తప్పులును రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకున్న భూమి మొత్తం పుస్తకాల్లో రాకపోవడంతో ఉన్న భూమి ఎటుపోతుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. చాలా పుస్తకాల్లో కొనుగోలు చేసిన భూములు కూడా ఆనువంశికంగా వచ్చినట్లు నమోదైంది. ఇవి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ తప్పులను సరిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ‘తప్పులను రికార్డు చేసి వెళ్లిపోండి.. మేం కొత్త పుస్తకాలకు పంపిస్తాం. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం’అంటూ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్న మాటలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా పాస్పుస్తకాల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చొరవ తీసుకుని నిశిత దృష్టితో ఈ అంశాన్ని పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విషయం సీఎం దృష్టికి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో అసలు ఎన్ని కొత్త పాస్పుస్తకాలను ముద్రించారు? అందులో పంపిణీ చేసినవి ఎన్ని? పంపిణీ చేయకుండా నిలిపివేసినవి ఎన్ని? పంపిణీ ఎందుకు చేయలేదనే వివరాలను జిల్లాల వారీ గణాంకాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.94 లక్షల కొత్త పాస్ పుస్తకాలను ముద్రించామని, అందులో 39.47 లక్షల పుస్తకాలను ఈనెల 23 నాటికి పంపిణీ చేశామని, 3.07 లక్షల పుస్తకాల్లో తప్పులున్నందున వాటిని నిలిపివేశామని తెలిపారు. పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లోనూ పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయన్న సమాచారంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. -
70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సాక్షి, సిద్దిపేట : లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదేవ్పూర్ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకేచోట 67 బోరు బావులు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్లో రెవిన్యూ అధికారులు హడావుడి చేశారు. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో బావులను గుర్తించారు. దీంతో వాటిని పూడ్చివేసే చర్యలకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో బోరు బావులు ఉన్నట్లు సాక్షిలో కథనం ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లి మొత్తం 67 బోరు బావులు గుర్తించారు. దీంతో వాటిని తీయించిన వారిని గట్టిగా మందిలిస్తూ వాటిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బోరు వేసి వదిలేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎమ్మార్వో విజయ చెప్పారు. -
రెవెన్యూ లీలలు
► వీఆర్ఏకు రూ.కోట్ల విలువైన భూమి ధారాదత్తం ► అసైన్మెంట్లో పొందిన భూమిలో రియల్ వ్యాపారం ► చోద్యం చూస్తున్న అధికారులు రాయచోటి రూరల్: అసైన్మెంట్ భూపంపిణీలో రెవెన్యూ లీలలు కొనసాగుతున్నాయి. రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన భూమిని ఇష్టారాజ్యంగా రెవెన్యూ అధికారులు తమ శాఖ సిబ్బందికే ధారాదత్తం చేయడం గమనార్హం. రెవెన్యూశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటంతో ప్రభుత్వ , డీకేటీ భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. రూ.లక్షలు అధికారుల జేబుల్లోకి పోతున్నాయి. వివరాల్లోకి వెళితే..రాయచోటి మండలం పెమ్మాడపల్లెకి చెందిన డీకేటీ భూమి 2005 నుంచి సుమారు 19 ఎకరాలు అక్రమంగా అనర్హులకు రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేసినట్లుÐð వెల్లడైంది. పెమ్మాడపల్లె రెవెన్యూ గ్రామంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా పనిచేస్తున్న కదిరప్ప కుమారుడు శివమల్లయ్య పేరుతో రింగ్రోడ్డు పక్కనే రూ.కోట్ల విలువైన డీకేటీ భూమి 6 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. శివమల్లయ్య పేరుతో పాసుపుస్తకం ఖాతా నంబర్ 456లో సర్వేనంబర్ 364/12బిలో 1.17ఎకరాలు, 364/14లో 0.48ఎకరాలు, 364/1ఇలో 0.63ఎకరాలు, 364/4లో 0.99ఎకరాలు, 364/7లో 0.28ఎకరాలు, 374/5లో 0.14సెంట్లు, 385లో 0.17ఎకరాలు, 397/1లో 0.40 ఎకరాలు, 406లో 1.03 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా పంపిణీ అనంతపురం జిల్లా ఎన్పీకుంట(పలువురు చెప్పిన అడ్రస్ ప్రకారం)కు చెందిన మేళ్ల చెరువు రామకృష్ణనాయుడు అనే వ్యక్తికి రాయచోటి మండలం పెమ్మాడపల్లెలో ఖాతా నంబర్ 558లో సర్వే నంబర్ 364/11లో 1.20ఎకరాలు, 364/12లో 1.16 ఎకరాలు డీకేటీ భూమి ఉన్నట్లు రికార్డులున్నాయి. దీంతో పాటు అదే రామకృష్ణనాయుడు పేరుతో మరో 9 సర్వే నంబర్లలో సుమారు 6ఎకరాలకు పైగా ఉండటం గమనార్హం. ఈ భూపంపిణీలో కూడా అప్పటి రెవెన్యూ అధికారులు చేతివాటం చూపినట్లు తెలుస్తోంది. అదే గ్రామంలో 362/4 సర్వే నంబర్లో ఒక వ్యక్తికి 2 ఎకరాలు డీకేటీ భూపంపిణీలో భాగంగా ఇవ్వగా, 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కబ్జా చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాయచోటి రింగ్రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా రూ.కోట్లు విలువ చేసే సుమారు 19 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన వ్యక్తులు, మరో 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనా కన్నేశారు. వారి భూమికి పక్కనే ఖాళీగా ఉన్న డీకేటీ భూమిని కబ్జా చేయడం విశేషం. అసైన్మెంట్ భూముల్లో రియల్ వ్యాపారం 2005 తర్వాత పలు దఫాలుగా అక్రమంగా అర్హతలేని వ్యక్తులు పెమ్మాడపల్లెలో రాయచోటి రింగ్రోడ్డుకు ఇరువైపులా భూములను పొందారు. దీంతో పాటు చేతికందినంత ఆక్రమించుకుని ప్రస్తుతం ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన వ్యక్తులు వారి చేతుల్లో పడి మోసపోతున్నారు. నిబంధనలకు విరుద్ధం గా డీకేటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విశేషం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు –గుణభూషణరెడ్డి, తహసీల్దార్ ,రాయచోటి ప్రభుత్వభూములను ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్ భూముల్లో వ్యాపార లావాదేవీలు చేసినా చర్యలు తప్పవు. డీకేటీ భూములను ఇళ్ల నిర్మాణం కోసం కొంటే ప్రజలే మోసపోతారు. వాటిని ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ స్వాధీనం చేసుకుంటాం. ఒకవేళ అసైన్మెంట్లో భూమి పొందిన అన్ని అర్హతలు ఉన్నవారు కూడా ప్రభుత్వం నుంచి ఎన్ఓసీతో పాటు పట్టా పొందాల్సి ఉంటుంది. -
‘ఉపాధి’ నిధులతో ‘వైకుంఠధామాలు’
తొలి విడతలో 500 గ్రామాల్లో ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాల(శ్మశానవాటిక)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించాలని నిర్ణయిచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో 500 గ్రామాల్లో వైకుంఠ థామాల ఏర్పాటుకు గ్రామీణాబివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా తొలివిడతలో మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధిహామీ చట్టంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కింద ఈ పనులను చేపట్టేందుకు వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.వైకుంఠధామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి అంచనాల్లో కొంత మేరకు హెచ్చుతగ్గులు ఉండే వచ్చు. ఏదేని గ్రామంలో దాతలు ముందుకు వచ్చినట్లయితే, వైకుంఠ ధామం ఏర్పాటుకు రూ.5 లక్షలు లేదా వ్యయంలో 25 శాతం (ఏది ఎక్కువైతే అది) ఇచ్చినవారి పెద్దల లేదా తల్లిదండ్రుల స్మారకంగా పేరును పెట్టనున్నారు. వైకుంఠ ధామం ఎలాగంటే.. ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్రూమ్, సందర్శకులకు షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్హెడ్ ట్యాంక్, సోలార్లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపట్టనున్నారు. నీటి సరఫరా, ప్రహరీ, ఇతర పనులను గ్రామ పంచాయతీ లేదా ఇతర నిధులతో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. స్థలం ఎంపిక నిమిత్తం రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని, గ్రామసభ ఆమోదం లభించాక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను సిద్ధం చేయించాలని ఉపాధిహామీ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. -
జగడం
మేయర్ x డీసీఆర్ - లెక్కలేనితనంపై మేయర్ గుర్రు - పాలనాపరమైన విషయాలు చెప్పనవసరం లేదంటున్న డీసీఆర్ బకాయిలు చెల్లించేందుకు నెలాఖరు వరకు గడువు ఉంది. వెబ్సైట్లో మొండి బకాయిదారుల జాబితా పెట్టేప్పుడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇది మంచిపద్ధతి కాదు. ఆంధ్ర రత్నభవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాల యం) ఏళ్ల తరబడి పన్ను చెల్లించడం లేదు. జాబితాలో పేరు ఎందుకు చేర్చలేదు. ఏమైనా అంటే సారీ అంటున్నారు. డీసీఆర్ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదు. కమిషనర్తోనే తేల్చుకుంటా. – కోనేరు శ్రీధర్,మేయర్, విజయవాడ. డిఫాల్టర్స్ లిస్ట్లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అందుకే సరిచేస్తున్నాం. సర్కిళ్ల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే జాబితాను వెబ్సైట్లో ఉంచాం. అప్డేట్ చేయకపోవడం పొరపాటే. అయినంత మాత్రాన ఎవరిపై చర్యలు తీసుకోలేం. పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి మేయర్తో చర్చించాల్సినఅవసరం లేదు. అందుకే ఆయనకు చెప్పలేదు. – సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) విజయవాడ సెంట్రల్ : నగర పాలక సంస్థలో హద్దుమీరిన రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ డిఫాల్టర్స్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టడం, అందులో టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లు ప్రముఖంగా ఉండటంతో కథ అడ్డం తిరిగింది. మంత్రి దేవినేని ఉమా డీసీఆర్ సుబ్బారావుకు ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అడ్డగోలుగా అధికారులు పనిచేస్తుంటే ఏం చేస్తున్నావంటూ మేయర్కూ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మేయర్, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)ను టార్గెట్ చేశారని భోగట్టా. మొండి బకాయిదారుల జాబితాను బహిర్గతం చేసేటప్పుడు కనీసం తన దృష్టికి తేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మేయర్ అంటే లెక్కలేదా అంటూ మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి తరుచూ వివాదాస్పదం కావడంపై ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీసీఆర్ వ్యవహార శైలిపై కమిషనర్తో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. తప్పుల తడక ...: డిఫాల్టర్స్ లిస్ట్ను తప్పుల తడకగా రూపొందించిన రెవెన్యూ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మూడు సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రూపొందించిన జాబితాను పరిశీలించి డీసీఆర్కు అందజేస్తారు. కమిషనర్ అనుమతితో వెబ్సైట్లో ఉంచాలి. ఈ ప్రక్రియలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాబితాను అప్డేట్ చేయలేదని తెలుస్తోంది. గతంలో ఆరు నెలలకోసారి ఆస్తిపన్నును చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేసేవారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాదికి ఒకసారే డిమాండ్ నోటీసు ఇచ్చేశారు. దీన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్టర్స్ లిస్ట్లో కొన్ని పేర్లను చేర్చడం వివాదాస్పదమైంది. డిఫాల్టర్స్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టి మొండి బకాయిదారుల్ని అల్లరి చేయాలన్న ఎత్తుగడ బెడిసికొట్టింది. కమిషనర్ ఆదేశాలతోనే జాబితాను వెబ్సైట్లో పెట్టాం కాబట్టి తమకేం ఇబ్బంది ఉండదనే ధోరణిని రెవెన్యూ అధికారులు ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద మొండిబకాయిలు మేయర్, డీసీఆర్ మధ్య జగడం సృష్టించాయి. -
బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు
⇒ అప్పు చెల్లిస్తామన్న ఇంటిని వేలం వేసిన అధికారులు ⇒ ఇల్లు ఖాళీ చేయాలంటూ గేటుకు తాళం ⇒ రాత్రంతా ఆరుబయటే జమ్మికుంట: ఇంటి పేరిట బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం ఆ కుటుం బాన్ని రోడ్డున పడేసింది. సదరు కుటుంబానికి తెలపకుండానే బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేశారు. మార్కెట్ విలువ కంటే తక్కు వకు విక్రయించడం.. రుణం చెల్లిస్తామన్నా వినిపించుకోకుండా ఇంటికి తాళం వేయడం తో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిల వడంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు, పోలీసులు వెనకడుగు వేశారు. ఈ ఘటన మంగళవారం జమ్మికుంట లో చోటుచేసుకుంది. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాంపెల్లి కిషన్ ఇస్త్రీ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. 2013లో ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకు న్నాడు. దాదాపు రూ.2.10 లక్షల వరకు తిరిగి చెల్లించాడు. బ్యాంకు వడ్డీ, అసలు ఇప్పటి వరకు ఇంకా రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, డబ్బులు సమ కూరక పోవ డంతో కొద్ది నెలలుగా రుణం చెల్లించడంలేదు. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇంటిని వేలం వేస్తామంటూ గత డిసెంబర్లో నోటీసు లిచ్చారు. ఈ విషయం తమకు తెలియదని బాధితులు పేర్కొంటున్నారు. గత జనవరిలో వేలం పాట కోసం ప్రకటన జారీ చేశారు. వేలం పాటలో ఇల్లును ఓ వ్యక్తి రూ.11.77 లక్షలకు దక్కించుకున్నట్లు బ్యాంకు ఉద్యో గులు వెల్లడించారు. దాదాపు రూ.20 లక్షల కుపైగా విలువ చేసే ఇల్లును తక్కువ ధరకు దక్కించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తన ఇల్లు తనకు కావాలని, బ్యాంకు అధికా రులు వేలం వేయొద్దని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే పట్టించుకోలేదని పేర్కొ న్నారు. చివరికి ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో పోలీసు భద్రత మధ్య ఖాళీ చేయించాలని నాలుగు రోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం కిషన్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కిషన్ కుటుంబం చేసేదేమీ లేక రాత్రంతా ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. కిషన్ కుటుంబసభ్యులు ఆత్మహత్యకు యత్నించేందుకు సిద్ధపడగా వారి వద్ద నుంచి క్రిమిసంహారక మందును స్థానిక మహిళలు లాక్కున్నారు. తాము అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడ తామని హామీనిచ్చారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు కిషన్ ఇంటికి వచ్చి ఖాళీ చేయించేందుకు యత్నించగా బాధితులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కాలనీ వాసులు నిలిచారు. తమకు న్యాయం చేయా లని, ఇల్లు ఇప్పించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషన్ భార్య విజయ హెచ్చరించారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుకడుగు వేశారు. కొనుగోలు చేసిన వ్యక్తితో చర్చలు జరిపి బ్యాంకు అప్పు కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకం
⇒ సర్కారు తీరుపై రైతుల మండిపాటు ⇒ అంగీకారం లేకుండా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన ⇒ నష్టపరిహారం ఇవ్వకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరిక మచిలీపట్నం : పోర్టు నిర్మాణం పేరిట అధికారులు, రైతుల అంగీకారంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినకరగ్రహారం సర్పంచ్ నడకుదుటి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. చినకరగ్రహారం రైతులు ఆది వారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి గ్రామాల ఆయకట్టులోని అసైన్డ్, ప్రభుత్వ భూములు 3,014 ఎకరాలను కాకినాడ పోర్టు డైరెక్టర్కు అప్పగిస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోవటం రైతులను మోసం చేయటమేనన్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను మత్స్యకారుల అనుమతి లేకుండా, అంగీకారం లేకుండా స్వాధీనం చేసుకోవటం సమంజసం కాదన్నారు. రైతుల మధ్య రెవెన్యూ అధికారులు విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా సమీకరిస్తే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
జాడలేని డంపింగ్ యార్డులు
► ఏర్పాటుకు చర్యలే తీసుకోని అధికారులు ► గ్రామాలలో తీవ్రమవుతున్న ‘చెత్త’ సమస్య ► రోడ్ల పక్కనే తగులబెడుతున్న వైనం ► రోగాలపాలవుతున్న స్థానికులు శంషాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో చెత్త సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది..ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుండగా.. మరో వైపు సేకరించిన చెత్తను వేయడానికి స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన పడవేసి కాల్చేస్తున్నారు. దీంతో అందులోని ప్లాస్టిక్ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి గ్రామీణులు రోగాల పాలవుతున్నారు. పెద్దషాపూర్, తొండుపల్లి, కాచారం, కవ్వగూడ, నర్కూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, ఊట్పల్లి, పాల్మాకుల, మదన్ పల్లి, శంకరాపురం, హమీదుల్లానగర్, మల్కారం, నానాజీపూర్, రామంజాపూర్, ముచ్చింతల్, ఘాంసిమియాగూడ, గొల్లపల్లి, జూకల్, సుల్తాన్ పల్లి, పెద్దతూప్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది. ఆయా గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణకు చర్యలు లేకపోవడంతో, ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా కాకుండా ఒకే రకంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పార బోస్తున్నారు. నర్కూడలోని చెత్తను సమీపంలోని చెరువులో వేస్తున్నారు. ఇక పెద్దషాపూర్లో చెత్తను జూకల్ వెళ్లే దారిలోని స్మశానవాటిక స్థలం లోనే వేసి కాల్చేస్తున్నారు. కాచారంలోని చెత్తను షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వరద కాలు వలో వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇలా గే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో అవస్థలు తప్పడం లేదు. చెత్తను కాల్చివేసే సమయంలో అందులోని ప్లాస్టిక్ నుంచి వెదజల్లే కాలుష్యంతో శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నా మని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగితాల మీదనే ప్రతిపాదనలు.. అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కానీ, చాలా చోట్ల స్థలాభావంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తొండుపల్లి పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డు కోసం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలం కేటాయించారు. చెత్త వేయడానికి అనువుగా గోతులు కూడా తీశారు. సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక్కడ చెత్త వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం చెబు తున్నారు. స్థలాలు లేక కొన్ని చోట్ల..ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. -
కేసీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై రగడ
అనుమతి లేదంటూ తొలగించిన రెవెన్యూ అధికారులు రేణిగుంట: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్రావు (కేసీఆర్) మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్ను స్తుతిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన వాల్పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదా అని ఆయన ప్రశ్నించారు. నేడే తిరుమలకు సీఎం రెండు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వరస్వామికి తెలంగాణ మొక్కులు తీర్చేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం తిరుమలకు బయల్దేరనున్నారు. ముఖ్య మంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సల హాదారులు, అధికారులు వెళ్తున్నారు. సీఎం పర్యటనకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్తున్నాయి. పలువురు రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి మంగళ వారం సాయంత్రం తిరుపతి చేరుకుం టారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. బుధవారం ఉద యాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విలువైన కానుకలను శ్రీవారికి ముఖ్యమంత్రి సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోనే రూ.5 కోట్ల విలువైన ఆభరణాల ను తయారు చేయించింది. శ్రీ మూల వర్ణ కమలం నమూనాలో 14.2 కిలోల సాలగ్రా మ హారం, 4.65 కిలోల బంగారంతో ఐదు పేటల కంఠ ఆభరణాన్ని చేయించారు. తిరుపతిలో అమ్మవారికి బంగారు ముక్కుపు డకను కానుకగా సమర్పించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా.. 2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించాలని వేడుకున్నారు. ఆ మొక్కులను తీర్చేందుకు ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వెళ్తున్నారు! పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీ డీజీపీకి, టీటీడీ అధికారులకు తెలంగాణ ఇంటెలి జెన్స్ ఐజీ ఇప్పటికే సమాచారం అందించా రు. సీఎం బుధవారం ఉదయమే తిరుమ లలో శ్రీవారిని, తిరుచానూరులో అమ్మవారి ని దర్శించుకుంటారు. తిరుమల పుష్పగిరి మఠంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి వివాహానికి ముఖ్య మంత్రి హాజరవుతారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
► జేసీ ప్రభాకర్రెడ్డి ఎలిగేడు: భూసమస్యలతోపాటు వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండలంలోని బుర్హాన్ మియాపేటకు చెందిన రైతులు గత రెండేళ్లుగా తమ ప ట్టా భూములను ఆన్ లైన్ లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ జేసీకి ఫిర్యాదుచేయగా గురువా రం జేసీ ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేశారు. రైతుల సమస్యల ను 15రోజుల్లోగా పరిష్కరించాలని వీఆర్వో తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సాదాబైనామాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిం చడం సరికాదన్నారు. కార్యాలయ పనితీరుపై తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సుదీర్ఘంగా చర్చించారు. జేసీ వెంట తహసీల్దార్ నాగరాజమ్మ, ఆర్ఐ అమ్జద్, వీఆర్వోలు, బుర్హాన్మియాపేట రైతులు పాల్గొన్నారు. -
కుంటుపడిన ‘కుటుంబ ప్రయోజన’o
రూ.13 కోట్లున్నా.. 3 వేలకు మించని ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు బాధితులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సెర్ప్ సీఈవో లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్ఎఫ్బీఎస్) పథకానికి పెద్దగా స్పందన ఉండడం లేదు. పేద కుటుంబ యజమాని(పెద్ద) మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. ఈ పథకం పట్ల బాధిత కుటుంబాలకు పెద్దగా అవగాహన లేకపోవడం, ఆయా కుటుంబాలను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టిం చుకోకపోవడమే దరఖాస్తులు తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2016–17)లో ఎన్ఎఫ్బీఎస్కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.13 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 వేల బాధిత కుటుంబాలకు సాయాన్ని అందించేందుకు వీలుంది. అయితే గత 10 నెలల్లో ఎన్ఎఫ్బీఎస్ కోసం ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు 3 వేలకు మించలేదు. 750 దరఖాస్తులు ఆయా జిల్లాల డీఆర్వోల వద్ద, మరికొన్ని డివిజన్ల స్థాయిలో ఆర్డీవోల వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్ఎఫ్బీఎస్ కింద బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచాలని ఇప్పటికే సెర్ప్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి కేంద్రం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేల చొప్పున మం జూరు చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది బాధితులకు సాయమందించే ఉద్ధేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది. బాధిత కుటుంబానికి కేంద్రం ఇచ్చిన మేరకు మొత్తం రూ.20 వేల చొప్పున లబ్ధిదారులకు మంజూరు ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆర్థిక సాయానికి నోచుకోని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఎన్ఎఫ్బీఎస్ పథకం పట్ల ఆయా కుటుంబాల సభ్యులకు అవగాహన కల్పించి, వెంటనే దరఖాస్తు చేసుకునే చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా లేఖలు రాశారు. -
చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!
• 400 బస్తాల లోడ్తో ‘పేట’కు చేరుకున్న చక్కెర లారీ • నామమాత్రంగా పరిశీలించిన వదిలేసిన అధికారులు నారాయణపేట : స్థానిక పాతగంజ్కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయనే వ్యాపార ఏజెన్సీ నిర్వాహకులు పుండలీక చక్కెరను కర్ణాటకలోని బిజాపూర్ నుంచి తెప్పించుకున్నారు. అక్రమంగా పెద్దఎత్తున చక్కెర క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కాళప్ప, జనార్దన్ అక్కడికి చేరుకుని.. లారీలో ఉన్న చక్కరను పరిశీలించి వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. అయితే అందులోని వివరాలు వారికి అర్థం కాకపోవడంతో విషయాన్ని ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రమీలకు అందజేశారు. అంతలోపే ఆ విషయం సబ్కలెక్టర్కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ బిల్లులను తీసుకెళ్లి సబ్కలెక్టర్ కృష్ణాదిత్యాకు చూపించడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యాపారులతో విచారణ చేపట్టాలని వారికి సూ చించారు. బిల్లులను పరిశీలించిన తర్వాత అందులో వే బిల్లులు తప్పా అన్నీ సక్రమంగానే ఉన్నాయని రెవెన్యూ అధికారులు ధృవీకరించి లారీని వదిలిపెట్టారు. అసలు చక్కెర ఇంత పెద్దమొత్తంలో నారాయణపేటలో క్రయవిక్రయాలు జరుగుతుంటే అమ్మక పన్ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న తెలంగాణకు కట్టాల్సిన పన్నులు కట్టారో లేదోనని అధికారులు పరిశీలించలేకపోయారు. వారిS అవగాహన లోపంతో ఉన్న బిల్లులను చూసి అవే కరెక్టు అని వ్యాపారులు చెప్పడంతో తల ఊపి పట్టుకున్న లారీని వదిలేశారు. ఆ వ్యాపారి మాత్రం వచ్చిన చక్కెర బస్తాలను గంటల వ్యవధిలోనే విక్రయించడం కొసమెరుపు. -
పొలాల్లో దోశ, సాంబార్ సాగు అట..
• ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు • అందకుండా పోయిన ఇన్పుట్ సబ్సిడీ • ఆందోళనలో రైతులు మద్నూర్: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు.. ‘రైతులు తమ పంట పొలాల్లో దోశ, సాంబార్, హోటల్ పువ్వులు పండించారు. మంచి దిగుబడులు సాధించి లాభాల్లో ఉన్నారు’ అంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కారణంగా రైతులకు కరువు సాయం అందకుండా పోయిన వైనమిది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గా, సుల్తాన్పేట్ గ్రామాలకు చెందిన రైతులు గతేడాది ఖరీఫ్లో సోయాబీన్, పెసర తదితర పంటలు పండించారు. కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అందులో ఎక్కడా లేని విధంగా రైతులు సాంబార్, దోశ, హోటల్ పువ్వులు వంటి పంటలు పండించారని, మంచి లాభాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వారికి ఇన్పుట్ సబ్సిడీ అందకుండా పోయింది. మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గాకు చెందిన రైతు హన్మంత్రావ్, పీరాబాయి, రుక్మిణీబాయి, దేవిదాస్, నాగ్నాథ్, అర్జున్ పటేల్, అహ్మద్ఖాన్లు దోçశ, సాంబార్, హోటల్ పువ్వులు వేశారని నమోదు చేశారు. సుల్తాన్పేట్కు చెందిన ధన్రాజ్గౌడ్ నాలుగు ఎకరాలలో సోయా వేయగా.. చిక్కుడుకాయ పండించారని, మౌలానా రెండు ఎకరాలలో హోటల్ పువ్వులు పండించారని పేర్కొన్నారు. అధికారుల నివేదిక మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాని రైతులు మంగళవారం తహ సీల్ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా.. కొందరు రైతులు సాంబార్, దోశ పండించినట్లు జాబితాలో వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని, దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
తీరంలో ఫిషింగ్ హార్బర్?
కె.మత్స్యలేశంలో పోర్టు భూముల పరిశీలన కె.మత్స్యలేశం (గార) : జిల్లాలోని సముద్ర తీరాన ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ తీరాన ఎప్పటి నుంచో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వంలో ఉండటం, జిల్లాలోనే అత్యధికంగా వేట సాగే ప్రాంతం కావడంతో స్థల పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. కె.మత్స్యలేశం(పోర్టు కళింగపట్నం) తీరంలో పీపీపీ ప్రాజెక్టు పద్ధతిలో నిర్మించనున్న టెక్మహింద్రా రిసార్టు పక్కనే పోర్టు భూములతో పాటు బందరువానిపేట వద్ద భూమిని పరిశీలించారు. సర్వే నంబరు 221లో పోర్టు భూమి 116 ఎకరాల్లో నిర్మించే పరిస్థితి ఉంది. స్థానిక సర్పంచ్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు రిసార్టుకు ఇబ్బంది లేకుండా చూడాలని, కె.మత్స్యలేశం, బందరువానిపేట మధ్యలోని బ్రిడ్జి వద్ద నుంచి హార్బర్ నిర్మాణం జరిగితే బాగుంటుందని కమిషనర్ను కోరడంతో సానుకూలంగా స్పందించారు. భూముల వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు రోడ్డు కనెక్టవిటీ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బందరువానిపేట మత్స్యకారులతో వేట పరిస్థితులు, ఇటీవల అందించిన బోట్లను ఆయన పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీలు మాదిరిగా 75 శాతం రారుుతీ ఇవ్వాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ డీడీ డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఇన్చార్జి తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఎఫ్డీవో దివాకరరావు, ఏడీఏ నిర్మలకుమారి, ఆర్ఐ డి. రామకృష్ణ, ఇన్స్పెక్టర్ గంగాధరరావు పాల్గొన్నారు. -
సారూ న్యాయం చేయండి..!
► గిరిపుత్రుల రోదన ►దబ్బగుంట జీవగెడ్డ భూమి, శ్మశాన వాటిక ఆక్రమణ ► జీవగెడ్డ ప్రవాహం దారిమళ్లింపు ►ఇకపై చెరువులు, భూములకు అందని జీవగెడ్డ ►కలెక్టర్ పరిశీలించాలని విన్నపం శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర పంచాయతీ శివారు దబ్బగుంట గ్రామం పక్కనుంచి ప్రవహిస్తున్న జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని ఆక్రమించడంతో పాటు దబ్బగుంట, జిల్లేల్లోవ గ్రామాల గిరిజనులు తాత ముత్తాతల కాలం నుంచి వాడుకుంటున్న శ్మశాన వాటిక భూమిని సైతం భారీ యంత్రాలతో చదును చేసేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజనులు కె.జమరాజు, యు.రాము, ఎస్.సన్నిబాబు, గెమ్మల సోములు, జె.గౌరీష్, దేముడు, చిన్నారావు, జి.గంగరాజు, భీమన్న తదితరులు బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారీ యంత్రాలతో జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని యంత్రాలతో చదును చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లు 75, 76, 77, 78, 79 మీదుగా జీవగెడ్డ ప్రవహిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు తెచ్చిన రికార్డులు, మ్యాపులో స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే జీవగెడ్డ ప్రవాహం వెళ్తున్న పలు ప్రాంతాల్లో కల్వర్టులు కూడా నేటికీ ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. అరుుతే గిరిజనుల డిమాండ్ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరుతెన్నులు మారుస్తున్న వైనంపై గానీ, పురాతన కాలం నుంచి గిరిజనులు వాడుతున్న మరుభూమి (శ్మశాన వాటిక) ఆక్రమణపై నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవగెడ్డ, దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజన గ్రామాల ప్రజలు వాడుతున్న శ్మశాన వాటిక భూమి ఆక్రమణ వెనుక ఉన్న పెత్తందార్లకు భయపడి రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని గిరిజనులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరును మళ్లించిన వైనంతో పాటు శ్మశాన వాటిక స్థల ఆక్రమణపై నిజానిజాలు పరిశీలించి న్యాయం చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. -
రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
డివిజన్ల నుంచి రికార్డుల పంపించామంటారు.. కలెక్టరేట్లో అందలేదంటారు ఎప్పుడూ ఇదే సమాధానమా? కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): కోర్టు కేసులు, భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల నుంచి కలెక్టరేట్కు రికార్డులు పంపించామంటారు, కలెక్టరేట్ ఉద్యోగులు రాలేదంటారు ఎప్పుడూ ఇదే సమాధానమా అంటు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక గోల్డన్జూబ్లీహాల్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లోకాయుక్తకు సంబంధించిన సమాచారం చివరి నిమిషంలో చెబుతున్నారన్నారు. లోకాయుక్తకు సంబంధించిన కేసుల విషయం ముందుగా తెలియజేయాలని ఆదేశించారు. ఎల్ఈసీ (లోన్ ఎల్జిబులిటీ కార్డ్స్) ఉన్నవారికి రూ.50 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేయించామని తెలిపారు. సీజేఎఫ్ఎస్ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ ఎల్ఈసీ కార్డులు మంజూరు చేయాలన్నారు. జాతీయ రహదారికి భూసేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. ధరలు నిర్ణయించే విషయంలో కావలి ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.60 లక్షలుగా నిర్ణయించారన్నారు. దీంతో బాధిత రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఇబ్బందులు పడకుండా చూడాలి రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూకు రావాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చినా తీసుకోవాలని సూచించారు. జేఈ ఇంతియాజ్ మాట్లాడుతు ఎల్ఈసీ కార్డుల మంజూరులో నాలుగు మండలాలు మాత్రమే 60 శాతం లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ టి. ధర్మారెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులురెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
నగరంలో నయా కబ్జా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్ : ఒంగోలు నగరంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే 20 సెంట్ల (120 గదులు) స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. పచ్చనేతలకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాలు పుచ్చుకోవడమే తరువాయి. నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత వెనుక ఉండి ఈ కథ నడిపిస్తుండగా, ఆయన అనుచరగణం ముందుండి దూసుకుపోతోంది. నగరంలోని గుంటూరు రోడ్డు బిలాల్నగర్లో సర్వే నంబర్ 116/1ఏ1ఏ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని కమ్యూనిటీ హాలుకుగానీ, మదర్సాలకుగానీ ఇవ్వాలని ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం నేతలు, ప్రజలు చాలాకాలంగా కోరుతున్నారు. అరుునా పట్టించుకోని అధికారులు ఆ స్థలాన్ని పచ్చనేతలకు అప్పగించి వారివద్ద మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేలాది మంది పేదలు గూడు లేక ఇంటి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు తావిస్తోంది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం కబ్జాకు గురవుతుంటే.. కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే నగరంలోని పలు స్థలాలను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. మనికొన్నింటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ.. బిలాల్నగర్ స్థలం నేపథ్యం... నగరంలోని గుంటూరు రోడ్డులో గల బిలాల్నగర్ను ఆనుకుని సర్వే నంబర్ 116/1ఏ1ఏలో మొత్తం 13.10 ఎకరాల వాగు పోరంబోకు భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగు పోరంబోకు, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు భూములను నివాసాలకు ఇవ్వకూడదు. గతంలో పేదలు పోతురాజుకాలువ పరిసరాలలో 30 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటంతో వాటికి పట్టాలు మంజూరు చేశారు. బిలాల్నగర్లోని 20 సెంట్ల భూమిని ఒక సొసైటీకి ఇస్తూ తొలుత పట్టా మంజూరు చేశారు. ఆ స్థలాన్ని వినియోగించకపోవడంతో రెవెన్యూ శాఖ వెనక్కు తీసుకుంది. 2004లో అప్పటి కలెక్టర్ ఆ స్థలంలో రెండు సెంట్ల భూమిని టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి కేటారుుస్తూ పట్టా మంజూరు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా నివాసాలు ఏర్పాటు కావడంతో అక్కడి స్థలాలకు ప్రస్తుతం విలువ పెరిగింది. దీంతో నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు కన్ను ఈ ప్రభుత్వ భూమిపై పడింది. ఆ స్థలాన్ని రెవెన్యూ వారు ఎవరికీ ఇవ్వడానికి వీలులేకుండా సదరు నేత నకిలీ పట్టాలు తయారుచేసి స్థలం తనదంటూ కోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాలని తేలడంతో ఆ స్థలాన్ని రెవెన్యూ వారు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ముఖ్యనేత అనుచరుడు ఈ స్థలంపై కన్నేశాడు. ఆ స్థలంలో గత కలెక్టర్ విజయ్కుమార్ ఇద్దరు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యుల పేరుమీద ఒకటిన్నర సెంట్ల చొప్పున కేటారుుస్తూ పట్టాలు మంజూరు చేశారు. అయితే, అధికార పార్టీ కబ్జాదారులు వారిని ఆ స్థలంలోకి రాకుండా అడ్డుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఈ వివాదం నడిచింది. చివరికి తాజాగా ఆ స్థలాన్ని వారిద్దరూ స్వాధీనం చేసుకున్నారు. పచ్చ నేతల కోసం రూ.5 కోట్ల స్థలం... మిగిలిన 15 సెంట్ల (90 గదులు)ను అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రస్తుతం రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారులు నేడో.. రేపో... వారికి ఆ స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఒకటిన్నర సెంట్ల చొప్పున ఈ స్థలాన్ని 10 మంది అర్హులైన పేదలకు కేటాయించవచ్చు. కానీ, అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఆ ముఖ్యనేత పీఏతో పాటు ఆయన అనుచరులు ముగ్గురికి రూ.5 కోట్ల విలువైన మొత్తం స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ముస్లింల ఆందోళన... బిలాల్నగర్లో పేదలకు ఇచ్చిన స్థలాలుపోను మిగతా భూమిని ముస్లిం కమ్యూనిటీ హాలు, మదర్సాలకు ఇవ్వాలని బిలాల్నగర్ మదర్సా పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానికులు మూడు రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఈ స్థలం కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందించాలని కోరారు. రికార్డుల్లో గోల్మాల్... ఏ స్థలానికైనా రెవెన్యూ కార్యాలయంలో ఒక రికార్డు మాత్రమే ఉంటుంది. బిలాల్నగర్లో మాత్రం సర్వే నంబర్ 116/1ఏ1ఏ స్థలానికి మాత్రం రెండు అడంగళ్లు ఉన్నాయి. ఒక అడంగల్లో ఇది వాగు పోరంబోకు భూమిగా ఉండగా, మరో అడంగల్లో ఇళ్ల స్థలాలని పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్లో రెండు రకాల అడంగళ్లను సృష్టించారంటే అధికార పార్టీ ఒత్తిళ్లు రెవెన్యూ అధికారులపై ఏ స్థారుులో ఉన్నాయన్న దానిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత
- జూనియర్ ఐఏఎస్ అధికారులకూ కొరత - రెవెన్యూ అధికారులు-గ్రూప్ 1 అధికారుల మధ్య పోటీ - ఆర్డీఓలకూ తప్పని ఇన్చార్జుల విధానం సాక్షి, హైదరాబాద్: జిల్లా పాలనలో కలెక్టర్ కార్యాలయానిదే ప్రధాన భూమిక. జిల్లా పాలనాధికారిగా కలెక్టర్ జిల్లా పాలనను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన తర్వాతి స్థానం జాయింట్ కలెక్టర్దే. మరో రెండు రోజుల్లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాల్సిన తరుణంలో ఈ రెండు పోస్టుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శాఖలవారీగా కొత్త జిల్లాల వ్యవస్థను ఏర్పాటు చేసుకునే పనులు మొదలైనప్పటికీ ప్రధానమైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల విషయంలో అయోమయం కొనసాగుతోంది. ప్రధాన పోస్టులకే పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారులను నియమించలేనంతగా ఐఏఎస్ అధికారులకు కొరత ఉన్న తరుణంలో, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకం ప్రభుత్వానికి ఇబ్బందిగానే పరిణమించింది. జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించటం ద్వారా ఎలాగోలా కలెక్టర్ స్థానాలను భర్తీ చేసినా.. జాయింట్ కలెక్టర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పోస్టులను భర్తీ చేసే సంఖ్యలో జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా లేనందున, సాధారణ సీనియర్ అధికారుల(నాన్ కేడర్)ను నియమించకతప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. జేసీ కోసం పోటాపోటీ.. ముందు నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులు రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉన్నందున.. ఇప్పుడు రెవెన్యూ శాఖలోని సీనియర్ అధికారులతోనే జాయింట్ కలెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఆ శాఖ అధికారుల సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాదని వేరే వారిని నియమిస్తే ఆందోళనలకూ వెనకాడబోమని తేల్చి చెబుతున్నాయి. మరోవైపు.. స్థాయి పరంగా తమ హోదానే పెద్దదని, ఎక్కడా రెవెన్యూ అధికారుల కింద తాము పనిచేసిన దాఖలాలు లేనందున ఆ పోస్టుల్లో తమనే నియమించాలని గ్రూప్ 1 అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విన తులు అందజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత వెలువడలేదు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లవైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మిగతా వ్యవస్థ యథాతథంగా ఉండనుంది. డీఆర్ఓల విషయంలోనూ సీనియర్ అధికారులను నియమిస్తారు. ఆర్డీఓలకు కొరత వస్తే పక్క డివిజన్ అధికారికి ఇన్చార్జి బాధ్యత అప్పగించి నెట్టుకొస్తారు. తహసీల్దార్లు లేని చోట డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యత అప్పగిస్తారు. కలెక్టరేట్లలో సెక్షన్ల కుదింపు.. కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిదిగా ఉన్న సెక్షన్ల సంఖ్యను ఆరుకు కుదిస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది సంఖ్యనూ కుదిస్తారు. 12గా ఉన్న సీనియర్ అసిస్టెంట్ల సంఖ్యను పదికి, 35గా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్/టైపిస్టు సంఖ్యను 11కు, రికార్డు అసిస్టెంట్స్ సంఖ్యను నాలుగు నుంచి రెండుకు, ఆఫీస్ సబార్డినేట్ల సంఖ్యను 28 నుంచి 9కి కుదిస్తారు. ప్రతి మండలానికి ఓ సర్వేయర్ పోస్టు ఉంటుంది. -
విమానాశ్రయ భూముల జాబితా విడుదల
దగదర్తి: దామవరంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం సేకరిస్తున్న దామవరం, కోత్తపల్లి కౌరుగుంట లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. కోత్తపల్లి కౌరుగుంట పరిధిలోని సర్వే నెంబర్ 334,335లో గత నెలలో కోంత మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 119 మందికి చెందిన లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారలు విడుదల చేశారు. విమానాశ్రయం కోసం సేకరిస్తున్న ఎలాంటి అభ్యంతరాలు లేని డీకేటీ భూములకు సంబంధించిన 11.54 ఎకరాలకు రెండు, మూడు రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆందోళన సాక్ష్యాత్తు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబరు 335లోని అనుభవదారులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము 25 ఏళ్లకు పైగా భూములను సాగుచేసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ భూములను విమానాశ్రయం కోసం సేకరిస్తున్నారని పరిహారం అందుకోవడానికి తాము అనర్హులమని రెవెన్యూ అధికారులు చెప్పడంతో కోత్తపల్లికౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు సెప్టెబరు 7వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిష¯ŒS పేరుతో ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు 17.9.2016 తేదీన కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులను భూముల్లో నుంచి తొలగించరాదని, వారికి పరిహారం అందిచే విషయంలో ఏమి చర్యలు తీసుకోంటున్నారో తెలపాలని ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు తమ కార్యాలయానికి అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామన్నారు. -
పంచకూటాలయానికి కొత్త స్థలం
- మంత్రి చందూలాల్ ఆదేశంతో ఆగమేఘాలమీద గుర్తింపు - గుట్టపై భూమిని సేకరించిన రెవెన్యూ అధికారులు సాక్షి, హైదరాబాద్: అరుదైన పంచకూటాలయం పునర్నిర్మాణానికి మరో కొత్త స్థలాన్ని సేకరించారు. ఇప్పటికే ఓ స్థలాన్ని గుర్తించి దాదాపు రూ.10 ల క్షలు వ్యయంతో చదునుచేసి నిర్మాణానికి సిద్ధం చేయగా, అది మరో పార్టీ నేతలు ఇచ్చిన భూమి కావటంతో అందులో ఆలయ పునర్నిర్మాణం వద్దంటూ అధికార టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో పురావస్తుశాఖ పనులు చేయకుండా చేతులెత్తేసింది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామానుజాపురంలో జరిగిన ఈ వ్యవహారాన్ని 4 రోజుల క్రితం ‘పంచకూటాలయంపై పంచాయితీ’ శీర్షికన సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదేరోజు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి చందూలాల్ ఇటు పురావస్తుశాఖ, అటు రెవెన్యూ అధికారులను పిలిపించి దీనిపై చర్చించారు. పంచకూటాలయం పునరుద్ధరణ ఇలా రాజకీయకారణాలతో వివాదాస్పదం కావడంతో వెంటనే పనులు మొదలుపెట్టక తప్పదని మంత్రి ఆదేశించారు. అయితే ఆ స్థలంలో కాకుండా మరోచోట నిర్మాణం చేపట్టాలని ఆదేశించటం విశేషం. ఆలయ పునర్నిర్మాణానికి సిద్ధం చేసిన స్థలానికి బదులు మరో చోట ప్రభుత్వ భూమిని సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వెంకటాపురం తహసీల్దార్ రంగంలోకి దిగి రామానుజాపురానికి 5 కి.మీ. దూరంలో 30 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దాన్ని పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ రహీంషా అలీ, ఆ శాఖ వరంగల్ ఏడీ ప్రేమ్సాగర్లు పరిశీలించారు. అందులోనే ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పురావస్తుశాఖకు స్వాధీనం చేయనున్నట్టు సమాచారం. మళ్లీ కొత్త ఖర్చు.. గతంలో గ్రామంలో ఆలయపునర్నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ఆలయం నుంచి విప్పతీసిన శిల్పాలు, రాళ్లను ఇక్కడికి తరలించారు. కాగా, ఇప్పుడు కొత్తగా గుర్తించిన స్థలం గుట్టప్రాంతం కావటంతో దాన్ని మళ్లీ చదును చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మళ్లీ భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. -
గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి
ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 సర్వీస్లో ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేసి ఆ అధికారులనే జాయింట్ కలెక్టర్, శాఖాధిపతులుగా నియమిస్తే పరిపాలనలో సమతుల్యత ఏర్పడుతుందని వారు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది యాయవిరుద్ధమే కాకుండా వివిధ శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, అధికారులు శశికిరణాచారి, అలోక్కుమార్, సర్వేశ్వర్రెడ్డి, చంద్రకాంత్రెడ్డి, అరవింద్రెడ్డి, పద్మజ, అనితాగ్రేస్, రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు మా భూమిని లాక్కున్నారు
అర్ధరాత్రి దొంగల్లా ఆస్తిని కబ్జా చేశారు: ఎంపీ కొత్తపల్లి గీత సాక్షి, హైదరాబాద్: ఒక ఎంపీ భూమికే రక్షణ లేకపోతే ఎలా అని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో తమ సంస్థకు చెందిన విలువైన భూమిని అధికారులు లాక్కున్నారని ఆరోపించారు. రాయదుర్గంలోని సర్వే నం.83/2లో 53 ఎకరాల భూమిని ఎనిమిదేళ్ల కిందట చట్ట ప్రకారం కొనుగోలు చేశామన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు దొంగల్లా తమ స్థలంలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ రంజిత్ కుమార్ ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పు పట్టించారన్నారు. ఇందులో టీఎస్ఐసీ చైర్మన్ నరసింహారెడ్డి హస్తం కూడా ఉందని చెప్పారు. పర్సంటేజీలకు ఆశించే జేసీ ఇదంతా చేశారన్నారు. ఈ ఆస్తే తమ జీవితాధారమని.. అది లేని నాడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరతానని ఏంపీ గీత తెలిపారు. -
మా భూముల్లో సర్వే ఆపండి
* హైకోర్టులో మహబూబ్నగర్ జిల్లా శాతాపూర్ రైతుల పిటిషన్ * కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా, అంజనాగిరి రిజర్వాయర్ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్ వరకు సొరంగం తవ్వేందుకు రెవెన్యూ అధికారులు ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి తమ భూముల్లో సర్వే నిర్వహించడాన్ని సవాలు చేస్తూ శాతాపూర్ గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం పాటించాల్సిన విధి విధానాలను పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ యు.రాముడు, మరో 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, సర్వే వల్ల రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, ప్రశ్నిస్తే ఎకరాకు రూ.8 వేల పరిహారం ఇస్తామని మౌఖికంగా చెబుతున్నారని వివరించారు. సర్వే విషయంలో ప్రశ్నిస్తే విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు కేసులు నమోదు చేస్తామంటూ రైతులను అధికారులు బెదిరిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ప్రభు త్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్కుమార్ జోక్యంచేసుకుని, ఎవ్వరినీ బెదిరించడం లేదన్నారు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించే అధికారం ప్రభుత్వానికి భూ సేకరణ చట్టం ప్రకారం ఉందన్నారు. అర్జున్ కలుగజేసుకుంటూ, జీవో 123 కింద భూములు ఇవ్వాలంటూ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. దీనికి శరత్ అభ్యంతరం చెప్పారు. బెదిరిస్తున్నారంటూ పదే పదే చెప్పడం అందరికీ అలవాటైపోయిందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, రైతులపై ఒత్తిళ్లు లేకుంటే వాళ్లు ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ఇక్కడి వరకు వస్తారా? అంటూ వ్యాఖ్యానించారు. ఎల్లూరు రైతుల పిటిషన్ కొట్టివేత.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీ డిజైనింగ్ పేరుతో నవయుగ కంపెనీ తమ భూముల్లో చేస్తున్న సర్వేను అడ్డుకోవాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, ఎల్లూరు గ్రామానికి చెందిన టి.నాగజ్యోతి, మరో 40 మంది రైతులు ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మంజీరలో ‘మహా’ అక్రమాలు
బోధన్: మంజీర నదిలో మహారాష్ట్ర మళ్లీ అతిక్రమణలకు పాల్పడుతోంది. మన సరిహద్దులోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపడుతోంది. హద్దు రాళ్లను తొలగించి మరీ కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. తాజాగా మన భూభాగంలో ఇసుక తవ్వుతుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొక్లెయిన్, టిప్పర్ సీజ్ చేశారు. బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివారులోని అంతరాష్ట్ర చెక్పోస్టుకు సమీపంలో మంజీర నది తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. నదిలో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏటా ఇది వివాదాస్పదమవుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి పేరుతో కాంట్రాక్టర్లు హద్దు దాటి మన భూబాగంలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరకు అవతలి వైపు నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలో భూభాగం ఉంది. బిలోలి తాలూకా పరిధిలోని ఎస్గీ, గంజ్గం, బోలేగాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు బోధన్ మండలంలోని మందర్న శివారులోని మన రాష్ట్ర సరిహద్దు రాళ్లను తొలగించి, మన భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. సమాచారమందుకున్న బోధన్ రెవెన్యూ అధికారులు సోమవారం మందర్న శివారులో పర్యటించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకొని, ప్రొక్లెయిన్, టిప్పరు స్వాధీనం చేసుకున్నారు. ‘మహా’ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో బోధన్ తహసీల్దార్ వినోద్కుమార్, సిబ్బంది మంజీర నది తీరంలో పర్యటించి మన రాష్ట్ర సరిహద్దులను గుర్తించి హద్దు రాళ్లను అమర్చారు. హద్దు దాటి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్కడి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కానీ బరితెగించిన కాంట్రాక్టర్లు హద్దు రాళ్లను తొలగించి మన భూభాగంలో ఇసుక తవ్వుతున్నారు. నదిలో సరిహద్దు వివాదాన్ని ఆసరా చేసుకుని మితిమీరుతున్నారు. వారికి ‘మహా’ సర్కారు అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సరిహద్దులో ఇసుక జాతర.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్పోస్టు సమీపంలో ఇసుక లారీలు బారులు తీరుతున్నాయి. వందల సంఖ్యలో లారీల రాకపోకలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు 200 పైగా ఇసుక లారీలు, టిప్పర్ల ద్వారా ఇసు రవాణా సాగుతోంది. సాలూర చెక్పోస్టు నుంచి బోధన్ వరకు రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్ర ఇసుక క్వారీలతో అక్కడి ప్రభుత్వం, కాంట్రాక్టర్లు రూ.కోట్ల ఆదాయం దండుకుంటున్నారు. నకిలీ వేబిల్లుతో ఇసుక తరలిపోతోందని ఆరోపణలు వచ్చినా తనిఖీలు మాత్రం ‘మామూలు’గా కొనసాగుతున్నాయి. క్రిమినల్ కేసులు పెడతాం.. మహారాష్ట్రలోని బోలేగాం ఇసుక క్వారీ నిర్వాహకులు మన భూభాగంలో చొచ్చుకు వచ్చి హద్దు రాళ్లను తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలను అడ్డుకొని ప్రొక్లెయిన్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని కలెక్టర్కు అందించాం. మంజీర నదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – వినోద్కుమార్, తహసీల్దార్ -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రేసిని రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ముమ్మరంగా సోదాలు
నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు భారీగా నగదు, భూ పత్రాలు, ఆయుధాలు లభ్యం! హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం, కుంట్లూర్తోపాటు నయీమ్ నివాసమున్న అల్కాపూర్ టౌన్షిప్లో మళ్లీ తనిఖీలు చేశారు. హస్తినాపురం ద్వారకానగర్లో నయీమ్ బంధువుల ఇంటి పై బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం నయీమ్ ద్వారకానగర్లో బండ జైపాల్రెడ్డి ఇంటిని కొనుగోలు చేసి అందులో నజియాబేగంను ఉంచాడు. ఆ తర్వాత నయీమ్ అనుచరులు సుధాకర్చారి, నవీన్లు ఈ ఇంటిని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారు. పోలీసులు ఈ ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉండటంతో పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. నగదు, పత్రాలు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదరుడి ఇంటిపై దాడులు నయీమ్ పెద్దమ్మ కొడుకు సలీం గత ఆర్నె ల్లుగా పెద్దఅంబర్పేట పరిధిలోని కుంట్లూరు తెలంగాణనగర్లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సలీంతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్కాపురిలోని నయీమ్ ఇంటి ని నార్సింగి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. ఒక బెడ్రూమ్ను తనిఖీ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్ సీఐ రామ్చందర్రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరోసారి నయీమ్ ఇంట్లో సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్లు లభించినట్లు తెలిసింది. నయీమ్ కేసుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ ఇన్చార్జి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం అల్కా పురిలోని నయీమ్ ఇంటికి వచ్చి పోలీసుల నుంచి సోదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పోలీసుల ఇంటి నుంచి స్వాధీ నం చేసుకున్న నగదు, బంగారు అభరణాలు, పత్రాలను పోలీసులు గురువారం ఉప్పర్పల్లి కోర్టుకు అందజేసి, అనంతరం బ్యాంక్లో డిపాజిట్ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఫర్హానా, ఆసియాలు నార్సింగి పోలీసులు ఫర్హానా, ఆసియాలను బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి నయీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు వీరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం. -
వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!
≈ లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్ల్యాండ్’ ≈ సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం ≈ ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు ≈ ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు ≈ సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ≈ ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు ≈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ≈ పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్ల్యాండ్లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్ల్యాండ్లో చేరింది. అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ (వెబ్ల్యాండ్లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్ల్యాండ్లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్ల్యాండ్లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్ల్యాండ్లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్ల్యాండ్లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్ల్యాండ్లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర నష్టం వెబ్ల్యాండ్లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్ల్యాండ్లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వం లోపాలమయం దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్ల్యాండ్లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్ల్యాండ్లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూమి విలువను బట్టి రేట్లు ఆన్లైన్లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొంపముంచిన తొందరపాటు నిర్ణయం వెబ్ల్యాండ్లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్ల్యాండ్లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం పేరు మాయం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్ల్యాండ్లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్ల్యాండ్లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు. - చింతకాయల రామాంజనమ్మ ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్ కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్ల్యాండ్లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోసాలు బయటపడటంతో... వెబ్ల్యాండ్లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్ల్యాండ్లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
ముందడుగు..
♦ పరిష్కారం దిశగా ఏళ్లనాటి సమస్యలు ♦ ఆ వైపుగా రెవెన్యూ అధికారుల అడుగులు ♦ ఇప్పటికే దాచారం, అన్నారం గ్రామాలసమస్యల పరిష్కారం ♦ తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై దృష్టి జిన్నారం : దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి మండల రెవెన్యూ అధికారులు చొరవ చూపుతున్నారు. అరవై ఏ ళ్లుగా నానుతున్న దాచారం ఇళ్లస్థలాలు, అన్నారంలో 30 ఏళ్లుగా వేధిస్తున్న రైతుల భూసమస్యను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించారు. తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించారు. జిన్నారం మండలం దాచారం, దార్గుల గ్రామాలను 60 ఏళ్ల క్రితమే డీఆర్డీఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తమకు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ గ్రామాలను వదిలే ప్రసక్తే లేదని దాచారం, దార్గుల వాసులు తేల్చిచెప్పారు. అలా చాలా ఏళ్లుగా ఈ సమస్య నానుతూ వస్తోంది. రెండేళ్ల క్రితం దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కి ష్టాయిపల్లిలోని 166 సర్వే నంబర్ గల భూమిలో 36 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. రెండు నెలల క్రితం దాచారం గ్రామాన్ని డీఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో దాచారం గ్రామాల ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన 360 మందిని గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాతోపాటు పొజిషన్ను కూడా చూపించారు. అన్నారం సమస్య 30 ఏళ్లది... అన్నారంలోని 261 సర్వే నంబర్లో 30 ఏళ్ల క్రితం 108 మంది రైతులకు ఎకరం చొప్పున సాగు చేసుకునేందుకు భూమి ని అందిస్తూ సర్టిఫికెట్లు అందించారు. ఇదే సర్వే నంబర్లో ఎక్స్సర్వీస్మెన్లకు కూడా స్థలాలు కేటాయించారు. అప్పటినుంచి రైతులకు, ఎక్స్సర్వీస్మెన్లకు పొజిషన్ చూపడంలో అధికారులు విఫలమయ్యారు. సర్వే నంబర్ ఒకటే కావటంతో ఎవరికి ఎక్కడ స్థలాన్ని కేటాయించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలుపడుతూ వచ్చా రు. తహసీల్దార్ శివకుమార్ ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో రైతులతో, ఎక్స్సర్వీస్మెన్లతో స్వయ ంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ముందుగా స్థలాన్ని కేటాయించి, ఆ తర్వాత ఎక్స్సర్వీస్మెన్లకు కేటాయిస్తామని చెప్పా రు. దీంతో రైతులకు ఎకరం చొప్పున లాట రీ ద్వారా స్థలాన్ని ఎంపిక చేసి అం దజేశారు.దీంతో ఈ సమస్యకు పరిష్కారమైంది. 59జీవో కింద ఆయా గ్రామాల ప్రజలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేం దుకు దరఖాస్తులు చేసుకున్నారు. రెండేళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 59జీఓలో భాగంగా రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జ రుగుతున్నాయి. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుం టున్న ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, రెవెన్యూ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. శాశ్వతపరిష్కారం దిశగా ముందుకు.. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సహకారంతో మండలంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నాం. 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దాచారం, దార్గుల గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉంది. - శివకుమార్, తహసీల్దార్ జిన్నారం -
‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’
జేసీ ఆమ్రపాలికి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు పరిగి : రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పంట పొ లాలను దున్ని పాడు చేశారని మండలంలోని రూప్ఖాన్ పేట్కు చెందిన రైతులు తెలిపారు. వారు బుధవారం పరిగికి వచ్చిన జారుుంట్ కటెక్టర్ ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. మండలంలోని తుంకలగడ్డ శివారులో 70 సంవత్సరాల క్రితం తమకు ప్రభుత్వం భూమిని పంపిణీ చేసిందన్నారు. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా గత సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు ట్రాక్టర్తో మొక్కజొన్న పంటను దున్నేశారని బాధిత రైతులు వివరించారు. ఆ పొలం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే మరో చోటనైనా తమకు భూములు ఇవ్వాలని ఆమెను కోరారు. పరిశీలిస్తామని ఆమె తెలిపారు. -
'లంచం అడుగుతున్నారు మహాప్రభో'
హైదరాబాద్: రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వోలు తనను రూ. 60 వేలు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో బాధితుడు ఆరోపించాడు. లంచం డిమాండ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. -
భూకబ్జాకు భారీ స్కెచ్!
► నడింపాలెంలో ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను ► 2.40 ఎకరాలకు నకిలీ వ్యవసాయ అప్పగింత పట్టాలు ► రాజముద్ర (సీల్), స్టాంపులు అన్నీ నకిలీవేనని నిర్ధారణ ► తహశీల్దార్ సంతకం సైతం ఫోర్జరీ.. డీకే రిజిస్టరు మాయం ► సర్పంచ్ చొరవతో వెలుగులోకి వచ్చిన వైనం... ► పూర్తి విచారణకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు నడింపాలెంలో నకిలీ పట్టాల కుంభకోణం వెలుగుచూసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు నకిలీ పట్టాలను సృష్టించారు. ఏకంగా తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలతో ప్రభుత్వ భూమిని కాజేసే పన్నాగం పన్నారు. ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం నడింపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై 184 సర్వే నంబరులో 29.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ఆ భూమిని కాజేసేందుకు భారీ స్కెచ్ వేశారు. రికార్డుల్లో లేని సర్వే నంబర్లు సృష్టించి 2.40 ఎకరాల భూ దోపిడీకి పాల్పడ్డారు. 184-3-ఏ1ఏ సర్వే నంబరుతో నకిలీ సబ్డివిజను సృష్టించి 2015 ఫిబ్రవరి 16న ఒక్కొక్కరికీ 30 సెంట్లు చొప్పున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎనిమిది మంది పేర్లతో 2.40 ఎకరాలకు నకిలీ పట్టాలను (వ్యవసాయ అప్పగింత పట్టాలు) పుట్టించారు. సంతకాలు, స్టాంపులు, సీల్స్.. అన్నీ నకిలీవే.. నడింపాలెంలో వెలుగులోకి వచ్చిన నకిలీ పట్టాలను చూసిన రెవెన్యూ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. పట్టాలపై ఉన్న రాజముద్ర (సీల్), తహశీల్దార్ పేరుతో ఉన్న స్టాంపులు అన్నీ నకిలీవేనని తేల్చారు. వీటితో పాటు ఏకంగా తహశీల్దార్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీకే రిజిస్టర్ మాయం.. ఇదిలా ఉంటే గ్రామంలో ఎవరికైనా నివేశన స్థలాలు లేదా వ్యవసాయ భూముల పట్టాలు అప్పగించిన సమయంలో లబ్ధిదారుల పూర్తి వివరాలను డీకే రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నడింపాలెం గ్రామానికి సంబంధించిన డీకే రిజిస్టర్ మాయమైంది. నాలుగు రోజులుగా పట్టాల పంపిణీకి సంబంధించిన రిజిస్టర్ల కోసం వీఆర్వోలు వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది. దీంతో కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ దొంగ పట్టాలు ఎంత మందికి ఇచ్చారు? ఇచ్చిన వారు ఎవరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు కార్యాలయంలోనే అస్మదీయులు ఉన్నారా? అన్న అనుమానాలూ లేకపోలేదు. సర్పంచ్ చొరవతో వెలుగులోకి.. ఈ నకిలీ కుంభకోణం గ్రామ సర్పంచ్ నేలపాటి శౌరీలు చొరవతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు ప్రభుత్వభూమిలో కొందరు పొక్లెయినర్లు, ట్రాక్టర్లుతో భూమిని చదును చేయించడంతో గ్రామంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సర్పంచ్ శౌరీలు రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు తహశీల్దార్ పద్మావతిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి తహశీల్దార్ ఏసుబాబు (ప్రస్తుత దుర్గి తహశీల్దార్)ను కలిసి తనకు లభించిన నకిలీ పట్టాలను చూపించారు. దీంతో నిజం నిగ్గుతేలిపోయింది. పట్టాలను, పట్టాలపై ఉన్న సంతకాలు పరిశీలించిన దుర్గి తహశీల్దార్ ఏసుబాబు అవి తన సంతకాలు కావని, అసలు తన హయాంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు గానీ, డీకే పట్టాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ప్రత్తిపాడు తహశీల్దార్కు ఓ లేఖ రాశారు. తన సంతకాలను ఎవరో ఫోర్జరీ చేశారని, నిజాలను నిగ్గు తేల్చి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆ పట్టాలు నకిలీవే.. నడింపాలెంలో వెలుగు చూసిన వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు నకిలీవే. పట్టాలు పరిశీలించాను. అనుమానం వచ్చి అప్పటి తహశీల్దార్ ఏసుబాబుని అడిగాను. తన హయాంలో ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. దానికితోడు అందుకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు కూడా కార్యాలయంలో ఏమీలేవు. అందుచేత కచ్చితంగా అవి నకిలీ పట్టాలే. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాను. - పద్మావతి, తహశీల్దార్, ప్రత్తిపాడు మండలం. డీకే రిజిస్టర్ లేదు మా రికార్డుల్లో 184-3-ఏ1ఏ సర్వే నంబరు లేనేలేదు. ఇది నకిలీ సర్వే నంబరు. అయినా అసలు 2015లో పట్టాలు ఇచ్చినట్లుగా కార్యాలయంలో రికార్డులేమీ లేవు. నాలుగు రోజులుగా డీకే రిజిస్టర్ కోసం వెతుకుతున్నాం. కనిపించలేదు. అందుచేత ఇవి నకిలీవిగానే భావిస్తున్నాం. 184 సర్వే నంబరులో ఉన్న భూమి మాత్రం ప్రభుత్వ భూమే. - కె జీవనజ్యోతి, ఇన్చార్జి వీఆర్వో, నడింపాలెం గ్రామం. -
డబ్బులివ్వందే పని చేయరట!
రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాలి ఆవేదన సైదాపూర్: తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులివ్వందే పనిచేయడం లేదని బాధితురాలు దొనికెన లలిత మంగళవారం తన గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం ఎలబోతారం శివారులో మూడెకరాల భూమిని కొన్నామని, జమాబందీ పాస్బుక్లో ఖాతా నెంబర్ 791 నమోదు కాగా, కంప్యూటర్ ఆన్లైన్లో 1019 అని తప్పుగా నమోదు చేశారని తెలిపారు. దీని సవరణ కోసం మూడు సంవత్సరాలుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, డబ్బులివ్వందే పని కాదంటూ కంప్యూటర్ ఆపరేటర్ తేల్చిచెప్పాడని ఆరోపించారు. తప్పు చేసింది తహసీల్ కార్యాలయ సిబ్బందేనని, తిరిగి సవరణ చేయమంటే ఇంత గోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఎకరంన్నర భూమికొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, జమాబందీ అమలుకు గతేడాది నవంబర్ 21న దరఖాస్తు చేస్తే, అదెక్కడో పోయిందంటే తిరిగి 23న మరోసారి దరఖాస్తు చేశానని పేర్కొన్నారు. ఇప్పటివరకు పనిచేయలేదని, ఈ విషయమై అధికారులను అడుగుతే చివరకు ఫైలే లేదు, అసలు దరఖాస్తు పెట్టుకోలేదని అంటున్నారని తెలిపారు. -
బది‘లీలలు’!
కలెక్టరేట్లో పాతుకుపోయిన 15 మంది అధికారులు వీరిని పక్కమండలాలకూ పంపలేని వైనం ముడుపులే బదిలీలను ఆపిస్తున్నాయా? అవకాశం కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ అధికారులు కలెక్టరేట్లో ఓ పరిపాలనా అధికారి సుమారు పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. పైసా ముట్టందే ఫైలు కూడా తాకరు. అడిగినంత ఇవ్వకుంటే ఇచ్చినంత పుచ్చుకుని ఫైలు దాచేస్తాడు. కాంట్రాక్టు ఉద్యోగులనూ వేధించే ఈ అధికారి ఉన్నతాధికారులకు ముడుపులందిస్తూ... కలెక్టరేట్లో తన దందా కొనసాగిస్తున్నాడు. ఈ బదిలీల్లో అయినా కలెక్టరేట్కు ఈయన నుంచి విముక్తి లభిస్తుందని రెవెన్యూ సిబ్బంది భావించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఒక డెప్యూటీ తహశీల్దార్ 2001లో కలె క్టరేట్లో విధుల్లో చేరారు. ఒక్క ఆర్ఐ పీరియడ్లో తప్ప తన సర్వీస్ మొత్తం కలెక్టరేట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ముడుపులు చెల్లిస్తుండటంతోనే బదిలీ చేయడంలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికీ బదిలీ తప్పదని కలెక్టర్ చెప్పడంతో.. ఆ అధికారి కచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ పైరవీ ఫలించింది. ఆ అధికారి మళ్లీ ఇక్కడే నిలిచారు. చిత్తూరు: రెవెన్యూ ఉద్యోగుల బది‘లీలల’పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్లో పీఠాధిపతులుగా పాతుకుపోయిన ఆ 15 మందిని ఈ సాధారణ బదిలీల్లో కూడా కదపకపోవడంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అని తెలిసిన ప్రతిసారీ వీరు డిప్యూటేషన్పై ల్యాండ్అక్విజేషన్, ఆర్డీవో, డీఎస్వో ఆఫీసులకు వెళ్లడం.. అక్కడ కొన్నేళ్లు పనిచేసి మళ్లీ కలెక్టరేట్కే రావడం రివాజుగా మారుతోంది. వీరిని కనీసం చిత్తూరు చుట్టుపక్కల మండలాలకు కూడా బదిలీచేయకపోవడం గమనార్హం. పారదర్శకత ఏదీ? మూడేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉంటే ఉద్యోగి ఇష్టంతో సంబంధం లేకుండా జిల్లాలో ఏ మూలకైనా బదిలీ చేయొచ్చు. మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధనలను అధికారులు కచ్చితంగా వర్తింపజేస్తున్నారు. అయితే కలెక్టరేట్కు వచ్చేసరికి మంచి పనితీరు అనే నెపంతో నిబంధనలు పక్కన పెడుతున్నారు. మండలాల్లో పనిచేసే ఉద్యోగులు బలైపోవాల్సి వస్తోంది. ముడుపులే కారణమా? బదిలీ నిలుపుదల చేసుకునేందుకు కలెక్టరేట్లో పనిచేస్తున్న ఆ 15 మంది ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా పనితీరు బాగుందని కలెక్టర్కు నివేదిక సమర్పిస్తూ వారిని ఇక్కడే ఉంచుతున్నారు. సంవత్సరాల తరబడి వీరు ఒకే చోట పనిచేస్తుండడంతో ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఆశ..నిరాశే చిత్తూరు నుంచి 20 కి.మీ పరిధిలోని పూతలపట్టు, జీడీనెల్లూరు, గుడిపాల, యాదమర్రి, తవనంపల్లి, ఐరాల, పెనుమూరు మండలాల రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్లో పనిచేయాలని తమ కోరికను పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి విన్నపాన్ని బుట్టదాఖలుచేస్తున్నారు. దీంతో వారిలో తీవ్ర అసంతృప్తి రేకెత్తుతోంది. అవకాశం ఇస్తే ఇప్పుడున్నవారికంటే బాగా పనిచేస్తామని చెబుతున్నారు. సబ్కలెక్టర్ కార్యాలయాల్లోనూ.. సబ్కలెక్టర్ కార్యాలయాల్లోనూ పీఠాధిపతుల జాబితా పెద్దదే. తిరుపతి, మదనపల్లి సబ్కలెక్టర్ కార్యాలయాల్లో కొందరు ఏళ్లతరబడి పాతుకుపోయారు. వీరు సీనియర్ అనే నెపంతో జూనియర్ ఉద్యోగులను వేధిస్తున్నారు. రాచరిక తీరును ప్రదర్శిస్తూ కిందిస్థాయి ఉద్యోగులను అవమానాలకు గురిచేస్తున్నారు. మోక్షం కలిగేనా? జిల్లాలో నలుగురు తహశీల్దార్లను బలవంతపు సెలవులో పంపారు. నాలుగు నెలల నుంచి వారు సెలవులో ఉన్నారు. వీరు గత శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్ కూగా హాజరయ్యారు. అయితే కలెక్టర్ సిద్ధార్థ్జైన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్చార్జ్ ఎమ్మార్వోలు ఉన్న మండలాల్లో చాలా ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. వీరు పాలనపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరుకు ఏం అరుణ్కుమార్ ఇంచార్జ్ ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు. ఈయ న ఎక్కువ సమయం ఆర్డీవో కార్యాలయంలో గడుపుతుండటంతో తహశీల్దార్ ఆఫీసులో పాలన పడకేసింది. నామమాత్రంగా బదిలీ కలెక్టరేట్లో దాదాపు 55 మంది రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న డెప్యూటీ తహశీల్దారు స్థాయి సిబ్బందిలో ఐదుగురిని మాత్రమే బదిలీ చేశారు. మిగిలిన వారు అక్కడే పాతుకుపోయారు. -
సర్వేపై సందేహాలు
► పేరుకు గ్రామ కంఠాలు.. కానీ రోడ్ల ► సర్వే అని అనుమానం ► ఇళ్లు తొలగిస్తారేమోనని ఆందోళన ► మానసిక వేదన పడుతున్న ప్రజలు ఉండవల్లి/పెనుమాక (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో గ్రామ కంఠాలు నిర్ణయిస్తున్నామంటూ రెవెన్యూ అధికారులు రిటైర్డ్ సర్వేయర్లతో సర్వే కార్యక్రమం చేపట్టింది. గురువారం ఉండవల్లి గ్రామంలో సర్వే చేస్తుండగా, ప్రజలు అభ్యంతరం తెలియజేసి, మీరెందుకు సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలను నిర్ణయించేందుకు పని చేస్తున్నామని వారు తెలిపారు. వాస్తవానికి గ్రామ కంఠాల సర్వే చేస్తే గ్రామాల నలుమూలల నిర్వహించాల్సి ఉంది. అలాంటిది ఉండవల్లిలో పాత ఆర్అండ్బీ రోడ్డులో మాత్రమే ఈ సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆర్డీవో శ్రీనివాసరావు ఉండవల్లిలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్లు తొలగించాలని సూచించారు. దీంతో స్థానికులు అందరూ ఆయన ప్రతిపాదనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అయితే రోడ్ల కోసం సర్వే అని చెబితే ప్రజల్లో తిరుగుబాటు ఎక్కడ వస్తుందోనని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో ఎత్తుగడను మార్చి గ్రామ కంఠాల సర్వే చేస్తున్నామని చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు నిర్మించే ప్రాంతాల్లో గప్చుప్గా సర్వే క్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పెనుమాక గ్రామస్తులు అయితే టీడీపీ ఆధ్వర్యంలో ఆర్డీవోను కలిసి, తాము పొలాలు కోల్పోయామని, రోడ్ల కోసం మా ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటో చెప్పాలని అధికారులను నిలదీశా రు. దీంతో ప్రభుత్వం 1932లో లెక్కల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సర్వేలు చేయిస్తున్నారు. అయితే ఈ నివాసాలు అన్నీ కూడా 1952 తరువాత నిర్మాణం చేపట్టినవి. 1952 నుంచి ఇప్పటి వరకు అధిక సంఖ్యలో గృహ నిర్మాణాలు జరగడంతో పాటు స్థలాలు, ఇళ్లు కొనుగోలు, అమ్మకాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో స్థల యజమానులు ఏళ్ల తరబడి స్థానిక పంచాయతీలకు పన్నులను చెల్లిస్తూనే ఉన్నారు. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న రికార్డును ప్రస్తుతం బలవంతంగా అమలు పరచాలని ప్రభుత్వ ఉద్దేశమని పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. -
నమ్మించి ముంచారు
► జీరో ల్యాండ్ పేరుతో పాగా వేయించారు ► రూ.లక్షలు పెట్టి ఇళ్లు కట్టించుకున్నాం ► తర్వాత దౌర్జన్యంగా ఖాళీ చేయించారు ► ‘చినబాబు కాలనీ’ బాధితుల ఆవేదన జీరో ల్యాండ్’ పేరిట నమ్మించారు. గుడిసెలు వేసుకుంటే త్వరగానే పట్టాలిప్పిస్తామన్నారు. తమకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి మాటలను పేదలు నమ్మారు. స్థలం వస్తుందన్న ఆశతో కట్టెలు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుని గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు అప్పోసప్పో చేసి.. లక్ష, లక్షన్నర రూపాయల ఖర్చుతో పక్కా నిర్మాణాలు కూడా చేపట్టారు. కొద్దిరోజుల్లోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. నమ్మబలికిన ‘పచ్చ నేతలే’ నట్టేట ముంచారు. స్థలం వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. వారు వదలకుంటే బలవంతంగా లాక్కొని తమ వారికి కట్టబెట్టారు. ఇదీ ‘చినబాబు కాలనీ’ కథ. జేఎన్టీయూ : అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో ‘తమ్ముళ్లు’ సృష్టించిన చినబాబు కాలనీ కారణంగా అనేకమంది పేదలు బలయ్యారు. కాయాకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి పోగొట్టుకున్నారు. స్థలం వస్తుందని ఆశపడితే .. చివరకు అప్పుల పాలు కావాల్సి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. దౌర్జన్యంగా కట్టుబట్టలతో బయటకు గెంటేశారని, తమ స్థలాలు/ నిర్మాణాలు నాయకుల అనుయాయులకు కట్టబెట్టారని వాపోతున్నారు. ఈ స్థలం జీరోల్యాండ్ అని చెప్పడంతో పేదలు గుడిసెలు వేసుకోవడానికి ముందుకొచ్చారు. స్థలం ఆక్రమణలో ఉంటే రెవెన్యూ అధికారులు ఏదో ఒకరోజు పట్టాలివ్వకపోతారా అని ఆశించారు. కొందరు ధైర్యం చేసి నిర్మాణలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కాలనీలో 128 ఇళ్లు వెలిశాయి. ఇందులో ప్రస్తుతం టీడీపీ నాయకులు 67 కుటుంబాలను వెళ్లగొట్టారు. వాటిలో కొన్ని తమ అనుయాయులకు ఇవ్వడంతో పాటు బేరం పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు టీడీపీ నేతల పాత్ర ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వస్థలాన్ని బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కుల చెర నుంచి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతున్నారు. రూ.22.80 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకోవడం తగదని అంటున్నారు. గుగ్గిళ్లు అమ్మి.. డబ్బు కట్టా జేఎన్టీయూ ఓల్డ్ క్యాంపస్, పంచాయతీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి రోజూ గుగ్గిళ్లు అమ్మి జీవనం సాగిస్తున్నా. తద్వారా కూడబెట్టిన రూ.40 వేలతో రేకుల కొట్టం వేసుకున్నా. అలాగే ప్రతి నెలా చందాల పేరుతో నాయకులు వసూలు చేశారు. ఆ డబ్బుతో జల్సాలు చేశారు. నన్ను దౌర్జన్యంగా బయటకు గెంటేసి.. కొట్టమున్న స్థలాన్ని రూ. రెండు లక్షలకు అమ్మేశారు. నేను ఇంటికి పెట్టిన సొమ్ము కోసం ప్రతి రోజూ పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. -రామలక్ష్మి, బాధితురాలు -
మదనపల్లెలో మాజీ సైనికుని నిరాహార దీక్ష
అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసు వద్ద మాజీ సైనికులు సోమవారం ఆందోళనకు దిగారు. మదనపల్లె ప్రాంతంలోని 150 మంది మాజీ సైనికులకు స్థలాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్ని విజ్ఞాపనలు అందజేసినా, ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా స్పందించలేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం.. ఆరు ఇళ్లు దగ్ధం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్లీకై ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు మొత్తం ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి వివరాలు సేకరించారు. -
పారదర్శకంగా సేవలందించాలి
► భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ ► జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ... ఎదులాపురం : రెవెన్యూ అధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని భూ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రేమండ్ పీటర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా జీవో నం.58, 59లకు అనుగుణంగా భూ క్రమబద్ధీకరణ చేసిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు డివిజన్లలో 2635 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, 2255 మంది దరఖాస్తులను పరిశీలించి 914 మందికి రెగ్యులర్ చేశామని తెలిపారు. 297 అభ్యర్థుల ద్వారా రూ.18 ,91,60,000లు ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, వీరికి పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో మీ సేవ కేంద్రాల పని తీరుపై ప్రధాన కార్యద ర్శి వివరణ కోరగా జిల్లాలో కొంత మంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపి సంబంధిత మీ సేవ యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల ద్వారా అన్ని మీ సేవా కేంద్రాల్లో ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ సుందర్అబ్నార్, డీఆర్వో సంజీవ్రెడ్డి, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరవింద్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేకే ఓసీపీకి భూసేకరణ ప్రారంభం
జీవో 123కు కొంత మంది రైతుల అంగీకారం కాసిపేట : మండలంలో ఏర్పాటు కానున్న కేకే ఓపెన్కాస్టు ప్రాజెక్టు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం భూసేకరణ ప్రారంభించారు. అధికారుల సూచన మేరకు కొంత మంది రైతులు 123 జీవోకు అంగీకరించి రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. గతం నుంచి అధికారులు, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అవుతుండటం.. ఎకరాకు లక్ష అంటు అధికారులు, రూ.12లక్షలు ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల సమావేశమైన జాయింట్ కలెక్టర్ రైతులకు డ్రై లాండ్ ఎకరాకు రూ.5.50లక్షలు, తరికి రూ.6లక్షలు చెల్లిస్తామని తేల్చి చెప్పారు. రైతులు అంగీకరిస్తే 123 జీవో ప్రకారం సెటిల్మెంటు చేస్తామని, లేదంటే సాధరణ భూసేకరణ చట్టం ద్వారా నోటీసులు అందించి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వేలు పూర్తికావడంతో పూర్తి వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అప్రోచ్ రోడ్డుకు సంబంధించి 45ఎకరాలకు నోటిఫికేషన్ సైతం వెలువడడంతో అధికారులు రైతులకు ఎటో తేల్చుకోవాలని సూచించారు. ఆమోదం తెలిపిన రైతులకు 123 జీవో ప్రకారం అందించి మిగత వారి పేర్లు సాధారణ భూసేకరణ చట్టం కింద పంపుతామని నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో శుక్రవారం సుమారు 35మంది రైతులు 180ఎకరాల వరకు ఆమోదం తెలుపుతూ రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. ఇష్టం ఉన్న రైతుల పేర్లు పంపిస్తామని, ఇతర రైతులకు మరోమారు అవకాశం ఇచ్చి భూసేకరణ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇప్పటికే సర్వే నంబరు 62, 67, 71, 107, 108, 112, 113, 114, 116,117, 130, 146,147, 198లో భూసేకరణ పూర్తి చేశారు. కార్యాలయం వద్ద అంగీకరించిన రైతులు సంతకాలు చేసేందుకు రావడంతో సందడి నెలకొంది. -
రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో ఇద్దరు రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రెండు నెలల క్రితమే నమోదు కాగా, తాజాగా సదరు అధికారులకు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది. పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని, సరుకుల పంపిణీ రిజిస్టర్లో ఫోర్జరీ సంతకం చేశారనే ఆరోపణలతో సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ సురేశ్తోపాటు రేషన్ డీలర్ శంకర్పై మార్చి 17న సంగారెడ్డి పట్టణ పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని రెవెన్యూ శాఖ బాధ్యులకు కానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తెలియకుండానే దాదాపు రెండు నెలలపాటు అత్యంత గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత రికార్డులు ఇవ్వాలని స్థానిక ఎస్ఐ గణేశ్ సోమవారం సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్కు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది. అసలు కారణం... సంగారెడ్డి పట్టణంలోని మంజీర నగర్ 16వ నంబర్ చౌకధర దుకాణంలో తిరుపతిరెడ్డికి రేషన్కార్డు ఉంది. తనకు కొంతకాలంగా బియ్యం ఇవ్వడం లేదని ఆయన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో గత మార్చి నెలలో ఎస్పీ సుమతిని కలసి ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని పట్టణ సీఐ ఆంజనేయులును ఎస్పీ ఆదేశించారు. అవినీతి ఎలా జరిగింది..? తిరుపతిరెడ్డి పేరుతో ప్రతి నెలా బియ్యం తీసుకుంటున్నట్టు సరుకుల పంపిణీ నివేదికలో పొందుపరిచారు. బియ్యం తీసుకుంటున్నట్టు తిరుపతిరెడ్డి పేరుతో సంతకం కూడా ఉంది. తాను బియ్యం తీసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బాధితుడు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సంతకం ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మార్చి 17న స్థానిక డీలర్ శంకర్, తహసీల్దార్ గోవర్దన్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విషయం వెలుగు చూడడంతో పోలీసులు సదరు అధికారులను అరెస్టు చేస్తారా? లేక మధ్యే మార్గంలో రాజీ కుదిరించుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే ఎస్పీ సుమతి రెవెన్యూ శాఖలో తలదూర్చి పలువురిపై కేసులు నమోదు చేసినప్పటికీ కలెక్టర్ రోనాల్డ్రాస్ మౌనం వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడలేదు: డీలర్ తిరుపతిరెడ్డికి ప్రతినెలా 12 కిలోల బియ్యం కోటా వస్తుందని డీలర్ శంకర్ చెబుతున్నారు. ప్రతి నెలా ఆయన ఎవరినో ఒకరిని పంపుతారని, ఆయన పంపిన వ్యక్తికే బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. -
ఇటుక బట్టీలకు పూడిక మట్టి
► రెవెన్యూ అధికారుల అండతో మాఫియా దందా ► నిర్మాణ పనులకు ఇదే మట్టి శనివారం 120 లారీలతో ► మట్టి తరలింపు పరిశీలన అంటూ ► రెవెన్యూ అధికారుల హడావుడి ► ప్రజాప్రతినిధి నుంచి బెదిరింపులతో వెనుదిరిగిన వైనం సాక్షి, హన్మకొండ : పొలాల్లోకి చేరాల్సిన చెరువు పూడిక మట్టి ఇటుక బట్టీలకు చేరుతోంది. పంట పొలాలకు సారాన్ని అందించేందుకు ఉపయోగపడే ఈ మట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోంది. మామూనూరు కేంద్రంగా సాగుతున్న మట్టి, మొరం మాఫియా మిషన్ కాకతీయ చెరువులపై కన్నేసింది. రైతుల పొలాలకు చేరాల్సిన మట్టితో నిత్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతోం ది. రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ అధికారుల అండతో ఈ దందా కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. మితిమీరిన ఈ దందాపై శనివారం ప్రభుత్వాధికారులు కర్రపెత్తనం చేయబోతే వారిపై ఓ ప్రజాప్రతినిధి కన్నె ర చే శాడు. దీంతో పూడిక మట్టి వ్యాపారం ఆరు లారీలు మూడు బట్టీలు అన్నట్లు సాగుతోంది. సారవంతమైన మట్టి మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా గీసుగొండ మండలం ఊకల్లు చెరువు, వంచనగిరి శాయంపేట చెరువు, చెన్నారం చెరువుల్లో పూడి క నిరంతరంగా తీస్తున్నారు. ఈ చెరువుల్లో పూ డికగా పేరుకుపోయిన నల్లరేగడి ఎంతో సారవంతమైందని వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు నల్లరేగడి మట్టిని రైతుల పొలాల్లోకి ఉచితంగా చేర్చాల్సి ఉండ గా.. మొరం, మట్టి మాఫియా ఇందుకు అడ్డం పడుతోంది. అడ్డదారిలో మామునూరు, నక్కల పల్లి, బొల్లికుంట, తిమ్మాపురం శివారు వద్ద ఉ న్న ఇటుక బట్టీలకు ఈ మట్టిని చేరవేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బట్టీల యజమానుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. అటు అధికారులు, ఇటు మాఫియా సహకారం ఉండడంతో ఇటుక బట్టీ వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ మట్టి కొనుగోలు చేస్తున్నారు. బట్టీల వద్ద టన్నుల కొద్ది మిషన్ కాకతీయ పూ డిక మట్టి నిల్వ చేస్తున్నారు. ఊకల్లు వద్ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూ డు గోదాముల నిర్మాణం జరుగుతోంది. ఈ గో దాముల బేస్మెంట్లలో నింపేందుకు కూడా పెద్దపెద్ద గుట్టలుగా మిషన్ కాకతీయ మట్టి ని ల్వ చేశారు. ఈ మట్టి విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. రెవె న్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల అండతో మిషన్ కాకతీయ మట్టి వ్యాపా రం కొంత కాలంగా జోరుగా సాగుతోంది. టిప్పర్ల జాతర మిషన్ కాకతీయ మట్టి అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే వారు కరువైపోవడంతో శనివారం అక్రమ మట్టి వ్యాపారులు మరింతగా రెచ్చిపోయారు. పట్టపగలు 120 లారీలు, టిప్పర్లను ఏ ర్పాటుచేసి మిషన్ కాకతీయ మట్టిని మామునూరు, నక్కలపెల్లి, తిమ్మాపురం పరిధిలోని ఇటుక బట్టీల వద్దకు తరలించిండం ప్రారంభిం చారు. జాతర తరహాలో మిషన్ కాకతీయ మట్టి ని బట్టీల వద్దకు లారీల్లో తరలి వెళ్తుండడంతో శనివారం ఈ విషయం చర్చనీయాంశంగా మా రింది. దీంతో అధికారుల్లో గుబులు మొదలైం ది. వెంటనే హన్మకొండ తహసీల్ధార్ రాజ్కుమా ర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సదానందం, వీఆర్వో దీపక్తో కలిసి నక్కలపల్లికి వచ్చారు. మిషన్ కాకతీయ మట్టిని తీసుకెళ్తున్న టిప్పర్లు, లారీల ను రోడ్డుపై నిలపగా స్థానికులంతా గుమిగూడారు. నేత నుంచి ఫోన్ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నాయు డు పెట్రోల్ బంక్ సమీపంలో మొరం వ్యాపా రం చేసే ఓ వ్యాపారి ఈ మట్టి మాఫియాకు నేతృత్వం వహిస్తున్నాడు. అధికారులు తమ లారీలను ఆపి అనుమతి పత్రాలను పరిశీలిస్తు న్న విషయం తెలిసిన సదరు మట్టి వ్యాపారి అక్కడకు చేరుకున్నాడు. తనకు అండగా నిలిచి న ఓ ప్రజాప్రతినిధికి ఫోన్లో సమాచారం ఇవ్వ గా... ఆయన నుంచి కాసేపట్లో అధికారులకు మరో ఫోన్ వచ్చింది. దీంతో అనుమతి పత్రాలను పరిశీలించకుండా అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ తతంగం చూస్తూ విస్తుపోవడం స్థానికుల వంతైంది. మిషన్ మట్టి బట్టీలకు పోతోంది మిషన్ కాకతీయ మట్టి తరలింపుకు సంబంధించి లారీలను పరిశీలిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానందం వివరణ కోరగా.... ‘ఊకల్లు చెరువు, శాయింపేట చెరువుల నుంచి మిషన్ కాకతీయ ద్వారా తీసిన పూడిక మట్టిని పంట పొలాలకు తరలించాల్సి ఉండగా బట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందచేస్తాం. మట్టి తరలిస్తున లారీలకు మైనింగ్ పర్మిషన్ ఉండడం వల్ల వెనుతిరిగి వెళ్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. -
టీడీపీ నేతలకు తొత్తులుగా అధికారులు
► వారి ప్రోద్బలంతోనే ఫిర్యాదు ► 15 మంది ‘దేశం’ నాయకుల ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు ► సీఐకి వివరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు పాయకరావుపేట: అధికారపార్టీ నేతలకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ, వారు చెప్పిన దానికల్లా తందాన తాన పాడుతున్నారని మండలంలోని కుమారపురం గ్రామస్తులు, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో తుపాను రక్షిత భవనానికి వెళ్లే దారిలో ఉన్న ఇంటి పునాదిని తొలగించే విషయంమై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ నీలాపు బాలకృష్ణా రెడ్డి , మండల యూత్ అధ్యక్షుడు నీలాపు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన కాలపురెడ్డి వరహాలు రెడ్డి 50 ఏళ్లక్రితం స్థలాన్ని కొనుగోలు చేసి, పునాదినిర్మించుకున్నారన్నారని చెప్పారు. అయితే తుపాను రక్షిత భవనం దారి కోసం బలవంతంగా పునాదిని తొలగించేందుకు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రయత్నం చేస్తునారన్నారు. ఈ ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన 15 మంది నేతల అక్రమణల్లో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకోకుండా... వీఆర్వోచేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, తహసీల్దార్తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గ్రామానికి చెందిన నీలాపు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఆల యానికి, తుపాను రక్షిత భవనానికి, గ్రామ అభివృద్ధికి ఉచితంగా తన సొంత స్థలం ఇచ్చానని చెప్పారు. తాము స్వచ్ఛందంగా స్థలం ఇస్తే రెవెన్యూ అధికారులు గమనించకుండా అధికారు పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను రక్షిత భవనానికి వెళ్లేందుకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డుకు సంబంధించి ఎంత స్థలం సరిపోతుందో పంచాయతీరాజ్ ఇంజినీర్తో పరిశీలన చేయించి, చర్యలు చేపడటామన్నారు. ఎస్ఐవి.సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు. -
పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం
► సుందరయ్యనగర్, ఫెర్రీ నిర్వాసితుల నుంచి డబ్బుల వసూలు ► కాచవరం కొండల్లో స్థలాల కేటాయింపు ► కనీస సౌకర్యాలు లేవని బాధితుల ఆందోళన ఇబ్రహీంపట్నం : పుష్కర నిర్వాసితులకు పట్టాల కేటాయింపులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండలంలోని సుందరయ్య నగర్, ఫెర్రీ రహదారిలోని ఈ నిర్వాసితులకు కాచవరం గ్రామంలో కేటాయించిన స్థలం కొండలు, గుట్టల మధ్యన ఉండటంతో కనీస సౌకర్యాలు కూడా లేనిచోట నివసించేది ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నిర్విరామ కృషి చేశారు. పేదలకు స్థలాలు ఇచ్చేలా అధికారులపై వైఎస్సార్ సీపీ పోరాడింది. ఈ క్రమంలో నిర్వాసితులు సుమారు 450 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి ఇంటింటికి తిరిగి తగిన ఆధారాలతో నివేశన స్థలం పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుందరయ్యనగర్లో 233 మందికిగాను 92 మందికి, ఫెర్రీ రహదారిలో 213 మందికిగాను కేవలం 65 మందికి మాత్రమే పట్టాలు అందజేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆధారాలు చూపిన అనంతరం పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వసూళ్లకు తెరతీసిన తమ్ముళ్లు పట్టాల కేటాయింపులో అధికారులు ఇంటి పన్నును ప్రామాణికంగా తీసుకోవటంతో టీడీపీ వార్డు సభ్యురాలి భర్త డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. పన్ను ఆధారాలు లేనివారికి ఇంటి పన్ను, పట్టా, ప్లాటు కేటాయింపు వరకు మేమే చూసుకుంటామని ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ వార్డు సభ్యులే ఆరోపణలు చేయటం గమనార్హం. కొండలు, గుట్టల్లో స్థలాలు కాచవరంలోని సర్వే నంబర్ 8లోని 9.30 ఎకరాల కొండ పోరంబోకు స్థలంలో పుష్కర నిర్వాసితులకు 465 ప్లాట్లు ఏర్పాటు చేశారు. పట్టాలున్న వారికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కొండలు, రాళ్లగుట్టల మధ్య స్థలాలు కేటాయిస్తే నివాసాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. నివాసయోగ్యంగా లేదు ఫెర్రీ రహదారిలో నా ఇం టిని కూల్చేశారు. రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. ఇక్కడకు వస్తే ఇవన్నీ కొండలు, గుట్టల మధ్య స్థలం ఉంది. సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదు. - గుమ్మడిదల హనుమంతరావు, నిర్వాసితుడు ఎడారిని తలపిస్తోంది పుష్కర బాధితులకు కేటాయించిన స్థలం ఎడారిని తలపిస్తోంది. రాళ్లగుట్టల మధ్య ప్లాట్లు ఏర్పాటు చేశారు. రహదారి సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. - చాగంటి దుర్గారావు, నిర్వాసితుడు -
కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీలు
ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ * మూడు నమూనాలు సిద్ధం చేసిన సీసీఎల్ఏ * ‘ట్రాక్’ సహాయంతో కొత్త హద్దులతో మ్యాపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరుసగా సమీక్షలు నిర్వహించడంతో... రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు శాటిలైట్ మ్యాపులు, గూగుల్ మ్యాపులను ఆధారంగా చేసుకుని కొత్త జిల్లాల హద్దులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. జిల్లాల ఏర్పాటుపై ముందు నుంచి కసరత్తు చేస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 3 నమూనాల్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిలో ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి.. కొత్త జిల్లాల తుది స్వరూపాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఇచ్చిన మూడు నమూనాలకు సీసీఎల్ఏ వేర్వేరు ప్రాతిపదికలను అనుసరించింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఉండేలా ఒక నమూనా, జనాభా ప్రాతిపదికన మరో నమూనా, అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా మరో నమూనాను రూపొందించినట్లు సమాచారం. అదనంగా 14 జిల్లాల వరకు పెంచేందుకు వీలుగా ఈ నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) సహాయంతో సీసీఎల్ఏ ఈ మ్యాప్లను తయారు చేయించారు. ఇదే తీరుగా సరిహద్దు నమూనాలతో మరిన్ని మ్యాప్లు తయారు చేయాలని సంబంధిత నిపుణులకు ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పరిధిలో జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు దూరం 60 కిలోమీటర్లకు మించకుండా ఉండేలా చూడాలన్న సీఎం సూచనకు అనుగుణంగా శాస్త్రీయంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అభిప్రాయ సేకరణకు కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ తాజాగా బాధ్యతలు అప్ప గించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరు నేతలతో కూడిన 9 కమిటీలను నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండా లి, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ 9 కమిటీల సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. హైదరాబాద్లో పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతా ఆయనకే అప్పగించారు. మెదక్ జిల్లాలో హరీశ్ సూచనల మేరకు కమిటీ పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం. పునర్విభజన కమిటీల సభ్యులు ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు రంగారెడ్డి: మహేందర్రెడ్డి, కృష్ణమూర్తి నల్లగొండ: జగదీశ్రెడ్డి, గ్యాదరి కిషోర్ మహబూబ్నగర్: నిరంజన్రెడ్డి, గువ్వల బాలరాజు నిజామాబాద్: ప్రశాంత్రెడ్డి, గంప గోవర్ధన్ కరీంనగర్: వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆదిలాబాద్: లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి మెదక్: శేరి సుభాష్రెడ్డి, మానిక్రెడ్డి వరంగల్: పెద్ది సుదర్శన్రెడ్డి, మధుసూదనాచారి -
సీబీఐ విచారణతో రెవెన్యూ వర్గాల్లో కలకలం
► తప్పుడు పత్రాలతో రూ.31.83 కోట్ల ► రుణం పొందిన ఘనులు ► బెంగళూరు నుంచి వచ్చి ► దర్యాప్తుచేసిన సీబీఐ డీఎస్పీ పడన రూరల్ : సీబీఐ దాడులతో పెడన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. తప్పుడు ధ్రువపత్రాలతో గుడివాడ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.31.83 కోట్ల రుణాలు పొందిన వ్యక్తి పెడన మండలంలో చేపల చెరువులు ఉన్నట్లు చూపించిన వైనంపై కేసు నమోదైంది. విజయవాడకు చెందిన వీనస్ ఆక్వా ఫుడ్స్ ైప్రైవేటు లిమిటెడ్ యజమాని నిమ్మగడ్డ రామకృష్ణ, పెడన , బంటుమిల్లి, గుడివాడ, అవనిగడ్డకు చెందిన నలుగురు వ్యక్తులు గుడివాడ ఆంధ్రాబ్యాంకులో రూ.31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి 2010లో రూ.31.83 కోట్లు రుణం పొందారు. హామీగా పెడన మండలం నందమూరు గ్రామం లజ్జబండ కాలువకు అనుకుని ఉన్న (నందమూరు నుంచి మడక మీదుగా బల్లిపర్రు వెళ్లే మార్గం) 31.97 ఎకరాల చేపల చెరువులను చూపించారు. హామీ దారుల్లో ఒకరైన పామర్రు మండలానికి చెందిన ఆరేపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు ఆరేపల్లి వెంకటనాగరమేష్, మరి కొందరి పేరుతో నందమూరులో 31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు అప్పటి వీఆర్వో కూనపురెడ్డి వీరమోహనరావు ధ్రువీకరించిన పత్రాలను బ్యాంకులో సమర్పించారు. ఈ పత్రాలు అసలైనవా? కావా? తేల్చాలంటూ బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు ఏప్రిల్ ఆఖరి వారంలో పెడన తహసీల్దార్కు లేఖ పంపించారు. ఏప్రిల్ 29న బెంగళూరులోని తమ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ డి.వి.ఎస్.ఎల్లారావు ఆ రోజున డెప్యూటీ తహసీల్దార్ కుమార్ను బెంగళూరు పంపించారు. కుమార్ అందించిన వివరాలను తీసుకుని సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర గురువారం సాయంత్రం పెడన వచ్చి, చేపల చెరువులున్న ప్రాంతంలో విచారణ చేశారు. అయితే ఆ చెరువుల సర్వే నంబర్లు వేరొకరి పేరుతో ఉండడంతో సీబీఐ డీఎస్పీ అవాక్కయ్యారు. మరి కొన్ని సర్వే నంబర్లు నందమూరులో లేవని స్థానిక వీఆర్వో రాజును విచారించిన సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర తెలుసుకున్నారు. ఆరేపల్లి వెంకట నాగరమేష్ తమ్ముడు, అన్నయ్య పేరుతో నందమూరులో చేపల చెరువులున్నట్లు గుర్తించారు. సీబీఐ విచారణ రెవెన్యూ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
రోడ్డున పడ్డ బతుకులు
► అక్రమణలపేరుతో పేదల ఇళ్లు నేలమట్టం ► అధికారులపై బాధితుల మండిపాటు చిత్తూరు(రూరల్)ః నగరంలోని గంగినేరు చెరువు ఆక్రమణకు గురైందంటూ బుధవారం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పట్టించుకోలేదు. చావనైన చస్తామని మా ఇళ్లను కూల్చడానికి మేం అంగీకరించమని జేసీబీలను అడ్డుకున్నా, అధికారుల్లో కాస్త కనికరం కూడా కనబడలేదు. స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని గుండెలు బాదుకున్నా, అధికారులు వినలేదు. గంగినేరు చెరువు ఆనుకోని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ స్థలం ఆక్రమణకు గురైందని బుధవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండానే ఇళ్లను కూల్చడంపై బాధితులు విరుచుకుపడ్డారు. 60 ఏళ్లుగా ఇక్కడ కాపురముంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లను తొలగిస్తే ఎక్కడి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కడ తలదాచుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని అధికారులను బతిమిలాడిన కనికరించలేదని వారు మండిపడ్డారు. ఈ సంఘటనపై చిత్తూరు ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని, ఓట్లు దండుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడ లేదని ఆయనపై మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైతే మాజీ ఎమ్మెల్యే సీ.కే బాబు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను తొలగించడంపై అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. -
రెవెన్యూ అధికారులకు నోటీసులు
తెర్లాం రూరల్ : సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి, పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి నోటీసులు అందాయని ఫిర్యాదుదారుడు కె.ధనప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పెరుమాళి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 29లో గల యర్ర చెరువులోని అక్రమణదారుల వివరాలు కావాలని కోరగా, సరైన వివరాలు అందివ్వలేదన్నారు. దీంతో తాను సమాచార హక్కు చట్టం కమిషనర్కు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆయన ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టననున్న విచారణకు హాజరుకావాలని తనతో పాటు తహశీల్దార్, ఆర్డీఓలకు నోటీసులు పంపించారని చెప్పారు. -
పాలమూరులో 17 బాల్య వివాహాలకు బ్రేక్
సాక్షి నెట్వర్క్ మహబూబ్నగర్: జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు బుధవారం ఒకేరోజు 17 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధన్వాడ మండలం కిష్టాపూర్కు చెందిన ఓ బాలికకు చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి యువకుడితో ఈనెల 21న వివాహం జరగాల్సి ఉండగా అధికారులు అడ్డుకున్నారు. బాలానగర్కు చెందిన ఓ బాలి కను మద్దూరు మండలం వీరారానికి చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 22న లగ్నం చేయాలని నిర్ణయించారు. ఇదే మండలం వీరన్నపల్లికి చెందిన 15 ఏళ్ల బాలికకు కొత్తూరు మండలం చలివేంద్రంపల్లికి చెందిన ఓ యువకుడితో గురువారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దౌల్తాబాద్ మండలం బాలంపేటకు చెందిన పదో తరగతి పూర్తయిన ఓ బాలికకు ఈ నెల 21న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బాలికను కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి బుధవారం ఉదయం వివాహం జరిపిం చేందుకు నిశ్చయించారు. ఇంటర్ చదువుతున్న భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన ఓ బాలి కకు ఈ నెల 23న, మరో బాలికకు ఈనెల 29న వివాహం చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్తమొల్గరకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఈ నెల 27న పెళ్లి కుదుర్చారు. కరివెన పంచాయతీ ముస్లాయిపల్లి తండాకు చెందిన బాలికకు ఈ నెల 27న లగ్నం నిర్ణయించ తలపెట్టారు. కరివెనకు చెందిన బాలికకు ఈ నెల 22న, తాటికొండలో మరో బాలికకు అదేరోజున పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఇటిక్యాల మండలం కొండేరులో మరో బాలిక పెళ్లిని, జడ్చర్లకు చెందిన బాలిక పెళ్లిని, పెద్దకొత్తపల్లిలో 4 బాల్య వివాహాల్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. -
మృత్యు శతకం
► రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ బాధితులు ► ఇప్పటిదాకా దాదాపు వంద మంది మృతి ► 14 మందేనంటున్న అధికారులు ► ఎక్స్గ్రేషియాపై కొరవడిన స్పష్టత అనంతపురం అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ‘అనంత’ అగ్నిగోళంగా మారింది. వడదెబ్బకు జనం మృత్యువాత పడుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద మంది చనిపోయారు. అధికారులు మాత్రం ‘అంత’ లేదంటున్నారు. 14 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నారు. వారు చెబుతున్న సంఖ్య వాస్తవ విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన మార్చి నుంచి ప్రతి రోజు సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతూనే ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లోనే 10 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడదెబ్బకు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారు, పేదలే కావడం గమనార్హం. అన్నీ కాదంటున్న అధికారులు వైద్యులు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలన్నీ వడదెబ్బ కారణంగా సంభవించినవి కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారి దృష్టికి 40 వరకు కేసులొస్తే అందులో 14 మాత్రమే వడదెబ్బతో చనిపోయినవిగా నిర్ధారించారు. మిగతా వారు అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేల్చారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారుల వాదన ఇలా ఉంది. ‘గుండె జబ్బులు, బీపీ, ఇతర వ్యాధులు ఉన్నవారు ఎందుకు ఎండలో తిరగాలి? ఉపాధి పనులు కూడా ఉదయం 6 నుంచి 10లోపు ముగించాలని చెబుతున్నాం కాదా! ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయించాం. ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎండలోకి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతే అది వడదెబ్బ మృతి ఎలా అవుతుంది?’అని లాజిక్లు మాట్లాడుతున్నారు. ఎక్స్గ్రేషియా ఎంతిస్తారో... వడదెబ్బ మృతులకు ఎక్స్గ్రేషియా ఎంత ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని, అయితే అది ఎంత మొత్తం నిర్ధారణ కాలేదని అంటున్నారు. జీవో విడుదల చేస్తేకానీ చెప్పలేమంటున్నారు. ప్రజాశ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు. అందుకే వడదెబ్బ మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. చనిపోయిన వారంతా పేదలే. పౌష్టికాహారం లేక రోగనిరోధక శక్తి తగ్గి.. ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్నారంటే వడదెబ్బ మృతి కిందకే వస్తుంది. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. -
చెరువు శిఖం.. మాయం
ఇప్పటికే 40 ఎకరాలు కబ్జా పోటీపడి వాలుతున్న అక్రమార్కులు తాజాగా మూడెకరాల ఆక్రమణకు యత్నం అంతుచిక్కని రెవెన్యూ అధికారులు మౌనం పరకాల : పరకాల పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. దామెర చెరువు శిఖం భూమిపై రెక్కలు కట్టుకుని వాలుతున్నారు. అసలు శిఖం భూమా.. లేక పట్టా భూమా అనే విషయం రెవెన్యూ అధికారులు వెల్లడించకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నారుు. శిఖం భూమిని రక్షించాలని పలువురు నేరుగా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం చూస్తే వీరి పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నారుు. గతంలో కబ్జాకు గురైన భూమిని వెలికి తీయడంలో వెనుకంజ వేసిన అధికారులు ఇప్పుడు మరో ఆక్రమణ జరుగుతుంటే కూడా నోరు మెదపడం లేదు. కాకతీయుల కాలంనాటి దామెర చెరువు శిఖం భూమి రోజురోజుకూ తగ్గిపోతోంది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 604లో దామెర చెరువు శిఖం భూమి 103 ఎకరాల 20గుంటలు ఉంది. కానీ, ఇప్పుడు సుమారు 40 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కులు దర్జాగా కబ్జా చేయడంతో 2012లో అప్పటి జారుుంట్ కలెక్టర్కు పట్టణ ప్రజలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా జేసీ దామెర చెరువు వద్దకు వచ్చి విచారణ జరిపారు. 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించి నోటీసులను సైతం అందించారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ నోటీసుల విషయం అటకెక్కింది. ట్యాంక్బండ్ పనులతో తెరపైకి.. పట్టణం క్రమంగా విస్తరిస్తుండడంతో దామెర చెరువు ఆయకట్టు కింద నివాస ప్రాంతాలు వెలిశాయి. పారకం లేక చెరువులోనే నీళ్లు నిల్వ ఉంటున్నారుు. సమ్మర్ స్టోరేజీగా ఉపయోగించాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో దామెరు చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. మినీ ట్యాంకుబండ్గా తీర్చిదిద్దడం కోసం రూ.3.80కోట్లు మంజూరయ్యాయి. రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి ఇరిగేషన్ అధికారులకు అప్పగిస్తే పనులు చేయాలి. కానీ తూతూమంత్రంగా సర్వేను చేసి అప్పగించడంతో తరుచూ వివాదం తలెత్తుతోంది. చెరువు శిఖంలో తమ భూమి ఉన్నదని కొందరు అంటున్నారు. గజం భూమికి వేలల్లో ధర పలుకుతుండడంతో అక్రమార్కులు ఏదో సాకుతో శిఖంపై వాలుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దామెర చెరువు భూమిలో తమకు మూడు ఎకరాల భూమి ఉందని బుధవారం పూడిక మట్టితో నింపడం ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు. చెరువు మధ్యలోకి పోయి మరీ మట్టిని పోసి చదును చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయూన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్కు సమాచారం అందించడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి పోయవద్దని నిలిపివేశారు. ఇప్పటికైనా చెరువు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
తహసీల్దార్లపై బదిలీ వేటు
అవినీతి ఆరోపణలే కారణమా..? సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో నలుగురు తహసీల్దార్లపై బదిలీ వేటు పడింది. ప్రధాన మండలాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు జైనథ్ మండల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు తహసీల్దార్లను లూప్లైన్ పోస్టులకు బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ తహసీల్దార్గా పనిచేసిన సుభాష్చందర్, జైనథ్ తహసీల్దార్ సంజయ్కుమార్ను కలెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల తహసీల్దార్గా ఉన్న కాసబోయిన సురేష్కు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల విభాగం ఆసిఫాబాద్కు బదిలీ అయింది. అలాగే నిర్మల్ తహసీల్దార్ నారాయణను ఖాళీగా ఉన్న లక్ష్మణచాంద తహసీల్దార్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో ఆదిలాబాద్ తహసీల్దార్గా ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న వర్ణను నియమించారు. అలాగే నిర్మల్ తహసీల్దార్గా అక్కడి ఆర్డీవో కార్యాలయంలోని ఏవో శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చారు. చెన్నూరు తహసీల్దార్గా పనిచేస్తున్న దిలీప్కుమార్ను మంచిర్యాల తహసీల్దార్గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాంసి తహసీల్దార్ రాంరెడ్డికి జైనథ్ తహసీల్దార్గా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. సిర్పూర్-యు తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ సెలవుపై వెళ్లడంతో ఉట్నూర్ తహసీల్దార్ రాథోడ్ రమేష్కు బాధ్యతలు అప్పగించారు. వీరందరికీ ఎఫ్ఏసీగా బాధ్యతలు ఇచ్చారు. ఆరోపణలే కారణమా? ఈ బదిలీల వెనుక పలు ఆరోపణలే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తవుతోంది. కానీ.. రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం పరిపాలన సౌలభ్యం కోసమే బదిలీ చేశామని చెప్పుకొస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. అధికారుల కళ్లముందే అన్యాక్రాంతమవుతున్నా.. కళ్లు మూసుకుని పరోక్షంగా కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు కొందరు తహశీల్దార్లు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో రూ.కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలాచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవడమే ఇందుకు నిదర్శనం.. ఈ నేపథ్యంలో తహసీల్దార్ల ఆకస్మిక బదిలీలు రెవెన్యూ వర్గాలతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
చావనైనా చస్తాం.. సెంటు భూమి ఇవ్వం
పరిశ్రమల పేరుతో దోచుకుంటారా? ప్రభుత్వంపై నమ్మకం పోయింది రెవెన్యూ అధికారులపై ఆగ్రహించిన అన్నదాతలు తొట్టంబేడు: ‘తహశీల్దార్గారు చావనైనా చస్తాంగానీ సెంటు భూమి ఇవ్వం. ఒకవేళ లాక్కున్నా ఊరుకోం’ అంటూ అన్నదాతలు మండిపడ్డారు. పరిశ్రమల కోసం భూములు సేకరించడానిక వెళ్లిన రెవెన్యూ అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పరిశ్రమలతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పిన అధికారులకు రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. ఈ సంఘటన ఆదివారం తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. తహశీల్దార్ చంద్రమోహన్తో పాటు పలువురు ఆర్ఐలు, వీఆర్వోలు రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులు సేకరిం చడం కోసం తొట్టంబేడు వుండలంలోని చొడవరం, చేవుూరు, చియ్యువరం, కాసరం, సిద్దిగుంట గ్రావూల్లో పర్యటించారు. తహశీల్దార్ మాట్లాడుతూ పరిశ్రవుల కోసం రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులను ఇవ్వాలన్నారు. భూవుులిచ్చిన రైతులకు అంతో ఇంతో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. దీంతో ఆగ్రహం చెందిన చేవుూరు గ్రావుస్తులు ‘పరిశ్రవుల పేరుతో రైతులను దోచుకోవాలని చూస్తున్నారా? ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్కహామీనైనా నిలబెట్టుకుందా? చావనైనా చస్తాంగానీ మా భూవుుల జోలికి వస్తే ఊరుకోవుని హెచ్చరించారు. దాంతో ఖంగుతిన్న రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. తర్వాత చోడవరం గ్రావూనికి వెళ్లారు. అక్కడ కూడా అధికారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ‘సార్ ప్రభుత్వం ఎలాగూ మమ్మల్ని పట్టించుకోదు, మేవుు వూ కష్టంతో ప్రశాంతంగా జీవిస్తున్నాం, ఇలా కూడా బతకనీయురా’ అంటూ రైతులు వుండిపడ్డారు. చియ్యువరం, కాసరం గ్రామాల్లోనూ రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. సోవువారం నుంచి వుండలంలో రోజుకు ఐదు గ్రావూల్లో భూసేకరణ చేపట్టాలని ప్రణాళిక వేసుకున్న అధికారులు ప్రస్తుతం వాటికి జోలికి పోతే కొట్టేలా రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు తాత్కాలికంగా భూసేకరణ కార్యక్రవూన్ని విరమించుకోవాలని రెవెన్యూ అధికారులు అనుకున్నట్లు సమాచారం. -
బాల్య వివాహానికి బ్రేక్
కన్నీటి పర్యంతమైన బాలిక కుటుంబీకులు అధికారులపై ఆగ్రహం పెద్దేముల్: మరో అరగంటలో వివాహం జరగాల్సి ఉండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని అడ్కిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని నీలమ్మ, లక్ష్మప్ప దంపతుల రెండో కూతురు (16)ను బషీరాబాద్ కాశీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం. దీంతో కుటుంబీకులు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువుల కోసం వంటలు కూడా చేశారు. మరో 30 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెద్దేముల్ తహసీల్దార్ గంగాధర్, ఎస్ఐ కృష్ణ, చైల్డ్లైన్ అధికారులు అక్కడికి చేరుకొని పెళ్లిని నిలిపివేశారు. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని స్పష్టం చేశారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అధికారులు పెళ్లిని అడ్డగించడంతో బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. బోనఫైడ్లు చూడాలి.. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పురోహితులు అమ్మాయిల బోనఫైడ్ సర్టిఫికెట్లు చూసి పెళ్లిళ్లు చేయాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీటల మీద ఆగిన పెళ్లి.. షాబాద్: పీటల మీద పెళ్లి ఆగిపోయింది. బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరులో బుధవారం చోటుచేసుకుంది. ఆర్ఐ రాజు, ఏఎస్ఐ శంకరయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగుల పెంటయ్య కూతురు(15)ను అదే గ్రామానికి చెందిన కప్పెర యాదయ్య కుమారుడు ప్రకాశ్కు ఇచ్చి వివాహం చేసేందుకు బుధవారం ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో 20 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. బాలికను నగరంలోని శిశువిహార్కు తరలించారు. అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
మృత్యువును వెతుక్కుంటూ వెళ్లారు!
మరికొన్ని గంటల్లో తెల్లారుతుంది. అప్పటిదాకా బోరు తవ్వకాన్ని ఆసక్తిగా గమనించిన వారు పచ్చటి పంట పొలంలో నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపట్లోనే గాఢనిద్రలోకి జారుకున్నారు. అదే ‘శాశ్వత నిద్ర’ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. బోర్వెల్ లారీ రూపంలో మృత్యువు వారిని కబళించుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. శెట్టూరు మండలం పర్లచేడులో శనివారం తెల్లవారుజామున బోర్వెల్ లారీ దూసుకెళ్లి నలుగురు దుర్మరణం చెందారు. వారంతా రెక్కల కష్టంపై ఆధారపడ్డ కూలీలు.. ఉగాది పండుగ కావడంతో ఇంటి పట్టునే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి హాయిగా పండుగ చేసుకున్నారు. రాత్రైంది. అంతా కలసి భోజనాలు చేశారు. ఎంతకూ నిద్ర రాకపోవడంతో గ్రామ సమీపంలో బోరు వేస్తున్నారని అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రయ్యేసరికి అలసటకు తోడు చల్లని గాలి వీచడంతో వారంతా పొలంలోనే నిద్రించారు. అంతే.. బోరుబండి వారి జీవితాలను బుగ్గి చేసింది. తెల్లారేసరికి ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ఊరంతా ఉలిక్కిపడింది. చనిపోయిన నలుగురి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కళ్యాణదుర్గం : ప్రమాదవశాత్తు బోర్వెల్ లారీని రివర్స్లో నడపగా వెనుక భాగంలో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో శెట్టూరు మండలం పర్లచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో బోయ సంజీవ (38), బోయ తిమ్మప్ప (35), బోయ మాంతేష్ (30), నరసింహమూర్తి (28) మృతి చెందారు. ఒకేరోజు నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దలు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆయా కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. మృతులంతా కూలీ పని చేసుకుని కుటుంబాల్ని పోషించుకునేవారు. అలాంటి వారు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబ సభ్యుల పోషణ చూసే వారు కరువయ్యారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతుల కుటుంబ స భ్యులు, భార్యలు, పిల్లల రోధనలు చూపరులను కలిసివేశాయి. ‘మాకు ఇక దిక్కెవరంటూ.. గుండెలు బాదుకుని రోధించారు.’ మృతులంతా కూలీలే... ప్రమాదంలో మృతి చెందిన బోయ సంజీవ, బోయ తిమ్మప్ప, బోయ మాంతేష్, నరసింహమూర్తి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సంజీవ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య నాగలక్ష్మి, కుమార్తె బుజ్జెమ్మ, కొడుకు తిప్పేస్వామి ఉన్నారు. బోయ తిమ్మప్ప స్వగ్రామం బొచ్చుపల్లి కాగా పదేళ్ల క్రితం పర్లచేడులో బయలమ్మను పెళ్ళి చేసుకుని అదే గ్రామంలో స్థిరపడ్డాడు. బోయ మాంతేష్ కూడా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మిదేవి, 18 నెలల కూతురు అక్షిత ఉన్నారు. నరసింహమూర్తి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వికలాంగురాలైన తల్లి హనుమక్క ఆలనాపాలన కోసం టైలర్ పనిచేస్తూ కాలం గడిపేవాడు. మృతుల్లో ఇద్దరు బావ, బామర్దులు, మరో ఇద్దరు స్నేహితులు.. మృతుడు సంజీవ పిన తల్లి సుశీలమ్మ కూతురు బయలమ్మను మృతుడు తిమ్మప్ప పెళ్ళిచేసుకోగా వీరిద్దరూ బావ, బామర్దులు. అదేవిధంగా మృతుడు సంజీవ, నరసింహమూర్తి ప్రాణస్నేహితులు. ఎక్కడికెళ్లాలన్నా కలిసిమెలిసి వెళ్లేవారు. చివరికి మరణంలో కూడా వారి బంధం వీడలేదు. కాగా... రెవెన్యూ అధికారులు వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దీంతో అమాయకులైన పేదలు నలుగురు బలి కావాల్సి వచ్చిందని శెట్టూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతదేహాలతో శెట్టూరులో బైఠాయించి ఆందోళన చేపట్టారు.