Toilet construction
-
తాగునీటికి తిప్పలు.. ఒకటికొస్తే అవస్థలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రహసనంగా మారింది. సరైన వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు వేచి ఉండలేక ఇళ్లకెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని 7,021 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం, 1,811 కేంద్రాలకు తాగునీటి వసతి ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024–25లో రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియనున్నా వేగం పుంజుకోవడం లేదు. పురోగతి లేని పనులు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. వీటిల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తారు. సమగ్ర పౌష్టికాహారాన్ని అక్కడే వండి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల వండిన ఆహారానికి బదులుగా ముడిసరుకునే అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని కేంద్రాలకు వీటిని మంజూరు చేసింది. 7,021 కేంద్రాలకు టాయిలెట్లు మంజూరు చేయగా... ఇందులో కేవ లం 1,015 టాయిలెట్లకు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 1,738 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా..4,268 కేంద్రాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు.అదేవిధంగా 1,864 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి వసతికి సంబంధించి పనులు మంజూరు కాగా కేవలం 289 మాత్రమే పూర్తయ్యాయి. మరో 406 కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా.. 1,169 కేంద్రాల్లో అసలు ప్రారంభమే కాలేదు. పాలకవర్గాలు లేకపోవడమే కారణం? ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులు ప్రారంభించకుంటే మంజూరైన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది. అంగన్వాడీల్లో వసతుల కల్పనలో స్థానిక సంస్థల పాత్రే కీలకం. కానీ పాలకమండళ్లు లేకపోవడం, ప్రత్యేక పాలన కొనసాగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొంటున్నారు.మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఇదీ. ఇక్కడ 22 మంది చిన్నారులున్నారు. టాయిలెట్ అసంపూర్తిగా ఉండటంతో రోడ్డుపైనే లఘుశంక తీర్చుకుంటున్నారు. ఈ కేంద్రంలో తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నారులు, ఈ కేంద్రానికి వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు
సాక్షి, వరంగల్: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్మాల్పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మించకున్నా బిల్లులు.. గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 లక్షలు డ్రా.. బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్మాల్ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్చార్జ్ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్ లావుడ్య రమేష్నాయక్, ఉప సర్పంచ్ ఉపేందర్ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.440 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.440 కోట్లతో ప్రత్యేక నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విజయవాడలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా పాఠశాలల్లో విద్యార్థినులకు, మహిళా టీచర్లకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారని.. వారి కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. బుక్స్, బ్యాగ్స్, షూస్, డ్రస్, గ్రీన్ బోర్డు, కాంపౌండ్ వాల్స్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి ఆదిమూలపు చెప్పారు. -
మరుగుదొడ్ల నిర్మాణం.. టీడీపీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్లు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టుకోవడానికి రుణం కోసం వెళ్లిన వారికి ఇప్పటికే మీ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ అధికారులు ఇస్తున్న సమాధానంతో వారు కంగుతింటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారుస్తున్నామంటూ హడావుడి చేసి జిల్లా వ్యాప్తంగా వేలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనే మరొకటి ఇటీవల వెలుగు చూసింది. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో 2018లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..) అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన పలువురు కొంత కాలంగా గ్రామ సచివాలయానికి వెళ్లి తాము మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పరిశీలించగా.. వారి పేర్లతో 2018లోనే మరుగుదొడ్ల కోసం రుణం తీసుకున్నట్లు ఉంది. దీంతో వారు మీపేరు మీద మరుగుదొడ్డి తీసుకున్నట్లుగా ఉంది. అసలు తాము మరుగుదొడ్డి ఇంటి వద్ద నిర్మించుకోకుండా ఎలా బిల్లులు చేశారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. (చదవండి: ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి) గ్రామ టీడీపీ నేత చేతివాటం 2018లో గ్రామంలో సుమారు 266 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పి.శ్రీనివాసరావు ఓ తాపీ మేస్త్రి పేరుతో కాంట్రాక్టు పొందారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.15 వేలు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో గ్రామంలో లేనివారు, చనిపోయినవారు, మరుగుదొడ్డి నిర్మించుకోని వారి ఆధార్ కార్డుల నంబర్లను తీసుకుని వారి పేర్లు మీద మరుగుదొడ్లు నిర్మించినట్లుగా నగదును డ్రా చేసినట్లు సమాచారం. ఇది అప్పట్లో ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పర్యవేక్షణలో జరిగాయి. ఈ నిర్మాణాల గురించి పట్టించుకోకుండా దొడ్లు కట్టించిన తెలుగుదేశం నాయకుడి మాటే వేదవాక్కుగా దొంగ సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. మొత్తం 266 మరుగుదొడ్లలో రెండు వందలకుపైగా మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించిన సదరు నేతను నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఏం చేస్తారని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు తాము మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. మరుగుదొడ్డి నిర్మించినట్టు రికార్డుల్లో ఉంది మరుగుదొడ్డి నిర్మించుకుందామని గ్రామ సచివాలయానికి వెళ్లి నాపేరు అన్లైన్లో నమోదు చేయించుకోవడానికి దరఖాస్తు ఇచ్చాను. కంప్యూటర్లో నాపేరును నమోదు చేస్తుంటే మరుగుదొడ్డికి రుణం నేను గతంలో తీసుకున్నట్లు ఉంది. నాపేరు మీద మరుగుదొడ్డి డబ్బులు ఎవరు తీసుకున్నారని సచివాలయంలో అడగ్గా మరుగుదొడ్లు కాంట్రాక్టు చేసిన పిల్లల శ్రీను తీసుకున్నారని చెప్పారు. – చీదరాల కృష్ణకుమారి, అయ్యపరాజుగూడెం నిర్మించకుండానే డబ్బులు కాజేశారు నాకు మరుగుదొడ్డి నిర్మిస్తానని చెప్పి పిల్లల శ్రీను అనే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అ తరువాత వచ్చి నీ కార్డు అన్లైన్ కావటం లేదు దొడ్డి రాదని చెప్పారు. తీరా ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్డి నిర్మించుకుందామని సచివాలయానికి వెళ్లి అడిగితే ఆధార్ నంబరు కొట్టి చూస్తే మరుగదొడ్డి కట్టినట్లుగా నాపేరు మీద రూ.15 వేలు నగదు తీసుకున్నట్లుగా ఉంది. – యర్రా జయమ్మ, అయ్యపరాజుగూడెం ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం అవకతవకలు విషయం ఇప్పటి వరకు నాదృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఫిర్యాదుచేస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఎంపీడీఓ, లింగపాలెం -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
ఓడీఎఫ్ సాధ్యమేనా.?
సాక్షి, ఆదిలాబాద్ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్గా ప్రకటించబడుతాయి. దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్హెచ్ఎల్) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్ కింద 59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.? జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓడీఎఫ్గా ప్రకటిస్తే.. జిల్లాను ఓడీఎఫ్గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. -
మరుగుదొడ్లు నిర్మించకపోతే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, నర్సాపూర్: మరుగుదొడ్లు నిర్మించకపోయినా, నిర్మించిన వాటిని వాడకపోయినా వారికి ప్రభుత్వం పథకాలు నిలిపివేస్తామని చేస్తామని డీపీవో హనోక్ తెలిపారు. గురువారం చిలప్చెడ్ మండలంలోని సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని పలు కుటుంబాల కరెంట్, నల్లా కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా డీపీవో హనూక్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛత విషయంలో సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ అట్టడుగు స్థాయిలో ఉందని ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మొత్తం 430 మరుగుదొడ్ల నిర్మాణాలకు గానూ కేవలం 350 మాత్రమే పూర్తయ్యాయని, ఎన్నిసార్లు అధికారులు స్వచ్ఛత గురించి అవగాహన కల్పించినా గ్రామస్తులు మారకపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఉమ్మడి సోమక్కపేట్ నుంచి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన సామ్లా తండా, రహీంగూడ గ్రామాలలో సైతం మరుగుదొడ్లు పరిశీలించి, నిర్మించుకోని పలు కుటుంబాలకు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలైన రేషన్, పింఛన్ తదితర వాటిని కూడా తొలగిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్లు వెంటనే నిర్మించుకున్న వారికి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దేవయ్య, ఎంపీడీఓ కోటిలింగం, ఏపీవో శ్యాంకుమార్, మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు, సామ్లా తండా సర్పంచ్ భిక్షపతి నాయకులు లక్ష్మణ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్
సాక్షి, నల్లగొండ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.12వేలు చెల్లిస్తారు. అయితే పథకం ఈనెల చివరి నాటికి పూర్తవుతుంది. దాంతో ఆ తర్వాత నిర్మించుకున్న మరుగుదొడ్డికి కేంద్ర నిధులు అందే అవకాశం లేదు. ఆ స్కీం సమయం పూర్తవుతున్నందున ఈలోపు నిర్మించుకుంటేనే ఇటు మరుగుదొడ్డి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఈనెల 30లోపు ఎవరైతే మరుగుదొడ్లు మంజూరై నిర్మాణం చేసుకోకుండా ఉంటారో వారికి రేషన్ కట్ చేయడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ రుణాలను నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఇంకా మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బహిర్భూమికి వెళ్తున్నారు. సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా ఇంకా బహిర్భూమికి బయటికి వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అందుకు రెండు ప్రభుత్వాలు నూటికి నూరు శాతం ఉచితంగా లబ్ధిదారునికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతం కింద రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాకింద రూ.4800 చెల్లిస్తున్నాయి. లబ్ధిదారునికి పూర్తిగా ఉచితంగానే నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. 2014లో పథకం ప్రారంభం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకాన్ని 2014 సెప్టెంబర్లో ప్రారంభించారు. మొదట నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 95601 మరుగుదొడ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటివరకు 76309 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకా 18847 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా పూర్తికాని నిర్మాణాలు ఐదేళ్లుగా పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు పదేపదే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి చెప్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం జాప్యం ఆగలేదు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మరుగుదొడ్లు ఇంకా కొన్ని నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. దీంతో ఇచ్చిన గడువుకూడా దగ్గర పడుతుండడంతో కలెక్టర్ గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్మాణంలో వెనుకబడిన మండలాలు జిల్లాలో అత్యధికంగా అనుముల మండలంలో 2580 మరుగుదొడ్లు నిర్మాణంలో వెనుకబడి పోగా దేవరకొండ మండలంలో 2242, కనగల్ మండలంలో 1270, నిడమనూర్ మండలంలో 1698, పెద్దవూర మండలంలో 2653, త్రిపురారం మండలంలో 1441, వేములపల్లి మండలంలో వెయ్యి మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చిట్యాల, దామరచర్ల మండలాలు నూటికి నూరుశాతం పూర్తి చేయగా, గుడిపల్లి మండలంలో ఒక్క మరుగుదొడ్డి పెండింగ్లో ఉంది. గుర్రంపోడులో పది, మిర్యాలగూడలో 35, నకిరేకల్లో 15, నార్కట్పల్లిలో 2, శాలిగౌరారంలో 25 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్లో ఉండగా 100 నుంచి వెయ్యిలోపు పెండింగ్లో ఉన్నాయి. -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్లో 188, చౌడూర్లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
దేన్నీ వదల్లేదు.. మొత్తం మింగేశారు
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో అందినకాడికి అవినీతి సొమ్మును వెనకేసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పాలకుల జేబులు నింపేందుకే అన్నట్లు వ్యవహరించారు. నీరు–చెట్టు, నీటికుంటలు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ ఇలా అన్ని పథకాలకు అవినీతి మరకలు అంటించారు. ప్రజలను అమాయకులను చేసి వారికి అందాల్సిన నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెద్దారవీడు మండలంలోని ఒక్క మద్దలకట్ట పంచాయతీలోనే మరుగు దొడ్ల పేరుతో రూ. 27,15,500 సొమ్మును కాజేశారు. సగం సగం పనులు చేయించుకున్న లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాల్లో నగదు జమ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరగుదొడ్ల పథకం టీడీపీ అవినీతికి ఓ మచ్చు తునక. లబ్ధిదారులకు తెలియకుండానే వారికి రావాల్సిన నగదును దొడ్డిదారిన నాయకులు తమ అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. మండలంలోని మద్దలకట్ట గ్రామంలో లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 538 మందికి మరుగుదొడ్లు నమోదయ్యాయి. అధికారులు కూడా ధ్రువీకరించడంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులు గుంతలు తీయగా మరోకొంత మంది రింగులు, గోడల వరకు నిర్మాణం పూర్తి చేశారు. కానీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అవి దారిమారి నాయకుల ఖాతాల్లో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితులు ఏడాదిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విశేషం. ఎవరెవరు ఎంత దోచుకున్నారంటే..! మద్దలకట్ట పంచాయతీలో 181 మంది లబ్ధిదారుల పేరుతో - రూ. 27,15,500 అవినీతి యమా దాసయ్య 53 మందివి - రూ. 7,88,000 పత్తి శ్రీనివాసరావు 65 మందివి - రూ.9,88,500 ఔకు వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) 31మందివి - రూ. 4,70,000 ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మందివి - రూ. 1,80,000 దొడ్డా భాస్కరరెడ్డి 20 మందివి - రూ. 2,89,000 అంతా అవినీతిపరుల ఖాతాల్లోకి మద్దలకట్ట పంచాయతీలో 538 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 181 మంది లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణ నిధులు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కాజేశారు. మద్దలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొడ్డా భాస్కరరెడ్డి 20 మంది రూ 2,89,000, చాట్లమడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యమా దాసయ్య 53 మంది రూ 7,88,000 , మాచరాజుకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పత్తి శ్రీనివాసరావు 65 మంది రూ 9,88,500, చాట్లమడ గ్రామానికి చెందిన మద్దలకట్ట ఎంపీటీసీ సభ్యులు ఔకు వెంకటేశ్వర్లు 31 మంది రూ 4,70,000, చట్టమిట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మంది రూ. 1,80,000 నిధులను వారి సొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. కొంత మంది తమ బ్యాంక్ ఖాతాలలో నిధులు జమకాలేదన్న కారణంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణాలను మధ్యలోనే అపివేసినప్పటికీ అదికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నిధులను తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి బిల్లులు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. బిల్లు ఇప్పించండి మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తీసి రింగులు వేశాను. బిల్లుల గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదు. మొత్తం 48 మంది గుంతలు, రింగులు, గోడలు నిర్మించాం. జనవరిలో జరిగిన జన్మభూమి గ్రాభసభలో కూడా ఫిర్యాదు చేశాం. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డా భాస్కరరెడ్డి, యమా దాసయ్య, పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఔకు వెంటేశ్వర్లు, ఏర్వ రామాంజనేయరెడ్డి, అధికారులు కలిసి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించుకొని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నారు. మాకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు. – జడ్డా దానియేలు, మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీ -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
సాక్షి, రొద్దం: అవినీతి కాదేదీ అనర్హమంటున్నారు అధికార పార్టీ నాయకులు. ఏకంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకెళితే..మండలంలోని 19 గ్రామ పంచాయితీల్లోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 8700 మరుగుదొడ్లు మంజూరు కాగా 6,533 నిర్మాణాలను 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకూ విడతల వారీగా పూర్తి చేశారు. ఇందుకోసం రూ.9.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరుగుదొడ్డి కట్టకుండానే బిల్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులే చేయించారు. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ చిన్నప్పయ్య పనులు చేశారు. మిగతా పంచాయతీల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పునాదులు తీసి వాటిని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు దిగమింగినట్లు తెలుస్తోంది. ఇక పాతవాటికి కూడా బిల్లులు చేసినట్లు సమాచారం. ఒకే తలుపును మరుగుదొడ్లకు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు సమాచారం. పెద్దగువ్వలపల్లి గ్రామంలోనే దాదాపు రూ.40 లక్షల దాకా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. బోగస్ బిల్లులు చేయడానికి ఒప్పుకోని ఒక ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ను జెడ్పీటీసీ బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. నాణ్యతకు పాతర.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకమైన ఇటుకలు వాడడంతోపాటు సిమెంట్ తగిన పాళ్లలో వాడలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక చాలావాటికి రింగులే ఇవ్వలేదు. నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని వినియోగించడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం. -
మరుగుదొడ్ల నిధులు గోల్మాల్!
గుంటూరు, వడ్లమూడివారిపాలెం(రొంపిచర్ల): ఇప్పటివరకు మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య లోలోన రగులుతున్న విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రచ్చకెక్కి కుమ్ములాటలకు దారితీస్తున్నాయి. మండలంలోని వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతి మంగళవారం గుప్పుమంది. ఈ గ్రామంలో నాలుగున్నరేళ్లలో 400 మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మించిన మరుగుదొడ్లన్నింటికీ నిధులు విడుదలైనప్పటికీ, ఆ మొత్తం లబ్ధిదారులకు ఇప్పటివరకు నగదు చేరలేదు. దీంతో కొందరు టీడీపీ నాయకులే మరుగుదొడ్లు ఎవరెవరికి వచ్చాయి, నిధులు ఎంతవరకు విడుదలయ్యాయనే సమాచారాన్ని సేకరించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వెనుకబడిన వర్గాల వారు పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం తమకు మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు రాలేదని గ్రామంలోని ఒక నాయకుడిని సంప్రదించారు. ఆ నాయకుడు దీనిపై ఆరాలు తీస్తుండగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్న వారు ఆ నాయకుడితో వాదనకు దిగటంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు 400 మరుగుదొడ్లు నిర్మించగా, అందులో 150 మందికి మాత్రమే నిధులు చేరాయి. మిగతా 250 మందికి మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు అందలేదు. అయితే కొంతమంది రూ.2వేలు ఇచ్చారని, రూ.3వేలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంమీద వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో రూ.30 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో చోటుచేసుకున్న ఉద్రిక్త వాతావరణం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. మరుగుదొడ్ల నిధులు అందని లబ్ధిదారులకు త్వరలో ఆ నిధులు అందేటట్టు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన మీదట కేసు నమోదుకాకుండా ఇరువర్గాల వారు రాజీపడినట్టు సమాచారం. -
బహిర్భూమికి వెళ్లి యువకుడి మృతి..
గౌతంనగర్: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే సదరు వ్యక్తికి సమాజంలో ఉండే గుర్తింపే వేరు. పైగా దేశ రక్షణలో పాలుపంచుకునే కొలువంటే ఇంకా గౌరవం. అందుకోసమే ఆ యువకులు భరతమాత రక్షణ సేవలో తరించాలని, ఆర్మీలో కొలువు సంపాదించాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా ఇక్కడ మాత్రం కనీస ఏర్పాట్లు లేక ఎముకలు కొరికే చలిలో అల్లాడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం వచ్చిన యువకుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మౌలాలిలోని ఆర్ఫీఎస్ సెంటర్లో ఈ నెల 28 నుంచి ఆర్మీలో జేడీ, టైలర్, చెఫ్ కమ్యూనిటీ, స్పెషల్ చెఫ్, వాషర్మెన్, హెయిర్ డ్రెస్సెస్, మెస్ కీపర్ తదితర ఉద్యోగాల నియామకం కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఎంపికలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 10 వేల మందికి పైగా తరలివచ్చారు. వీరిలో 4,350 మందిని మాత్రం పరీక్షకు అనుమతిచ్చారు. సుమారు 6 వేల మంది రోడ్లపైనే ఉన్నారు. మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర, అభ్యర్థుల ఎంపిక చేపట్టగా 2,945 మంది వచ్చారు. బుధవారం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, డయ్యూ, డామన్, లక్షదీప్, మేఘాలయ, పుదుచేర్చి ప్రాంతాల నుంచి 4 వేల మందికి పైగా హాజరయ్యారు. అయితే, అన్ని రాష్ట్రాలకు కలిసి 85 పోస్టులు మాత్రమే ఉండగా.. మొత్తం 20 వేల మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు వస్తారని ఆర్మీ అధికారులు అంచనా వేయకపోవడం గమనార్హం. యువకులకు ఉచితంగా భోజనం పెడుతున్న మన క్యాటరింగ్ ప్రతినిధులు యువకుడు మరణించినా మేల్కోని యంత్రాంగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల కోసం టాయిలెట్లు, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా బహిర్భుమికి వెళ్లిన వనపర్తి జిల్లా యువకుడు అరవింద్ విద్యుదాఘాతానికి బలైన విషయం తెలిసిందే. అయినా సరే మేల్కోని అధికారులు తాత్కాలికంగా మూడు మొబైల్ టైయిలెట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వేల మంది యువకులకు రెండు మూడు బాత్రూమ్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలి. ఇక వచ్చిన వారికి అనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులు చలిలో వణుకుతూ రాత్రివేళ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ యువకుల బాధలు చూడలేక ‘మన క్యాటరింగ్’ నిర్వాహకులు సెంటర్ సమీపంలో తాగునీరు, అల్పాహారం, భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అధికారులు ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడాన్ని పలు విమర్శలకు తావిస్తోంది. పట్టించుకునే వారు లేరు ఆర్మీ సెలక్షన్స్ కోసం కర్ణాటక నుంచి ఒక రోజు ముందే మౌలాలి జేటీఎస్ సమీపంలోని ఆర్పీఎస్కు చేరుకున్నాం. రాత్రి పడుకోవడానికి కనీస వసతి లేదు. చలిలో రోడ్ల పక్కన ఫుట్పాత్లపై నిద్రించాం. మా గోడు పట్టించుకునేవారు లేరు.– విటల్, అరుణ్ నాయక్ (కర్ణాటక) -
అలాంటి ఇళ్లలో మీరుంటారా..?
ఒంగోలు టూటౌన్ :‘బాత్ రూములు, టాయిలెట్స్ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట సుధాకర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్ హాస్టల్ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు. మంచి ఫలితాలు సాధించాలి.. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవ్వగా, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు 900 రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఏ ఒక్కటీ పెండింగ్లో ఉండకూడదని సంబంధిత సెక్షన్ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్వచ్ఛందంగా’ మెక్కేశారు!
ఆలూరు: మరుగుదొడ్ల నిర్మాణంలో హాలహర్వి మండలంలో జరిగిన అవినీతి బయటపడి కొద్ది రోజలు డవక ముందే హొళగుంద మండలం కూడా అదేబాట పట్టింది. థర్డ్పార్టీ ముసుగులో కొందరు అధికార పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసి నిజమైన లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే.. హొళగుంద మండలంలో స్వచ్ఛ భారత్ కింద మండలానికి 4,500 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైతే అందులో హొళగుంద గ్రామానికి 2 వేలు మంజూరయ్యాయి. అయితే కొందరు అధికార పార్టీ నేతలు థర్డ్పార్టీ ముసుగులో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసినట్లు సమాచారం. బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా థర్డ్పార్టీలుగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ఖాతాల్లో జమ అయ్యేలా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండానే బిల్లులకు ఓకే చెసినట్లు తెలుస్తోంది. దీంతో నిజమైన లబ్ధిదారులు బిల్లులు అందక బలైపోతున్నారు. ఇదిలా ఉండగా తమ పేరు మీద మరుగుదొడ్డి కట్టినట్లు, బిల్లులు కూడా మంజూరైనట్లు లబ్ధిదారులకు తెలియకపోవడం గమనార్హం. ఇలా ఒక్క హొళగుందలోనే వందలాది మరుగుదొడ్లకు సంబంధించి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా వాడుకున్నారంటే.. ఇంతకు ముందు మరుగుదొడ్డి కట్టుకున్న వారు, అసలు కట్టని వారి పేర్లను తెలుసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి ఏవేవో చెప్పి ఆధార్కార్డు, రేషన్కార్డులను సేకరించారు. వారికి తెలియకుండా లబ్ధిదారులుగా చేర్చి మరుగుదొడ్లు మంజూరు చేయించి పక్కా ప్రణాళికతో నిధులు కాజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మరుగుదొడ్డికి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. అయితే అక్రమార్కులు టెక్నాలజీని ఉపయోగించి దొంగ రికార్డులు సృష్టించి భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమాలు బయట పడుతుండడంతో అక్రమార్కులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల డబ్బులు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగిన వారిని దబాయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చేతిలో బిల్లు పెట్టారు ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనుకున్నాం. అయితే కొందరు వచ్చి మేము మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు చేతిలో బిల్లు కాగితం పెట్టారు. రూ.15వేలు బిల్లు కాజేశారు. దీంతో మేం మరుగుదొడ్డి నిర్మించుకునే వీల్లేకుం డాపోయింది.– శివప్ప, హొళగుంద గ్రామస్తుడు మా బిల్లు కాజేశారు మరుగుదొడ్డి నిర్మించుకుంటే బాగుంటుంది అనుకున్నాం. మొదటి మరగుదొడ్డి నిర్మించుకున్న వెంటనే బిల్లులు ఇస్తామన్నారు. అందుకని కొంత వరకు గుంతను తవ్వి రింగులు వేసుకున్నాం. తరువాత బిల్లు ఇవ్వకుండానే డబ్బు మీకుముట్టిందని చెప్పారు. దీంతో దొడ్డి నిర్మించుకోలేకపోయాం. మా డబ్బు తినేస్తారని అనుకోలేదు. బోయ నాగమ్మ, హొళగుంద -
బాలికను బలిగొన్న శౌచాలయం
కర్ణాటక, ముళబాగిలు: అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఉజ్వల భవిత శిథిలాల కింద నలిగిపోయింది. తరగతి పాఠశాల శౌచాలయానికి వెళ్లిన సమయంలో అది కుప్పకూలి జ్యోత్స్న (13) అనే 7వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో జరిగింది. జ్యోత్స్న తాలూకాలోని ఎన్ బిసనహళ్లి గ్రామానికి చెందిన రైతు శంకరప్ప, విజయమ్మ దంపతుల కుమార్తె. బుధవారం ఉదయం పాఠశాలలో ప్రార్థనచేసిన అనంతరం జ్యోత్స్న శౌచాలయానికి వెళ్లింది. ఈ సమయంలో కట్టడం ఉన్నపలంగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కి చిన్నారి ఊపిరి వదిలింది. ఘటనతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు బాలిక మృతదేహాన్ని కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరమే దేవరాయ సముద్రలో ఉన్న వసతి పాఠశాలను ఇక్కడి ప్రైవేటు కట్టడంలోకి మార్చడం జరిగింది. ఈ సమయంలో శౌచాలయాలను పక్కన ఉన్న రాజకాలువ వద్ద నాసిరకంగా నిర్మించడంతోనే కుప్పకూలిందని ఆరోపణలున్నాయి. కలెక్టర్ పరిశీలన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ జె మంజునాథ్, జడ్పీ సీఈఓ సి జగదీష్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. పాఠశాలను దేవరాయ సముద్రం నుంచి ఈ కట్టడంలోకి మార్చడానికి కారణమైన ప్రిన్సిపాల్ తదితరులపైన, కట్టడం యజమానిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలుహొళలి గ్రామం వద్ద నూతన భవన నిర్మాణం 90 శాతం పూర్తయింది, అంతా అయ్యాక అక్కడికి మారుస్తామని కలెక్టర్ తెలిపారు. ఘటనను ఖండించి ప్రతిఘటన కట్టడం కూలి విద్యార్థిని మరణించడంతో ఇది జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించి ఎస్ఎఫ్ఐ, రైతు సంఘం తదితర సంఘాల కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని కన్న తండ్రిపై..
వేలూరు: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించని తండ్రిపై చర్యలు తీసుకోవాలని రెండవ తరగతి చదివే విద్యార్థిని గత సోమవారం ఉదయం ఆంబూరు మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వేలూరు జిల్లా రాజపురం వినాయకగుడి వీధికి చెందిన ఇసానుల్లా కుమార్తె హనిపా జార(7) అదే గ్రామంలోని ప్రవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుంది. ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు, మరుగుదొడ్డి లేదు. దీంతో కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మరుగుదొడ్డి నిర్మించాలని పలుమార్లు తండ్రి వద్ద తెలిపినా పట్టించుకోకపోవడంతో వారి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్స్టేషన్కు వెళ్లి తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ రామన్ వెంటనే చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆంబూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చభారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించే పనులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు చిన్నారిని అభినందించారు. -
ఆరు బయటకు పరుగు తీయాల్సిందే...
విజయనగరం అర్బన్: పట్టణంలోని 39వ వార్డు పరిధిలో శాంతినగర్ ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలలో నేటికీ మరుగుదొడ్లు నిర్మించలేదు. అలాగే ఆరో వార్డు పరిధిలోని హుకుంపేట ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిర్మించమని పలుమార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 102 వరకు ఉన్నాయి. మరోవైపు నిర్మించిన మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడిక... రన్నింగ్ వాటర్ సౌకర్యం లేక సుమారు 60 శాతం వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థంచేసుకోవచ్చు. అత్యవసరం అయితే అంతే.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,034 పాఠశాలలుండగా ఇప్పటికీ మరుగుదొడ్లు నిర్మించని పాఠశాలలు 102 వరకు ఉన్నాయి. విజయనగరం పట్టణ పరిధిలోని రెండు పాఠశాలలకు ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఆయా పాఠశాలలో ఆ రెండింటికీ విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యమంలా నిర్మించిన మరుగుదొడ్ల వ్యవహారం తూతూమంత్రంగా కనిపిస్తోంది. ఆగస్టులో నిధులు వెనక్కి వెళ్లిపోవడం నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య నిర్మించడం లేదు. సీతానగరం మండలం గాదిలవలస ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులుండగా ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్మించారు. మరోవైపు దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు ఉన్నాయి. అమలు కాని ఆదేశాలు.. ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ ఒలకపోస్తోంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహణ లోపాలను సరిదిద్దుకోవాలని ఇటీవల జిల్లాలో పర్యటించిన సుప్రీంకోర్టు బృందం సూచనలతోకూడిన ఆదేశాలిచ్చింది. అదేవిధంగా పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్ల నిర్వాహణకు నెలవారీ నిధులివ్వాలని సూచించింది. అయితే ప్రభుత్వం మాత్రం పాఠశాలలను మూసివేయడానికి చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన మాటలు చూస్తే అనుమానాలు కలగకమానవు.నిధుల్లేక నిలిచాయి.. జిల్లాలో 43 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. మరో వంద మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడం వల్లే పనులు ఆగాయి. త్వరలో నిధులు విడుదలవుతాయి.వెంటనే పనులు చేపడతాం. – డాక్టర్ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్ఎస్ఏ -
బహిర్భూమికి వెళ్లి విద్యార్థి మృత్యువాత
కర్నూలు, పగిడ్యాల: పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీలు గుండెపోగు నడిపి ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శివశంకర్ నందికొట్కూరులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడైన రాఘవేంద్ర స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లిన రాఘవేంద్ర.. స్నేహితుడు బోయ పార్థుతో కలిసి సమీపంలోని కేసీ కాలువ గట్టుకు బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు ముగించుకుని కాలువలో శుభ్రం చేసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయాడు. ఇది గమనించిన స్నేహితుడు పార్థు రక్షించేందుకు చేయి అందించానని పేర్కొన్నాడు. చేయి అందుకున్న రాఘవేంద్ర తనను కూడా నీటిలోకి లాగడంతో భయాందోళనకు గురై విడిచిపెట్టగా మూడు సార్లు పైకి లేచి మునిగిపోయాడని తెలిపాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను గ్రామస్తులైన ముర్తుజావలి, చాకలి శ్రీనివాసులు శివాలయం వద్ద ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని కన్నీటి పర్యంతమయ్యాడు. పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం చెప్పగానే మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించడంతో హుటాహుటిన దేవనగర్ కాలనీవాసులు తరలివచ్చి కేసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. నందికొట్కూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఈశ్వరయ్య ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు జలవనురుల శాఖ అధికారులతో మాట్లాడి ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదలను బంద్ చేయించారు. అనంతరం వెదురు బొంగుకు ఇనుప కొక్కాలను కట్టి కేసీ కాలువలో అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో శివాలయం వద్దనే మృతదేహం లభ్యం కావడంతో ఒడ్డుకు చేర్చారు. ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుగుదొడ్ల కొరత: పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురు 163 మంది, బాలికలు 105 మంది ఉన్నట్లు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి వెల్లడించారు. బాలురకు రెండు, బాలికలకు తొమ్మిది మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో బాలురు మల, మూత్ర విసర్జన చేసేందుకు బయటకు వెళ్తున్నారు. ఉదయం 8.20 గంటలకే పాఠశాలకు వచ్చానని, విద్యార్థులు కేసీ కాలువకు వెళ్లిన సంగతి తనకు తెలియదని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి తెలిపారు. పాఠశాలలో రెండు మరుగుదొడ్లు వినియోగించుకోవాలని విద్యార్థులకు చెప్పామన్నారు. కన్నీరు మున్నీరుగావిలపించిన తల్లిదండ్రులు బడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కుమారుడు కొన్ని నిమిషాలకే మత్యువాతకు గురికావడం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘‘రెక్క లు ముక్కలు చేసుకుని పెద్ద చేస్తిమి కదా నాయనా.. అంతలోనే నీకు నూరేండ్లు నిండినాయా తండ్రీ’’ అంటూ తల్లి లక్ష్మీదేవి రోదించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. -
ఆత్మశుద్ధి లేని ‘స్వచ్ఛ’ ఉద్యమమేల?
గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగి నప్పుడు మనం తన్నులాడుకోవలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. గాంధీజీ నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అందజేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. భారత రిపబ్లిక్ కాస్తా నేడు అసహన భారతంగా రూపొందింది. 2010–18 మధ్య దేశ పౌరులపై 63 వేధింపులు, హత్యలు నమో దుకాగా, కేవలం 2014 మే తర్వాతనే 61 హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతటి స్థాయిలో దేశపౌరులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ హింసాకాండను కళ్లతో చూస్తూ కూడా స్పందించలేనివారిగా మిగిలి పోతున్నాం. కాగా, మరోవైపున అసలు సంఘర్షణ జరుగుతున్నది సమా జంలో అణగారిన వర్గాలతో–కుల మతాలు, వ్యక్తిగత విశ్వాసాలు కల్గి అవతల గట్టున ఉన్న అసంఖ్యాక ప్రజలతోనని గ్రహించాలి. ఈ పరి ణామం మొత్తం గాంధేయ తాత్విక దృష్టిని బలవంతంగా పక్కకు నెట్టేసిన ఫలితమే.– జస్టిస్ (రిటైర్డ్) ఎ.పి.షా: హైదరాబాద్ ‘గాంధీ మంథన్ సంవాద్’లో ప్రసంగం, 2–10–18 గాంధీజీని పాలకులు నేడు ఒక టాయిలెట్ నినాదానికి, ఓ కళ్లజోడు ఫ్రేము కిందికి దిగజార్చి మానవశ్రమలోని హుందాతనాన్ని కేవలం కక్కూసు దొడ్లకు కుదించి, ప్రచారం కోసం పాలక పెద్దలు చీపుళ్లు చేత పట్టుకుని కొద్ది నిమిషాల సేపు వీధులు ఊడుస్తున్నట్టు చూపించే నాలుగు కెమెరాలకు దిగజార్చారు.– జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, 2–10–18 గాంధీజీ విదేశాల్లో ఉండగా, దక్షిణాఫ్రికా ఫీనిక్స్ సెటిల్మెంట్ టాల్ స్టాయ్ క్షేత్రంలో, ఎరవాడ జైల్లో తానున్న చోట కక్కూసు దొడ్లను (టాయిలెట్స్) తానే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఆయనతో పాటు భార్య కస్తూరీబాయి కూడా అదే పనిచేశారు. స్వతంత్ర భారత పాలకులెవరూ అలాంటి జీవనవిధానం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచినవారని భావించలేం. టాల్స్టాయ్, తోరో, రస్కిన్ బోధల ఆధా రంగా ఏర్పడినదే ఫీనిక్స్ సెటిల్మెంట్ క్షేత్రం. తర్వాత దేశంలోని జైళ్లలో, సబర్మతీ ఆశ్రమం, ఇతర ఆశ్రమాల్లో గాంధీ అనుసరించిన జీవన విధా నానికి ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పే రాజకీయపక్షాల నేతల తీరుకూ పోలికే లేదు. ప్రస్తుత పాలకవర్గంలోని ‘భద్రమూర్తులు’ ఎన్నికల ముందు, ఆ తర్వాత ‘చిట్కా’ విధానాలతో కాలక్షేపం చేస్తు న్నారు. దక్షిణాఫ్రికాలో, మనదేశంలో అనుసరించిన సిద్ధాంత విలువల్లో గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. విదేశాల్లోనూ, ఇక్కడా కూడా సత్యా గ్రహ ఆశ్రమాల్లో కామన్ వంటశాల ఉన్నప్పుడు అస్పృశ్యత పేరిట ఆశ్ర మవాసులు కొందరు దళిత కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సంకోచించి, పక్కన కూర్చోవడానికి నిరాకరించిన సందర్భాల్లో గాంధీ పాత్ర చాలా గొప్పది. దళితులతో కలిసి భోంచేయడం తప్పు కాదని, పాపం కాదనీ వారికి ఆయన ‘క్లాస్’ పీకవలసివచ్చింది. అన్ని ఆశ్రమ సమావేశాల్లోనూ రెండు పూటలా అన్ని మతాలవారినీ స్వయంగా కలు పుకుని ప్రార్థనలు నిర్వహించేవారు. అలా అన్ని మతాలవారితో కలిసి భోజనాలు, భజనలు చేసేవారు. మత ఛాందసులను సైతం కలుపుకు పోవడం ద్వారా గాంధీజీ మానవ జీవితాన్ని సమానత్వ పునాదులపై నిర్మించారు. ఆ ప్రాతిపదికన అన్ని కులాలు, మతాల వారి కుల దుర హంకారాన్ని, వివక్షను ఛేదించడానికి ఆయన కృషి చేశారు. ఇంతకీ దేవుడనేవాడు ఎక్కడున్నాడంటే–‘శ్రమలో మాత్రమే’ అని ఎన్నో సంద ర్భాల్లో ఆయన చెప్పేవారు. మానవునిలోని ఆ శ్రమైక జీవన సౌంద ర్యాన్ని ఆయన గుర్తించినందునే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాల్గొనగలిగారు. ప్రచారం కోసమే శుద్ధి విన్యాసాలు! ఈనాటి దేశ పాలకులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రచారం కోసమే చేపడుతున్నారు. స్వాతంత్య్రోద్యమ మౌలిక లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమూల పరివర్తనను విస్మరించారు. ఈ నేతలు సూటూ– బూటూ వేసుకుని వీధులు శుభ్రం చేస్తున్నట్టు నడుం వంచినట్టుగా కనిపించే కెమెరా షాట్లతో సరిపెట్టుకునే విన్యాసంగా మలిచారు. అదైనా దేశవ్యాప్తంగా శ్రద్ధగా అమలు చేశారా అంటే లేదని న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ ప్రతినిధి కబీర్ అగర్వాల్ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం రోజునే వివరించారు. అంతేకాదు, 2014 నుంచి ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో ‘స్వచ్ఛ భారత్’’ పేరిట తలపెట్టిన టాయిలెట్స్ నిర్మాణ పథకం అమలు జరుగుతున్న తీరును వివిధ దేశీయ, ప్రపంచ సాధికార సర్వే సంస్థలు ఎండగట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు ప్రధాన కారణం టాయ్లెట్ మరు గుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించకుండా పారి శుద్ధ్య కార్మికుల(సఫాయి కర్మచారి)ఉపాధిని దెబ్బదీస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచకుండా పాలకులు టాయిలెట్స్ నిర్మించడానికి ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఫలితం ఉండదని జాతీయ కర్మచారీ ఆందోళన్ సంస్థ ఎన్నోసార్లు ప్రకటించింది. ఆధునిక పరికరాల సాయంతో పౌర నివాసాల్లో మురికి నీళ్లు, బురద, మానవులు విసర్జించే మలమూత్రాలను క్షణాల్లో తొలగించే యాంత్రిక పద్ధతులు ప్రవేశపెట్టా లని జాతీయ కర్మచారీ సంఘం పదేపదే కోరుతూ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులు ఉపయోగించి ఈ పనులకు దిగకుండా పైన చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ఏళ్ల తరబడిగా మొత్తుకుంటోంది. మురుగు కాలువల్లోకి దిగి పనిచేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా, వంద లాది మంది సఫాయీ కార్మికులు ఇలా మరణిస్తూంటే కేవలం డజన్ల కేసుల్లో మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఫలితంగా 2017లో ప్రతి ఐదు రోజులకు సగటున ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తున్నా డని తేలింది. పైగా పార్లమెంటు చట్టం ప్రకారం సఫాయీకర్మచారులకు జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పడినా పరిస్థితుల్లో మార్పురాలేదు. గ్రామసీమల్లో జరిగింది అంతంత మాత్రమే! గ్రామ సీమల్లో టాయిలెట్ సౌకర్యాల గురించి అధికార స్థాయిలో వెలువ డుతున్న ప్రకటనలేగాని ఆచరణలో ఫలితాలు ప్రచారం జరిగినంతగా కనిపించలేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గమ్మత్తేమంటే, ప్రభుత్వ టాయిలెట్స్ నిర్మాణ ప్రచారంలో చెప్పుకున్నట్టు దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ కమిషన్ లెక్కల ప్రకారం కేవలం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే కర్మచారుల మృతి వార్తలు నమోదయ్యాయి. పనిలో ఉన్న సఫాయీ కర్మచారులు ఎందరు చనిపోయారన్న వివరాలు ఇంగ్లిష్, హిందీ పత్రి కల్లో వచ్చినంతగా ప్రాంతీయ భాషా పత్రికల్లో రిపోర్టవుతున్న మరణాల సంఖ్య మాత్రం గణనలోకి రావడం లేదు. ఎందుకంటే, పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి, పునరావాసానికి చెందిన 2013 నాటి ప్రభుత్వ లెక్కలే ఈ దుస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భౌతికంగా చేతులు ఉపయోగించి నిర్వహించే పారిశుద్ధ్య పనులపై విధించిన నిషేధం నాటికి సమయంలో దేశంలో ఉన్నవి 7,40,078 ఇళ్లు. కాగా, సామాజిక, ఆర్థికపరంగా 2011లో కుల ప్రాతిపదిక ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం చేతులు ఉపయోగించి మరుగు దొడ్లు కడిగే కర్మచారుల కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే గ్రామీణ భార తంలో ఉన్నాయి. ఈ పరిస్థితికి తోడుగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా ‘గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్’ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అయితే, తాను దేశ ప్రధాని అయిన తరు వాత బిహార్లో ఎనిమిది లక్షల ఇళ్లకు టాయిలెట్లు అందించానన్న మోదీ ప్రకటనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండిస్తూ, అందులో 6 లక్షలకు పైగా టాయిలెట్లు తాను ఏర్పాటు చేసినవేనని బహిరంగంగా ప్రకటిం చాల్సి వచ్చింది. అనేక గ్రామాల్లో ఏ మేరకు టాయిలెట్ సౌక ర్యాలను ప్రభుత్వం కల్పించిందో లెక్కలు తీసేందుకు వెళ్లిన పరిశోధనా సంస్థలు అయిదు ఉత్తర భారత రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించగా వివిధ స్థాయిల్లో పంచాయతీ అధ్యక్షుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా ఎక్కువమంది వివరాలు తెలపడానికి జంకి నోరు మెదపలేదని తేలింది. గాంధీజీని హత్య చేసి, ఉరిశిక్షపడిన నాథూరాం గాడ్సే నీడను భారత ప్రజలు మాపేసుకున్నారు గానీ, దేశ పాలనా వ్యవస్థలోని కొందరు ఈ రోజుకీ వదిలించుకోలేకపోతున్నారు. ఆ నీడ చాటునే కొందరు బీజేపీ నాయకులు ఈ రోజుకీ దాగుడుమూతలాడుతున్నారు. గాంధీని గాడ్సే హత్య చేయడాన్ని మహాత్ముడి 150వ జయంతినాడే బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ సమర్థించారు. కానీ, ఆ ప్రకటనను గౌరవ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వార్తను ఇంత వరకు మనం చూడలేదు. నిజానికి గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే (1947 అక్టోబర్ 4న) దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగినప్పుడు మనం తన్నులాడుకో వలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. అందుచేత గాంధీజీ ఇంత విస్తృతమైన నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అంద జేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. ‘భాండశుద్ధిలేని పాకమదియేల’ అని వేమన అన్నట్టుగానే ఆత్మశుద్ధిలేని ‘స్వచ్ఛ భారత్’ ఏల అనుకోవాలి!! ఏబీకే ప్రసాద్(abkprasad2006@ahoo.co.in), సీనియర్ సంపాదకులు -
హీరోలా ప్రశ్నిస్తే ఏ పనీ జరగదు
అనంతపురం, గుంతకల్లు రూరల్: ‘ఏదైనా పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులను ప్రాధేయపడాలి. అంతేకానీ హీరోలా ప్రశ్నిస్తే పనులేమీ జరగవిక్కడ. ముందు ఆఫీస్లో నుంచి కాలు బయటకు పెట్టి మాట్లాడు. లేదంటే పోలీస్ కేసు పెడతా’ అంటూ గుంతకల్లు ఎంపీడీఓ శంకర్ వ్యక్తిగత మరుగుదొడ్డి లబ్ధిదారుపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకెళితే.. మొలకలపెంట గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య ఈశ్వరమ్మ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేక పనులు మొదలుపెట్టకపోయారు. దీంతో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ శంకర్లు దగ్గరుండి వారి ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతలో నారాయణస్వామి అన్న మృతి చెందడంతో దాదాపు 40 రోజుల పాటు పనులను నిలిపివేయాల్సి వచ్చింది. జాబితా నుంచి పేరు తొలగింపు మరోవైపు త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మధ్యలోనే నిలిచిపోయినా వాటిని జాబితాలోంచి తొలగించి.. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించారు. నారాయణస్వామి తన అన్న మరణానంతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి మరుగుదొడ్డి పనులు పూర్తి చేశాడు. బిల్లు చేయలేం.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లు రాకపోవడంతో నారాయణస్వామి శుక్రవారం ఎంపీడీఓను కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించుకున్నాడు. నిర్మాణం జాప్యం జరగడంతో జాబితాలోంచి పేరు తొలగించామని, ఇప్పుడు బిల్లు ఏమీ చేయలేమని ఎంపీడీఓ అసహనంతో చెప్పారు. దగ్గరుండి మీరే నిర్మాణ పనులు ప్రారంభించి.. ఇప్పుడు పేరు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన నారాయణస్వామిపై ఎంపీడీఓ కోపోద్రిక్తులయ్యారు. నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ గద్దించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మంజూరు కాకపోతే ఏంటి పరిస్థితి అని డీలాపడిపోయిన నారాయణస్వామి ఒక అడుగు వెనక్కు తగ్గాడు. అప్పుడు ఎంపీడీఓ స్పందిస్తూ ‘ప్రాధేయపడి అడుక్కుంటేనే ఏదైనా పని జరుగుతుంది. గట్టిగా అడిగితే ఏ పనీ జరగదు’ అంటూ మందలించడంతో బాధితుడు నారాయణస్వామి కన్నీరుపెట్టుకుంటూ బయటకు నడిచాడు. -
మొబైల్ స్క్రీన్ కంటే మరుగుదొడ్డే నయం!
మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మనలో చాలా మంది పొద్దున లేవగానే ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. ఫోన్ చెక్ చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. అయితే మనం రోజూ పదులసార్లు టచ్ చేసే మన మొబైల్ స్క్రీన్పై టాయ్లెట్లో కంటే మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫోన్ వినియోగదారుల్లో కనీసం 35 శాతం మంది ఎప్పుడూ తమ మొబైల్ స్క్రీన్లను ఎటువంటి లిక్విడ్లు ఉపయోగించి శుభ్రపరచలేదని ఇంగ్లండ్కు చెందిన ‘ఇన్య్సూరెన్స్ టూ గో’ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు స్కై.కామ్ వెబ్సైట్ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు వాడే ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరు నెలలోపు తమ మొబైల్ స్క్రీన్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు ఫోన్ల స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ఒక్కో స్క్రీన్పై సుమారుగా 84.9 యూనిట్ల క్రిములను గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 30 యూనిట్ల క్రిములు, లాక్ బటన్పై 23.8 యూనిట్లు, హోమ్ బటన్పై సుమారుగా 10.6 యూనిట్ల క్రిములు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. టాయ్లెట్, ఫ్లష్పై 24 యూనిట్ల క్రిములు ఉంటాయి. ఆఫీసులో ఉపయోగించే కీ బోర్డులు, మౌస్లపై ఐదుశాతం క్రిములు ఉంటాయి. మొబైల్ ఫోన్ల స్క్రీన్లపై ఉన్న ఈ బ్యాక్టీరియా కారణంగా చర్మసంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు(40 శాతం), 35 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది లేచిన వెంటనే ఐదు నిమిషాల వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అలాగే పడుకునే ఐదు నిమిషాల ముందు వరకు ఫోన్లను పరిశీలిస్తున్న వారిలోనూ 60 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. -
ఇల్లు లేకున్నా.. మరుగుదొడ్డి కట్టావ్.. భేష్!
దుగ్గొండి(నర్సంపేట) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత సోమవారం ఉదయం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు వచ్చారు. ఇదే సమయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రదేశాన్ని ఎస్సై కాలనీలో పరిశీలిస్తున్నారు. సాధారణ మహిళలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పక్కన కవర్లు పైకప్పుగా కట్టుకుని ఉన్న గుడిసె, దాని పక్కన నిర్మించిన ఉన్న మరుగుదొడ్డిని చూశారు. ఇంటి యజమాని ఎలుదొండ భిక్షపతి మరుగుదొడ్డి గుంతలకు ఓడలు వేసి మట్టి నింపుతుండగా కలెక్టర్ ఆగి అభినందించారు. ‘ఇల్లు లేకున్నా.. మరుగుదొడ్డి కట్టావు.. భేష్! నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా’నని చెప్పి వివరాలు నమోదు చేసుకోవాలని సీసీని ఆదేశించారు. -
సర్దుకు‘పోయా’ల్సిందే!
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు.. ‘మా స్కూల్లో చదివితే ఐఐటీ గ్యారెంటీ, నీట్ ర్యాంక్ పక్కా, సివిల్స్కు సెలక్ట్ అయినట్టే’.. ఇలా ఎన్నెన్నో మాటలు చెబుతాయి. మరి మౌలిక వసతుల మాటేమిటంటే బిక్కముఖం వేయాల్సిందే. ర్యాంకులు, మార్కుల మాయలో పడ్డ తల్లిదండ్రులు వాటి గురించి ఆలోచించే తీరికేది. వందల కొద్ది అడ్మిషన్లు తీసుకొని రూ.లక్షలు వెనకేసుకుంటున్న యాజమాన్యాలు పిల్లలకు సరిపడా మరుగుదొడ్డు ఉన్నాయా? లేవా? అన్న స్పృహను కోల్పోతున్నాయి. పట్టించుకోవాల్సిన పేరెంట్స్ అయినా చదువు ముఖ్యం గాని వాటితో పనేంటిలే అన్న ధోరణిలో పడిపోయారు. వీళ్ల నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల నిండు జీవితాలు. చాలీచాలని, అపరిశుభ్ర మరుగుదొడ్లను వినియోగించి అనారోగ్యాల పాలవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే సర్దుకుపోవాల్సి వస్తోంది. చట్టం ఏమి చెబుతోంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 60 మంది విద్యార్థులకు గాను బాలికలకు ఒక యూనిట్, బాలురకు ఒక యూనిట్ టాయిలెట్లను ప్రత్యేకంగా కేటాయించాలి. ఇక్కడ ఒక యూనిట్ అనగా నాలుగు యూరినల్, రెండు టాయిలెట్ బేసిన్లు. అయితే విజయవాడ నగరంలోని చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో నామమాత్రంగా ఒకటో, రెండో యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ తరహాలోని పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. ఒక్కో ఫ్లాట్లో కేవలం రెండు, మూడు టాయిలెట్స్ ఉంటుండగా విద్యార్థులు మాత్రం వందల్లో ఉంటున్నారు. లాభాపేక్షతోయాజమాన్యాలు నిబంధనలకు నీళ్లోదులుతున్నారు. సర్దుకోవాల్సిందే.. రెండు పీరియడ్లు అయిన తర్వాత యూరిన్ కోసం 10 నుంచి 15 నిమిషాల వరకు ఇంటర్వెల్ ఇస్తారు. రోజుకు రెండుసార్లు ఇంటర్వెల్స్ ఉంటాయి. ఈ కొంత సమయంలోనే వందల మంది పిల్లలు యూరిన్, టాయిలెట్కు వెళ్లాల్సిఉంటుంది. టాయిలెట్కు వెళ్లేందుకు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో టాయిలెట్కు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. కొందరు పిల్లలు టాయిలెట్, యూరిన్కు వెళ్లకుండా బిగబట్టుకుని ఇంటికి వెళ్లిన తర్వాత తీర్చుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు నీళ్లు తాగితే యూరిన్ వస్తుందని పాఠశాల సమయంలో నీళ్లు తాగడాన్ని మానేస్తున్నారు. రోగాలు తప్పవు.. పిల్లలు ఇలా చేయడం వల్ల రోగాల బారిన పడాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో టాయిలెట్కు వెళ్లాలని సూచిస్తున్నారు. టాయిలెట్కు పోకుండా బిగబట్టడం వల్ల మలబద్ధకం, ఒకరి నుంచి మరొకరికి యూరిన్ ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు ఉండాలని, అలాగే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కిడ్నీలపై ప్రభావం.. సకాలంలో మూత్ర విసర్జన చేయకుంటే యూరిన్ బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనర్థాలకు దారితీస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్స్ను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అప్పటికే చిన్నచిన్న కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకు ఇలాంటి సంఘటనలతో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. యూరిన్ వెళ్లాల్సి వస్తుందని కొందరు పిల్లలు నీళ్లు తాగడం మానేస్తున్నారు ఇది చాలా తప్పు. ప్రైమరీ స్థాయి పిల్లలకు సకాలంలో టాయిలెట్ రాదు.. వచ్చినప్పుడు వెళ్లాలి. బిగబడితే మలబద్ధకం వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోలేరు. యాజమాన్యాలు తగినన్ని టాయిలెట్స్ ఏర్పాటుచేసి, శుభ్రతను పాటించాలి. – డా. కిరణ్కుమార్, యూరాలజిస్ట్, విజయవాడ -
మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా?
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గాలో మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని, మరుగుదొడ్లు పరిశుభ్ర పరిచి ఉపయోగంలోకి తెస్తారా లేక తానే శుభ్రం చేయమంటారా అని నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని బారాషహీద్ దర్గా ఆవరణలోని మరుగుదొడ్లు, ఘాట్ పనుల్లో లోపాలను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా నెల్లూరుకు గర్వకారణమన్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాను సందర్శిస్తుంటారని తెలిపారు. రూ.కోట్లు ఖర్చు చేసి మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లులో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. తాను వస్తున్నానని తెలుసుకుని అప్పటికప్పుడు తూతూమంత్రంగా పైపై పనులు చేశారని పేర్కొన్నారు. ఘాట్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తేదీ ఉదయం 10 గంటలలోపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలసి రాజకీయాలకు అతీతంగా గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలుపుతానన్నారు. అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా శుభ్రం చేస్తానని చెప్పారు. మహిళా మరుగుదొడ్లు పక్కన మందు సీసాలు ఉండటం గమనించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరులో భాగంగా పచ్చదనం పెంపొందిస్తామని గోడలపై రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. బారాషహీద్ దర్గాలో చెట్లు ఎండిపోవడంపై ఇదే మంత్రి నారాయణ, మేయర్ అజీజ్లు చేస్తున్న స్వచ్ఛ నెల్లూరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, బొబ్బల శ్రీనివాసయాదవ్, అంజా హుస్సేన్, మాళెం సుధీకర్కుమార్రెడ్డి, ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ స త్తార్, రియాజ్, మిద్దె మురళీకృష్ణయాదవ్, సందానీ బాషా, చిన్న మస్తాన్, అలీ నావాజ్, యాకసిరి శరత్చంద్ర, ఎం.శ్రీకాంత్రెడ్డి, టీవీఎస్ కమల్, రా మరాజు, మా దా బాబు, జగదీష్, సింహాచలం, మేఘనాధ్సింగ్, యనమల శ్రీహరియాదవ్, హ జరత్నాయుడు, తుమ్మల శీనయ్య, తాళ్లూరు సురేష్, కట్టా వెంకటరమణయ్య, ప చ్చారవి, మొయిళ్ల సురేష్, ఆండ్ర శ్రీనివాసులు, పేనేటి సుధాకర్, వే ల్పూలు అజ య్, గజరా నరేష్, కమల్రాజ్, హయద్ బాషా, పెద్ద మస్తాన్, తారీఖ్, మందాపెద్దబాబు, దిలీప్రెడ్డి పాల్గొన్నారు. -
సంక్షోభంలో సంక్షేమం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పలుచోట్ల హాస్టళ్లు సమస్యల లోగిళ్లుగానే ఉన్నాయి. అస్తవ్యస్త మరుగుదొడ్లు, తాగునీటి కరువు, దోమల బాధ, ఉక్కపోతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల 25న జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సహా 20చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేపల్లె, తెనాలి, అమరావతి, చేబ్రోలు, గురజాల, గుంటూరు నగరం, నిజాంపట్నంలోని హాస్టళ్లను ఐదు బృందాలుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు, సమస్యలు వెలుగు చూశాయి. 70 శాతానికి పైగా వసతి గృహాల్లో బోగస్ ఎన్రోల్మెంట్లు బయటపడ్డాయి. ఉన్న విద్యార్థుల కన్నా అధికంగా 20శాతం చూపించి వార్డెన్లు జేబులు నింపుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. భద్రత ప్రశ్నార్థకం బాలికల వసతి గృహాల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో చాలా వరకూ ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీ వాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరుగుదొడ్లకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థినులు అరుబయట కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లెలోని ఓ సంక్షేమ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటికి కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల వద్ద మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. పౌష్టికాహారం అందని ద్రాక్షే.. విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందని ద్రాక్షలానే మారింది. జిల్లాలోని చాలా వరకూ వసతి గృహాల్లో కొత్త డైట్ విధానం అమలు కావడం లేదు. వారానికి ఒక్కసారి కూడా కోడిగుడ్డు ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. పాలు కూడా విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. హాస్టళ్లలో ఎక్కడా ఆర్వో వాటర్ సిస్టమ్ అమలు కావడం లేదు. నేటికీ కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుతూ పొగ చూరిన ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. గురుకులాల్లో టీచర్ల కొరత విజిలెన్స్ అధికారుల తనఖీల్లో గురుకులాల్లో సిబ్బంది కొరత బయటపడింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే సిబ్బందే ఎనిమిది, తొమ్మిది, పది విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రిన్సిపాళ్ల గైర్హాజరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. వంటలు చేసే సిబ్బంది నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. నిధుల దుర్వినియోగం తనిఖీల సమయంలో జిల్లాలోని చాలా హాస్టళ్లలో పలు సమస్యల్ని గుర్తించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పరిశీలించాలి. అప్పుడే వార్డెన్లు అక్రమాలకు పాల్పడకుండా నిధులు వినియోగిస్తారు. – శోభామంజరి, విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ -
ఫెర్టిలిటీ
సాయంత్రం ఆరవుతోంది. దివ్యకు ఎందుకో అనీజీగా ఉంది. తనకిప్పుడు ఐదు నెలల గర్భం. చెమటలు పడుతున్నాయి. మాటిమాటికీ టాయిలెట్కు వెళ్లాలనిపిస్తోంది. టీవీ ఆఫ్ చేసి, మంచినీళ్ళు తాగింది. అత్తమ్మ, తను ఇందాకే టీ తాగారు. అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రుల పూజలని ఆమె కిందికి వెళ్లారు. ఇంకో గంటకు గానీ రారు. సమయానికి భర్త అరుణ్ కూడా ఊళ్లో లేడు. ఉండీ ఉండీ పొత్తికడుపులో నొప్పి. చాలా భయమేస్తోంది. ముఖం కడుక్కుని, దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంది. పెళ్ళైన ఏడేళ్లకు నిలిచిన గర్భం. ఏడుపొస్తోంది. ఊళ్లోనే ఉన్న అమ్మ సుమిత్రకు ఫోన్ చేసింది. వెంటనే అమ్మ, నాన్న, తమ్ముడు రాహుల్ వచ్చేశారు. దివ్య రెగ్యులర్గా చూపించుకునే హాస్పిటల్కి కాల్ చేస్తే, డాక్టర్ యూఎస్ వెళ్లారట. డ్యూటీ డాక్టర్స్ ఉన్నారట. డ్యూటీ డాక్టర్ తన డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఇంకో హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడ దివ్యకు గర్భం జారకుండా స్టిచ్ వేస్తారని చెప్పారు. అది యూసుఫ్గుడ లోపలి కాలనీల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్. వెతుక్కుంటూ వెళ్లేసరికి డాక్టర్ వెళ్లిపోబోతున్నారు. అడ్మిట్ చేసుకుని సెలైన్ పెట్టారు. యూరిన్ టెస్ట్ చేసి, స్కాన్ చేసి భయం లేదని, పొద్దున్నే గర్భసంచికి ‘సర్క్లాజ్ స్టిచ్’ వేస్తానని మెడిసిన్స్, థియేటర్కి కావాల్సిన లిస్ట్ రాసిచ్చారు. దివ్య అమ్మగారు దివ్యకు ఇడ్లీ తినిపించి, అన్నం తినేసి అటెండెంట్ బెడ్పై నడుం వాల్చారు. టైమ్ పది దాటింది. అరుణ్ ఫోన్ చేశాడు. దివ్య కొంచెంసేపు మాట్లాడింది. బయట హాల్లో దివ్య తమ్ముడు స్టీల్ చైర్లో పడుకున్నాడు. సలైన్ అయిపోవచ్చింది. సుమిత్ర లేచి సిస్టర్ని పిలుచుకొచ్చింది. సిస్టర్ నీడిల్ తీస్తూ దివ్యతో ‘మీరు జాబ్ చేస్తారా?’ అనడిగింది. దివ్య ‘అవును’ అని చిన్నగా నవ్వింది. ఏం జాబ్ అని సిస్టర్ అడగలేదు. లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయింది.దివ్య ఆమె భర్త అరుణ్ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లు. వంద కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామంలో పోస్టింగ్. సున్నితంగా, మంచి చుడిదార్లు వేసుకుని, పెద్ద బ్యాగ్తో ట్రైన్ ఎక్కే దివ్యను చూసి ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అమ్మాయో అని అనుకుంటారు. ఎవరైనా ఆశ్చర్యపోతే దివ్య నవ్వుకుంటుంది. తాము తమ వృత్తిని ఎంతో ప్రేమిస్తారు. వైద్యం చేసిన పశువు కళ్లలో మనుషుల్లో లేని కృతజ్ఞత కనబడుతుంది. బాధతో నోరులేని మూగ జీవి విలవిల్లాడితే దానికి ఉపశమనం అందించడం ఎంత గొప్ప విషయం. ‘ట్రెవిస్’ పైకి తీసుకురాగానే కంగారులో పశువు వేసే పేడకు డ్రెస్ అంతా పాడవుతుంది. దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో అసిస్టెంట్లు ఉన్నా, దాదాపు ప్రతిసారీ గిట్టల చేత, కాళ్ల చేత డ్రెస్ చీరుకుపోవడమో, చేతులకు గాయాలవడమూ సహజమే. యానిమల్ తాలూకు తాళ్లు అరచేతుల్లో చీరుకుపోతాయి. అన్నింటికన్నా కష్టమైన పని పశువుల్లో ప్రెగ్నెన్సీ డిటర్మైన్ చేయడం. మనుషుల్లాగా యూరిన్ టెస్ట్ చేసి చెప్పడం సాధ్యపడదు. పొరపాటున పశువు గర్భం దాల్చలేదని చెబితే, రైతు దాన్ని అమ్మేసాక అది గర్భంతో ఉందని తెలిస్తే ఎంత పెద్ద గోలో! తనకు గర్భసంచి జారింది. జారదు మరి! ప్రతిరోజూ ప్లాట్ఫాం వైపు నుండి కాక ఎల్తైన మరో వైపు చిన్న స్టేషన్లో ఆగి ఆగకుండానే దూకడం, టైంకు అసిస్టెంట్ రాకుంటే చిన్నపాటి గుట్ట ఎక్కి దిగడం, తలచుకుంటేనే బాధ కలుగుతుంది. అరుణ్ ‘షీప్ గ్రవుండింగ్’కి కర్ణాటక వెళ్లాడు. మొన్నటివరకు తనూ వెళ్ళేది. ఒక్కోసారి వారం నుండి పదిహేను రోజులు. అదొక పెద్ద ప్రహసనం. మేలురకం గొర్రెల్ని సెలెక్ట్ చేసి, వాటిని ఫొటోలు తీసి, ఎక్సల్లో అప్లోడ్ చేయాలి. చెవుల కిందుగా ట్యాగ్ వేయాలి. తరువాత వాటి లబ్ధిదారుల ఆధార్తో గొర్రెల్ని అనుసంధానించాలి. పెద్ద తతంగం. అరుణ్ రేపు ఆపరేషన్ టైమ్ కల్లా వస్తానన్నాడు. తొందరగా వస్తే బావుండు. ఈ స్టిచ్ ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.అర్ధరాత్రి. బయట ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. దివ్యకు మెలకువ వచ్చింది. సెల్ ఆన్ చేసి టైం చూసింది. రెండు కావొస్తోంది. అమ్మను లేపబోయి ఊరుకుంది. బాటిల్లోంచి మంచినీళ్లు తాగి, మెల్లగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. హాల్లో ముగ్గురు లంబాడీ స్త్రీలు, తలపాగాతో ఒక వ్యక్తి. అచ్చం తను పనిచేసే తండా వారి లాగానే ఉన్నారు. డెలివరీ కేసేమో. గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. దగ్గరకు వెళ్లాలనుకుంది కానీ, తల్లి పిలవడంతో లోపలికి వెళ్లింది.‘ఏమైందమ్మా..’ తల్లి కంగారుగా అడిగింది.‘ఏమీ లేదమ్మా. బయట చప్పుడైతే లేచాను. నువ్వు పడుకో’. పొద్దున్న నాలుగు గంటలకు సిస్టర్ వచ్చి లేపింది. ఎనీమ ఇచ్చింది. నాలుగుసార్లు మోషన్కు వెళ్ళగానే సర్క్లాజ్కి కావలసిన ఏర్పాట్లు చేసింది. అరుణ్ వచ్చాడు. దివ్యను థియేటర్లోకి తీసుకెళ్లారు. గంటలో సర్జరీ అయిపోయింది. ఇంకా కొంచెం మత్తులోనే ఉంది. పూర్తిగా మత్తు వీడాక థియేటర్లో డాక్టర్, నర్సుల మధ్య సంభాషణ లీలగా విన్నట్టు అనిపించింది. తన శరీర కింది భాగమంతా మొద్దుబారినట్టు అనిపించింది. అలాగే కళ్లు మూసుకుంది.సాయంత్రం రూమ్లోకి షిఫ్ట్ చేశారు. తల్లి స్నానం చేసి భోజనం పట్టుకొస్తానని వెళ్లింది. పక్కన ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. సడెన్గా దివ్యకు రాత్రి లంబాడీ వాళ్ళ సంగతి గుర్తొచ్చింది. తనంటే చుట్టు పక్కల తండా వాళ్లకు చాలా అభిమానం. గేదెలు, ఆవులు ఈనితే జున్ను పాలు, స్వచ్ఛమైన నెయ్యి తెచ్చిచ్చేవారు. చుట్టాలు వస్తున్నారంటే ఫోన్ చేస్తే గ్రామంలో ఖాసీం మంచి మటన్ పంపించేవాడు. పశువు ఈనడం కష్టమైతే ఒక్కోసారి రాత్రిళ్లు వాటి తాలూకు ఓనర్ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది. అప్పుడు వారు తనపట్ల ఎంతో గౌరవం చూపేవాళ్లు. అవునూ! ఇది ఫెర్టిలిటీ సెంటర్ కదా. ల్యాబ్లు కానీ, అలాంటి ఎక్విప్మెంట్ కానీ లెవేంటి? ఐవీఎఫ్ చేస్తారా.. ఆర్టిఫిషల్ ఇన్సెమినేషన్ చేస్తారా.. లేదా సరోగేసీ చేస్తారా....తను పనిచేసే గ్రామంలో విష్ణురెడ్డి దగ్గర బలిష్టమైన ఎద్దు ఉంది. ప్రతీ రైతు దగ్గర చూడి కోసం వెయ్యి రూపాయలకు తక్కువ తీసుకోడు. డోర్ తెరుచుకుంది. సిస్టర్ బీపీ చెక్ చేసి సెలైన్ ఆపేసింది. పక్కన బెడ్పైకి ఒక అమ్మాయి వచ్చింది. జీన్స్ వేసుకుంది. పేషంట్లాగా లేదు. కూర్చుని ఫోన్ చూసుకుంటూ గడిపింది. ఒక గంటలో సిస్టర్ వచ్చి ఏవో పేపర్ల మీద ఆ అమ్మాయితో సంతకాలు పెట్టించుకుంది. దివ్య చాలా క్యూరియస్గా చూస్తోంది. ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా చూయింగ్ గమ్ నములుతూ ఫోన్ చూసుకుంటోంది. కాసేపటికి ఆమె భర్త కాబోలు, ‘ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మార్నింగ్ ఫైవ్కి ఫ్లయిట్.’ చెప్పాడు. ఇద్దరూ సిస్టర్కి చెప్పి బయటకు వెళ్లారు. దివ్య అమ్మ, అత్తమ్మ వచ్చి తనకు వేడి జావ తాగించారు. అత్త ఉంటానన్నా దివ్య తల్లి వారించి, ‘తెల్లారి ఎలాగో డిశ్చార్జ్ అవుతాం కదా’ అని పంపేసింది. అరుణ్ బయట సోఫాలో పడుకున్నాడు.రాత్రి ఒకటిన్నర అయినట్టుంది. ఏడుపు చప్పుడుకు దివ్య లేచింది. పక్కన ఉన్న చిన్న రూంలోనుండి గుసగుసలు. చిన్నగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళింది. నిన్న చూసిన పెద్దవయసు లంబాడీ స్త్రీ చేతిలో మాసిన గుడ్డల్లో ఎర్రటి పసికందు. ఒక్కరోజు వాడేమో! మధ్యాహ్నం చూసిన అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి ఎక్సయిట్ అయి.. ‘ఎత్తుకోవాలంటే భయం’ అని నవ్వుతూ తల్లికి అందించింది. కొద్దిసేపట్లో బిడ్డను తీసుకొని వాళ్లు బయటకు నడిచారు.దివ్య గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది. ఎందుకో ఏడుపొచ్చింది. మెల్లిగా వచ్చి బెడ్ మీద కూర్చుంది.తెల్లారి సిస్టర్ని పిలిచి, ‘ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమా, ఎందుకు బిడ్డను తీసుకెళ్లారు?’ అని రహస్యంగా అడిగింది. ‘లేదమ్మా! కానీ వాళ్లు చాలా కోటీశ్వరులట. మేనరికం మాత్రమే చేసుకుంటారట. బయటి వాళ్లను నమ్మరట. పిల్లలు ఏమైనా లోపాలతో పుడితే ఎట్లా అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ బంధువులకు గుడ్డి పిల్లవాడు పుట్టాడట. ఇంక రిస్క్ ఎందుకు అని ఇట్లా కొంటారు.’ చెప్పింది సిస్టర్. దివ్యకు అప్పుడు అర్థమయ్యాయి థియేటర్లో డాక్టర్ మాటలు – ‘ఏందట ముసల్దాని గోల. రెండు లక్షలు చాలవటనా’. - రజిత కొమ్ము -
విమానం టాయిలెట్లో మృతపిండం
న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమానం టాయిలెట్లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్ కోసం గురువారం తన కోచ్తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్ చెప్పారు. -
మరుగుదొడ్డి లేదని ‘రేషన్’ కట్
తాండూరు రూరల్ : స్వచ్ఛభారత్ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని అధికారులు రేషన్ సరుకులు నిలిపివేశారు. కనీసం తాత్కలికంగా రేషన్ సరుకులు నిలిపివేస్తే కొందరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటారని అధికారులు ఈ విధంగా చేసినట్లు సమాచారం. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాల శ్రీను, బంటు మొగులప్ప డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ రాములును కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ డీలర్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. డీలర్ అశప్పను అడగ్గా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారని చెప్పారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యం లేకపోతే ఎలా బతకాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ రాములును ఫోన్లో సంప్రదిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఎంపీడీఓ డీలర్కు చెప్పి రేషన్ సరుకులు ఇవ్వొదని చెప్పారని తహసీల్దార్ బదులిచ్చారు. ఎంపీడీఓ జగన్మోహన్రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదు. పంపిణీ చేస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రేషన్ సరుకులు నిలిపివేశాం. అంతేకాకుండా డీలర్ ఆశప్ప అనార్యోగం కారణంగా కూడా సరుకులు ఆలస్యమయ్యాయి . మంగళవారం నుంచి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందజేస్తాం. – ఇస్మాయిల్, సర్పంచ్ -
టాయిలెట్పై ఫన్నీ ట్వీట్ : నెటిజన్ల ఆగ్రహం
ఆసియాలోని టాయిలెట్లపై ఓ అమెరికన్ టీవీ స్టార్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్ మైఖేల్ వాష్ రూమ్లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్ స్ప్రెయర్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్ స్ప్రెయర్ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్రూమ్లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్ పంప్(హ్యాండ్ స్ప్రెయర్ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మైఖేల్ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్రూమ్లలో పేపర్స్ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్కు బదులు జూస్ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. I love how bathrooms here have this water hose next to the toilet incase you get thirsty while in the restroom pic.twitter.com/xsfrFeYkzh — Dean Michael Unglert (@deanie_babies) July 10, 2018 -
ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేసాడని..
పుత్తూరు: ఒక యువకుడు ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేయడంతో రేగిన వివాదం ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. దీంతో పుత్తూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ హనుమంతప్ప కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్లో నివాసముంటున్న గాంగ్మాన్ వేలాయుధం ఇంటి కిటికీ పక్కన గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జన చేశాడు. దీనిపై వేలాయుధం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల కాపురముంటున్న వారు ఆ యువకుడిని నిలదీశారు. మాటామాటా పెరగడంతో యువకుడికి వేలాయుధం దేహశుద్ధి చేశాడు. కొంత సేపటి తరువాత ఆ యువకుడు పట్టణంలోని దళితవాడకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి వేలాయుధం ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వేలాయుధంతోపాటు ఆయన భార్యపై భౌతిక దాడికి దిగారు. వేలాయుధంకు స్వల్ప గాయాలు కాగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతోంది. వేలాయుధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం వేలాయుధంకు మద్దతుగా రైల్వే సిబ్బంది వచ్చారు. మరో వైపు పుత్తూరు దళితవాడకు చెందిన వ్యక్తులు పోలీస్స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
పిల్లలతో మరుగుదొడ్డి శుభ్రం చేయించారు
శివాజీనగర: పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్డి శుభ్రం చేయించిన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా శిరడాణ క్రాస్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇతర పనులకు ఉపయోగించుకోవటం నేరమని తెలిసినా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో మరుగుడొడ్లు పరిశుభ్రం చేయించే సాహసానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయుల మెడకు చిక్కుకుంది. జిల్లా ఉన్నతాధికారులకు విషయం తెల్సినా కూడా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఈఓ ఉమాదేవిని అడగ్గా పిల్లలే స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేశారని, ఈ విషయం ఉపాధ్యాయులు, స్థానికులు చెప్పారని ఆమె సమర్థించుకున్నారు. ఈ సంఘటనకు కారకులైన ప్రధానోపాధ్యాయుడు,, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
బాత్రూంలో 2.8 కిలోల బంగారం
సాక్షి బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్న 2.8 కేజీల బంగారాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.87.69 లక్షలుగా లెక్కగట్టారు. విమానాశ్రయంలోని శౌచాలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది ఈ నెల 4వ తేదీన బాత్రూంలోని చెత్తబుట్టలో ఒక పాలిథీన్ బ్యాగ్ ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా 2.8 కేజీల బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై కస్టమ్స్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎవరో అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకొచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లలేక వదిలేసి ఉంటారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. -
స్వచ్ఛమేస్త్రీలు
అవసరం నడిపించినంత అభ్యుదయ పథంలో మనిషిని మరే ఇజమూ నడిపించలేదు. అందుకే బతికి బట్టకట్టి తీరాలనే పట్టుదల వారి చేత తాపీ పట్టించింది. స్వచ్ఛభారత్ వారికి తోడయ్యింది. సాధారణంగా నిర్మాణ రంగంలో మగవాళ్లు తాపీ పట్టుకుని ఇటుక పేర్చి, సిమెంట్ రాస్తుంటే... ఆడవాళ్లు తాపీ మేస్త్రీలకు సిమెంట్, ఇటుక అందించే పనిలో ఉంటారు. అయితే అస్సాంలోని బార్పేట జిల్లాలో ఏకంగా మూడువందలకు పైగా మహిళలు తాపీ పని చేస్తున్నారు. వీళ్లలో బెంగాల్నుంచి అస్సాంకు వలస వచ్చిన ముస్లిం మహిళలున్నారు. ఇంకా.. స్థానిక బోడో మహిళలు, బెంగాలీ హిందువులు... ఇలా రకరకాల సాంస్కృతిక నేపథ్యాల మహిళలున్నారు. తాపీ పని నేర్చుకున్న తర్వాత వాళ్ల జీవితాలు ఎంత మెరుగయ్యాయో చెప్పడానికి బార్పేట జిల్లాలోని భులుకాబారీ పత్తర్ గ్రామంలో నూర్ నెహర్ బేగం జీవితమే ఉదాహరణ. భార్యపై భర్తకు ఫిర్యాదు చేశారు! ‘‘ఊళ్లో పనుల్లేవు, మగవాళ్లు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. వాళ్లు వచ్చే వరకు ఇంటిని నెట్టుకొచ్చేదెలాగ? పొట్ట నింపడానికి ఎలాగో తిప్పలు పడతాం. కానీ పిల్లల ట్యూషన్కి ఫీజు కట్టాలంటే డబ్బెలా? అందుకే ఈ పని నేర్చుకున్నాను. ఇప్పుడు ఇల్లు గడిచేదెలాగ అనే బెంగ లేదు. నేను తాపీ పని నేర్చుకున్నానని ఊళ్లో మగవాళ్లు నా భర్త వచ్చినప్పుడు ‘మగవాళ్లు చేయాల్సిన పనులు చేస్తోంది నీ భార్య ’ ఆయన్ను నిలదీశారు. ‘అలా నిలదీసిన వాళ్లలో ఎవరైనా నా బిడ్డల కోసం ఒక్క రూపాయి ఇచ్చారా’ అని నేను నా భర్తను అడిగాను. పోయినేడాది నేను తాపీ పని నేర్చుకున్నప్పుడు నేనొక్కర్తినే, ఇప్పుడు మా ఊరు, ఆ చుట్టు పక్కల 11 గ్రామాలకు కలిసి మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు’’ అంటోంది నూర్ నెహర్ బేగం. పని ఇచ్చింది స్వచ్ఛ భారత్ మగవాళ్లే పనుల్లేక పరాయి రాష్ట్రాలకు వలస పోతున్న ఆ చిన్న గ్రామాల్లో అంతమంది మహిళలు తాపీ పని నేర్చుకున్నారు సరే, వాళ్లకు పని ఎలా? స్వచ్ఛభారత్ ఉద్యమం వీళ్లకు పని కల్పిస్తోంది. స్వచ్ఛభారత్లో టాయిలెట్లు కట్టడం ఒక ఉద్యమంలా సాగుతోంది. నిర్ణీత సమయంలో టార్గెట్ను చేరుకోవడానికి అధికారులకు చేతినిండా పని వాళ్లు కావాలి. మగవాళ్లు వలస పోయిన కారణంగా అందుబాటులో ఉన్న మహిళా తాపీ మేస్త్రీలను ప్రోత్సహించారు అధికారులు. డిస్ట్రిక్ట్ వాటర్, శానిటేషన్ అధికారి అపర్ణా అధికారి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. మగవాళ్లు కట్టిన టాయిలెట్ల కంటే ఆడవాళ్లు కట్టినవే బాగున్నాయనే ప్రశంసలు కూడా వస్తున్నాయి స్థానికుల నుంచి. ఎక్కడా మొక్కబడిగా చేయలేదు నేర్చుకునే దశలో ఉండడంతోనో లేక మహిళల్లో స్వతహాగా ఉండే సమగ్రత వల్లనో కానీ నిర్మాణం రూపం వచ్చిన తరవాత మా పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకోవడం లేదు బార్పేట జిల్లా మహిళలు. సిమెంట్ నిర్మాణానికి నీరు పట్టి, లీక్లు చెక్ చేయడం, వాటర్ క్యూరింగ్ వంటివన్నీ తమ బాధ్యతే అన్నట్లుగా చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్నాటికి జల్కారా గ్రామంలో పదిహేడు ఇళ్లకు మాత్రమే టాయిలెట్ ఉండేది. ఇప్పుడు అదే గ్రామంలో 106 ఇళ్లలో పక్కా టాయిలెట్లున్నాయి. వీళ్లు మొత్తం ఐదు పంచాయితీలకు గాను 1,423 టాయిలెట్లు నిర్మించారు. ఈ స్ఫూర్తితో ఈ మహిళలు తమ ఇళ్లలో కూడా పక్కా టాయిలెట్ను నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదారుగురు బృందాలుగా ఏర్పడి, ఎవరికి ఎవరూ డబ్బిచ్చే పని లేకుండా, ఒకరి ఇంటి టాయిలెట్ నిర్మాణంలో మిగిలిన వాళ్లు సహాయం చేసుకుంటున్నారు. – మంజీర -
టాయ్లెట్లో విద్యార్థి అనుమానాస్పద మృతి
బెంగళూరు: గుజరాత్లో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కర్ణాటకలో కలకలం రేపింది. కొడగు జిల్లాలోని సైనిక పాఠశాల్లోని టాయ్లెట్లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగులో సైనిక పాఠశాలలో తొమిదో తరగతి విద్యార్థి(14) శనివారం సాయంత్రం టాయ్లెట్ వద్ద అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. విద్యార్థి తండ్రి అదే పాఠశాలలో హాకీ కోచ్గా పనిచేస్తున్నారు. పాఠశాలలోని కొంత మంది ఉపాధ్యాయులు తన కొడుకుని వేధించినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల వైస్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కొడుకు మృతికి వైస్ ప్రిన్సిపాల్ కారణం మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్, మరో నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..!
వడోదర: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు. పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని హత్య చేస్తే తన లక్ష్యం నెరవేరుతుందనుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 9వ తరగతి చదువుతున్న దేవ్ తాడ్వి(14)ని హత్య చేసి టాయ్లెట్లో పడేశాడు. వడోదర ఎస్పీ మనోజ్ శశిధర్ ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు.. నిందితుడు శ్రీ భారతీ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రవర్తన సరిగా లేనందున అతన్ని టీచర్లు పలుమార్లు మందలించారు. దాంతో అతడు పాఠశాలపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. ఎవరినైనా హత్య చేస్తే స్కూలు మూతపడుతుందని భావించాడు. శుక్రవారం మధ్యాహ్నం టాయ్లెట్ల వద్దకు వచ్చిన దేవ్ తాడ్విపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. 90 సెకన్ల కాలంలోనే నిందితుడు తాడ్వి ప్రాణాలు తీశాడని ఎస్పీ తెలిపారు. మృతుడి శరీరంపై 31 కత్తిగాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించామని అన్నారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను గుర్తించామన్నారు. హత్యానంతరం ఇల్లు విడిచి పారిపోయిన బాలున్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, పాఠశాలను శాశ్వతంగా మూసేయాలని మృతుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడి మానసిక స్థితి సరిగా లేనందున అతనిపై చర్యలకు అప్పుడే డిమాండ్ చేయలేమని గుజరాత్ మహిళా, శిశు సంక్షేమ బోర్డు చైర్మన్ జాగృతి పాండ్యా అన్నారు. ఇదే తరహా ఉదంతం గతేడాది హరియాణాలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. పాఠశాలను మూసేయించాలనే పన్నాగంతో అక్కడే చదువుతున్న ఓ ఏడేళ్ల బాలున్ని గొంతుకోసి చంపేశారు. -
రైళ్లలోనూ వాక్యూమ్ టాయిలెట్లు
న్యూఢిల్లీ: రైళ్లలోనూ విమానాల తరహాలో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా తొలిదశలో రైళ్లలో 500 వాక్యూమ్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మొత్తం రైళ్లల్లో 2.5 లక్షల వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో టాయిలెట్కు రూ.2.5లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. వీటి వల్ల 1/20 వంతు నీటి ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. -
‘టాయిలెట్’ తెచ్చుకున్న కిమ్
సింగపూర్ : ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు ఉన్నా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు ఉన్న ప్రత్యేకత వేరు. విలక్షణమైన చేష్టలతో ఆయన తరచూ వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కిమ్ సింగపూర్లో భేటీ అయ్యారు. ఇందుకోసం సింగపూర్ వచ్చిన కిమ్ ఆయన వెంట ఒక టాయిలెట్ను తీసుకొచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా చూసుకునేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. కిమ్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు కథనం పేర్కొంది. స్థూలకాయత్వంతో బాధపడుతున్న కిమ్కు ఫాటీ లివర్ ఉందని, మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పత్రిక ఒకటి పేర్కొంది. వీటన్నింటిని పాశ్చాత్య మీడియా దృష్టిలో పడకుండా చూసుకునేందుకే ప్రత్యేక మొబైల్ టాయిలెట్ను కిమ్ జాంగ్ ఉన్ సింగపూర్కు తన వెంట తెచ్చుకున్నారని వెల్లడించింది. -
1500 కిలోమీటర్లు ప్రయాణించిన శవం
పాట్నా : రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఓ వ్యాపారి శవం ఎవరూ గుర్తించకపోవడంతో ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు 72 గంటల తర్వాత శవాన్ని గుర్తించటంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన సంజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఈ నెల 24న పాట్నా-కోట ఎక్స్ప్రెస్లో ఆగ్రాకు బయలుదేరాడు. ఉదయం 7-30 గంటల సమయంలో తన భార్యకు ఫోన్ చేసి ఆరోగ్యం సరిగాలేదని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతని భార్య ఫోన్ చేసినప్పటకీ భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భార్యకు ఫోన్ చేసిన తర్వాత టాయ్లెట్కు వెళ్లిన సంజయ్ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. టాయిలెట్లో శవం ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడంతో అలా 1500 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నా చేరుకుంది. పాట్నా చివరి స్టేషన్ కావడంతో ప్రయాణికులు దిగిన తర్వాత రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించారు. బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బందికి టాయిలెట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. టాయిలెట్ తలుపులు తెరచి చూడగా అందులో శవం ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. శవం దగ్గర ఉన్న ఐడీ కార్డు సహాయంతో మృతుడిని సంజయ్ కుమార్ అగర్వాల్గా పోలీసులు గుర్తించారు. బోగిలోని టాయ్లెట్ లోపలి నుంచి లాక్ అయ్యిందని 1500 కిలోమీటర్లు ప్రయాణించినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
గున్న గున్న మామిడి... గూడ్సుబండి దోపిడి!
మాది రైల్వేస్టేషన్ ఉన్న ఊరు. మా ఊరు మీదుగా ప్రయాణికులను తీసుకువెళ్లే రైలుబండ్లతో పాటు రకరకాల వస్తువులను ఒకచోటు నుంచి మరొకచోటికి రవాణా చేసే మాల్గాడీలు కూడా వెళుతుంటాయి.ఒక ఎండాకాలంలో నిమ్మకాయలు రవాణా చేస్తున్న ఒక మాల్గాడి(గూడ్స్బండి) అగ్నిప్రమాదానికి గురైంది.ఆ బండిని లూప్లైన్లో పెట్టారు.బాగా కాలిపోయిన బోగీలతో పాటు పెద్దగా ఏమీ కాని బోగీలు కూడా ఈ లూప్లైన్లో ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గురైన మాల్గాడి డబ్బాలను చూడడానికి మా ఊరు నుండే కాకుండా చుట్టు పక్కల ఊళ్ల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు.అగ్నిప్రమాదానికి గురైన గూడ్స్ డబ్బాలను చూడడానికి వాళ్లు అలా వస్తున్నారని పుసుక్కున్న మీరు అనుకొని ఉంటే వేడి వేడి నిమ్మకాయ తొక్కులో కాలేసినట్లే!లూప్లైన్లో ప్రమాదానికి గురైన డబ్బాలతో పాటు పెద్దగా ప్రమాదానికి గురి కాని డబ్బాలతో పాటు... అసలు ఏమీ కాని డబ్బాలు కూడా ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి. డబ్బాలను చూడడానికి వచ్చిన వాళ్లు.... వాటిని చూసినట్లే చూసి నిమ్మకాయలను నొక్కేయడం మొదలు పెట్టారు. జేబులతో మొదలైన దోపిడి సంచుల వరకు వెళ్లింది. అలా ఏ వీధిలో చూసినా నిమ్మకాయ ముచ్చట్లే.ఏ ఇంటిలో చూసినా నిమ్మకాయ పచ్చడే.నిమ్మకాయల బండి ఎపిసోడ్కు ముందు మా ఊరికి బిచ్చగాళ్ల తాకిడి విపరీతంగా ఉండేది. ఈ నిమ్మకాయ పచ్చడి పుణ్యమా అని ఒక్కరు కనబడితే ఒట్టు!‘ఒకప్పుడు.... అమ్మా ఇంత బువ్వెయమ్మా... అని అరిస్తే చాలు.... నూటొక్క రకాల కూరలు బొచ్చెలో పడేవి. ఇప్పుడు... ఏ ఇంటికి వెళ్లినా నిమ్మకాయ పచ్చడే వేస్తున్నారు. ఇక ఈ ఊరికి సచ్చినా రాకూదు’ అని ఒక సీనియర్ బిచ్చగాడు మా ఊరివాళ్ల మీద నిప్పులు చెరిగాడు కూడా!మరో విషయం ఏమిటంటే ఈ నిమ్మకాయలు కొన్ని సంసారాల్లో నిప్పులు కూడా పోశాయి. ఉదాహరణకు గొట్టిముక్కల లింగమూర్తి కేసు.ఒకరోజు పొరుగింటామె లింగమూర్తి భార్యతో....‘‘ఏమమ్మా... ఎన్ని నొక్కారు? సంచా? రెండు సంచులా?’’ అని అడిగింది. అంతే! కోపంతో లింగమూర్తి భార్య కళ్లు ఎర్రబడ్డాయి.తన భర్తను తిట్టిన తిట్టు రిపీట్ కాకుండా తిట్టడం మొదలు పెట్టింది...‘‘మా ఆయన సంగతి నీకు తెలియదా! ఒట్టి దద్దమ్మ.... చేసి పెడితే తినడం తప్ప... ఊళ్లోకి నిమ్మకాయల బండి వచ్చిందనిగానీ, అది మన కోసమే వచ్చిందనిగానీ, అలా చూసినట్లు చూసి ఇలా సంచి నిండా నిమ్మకాయలు కొట్టేయ వచ్చనిగానీ... ఇలాంటి కనీసం జ్ఞానం ఈయనకు ఉండి చచ్చిందా!మన ఇంటెనక ఈరయ్య ఇంటి నిండా నిమ్మకాయలేనట.ఈయన ఉన్నాడెందుకు... మనిషి జన్మ పుట్టినందుకు దమ్ము, ధైర్యం ఉండాలా... గొడ్డులా తినడం కాదు...’’ నాన్స్టాప్గా తిట్టడం మొదలు పెట్టింది.ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే...భర్త బజారుకు వెళ్లాడని ఆమె తిట్లు అందుకుంది.కానీ ఆయన బజారుకు వెళ్లినట్లే వెళ్లి ‘స్టమక్ నెట్వర్క్’ నుంచి అర్జెంట్గా మెసేజ్ రావడంతో ఉరుకులు పరుగుల మీద వెనక్కి వచ్చి టాయిలెట్లో దూరాడు. పాపం ఈ దృశ్యాన్ని ఆయన భార్య చూడలేదు. టాయిలెట్లో ఉన్న లింగమూర్తి మాత్రం భార్య తిట్లను ఆకాశవాణి వార్తల్లా శ్రద్ధగా విన్నాడు.బయటకి వచ్చాడో లేదో...‘‘ఏమాన్నావు? నేను గొడ్డునా?’’ అని లుంగీ సర్దుకుంటూ భార్య వైపు ఆవేశంగా అడుగులు వేశాడు. అంతే! ఆయన భార్య జంప్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు లింగమూర్తి భార్య పుట్టింటి నుంచి తిరిగిరానేలేదు! అవసరానికి మించి, అవసరం లేకపోయినా నిమ్మకాయలు వాడడం వల్ల కొందరికి ‘నీంబోరియా’ అనే వ్యాధి ఎటాక్ కావడంతో ఊళ్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే... ఒక వ్యక్తి అప్పటి వరకు ఏ టాపిక్ మాట్లాడుతున్నా సరే... సడన్గా నిమ్మకాయాల టాపిక్లోకి దూరిపోయి ఏదో ఒకటి వాగుతుంటాడు. ఉదాహరణకు ‘నీంబోరియా’ సోకిన పెంచలయ్యను తీసుకుందాం.సపోజ్ ఈయనను ‘కర్నాటక రాజకీయాల గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా?’ అని అడిగాము అనుకుందాం. ఆయన ఇలా స్పందిస్తాడు.‘‘కర్నాటక రాజకీయాలు ఊహకు అందనివేమీ కావు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని... హంగు వస్తుందని అందరూ అనుకున్నదే. అయితే రిజల్ట్ తరువాత ఇంత హంగామా ఉంటుందని ఎవరూ అనుకోలేదు... లింగాయత్ ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే... నిమ్మ కాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపురంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. ఇంతకీ కర్నాటకలో ఏ పార్టీ గెలిచినట్లు, ఏ పార్టీ ఓడినట్లు! సీట్లు తక్కువ వస్తేనేం... ఓట్ల శాతం ఎక్కువ అని సంతోషించాలా? ఓట్ల శాతం తక్కువ అయితేనేం... సీట్లు ఎక్కువ వచ్చాయని సంతోషించాలా? నిమ్మ గురించి మొదటిసారిగా పదవ శతాబ్దంలో అరబ్ సాహిత్యంలో పేర్కోబడింది. అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా నిమ్మకాయలు పండించారు. కర్నాటక రాజకీయాలు, వాటి ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి పరిమితమైన వ్యవహరం అనేది వాస్తవం కాదు. దేశరాజకీయాలు సరికొత్త సమీకరణలతో ముందుకు వెళతాయి... నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి పది అడుగుల ఎత్తు పెరుగుతుంది. పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిలా ఉంటుంది...’‘నీంబోరియా’ వ్యాధి చాలాముంది యువకులకు ఎటాక్ కావడంతో... మా ఊళ్లో అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా భయపడేవారు.ఏదైనా పని సులువుగా అయిపోతుందని చెప్పడానికి... ‘అరచేతిలో నిమ్మకాయ పట్టినంత సులభంగా పని అయిపోతుంది’ అనేది మన జాతీయం. ఈ దొంగ నిమ్మకాయలు మాత్రం రకరకాల సంఘటనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేంత పనిచేశాయి! – యాకూబ్ పాషా -
టాయిలెట్ ఉంటేనే జీతం ఇస్తాం
సీతాపూర్, యూపీ : మీరు యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగా...? అయితే మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా...? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మీకు నెల జీతం అందుతుంది. మరుగు దొడ్డి ఉన్నట్లు చెప్తే సరిపోదు...దానికి సంబంధించిన ఫోటోతోపాటు ప్రమాణ పత్రాన్ని ఇస్తేనే మీకు మీ నెల జీతం అందుతుందనే నూతన నిబంధనను తీసుకు వచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతొంది. ఈ ఫోటో యూపీకి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భగవత్ ప్రసాద్ది. ఇది అతను తన ఇంటి టాయిలెట్లో ఒక స్టూలు మీద కూర్చుని దిగిన ఫోటో. ఫోటోతో పాటు ప్రమాణ పత్రంలో అతని ఆధార్ కార్టు నంబరు, కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. భగవత్ ప్రసాద్ ఇంట్లో మరుగుదొడ్డి ఉందనే దానికి నిదర్శనం ఈ ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రాన్నిపంచాయితీ ఆఫీసులో ఇవ్వాలి. తర్వాతే అతనికి ఈ నెల జీతం అందుతుంది. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగంగా యూపీ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం సీతాపూర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రీట్ శీతల్ వర్మ సీనియర్ అధికారులకు ఒక నోటీసు జారీ చేసారు. మీ సిబ్బంది ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా, ఉంటే వాటి ఫోటోలను తీసి జిల్లా పంచాయితీ రాజ్ అధికారులకు పంపిచమని, అలా చేసిన వారికి మాత్రమే జీతం ఇస్తామని ఆదేశించారు. ఈ విషయం గురించి శీతల్ వర్మ ’ప్రధాని మోదీ 2018, అక్టోబరు 2 నాటికి మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం తపప్పనిసరిని తెలిపారు. ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపారు. ఈ నెల 27 నాటికి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నట్లు ఫోటో పంపించకపోతే వారికి ఈ నెల జీతం ఆపేస్తామన్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
కాలేజీ టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్లో విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్లోని ధర్మ్సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్వేర్ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు. -
ప్రిన్సిపాల్ వినూత్న ఆలోచన.. విమర్శలు!
లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు. విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు. -
పోలీస్ స్టేషన్లో నాగుపాము
కడప , ఓబులవారిపల్లె : స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి నాగుపాము కనిపించింది. స్టేషన్ బయట ఉన్న మరుగుదొడ్డి పక్కనే శబ్దం రావడంతో అటువైపు వెళుతున్న కానిస్టేబుల్ అమర్ చూశాడు. ఆయన గమనించి తోటి సిబ్బందికి తెలిపాడు. పాము పడగవిప్పి బుసలు కొడుతుండటం, రాత్రి కావడంతో దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. రెండు గంటల సేపు అలాగే ఉన్న పాము పక్కనే ఉన్న వాహనాల్లోకి వెళ్లింది. పట్టుబడ్డ వాహనాలను రైల్వేకోడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన వారు పోలీసు క్వార్టర్స్లో ఉంచారు. అవి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. విషసర్పాలకు అడ్డాగా మారాయి. తరచూ క్వార్టర్స్లోకి వస్తుండటంతో పోలీసు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలను మరో చోటుకు తరలించాలని పోలీసులు కోరుతున్నారు. -
చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఘటన.. రైల్వే యాక్షన్..
సాక్షి, హైదరాబాద్ : రైలులో అమ్మే టీలో బాత్ రూం నీళ్లను కలిపిన వీడియోపై భారతీయ రైల్వే చర్యలకు ఉపక్రమించింది. బాత్రూం నీళ్లను టీ క్యాన్లో కలిపిన కాంట్రాక్టర్కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు మూడు టీ క్యాన్లు తీసుకొని రైలులోని ఓ బోగీలోకి ఎక్కారు. ఒక వ్యక్తి ఆ మూడు క్యాన్లను టాయిలెట్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు. టీ క్యాన్లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బోగీ తలుపు వద్ద నిలుచున్న ఓ వ్యక్తి తన స్మార్ట్ఫోన్తో ఈ ఘటనను చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులుగా వైరల్గా మారిన ఈ వీడియోపై రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది. రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న పి.శివప్రసాద్ అనే కాంట్రాక్టర్కి చెందిన ఉద్యోగులే ఇందుకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో శివప్రసాద్కు దక్షిణ మధ్య రైల్వే లక్ష రూపాయల జరినామా విధించింది. శివప్రసాద్కు ఉన్న ఐఆర్సీటీసీ లైసెన్స్ను కూడా రద్దు చేసింది. -
అయ్యా.. మీ కాళ్లు కడుగుతాం !
నవాబుపేట (జడ్చర్ల): బాబ్బాబు మీ కాళ్లు కడుగుతాం.. ఎలాగైనా సరే ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోండి.. అంటూ గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ జిల్లాను వంద శాతం ఓడీఎఫ్గా మార్చాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఇళ్లిళ్లూ తిరుగుతూ మరుగుదొడ్డి లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని నవాబుపేట మండలం పోమాల్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం వినూత్న ప్రచారం చేశారు. మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించి ఆ ఇంటి యాజమాని కాళ్లు కడిగి విజ్ఞప్తి చేయడంతో పాటు పాటు ఇంటి మహిళకు బొట్టు పెట్టి యజమానిని ఒప్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, శ్రీశైలం, రాజు, శ్రీౖశైలం, చంద్రయ్య, ఎస్బీఎం బృందం మల్లికార్జున్, రవితో పాటు అంగన్వాడీ, ఆశ, సాక్షరభారత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళల సమాధానం.. సీఎం షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కి తన పర్యటనలో ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ స్వరాజ్ యోజన పథకాన్ని రాష్ట్రంలో 50,000 పంచాయతీల్లో విస్తరించాలనేది యోగి ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి యోగి గతకొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిత్యానాథ్ సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కందీపూర్, మధుపూర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో స్థానిక అధికారులు ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చాక అందరికీ మరుగుదొడ్లు నిర్మించిందా? లేదా? అని ప్రశ్నించగా... అక్కడున్న మహిళలంతా లేదు అని బిగ్గరగా అరవడంతో సీఎం షాక్తిన్నారు. ఈ ఘటనతో తీవ్ర అసహనానికి గురైన యోగి వెంటనే అక్కడున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలకు 24 గంటల్లో వారి ఖాతాలో నగదు జమచేసి, మరుగుదొడ్లు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం దళితవాడలో పర్యటించి, వారితో కలిసి భోజనం చేశారు. -
పథకాల లక్ష్యాలను సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను సాధించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులు, విద్యాధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం 1.42 లక్షలు కాగా.. ఇప్పటివరకు 1.10 లక్షలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించే ఉద్దేశంతో ఇప్పటివరకు జిల్లాలో రూ.21 కోట్లు ఖర్చు చేశామన్నారు. దండేపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, వేమనపల్లి మండల అభివృద్ధి అధికారులను మినహాయించి మిగతా మండల అభివృద్ధి అధికారులకు ఓపెన్ బావులు, ఫామ్పాండ్స్ నిర్మించడంలో జాప్యం జరిగినందున షోకాజ్ నోటీసులు జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేస వి సెలవులు ముగిసే లోగా పాఠశాలల్లో వంటశాలలు, మూత్రశాలలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే 10న రైతుబంధు పథకం మొదటి విడత చెక్కుల పంపిణీకి మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో ఎ లాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి మరణధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, పట్టాదారు పా సుపుస్తకం, ఆధార్ అనుసంధానంతో పాటు రైతుల వివరాలను పునఃపరిశీలించాలని తహసీల్దార్, మండ ల స్థాయి అధికారులకు సూచించారు. వ్యవసాయ వి స్తరణ అధికారులు ఉద్యానవన సిబ్బంది కలిసి ఫామ్పాండ్స్, ఓపెన్ బావుల లక్ష్యాలను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ కింద తొమ్మిది మండలాల్లోని 18 గ్రామాల్లో ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారులకు సూ చించారు. వేసవికాలంలో కలుషిత నీరు తాగడం వల్ల కన్నెపల్లి ఎస్టీ కాలనీలో జ్వరాలు ప్రబలి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు కేటాయించిన ఫార్మాట్లో నివేదిక పంపించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ పథకాలపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు, మండల అభివృద్ధి అధికారులు బ్యాంకు అధికారులతో కలిసి ప్రభుత్వ ఆర్ధిక చేయూత పథకాలపై ఈనెల 24వ తేదీలోపు లబ్దిదారులతో గ్రామçసభ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ, ఎక్సైజ్, ఉద్యానవనశాఖ, పేదరిక నిర్మూలన సంస్థ, గిరిజనాభివృద్ధి శాఖ, సింగరేణి తదితర శాఖల సమన్వయంతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు. నర్సరీలు, మొక్కల ప్లాంటేషన్ను వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల సంక్షేమాధికారులు రవూఫ్ఖాన్, ఖాజా నజీమ్ అలీ అఫ్సర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్కే లేదు..మాకెందుకు?
మూసాపేట: సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదు.. మాకెందుకు అంటూ మండల పరిధిలోని తుంకినీపూ గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. వంద శాతం ఓడీఎఫ్ సాధించాలన్న లక్ష్యంతో అధికారులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు తుంకినిపూ గ్రామానికి ఎంపీడీఓ నర్సింహారావు, ఈఓఆర్డీ ప్రభాకర్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడగా.. పలువురు ఎదురుతిరిగారు. సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదని.. మేమేందుకు కట్టుకోవాలని అడగడంతో అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మమ్మ అధికారుల ముందే గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి విషయం మీకెందుకు’ అని అడగడంతో అధికారులు ఎవరికీ సర్దిచెప్పలేకపోయారు. -
ఐఎస్ఎల్ సొమ్ము స్వాహాపై విజిలెన్స్ విచారణ
తొండంగి(తుని) : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అమలులో భాగంగా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు నిర్మించినట్టు చూపించి నిధులు కాజేసిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ ప్రారంభించారు.పైడికొండ పంచాయతీలో పైడికొండతోపాటు ఆనూరు గ్రామాల్లో అధికారులు, కాంట్రాక్టర్ కలిసి 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్ రికార్డుల్లో చూపించారు. వీటిలో సగానికి పైగా లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు లేని ఇళ్ల వద్ద, దీర్ఘకాలం క్రితం సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి వివరాలు నిర్మించినట్టు చూపారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి పేరు మీద రూ.15వేల చొప్పున సుమారు పైడికొండ పంచాయతీ పరిధిలో సుమారు రూ.60 నుంచి 70 లక్షల వరకు నిధులు కాజేసినట్టు ‘సాక్షి’ ఈ బాగోతాన్ని గతేడాది డిసెంబర్లో ప్రత్యేక కథనంతో వెలికితీయడం అప్పట్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆనూరు గ్రామంలోని బాధిత ప్రజలు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పైడికొండలో బాధిత గ్రామస్తులందరూ వ్యవహారానికి కారకులైన గ్రామ కార్యదర్శి బుచ్చిరాజు, ఇతర అధికారులతోపాటు స్థానిక అ«ధికార పార్టీ నేతలను నిలదీసి జరిగిన అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ ద్వారా కొంచెం నోరున్న నాయకుల నోరు మూయించేందుకు నేరుగా డబ్బులు పంపిణీ నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓతో డ్వామా ఏపీఓ, ఇతర 34 మంది కూడిన బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో ఆన్లైన్ లబ్ధిదారుల రికార్డుల ప్రకారం ఇంటింటా పర్యటన నిర్వహించి వాస్తవ విషయాలను సేకరించి నివేదిక రూపొందించింది. ఈ ప్రక్రియకు ముందు సదరు కాంట్రాక్టర్, అధికారులు కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్ల వద్ద ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిని పూర్తి చేసినా అందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. కాగా సొంత ఖర్చులతో మరుగుదొడ్డిని నిర్మించుకున్న వారికీ తమకు తెలియకుండా పేరు వాడుకున్నందుకు కూడా కాంట్రాక్టర్ నయానా, భయానా సొమ్ములు ముట్టజెప్పారని సమాచారం. ప్రారంభమైన విచారణ పైడికొండ పంచాయతీలో జరిగిన ఐఎస్ఎల్ నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం, అవినీతి బాగోతాలపై విచారణ జరపాలంటూ ఆనూరుకు చెందిన బాధిత గ్రామస్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఈ డీఎస్ఎన్ మూర్తి, మరికొంత మంది అధికారుల బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. పైడికొండ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల్లో వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా లబ్ధిదారుల పేర్లు ఆధారంగా అధికారుల బృందం స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతోపాటు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈ మూర్తి తెలిపారు మరో రెండు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఇదే తంతు? పైడికొండ అక్రమాలు బయటపడడంతో మిగిలిన పంచాయతీల్లో ప్రజలు కూడా తమ వివరాలు దుర్వినియోగమయ్యాయేమోనని వెతుకులాటలో పడ్డారు. దీంతో పి.ఇ.చిన్నాయపాలెం, బెండపూడి తదితర గ్రామాల్లో కూడా లబ్ధిదారుల పేరుమీద భారీస్థాయిలో నిధులు కాజేసినట్టు తెలిసింది. దీంతో బాధిత ప్రజలు ఇప్పటికే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని..
అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని గుడిబండలో గురువారం అధికారులు పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీఓ బి.నర్సింగ్రావు, స్థానిక సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి యశోద, అంగన్వాడీ, ఆశలు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ నిర్మాణాలు మొదలుపెట్టని వారిని కలిశారు. నిర్మాణాలు మొదలు పెట్టి మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ సూచించారు. నిర్మాణాలు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ల ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. మొండికేసిన వారి ఇళ్లకు విద్యుత్ శాఖ సిబ్బందితో కరెంటు కనెక్షన్లను తొలగింపజేశారు. నిర్మాణాలు పూర్తిచేసిన 5 మంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయం వద్ద చెక్కులను అందజేశారు. మూడు రోజుల్లో గ్రామంలో నిర్మాణాలు పూర్తి కావాలని ఎంపీడీఓ బి.నర్సింగ్రావు సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. -
రైతును 4 కి.మీ పాటు బానెట్పై ఉంచి..
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండో విడతగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని బ్లాక్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్లోని రామ్నగర్ బ్లాక్కు చెందిన ప్రజలు టాయిలెట్ల నిధుల కోసం అధికారి కార్యాలయానికి వెళ్లారు. తమ సమస్యపై బీడీవో మాట్లాడాలని చెప్పగా కార్యాలయంలో ఎవరూ స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకూ ఎవరైనా వస్తారని కార్యాలయం వద్దే వేచి చూశారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీడీవో పంకజ్ కుమార్ గౌతమ్ కార్యాలయం బయటకు వచ్చి రైతుల వైపు కన్నైత్తైనా చూడకుండా వెళ్లిపోసాగారు. ఇది గమనించిన రైతులు పంకజ్ వెనుక వెళ్లగా.. ఆయన కారులో ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశారు. అధికారి కారును అడ్డుకున్న రైతులు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల వినతిని లెక్కచేయని అధికారి కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో రైతుల్లో కొందరు కారుకు అడ్డుతప్పుకోగా.. ఒక యువ రైతు మాత్రం అలానే అడ్డుపడి కారు బానెట్ను పట్టుకున్నాడు. కానీ పంకజ్ కారును ఆపకుండా అలానే నాలుగు కిలోమీటర్లు పాటు పోనిచ్చాడు. ఈ ఘటనను మొత్తం పంకజ్ తన ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత ఇరువురూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పంకజ్ రికార్డు చేసిన వీడియో సోషల్మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ బ్లాకడెవలప్మెంట్ ఆఫీసర్ విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. -
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు చేదు అనుభవం
-
మోదీపై ఆర్జేడీ నేత సెటైర్లు
సాక్షి, పాట్నా : బిహార్లో కేవలం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించారని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. బిహార్లో గంటకు 5059 మరుగుదొడ్లు నిర్మించడం సాధ్యమా అని ప్రశ్నించారు. మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కనీసం బిహార్ సీఎం కూడా దీన్ని అంగీకరించరని తేజస్వి ట్వీట్ చేశారు. వారానికి ఏడు రోజులు..రోజుకు 24 గంటలు..అంటే ఏడు రోజుల్లో 168 గంటలకు గాను ఒక్కో గంటలో 5059 మరుగుదొడ్లు నిర్మించారన్నది ప్రధాని వ్యాఖ్యల సారాంశమని, బిహార్లో ఇది సాధ్యమేనా అని తేజస్వి ప్రశ్నించారు. ప్రధాని నుంచి ఇలాంటి బూటకపు ప్రచారం ఆశించలేమన్నారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను బిహార్ సీఎం కూడా అంగీకరించబోరని తేజస్వి ఆక్షేపించారు. స్వచ్ఛభారత్ మిషన్కు స్ఫూర్తినిచ్చేలా బిహార్ ప్రభుత్వం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించిందని సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలను మంగళవారం ప్రధాని మోదీ ప్రశంసించిన క్రమంలో తేజస్వి ట్వీట్ చేశారు. -
నేరవేరని లక్ష్యం..!
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు ఆర్భాటం చేస్తున్నాయి. కానీ అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. గత మార్చి 31 వరకు సుమారు 50 శాతం కూడా పూర్తి చేయలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల్వంచరూరల్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మొత్తం 81,172 వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ దశల్లో 49వేల682 మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంకా 12వేల484 మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభించలేదు. మార్చి 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా లక్ష్యాన్ని సాధించలేకపోయారు. లబ్ధిదారులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించకపోవడంతో నిర్దేశితి గడువులో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు గ్రామాలనే ఓడీఎఫ్(బహిరంగ మల, మూత విసర్జన రహిత ప్రాంతం)గా మార్చారు. రూ. 12 వేలు సరిపోవడంలేదు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మంజూరు చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ మొత్తం సరిపోవడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సిమెంట్, ఇటుకలు, మేస్త్రీ కూలీ ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో ప్రభుత్వం ఇస్తున్న రూ.12వేల సరిపోవడం లేదని చెబుతుఆన్నరు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిధుల వ్యయాన్ని పెంచాలని కోరుతున్నారు. జూన్లోగా పూర్తిచేయాలి జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్కింద మొత్తం81,172 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్లు మార్చి నాటికి పూర్తయ్యాయి. మార్చి 31నాటికి పూర్తికాని మరుగుదొడ్లను జూన్నాటికి పూర్తి చేయాలి. లక్ష్యసాధనకోసం చర్యలు తీసుకుంటున్నాం. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లబ్దిదారులు నిర్మాణంలో తీవ్రజాప్యం చేయడంతో జిల్లాలో మూడు గ్రామపంచాయతీలు మాత్రమే ఓడీఎఫ్గా ప్రకటించాం. ఏప్రిల్ నెలాఖరుకు వంద గ్రామాలను ఓడీఎఫ్గా మార్చుతాం. –విజయచంద్ర, ఏపీడీ -
మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై ఈఓపీఆర్డీ సీహెచ్ఎస్ఎన్ఎం రాజు, మండల జేఈ బర్ల భాస్కరరావు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామంలో కొందరిని విచారణ చేసే సమయంలో అక్రమాల అనకొండ, టీడీపీ నాయకుడు అక్కడే ఉండి అందరినీ భయబ్రాంతులకు గురిచేసే యత్నం చేశాడు. దీంతో కొందరు బయటకు రాలేకపోయారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ వివరాలు చెబుతుండగా ముప్పేట దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకొంది. అక్రమాల చిట్టా వివరించిన నగేష్ సాంకేతికంగా కొన్ని వివరాలు విచారణాధికారులు నమోదు చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడ్డవారు అక్కడే ఉంటే విచారణ ఎలా చేస్తారని, మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే యత్నాలు టీడీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. విచారణాధికారులు మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. విచారణ కొనసాగిస్తామని తెలిపారు. విచారణాధికారిని మార్చిన నాయకులు... పారాది అక్రమాలపై ఆర్డీఓ సుదర్శనదొర ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును నియమించగా, టీడీపీ నాయకులు డమ్మీ ఎంపీపీ కలిపి మండల జేఈ బర్ల భాస్కరరావును నియమించారు. శంకరరావు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడతారని, తిరిగి తమకు నష్టం కలుగుతుందనే భావంతో రాత్రికి రాత్రి విచారణాధికారి పేర్లు మార్చి తక్షణమే విచారణ చేయించేలా చర్యలు చేపట్టారు. ఏదోలా తూతూమంత్రంగా విచారణ చేయిస్తే ఊరుకోబోమని, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును విచారణాధికారిగా ఆర్డీఓ నియమిస్తే ఆయనను ఎందుకు తప్పించారని పలువురు ప్రశ్నిస్తూ ఈ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము లోకాయుక్తకు వెళ్తామని, న్యాయవాది, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ తెలిపారు. -
మరుగుదొడ్లు రెట్టింపు.. సదుపాయాలు శూన్యం
ఇంటింటికీ టాయిలెట్ సౌకర్యం అంశంలో సంఖ్యాపరంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. మహాత్మా గాంధీజీ కన్న కలలు నిజమయ్యేలా భారత్ను అద్దంలా తళతళలాడేలా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడున్నరేళ్ల క్రితం స్వయంగా చీపురు పట్టి రాజధాని వీధుల్ని తుడిచి మరీ ప్రకటించారు. బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి అక్టోబర్ 2, 2019 గాంధీజీ 150వ జయంతిన స్వచ్ఛ భారత్తో ఘనంగా నివాళులర్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యసాధన దిశగా మెరుగైన ఫలితాల్ని సాధిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ మొదలైన ఇన్నేళ్లలో నివాస గృహాలకు మరుగుదొడ్ల సదుపాయం రెట్టింపైందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ లోక్సభకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 2014 అక్టోబర్ 2 నాటికి దేశంలో 38.7 శాతం నివాసాలకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, 2018 మార్చి నాటికి 78.98శాతం నివాసాలకు ఈ సదుపాయం పెరిగింది. ఈ మూడున్నరేళ్లలో 6.4 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఒడిఎఫ్ను సాధించాయి. ఒడిఎఫ్ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ మహారాష్ట్ర, మేఘాలయా, సిక్కిం, ఉత్తరాఖండ్ కేంద్రపాలిత ప్రాంతాలు దాదా నాగర్ హవేలి, డయ్యూ డామన్ , చండీగఢ్ ఇక టాయిలెట్లు సదుపాయం ఘోరంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఒడిశా, జమ్ము కశ్మీర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్లో కేవలం 41 శాతం ఇళ్లకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, ఒడిశాలో 48 శాతం, కశ్మీర్లో 51శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సదుపాయం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా 19 లక్షల టాయిలెట్స్ను నిర్మిస్తే ఒడిఎఫ్ రాష్ట్రాల జాబితాలో నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యం చేరుకోవాలంటే 22 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలో 9 కోట్ల 80 లక్షల టాయిలెట్స్ను నిర్మించాలన్నదే స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పెట్టుకొని భారీగా నిధులు కూడా కేటాయించారు సదుపాయాల సంగతేంటి? ఇంటింటికి టాయిలెట్స్ విషయంలో సంఖ్యాపరంగా రెట్టింపైనప్పటికీ సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల నీటి సదుపాయం లేక టాయిలెట్ ఉన్నప్పటికీ బహిర్భూములకే వెళుతున్నారు. మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, టాయిలెట్కి సరైన పద్ధతిలో ట్యాంకులు నిర్మించకుండా ఏదో ఒక గొయ్యిని తవ్వడం వల్ల దానిని వినియోగించుకోలేకపోతున్నారు. నాలుగు గోడలు కట్టేసి పైపు లైన్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా టాయిలెట్లను వినియోగించుకోలేని పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లోని గోపాల్పుర గ్రామంలో 330 ఇళ్లకు గాను 100 టాయిలెట్స్ను కట్టించారు. కానీ వారిలో ఒక్కరు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. దీనికి నీటి వసతి లేకపోవడం, నాసిరకం నిర్మాణాలే కారణం.. కొంతమంది ఆ టాయిలెట్స్ని గోడౌన్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలాగైతే కోట్లలో అంకెలే కనిపిస్తాయి తప్ప అసలు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం వినిపిస్తోంది. -
ఒట్టేసి చెబుతున్నా.. నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
వరదయ్యపాళెం/పిచ్చాటూరు/కేవీబీపురం: ‘ఒట్టేసి చెబుతున్నా..మహిళల ఆత్మగౌరవం పేరుతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైన ఇళ్లకు పంపడంలో వెనుకడుగు వేసేది లేదు’ అని జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వరదయ్యపాళెంలోని ఒన్నెస్ కోచింగ్ సెంటర్లో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన అధికారులతో ఓడీఎఫ్, నరేగా పథకాల గురించి జిల్లా కలెక్టర్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ రుగుదొడ్డి నిర్మాణాల నిధులకు కొరత లేదని ప్రస్తుతం జిల్లాకు రూ.625 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2లక్షల మరుగుదొడ్లు నిర్మించామని, మరో 80వేల మరుగుదొడ్లు నిర్మిస్తే ఓడీఎఫ్ ఖాతా లోకి చేరుకుంటామన్నారు. శ్రమకు తగి న ఫలితం రావాలంటే ఈనెల 30 లోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సత్యవేడు మండలంలోని కన్నవరం, మల్లవారిపాళెం, పెద్దఈటిపాకం, సత్యవేడు, వానెల్లూరు పంచాయతీలలో 1012 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్యం పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీబీపురం మండలంలోని ఐకేపీ(వెలుగు)కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 29 పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందితో మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిచ్చాటూరు మండలం ఎంపీడీఓ కార్యాలయలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు టార్గెట్లను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. కీళపూడి, ముడియూరు పంచాయితీలలో నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. -
వైరల్.. లిఫ్ట్లో బాలుడి బిత్తిరి చర్య
బీజింగ్ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది. లిఫ్ట్ బటన్స్ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్ పోసాడు. తీరా ఆ బటన్స్ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చే సరికి బటన్స్ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. దీంతో లిఫ్ట్ డోర్ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్లను ప్రెస్ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. -
లిఫ్ట్లో బాలుడి బిత్తిరి చర్య.. వీడియో హల్ చల్
-
ఓ వైపు లక్ష్యం.. మరోవైపు నిర్లక్ష్యం
కాశీబుగ్గలోని హడ్కో కాలనీకి చెందిన ఈ బాలుడు మూడు నెలలుగా ఇలాగే నిచ్చెన ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. నిచ్చెన కింద పది అడుగుల గొయ్యి ఉంది. కుటుంబమంతా ఇలాగే అవస్థలు పడుతోంది. ఎందుకంటే.. శ్రీకాకుళం ,కాశీబుగ్గ: మరుగుదొడ్ల నిర్మాణం నిరుపేదలను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. కట్టేందుకు సరైన స్థలం, సరిపడా డబ్బులు లేకపోయినా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారన్న భయం, బిల్లులు మంజూరు చేస్తారన్న ఆశతో గొయ్యిలు తవ్విన వారికి నిరాశే ఎదురవుతోంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు హడ్కోకాలనీలో పాలక శ్యామల, శంకరరావులు తమకు సరైన స్థలం లేకపోయినా మరుగుదొడ్డి కోసం ఇంటి ముందే భారీ గొయ్యిలు తవ్వారు. అయితే మొదటి విడత బిల్లులు ఇంతవరకు రాకపోవడంతో తదుపరి పనులు చేపట్టలేదు. ఇప్పటికి మూడు నెలలవుతున్నా అధికారులు స్పందించకపోవడంతో నిచ్చెనలు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో గోతుల్లో పడే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
చేతితో టాయిలెట్ను శుభ్రపరిచిన ఎంపీ
భోపాల్ : చేతితో టాయిలెట్ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. మధ్యప్రదేశ్లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు. దీంతో వెంటనే వాటిని పరిశీలించిన ఆయన చీపురు చేత పట్టి టాయిలెట్స్ను శుభ్రపరిచారు. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించాలని చాటి చెప్పాడు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ గత బుధవారం జైపూర్లోని ఓ గోడకు మూత్రం పోసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇక ఈ విషయాన్ని సైతం నెటిజన్లు ప్రస్తావిస్తూ జనార్థన్ మిశ్రాను కొనియాడుతున్నారు. -
చేతితో స్కూల్ టాయిలెట్ శుభ్రపరిచిన ఎంపీ
-
లేనిది ఉన్నట్టు... అంతా కనికట్టు...
ఒకే ఇంట్లో నిర్మించిన మరుగుదొడ్డికి ముగ్గురి పేర్లతో బిల్లులు కాజేశారు. తాత్కాలికంగా గుడ్డతో కట్టుకున్న దొడ్డి ఉంటే దానికి డబ్బులు గుంజేశారు. చనిపోయినవారి పేర్లను చేర్చి వారి పేరున స్వాహా చేశారు. ఇదీ కొత్తవలస మండలం చినరావుపల్లిలో జరిగిన బిల్లుల మాయాజాలం. కొత్తవలసరూరల్(శృంగవరపుకోట): స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఓ వైపు జిల్లా కలెక్టర్ ఓ ఉద్యమంలా కార్యక్రమాలు చేపడుతుంటే అందులోనూ కాసులు కాజేసేవారు పుట్టుకొస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడానికి తప్పుడు లెక్కలతో బిల్లులు కాజేసేశారు. ఈ స్కాం వెనుక మండలానికి చెంది న ఓ అ«ధికారి టీడీపీ ప్రతినిధుల అండదండలతో ఉన్నట్టు తెలుస్తోంది. మండలంలోని చినరావుపల్లిలో జరిగిన బిల్లులే అక్రమాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. 40శాతానికి పైగా బిల్లులు స్వాహా చినరావుపల్లిలో చనిపోయినవారి పేరిట చెల్లింపు, అస్సలు నిర్మాణాలే లేకుండా డ్రా చేయడం, అసంపూర్తిగా వదిలేసిన వాటికీ, ఒకే నిర్మాణంతో ముగ్గురికి బిల్లులు చెల్లించిన సంఘటనలు వెలుగు చూశాయి. గ్రామంలో 182 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు తీసేసుకున్నా... 40 శాతానికి పైగా బిల్లులు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. గ్రామానికి చెందిన సింగంపల్లి వాసు, బూసాల వెంకటరమణతో పాటు గ్రామంలోగల తెలుగు తమ్ముళ్లు తదితరులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్కు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో 182 మంది లబ్దిదారులను ఓడీఎఫ్కు ఎంపికచేసి దాదాపు రూ. 27 లక్షలు మంజూరు చేశారు. అందులో ఎన్జీఓ అకౌంట్లో రూ. 24 లక్షలు, వెలుగు సీసీ వీఓ అకౌంట్లో 2 లక్షలు, లబ్ధిదారుల అకౌంట్లో సుమారు 84 వేలు చేరింది. పనులు పర్యవేక్షించాల్సిన కార్యదర్శి మరో గ్రామం బాధ్యతలు చూస్తున్నందున దీనిపై దృష్టిసారించలేకపోయారు. ఉపాధి టీఏ సూర్యకుమారి జియోట్యాగింగ్ వంటి పనులు చూశారు. అయితే అనుమానం వచ్చి ఆమె అభ్యంతర పెట్టినా కొందరి ఒత్తిళ్లతో తలూపక తప్పలేదు. రకరకాలుగా అక్రమాలు ∙గ్రామానికి చెందిన కొయ్యాన లక్ష్మి, కొయ్యాన కొండమ్మ, కొయ్యాన గౌరి ఒకే కుటుంబంగా నివసిస్తున్నారు. ఇక్కడ ఒకే మరుగుదొడ్డి నిర్మించినప్పటికీ వీరి ముగ్గురి పేరిట మూడు బిల్లులుగా రూ. 45 వేలు ఆన్లైన్లో చెల్లించేశారు. ∙గంధం సరళ అనే ఆమె కేవలం ఒక గుడ్డమాత్రమే కట్టుకుని మరుగుకు వినియోగిస్తున్నారు. ఈమెకు తెలీకుండానే బిల్లు చెల్లించినట్టు నమోదైంది. ∙అడ్డాల లక్ష్మికి అసలు ఇల్లే లేదు. అయినా లెక్కకోసం నందలు తీసి వదిలేశారు. ∙చనిపోయిన యర్ర బంగా రమ్మ పేరిట నిర్మించిన బాత్రూంను అసంపూర్తిగా వదిలే సి లబ్ధిదారునికి చేరాల్సిన బిల్లులు పక్కదారి పట్టించేశారు. కంప్యూటర్ మాయాజాలం గ్రామంలో జరిగిన బిల్లు చెల్లింపుల వ్యవహారంలో సాంకేతిక మాయాజాలం కూడా వెలుగు చూసింది. బాత్రూం ఐడీ 30311073 కొయ్యానగౌరి అని నమోదైతే రేషన్ కార్డు కొయ్యాన అచ్చుతరావుగా చూపుతోంది. లబ్ధిదారుల జాబితాకు రేషన్కార్డులకు అసలు పొంతన ఉండట్లేదు. మరుగుదొడ్డి నిర్మించకుండానే తినేశారు మా ఇంటికి మరుగు లేదు. గుడ్డ కట్టుకుని మరుగుగా వాడుకుంటున్నాం. నుయ్యి పక్కనే బాత్ రూం కడతామంటే వద్దన్నాం. వేరే దగ్గర కట్టుకుంటామని తెలిపాం. మాకు తెలీకుండానే మరుగు కట్టినట్లు రూ. 15 వేలు నిధులు తినేశారు. – గంధం సరళ కుమార్తె మూడువేలు తీసుకున్నారు మేము కట్టుకున్న మరుగుకు 15వేలు మంజూరయ్యారన్నారు. రూ. 12వేలే ఇచ్చారు. మిగతా మొత్తంకోసం జన్మభూమి సభలో అధికారుల్ని నిలదీసినా ఫలితం లేకపోయింది. పైగా ఖర్చులు ఉంటాయంటున్నారు. – కర్రి పార్వతి అసలు లిస్టే నాకు తెలీదు గ్రామంలో ఎన్ని మరగుదొడ్లు నిర్మించారో ఎంతమందికి బిల్లులు ఇచ్చారో ఆ లిస్టే నాకు తెలీదు. అధికారులు ఎలా చెయ్యమంటే అలాచేశాను. కొన్ని నిర్మాణాలు పూర్తికాక, ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం ఆలస్యమైంది. గ్రామంలో కొంతమంది వీధికుళాయిల వద్ద వచ్చిన చిన్నగొడవతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా సొంత డబ్బులు చెల్లించి మరీ నిర్మాణాలు చేపడుతున్నాను. – బొబ్బిలి రమణ, సర్పంచ్ -
టాయిలెట్ కోసం ఆమె ఏం చేశారంటే..
పట్నా: సంకల్ప సిద్ధికి, నిబద్థతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బిహార్కు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న అమీనా ఖటూన్ (40) అత్యంత పేదరికాన్ని సైతం ఎదిరించి టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసిన వైనం ప్రముఖంగా నిలిచింది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎలా వున్నప్పటికి.. ఆమె సంకల్పానికి మాత్రం స్థానికులు, అధికారులు జేజేలు పలికారు. అంతేకాదు స్వచ్ఛ్ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణంకోసం ఆశ్రయిస్తే ఉదాసీనత ప్రదర్శించిన అధికారులకు చెంపపెట్టులా ఆ పనిని పూర్తి చేసి.. వారి ప్రశంసలందుకోవడం విశేషం. సౌపాల్ జిల్లా పత్రా గ్రామానికి చెందిన అమీనా స్వచ్ఛ్ భారత్ పథకం కింద టాయిలెట్ నిర్మించుకునేందుకు అధికారులను ఆశ్రయించారు. పలుమార్లు సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తానే స్వయంగా రంగంలో దిగి చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షమెత్తుకుని మరీ తన ఇంట్లో టాయిలెట్ నిర్మించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె పట్టుదలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, ఇతర కార్మికులు టాయిలెట్ నిర్మాణ పనులను ఉచితంగా చేసిపెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే విషయం తెలుసుక్ను జిల్లా అధికారులు ఆదివారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఒక చిన్న పిల్లవాని తల్లి, తన జీవనోపాధికోసం కార్మికురాలిగా పని చేస్తున్న నిరుపేద మహిళ చేసిన ప్రత్యేక ప్రయత్నం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు బిహార్ రాష్ట్రం స్వచ్ఛ భారత్ లక్ష్యం అమలులో దిగువ స్థాయిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలమూత్ర విసర్జన పద్ధతినే అనుసరిస్తున్నారు. అయితే, అక్టోబర్ 2, 2019 నాటికి బిహార్ను ఓడీఎఫ్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. కానీ...ఒక్క జిల్లాగా కూడా ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) గా ప్రకటితం కాకపోవడం గమనార్హం. కాగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా, 2014, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
అవినీతి కంపు!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపుకొడుతోంది. అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కుమ్మక్కై పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. కోవెలకుంట్ల మండలంలో ఏకంగా పాతమరుగుదొడ్లు చూపి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్ల కాలంలో రెండు వందలు దాటని మరుగుదొడ్ల నిర్మాణాలు రెండు నెలల్లోనే కొత్తగా 300 నిర్మాణాలు పూర్తైనట్లు రికార్డుల్లో చూపడం అనుమానాలకు తావిస్తోంది. కోవెలకుంట్ల: పల్లెలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోకేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరుగుదొడ్డి మంజూరైన తర్వాత లబ్ధిదారుడు దానిని నిర్మించే ప్రదేశాన్ని అధికారులు జియోట్యాగింగ్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. మరుగుదొడ్డి బేస్మెంట్ దశలో నిర్మాణ ఫొటో జత చేసి మొదటి విడత బిల్లుకు ప్రతిపాదిస్తే రూ. 6వేలు లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. మరుగుదొడ్డి పూర్తి అయ్యాక అధికారులు పరిశీలించి రికార్డుల్లో నమోదు చేసి మిగిలిన రూ. 9వేలు జమ చేస్తారు. ఇందులో ఎలాంటి అవకగతవకలు జరగకుండా సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అయితే, కోవెలకుంట్ల మండలంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కి చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పాతవాటికే బిల్లులు: కోవెలకుంట్ల పట్టణంలో గత రెండళ్లలో కేవలం 240 లెట్రిన్లు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15 నాటికి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇటీవల లక్ష్యాన్ని నిర్దేశించగానే ఏకంగా 300కు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ రెండు నెలల్లో అదేలా సాధ్యమని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని టీడీపీ కమిటీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు, కొందరి అధికారులతో కుమ్మక్కై గతంలో నిర్మించిన పాత మరుగుదొడ్లకే బిల్లులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇదే తంతు నిర్వహించి సుమారు రూ. రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఆ నిధులను కొందరు అధికారులు, టీడీపీ నాయకులు, బోగస్ లబ్ధిదారులు కలిసి వాటాలు పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. బిల్లులు చేయాలంటూ అధికారులపై ఫైర్: తాము సూచించిన వ్యక్తులకే వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని, టీడీపీ నాయకులు ఇటీవల మండల అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగే గుళ్లదూర్తి గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాలు మరుగుదొడ్ల కేటాయింపులో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఒక వర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా తమ వర్గానికి 50 కేటాయించాలని అధికారులకు లబ్ధిదారుల జాబితా అందజేశారు. ఉన్నతాధికారులు మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పాత మరుగుదొడ్లకు బిల్లుల చెల్లింపు జరిగినవి మచ్చుకు కొన్ని ► కోవెలకుంట్ల గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత మరుగుదొడ్లు చూపించి తమ బంధువుల పేరుతో మూడు బిల్లులు డ్రా చేసుకున్నాడు. ► ఇదే కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి రెండు బిల్లులు తీసుకున్నాడు. ► స్వామినగర్ కాలనీలో ఒకే ఇంటిపేరు మీద ఆరుగురికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో రెండింటికి పాత వాటికే బిల్లులు చేశారు. ► పట్టణంలోని గుదేట్టి వీధి, బసిరెడ్డి బావి వీధి, సంతపేట కాలనీల్లో 50 నుంచి 60 దాకా పాత మరుగుదొడ్లకే బిల్లులు చెల్లించారు. -
మరుగుదొడ్లలో అవినీతి కంపు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓడీఎఫ్ (బహిరంగ మల, మూత్ర విసర్జన నివారణ)లో ప్రధాని నుంచే ప్రసంశలం దుకున్న విజయనగరం జిల్లాలో వాస్తవ పరి స్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాకు 3.70 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా వాటిలో ఇప్పటి వరకు 3.30 లక్షలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పూర్తయ్యాయని చెబుతున్న వాటిలో 20 శాతం మరుగుదొడ్లు లేనే లేవు. 30 శాతం మరుగుదొడ్లు అరకొరగా వినియోగానికి పని కి రాకుండా ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.కోట్లల్లో నిధులు అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోయాయి. చచ్చిపోయిన వారిపేరున కూడా మరుగుదొడ్లు కట్టేసి, నిధులు కాజేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే సాకుతో కాంట్రాక్టర్లు, అధికా రులు కుమ్మకై చేయని పనులను చేసినట్లు, లేని లబ్ధిదారులను ఉన్నట్లు చూపించి నిధులు మింగేశారు. నిర్మించకుండానే.. నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామం.. చుట్టూ పచ్చని చెట్లు.. పంట చేల సుగంధం నడుమ ఆధునికతకు కాస్త దూరంగా ఉంటారు ఇక్కడి జనం. వీరికి సర్పంచ్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అతను అన్యాయం చేస్తున్నాడని కూడా తెలుసుకోని అమాయకత్వం వారిది. దీనినే ఆసరాగా చేసుకుని పాలకులు, కాంట్రాక్టర్లు కుమ్మకయ్యారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా జిల్లాలను సంపూర్ణ ఓడీఎఫ్గా మార్చాలని జిల్లా అధికారులకు గట్టిగా ఆదేశాలివ్వడంతో వారు లక్ష్యాలను చేరుకోవడంపైనే దష్టి సారించారు. ఈ ఒక్క పంచాయతీలోనే 310 మంది లబ్ధిదారులకు రూ.45.90 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో లెక్కల్లో మా యలు చేసి మరుగుదొడ్లు నిర్మించకుండా, పాత మరుగుదొడ్లకు బిల్లులు చేసుకుని ఈ మొత్తంలో సగానికిపైగా ప్రభుత్వ ధనాన్ని కొందరు కాజేస్తున్నారు. ఒకే మరుగుదొడ్డికి రెండేసి బిల్లులు.. గ్రామంలో అప్పటికే నిర్మించిన మరుగుదొడ్డికి మరలా దరఖాస్తు చేసి, ఒక సారి నిధులు తీసుకున్నదానికి మరలా నిధులు మంజూరు చేయిం చుకుని సొమ్ము చేసుకున్నారు. పప్పలరాము, పప్పల రాజినాయుడు, పొట్నూరు అప్పలనాయుడు, పొట్నూరు కళావతి, పప్పల వరహా లమ్మ, పప్పల శ్రీనివాసరావు, పల్లి అప్పలనర్సి, పల్లి పైడిరాజు, కర్నపు రాజప్పడు, పొట్నూ రు నారాయణమ్మ, దుర్గాసి రాముల పేరుమీద రెండేసి సార్లు నిధులు డ్రా చేసేశారు. ఒకే రేషన్కార్డుపై రెండు మరుగుదొడ్లు బిల్లులు చేశారు. రెడ్డి స్వామినాయుడు, రెడ్డి సుబ్బలక్ష్మి భార్యభర్తలు పేరుపై రెండు మరుగుదొడ్లు నిర్మించినట్లు నిధులు తీసేసుకున్నారు. ఇదంతా ఎలా చేశారు.. ఇంత దారుణంగా జనాన్ని మోసం చేసి, ప్రభుత్వ ధనాన్ని దర్జాగా కాజేయడానికి అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలను అన్వేషిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల గహాల వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే ప్రదేశాన్ని ట్యాబ్లో ఫొటోతీసి ఆర్డబ్య్లూఎస్ వెబ్సైట్లో నమోదు చేయాలి. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులతో గుంత ఫొటో, పూర్తి చేసిన తర్వాత మరో ఫొటోను వెబ్సైట్లో ఉంచాలి. అయితే ఈ గ్రామంలో లబ్ధిదారులకే తెలియకుండా వారి ఫొటోలు వెబ్సైట్లోకి చేరిపోయాయి. కొందరికి పాత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటినే కొత్తవిగా చూపించారు. ఇంత జరుగుతుంటే పంచాయతీ స్పెషల్ æఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవటాన్ని బట్టి వారికి తెలిసే ఈ వ్యవహారం జరిగినట్లు అర్థమవుతోంది. ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలి: మా గ్రామంలో ఓడీఎఫ్ నిర్మాణాల్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు సష్టంగా తెలు స్తోంది. అలాగే, మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రైవేటు కాంట్రాక్టర్కు అప్పజెప్పడంతో పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. చాలా మరుగుదొడ్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడితే జరిగిన అక్రమాలు బయటపడతాయి. –రెడ్డి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్, మల్యాడ గ్రామం లబ్ధిదారులకు తెలియకుండానే.. తమ పేరుమీద మరుగుదొడ్డి మంజూరైందని, నిధులు కూడా వస్తే తీసుకుని వాడుకున్నామనే విషయాలు లబ్ధిదారులకే తెలియదు. ఈ గ్రామంలోని మామిడి అచ్చియ్యమ్మ, యడ్ల అసిరి నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, గేదెల రాము, గేదెల లక్ష్మణరావుల ఒక్కొక్కరి పేరుమీద రూ.15వేలు చొప్పున మరుగుదొడ్ల నిధులు మంజూరైనట్లు తేలింది. వారిని విచారించగా తమకసలు ఆ నిధులు వచ్చినట్లుగానీ, మరుగుదొడ్డి మంజూరైనట్లుగానీ తెలియదని స్పష్టం చేశారు. తమ ఇళ్ల వద్ద మరుగుదొడ్లు కూడా నిర్మించలేదని వాపోయారు. ఇదెలా సాధ్యమో అక్కిడి పాలకులు, అధికారులే అడగాలి. -
బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా?
బీజింగ్ : బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. పొరుగు దేశం చైనాలో ఓ కుర్రాడు బాత్రూంలో వీడియోగేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గంటల కొద్దీ బాత్రూంలో గేమ్ ఆడుతూ ఉండటంతో అతని మలద్వారం తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే రెక్టమ్ (పెద్ద పేగు చివరి భాగం) కిందికి వేలాడటమే కాకుండా అతని మలద్వారం నుంచి ఓ రక్తం ముద్ద కిందికి జారిపోయింది. వైద్య పరీక్షల్లో అతని రెక్టమ్ శరీరంతో విడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. చివరకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను రక్షించారు. గంటలకొద్ది కూర్చోని ఉండటంతో అతని పురుషనాళ కండరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచే మలబద్దకం సమస్యతో బాధపడుతున్నాడని, ఇంతవరకు చికిత్స చేసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రమై ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. అలానే వీడియో గేమ్స్ ఆడుతూ బాత్రూంలో ఎక్కువ సమయం గడపడంతో వ్యాధి తీవ్రమైందన్నారు. ఆ కుర్రాడు మాత్రం 30 నిమిషాలు మొబైల్లో గేమ్ ఆడుతూ బాత్రూంలో కూర్చున్నానని డాక్టర్లకు తెలిపాడు. -
హా...ర్టీసీలో... అన్నీ అవస్థలే...
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రగతి రథ చక్రాలకు వేదికైన ఆర్టీసీ బస్సు కాంపెక్సుల్లో సమస్యలు తిష్టవేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని తొమ్మిది కాంప్లెక్సుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు, కూర్చునేందుకు, అవసరమైనన్ని బెంచీలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, క్యాంటీన్లలో బెంబేలెత్తించేలా టీ, టిఫిన్ల ధరలు, తాగడానికి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన డంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చోటుచేసుకున్న లోపాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూశాయి. ముక్కు మూసుకోవాల్సిందే... గోకవరం, రావులపాలెం కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవడంతో ఆరుబయటే మూత్రశాలగా మారింది. ప్రయాణికులు ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తుండడంతో డిపో ఆవరణల్లో దుర్గంధం వెదజల్లుతోంది. రావులపాలెంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోకవరంలోని మూత్రశాల వద్ద నీటి సమస్య నెలకొంది. నీరు రాకపోవడంతో మూత్రశాలలో దుర్వాసన వస్తోంది. అమలాపురంలో పార్కింగ్ స్టాండ్ పక్కన డ్రైనేజీ నీరు ఆవరణలో నిల్వ ఉంటుండడంతో ఆ పరిసరాలు మురికికూపంలా మారాయి. ప్రమాదం జరిగితే బూడిదే... గోకవరం బస్టాండ్లో తాటాకుల పందిరిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే భారీ ఆస్తినష్టం వాటిల్లుతుంది. రావులపాలెం డిపోలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం లేదు. బస్టాండ్ ఆవరణంతా ఆటోలు, వ్యాన్ల స్టాండ్లతో ఆక్రమణలో ఉంది. పార్కింగ్ సదుపాయం సరిపోకపోవడంతో డిపో చుట్టూ మూడు ప్రైవేటు పార్కింగ్ స్టాండ్లు వెలిశాయి. జాతీయ రహదారి, లొల్ల ప్రధాన కాలువ ఆధునికీకరించడంతో బస్టాండ్ వర్షాకాలంలో చెరువును తలపిస్తోంది. ఆ సయమంలో రెండు మోటార్లు పెట్టి వర్షపు నీటిని తోడుతారు. ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా సదుపాయం లేదు. డీలక్స్ ఫ్లాట్ఫాంపై సరిపడా బల్లలు లేవు. బస్సులు ఆగేందుకు సరైన ఫ్లాట్ఫాం లేదు. డ్రైవర్ ఆదమరిచినా, బస్సు బ్రేక్ విఫలమైనా ప్రయాణికులపై దూసుకొచ్చే ప్రమాదం ఉంది. రామచంద్రపురంలో పార్కింగ్ స్టాండ్ నిర్వహించడం లేదు. ఒక్కో కాంప్లెక్సులో ఒక్కోలా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ కాంప్లెక్సుల్లో ప్రతి నాలుగు గంటలకు రూ.5 లెక్కన రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. గోకవరం, రాజోలు డిపోల్లో రోజుకు రూ.20లñ చొప్పున తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్న సమస్యలున్నా ప్రయాణికులను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దడపుట్టిస్తున్న ధరలు.... అన్ని ఆర్టీసీ కాంప్లెక్సుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, కంపెనీ చిప్స్ ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. అర లీటర్ కూల్ డ్రింక్ ఎమ్మార్పీ రూ.38 ఉంటే రూ.42, రూ.18 లేస్చిప్స్ రూ.20, రూ.15 గుడ్ డే బిస్కట్ ప్యాకెట్ రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక క్యాంటీన్లలో టీ తాగినా, టిఫిన్ చేసినా జేబులు గుల్ల అవ్వాల్సిందే. రాజమహేంద్రవరం కాంప్లెక్సులోని క్యాంటిన్లో టిఫిన్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. రెండు ఇడ్లీ రూ.30, చపాతి రూ.40, దోసె రూ.35, మైసూర్ బజ్జీ రూ.30 (నాలుగు), పేపర్ కప్పులో టీ రూ.15 లెక్కన విక్రయిస్తున్నారు. కాకినాడ కాంప్లెక్సులోని క్యాంటీన్లో రెండు ఇడ్లీ రూ.25, చపాతి రూ.30, దోసె రూ.30, మైసూర్ బజ్జీ రూ.25, టీ రూ.10 లెక్కన అమ్ముతున్నారు. హోటళ్లు, ఆర్టీసీ డిపో ఎదరుగా ఉన్న హోటళల్లో కన్నా డిపోల్లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలున్నాయి. మౌలిక సౌకర్యాలు మాటుమాయం... ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణకు వివిధ పేర్లతో టికెట్లపై అదనంగా వసూలు చేస్తున్నా ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, రాజోలు కాంప్లెక్సుల్లో తాగునీటి సదుపాయం లేదు. మంచినీరు కావాలంటే అక్కడ దుకాణాల్లో రూ.20 వెచ్చించి బాటిల్ కొనుగోలు చేయాల్సిందే. అది కూడా స్థానికంగా తయారు చేసే సంస్థ బాటిళ్లు విక్రయిస్తున్నారు. రావులపాలెం, గోకవరంలలో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రత్తిపాడు, రామచంద్రపురాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. రామచంద్రపురం డిపోలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పగటి పూటే ప్రయాణికులపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. -
ఇవేం బస్టాండ్లు బాబోయ్
ఇదీ జిల్లాలో బస్టాండ్ల పరిస్థితి. పైకి మాత్రం హైటెక్ హంగులంటూ టీవీలు, స్టీలు బెంచీలు వేశారు. కానీ ప్రాంగణాలు మొత్తం కంపుకొడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా దారుణం. అంతా వసూళ్లే. ఇక దుకాణాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. సాక్షి, కడప : ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలావరకు బస్టాండ్లకు సోకులు చేసినప్పటికి కొన్ని మౌలిక వసతులను ఇంకా కల్పించలేదు. బస్టాండ్లలోకి వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారాయి. ఆవరణలు కంపుకొడుతున్నాయి. ధరల మోత మోగుతోంది. అయినా అధికారులు మాత్రం అంతా బాగుందనే చెబుతున్నారు. ఉదాహరణకు.. కడప నగరంలోని పాత బస్టాండ్ ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇప్పటికే పెచ్చులు రాలుతున్నా..పైకప్పు అంతా నెర్రెలు చీలి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా....గోడలకు చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి చేయదాటకమునుపే అధికారులతోపాటు అందరూ అప్రమత్తం కావాలి. ప్రతినిత్యం వేలాది మంది కడప పాత బస్టాండులో బస్సుల కోసం వేచి ఉండడంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటోంది. అయితే పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది. ఇలా జిల్లాలో రాయచోటి, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల తదితర బస్టాండ్లలో సమస్యలమయంగా మారడంతో పాటు విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు.. జనం మధ్యలో మూత్ర విసర్జన జిల్లాకేంద్రమైన కడపలో ప్రతినిత్యం వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత బస్టాండు మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో పాత బస్టాండులో ఎక్కడ చూసినా జనమే జనం. అయితే అనువైన వసతులు సరిగా లేకపోవడంతో బహిరంగంగానే మూత్ర విసర్జన చేస్తుంటారు. జనం చూస్తున్నా....గోడల మీద రాతలు కనిపిస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని కానిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...కనీసం జనం సమీపంలోకి వస్తే జరిమాన విధిస్తారన్న భయం కూడా ప్రజల్లో లేదు. దీంతో పాత బస్టాండులో పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా మూత్ర విసర్జన కంపుతో జనం అల్లాడిపోతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కుకూడా లేదు. అలాగే కొత్త బస్టాండ్లోనూ పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. వర్షం కురిస్తే అంతా జలమయమే. ఆవరణలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. పారిశుద్ద్యం అంతంతమాత్రమే ఆర్టీసీ బస్టాండ్తోపాటు పాత బస్టాండులోనూ పారిశుధ్యం అధ్వానంగా కనిపిస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల నీరు రోడ్లమీదనే పారుతుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండులో టాయ్లెట్ల వద్ద తప్పనిసరిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 తీసుకుంటున్నారు. అయినా పరిశుభ్రంగా ఉంచడ లేదు. దుర్వాసన భరించలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీకి ఎసరు జిల్లాలోని బస్టాండ్లలో ఎమ్మార్పీకి ఎసరు పెట్టి తినుబండారాలపై దోపిడీ చేస్తున్నారు. మినరల్ వాటర్ ఒక లీటరు ఎమ్మార్పీ ధర రూ.20 అయితే రూ.25 వరకు రాబడుతున్నారు. ఒక్క వాటరే కాదు, మిగతా వాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బస్టాండు ప్రాంగణంలోని హోటళ్లలో దోపిడీపర్వం మరింత అధికంగా కొనసాగుతోంది. బస్టాండ్లలో ఉన్న అధికభాగం షాపులలో ఎమ్మార్పీని పక్కనపెట్టి దోచుకుంటున్నా అడిగే అధికారులు లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాలోని బస్టాండ్ల తీరిది.. ♦ మైదుకూరు బస్టాండ్లో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. అందులోనూ నీటి సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడూ మూత వేసి ఉంటారు. ఇబ్బందిగా మారింది. పైగా చుట్టుపక్కల వారు కూడా బస్టాండు ఆవరణంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సాగిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో బస్సులు గుంతలో వెళుతున్నప్పుడు ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ♦ ప్రొద్దుటూరు బస్టాండులో మరుగుదొడ్లు ఉన్నా సరిగా లేవు. దీంతో ప్రయాణికులకు మరుగు కంపుతో అల్లాడుతున్నారు. ♦ రాయచోటి బస్టాండ్లో మరుగుదొడ్లు త లుపులకు రంధ్రాలు పడి వాడకానికి ఇబ్బం దిగా ఉంది. చుట్టూ దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలోని దుకా ణాల్లో అధికధరలు వసూలు చేస్తున్నారు. ♦ బద్వేలు బస్టాండ్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. పైగా ఎప్పుడు చూసినా పందులు నిత్య సంచారంగా మారింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. -
బిల్లులకు నిరీక్షణ
ఊట్కూర్ : మండలంలో మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లైయినా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో నిర్మల్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ఆర్డబ్లూఎస్, ఈజీఎస్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 638 మరుగుదొడ్లు మంజూరు మండలంలో 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 508 మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ కారణాలతో 130 పెండింగ్లో వున్నాయి. ఊట్కూర్లో 102, పెద్దపొర్లలో 42, చిన్నపొర్లలో 22, అవుసలోనిపల్లిలో 44, ఎడివెళ్లిలో 20 తదితర గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు విడతల వారీగా ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9 వేలు వారి ఖాతాలో జమచేయాల్సివుంది. 200 మందికి అందని బిల్లులు రెండేళ్లు గడిచినా బిల్లులు రాలేదు. మం డలంలో దాదాపు 200 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సివుందని, అధికారులకు అడిగితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి బిల్లులు మంజూరు చేయాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు. నిధులొస్తే ఇస్తాం లబ్ధిదారులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంతమందికి బిల్లులు రావాల్సి ఉందో ఆన్లైన్లో ఖచ్చితంగా చూపడంలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. బిల్లులు ఇప్పటికీ అందలేదు. విడుదలైతే లబ్ధిదారులు ఎందరో తెలుసుకొని వారి ఖాతాల్లో జమ చేస్తాం. – జయమ్మ, ఏపీఓ, ఊట్కూర్ 18నెలలు గడిచింది మరుగుదొడ్డి నిర్మించి 18 నెలల అవుతుంది. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా ఉంది. సంబంధత అధికారులూ పట్టించుకోవడంలేదు. మా గ్రామంలో 20మందికి రావాల్సి ఉంది. అధికారులు వెంటనే బిల్లులు మంజూరుచేయాలి. – డీలర్ వెంకటయ్య, పెద్దపొర్ల, , ఊట్కూర్ -
రెంటికీ బయటికే..!
నేలకొండపల్లి : చిన్నోళ్ల బడంటే చిన్నచూపే.. ఒకటి, రెండుకు వెళ్లాలంటే ప్రమాదమైనా రోడ్డు దాటక తప్పడంలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక.. ఉన్నవి శిథిలావస్థకు చేరి గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని.. బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నా.. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం ‘చిన్న’చూపు చూస్తున్నాయి. కేంద్రాలకొచ్చే చిన్నారులకు చిన్నతనం నుంచే మరుగుదొడ్లకు వెళ్లే అలవాటు నేర్పితే బాగుంటుందని, ఈ విషయాన్ని అధికారులు గ్రహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీల్లో స్వచ్ఛభారత్ లేదా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయటం లేదు. పిల్లలకు బాల్యంలో ఏ అలవాటు నేర్పుతారో దానినే జీవితాంతం పాటిస్తారు. ఈ చిన్నపాటి విషయాన్ని కూడా అధికారులు గుర్తించటం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించటం లేదు. జిల్లాలో ఉన్న 1,896 కేంద్రాల్లో చాలా వరకు కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. దీంతో చిన్నారులు బహిరంగ మల, మూత్ర విసర్జన కోసం రోడ్డు ఎక్కుతున్నారు. పౌష్టికాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి సరఫరాలేక నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 369 కేంద్రాల్లో మాత్రం చిన్నారులు పాఠశాల మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నారు. చాలా అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాల్లో చిన్నారులు రహదారులు వెంట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పిల్లలు రోడ్లపైకి వెళ్తుండడంతో ఎప్పుడు ఏమవుతుందోనని తల్లిదండ్రులు, కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. 922 మరుగుదొడ్లు కావాలని ఐసీడీఎస్ జిల్లా అధికారులు నివేదిక కూడా అందించారు. సౌకర్యాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని పలువురు అంటున్నారు. కలెక్టర్కు నివేదించాం మరుగుదొడ్లు లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి కలెక్టర్కు నివేదించాం.అత్యవసరంగా జిల్లాలో 922 కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది. త్వరలోనే చర్యలు తీసుకుంటుంది. – రాయపూడి వరలక్ష్మి, ఐసీడీఎస్, పీడీ మరుగుదొడ్లు నిర్మించాలి అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చి న్నారులు, కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. బాల్యం నుంచే పిల్లలకు మరుగుదొడ్ల వినియోగం గురించి వివరిస్తే జీవితాంతం అలవాటు మరిచిపోరు. – కోటేశ్వరి, చెరువుమాధారం, అంగన్వాడీ టీచర్ కేంద్రాలపై నిర్లక్ష్యం అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేది అంతా నిరుపేదలు, కార్మికుల పిల్లలే. అందుకే ప్రభుత్వానికి నిర్లక్ష్యం. రోడ్ల వెంట మల విసర్జన వదంటారు. మరి చిన్నారులు ఎక్కడికి పోవాలి. వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు -
మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు
చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది. ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్ఐ మురళీమోహన్ ఎర్రయ్యను పోలీస్స్టేషన్కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు. -
మరుగేది..!
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు టాయిలెట్, మరుగుదొడ్లు లేక వారు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయమై సంవత్సర కాలంలో పలుమార్లు సాక్షిలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుమారు నాలుగు నెలల క్రితమే బాలికలకు టాయిలెట్, మరుగొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం కూడా మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండగా నాలుగు నెలలు అవుతున్నా నేటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. బాలికల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
దేశ రాజధానిలో దారుణం
-
దేశ రాజధానిలో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : గుర్గావ్ బాలుడు ప్రద్యుమన్ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి టాయ్లెట్లో శవమై కనిపించాడు. డయేరియాతోనే విద్యార్థి చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతుండగా.. తోటి విద్యార్థుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తర ఢిల్లీ కారావల్ నగర్కు చెందిన తుషార్(16) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన తుషార్ అస్వస్థతకు గురికావటంతో స్కూల్ యాజమాన్యం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. ఆపై బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు ఆస్పత్రికి వెళ్లాక బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. అయితే వైద్యులు మాత్రం ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. ముమ్మాటికీ హత్యే... తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని వాదిస్తున్నారు. తోటి విద్యార్థులే అతన్ని కొట్టి చంపేసి.. టాయ్లెట్లో పడేశారని, కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తమకు తెలియజేశారని వారంటున్నారు. విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు, నిందితులను తప్పించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక తుషార్ బందువులతోపాటు స్థానికులు కొందరు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ ఒక్కసారిగా స్కూల్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. స్థానిక ఎమ్మెల్యే కపిల్ మిశ్రా జోక్యం చేసుకోవటంతో వారు వెనక్కి తగ్గారు. సీసీ ఫుటేజీ ఆధారంగా... తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ లను పరిశీలించారు. అందులో తరగతి గది బయట ముగ్గురు విద్యార్థులు తుషార్ను చితకబాదినట్లు ఉంది. ఆపై వారు అతన్ని పరిగెత్తిస్తూ కొడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీడియోలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు సమాచారం. ఒంటిపై గాయాలు లేకపోవటంతో పోస్టు మార్టంలో అసలు నిజాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశరాజధానిలో మరో ఘటన చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.