TS Assembly Top Stories
-
చివరి ప్రచార సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
సాక్షి, గజ్వేల్ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్ కావాల్నా..24 గంటల కరెంట్ కావాల్నా’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుంది’అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్ను ఓడించాలి. హైదరాబాద్లో మెట్రో, ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్నగర్లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
తిట్లకు జామర్ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
TS: ఊపు ఊపిన సోషల్ ప్రచారం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే! సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. పాటలు.. పదనునైన తూటాలు గులాబీల జెండలే రామక్క.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్డ్రాప్తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు. ఇంటర్వ్యూల పర్వం.. వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్ఫామ్ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు. వ్యక్తిగత దూషణలు ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది. Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండింగ్లో హెలికాఫ్టర్ ఎక్కడో ఆదిలాబాద్లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. బర్రెలక్క నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి. ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్లు పంపి మీటింగ్లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు.. ఇలా షరామాములుగానే కనిపించింది. నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం -
కాంగ్రెస్వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్నగర్కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్ పైలట్ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్ పైలట్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ‘చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయాలి. కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్ తెలిపారు -
ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణకు ప్రమాదకరమని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూటుకేసుల ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను పాలించిన తీరు, కేంద్రంలో బీజేపీ పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేయండి. మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లలో ఓడిపోతారు. బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెర వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ కమిట్మెంట్ను మ్యానిఫెస్టో రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కటే. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారు.. ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి. ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?. ముస్లీం ఐటీ టవర్స్ కట్టడం ఏంటి?. సాప్ట్ వేర్ రంగంలో కూడా కేటీఆర్ మతాన్ని జోప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు. పాతబస్తీలో అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒవైసీ కుటుంబానికి అండగా ఉన్నాయి తప్ప.. సామాన్య ముస్లీం సమాజానికి ఏం చేయలేదు. ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే ఒవైసీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తారని అక్షరాస్యత పెంచకుండా చూస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు. దారుసలాంను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం దారాదత్తం చేసింది’ అంటూ విమర్శించారు. -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన.. నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. -
కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పటాన్ చెరు/గచ్చిబౌలి (హైదరాబాద్): తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్న సీఎం కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసే కేసీఆర్ ఇలా అంటున్నారని చెప్పారు. తదాస్తు దేవతలు ఉన్నారని, వారంలోనే ఆయన మాట నెరవేరనుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా కేసీఆర్కు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం’అని చెప్పారు. ఇవి సెమీఫైనల్ ఎన్నికలని, రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో 2024లో ఢిల్లీ ఎర్రకోటలో తిరంగా జెండా ఎగుర వేయడానికి మార్గం సుగమవుతుందని, మోదీని ఇంటికి పంపిస్తామన్నారు. రేవంత్ ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి, పటాన్చెరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్లో నిర్వహించిన ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ఈ బకాసురుడికి రూ. లక్ష కోట్లు దోచినా చాలట్లేదు. ధరణి పేరుతో రాష్ట్రంలో పదివేల ఎకరాలు మింగాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా తోకబట్టి ఈడ్చుకొచ్చి రూ.లక్ష కోట్లను కక్కిస్తాం. సీఎం కేసీఆర్కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం నిర్మిస్తాం.. దోపిడీలో భాగమైన కొడుకు, బిడ్డ, అల్లుడికీ చోటు కల్పిస్తాం’అని వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డ సంతకంతోనే.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఏనాడూ పాలమూరును పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్దని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పాలమూరు బిడ్డను గెలిపించుకోకుంటే మళ్లీ గుంపు మేస్త్రీలు సంతల్లో పశువుల్లా వలస తీసుకెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్లో శషబిషలు, గ్రూపులు, గుంపులు లేవన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరైనా చేయిచేసుకుంటే వారి గుడ్లు పీకి గోళీలు ఆడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులున్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారని, ఇది పాలమూరు గడ్డ గొప్పతనమని చెప్పారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ, కేటీఆర్, హరీశ్ గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారని, పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. మూడోసారి మనవడికి ఇస్తారా? కేసీఆర్ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారని, ఇప్పటికే తాను సీఎం అయి, కొడుకు, అల్లుడిని మంత్రులను చేశారని, సంతోష్రావును ఎంపీగా చేశారని, నిజామాబాద్లో నేలకేసికొడితే బిడ్డను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని, ఈసారి గెలిస్తే మనవడిని మంత్రి చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్కీ నెంబర్ ఆరు లాగా మనవడు మంత్రి అయ్యాడంటే అందరికీ పదవులొచ్చినట్లవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ 17 పరీక్షలను నిర్వహించి పల్లీలను అమ్మినట్లు పరీక్ష పేపర్లను అమ్మి మోసం చేసిందని, నిరుద్యోగులంతా కేసీఆర్కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమాల్లో యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), పరి్ణకారెడ్డి (నారాయణపేట), జి.మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), జగదీశ్వర్గౌడ్ (శేరిలింగంపల్లి), కాట శ్రీనివాస్ గౌడ్ (పటాన్చెరు) పాల్గొన్నారు. -
పేదరికం లేని తెలంగాణే నా పంతం
నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా ఉన్నా. ఇక్కడ నా కంటే ఎక్కువకాలం పదవిలో ఉన్న సీఎం ఉన్నడా? 70 ఏళ్లొచ్చాయి. ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? పేదరికంలేని తెలంగాణే నా పంతం. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/ఖానాపూర్: పేదరికం లేని తెలంగాణ తన పంతమని.. కేరళ తరహాలో వందశాతం అక్షరాస్యత, నిరంతరం తాగునీరు, ప్రతీ ఇంచుకు సాగునీరు రావాలనేదే తన లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతాంగం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయే తెలంగాణ కావాలని.. దానికోసమే తాను తండ్లాడుతున్నానని, పదవి కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని, తెలంగాణ ఆగమైపోతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్నికలనగానే ఆగమాగం కావొద్దు. అభ్యర్థులు, పార్టిల చరిత్ర చూసి ఓటేయాలి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రాల కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురు తెలంగాణ యువకులను కాల్చిచంపారు. తర్వాత 58 ఏళ్లు గోస పడ్డాం. రాష్ట్రం వచ్చా క సంక్షేమానికి పెద్దపీట వేసుకున్నాం. రూ.200 పింఛన్లను రూ.2,000 చేసుకున్నం. మళ్లీ గెలిస్తే దాన్ని రూ.5 వేలు చేసుకుందాం. రైతుబంధు సాయాన్ని రూ.16వేలు చేసుకుందాం. నీటి తీరువా రద్దు చేసి, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్, రైతుబీమా, పల్లె–బస్తీ దవాఖానాలు, వంద పడకల ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చేసుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ వారు ఎందుకు చేయలేకపోయారు ? ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఎమర్జె న్సీలు, యువతను జైల్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఆమె పాలనలోనే కదా జగిత్యాల, సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే.. గులాబీ పార్టీ సామర్థ్యాన్ని శంకించిన నాటి మంత్రి ఎమ్మెస్సార్ ముఖం మీద రాజీనామా విసిరికొట్టా ను. అప్పుడు 2.5 లక్షల మెజార్టితో కరీంనగర్ ప్రజ లు గెలిపించారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తెలంగాణ చాలా ఏళ్లు దుఃఖపడింది. నాడు సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనన్నప్పుడు ఒక్కరూ నోరు తెరవలేదు. కాంగ్రెస్ వాళ్లది.. భూమేత! అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఎమ్మెస్పీ ధరలకు వరి ధాన్యం కొనుగోలుకు మూలం ధరణి. దాని స్థానంలో కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు చట్టం చేస్తరట. అలా చేస్తే రైతులు చిప్పపట్టుకుని తిరగాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వృథా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పాలిట శని. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం బీఆర్ఎస్ సర్కారు అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మేం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి 100 ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. వేస్తే మోరీలో పడేసినట్టే. తండాలను పంచాయతీలు చేశాం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల కల సాకారం చేశాం. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్లో బంజారా భవన్తోపాటు పక్కనే కుమురంభీం భవన్ నిర్మించాం. పోడు పట్టాలిచ్చాం, వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నాం. కాంగ్రెస్వన్నీ వట్టి మాటలే. బీఆర్ఎస్ భయంకరమైన మెజార్టితో గెలుస్తోంది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్కుమార్, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఖానాపూర్లో జాన్సన్ నాయక్ను గెలిపించాలని కోరారు. వేములవాడ ముఖచిత్రం మారుస్తా.. వేములవాడతో నాది ప్రత్యేక అనుబంధం. ఇక్కడి రాజన్న గుడిలోనే నా వివాహం జరిగింది. కోర్టు కేసుల కారణంగా ఎమ్మెల్యే రమేశ్బాబును మార్చాల్సి వచ్చింది. వేములవాడ ముఖచిత్రం మార్చే బాధ్యత నాది. ఇక్కడి మూలవాగు, తల్లికోట సూరమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకుందాం. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జగిత్యాల జిల్లాను కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసుకుందాం. -
రిస్క్ వద్దు !
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు బీఆర్ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు. రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి. కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కేసీఆర్ ఫోకస్ రైతులే ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే. వాస్తవాలు చెబుతున్నాం కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం. ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ బీఆర్ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ♦ కాంగ్రెస్నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. ♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. ♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి. ♦ బీఆర్ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా? ♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం ♦ కేటీఆర్ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. -
‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్లో నిర్వహించిన సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్ దుయ్యబట్టారు. తొలి సమావేశంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్అలీ, ఏనుగు రవీందర్రెడ్డి, కె.మదన్మోహన్ పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది ‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మీకుల కష్టాలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్రెడ్డి ప్రజలను కోరారు. -
కాంగ్రెస్తో కష్టాలు తెచ్చుకోవద్దు
మణికొండ/దుబ్బాకటౌన్: రాష్ట్రంలో కంటికి కనిపించే అభివృద్ధి, ఇంట్లోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని, ఏరికోరి కాంగ్రెస్ పాలన తెచ్చుకుని కష్టాల పాలు కావద్దని మంత్రి హరీశ్రావు అన్నా రు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏ కోశానాలేదని, ఒకవేళ వస్తే విద్యుత్ కోత లు, బిల్డర్ల వద్ద కర్ణాటకలో మాదిరిగా చదరపు అడుగుకు రూ.80లు వసూలు, స్కాములు, కర్ఫ్యూ లు తప్పవని అన్నారు. రైతులకు రైతుబంధు, బీ మా, బీసీబంధు, దళితబంధు, ఇంటింటికి తాగునీ రు, 24గంటల విద్యుత్, శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూ ట్రిషన్ కిట్లు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ర్చాల్సిన అవసరం ఎందుకని హరీశ్రావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మíßహిళకు గృహలక్ష్మి, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్యబీమా, మరో లక్ష డబుల్బెడ్రూం గృహాలను ఇస్తామని హామీ ఇచ్చారు. మరో మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కనిపిస్తారని, ఎన్నికలు ముగియగానే వారంతా ఢిల్లీ బాట పడతారని, ఇక్కడ ఉండేది ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తర ప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని, అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, అలాంటిది రాహుల్, ప్రియాంకలు ఇక్కడకు వచ్చి గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నమ్మి మోసపోవద్దని హరీశ్రావు కోరారు. వారికి దమ్ముంటే ఇప్పుడు బెంగళూరు ప్రజలతో సమావేశం పెట్టాలని సవాల్ విసిరారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మణికొండ, శంషాబాద్లకు వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మన రాష్ట్రం, మన పాలనకే ప్రజలు పట్టం కట్టాలని.. ఢిల్లీ పార్టీలను తరమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో మారు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అన్నారు. కేంద్రం రూ.28 వేల కోట్లు ఎగ్గొట్టింది.. రైతుల బోరు బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టక పోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన రూ.28 వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్, రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి కష్టాలు వస్తాయని అన్నారు. -
కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ
సాక్షి, యాదాద్రి/నారాయణపేట/ములుగు: కాంగ్రెస్ అంటేనే అమ్ముడుపోయే పార్టీ అని, అది తెలంగాణలో బీఆర్ఎస్ను బీ టీమ్లా కాపాడుతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనని, ఆ రెండింటికీ చెక్పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు. మూసీ నదిలా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ అవినీతితో కలుషితం చేశారని.. ఈ అవినీతి కాలుష్యాన్ని శుద్ధి చేయాలంటే బీజేపీకి అధికారం అప్పగించాలని పేర్కొన్నారు. ఆదివారం మక్తల్, ములుగు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్షా మాట్లాడారు. నారాయణపేట సభలో కురుమూర్తిస్వామి, జోగుళాంబదేవి, సంగమేశ్వరస్వామికి.. ములుగు సభలో సమ్మక్క–సారలమ్మ, రామలింగేశ్వరస్వామికి నమస్కరిస్తున్నా అంటూ అమిత్ షా తన ప్రసంగాలను ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇవి తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. కేసీఆర్ సర్కారు గత పదేళ్లలో అవినీతిలో కూరుకుపోయింది. కుంభకోణాల మయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మియాపూర్ భూముల్లో వేల కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ భూకబ్జాల కారును గ్యారేజీకి పంపిస్తాం. కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. అసలు కేసీఆర్ జాతీయ హోదా కోసం ఒక్కనాడు కూడా ప్రధాని మోదీని కలవలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డీల్.. కాంగ్రెస్కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కు వేసినట్లే. వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ. అది బీఆర్ఎస్ను బీ టీంలా కాపాడుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో వారి మధ్య అధికారాన్ని పంచుకునే డీల్ కుదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారు. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్గాందీని ప్రధాన మంత్రిని చేయాలనేది ఒప్పందం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ చేపడతాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్ రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మేం అధికారంలోకి రాగానే సెపె్టంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ఇస్తున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. మేం అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం ఆంక్షలు లేని పోడుపట్టాలు జారీ చేస్తాం. గిరిజన రైతులకు రూ.12 వేల చొప్పున అందజేస్తాం. అయోధ్యలో రాముడి దర్శనం చేయిస్తాం భవ్యమైన, దివ్యమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఉచితంగా అయోధ్య ప్రయాణం, వసతి, దర్శనం కల్పిస్తాం..’’అని అమిత్ షా ప్రకటించారు. 'డబుల్ ఇంజన్’తో రాష్ట్రం నంబర్వన్ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుందాం. దేశాన్ని సురక్షితంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మోదీని 2024లో మరోసారి ప్రధాని చేసుకుందాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణను నంబర్వన్గా అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. -
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్కుమార్యాదవ్కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు ‘బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు. మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్లోని తాజ్కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు. ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. -
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి లాంటి సీనియర్తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
సాక్షి, నిర్మల్: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన. ‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం. ..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్లు ఇస్తున్నాం. గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ఈసారి గెలిచాక.. పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. జగిత్యాలలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా. ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్.. కేసీఆర్. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్ఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్లో మేం బలంగా ఉన్నాం. కిషన్రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. -
చిన్న చిన్న లోపాలపై రాద్ధాంతం తగదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిన్నరేళ్లలో తగిన న్యాయం చేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో.. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానం పేరిట మీడియాకు ప్రజంటేషన్ ఇచ్చారాయాన. ఈ సందర్భంగా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకూ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. నేడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్ స్థానంలో తెలంగాణ ఉంది. సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ప్రోజెక్ట్ లు కట్టాం. దీంతో తెలంగాణ పల్లెల్లో కరువు పూర్తిగా కనుమరుగు అయ్యింది. శిథిలావస్థలో పాఠశాలలు ప్రస్తుతం కొత్త బడులు కట్టించాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాం. రైతు బంధు ద్వారా 70 లక్షల మందికి రూ. 73,000 వేల కోట్లు ఇచ్చాం. దేశంలో రైతును రాజును చేసింది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం. రోజులో 24 గంటల కరెంట్ ఇచ్చేది దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే. రైతు వేడుకలు నిర్మించి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. రైతులకు 5లక్షల రైతు భీమా అందిస్తున్నాం. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అందిస్తాం. ‘పలకతో రండి.. పట్టా పోండి’.. ఇదే మా విద్యా విధానం.. ప్రతిపక్షాల విమర్శలపై.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను.. అనవసరమైన రాద్ధాంతంగా కొట్టిపారేశారు కేటీఆర్. ‘‘సముద్ర మట్టానికి ఎత్తులో నీటిని తీసుకురావటం కష్టమైన పని. అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ తోనే ఎత్తులో ఉన్న తెలంగాణకు నీటిని తీసుకురావాలనే ఆలోచనతోనే కాళేశ్వరం కట్టింది. ప్రాజెక్టులు కట్టాక.. చిన్న చిన్న లోపాలు సహజమే. ప్రతిపక్షాలు వాటి మీద రాద్ధాంతం చేయడం తగదు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు. అందులో మూడు బ్యారేజ్ లు ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తున్నాం. దాని సామర్థ్యం 160 టీఎంసీలు, పైగా 1,531 కిలోమీటర్ల గ్రావేటి కెనాల్ ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగిన సందర్భాలు అనేకం. కాబట్టి అనవసరంగా విమర్శలు చేయడం సరికాదు. ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు పూర్తి చేస్తాం.. .. ప్రచారాల్లో ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లే!. ప్రతిపక్షాలు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ సమాజం ఇది గమనించాలి.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలపై నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎవరైనా సరే లెక్కలతో రండి. నేను చర్చకు సిద్దం. గాలి మాటలు మాట్లాడొద్దు. మా ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలిచ్చింది. మొత్తంగా.. నీళ్లు, నిధులు, నియామకాలకు తగిన న్యాయం చేసింది కేసీఆర్ సారరథ్యంలోని మా ప్రభుత్వం’’ అని కేటీఆర్ ప్రసంగించారు. -
కేసీఆర్ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది
సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్ ఇచ్చారాయన. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయూ, న్యాక్ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్రెడ్డి. -
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా: రేవంత్రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నర్సాపూర్లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
ప్రత్యర్థులకు సవాల్ విసిరిన కేసీఆర్.. షెడ్యూల్ రాక ముందే అభ్యర్థుల ప్రకటన
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల కంటే ముందే గులాబీ బాస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. గతంలో మాదిరిగానే షెడ్యూల్ రాకుండానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు కేసీఆర్. అభ్యర్థులంతా ఎప్పటినుంచో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రతి రోజూ మూడు నాలుగు సభల్లో ప్రసంగిస్తూ దూకుడు పెంచారు. నామినేషన్లును పూర్తిచేసిన అభ్యర్థులు.. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులంతా నామినేషన్లు వేసేశారు. ఇక ప్రచార జోరు తీవ్రం కానుంది. రెండు నెలల క్రితమే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం..ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అభ్యర్థులందరికీ బి ఫామ్స్ కూడా అందజేయటం పూర్తి చేసింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలుండగా...తొలి విడతలోనే 115 స్థానాలకు సెప్టెంబర్ 21న అభ్యర్థులను ప్రకటించించారు. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ అభ్యర్థులను మాత్రం అప్పుడు పెండింగ్లో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. మరికొద్ది రోజులకు నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి, ఇంకో రెండు స్థానాలకు టిక్కెట్లు కేటాయించారు. రెండుస్థానాల్లో మార్పులు.. అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించి...వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి...భవిష్యత్పై భరోసా కల్పిస్తూ...గులాబీ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళుతోంది. అందరికంటే ముందుగా జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అందులో రెండు స్థానాల్లో మాత్రమే మార్పులు చేసింది. మల్కాజ్గిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించినప్పటికీ..ఆయన కొడుక్కి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో పార్టీ మీదు బురద జల్లి...బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరి తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ తెచ్చుకుని బరిలోకి దిగారు. దీంతో మల్కాజ్గిరి స్థానం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది. అలాగే ఆలంపూర్ నియోజకవర్గానికి మొదటి లిస్టులోనే అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవని గ్రహించి విజయుడుకు అవకాశం కల్పించారు. ఇలా రెండు స్థానాల్లో మినహా గులాబీ పార్టీలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బీ ఫార్మ్స్ నింపాలి.. 2018లో ఎదురైన సమస్యలు.. అనుభవాల దృష్ట్యా నామినేషన్ల దాఖలు, బీ ఫామ్స్ భర్తీ విషయంలో గులాబీ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నిపుణుల సమక్షంలోనే ఫార్మ్స్ నింపాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల పేపర్లు నింపేటప్పుడు ఏమరుపాటు లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే నింపాలని కూడా ఆదేశించారు. గతంలో గెలుపొందిన అభ్యర్థుల్లో పది మందికి పైగా అనర్హత కేసులు ఎదుర్కొనడమే గాకుండా వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావటంతో ఈ అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది పార్టీ. వాటి వల్ల ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కచ్చితంగా ఈసారి ఏ చిన్న అవకాశం కూడా పక్క పార్టీలకు ఇవ్వకూడదని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ఇక ప్రచారం విషయంలో కూడా రాబోయే 15 రోజులు గులాబీదళం కీలకంగా వ్యవహరించనుంది. కేసీఆర్ రాకతో గ్రౌండ్ లెవెల్లో మార్పులు.. పార్టీ అభ్యర్థుల కోసం గులాబీ బాస్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికి తొలివిడత ప్రచారం ముగిసింది. దీపావళి తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. గ్రౌండ్ లెవెల్ లో మొదటి విడత షెడ్యూల్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఏ విధంగా ఉందనే దానిపై కేసీఆర్ ఆరా తీశారు. అంతకుముందున్న కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ.. కేసిఆర్ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే పరిస్థితిలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
నేటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, ఈరోజు నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. రెండో విడతలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఇక, ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!
వారిద్దరూ స్నేహితులు.. అంతేకాదు.. కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులైనా ఎప్పుడూ బయటపడి ఒకరినొకరు పెద్దగా విమర్శించుకోరు. ఆ సిటీలో రాజకీయవర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. తాజా ఎన్నికల్లో కూడా వారిద్దరూ చెరో పార్టీ తరపున తలపడుతున్నారు. ఇక తప్పనిసరిగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో విమర్శల జోరు పెరుగుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంచి స్నేహితులు. సామాజికవర్గ లెక్కలు వీరిద్దరినీ ఒక్కటిగా పెనవేశాయనే టాక్ ఎలాగూ ఉంది. గతంలో ఒకింత తీవ్రస్థాయిలోనే ఒకరిపై ఇంకొకరు అటాక్ చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్కు వచ్చారనే అభిప్రాయం కరీంనగర్ జనంలో ఉంది. ఇక అప్పట్నుంచీ వీరిద్దరూ పార్టీల పరంగా కౌంటర్స్ విసురుకుంటారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి రాలేదు. ఒక సుహృద్భావమైన వాతావరణంలో రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాల్గోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా.. తన చిరకాల ప్రత్యర్థినెలాగైనా ఈ సారి ఓడించి తీరాలన్న కసితో.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో నిల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మాటల యుద్ధం రకరకాల రాజకీయ చర్చలకు తావిస్తోంది. కేబుల్ బ్రిడ్డ్ కూలిపోతోంది.. కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు చూసి జనం నవ్వుకుంటున్నారు.. ముందు అది చూసుకో.. ఆ తర్వాత నీ అభివృద్ధి గురించి చెప్పుకో అంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. మంత్రి గంగులపై కామెంట్స్ చేయడంతో ఈ రాజకీయ కాక మొదలైంది. అంతేకాదు.. గంగుల ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ ఇంతకాలం బీఫామ్ ఇవ్వలేదంటూ కూడా సంజయ్ చేసిన కామెంట్స్.. సహజంగానే మంత్రి గంగులకు కోపం తెప్పించాయి. దాంతో అసలు రేవంత్ పై బలి కా బక్రా అని సానుభూతి చూపించావు గానీ.. నువ్వూ, నీకోసం వచ్చిన రాజాసింగే అసలు బలి కా బక్రాలంటూ ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు. కరీంనగర్ లో మూడో ప్లేస్ కే బండి సంజయ్ పరిమితం కాబోతున్నారన్నారు. అంతేకాదు.. తనకు బీఫామ్ ఇవ్వలేదనడం హాస్యాస్పదమని.. మరి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థెవ్వరో బండి చెప్పాలన్నట్టుగా గత రెండు రోజులుగా గంగుల కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేసే నిధులను కేంద్రమే ఇస్తోంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్రానివే. నగరం అందంగా తీర్చిదిద్దే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. కాని బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లో సమర్థవంతంగా చెప్పుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. కాని అదే స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను తమకనుకూలంగా మల్చుకుని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి గంగుల వర్గం జనంలోకి వెళ్లుతుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గతంలో పరుష పదజాలం వాడి నాలుక్కర్చుకుని మళ్లీ తిరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎన్నికల వేళ నోటికి పని చెప్పి కౌంటర్ అటాక్స్ తో జనం మధ్య జరిగే చర్చల్లో భాగస్వాములవుతున్నారు. చదవండి: కేసీఆర్కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్? -
నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలు తనపై దాడి చేశారని, తన కాన్వాయ్ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నా అనుచరులను చంపినంత పనిచేశారు. రాయితో నాపై దాడి చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు నిన్న నామీద దాడిచేశారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాల కోసం పనిచేస్తా’ అని బాలరాజు చెప్పారు. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. కేటీఆర్, హరీశ్రావు పరామర్శ.. దాడి తర్వాత అపోలో ఆస్పతత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే బాలరాజును మంతత్రులు కేటీఆర్, హరీశ్రావు వేర్వేరుగా పరామర్శించారు. దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదీ చదవండి..నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య
సాక్షి,హైదరాబాద్ : తన భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య గువ్వల అమల అన్నారు. దాడి ఘటనపై అపోలో ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడు. ప్రచారం ముగించుకొని వెళ్తుండగా మా వాహనాలను అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు. నా భర్తకు దవడ, మెడ భాగంలో గాయాలయ్యాయి. డాక్టర్లు ఇప్పటికే స్కానింగ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో వంశీకృష్ణ అనుచరులు నాపై అసభ్యకరంగా మాట్లాడారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల తీరు మార్చుకోవడం లేదు. మా కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్స్ చేస్తున్నారు. నియోజకవర్గానికి వస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నీచమైన రాజకీయాలు సరికాదు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన అనుచరులకు బుద్ధి చెప్తారు’ అని గువ్వల భార్య హెచ్చరించారు. కేటీఆర్ పరామర్శ.. దాడి తర్వాత హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రాళ్ల దాడిలో గువ్వలకు గాయాలు.. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఇదీ చదవండి..బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి -
కేసీఆర్కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, నామినేషన్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, గజ్వేల్లో నామినేషన్లతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ ఎదురైంది. నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వివరాల ప్రకారం.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో నామినేషన్ల దాఖలును సీఈఓ ఆఫీస్ ఫైనల్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు. 116 నామినేషన్లతో మేడ్చల్ సెకండ్ ప్లేస్, కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు వేశారు. వైరా, మక్తల్లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది కూడా చదవండి: అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు! -
రాజగోపాల్రెడ్డిని ఓడించి తీరాల్సిందే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాజగోపాల్రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్’ అని కేటీఆర్ చెప్పారు బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ చాలా ఆలోచించి నేను బీఆర్ఎస్లో చేరాను. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పిన మాట. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇచ్చారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్ను కోరుకుంటున్న. అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని తెలిపారు. ఇదీ చదవండి...శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి -
శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
సాక్షి, తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జోరు మీదున్న తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పండుగ బ్రేక్ రావడంతో ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని స్వామి వారిని కోరుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని ప్రార్ధించా. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నా’ అని రేవంత్ అన్నారు. కాగా,రేవంత్రెడ్డి శనివారం రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో మార్పు తప్పదు
సాక్షి, పెద్దపల్లి/ ధర్మపురి/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు బైబై చెప్పి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధమయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారని, పదో తరగతి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాకా ఏ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేవలం కేసీఆర్ కుటుంబం, చుట్టాలను ముఖ్యమంత్రులు, మంత్రులు చేసేందుకే ఉన్నారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తామని, చేతి గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, జగిత్యాల జిల్లా ధర్మపురిలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిందేమీ లేదు. రాష్ట్రం ఇస్తే ప్రజల జీవన విధానం మారుతుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సోనియాగాంధీ భావించారు. కానీ కేసీఆర్ పాలనలో ఈ ఆశలకు పాతరేశారు. ‘మేడిగడ్డ’కుంగింది.. ‘అన్నారం’పగిలింది లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నిరుపయోగం. ఇసుక కదిలిందని అధికారులు చెప్తున్నారు. బుద్ధి ఉన్నవారెవరైనా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తగిలి కూలిపోయినట్టు ఉంది. రూ.35 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచారు. సీఎం కేసీఆర్కు ఆకలి ఎక్కువ. ఆలోచన తక్కువ. 60ఏళ్ల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మూడేళ్ల కింద కట్టిన ‘మేడిగడ్డ’కుంగింది ‘అన్నారం’పగిలింది. ఈ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అధికారంలోకి రాగానే వాటిని కక్కిస్తాం. ప్రజలను దోచుకుతింటున్న సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ను మోసం చేశారు వైఎస్సార్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి కేంద్రంగా చేపట్టారు. దాన్ని అలాగే కొనసాగిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించేది. కానీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి ఆదిలాబాద్ జిల్లాను మోసం చేశారు. 2004లోనే వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకంపై పేటెంట్ కాంగ్రెస్దే. ధరణి లేకుంటే రైతుబంధు ఎలాగని కేసీఆర్ అంటున్నారు. మేం అంతకంటే మెరుగైన సాధనం రూపొందించి రైతులను ఆదుకుంటాం. సింగరేణిలో గెలవలేక.. ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని మూయి స్తానన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎక్కడికిపోయా రు? గనుల్లో ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బందిపోటు దొంగలా మారారు. ఆయన కేసీఆర్ బిడ్డకు, కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతున్నాడు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచే సత్తా కేసీఆర్కు లేదు. అందుకే కోర్టుకు వెళ్లి వాయి దా తెచ్చుకున్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ దొరికితే బొగ్గుబావుల్లో పాతరేస్తారు. గతంలో సింగరేణి మూతపడే స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చేసి ఆదుకున్నారనే విష యాన్ని కార్మికులు మరిచిపోవద్దు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ధర్మపురిలో శ్రీలక్ష్మినరసింహుడి దయతో అడ్లూరి లక్ష్మణ్కుమార్ గెలిచినా.. ఈవీఎంలను మార్పించిన ఘనత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దక్కింది. ఓట్లను రీకౌంటింగ్ చేయాలని కోర్టు ఆదేశాలిస్తే అధికారులు స్ట్రాంగ్ రూంల తాళాలు పోయననడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు చేస్తున్నారు. మా సభకు కరెంట్ సర ఫరా కట్ చేయించారు. ప్రజలు ఎన్నికల్లో మీకు కరెంట్ లేకుండా కట్చేస్తారు. ఎమ్మెల్యే బాల్క సు మన్ ఇసుక, సింగరేణి ఉద్యోగాలు, హైదరాబాద్లో భూముల కబ్జాలు చేస్తున్నారు. నూరు కేసులు ఉన్నా యని చెప్పిన సుమన్.. ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారు? అవినీతిపై నిలదీసిన ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా రు.’’అని రేవంత్రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని సభలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు, రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, ఐఎన్టీయూఈ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, ధర్మపురి సభలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి సభలో మాజీ ఎంపీ వివేక్, నేతలు వినోద్, నల్లాల ఓదెలు, ఏఐటీ యూసీ నాయకుడు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ దీపావళి... పార్టీల స్వగతాలు!
అదేంటోగానీ దీపావళి బాణాసంచాకు చెందిన అనేక అంశాలు ఈసారి ఎన్నికల్లో బాగా రెలెవెంట్ అయి నప్పాయి. ప్రముఖ నేతల, పార్టీల స్వగతాలూ,స్వభావాలూ, ఆలోచనలూ...ఇవన్నీ తమ స్వగతాలుగా బాణాసంచాల్లో రిఫ్లెక్ట్ అవుతున్న తీరు ఇది. బీఆర్ఎస్ స్వగతం... ఎప్పట్నుంచో మన పార్టీ దేదీప్యమానం. మనం జస్ట్ ఓ తాడు పేనితే, అవి ‘దీపావళి తాళ్ల’లా మనకు వెలుగులూ, ప్రత్యర్థుల్ని కట్టడి చేసే మోకులయ్యాయి. మనం ఓ చిన్న గోలీ విసిరితే, అది నల్లగా పాంబిళ్లలా పాకి ప్రత్యర్థులను గజగజలాడించింది. మనమింతగా వెలిగామా! ఎందుకోగానీ తీరా ఎన్నికల ముందే మనకు కొన్ని అపశకునాల బాంబుపేలుళ్లు! మేడిగడ్డను ‘తాటాకు బాంబు’అంటూ ప్రొజెక్ట్ చేసినా, లక్ష్మి బ్యారేజీ కుంగి ‘లక్ష్మి బాంబు’లా పేలింది. సరిగ్గా ఎలక్షన్ టైము చూసుకుని...సర్రుమంటూ కాళ్లకింది భూచక్రంలా గిర్రుమంది. కనీసం డిసెంబరు మూడు నాటికైనా ఈ గండాలన్నీ తొలగి, మనం మతాబులా వెలగాలి మునుపటిలాగే! మన వారసులూ ‘సిసింద్రీ’ల్లా నిలవాలి ఎప్పటిలాగే!! కాంగ్రెస్ స్వగతం... అదేంటోగానీ... నిక్కమైన చక్కటి ‘బాంబు’ఒక్కటైన చాలు అని అధిష్ఠానం అనుకుంటుందా...ఒక్కో నియోజకవర్గంలో ఓ వెయ్యిమంది ‘థౌజెండ్వాలా’ల్లా పటపటా పేల్తారు! అభ్యర్థి ఎంపిక అయ్యేదాకా అందరూ చిటపట, చిటపట, చిటపటలాడుతూనే ఉంటారు. అందర్నీ మనం మన కార్యకర్తలనుకుంటాంగానీ...తామూ నేతలమేనంటూ వాళ్లు ‘టెన్ థౌజెండ్వాలా’లవుతారు. హమ్మయ్య ఎలాగోలా ఎంపిక పూర్తయ్యిందనుకుంటూ, హాయిగా నిట్టూర్చేలోపు...తోటి పోటీదారును సాటి సీఎంగా ఎంచి, ప్రతివాడూ ఎదుటివాడి సీటు కింద మంటపెట్టి వాణ్ని ‘రాకెట్’లా ఎగరేయాలని చూస్తారు. ఒక్కొక్కడు పైపైకెగిరాక...అక్కడా అనేక విన్యాసాలతో రంగురంగుల గోళాల్ని విరజిమ్ముతుంటాడు. అవి ఉల్కాపాతాల్లా సీఎమ్ కుర్చీని తాకి, తమ అవకాశాల్నెక్కడ గండికొడతాయోనంటూ అందరూ భయపడతుంటారు. కమ్యూనిస్టులు... రాజకీయ దీపావళిలో మనకూ బోల్డంత ప్రాధాన్యముందని మనమూ అనుకుంటామా?! కానీ వాస్తవం వేరు. కనీసం మనల్ని దీపావళి అగ్గిపెట్టెలోని వెలుగుపూల అగ్గిపుల్లల్లాగా కూడా చూడరు. తమ సొంత బాణాసంచా పేలడానికి పనికొచ్చే కొవ్వొత్తిలా మాత్రమే చూస్తూ...మనకెలాంటి వెలుగులూ, శబ్దాలూ అక్కర్లేదనీ...కేవలం వాళ్ల కోసమూ, వాళ్ల బాణాసంచాలు వెలగడం కోసమే మనం కొవ్వొత్తుల్లా కాలి, కారి, కరిగిపోతూ త్యాగం చేయాలనుకుంటారు ఈ పొరుగు పార్టీల వాళ్లు. ప్చ్. బీజేపీ... అసలు...ఏ బాంబు వెలగాలన్నా కాకరపువ్వొత్తినే కాల్చి మంట అంటిస్తారు కదా. అసలీ కాకరపువ్వొత్తిని కాకరపువ్వొత్తి అనే ఎందుకనాలి? మన పార్టీ గుర్తు ‘కమలం’కదా. కాబట్టి ఇకపై కాకరపువ్వొత్తిని ‘కమలం పువ్వొత్తి’అనే అనాలంటూ... ‘దీపావళి’సందర్భంగా ఓ రివల్యూషనరీ రిజల్యూషన్ తీసుకోవాల్సిందే మనం. అలా ఎలా కుదురుతుందంటూ మన కాళ్లలోనే పేలేలా ఎవ్వరూ బాంబులు పేల్చకండి. అసలిప్పటివరకు మనం మార్చని పేరంటూ ఏదైనా ఉందా? పథకాలూ, చట్టాల పేర్లూ, వీధుల–నగరాల పేర్లూ మార్చాం. ఆఖరికి...వాళ్లెవరో తమ కూటమికి పెట్టుకున్నారంటూ, ఇంగ్లిష్ లో పలికాల్సిన సొంతదేశం పేరు కూడా ప్రాంతీయ భాషల్లోకే మార్చి పలుకుతున్నప్పుడు కాకరపువ్వొత్తిని... ‘కమలం–పువ్వొత్తి’అని మార్చి పిలిస్తే పోయేదేముంది, ఒక కీలక బాణాసంచాకు మన పార్టీ గుర్తు పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడం తప్ప? ఇక సామాన్యుడి స్వగతం... సరే...అన్ని పార్టీలూ బాణాసంచా కాంతులతో ఏదోరకంగా వెలుగుతున్నవే కదా. మరి సామాన్యుడికి మిగిలేదేమిటి, దీపావళినాటి బాంబుల కాలుష్యపు పొగ, నుసి తప్ప! ఆ మర్నాడు వీధుల నిండా బాణాసంచాకు వాడిన కాగితాల చుట్టల వ్యర్థాలు తప్ప! అందుకే...ఇప్పటికైనా తమ బతుకులు వెలిగేపోయేలా ఆలోచించి ఓటేయ్యాలంటూ...ప్రతి సాటి ఓటరుకూ, మరో సామాన్య ఓటరు చేసుకుంటున్న విజ్ఞప్తులివి. తమ బతుకులు చీదేసిన చిచ్చుబుడ్డీలు కాకూడదంటూ చేస్తున్న వినతులివి. -
34 కాలనీలు.. 85 నామినేషన్లు
మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది. జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే. ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే.. మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు పాలకులు పట్టించుకోవడం లేదు.. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్ -
Telangana: వలస ఓటర్ల వేట
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే 2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు. ♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. ♦ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కునే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందుకు రేషన్ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. ♦నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు. వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది. ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. -
రెండు చోట్ల ఎందుకు పోటీచేస్తారు?
ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థి రెండు, మూడుచోట్ల అసెంబ్లీ/లోక్సభ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీచేస్తారు? దానివల్ల లాభనష్టాలేంటి? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. ఇక్కడ అత్యంత ఆసక్తికర అంశమేమి టంటే ముగ్గురు సీఎం అభ్యర్ధులు రెండేసి చోట్ల పోటీలో ఉండటం, పరస్పరం పోటీ పడుతుండటం. ఇలా గతంలో ఉమ్మడి ఏపీలో ఎన్నడూ జరగలేదు. ఆ మాటకొస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండేసి నియోజకవర్గాలకు పోటీచేసే అంశాన్ని నియంత్రించాల ని ప్రతిపాదించారు. దీనివల్ల ఉప ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడి అనవసర వ్యయ భారం పడుతోంద ని భావించేవారు. ఈ ఖర్చును సంబంధిత అభ్యర్థి నుంచి వసూలు చేయాలని కూడా కొందరు వాదించేవారు. 1996కి ముందు మూడుచోట్ల పోటీ చేయడానికీ అవకా శం ఉండేది. అలా కొంతమంది చేశారు కూడా. ఆ తర్వా త దానిని రెండు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. ఇలా రెండేసి చోట్ల పోటీచేసే వారిలో ప్రముఖ నేతలే ఎక్కువ. తమకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి, ఒకచోట పోటీ చేస్తే ఓడిపోతామని అనుమానం వచ్చినా జాగ్రత్తపడటానికి, ఇతరత్రా రాజకీయ కారణాలతోనూ రెండేసి చోట్ల పోటీచేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణలో ఏకంగా ముగ్గురు నేతలు రెండేసి చోట్ల పోటీ చేయడం, పైగా వారు ముగ్గురు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఈసారి ప్రత్యేకత అని చెప్పాలి. కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయడం తొలిసారి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి రంగంలో దిగారు. గతంలో కేసీఆర్ రెండుసార్లు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోటీ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇలా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకేసారి పోటీచేయలేదు. కేసీఆర్పై కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగుతుండ గా, గజ్వేల్లో బీజేపీ అగ్రనేత, ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడైన ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. రేవంత్, ఈటల ఇద్దరూ తమ పార్టీల తరపు న ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే పరిగణనలో ఉన్నారు. కొడంగల్ సభలో రేవంత్ ఆ విషయం ప్రజలకు తెలియచెప్పగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంలో బీజేపీ గెలిస్తే ఈటలను ముఖ్యమంత్రిని చేస్తామన్నారని వార్త లు వచ్చాయి. దానిని ధ్రువీకరిస్తూ ఈటల బహిరంగంగానే చెప్పేశారు. సాధారణంగా ఈ స్థాయి నేతలు ఇలా ఒకరిపై ఒకరు తలపడరు. ఎందుకంటే వారి రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ వీరిద్ద రూ తమకు పట్టున్న వేరే నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్నందున అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశాన్ని పదిలపరచుకున్నారని భావించవచ్చు. రేవంత్ కొడంగల్ నుంచి, ఈటల హుజూరాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీచేయడంలో ఉద్దేశం గజ్వేల్లో ఓటమి భయంతోనే అని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నా, అంత ఓడిపోయే పరిస్థితి ఉంద ని చెప్పలేం. నిజంగానే అలా జరిగితే బీఆర్ఎస్ అధికా రంలోకి రావడం కష్టమవుతుంది.పైగా గతంలో కేసీఆర్కు కాస్త పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కేసీఆర్ పక్షానే ఉన్నారు. రెండో సీటుకు పోటీ చేయడం ద్వారా ఆ పరిసర నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపే లక్ష్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు 1983 శాసనసభ ఎన్నికల్లో కొత్తగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గుడివాడతో పాటు తిరుపతిలో పోటీచేస్తారన్న సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో విపరీత ప్రభా వం చూపి ప్రత్యర్థి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రభావం చూపడానికేనా? మూడు దశాబ్దాల తర్వాత తెలుగు నాయకుడొకరు రెండుచోట్ల పోటీ చేయడం అదే మొదలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా కేసీఆర్ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కొంత ప్రభావం చూపడానికి కామారెడ్డి నుంచి కూడా రంగంలో దిగి ఉండొచ్చు. కామారెడ్డిలో ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తప్పుకుని కేసీఆర్కు అవకాశం ఇచ్చారు. సీఎం ఈ సీటును గెలిచాక ఆయనకు అవకాశం ఇస్తారా? లేక తన కుమార్తె కవితకు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఈసారి కామారెడ్డిలో విజయం సాధించే పరిస్థితి ఉందన్న వార్తలు వస్తుండేవి. ఎప్పుడైతే కేసీఆర్ పోటీ చేస్తారని వార్తలొచ్చాయో సహజంగానే ఆయన విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి పంపి, రేవంత్రెడ్డి రిస్కు తీసుకుంటున్నారు. తాను పోటీచేయడం ద్వారా కేసీఆర్ను కొంతమేర కామారెడ్డికి పరిమితం చేయొచ్చన్న ఆలోచన ఉండొచ్చు. కానీ కేసీఆర్ దానిని పట్టించుకోకుండా ,ఈ నెలాఖరు వరకు దాదాపు 94 నియోజకవర్గాల్లో ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రేవంత్ నిజానికి గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ తదుపరి మల్కాజిగిరి లోక్సభ స్థానానికి పోటీచేసి పుంజుకోగలిగారు. తనను గెలిపిస్తే సీఎం చాన్స్ ఉంటుందని చెప్పడంతోపాటు స్థానికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుని వివిధ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. రేవంత్ తలనొప్పి తెచ్చుకోవడమే... రేవంత్ కామారెడ్డి నుంచి పోటీచేయడం వల్ల కేసీఆర్కు ఎంత ఇబ్బందో తెలియదు గానీ, ఆయన మాత్రం తలనొప్పి తెచ్చుకోవడమే. ఎందుకంటే కేసీఆర్పై గెలిస్తే సంచలనమే అవుతుంది. కానీ ఓటమిపాలై అది కూడా భారీ తేడాతో అయితే ప్రతిష్ట దెబ్బతింటుంది. అదే సమయంలో కొడంగల్కు ఎక్కువ టైమ్ కేటాయించలేకపోతే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొడంగల్లో తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆయనే ఆరోపించారు. అలాగే ఈటల హుజూరాబాద్లో ఆరుసార్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి, ఒకసారి బీజేపీ పక్షాన గెలిచారు. టీఆర్ఎస్కు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం ఆయనకు ప్రతిష్ట తెచ్చింది. అదే ఊపుతో గజ్వేల్ నుంచి కూడా ఆయన రంగంలో దిగారు. ఇక్కడ కేసీఆర్ను ఓడించడం అంత ఈజీ కాదు. అయినా ఒక చాన్స్ తీసుకుంటున్నారు. అదే టైమ్లో హుజూరాబాద్లో తన బేస్ను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెంటికి చెడ్డ రేవిడి అయ్యే పరిస్థితి వస్తుంది. ఓడిన ఘట్టాలు రెండుచోట్ల పోటీచేసిన నేతలు గతంలో గెలిచిన సందర్భాలతోపాటు ఓడిన ఘట్టాలూ ఉన్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ది ఒక రికార్డు అని చెప్పాలి. ఆయన 1983లో గుడివాడ, తిరుపతి, 1985లో నల్లగొండ, హిందూపూర్, గుడివాడ నుంచి పోటీచేసి చరిత్ర సృష్టించారు. కానీ 1989లో కల్వకుర్తి, హిందూపూర్ నుంచి పోటీచేసి కల్వకుర్తిలో ఓడిపోయారు. అప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. 1994లో టెక్కలి, హిందూపూర్ నుంచి గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీచేసి తిరుపతిలో మాత్రమే గెలవగలిగారు. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. తెలంగాణలో పెండ్యాల రాఘవరావు అనే కమ్యూనిస్టు నేత 1952లో హన్మకొండ, వర్దన్నపేట అసెంబ్లీ సీట్లకు, వరంగల్ లోక్సభ సీటుకు పోటీచేసి మూడుచోట్లా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ సీట్లు వదులుకుని లోక్సభను ఎంపిక చేసుకున్నారు. మరోనేత రాంగోపాల్ రెడ్డి 1962లో బోధన్, మేడారం నుంచి ఇండిపెండెంట్గా ఎన్నికవడం విశేషం. లోక్సభకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలో రెండుచోట్ల పోటీచేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏదేమైనా తెలంగాణలో ఈసారి ముగ్గురు సీఎం అభ్యర్ధులు ఎన్నికల గోదాలో దిగడం సంచలనమే. ఒక్కోసారి పెద్ద నేతలు చిన్న నేతల చేతిలో ఓడిపోతుండటం కూడా జరగవచ్చు. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ రాయ్బరేలీలో రాజ్ నారాయణ అనే చిన్న నేత చేతిలో పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు టి.అంజయ్య ముషీరాబాద్లో కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కాలంలో ఆయనకు సీఎం అవకాశం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా నెగ్గారు. ఎన్టీఆర్ను చిత్తరంజన్ దాస్ అనే కాంగ్రెస్ నేత కల్వకుర్తిలో ఓడించారు. ప్రఖ్యాత నేతలు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి వంటివారు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే. సంజీవరెడ్డి స్వయంగా తన బావమరిది తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పలు చిత్రాలు కూడా జరుగుతుంటాయి. మరి తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం! - కొమ్మినేని శ్రీనివాసరావు -
గుర్తుంచుకునేలా..
సాక్షి మంచిర్యాల డెస్్క: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తు ప్రధానమైనది. రిజిష్టర్డ్ పార్టీలకు ఎన్నికల సంఘం కామన్ సింబల్ను కేటాయిస్తుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటే ఈసీ సూచించిన గుర్తుల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ కండిషనర్, అల్మారా, ఆపిల్, ఆటోరిక్షా, బేబీవాకర్, బెలూన్, బ్యాంగిల్స్, బ్యాట్, బ్యాట్స్మెన్, బ్యాటరీ టార్చ్, బెల్ట్, బెంచ్, బ్రష్, బకెట్, కేక్, కెమెరా, డీజిల్ పంప్, ఫుట్బాల్, గ్యాస్ స్టౌవ్, గిఫ్ట్ప్యాక్, గ్రామఫోన్, హార్మోనియమ్, హాకీ అండ్ బాల్, లేడీ ఫింగర్, లాప్టాప్, లెటర్ బాక్స్, లూడో, మిక్సీ, నెయిల్కట్టర్, పెన్డ్రైవ్, కుండ, టెలిఫోన్, టెలివిజన్, టూత్బ్రష్, టూత్పేస్ట్.. ఇలా ఏ అక్షర క్రమం నుంచి డబ్ల్యూ వరకు 193 రకాల వస్తువులను ఎన్నికల సంఘం గుర్తులుగా సూచించింది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఈసీ కొన్ని విధానాలు అవలంభిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో సూచించాల్సి ఉంటుంది. ఈ గుర్తులను మిగతా ఎవరూ ఎంపిక చేసుకోకుంటే వాటిలో ఒకటి కేటాయిస్తుంది. ఒకే గుర్తును ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఒకరికి కేటాయిస్తారు. జనసేనకు 32 స్థానాల్లో కామన్ సింబల్ జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం తెలంగాణలోని 32 అసెంబ్లీ స్థానాల్లో కామన్ సింబల్ను కేటాయిస్తూ ఈ ఏడాది సెపె్టంబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కానీ, పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన ఎనిమిది స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. ఈ స్థానాల్లో ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. జనసేన పార్టీ కోరిన 32 స్థానాల్లో తాండూర్ అసెంబ్లీ స్థానం లేకపోవడంతో ఎన్నికల సంఘం జాబితాలో లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి మరో గుర్తు ఎంచుకోవాల్సి ఉంటుంది. -
డబ్బిచ్చే వాడిదే తప్పు..
‘ప్రజాస్వామ్యం ధనస్వామ్యం, కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది. ఓటుకు నోటు ఎప్పుడైతే వచ్చిందో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతోంది.. డబ్బు ఇస్తున్నవాడిది తప్పా.. తీసుకుంటున్న వాడిది తప్పా అంటే డబ్బు ఇచ్చే వాడిదే తప్పు. ఎందుకంటే నాయకుడనేవాడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి డబ్బివ్వడం అనేది అతడి తప్పే అవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండానే కీలకం కావాలి’అంటున్నారు సినీ విప్లవ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి. ‘దేశంలో పీడిత ప్రజల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మహోన్నతం. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కమ్యూనిస్టులే ముందుకు వచ్చి పోరాటం చేస్తుంటారు’ అని చెప్పిన ఆయన ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచ కమ్యూనిస్టుల్లారా ఏకం కండి.. దేశంలో మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక చీలికలు పేలికలు అయ్యాయి. త్యాగాలు, సిద్ధాంతాలు గొప్పవైనా ఇప్పుడు అలా ఆ పార్టీలు ఉండకపోవడంపై చాలా బాధపడుతున్నాను. ఒకటా రెండా.. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదు. ఎన్నికల పోరాటంలో వామపక్షాలు కలిసి పోటీ చేయాలి. అందుకు ప్రపంచ కమ్యూనిస్టులంతా ఏకం కావాలి. బీజేపీ కులగణనకు ముందుకొస్తే అప్పుడు నమ్ముతాం అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. మహిళా బిల్లు పెట్టి దాన్ని ఇంకా పాస్ చేయలేదు. కులగణన చేయమంటే చేయట్లేదు. అలాంటప్పుడు బీసీలకు వారేం న్యాయం చేయగలరు? బీసీలకు మన దేశంలో అన్యాయం జరుగుతోంది. పార్లమెంటులో 13–14 శాతానికి మించి బీసీలు లేరు. వాస్తవంగా దేశంలో బీసీల జనాభా 54 శాతంగా ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులగణనకు ముందుకు రావాలి అప్పుడు బీసీ సీఎంను చేస్తామంటే మేం నమ్ముతాం. భయంతోనే ఎన్నికల్లో వెనక్కి తగ్గిన టీడీపీ.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామని చివరలో వెనక్కి తగ్గింది. టీడీపీ ఎన్నికల్లో నిలబడకుంటే ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతుంది. వారు ఆ పార్టీలో మిగలరు. దాని పర్యవసానమే కాసాని జ్ఙానేశ్వర్ పార్టీ మారడం. ఇక్కడ సొంతంగానో, లేదా ఏదైనా పార్టీతో పొత్తుతోనే బరిలోకి దిగిన తర్వాత వ్యతిరేక ఫలితాలు వస్తే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందన్న భయం కూడా టీడీపీలో కనిపించింది. అందుకే వెనక్కి తగ్గింది. అన్ని పార్టీల్లోనూ వారసులు.. వారసత్వం అనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉంది. వారసత్వానికి మేం వ్యతిరేకం అని మోదీ చెబుతున్నారు కానీ బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది వారసులు ఎమ్మెల్యేలుగా లేరా? సాక్షాత్తూ హోం మంత్రి అమిత్ షా తనయుడికి క్రికెట్ బోర్డులో కీలక పదవి ఇవ్వలేదా? ఇక రాహుల్గాంధీ సీఎం కేసీఆర్పై చేస్తున్న విమర్శల సందర్భంగా వారసత్వం ప్రస్తావించడం మరీ విచిత్రం. కాంగ్రెస్కు మించిన కుటుంబ పాలన ఇంకెక్కడ ఉంది? వారిది వారసత్వం కాదా? పార్టీ మారే వారిని బహిష్కరించాలి.. పార్టీలు మారడం సులువైంది. ఒక పార్టీ నుంచి గెలిచాక మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని నిరోధించడానికి పార్లమెంటులో బిల్లుపెట్టాలి. సిద్ధాంతం, పార్టీని చూసి ఓటు వేస్తే, ఆ తర్వాత పార్టీ మారితే అలాంటి వారిని నిలదీయాలి. పార్టీలను మారే వారిని బహిష్కరించాలి. రోజుకు మూడు పార్టీలు మారడమా? ఇదేం విచిత్రం? అలాగే డబ్బులిచ్చేందుకు వచ్చే వారినీ బహిష్కరించాలి. ఏం చేస్తారో బాండ్ రాసివ్వాలి.. ఎన్నికల్లో వచ్చే నాయకులను తమకేం చేస్తారో బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేయాలని ప్రజలు కోరాలి. గెలిపించిన తర్వాత బాండ్ పేపర్లో రాసిన హామీలు అమలు చేయకపోతే, కోర్టుకు వెళ్లాలి. అలా ఎన్నికలను పీపుల్స్ ఎజెండాగా మార్చాలి. పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ నెరవేర్చేలా మనం ఒత్తిడి చేయాలి. -బొల్లోజు రవి -
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
గజ్వేల్లో 145 .. కామారెడ్డిలో 92
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిపోగా, రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, గజ్వేల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కామారెడ్డిలో సైతం 92 మంది నామినేషన్ వేయడం గమనార్హం. మేడ్చల్ నియోజకవర్గంలో 116 మంది, ఎల్బీనగర్ నుంచి 77 మంది, మునుగోడు నుంచి 74 మంది, సూర్యాపేట నుంచి 68 మంది, మిర్యాలగూడ నుంచి 67 మంది, నల్లగొండ నుంచి 64 మంది, సిద్దిపేట నుంచి 62 మంది, కోదాడ నుంచి 61 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా నారాయణపేట్ స్థానం నుంచి 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 దరఖాస్తులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం భారీ సంఖ్యలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31,551 మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్ధిపేట నుంచి 757 మంది, అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 మంది దరఖాస్తు చేసుకున్నారు. వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అవకాశం కల్పిం చనున్నారు. 3.26 కోట్లకు పెరిగిన ఓటర్లు ఈ నెల 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఆ తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించి శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,26,18,205కి పెరిగింది. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లకు మించిపోయింది. 15,406 మంది సర్విసు ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లున్నారు. 2023 జనవరితో పోల్చితే తాజాగా రాష్ట్రంలో 8.75 శాతం మంది ఓటర్లు పెరిగారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 44,371 మంది ఉండగా, వికలాంగ ఓటర్లు 506921 మంది ఉన్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 9,99,667 కాగా, మొత్తం ఓటర్లలో వీరి శాతం 3.06గా ఉంది. -
బీజేపీకి భయపడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీపై ఎదురుగాలి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు. బీఆర్ఎస్ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు. మగదేవుళ్ల ఆధిపత్యం సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు. వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు. -
కేసీఆర్కు రెండుచోట్లా ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా ఓడిపోతారన్నారు. బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే వారికి పరాభవం వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు, అన్ని సీట్లు అని కేటీఆర్ చెబుతున్నారని, ఆయన చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా పరిస్థితులున్నాయన్నారు. శనివారం కిషన్రెడ్డి, రాజాసింగ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, సుదర్శన్ సింగ్ రాథోడ్, విద్యావేత్త బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జబ్బార్ నాయక్, శ్రీరాములు తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ...బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతల అక్రమ సంపాదనను కక్కిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి, మాఫియా, కుటుంబపాలనతో కూడిన చీకట్లను తరిమి.. బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా డిసెంబర్ 3న నిజమైన దీపావళి రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలోని కారు చీకటి పోయి, మరో కమ్ముకున్న చీకటి (కాంగ్రెస్) రాకుండా కమలం పువ్వుతో లక్ష్మీదేవి వచ్చేలా చూడాలని చెప్పారు. భూములు అమ్మితేనే జీతాలు సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను దగా చేశారని కిషన్రెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి బీఆర్ఎస్ పోయి ఇక్కడ కాంగ్రెస్ వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్లుగా అధికారంలో లేమని కాంగ్రెస్ నేతలు ఆవురావురు మంటున్నారని, రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మజ్లిస్, బీజేపీ రెండూ ఒకటేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, ఇతరనాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎంఐఎంను పెంచి పోషించి లాభపడింది కాంగ్రెస్ కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ మజ్లిస్ను మోస్తోందని విమర్శించారు. సూర్యుడు పడమట ఉదయించినా ఎంఐఎంతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. మతతత్వ, రజాకార్ల పార్టీతో బీజేపీ కలవబోదన్నారు. కర్ణాటకలో ఐదు నెలల పాలనలోనే ఐదేళ్ల అసంతృప్తిని, వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఐదు గ్యారంటీలంటూ కర్ణాటక ప్రజల తలలపై భస్మాసుర హస్తం పెట్టి కాంగ్రెస్ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించిందన్నారు. ఆ పార్టీ ట్రాక్రికార్డ్ ఘోరంగా ఉంటే ఆరు గ్యారంటీలతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటూ గొప్పలకు పోతోందన్నారు. -
ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్లో నిర్వహించే రోడ్షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్నగర్, నిజామాబాద్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. దీపావళి దాటగానే జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
కేసీఆర్పై పోటీ.. సరికొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. ఆ తర్వాత.. మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు. ఇప్పటిదాకా వంద మంది అఫిడవిట్లు లేకుండా నామినేషన్లు వేయడంతో ఎన్నికల సంఘం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. బీఫామ్ లేకుండా నామినేషన్లు వేసిన వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించనుంది ఈసీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. తెలంగాణ ఎన్నికల సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి
సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీంతో మందకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన. పరేడ్గ్రౌండ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మాదిగ విశ్వరూప సభ జరిగింది. ‘‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది. బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన కుర్చీలోంచి లేచి సభకు హాజరైన జనసందోహంను చూస్తూ వంగి నమస్కరించారు. -
కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను ఉచిత కరెంట్ కోసం ఖర్చు చేస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో కాంగ్రెస్పై, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. ‘‘రేవంత్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులే.. కాబట్టి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ అంటున్నారు. రైతులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3-4 గంటలకు మించి కరెంట్ వచ్చిందా?. బీఆర్ఎస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించుకోండి’’ అని తెలంగాణ రైతులను ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ‘‘ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగతిన పూర్తి చేసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడ్డారు. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా?. మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోంది. ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ నేతల్ని ఊరి పొలిమేర అవతలకు తరిమి కొట్టండి’’ అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. -
vijayashanti: కాంగ్రెస్లోకి విజయశాంతి!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అలాగే చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశాలుగా మారాయి. ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, అటుపై లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించి పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్వయహరించారు. అటుపై 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. విజయశాంతి కడప రేసు నుంచి తప్పుకున్నారు. దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన ఆమె.. 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. 2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్లో అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
ధరణి కంటే మంచి పోర్టల్ తెస్తాం: రేవంత్రెడ్డి
సాక్షి, బెల్లంపల్లి: తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్దే అధికారమని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి .. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. బెల్లంపల్లిలో శనివారం జరిగిన కాంగ్రస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో ఆయన బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?.. ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు. .. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?. అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది’’ అని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్ తీసుకొస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు. సింగరేణి కార్మికుల్ని కేసీఆర్ మోసం చేశారు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారని.. కానీ, వాళ్లను కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్రెడ్డి అన్నారు. రామగుండం కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్దీకరించలేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు బంద్ కాలేదు?. సింగరేణి సొంతింటి కల నెరవేరిందా?. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అన్నారాయన. -
‘రేవంత్.. మేము కూడా నీలా మాట్లాడగలం’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్ మండిపడ్డారు. రేవంత్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నోటికి వచ్చినట్లు రేవంత్ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. -
మళ్లీ వచ్చేది మేమే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్లో 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గిస్తామన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘నగరంలో ట్రాఫిక్ సమస్యను రాబోయే రోజుల్లో తగ్గిస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తాం. డిసెంబర్ 3న మళ్ళీ మేమే వస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్లో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేశాం. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తాం. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు మరింత పెరగాలి. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు ,మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చూడండి..జంగ్ తెలంగాణ -
అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుర్చీ ఆట మొదలైంది. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమో, లేక ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కుర్చినీ చూపిస్తున్నారో కాని మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి తనదంటే తనదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉందన్ని సమాచారంతో సీఎం పదవి కుర్చీపై కూడా కొందరు ఖర్చీఫ్ వేసుకుంటున్నట్లుగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా కుర్చీ పేరుతో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. పార్టీలో కొందరికి కాస్త అసహనం కూడా ఏర్పడింది. నాకే సీఎం పదవి: రేవంత్ రేవంత్ చాలా స్పష్టంగా తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని కొడంగల్ ప్రజలకు చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తానే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నానని పార్టీలో పోటీ పడేవారికి సంకేతం ఇవ్వడం, తాను ముఖ్యమంత్రి అవుతాను కనుక తనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం. నిజానికి ఇది ఒకరకంగా సాహసం అని చెప్పాలి. వర్గాలతో నిండి ఉండే కాంగ్రెస్లో ఇలా చెప్పడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే. అయినా ఆ పని చేయడానికే ముందుకు వెళ్లారు. దానికి కారణం సెంటిమెంట్ను ప్రయోగించడమే. ఉమ్మడి మహబూబ్నగర్నుంచి ఒక్కరే ఈ సందర్భంగా గతంలో బూర్గుల రామకృష్ణారావు ఒక్కరే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. మరో విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆఆర్ పోటీ చేసే కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ వేశారు. అక్కడ గెలిచే అవకాశం సహజంగానే తక్కువ. ఒకవేళ అక్కడ గెలిస్తే, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పక్షంలో ఆయనే సీఎం అవుతారని చెప్పవచ్చు. మరో పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. అది నెగిటివ్ మార్క్ అయినా, ఆ విషయం తెలిసి కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కనుక అది పెద్ద అభ్యంతరం కాకపోవచ్చు. కాంగ్రెస్లో అతి వేగంగా పీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత బాగానే ఉంటుంది. అందులోను రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి అతి వేగంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరారు. కాని అన్నిసార్లు అలా జరగాలని లేదు. గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆయన ఆ రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. కాని రెండేళ్లలోపే పదవిని వదలుకోవల్సి వచ్చిన సంగతి కూడా గుర్తుచుకోవాలి. కానీ ఆ తర్వాత కాలంలో అలాంటి అవకాశంఎవరికి రాలేదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వానికి జనామోదం ఉండడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. లైన్లో కోమటిరెడ్డి కూడా.. తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కాదని, సిద్దరామయ్యను సీఎంగా చేశారు. సిద్దరామయ్య అంతకు ముందు కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. వీరిద్దరి పోటీ అక్కడ వర్గ కలహాలకు ప్రాతిపదికగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు తామూ సీఎం అభ్యర్దులమేనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకున్నారు. రేవంత్ రెడ్డి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేసి ఉత్సహాపడ్డారో, అదే మాదిరి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఘట్టం సందర్భంగా జరిగిన సభలో కూడా ఆయనను సీఎం, సీఎం అని అనుచరులు నినాదాలు చేశారు. దానిపై ఆయన స్పందించారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో తనకు సీనియారిటీ ఉందన్నది ఆయన భావన. ఆయనతో పాటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించవచ్చు. అందరికన్నా సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి పోటీ చేయకపోయినా, ఆయా ప్రచార సభలలో తనకు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పి మనసులో మాట బయటపెట్టారు. మరో నేత జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతానని అంటున్నారు. పైగా సీఎం పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన జవాబు ఇచ్చారు. భట్టికి చాన్? మరో నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించారు. దళితవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయనకు చాన్స్ రావచ్చు. మరోవైపు బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నందున, ఆ వర్గాలకు చెందినవారు కూడా తాము రేసులో ఉంటామని ప్రకటించవచ్చు. బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ కూడా ప్రచారం ఆరంభించారు. ఆయన లక్ష్యం కూడా ఆ సెంటిమెంట్ ద్వారా తొలుత శాసనసభ్యుడిగా ఎన్నికవడమే అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న చర్చ. అసలు ఎన్నికలలో గెలవడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వీరంతా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎవరికి వారు తొలుత ఎమ్మెల్యే అవడం కోసం వ్యూహాత్మకంగా సీఎంపదవిని ఒక ఆకర్షణగా తమ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంతకీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్పాండే.. కిషన్రెడ్డికి ఫోన్చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్లో రాజగోపాల్ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్ను రవికుమార్ యాదవ్కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్డ్తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
మార్పులతో బీజేపీ ఐదో జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా గందరగోళానికి దారితీసింది. తీవ్ర కసరత్తు అనంతరం శుక్రవారం 14 మంది అభ్యర్థులతో చివరి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తవారు కాగా.. మిగతా నలుగురు మార్పులతో టికెట్ దక్కించుకున్నవారు. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఐదో జాబితాలోని మూడు చోట్ల అభ్యర్థులను మార్చడం గందరగోళానికి తెరలేపింది. ఇటీవల వేములవాడ నుంచి తుల ఉమ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా బీఫాంను చెన్నమనేని వికాస్రావుకి ఇచ్చింది. సంగారెడ్డి నుంచి దేశ్పాండే రాజేశ్వర్రావు పేరును ఐదో జాబితాలో ప్రకటించినా.. అక్కడ పులిమామిడి రాజుకు బీఫాం అందింది. బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి తొలి జాబితాలో సీటు పొందిన అమరాజుల శ్రీదేవిని మారుస్తూ.. కొయ్యల ఏమాజీ పేరు ప్రకటించారు. కాసేపటికే మళ్లీ అమరాజుల శ్రీదేవినే బరిలో ఉంటారని ప్రకటించి బీఫామ్ ఇచ్చారు. ఐదో జాబితాలో అలంపూర్ నుంచి మారెమ్మ బరిలో ఉంటారని చెప్పినా.. సాయంత్రానికి మార్చేసి, రాజగోపాల్ పేరు ప్రకటించారు. చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ ముదిరాజ్కు బదులు కె.మహేందర్ను ఎంపిక చేశారు. మూడో జాబితాలో వనపర్తికి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించగా.. తాజా జాబితాలో అనుజ్ఞారెడ్డిని అక్కడ బరిలో దింపారు. ఐదు జాబితాల్లో కలిపి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 111 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 8 స్థానాల్లో జనసేన బరిలో ఉంది. -
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
T Congress: ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తనదైన శైలిలో బుజ్జగించా రు. పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ నచ్చజెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హా మీ ఇచ్చారు. పలువురికి ఎంపీ సీట్లపై హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. నారాయణఖేడ్పై మీరే తేల్చుకోండంటూ నిర్ణయాన్ని ‘ఆ ఇద్దరికే’వదిలిపెట్టారు. ఒకరోజు పర్యటనకు గాను గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయన అర్ధరాత్రి వరకు తాజ్కృష్ణా హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల తో సమావేశమయ్యారు. టికెట్లు రాని దాదాపు 15 మంది నేతలను పిలిపించి ఆయన స్వయంగా మాట్లాడారని సమాచారం. ముఖ్యంగా నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎంపీ టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీ ఇద్దరూ తేల్చుకోండి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ను జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కూడా ఈ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించిన కేసీవీ ఎవరికి టికెట్ కావాలో తేల్చుకుని తన దగ్గరకు వస్తే వారికే బీఫారం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారని, ఈ భేటీలో భాగంగా సంజీవరెడ్డి అసెంబ్లీకి, షెట్కార్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే చివరి నిమిషంలో బీఫారంను సంజీవరెడ్డికి ఇచ్చారని సమాచారం. షెట్కార్ను జహీరాబాద్ లోక్సభకు పోటీ చేయిస్తామని కేసీవీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నారాయణఖేడ్ కథ సుఖాంతమైంది. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు మరికొందరికి కూడా.. ఇదే కోవలో కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, పారిజాతా నర్సింహారెడ్డి, గాలి అనిల్కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్ తదితరులతో కేసీవీ విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో బలరాం నాయక్ (మహబూబాబాద్), గాలి అనిల్కుమార్ (మెదక్)లకు లోక్సభ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ (వరంగల్)ను కూడా పార్లమెంటుకు పోటీ చేయిస్తామని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. ఈ సమావేశాల్లో భాగంగా కేసీవీ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పట్టుపట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మళ్లీ ఎంపీ టికెట్లకు పోటీకి రాకూడదని ఆయన సూచించినట్టు తెలిసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కేసీవీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు యువ నాయకులకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టికెట్ రానంత మాత్రాన అసంతృప్తి చెందాల్సిన పని లేదని చెప్పారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. బల్మూరి గురించి బోసురాజు ఏదో చెప్పబోగా.. ‘వెంకట్ గురించి అధిష్టానానికి తెలు సు. ఈ ప్రభుత్వంపై పార్టీ పక్షాన గట్టి పోరాటం చేశాడు. 60కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాహుల్గాంధీ జైలుకు వెళ్లి వెంకట్ను పరామర్శించారు..’అని వేణుగోపాల్ అ న్నారు. వెంకట్ రాజకీయ భవిష్యత్తుపై తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, పార్టీ కూడా వెంకట్కు తగిన ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బల్మూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లో కేసీవీ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడారనేది పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా వేణుగోపాల్ శుక్రవారం ఉదయం 6:30 సమయంలో ఢిల్లీ వెళ్లారు. -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నో ట్విస్టులు.. ఎంతో కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించగా, మిగిలిన 118 స్థానాలకు నాలుగు జాబితాల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. గత నెల 15వ తేదీన మొదటి జాబితాను ప్రకటించగా, దాదాపు 25 రోజుల కసరత్తు తర్వాత ఈనెల 9వ తేదీన నాలుగో జాబితాను ప్రకటించింది. పలు మార్పులు చేర్పులు, ట్విస్టులు, తర్జనభర్జనల తర్వాత అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రెండుచోట్ల పోటీ చేయడం ఇదే తొలిసారి. మొదటి మూడు జాబితాలకు గాను నాలుగు సీట్లలో (వనపర్తి, బోథ్, పటాన్చెరు, నారాయణఖేడ్) అభ్యర్థులను మార్పు చేయగా, ఒకచోట (చేవెళ్ల) మాత్రం కొంత ఉత్కంఠ, తర్జనభర్జన తర్వాత తొలుత ప్రకటించిన అభ్యర్థికే బీ ఫాం మంజూరు చేసింది. 34 ఇస్తామని.. 23 ఈసారి బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తామని, 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. తర్వాత 34 ఇవ్వడం సాధ్యం కావడం లేదని, 25 ఇస్తామని, సర్దుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ నుంచి బీసీలకు 23 టికెట్లు ఇచ్చారని, ఆ పార్టీ కంటే ఒకటో, రెండో ఎక్కువే ఇస్తామని పేర్కొంది. కానీ చివరకు 23 టికెట్లతోనే సరిపెట్టింది. చివరి నిమిషంలో ఇద్దరు బీసీలను మార్చినా మళ్లీ బీసీలకే అవకాశమి చ్చింది. పటాన్చెరులో నీలం మధు ముదిరాజ్ స్థానంలో కాట శ్రీనివాస్గౌడ్, నారాయణఖేడ్లో సురేశ్ షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డి (బీసీ)లకు చివరి క్షణంలో బీఫామ్లు ఇ చ్చింది. ఇక అగ్రవర్ణాలకు అత్యధికంగా 58 చోట్ల టికెట్లు కేటాయించింది. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 43, వెలమ కులస్తులకు 09, కమ్మ, బ్రాహ్మణ సామాజికవర్గాలకు మూడు చొప్పున అవకాశం కల్పించింది. అనుబంధ సంఘాలకు ఒక్కటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 10కి మించి అనుబంధ సంఘాలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన, మత్స్యకార, మహిళా విభాగాలు ఇందులో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఈ అనుబంధ సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న చాలామంది నేతలు ఈసారి టికెట్లు ఆశించారు. కానీ కేవలం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్కు మాత్రమే టికెట్ ఇచ్చారు. మరోవైపు ఒకరిద్దరు మినహాయించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా పార్టీ మొండి చేయి చూపింది. రిజర్వుడు స్థానాల్లో సామాజిక కూర్పు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 31 (19 ఎస్సీ, 12 ఎస్టీ) నియోజకవర్గాలకు టికెట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా సామాజిక కూర్పును చేసింది. 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 10 చోట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు, మరో 9 చోట్ల మాల వర్గానికి టికెట్లు కేటాయించింది. ఎస్టీ కోటాలో ఏడుగురు లంబాడాలకు, నలుగురు కోయ నేతలకు, ఒక గోండు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్లిచ్చింది. ఎవరి కోటా వారిదే.. టికెట్ల కేటాయింపులో రాష్ట్ర కాంగ్రెస్లోని అగ్ర నేతలు తమ మార్కు చూపెట్టారు. చర్చోపచర్చలు, తీవ్ర కసరత్తుల అనంతరం పూర్తి చేసిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో తమ సన్నిహితులు, అనుచరులకు టికెట్లు రాబట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తాండూరు, మెదక్, మల్కాజ్గిరి, అంబర్పేటలతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి తనతో కలిసి నడుస్తున్న మరో 10 మంది వరకు నాయకులకు టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కోటాలో సూర్యాపేట, సికింద్రాబాద్, భువనగిరి, కోదా డ స్థానాల్లో టికెట్లు రాగా, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్చర్ల, జనగామ, మునుగోడు స్థానాల్లో, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వైరా, మహేశ్వరం, రాజేంద్రనగర్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉడుం పట్టుపట్టి మరీ పటాన్చెరు, నారాయణఖేడ్లలో తమ వారికి టికెట్లు ఇప్పించుకున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. 118 టికెట్లలో సామాజిక వర్గాల వారీ కేటాయింపులిలా.. ఓసీ: 58 (రెడ్డి–43, వెలమ–09, కమ్మ–03, బ్రాహ్మణ–03) బీసీ 23: (మున్నూరుకాపు–05, యాదవ–04, గౌడ–04, ముదిరాజ్–03, ఆర్య మరాఠా, బొందిలి, చిట్టెపు రెడ్డి, వాల్మికి, మేరు, పద్మశాలి, రజకులకు ఒక్కొక్కటి.) ఎస్సీ: 19 (మాదిగ–10, మాల–09) ఎస్టీ: 12 (లంబాడా–07, కోయ–04, గోండు–1) ముస్లిం మైనార్టీ: 06 -
TS: జెండా కూలీలుగా మారిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ముసుగు తొలగించింది. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ కోసం ప్రచారంలోకి దిగింది. తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసిన కొన్ని గంటలకే.. తన ప్రియ శిష్యుడి కోసం రంగంలోకి దిగాలంటూ టీడీపీ శ్రేణుల్ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బహిరంగ మద్దతు ప్రకటించింది. పొత్తులో ఉన్నట్లు, కనీసం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటనలు చేయకుండానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తన ప్రియ శిష్యుడు రేవంత్రెడ్డి(టీపీసీసీ చీఫ్) కోసం పని చేయాలని చంద్రబాబు ఆదేశించడం.. ఆ ఆదేశాల్ని టీడీపీ నేతలు పాటించడం చకచకా జరిగిపోయాయి. శుక్రవారం కోదాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని పద్మావతి ప్రచారం చేశారు. ప్రచార ర్యాలీలో పద్మావతి భర్త ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీ శివకుమార్, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. అయితే ర్యాలీ కొనసాగే క్రమంలో.. కాంగ్రెస్ జెండాల మధ్య టీడీపీ జెండాలు కనిపించాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసిపోయి మరీ టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు జోష్గా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్లలో కొందరు తమను వేరే జెండా కూలీలుగా మార్చేశారంటూ అసహనం ప్రదర్శించడం స్పష్టంగా కనిపించింది. ఏపీలో టీడీపీ కోసం జనసేన కార్యకర్తలకు పట్టిన గతే.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పట్టిందని, ఇదంతా కర్మ ఫలితమేనని కామెంట్లు చేస్తున్నారు మరికొందరు. మళ్లీ 'ఓటుకు కోట్లు'? -
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనారిటీలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.మైనారిటీలకు కులగణనతో సంబంధం లేదు. ఇది బీజేపీ కుట్రలాగా కనిపిస్తోంది. మైనారిటీలను బీసీల్లో కలిపితే వారు తమ హక్కులన్నీ కోల్పోతారు. కాంగ్రెస్ వెంటనే మైనారిటీ డిక్లరేషన్ను ఉపసంహరించుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు! -
తెలంగాణ ఎన్నికలు.. పవన్కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గానే ఈసీఐ గుర్తించింది. అయితే, తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన తరఫున ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో, ఎనిమిది మంది కూడా జనసేన గుర్తు గ్లాస్ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. జనసేన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు. -
Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్ వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీ-ఫామ్ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీ-ఫామ్ అందజేసింది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే.. మల్కాజ్గిరి - రామచంద్రరావు శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్ పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ బెల్లంపల్లి - ఎమాజీ సంగారెడ్డి - దేశ్పాండే రాజేశ్వరరావు మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి చాంద్రాయణ గుట్ట- మహేందర్ కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్ దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి వనపర్తి - అనుఘ్నారెడ్డి అలంపూర్ - మేరమ్మ నర్సంపేట - కే. పుల్లారావు మధిర - విజయరాజు నాంపల్లి-రాహుల్ చంద్ర -
హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అద్ధంకి దయాకర్కు హ్యాండిచ్చింది. మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. "పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా." : అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt — Telangana Congress (@INCTelangana) November 9, 2023 -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి
మధిర/సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మధిర అభ్యర్థి గా గురువారం ఆయన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశదిశ నిర్దేశించేదిగా ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక పరిశ్రమలు జిల్లాకు సాధించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి అవకాశం జిల్లాకు రానున్నందున అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా అవకాశం లభించగా, మళ్లీ ప్రజల ఆశీస్సులతో తాను ఆ పదవి చేపట్టానని చెప్పారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీదారుడు, దుర్మార్గుడైన కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు మెరుగైన భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్కు గజ్వేల్లో ప్రజల అసంతృప్తి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వంద మంది కౌరవుల మాదిరి, శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో.. పాండువుల్లా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోరాడానని భట్టి తెలపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అవినాశ్ వజహర్ ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెప్తుంటే బీజేపీ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల ఇళ్లపై ఐటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరైంది కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ చెపుతుంటే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని, ఐటీ దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టాలని చూడటం అవివేకమేనని భట్టి అభిప్రాయపడ్డారు. -
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్లో నిర్వహించిన రోడ్షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్ను ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
సారుకు కారు లేదు!
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు. -
కేటీఆర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్గౌడ్కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతో రోడ్షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావుల రోడ్షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. వార్రూమ్లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ వార్రూమ్తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్రూమ్లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
అధికారంలోకొస్తే ప్రత్యేక మైనారిటీ సబ్ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీడబ్ల్యూసీ సభ్యులు నాసిర్, షకీల్ ఆహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్ తదితరులు మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ మెప్పు కోసం క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడించేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత తీసుకున్నాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేయని మజ్లిస్ ఈసారి అజహరుద్దీన్పై ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపడం వెనుక మైనారిటీ ఓట్లు చీల్చే కుట్ర కనిపిస్తోందని దుయ్యబట్టారు. అలాగే మైనారిటీ పక్షపాతినని చెప్పుకొనే సీఎం కేసీఆర్ తమ పార్టీ నేత షబ్బీర్ అలీ పోటీ చేసే కామారెడ్డి స్థానం నుంచి కూడా పోటీ చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్కు దమ్ముంటే గోషామహల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్పై గెలవాలని రేవంత్ సవాల్ చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మైనారిటీ డిక్లరేషన్లోని హమీల అమలు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు జాఫర్ జవీద్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీతారావ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్లోని హామీలు... ► మైనారిటీ సంక్షేమ బడ్జెట్ను రూ. 4,000 కోట్లకు పెంచడంతోపాటు నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి ఏటా రూ.1,000 కోట్ల కేటాయింపు. ► 6 నెలల్లోగా కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీలు సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చర్యలు. ► అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ఎంఫిల్ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం. పీహెచ్డీ, అదనంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి రూ. లక్ష, గ్రాడ్యుయేష¯న్కు రూ. 25,000, ఇంటర్కు రూ.15,000, 10వ తరగతి పాసైన వారికి రూ. 10,000 ఆర్థిక చేయూత. ► తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ► మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ. ► మసీదుల ఇమామ్లు, మౌజమ్లు, దర్గాల ఖాదీమ్లు, చర్చి పాస్టర్లులకు నెలకు రూ. 10,000 నుంచి 12,000 వరకు గౌరవ వేతనం. ► వక్ఫ్ బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వాదీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్. ► ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటికల కోసం భూకేటాయిపు. ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు. ► కొత్తగా పెళ్లయిన ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ జంటలకు రూ. 1,60,000 ఆర్థిక చేయూత. ► కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సెట్విన్ల బలోపేతం. -
Telangana: ఒక్కరోజే 1,129 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో భారీసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గురువారం రికార్డు సంఖ్యలో 1,129 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్లు వేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకు 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1,188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రెండురోజుల తర్వాత (13వ తేదీన) నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థులెవరో తేలిపోతుంది. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. -
మరో ఏడుగురికి బీజేపీ టికెట్లు!
సాక్షి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. బీజేపీ నాయకత్వం ఆయా అభ్యర్థులకు ఫోన్లు చేసి పార్టీ తరఫున నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో ఇప్పటివరకు 106 మందిని ప్రకటించినట్టు అయింది. మరో ఐదు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగతా 8 స్థానాలను పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు కేటాయించారు. కీలక స్థానాలకు ఎంపిక శేరిలింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ పేరు ఖరారైంది. నిజానికి ఈ సీటుకోసం జనసేన ప్రయత్నం చేసింది. కానీ తనకు సంబంధించిన చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోని కీలకమైన సీటు కావడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పట్టుబట్టి రవికుమార్ యాదవ్కు ఇప్పించుకున్నారు. ఇక మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావుకు.. పెద్దపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్కు టికెట్లు ఇచ్చారు. సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, నాంపల్లి నుంచి రాహుల్చంద్ర, కంటోన్మెంట్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ల పేర్లు ఖరారైనట్టు తెలిసింది. ఇంకా నర్సంపేట, మధిర, అలంపూర్, దేవరకద్ర, చాంద్రాయణగుట్ట సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట అభ్యరి్థగా సత్యనారాయణ ముదిరాజ్ పేరును ఇంతకుముందే ప్రకటించినా.. అనారోగ్య కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ కావడంతో.. ఈ ఐదు సీట్లకు వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నేడు నామినేషన్లు.. ప్రచార సభల్లో కేంద్రమంత్రులు శుక్రవారం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార సభల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. వరంగల్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, చేవెళ్లలో బీఎల్ఎన్ వర్మ, కొల్లాపూర్లో పురుషోత్తం రూపాలా తదితరులు పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 27 వరకు జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, అమిత్షా, నడ్డాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. టికెట్ ఖరారు సమాచారం అందిన నేతలు నియోజకవర్గం అభ్యర్థి 1.మల్కాజిగిరి రాంచందర్రావు 2.మేడ్చల్ విక్రమ్రెడ్డి 3.పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్రావు 4.శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్ 5.నాంపల్లి రాహుల్ చంద్ర 6.కంటోన్మెంట్ కృష్ణప్రసాద్ 7.సంగారెడ్డి పులి మామిడి రాజు -
చురక పెట్టాలె..!
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 50 ఏళ్లు గోసపడేలా చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు.. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా గోసపెడుతున్న బీజేపీ వాళ్లు మరోవైపు ఓట్ల కోసం వస్తున్నారని.. వారికి ఓటుతో చురక (వాత) పెట్టాలని పేర్కొన్నారు. ఏ అభ్యర్థి ఏమిటో, వారి గుణగణాలు, మంచీచెడ్డతోపాటు వారి వెనుక ఉన్న పార్టీని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షలతో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ మహాత్ముడు తనపై పోటీకి వస్తున్నారని, ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గజ్వేల్, కామారెడ్డిలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. తమాషాకు వేయొద్దు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటేయాలి. ప్రతీ విషయం మీద చర్చ జరగాలన్నదే నా అభిమతం. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు. ప్రజలే గెలవాలి. ఎన్నికలు రాగానే అబద్ధాలు, అభాండాలు, గోల్మాల్ తిప్పుడు, గోలగాళ్లు తయారవుతున్నరు. అట్లా కాకుండా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలి. బీడీ కార్మికులందరికీ జీవన భృతి యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలి. 1956కు ముందు మనం మనంగానే ఉంటే, మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. మనోళ్లు అప్పుడు నెత్తీనోరు కొట్టుకున్నరు. సిటీ కాలేజీ విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తే.. ఏడుగురు పిల్లల్ని కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ది. తెలంగాణ సాధించుకున్న సమయంలో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండె.. ఇప్పుడు ఎట్లా ఉన్నయో ఆలోచించాలి. నేను కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. అందులో బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. కటాఫ్ డేట్ తొలగించి అందరికీ జీవనభృతి ఇస్తాం. అందరికీ పింఛన్ సొమ్మును రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతాం. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి రాష్ట్రం వచ్చాక ఎన్నో విజయాలు సాధించినం. 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టినం. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి అండగా నిలిచినం. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నం. రాబోయే రోజుల్లో రూ.16 వేలకు పెంచుకుంటం. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడా రైతుబంధు లేదు. ఏదైనా పరిస్థితుల్లో రైతు చనిపోతే రైతుబీమాతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. కరెంటు మీద, రైతుబంధు మీద కాంగ్రెస్ లీడర్లు ఏమేమో మాట్లాడుతున్నరు. ఎద్దు ఎవుసం తెలువని రాహుల్గాంధీ ధరణిని తీసేస్తనంటడు. ధరణి పోతే మళ్ల వీఆర్వో, గిర్దావర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో.. ఇట్లా అందరి చేతుల్లోకి భూమి పోయి, రికార్డులన్నీ తారుమారై జనం ఆగం కావలన్నదే వాళ్ల ఉద్దేశం. ధరణి వచ్చినంక రైతుఖాతాలోనే భూమి ఉంటోంది, తను వేలిముద్ర వేస్తేగానీ వేరే వారికి మారే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలను నిలదీయాలి.. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తే మేం పెట్టబోమని స్పష్టం చేసిన. అందుకు రూ.25వేల కోట్లు లాస్ చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేంద్రం తరఫున 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాల్సి ఉన్నా ఒక్కటీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటూ వెయ్యకుండా చురుకు (వాత) పెట్టాలి. బీజేపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలి...’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే సింధే, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత గజ్వేల్లో.. తర్వాత కామారెడ్డిలో.. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి హెలికాప్టర్లో గజ్వేల్కు చేరుకున్నారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ పత్రాలను పరిశీలించి, స్వీకరించిన అధికారులు కేసీఆర్తో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్ హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. -
జాతి కోసమే బతికిన నేతల ఆశయమేదీ?
దేశ స్వాతంత్య్రోద్యమంలో ఉన్నత పదవులే కాదు, ఉన్నదంతా ధారపోసిన మహానుభావులున్నారు. ఈ పోరాట స్ఫూర్తిలోంచే విలువలతో కూడిన రాజకీయం ఆవిర్భవించింది. ప్రజాసేవే లక్ష్యంగా...పైసాకి కూడా వెతుక్కునే గొప్ప నాయకులను భారతావని అందించింది. ఇవన్నీ చెబితే ఈ తరం నమ్ముతుందా? అవేవో పుక్కిట పురాణాలు అనుకుంటారు ప్రజలు. నేటితరం రాజకీయాలు వ్యవస్థను అలా తయారు చేశాయంటారు సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల నుంచి తిరుగులేని నేతగా సుదీర్ఘకాలం గెలిచిన శాసనసభ్యుడాయన. హోం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ సహా కీలక మంత్రి పదవుల్లో సమర్థత నిరూపించుకున్న వ్యక్తి ఆయన. అసెంబ్లీ సమావేశాల ఉన్నతిలో ఆయన పాత్ర స్పష్టంగా కన్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల వేళ ఆయనను కలిసినప్పుడు ఎన్నో విషయాలు నెమరువేసుకున్నారు. అందులోంచి కొన్ని ఆయన మాటల్లోనే... రాజకీయాల్లో దూషణలు..అసభ్య పదజాలం.? ఒకరిపై ఒకరు దూషణలు.. అసభ్య పద ప్రయోగం..అనుచిత వ్యాఖ్యలు... ఇవీ నేటి రాజకీయాల్లో కనిపించేవి..బాధేస్తుంది..జాలేస్తోంది. అరే.. విధానపరమైన విమర్శలు చేస్తే తప్పేంటి? దీన్ని నేతలు ఎందుకు స్వీకరించడం లేదు. ప్రతి విమర్శలు గాడి తప్పుతున్నాయి. సిద్ధాంతపరమైన విమర్శలే రాజకీయాల్లో ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శనావాదం వచ్చేసింది. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. నేతలు ధన రాజకీయాల వైపే వెళ్తున్నారు. తేలికగా డబ్బు సంపాదిస్తున్నారు. దాన్ని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. సభా మర్యాద ముఖ్యం.. చట్టసభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నికయ్యే ప్రతీ ఎమ్మెల్యే దాన్ని గుర్తించాలి. చట్టసభల విలువలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేం అసెంబ్లీకి వెళ్తు న్నామంటే దృష్టంతా దానిపైనే ఉండేది. మంత్రిగా సమాధా నంచెప్పాల్సివస్తే..ముందే విద్యార్థిలా ప్రిపేర్ అయ్యేవారం, చాలామంది మంత్రులు అసెంబ్లీలో అధికారులపై ఆధారపడకుండానే సమాధానమిచ్చే వారు. తమ శాఖలపై అంత కమాండ్ ఉండేది. అసెంబ్లీ నియమాలు..ఏ అంశాన్ని ఏ రూల్ కింద లేవనెత్తాలి... వాకౌట్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ పార్లమెంటరీ నిబంధనలు చదివినప్పుడే తెలుస్తాయి. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదివేవారం. అసెంబ్లీలో చిన్నమాట తప్పుగా మాట్లాడినా పెద్ద వివాదమయ్యేది. మాట్లాడేప్పుడు అది గుర్తుండేది. కానీ ఇప్పుడేంటి? దారుణమైన భాష మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో ప్రజలు లైవ్లో చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ముందుగా నైతిక విలువలు నేర్చుకోవాలి. ఎవరెటో చెప్పలేని స్థితి ఓ నాయకుడు ఫలానా పార్టీ అని చెప్పడం కష్టంగా ఉంది. ఎప్పుడు మారతాడో తెలియదు. ఎందుకు మారతాడో అసలే తెలియదు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారని అందరికీ తెలుసు. పైకి మాత్రం ప్రజాభీష్టమంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని ఎప్పుడూ ఊహించలేదు. ఇదో దురదృష్టకర పరిణామమే. నేతల్లో విలువలు పెరగాలి. ఎన్నికల్లో పార్టీలిచ్చే హామీలు వినసొంపుగా ఉంటున్నాయి. కానీ వాటి అమలే ప్రశ్నార్థ్థకంగా ఉంటు న్నాయి. ఎవరు ఏమిచ్చినా..తిరిగి ఏదో రూపంలో ప్రజల నుంచే రాబడతారనేది అందరూ గుర్తించాలి. తెలంగాణ అభివృద్ధి చెందిందా అంటే... చెందిందనే చెబుతాను. కాకపోతే జరగాల్సిన అభివృద్ధి జరగలేదనేదే నా వాదన. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టగలిగే సామర్థ్యం ప్రజలకే ఉంది. అది ప్రజాస్వామ్యం ప్రజలకిచ్చిన ఓటు హక్కు. ఇప్పటికైనా ప్రజలు రాజకీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే నేతలనే గుర్తించి, చట్ట సభలకు పంపాలి. బ్యూరోక్రాట్స్ సాగిల పడటమేంటి? ప్రజాస్వామ్య పరిరక్షణలో ఐఏఎస్, ఐసీఎస్లది కీలక పాత్ర. వారు దీన్ని మరిచిపోయారేమో అన్పిస్తోంది. సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నా. బ్యూరోక్రాట్స్ ఇంత సాగిలపడటం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను. దశాబ్దకాలంగా ఇది మరింత దిగజారింది. బ్యూరోక్రాట్స్ సరిగ్గా పనిచేస్తే, రాజకీయ వ్యవస్థ ఇంత భ్రషు్టపడుతుందా? కట్టడి చేయగల సామర్థ్యం వాళ్లకు మాత్రమే ఉంది. నేతలు ఐదేళ్లే అధికారంలో ఉంటారు. అధికారులు సుదీర్ఘ కాలం సర్విస్ చేస్తారు. ఇది తెలిసీ నాయకులకు ఎందుకు సాగిలపడుతున్నారు..? మా అప్పుడు ఇలా లేదు. మేం చెప్పేదాంట్లో తప్పుంటే అభ్యంతరం చెప్పేవారు. ఖర్మ కాకపోతే... ఓ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్యే చెప్పినట్టు వినడమేంటి? అయితే ఈ మధ్య కాలంలో యువ ఐఏఎస్లు, ఐపీఎస్లు నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్లలో ఆశయం కన్పిస్తోంది. ఇది శుభ పరిణామమే. -వనం దుర్గా ప్రసాద్ -
ఇడ్లీ పాత్ర.. దోసె పెనం..కుతకుతలాడే అన్నం!
‘‘మీ పార్టీ లో అందరూ సీఎమ్ము క్యాండిడేట్లే. నామినేషన్ వేసే ప్రతివాడూ నేనూ సీఎమ్మంటూ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. జనాలు నవ్వుకుంటుంటే మీకు సిగ్గేయడం లేదా?’’ అంటూ బీఆర్ఎస్ నేతలూ, కార్యకర్తలందరూ విమర్శించసాగారు. పై ప్రశ్నకు ఇలా బదులు చెప్పారు కాంగ్రెస్ నేతలు. ‘‘తిండి అంటే అందరికీ ఇష్టం. కాబట్టి మీ ప్రశ్నకు వంట ఐటమ్స్తోనే జవాబు చెబుతాం వినండి. కాంగ్రెస్ అనేది ఇడ్లీ పాత్రలాంటిది. అందులో బోల్డన్ని ఇడ్లీప్లేట్లు ఉంటాయి. కింది నుంచి పైకి వేర్వేరు అంతస్తుల్లో అంచెలవారీగా కనిపిస్తుంటాయిగానీ..ఇడ్లీలన్నీ సమానంగా ఉడుకుతాయి. మా నాయకులూ అంతే. ఒకేసారి వాయి దిగే ఇడ్లీల్లాంటివారే. ఎందరో ఇడ్లీలు..అందరూ సీఎమ్ములే’’ ‘‘మరి మా బీఆర్ఎస్ వాళ్లో?’’ ‘‘బీఆర్ఎస్ సీఎంని దోసెపెనంతో పోల్చవచ్చు. ఇక్కడ దోసెపెనం ఎగ్జాంపుల్ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది..ఇంటి దోసెపెనం. ఈ ఎగ్జాంపుల్ను తీసుకుంటే ఇక్కడ ఒకేఒక్క దోసెకు అవకాశముంటుంది. అది మీ పార్టీ అధినేత. అంటే... ఆయనొక్కడే సీఎం అన్నమాట. ఇక.. ‘ఏ హోటల్లోనో లేదా టిఫిన్ సెంటర్లోనో ఒకేసారి నాలుగు దోసెలేసే వెడల్పాటి పెనాలుంటాయి కదా’ అని మీరడగొచ్చు. అక్కడికే వస్తున్నాం. టిఫిన్సెంటర్లోలాంటి ఆ పెనమ్మీద ఒకేసారి వేయగలిగే నాలుగు దోసెల్లాంటి బీఆర్ఎస్లోని ఇంపార్టెంట్ నేతలెవరో మీకు వేరే చెప్పక్కర్లేదనకుంటా!’’ ‘‘మరి కమ్యూనిస్టులో?’’ ‘‘ఒకప్పుడు వాళ్లు కూడా అన్నోఇన్నో సీట్లు గెలిచి పచ్చడిజాడీల్లా ఉండేవారు. ఇక్కడ పచ్చడి జాడీ అని ఎందుకంటున్నామంటే... అది మామిడికాయ పచ్చడైనా, పండుమిరపకాయ కొరివికారమైనా..ఇలా దాదాపు పచ్చళ్లేవైనా..‘ఎర్ర’టి ఎరుపురంగులో మిలమిలలాడుతూ కమ్యూనిస్టు కళతో కళకళల్లాడేవి. కానీ ఇప్పుడో? ఇటు పొత్తులపరంగా చూసినా..లేదా అటు గెలుపుపరంగా చూసినా వాళ్లకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కాబట్టి..ప్రస్తుతానికి వాళ్లను దంపుడుకారం మిల్లులోని గుంటల్లో మిరపకాయలనుకోవచ్చు. ఎర్రటి ఎండు మిరపల్ని అందులో వేయగానే..రోకళ్లు రెండూ ఒకదాని తర్వాత మరొకటి ఆల్టర్నేట్గా దెబ్బేస్తుంటాయి. ఆ రోకళ్లు మరెవరో కాదు..మొదట బీఆర్ ఎస్, తర్వాత కాంగ్రెస్! దాంతో పాపం..ఆ ఎండు మిరపలన్నీ పొడి పొడి అయిపోయి, కారంగా మా రి, ఘాటెక్కి, మంటెక్కి భగభగలాడుతున్నారు’’ ‘‘సరే... మరి పువ్వు పార్టీ వాళ్లో?’’ ‘‘వాళ్లు కాషాయం పార్టీ వాళ్లు కదా..అందుకే కషాయం అనుకోవచ్చు. అది ఆరోగ్యానికి మంచిదంటారు కదా. అచ్చం అలాగే కాషాయం దేశానికి మంచిదని వాళ్లూ అనుకుంటుంటారు’’ ‘‘సరే మరి ఓటర్లో?’’ ‘‘ఓటర్లనేవాళ్లు బియ్యపుగింజల్లా బోలెడంత మంది ఉంటారు. వ్యవహారికంలో కష్టాలొచ్చినప్పుడు ‘ఎసరొచ్చింది’ అనే నానుడి వాడుతుంటాం కదా. అలా ఎప్పుడూ వాళ్లకే ఎసరొస్తూ ఉంటుంది. ఎసరు మరగ్గానే పోసిన బియ్యపు గింజల్లా..పాపం వాళ్లెప్పుడూ కుతకుతలాడిపోతూ, ఉడికిపోతూ ఉంటారు. కానీ..ఎన్ని వంటకాలున్నా, ఎన్ని కూరలున్నా, ఎన్ని పచ్చళ్లున్నా అన్నమే మెయిన్ కదా. అలా చూస్తే..ఓటర్లు అన్నం లాంటివాళ్లన్నమాట. కాకపోతే ఎలక్షన్ టైములో అప్పుడే ఉడికిన వేడివేడి అన్నంలాంటి వాళ్లు. ఇక ఎన్నికలై ఏడాదిగానీ గడిచిందా.. పాశిపోయి పారేయాల్సిన సద్దిబువ్వల్లాంటివాళ్లవుతారు. ప్చ్..పాపం. ఇలా ఏరకంగా చూసినా వాళ్లు... ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఆల్వేస్ మొత్తుకుంటూ ఉండే అన్నం మెతుకులన్నమాట.’’ -
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
‘‘అధికార బీఆర్ఎస్పై ప్రజల ఆగ్రహ జ్వాలల అగ్నిపర్వతం నవంబర్ 30న బద్దలవుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. తెలంగాణలోని యువత మొత్తం భారతీయ జనతాపార్టీ వైపే ఉంది.’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిణామాలపై అంచనా వేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా విధ్వంసానికి గురికాగా.. ఒకవేళ కాంగ్రెస్ వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడి ఉద్యోగులకు జీతాలివ్వలేక తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే బీసీ సీఎం నినాదంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి కదా ? ఎన్నికల్లో మాకు, బీఆర్ఎస్కే ప్రధాన పోటీ. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అనేక నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదు. గ్యారంటీల పేరుతో హైప్ సృష్టించే ప్రయత్నంతోపాటు బీజేపీపై బురదచల్లి తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్నిపర్వతం బద్ధలవుతుందో తెలియదన్నట్టుగా పరిస్థితి ఉంది. వారు ఎంత ప్రచారం చేస్తే ఏమి లాభం, ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నేతల బలాన్ని చూసి ఇప్పుడు బయటకు చెప్పకపోవచ్చు. కానీ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ బింకాలు పోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పడితే అక్కడకు వెళ్లాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. మంత్రులను నియమించుకుంటున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కేవలం భ్రమల్లో బీఆర్ఎస్ నేతలు బతుకుతున్నారు. ఇక మా పార్టీకి ఊహించని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఇది మామూలు పరిస్థితుల్లో రాదు. మాది యూత్ఫుల్ పార్టీ. ఎక్కడి చూసిన యువతే పార్టీని నడిపిస్తోంది. ప్రచారాన్ని ఎప్పుడు ముమ్మరం చేస్తారు ? నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక.. మొత్తంగా దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాం. బీజేపీకి పోలింగ్బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఎవరు అభ్యర్థులు ఐనా ఒరిజినల్గా ఉన్న ఆర్గనైజేషన్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అభ్యర్థుల ఖరారులో ఆలస్యం వల్ల ప్రచారానికి ఇబ్బంది కాదా ? బీజేపీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఖరారులో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఆయా స్థానాలకు ఖరారు చేసిన వారు ఇప్పటికే మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న వాళ్లే. ప్రజలకు బాగా తెలిసినవారే. అందువల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. రాబోయే ఇరవై రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, అమిత్షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఇలా హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిస్తాం. పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తాం. పాత వారికి కాకుండా కొత్త వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు ? మాది పెరుగుతున్న పార్టీ. బలపడుతున్న పార్టీ. అందువల్ల మిక్స్డ్గా ఆలోచించాలి. పాత–కొత్త కలయికగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్తో ప్రజల మద్దతు పొందాల్సి ఉంటుంది. పాత వారికే ఇస్తామని మడికట్టుకు ఉండలేం. పూర్తిగా కొత్తవారికీ ఇవ్వలేం. ఆ దిశలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి మంచి ఫలితాలు సాధించాం. అదే ఎక్స్పర్మెంట్తో ఇప్పుడూ మంచి ఫలితాలు సాధిస్తాం. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడుతుందని మీరు పదే పదే అంటున్నారు ? ఎందువల్ల ? కాంగ్రెస్ చరిత్ర ఏమిటి? పుట్టుక ఏమిటి? అవినీతి చరిత్ర ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ? అని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడి దుస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో ఎలక్షన్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అవినీతి పాలన గురించి ప్రజలకు వివరిస్తూనే...కాంగ్రెస్ తనకు తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా అబద్ధపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పార్టీల చరిత్రను వివరించి, అవి ఏరకంగానూ తెలంగాణను ఆదుకోలేవనే విషయాన్ని ఉదా«హరణలతో చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని చెబుతున్నాం. ఇక్కడా యూపీ తరహా పాలన అంటున్నారు ? కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం వంతపాడుతూ వస్తోంది. పాతబస్తీలో మజ్లీస్ దౌర్జన్యమే నడుస్తోంది. కరెంట్ బిల్లు, ఇంటి పన్నులు వసూలు చేయలేకపోతున్నారు. 90 శాతం ఇళ్లు మున్సిపల్ అనుమతులు లేకుండానే కడతారు. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండగా నిలవడమే కారణం. యూపీలో యోగి ఆదిత్యనాధ్ పాలనలో బుల్డోజర్ ప్రభుత్వంతో ఆ రాష్ల్ర ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణలోనూ అలాంటి బుల్డోజర్ ప్రభుత్వం తెస్తాం. మాఫియాపై, అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. మజ్లిస్ పార్టీ కాదు వారి జేజమ్మలు వచ్చినా ఏమీ చేయలేరు. అక్రమాలు, దాడులకు, నేరాలకు పాల్పడే మజ్లిస్ నేతలు ఉండాల్సింది పాతబస్తీలో కాదు చంచల్గూడ, చర్లపల్లి జైళ్లల్లో.. .. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ పక్కన కూర్చుని చర్చలు జరుపుతున్నారు. -
ఎన్నికల బరిలో వారసులు
రాజకీయాల్లో వారసత్వమేమీ కొత్త విషయం కాదు. కొందరు వారసులు తమవంతు కోసం ఎదురుచూసి రాజకీయాల్లోకి వస్తే.. మరికొందరు ఇష్టం లేకపోయినా.. అనివార్యంగా రావాల్సి వస్తుంది. వారసులను రంగంలోకి దించేందుకు అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన తల్లీ/తండ్రీ/మామ/బంధువులు ఎవరైనా ఆకస్మికంగా మరణించినా లేక అనారోగ్య సమస్యలు తలెత్తినా.. వారి వారసులు తెరమీదకు రావాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వారసుల్లో అన్ని రకాల కారణాలతో వచ్చిన వారు ఉన్నారు. వారి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం! లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న ఆకస్మిక మరణంతో ఆయన కుమార్తె లాస్య నందిత రాజకీయ అరంగేట్రం చేశారు. నగరంలోని సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరైన సాయన్నకు మంచి కేడర్ ఉంది. ఆ కేడర్ను కాపాడుకునేందుకు, తిరిగి బీఆర్ఎస్ విజయపతాక ఎగరేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సాయన్న కూతురుకు టికెట్ ఇచ్చారు. ఈమె గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా గెలుపొందారు. వెన్నెల ప్రజాయుద్ధనౌకగా పేరొందిన సామాజిక ఉద్యమకారుడు గద్దర్ కుమార్తె వెన్నెల ఈ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. పాట ద్వారా సామాజిక స్పృహ పెంచి హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన శక్తిగా గద్దర్ ఎంతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కుమార్తె వెన్నెల కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేసిన ఈమెకు గద్దర్ పోరాటాలు వెంటనిలుస్తాయని ఆమె అనుచరులు ధీమాగా ఉన్నారు. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విద్యాసాగరరావు నాలుగుసార్లు కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వయోభారం వల్ల ఆయన తప్పుకుని ఈసారి కుమారుడు సంజయ్కి అవకాశం కల్పించారు. ఆమరణ దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించిన డాక్టర్గా మంచి అనుబంధం ఉంది. దీనికితోడు తండ్రి వయోభారంతో రాజకీయ వారసత్వాన్ని అంగీకరించి తొలిసారి బరిలో నిలిచారు. ఈయన కేటీఆర్కు బంధువు, క్లాస్మేట్ కావడం గమనార్హం. కుందూరు జయవీర్రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఘనమైన రాజకీయ నేపథ్యం, తండ్రికి ఉన్న బలమైన అనుచరబలం, అర్ధబలం ఇతని వెంటరావడం కలిసి వచ్చే విషయాలు. 2008లోనే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన జయవీర్.. తండ్రి తరహాలోనే కాంగ్రెస్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయారెడ్డి మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్రెడ్డి కుమార్తె విజయారెడ్డి. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న ఈమెకు తన తండ్రికి నగరంలో ఉన్న జనాదరణ కారణంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నగరంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరొందిన పీజేఆర్ చేసిన పనులు తన విజయానికి సోపానాలు అవుతా యని ధీమాగా ఉంది. కూచుకుళ్ల రాజేశ్రెడ్డి నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్య ర్థిగా కూచుకుళ్ల రాజేశ్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయునిగా రాజేశ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. దంత వైద్యుడైన ఆయన తెలంగాణ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మిథున్రెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. తన తండ్రి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి రాజకీయ వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో మంచి పేరు ఉంది. వారసత్వం, తండ్రి కేడర్ ఈయనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. తన కుమారుడు టికెట్ కోసం అధికార పార్టీతో విభేదించిన మైనంపల్లి వెంటనే కాంగ్రెస్లో చేరారు. అనుకున్నటు్లగానే తనకు మల్కాజిగిరి, తన కుమారుడికి మెదక్ టికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -భాషబోయిన అనిల్కుమార్ -
ఆ గోస మళ్లీ కావాల్నా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ ప్రజల 50 ఏళ్ల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని.. సమైక్య పాలకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపి మన ప్రాజెక్టులను రద్దు చేశారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. నదులు పారే పాలమూరు జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించినది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాలు చేస్తే, వందలాది మంది పిల్లలు చనిపోతే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు, నీళ్ల సమస్యలు, దోపిడీ, కమీషన్ల రాజ్యం వస్తుందని.. అలాంటి పాలన మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీలు, వాటి చరిత్రను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరులోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పిడికెడు మందితో తెలంగాణ అంతా తిరిగి అందరినీ చైతన్యవంతం చేశాం. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నాని్చవేత ధోరణితో టీఆర్ఎస్ను ముంచేందుకు ప్రయత్నించింది. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాల తర్వాత.. నేను ఆమరణ దీక్ష చేస్తే తట్టుకోలేక దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనుకకు పోవడంతో వందలాది మంది పిల్లలు చనిపోయారు. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణకు ఈ దుస్థితి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పచ్చబడింది. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మరోసారి ఖతం పట్టించాలని కుట్రలు చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పం.. చెప్పే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ వాళ్లు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు ఒకప్పుడు పాలమూరు జిల్లా పాలుగారిన జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు. పాలమూరును సర్వ నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారు. ఒక్క ప్రాజెక్టు కావాలని ఏ కాంగ్రెస్ నాయకుడూ నోరు తెరిచి అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే.. పాలమూరుకు నీళ్ల గురించి ఏ నాయకుడూ అడగలేదు. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోయి ఉంటే బాగుపడేదని బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లోనే రాసి ఉంది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ గమనించి అప్పట్లో జూరాలకు 17 టీఎంసీలు మంజూరు చేసింది. ఎవరూ పట్టించుకోకపోతే.. తెలంగాణ ప్రాంతవాసి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు. అయినా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. 2001లో గులాబీ జెండా ఎగిరాకే అడుగు ముందుకుపడింది. నాటి ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకున్నామంటూ పునాది రాళ్లు వేసిపోయారే తప్ప ఎవరూ కశికెడు నీళ్లు తెచ్చివ్వలేదు. కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంట పారే జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పాలమూరు ఎలా అయిందో ప్రజలు గమనించాలి. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించారు. కోయిల్సాగర్ లిఫ్ట్నూ పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలను పూర్తిచేసి చెరువుల్లో నీళ్లు నింపుతాం. మరో ఉద్యమం వస్తదేమో.. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందిస్తలేదు. మరో ఉద్యమం వస్తదేమో. సమైక్య రాష్ట్రంలో మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి బోయలను ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీల్లో పెట్టి, ఇక్కడ బీసీల్లో పెట్టింది నిజం కాదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? ఆనాటి మంత్రి రఘువీరారెడ్డి పాలమూరుకు వస్తే.. మంగళహారతులు పట్టి మరీ నీళ్లు తీసుకుపొమ్మని ఎవరు చెప్పారో అందరికీ తెలుసు. బాగా ఆలోచించి ఓటేయాలి నేను కూడ రైతునే, వారికష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. గతంలో రాత్రిళ్లు ఇచ్చే అరకొర కరెంటుతో పాములు కుట్టి, కరెంటు షాక్ తగిలి వేల మంది రైతులు మృత్యువాత పడ్డారు. రైతు బంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటే.. మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రైతులపై విషం చిమ్ముతున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజల దగ్గర ఓటు అనే వజ్రాయుద్ధం ఐదేళ్ల భవిష్యత్ను నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి, సమాజానికి ఎవరుంటే మేలు జరుగుతుందో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి. గద్వాలలో తడబడిన కేసీఆర్ కేసీఆర్ గద్వాలలో తన ప్రసంగం సందర్భంగా తడబడ్డారు. ‘‘ఎన్నికలు వస్తాయి, పోతాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉంటారు. అభ్యర్థుల గుణం చూడాలి. ముఖ్యంగా వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. బండ్ల కృష్ణమోహన్రెడ్డి వెనుక బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటది’’అని చెప్తూ.. ‘బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది’అన్నారు. వెంటనే సవరించుకుని ‘బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’అంటూ ప్రసంగం కొనసాగించారు. నారాయణపేటలో ఉర్దూలో ప్రసంగం సీఎం కేసీఆర్ నారాయణపేట సభలో ప్రసంగించిన సందర్భంగా చివరిలో ముస్లింలను ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో ఒక్క కర్ఫ్యూ లేదు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది’’అని చెప్పారు. హెలికాప్టర్లో సమస్యతో సభలు ఆలస్యం మర్కూక్ (గజ్వేల్): సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే వెనక్కి తిప్పి వ్యవసాయ క్షేత్రంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రచార సభలకు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు మరో హెలికాప్టర్ను తెప్పించారు. కేసీఆర్ అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు.. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ దేవరకద్ర సభకు రావాల్సి ఉండగా.. హెలికాప్టర్ సమస్య వల్ల 3.35 గంటలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి 12 నిమిషాలు ప్రసంగించారు. అక్కడి నుంచి గద్వాలకు చేరుకుని 15 నిమిషాలు, మక్తల్లో ఎనిమిది నిమిషాలు ప్రసంగించారు. చివరగా నారాయణపేటలో 29 నిమిషాలు మాట్లాడారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్కు చేరుకున్నారు. -
కాంగ్రెస్ వస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్పు అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు కాకూడదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి అంతేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని.. అవినీతి, అక్రమాల్లో కవల పిల్లల వంటివని విమర్శించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో దళిత సీఎం నుంచి దళితబంధు దాకా, ఉద్యోగాల భర్తీ మొదలు నిరుద్యోగ భృతి దాకా.. ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా చాలా రంగాల్లో కేసీఆర్ సర్కార్ పాలన తూతూమంత్రంగానే సాగిందని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తనతో బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేయాలన్న నిర్ణయానికి అనుగుణంగానే తనను అసెంబ్లీకి పోటీచేయొద్దని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సరైన తీర్పు ఇవ్వాలి కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు వేస్తే కాంగ్రెస్కు వేసినట్టే. ఈ రెండింటికి వేస్తే ఎంఐఎంకు వేసినట్టే. కేసీఆర్ అవినీతి, నయా రాచరిక పాలనతో ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది. దేశంలోని అన్ని సమస్యలకు, దోపిడీ, అవినీతి రాజకీయాలకు కారణమైన కాంగ్రెస్.. తెలంగాణలో గ్యారంటీలు నెరవేర్చుతామంటే ఎలా నమ్ముతారు? ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు. ఓటు ఆయుధంతో సరైన తీర్పు ఇవ్వాలి. నేరం చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత అరెస్టో, సోనియాగాంధీ అరెస్టో.. ఏదైనా విచారణ సంస్థల బాధ్యత. అది బీజేపీకి సంబంధం లేని అంశం. తప్పు జరిగిన చోట ఆధారాలతో వ్యవస్థ ముందుకెళ్తుంది. నేరం చేసిన వారెవరైనా జైలుకెళ్లాల్సిందే. కాళేశ్వరంగానీ మరే పథకంలోగానీ అవినీతి జరిగిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనో లేదా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆదేశిస్తేనో సీబీఐ విచారణకు అవకాశం ఉంటుంది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇస్తుండటమే దీనికి కారణం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోసం మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ సంతకం పెడితే.. 4 గంటలకల్లా సీబీఐ టీమ్ను సిద్ధం చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేసీఆర్ వద్ద అంత డబ్బు ఎక్కడిది? తానే ఓ సూపర్ ఇంజనీర్ అన్నట్టుగా కేసీఆర్ నిపుణుల సూచనలను కాదని కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. రూ.30వేల కోట్ల ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.1.30 లక్షల కోట్లకు పెంచి.. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన నాయకత్వాన్ని అంగీకరిస్తే అన్ని రాజకీయపార్టీల ఎన్నికల ఖర్చును భరిస్తానని కేసీఆర్ చెప్పినట్టు ఒక సీనియర్ రిపోర్టర్ వెల్లడించారు. అంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల డబ్బు ఒక సీఎం చేతుల్లో ఉందంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఓటమి ఖాయం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి, తన కొడుకును సీఎం చేయాలన్న ఆలోచనే తప్ప ప్రజల బాగోగులను కేసీఆర్ పూర్తిగా విస్మరించారు. తనతోనే తెలంగాణ వచ్చినట్టు కేసీఆర్ గొప్పలు చెప్తుంటారు. బీజేపీ ఎంపీల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రంఏర్పడేదా? ఉద్యమాలతో అధికారంలోకి వచ్చి.. మరెవరూ ఉద్యమాలు చేయకుండా, తమ గోడు చెప్పుకొనే అవకాశం లేకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఈ తీరుపై ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్లా కేసీఆర్ ఓటమి ఖాయం. కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుచేసి విఫలమయ్యారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు రిపీట్ కాబోతోంది. బీసీలంతా కలసి గెలిపించుకుంటారు తెలంగాణలో బీసీలకు రాజ్యాధికార సాధన లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నాం. దేశంలో మొదటిసారిగా బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించాం. రాష్ట్ర జనాభాలో 55శాతం ఉన్న బీసీలు తమ వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. వాళ్లే గెలిపించుకుంటారు. ఈ విషయంలో ఎవరి ప్రభావం పనిచేయదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను అవహేళన చేస్తున్నాయి. జనసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ. పొత్తుధర్మంగా వారిని కలుపుకొని ముందుకెళ్తాం. ప్రగతిభవన్ను ప్రజాభవన్గా మారుస్తాం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. దుబారా తగ్గించి, అవినీతిని పూర్తిగా అరికడుతుంది. కేసీఆర్ కుటుంబభవన్గా మారిన ప్రగతిభవన్ను ప్రజా ప్రగతిభవన్గా మారుస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే సీఎంను తీసుకొస్తాం. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూపిస్తాం. అవినీతి రహిత వ్యవస్థను నిర్మిస్తాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. వ్యక్తిగత అవసరాల కోసమే వీడుతున్నారు పార్టీని వీడేవారు వ్యక్తిగత అవసరాలకోసం వెళ్తున్నారు. ఏం ఇబ్బంది లేదు. మాది కేడర్ ఆధారిత పార్టీ. ప్రజలు మాతోనే ఉన్నారు. నామినేషన్ల విత్డ్రా తర్వాత మేనిఫెస్టో విడుదల చేయడం మా సంప్రదాయం. ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడి సలహాలు తీసుకున్నాం. ఏం చెబుతామో అది చేసి చూపిస్తాం. -
ఎన్నికలు అనగానే గుంపులుగా వస్తున్నారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘సీఎం కేసీఆర్ సింహంలాంటి వాడు. సింహం సింగిల్గానే వస్తుంది. తోడేళ్లే మందలు మందలుగా వస్తాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా.. చివరికి తెలంగాణలో గెలిచేది కేసీఆరే..’’అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం షాద్నగర్ నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం కొనసాగుతోందన్నారు. ‘‘బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను మోహరిస్తే.. కాంగ్రెస్ నుంచి సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్గాందీ, ప్రియాంక గాంధీ తిరుగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రజలకు జూటా మాటలు చెప్తున్నారు. ఒక్క బక్కపల్చని కేసీఆర్ను ఓడించేందుకు ఇంత మంది రావాల్నా? ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతోంది. కేసీఆరే తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు..’’అని చెప్పారు. కేసీఆర్ను ఓడించేందుకు కాంగ్రెస్ వాళ్లు డబ్బు సంచులతో తిరుగుతున్నారని.. వాళ్లు పంచే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం కారు గుర్తుపై వేయాలని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. గత పాలనలో రెండు, మూడు గంటలకు మించి కరెంట్ ఉండేది కాదని.. తెలంగాణ వచ్చాక 24 గంటలు ఇస్తున్నామని వివరించారు. బీజేపీ నేతలు పోటీకి భయపడుతున్నారు రాష్ట్రంలో బీజేపీ ఎత్తిపోయిందని.. ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పోటీకి భయపడుతున్నారన్నారు. ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని.. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ కావాలో, బతుకులను చీకట్లోకి నెట్టే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్, షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ఇక 'ప్రాంతీయ' శకమే: సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నికలు వస్తుంటాయి.. వివిధ పార్టీల అభ్యర్థులు నిలబడతారు.. ఇప్పుడు కూడా నిలబడ్డారు. మనిషి గుణం, గణం చూడాలి. సేవ చేస్తాడా.. గెలిచిన తర్వాత టాటా చెబుతాడా..? అన్నవి పరిశీలించాలి. అంతకన్నా ముఖ్యమైన అంశం.. అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉంటుంది. గెలిచే అభ్యర్థి ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వమే రాబోయే ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్ను నిర్దేశిస్తుంది. మన తలరాత రాస్తుంది. కాబట్టి ఏ పార్టీ చరిత్ర ఏమిటి?..అధికారం ఇచ్చినప్పుడు వారి నడత, సరళి ఏమిటి? ఏం చేశారనేది ఆలోచించి మీ విచక్షణతో ఓటు వేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలవడం ప్రారంభం అవుతుంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ సొంత ఓటు. మీ నిర్ణయాధికారాన్ని సరైన పద్ధతిలో వాడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు..’అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెంల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. మీ కళ్ల ముందే అభివృద్ధి ‘బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ జెండా ఎత్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా భుజాన వేసుకున్నాయా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమాన పరిచారు. కాల్చి చంపారు..జైళ్లల్లో పెట్టారు. వీళ్లకెందుకు ప్రేమ ఉంటుంది? కాంగ్రెస్ నాయకులకు సొంతం ఉండదు కథ. ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైటు వెలుగుతుంది. ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాం అవుదామా? తెలంగాణ రాకముందు 70 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమురా’అని ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకటరామారావు పాట రాశారు. ఖమ్మం, కొత్తగూడెం నాడు ఎలా ఉండేవి? ఐదారేళ్లలో ఎలా చేశాం? ఖమ్మం పట్టణం చూస్తే ఇప్పుడు గర్వపడుతున్నా. ఒకనాడు ఇక్కడ పాదయాత్ర చేశా. గోళ్లపాడు ఎట్లా మురికిగా ఉండేది.. ఎన్నేళ్లు ఆ మురికి కంపు భరించాం? లకారం చెరువు ఎంత వికారంగా ఉండేది.. ఇవ్వాళ ఎంత సుందరంగా తయారైంది. అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది..’అని కేసీఆర్ అన్నారు. సింగరేణిని గాడిలో పెట్టాం..లాభాలు పెంచాం.. ‘అప్పట్లో రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి పేరు చెప్పి కేంద్రం నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చాయి. వాటిని సకాలంలో చెల్లించలేదు. దానికి బదులు సింగరేణిలో కేంద్రానికి వాటా ఇచ్చారు. ఫలితంగా సింగరేణి సంస్థలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లింది. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని గాడిలో పెట్టాం. లాభాలను పెంచడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా సంస్థను తీసుకువచ్చాం. రాష్ట్రంలో కరెంటు కష్టాలు, మంచినీటి వెతలు తీరాయి. గురుకులాలతో విద్యావ్యవస్థ మెరుగైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ మేం ప్రతి దళిత కుటుంబానికి సాయం అందే వరకు దళితబంధు పథకం కొనసాగిస్తాం. ఇవన్నీ విచారించి.. ఆలోచించి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలి..’అని సీఎం విజ్ఞప్తి చేశారు. మైనార్టీలకు పెట్టిన ఖర్చు చూడండి.. ‘మనకన్నా ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది. మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం రూ.900 కోట్లు ఖర్చుచేసింది. ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ఓట్లు దండుకుంది. మనం తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దీన్ని చూస్తే ఎవరు ఏవిధంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. మేం అందరినీ కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నాం. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం లౌకిక రాష్ట్రంగానే ఉంటుంది. అజయ్కుమార్ను ప్రేమతో అజయ్ఖాన్ పేరుతో పిలుస్తారు. అజయ్ను ఆశీర్వదించండి. ఖమ్మంకు న్యాయం చేస్తాడు..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఖమ్మంకు వాళ్లిద్దరి పీడ వదిలింది.. ‘ఖమ్మం జిల్లాలో ఇద్దరు కరటక దమనకులు ఉన్నారని మొన్న సత్తుపల్లి సభలో చెప్పా. పరావస్తు చిన్నయసూరి కథ చదివితే వాళ్లెవరు ఆ కథ ఏంటో తెలుస్తుంది. లేకపోతే మీ తెలుగు మాస్టర్ని అడగండి. ఖమ్మానికి వీళ్లిద్దరి పీడ వదిలించాం. ఇవ్వాళ ఖమ్మం శుభ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఒకాయన అజయ్ చేతిలో ఓడి మూలకు పడి ఉంటే.. నేను పిలిచి అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లాను అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా. బీఆర్ఎస్ పార్టీ వారిని ఒక్కరినీ అసెంబ్లీ గడప తొక్కనీయనని ఒక అర్భకుడు మాట్లాడుతున్నాడు. ఖమ్మంను గుత్తకు పట్టినవా.. ఖమ్మం జిల్లాకు జిల్లానే కొనేశావా.. ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా?..’అంటూ పరోక్షంగా తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ సభల్లో పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మ«ధు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, లింగాల కమల్రాజ్, రేగా కాంతారావు, బానోతు హరిప్రియ, బానోతు మదన్లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
పంటికి తగలకుండా మింగేస్తరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/మోర్తాడ్(బాల్కొండ)/సాక్షిప్రతినిధి,కరీంనగర్/ నిర్మల్: తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని, ఎవరో ఒకరు గెలుస్తారని... కానీ మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, వాళ్ల మంచి చెడులు విచారించి, ఏపార్టీకి ఓటేస్తే లాభమో, ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఒక్క చాన్స్ అంటూ వస్తున్న వారిని నమ్మితే అంతేనని.. పంటికి కూడా తగలకుండా మింగేస్తారని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన విషయంపై గ్రామాలకు వెళ్లిన తర్వాత లోతుగా చర్చించాలని కోరారు. నిర్మల్, బాల్కొండ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ కోసం నేను 24 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నా. 14 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన. మరో పదేళ్లపాటు తెలంగాణ అభివృద్ధి కోసం మమేకమైన. ఇప్పుడు దుష్టశక్తుల నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు మీరే కొట్లాడాలి. ప్రజలు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల మంచి చెడులను విచారించాలి. ఆగం కావొద్దు. నేను మాట్లాడిన మాటలు ఇక్కడనే విడిచిపెట్టొద్దు. మీ గ్రామాలకు వెళ్లిన తర్వాత చర్చ పెట్టాలి. ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలవాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ దగ్గరున్న విలువైన వజ్రాయుధం ఓటు. పోటీచేసే ప్రతి అభ్యర్థి గుణగణాలు, ఆయా పార్టీల చరిత్ర, నడవడిక, దృక్పథం మీద చర్చ జరగాలి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్ఫ్యూ లేదు. మత కల్లోలాలూ లేవు. అలాంటిది బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎంపీ ప్రభాకర్రెడ్డిపైనే కాంగ్రెస్ కత్తుల దాడి జరిగింది. వాళ్లు దుర్మార్గమైన సంస్కృతిని తయారు చేస్తున్నారు. కేసీఆర్ ప్రాణంతో ఉన్నంత వరకు తెలంగాణలో శాంతిభద్రతలు ఉంటాయి. నెహ్రూ కాలం నుంచే దృష్టిపెట్టి ఉంటే.. కాంగ్రెస్ హయాంలో దళిత సమాజం అణచి వేయబడింది. వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. నెహ్రూ కాలం నుంచే వీరి సంక్షేమంపై దృష్టిపెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. అసలు దళితబంధు అనే పథకాన్ని పుట్టించినదే బీఆర్ఎస్ పార్టీ. దళిత సమాజాన్ని ఉద్ధరించాలన్నదే మా లక్ష్యం. ఏ ప్రధాని, సీఎం కూడా దళితబంధు లాంటి ఆలోచన చేయలేదు. గిరిజనులకూ పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. కరెంటు, నీళ్లు, రైతుబంధు.. నీటి తీరువా రద్దుచేశాం. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. పండిన పంటనూ ప్రభుత్వమే కొంటుంది. రైతు రుణమాఫీ అందరికీ వస్తుంది. ఒకప్పుడు అంజుమన్ బ్యాంక్ అప్పులు బాకీ ఉంటే రైతుల ఇండ్ల తలుపులు గుంజుకుపోయేవారు. అలాంటి పరిస్థితులు రాకుండా, రైతుల బాధలు తీర్చాలని రైతుబంధు అమలు చేస్తున్నాం. ఇదేదో ఎలక్షన్ల కోసం చేయలేదు. నాకు రైతుబంధు పెట్టాలని ఎవరైనా దరఖాస్తు ఇచ్చారా? ఉద్యమం చేశారా? నా అంతట నేను రైతు నాయకులు, మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకున్నా. దాని ఫలితం తెలంగాణ ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే పెద్ద పాము మింగినట్టే! ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ అంటూ వస్తోంది. ఇంతకుముందు 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు వారు ఏంచేశారో ప్రజలు ఆలోచన చేయాలి. అన్నిరంగాల సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు ఓటేస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే. కాంగ్రెస్ నేతలు పంటికి కూడా తగలకుండా మింగేస్తారు. ప్రజల పన్నులను దుబారా చేస్తూ రైతుబంధు ఇస్తున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు వృధా, మూడు గంటలు ఇస్తే చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్తున్నారు. ధరణి పోర్టల్ వద్దంటున్నారు. ధరణిని రద్దుచేస్తే మళ్లీ పైరవీకారుల దందాలు షురూ అవుతాయి. ధరణి పోర్టల్ తీసివేస్తే రైతుబంధు, వడ్ల డబ్బులు ఎట్లా ప్రజల ఖాతాల్లోకి రావాలి? పదేళ్లలో నంబర్ వన్గా నిలిచాం గత పదేళ్లలో దేశంలో తెలంగాణ అన్ని విషయాల్లో నంబర్ వన్గా నిలిచింది. తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్గా ఉంది. త్వరలోనే మిగులు విద్యుత్ సాధించబోతున్నాం. బీఆర్ఎస్ గెలిస్తే రైతుబీమా తరహాలో రాష్ట్రంలో రేషన్కార్డున్న 93 లక్షల కుటుంబాలకు రూ.5లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తాం. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు అధికారంలోకి వచ్చినా రైతుబంధుకు రాంరాం పలుకుతారు. దళితబంధుకు జైభీం చెప్తారు. కరెంట్ కట్ చేస్తారు. ఇచ్చే కొంచెం కూడా పగలు, రాత్రి సరఫరా చేస్తారు. కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారు. ఏది మంచో, ఏది చెడో రైతులు తేల్చుకోవాలి. మోటార్లకు మీటర్లు పెట్టేదేలేదని చెప్పిన ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చిపట్టింది. విమాన రంగం, రైల్వేలు, విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటు బాట పట్టించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తే.. చావడానికైనా సిద్ధమేగానీ మీటర్లు పెట్టనని చెప్పిన. మనకు రావాల్సిన రూ.25వేల కోట్ల నిధులకు కేంద్రం కోత పెట్టినా మీటర్లు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్ సీఎం బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. వాళ్ల మాటలు వింటే నెత్తి పగలగొట్టుకోవాలి అనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలకు హామీలు బీఆర్ఎస్ను గెలిపిస్తే జేఎన్టీయూతో మాట్లాడి నిర్మల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ను 70వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అంతా దళితబంధు అమలు చేస్తామన్నారు. నిర్మల్ సభలో ఎంపీ దామోదర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, ధర్మపురి సభలో కొప్పుల ఈశ్వర్, బాల్కొండ సభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Politics & Election Updates: 2nd Nov 2023, 07:20PM రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేటీఆర్ ►తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ ►వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారు ►మహా ఇంజనీర్లు వీళ్ళు.. బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు ►ఎక్స్పానషన్ లెవల్ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన ►జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీలోని ఈ చిల్లర గాళ్ళు ►రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ 2nd Nov 2023, 07:00PM ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్.. ►అనేక మంది యువకుల బలిదానం ఫలితం తెలంగాణ రాష్ట్రం ►తెలంగాణా ఆత్మ గౌరవం కాపాడాలని రాష్ట్రం కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.. ►గారడీ మాటలతో అనేక మాటలు చెప్పి రెండు సార్లు కేసీఆర్ పరిపాలించారు. ►పది సంవత్సరాలో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేశాడు. ► టీఎస్పీఎస్సీ ద్వారా రెండు సార్లు పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని యువకులను బలి తీసుకుంది కల్వకుంట్ల కుటుంబం. ►కాళేశ్వరంలో రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు 150 మీటర్లు కుంగి పోయింది. ►కాళేశ్వరం ప్రాజెక్టు ను ఏటీఎం వాడుకుందన్న బీజేపీ ఒక్కసారి కూడా ప్రశ్నిచలేదు..ఇక్కడే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ తెలుస్తుంది. ►హస్తం గుర్తు పై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను గెలిపించండి.. 2nd Nov 2023, 5:40PM తెలుగుదేశం మీకో దండం.. ►చంద్రబాబు, లోకేష్ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ►రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ►గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ►తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2nd Nov 2023, 4:30PM జనసేన, బీజేపీ పొత్తు అంశంపై రచ్చ ►నిరసనలతో అట్టుడికిన బీజేపీ రాష్ట్ర కార్యాలయం ►నాగర్ కర్నూల్ టికెట్ .జనసేనకు కేటాయిస్తారని ప్రచారం ►నిరసనకు దిగిన నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి దిలీపాచారి, ఆయన అనుచరులు ►జనసేన వద్దు.. బీజేపీ ముద్దు అంటూ నినాదాలు ► జనసేన అసలు తెలంగాణలోనే లేదని అలాంటప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం 2nd Nov 2023, 4:00PM ►కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న సీపీఎం ►తెలంగాణలో 17 స్ధానాల్లో పోటీ చేయనున్న సీపీఎం ►తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి సీపీఎం ►పోటీ చేయనున్న స్ధానాల పేర్లు ప్రకటించిన సీపీఎం ►భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర సత్తుపల్లి, ఖమ్మం, వైరా, మిర్యాలగూడ, నల్గొండలో సీపీఎం పోటీ 2nd Nov 2023, 2:53PM ►బీజేపీ మూడో జాబితాలో దత్తాత్రేయ కుమార్తెకు మొండిచేయి ►ముషీరాబాద్ టికెట్ను పూస రాజుకు కేటాయించిన బీజేపీ 2nd Nov 2023, 2:30PM 35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల 1. నిజామాబాద్ రూరల్ దినేష్ 2. రాజేంద్రనగర్-శ్రీనివాస్ రెడ్డి, 3. ఆందోల్- బాబూమోహన్ 4. జహీరాబాద్- రామచంద్ర రాజనర్సింహా 5. చేవేళ్ల-కేఎస్ రత్నం 6. బోథన్- మోహన్రెడ్డి 7.బాన్సువాడ- యెండల లక్ష్మీనారాయణ 8. పరిగి- మారుతి కిరణ్ 9.ముషీరాబాద్-పూస రాజు 10. జడ్చర్ల- చిత్తరంజన్ దాస్ 11.మక్తల్ - జలంధర్ రెడ్డి 12. రాజేంద్ర నగర్- తోకల శ్రీనివాసరెడ్డి 13.సనత్ నగర్- మర్రి శశిధర్ రెడ్డి 14.మంథని- చందుపట్ల సునీల్ రెడ్డి 15. ఉప్పల్- ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్, 16. లాల్బహదూర్ నగర్- సామరంగారెడ్డి 17.దేవరకొండ- లాలూ నాయక్ 18. చల్లా శ్రీలతా రెడ్డి 19. నారాయణ్పేట-రతన్ పాండురంగారెడ్డి 20. మలక్పేట- శ్యామ్రెడ్డి సురేందర్ రెడ్డి 21. అంబర్పేట్-కృష్ణ యాదవ్ 22. షాద్నగర్- అందె బాబయ్య, 23. వనపర్తి- అశ్వద్ధామరెడ్డి, 24. అచ్చంపేట్- దేవని సతీష్ మాదిగ 25.సత్తుపల్లి(ఎస్సీ)-రామలింగేశ్వరరావు 26.సికింద్రాబాద్- మేకల సారంగపాణి 27. నారాయణపేట్- కేఆర్. పాండురెడ్డి 28. మెదక్- పంజా విజయ్ కుమార్ 29.నారాయణఖేడ్ -సంగప్ప 30. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్ 31. అసిఫాబాద్(ఎస్టీ) అజ్మీరా ఆత్మరాం నాయక్ 32. జూబ్లీహిల్స్: లంకల దీపక్ రెడ్డి 33. ఆలేరు- పడాల శ్రీనివాస్ 34.నల్గొండ- మడగాని శ్రీనివాస్ గౌడ్ 35 పరకాల్- కాలి ప్రసాద్రావు 2nd Nov 2023, 2.10 pm తెలంగాణకు భారీగా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ► తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ► ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న ఎమ్మెల్యేలు ► మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు ► అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు 2nd Nov 2023, 1.55 pm ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మందా:కేటీఆర్ ► హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం లేదు ► కిషన్ రెడ్డి ఫోటో పోజులకు తప్ప చేసిన పని ఏమి లేదు ► వర్షాలు వరదల వచ్చిన కనీసం జనాల ఇబ్బందులు కిషన్ రెడ్డి కి పట్టవు ► ఉప్పల్ ఫ్లై ఓవర్ కట్టడానికి కూడా బీజేపీకి కనీసం చేతకావటం లేదు ► బిజెపి, కాంగ్రెస్ పహిల్వాన్ లు తెలంగాణ లో దిగుతున్నారు ► బక్క పల్చని కేసిఆర్ ను కొట్టడానికి ఇంత మంది వస్తున్నారు ►డిక్కీ బలిసిన కోడి తొడ కొట్టినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది 2nd Nov 2023, 1.40 pm తెలంగాణ బీజేపీకి పక్కరాష్ట్రాల ఎమ్మెల్యేలు ►నేటినుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ►ఇవాళ హైదరాబాద్ చేరుకొనున్న ఎమ్మెల్యేలు ►మహారాష్ట్ర, కర్నాటక, గోవా నుంచి 150 ఎమ్మెల్యేలు ►అన్నిజిల్లాలకు ఇంచార్జులుగా ఎమ్మెల్యేలు 2nd Nov 2023, 1.20 pm మాటలు vs ముఠాల మధ్య పోరు: హరీష్ రావు ►మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు ►ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి, మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ ►మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం. ►కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా? ►9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. సీఎం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నడు. ►అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారింది. ►మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం గారు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నరు. ►28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి. నేను దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా. ►కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలి. ►కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంది. 2nd Nov 2023, 1.20 pm కౌశిక్ ప్రచారం అంటే డాన్సే డాన్స్ ►కరీంనగర్ జిల్లా :వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ►కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులు ఇంటింటికి వచ్చి ఇచ్చా. ►కనపర్తిలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.కోటి రూపాయలు మంజూరు చేపించాం. ►గ్రామంలో రూ.కోటి 14లక్షలతో రోడ్లు వేసాం. ►తెలంగాణలో రూ.19వేల కోట్లు రుణమాఫీ చేసాం. ►మరో రూ.5వేల కోట్లు కూడా త్వరలో మాఫీ చేయబోతున్నాం. ►మీ దయ, దండం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి. ►బిసి బంధు చెక్కులు కూడా వచ్చాయి. ►అందువల్లే బిసి బంధు చెక్కులు MRO హాండవర్ చేసుకున్నారు ఈ రోజు హుజురాబాద్ మండలం ధర్మరాజపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో భాగంగా కెసిఆర్ గారు మొట్ట మొదట రైతు బంధు ఈ గ్రామానికి ఇచ్చారు వారి ఋణం తీసుకునే అవకాశం మనకు వచ్చింది రైతు బంధు ఇచ్చిన కెసిఆర్ గారికి మా ఓటు కార్ గుర్తుకు @BRSparty @KTRBRS pic.twitter.com/i7sUwLSm0b — Padi Kaushik Reddy (@KaushikReddyBRS) November 1, 2023 2nd Nov 2023, 1.15 pm స్మార్ట్ లేదంటే రిజైన్ : అరవింద్ రూటులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి ► పెద్దపెల్లి జిల్లా:గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఆభ్యర్థి కందుల సంధ్యారాణి ►BRS, కాంగ్రెస్ అభ్యర్థులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెడుతున్నారు ►చర్రితలో 33 శాతం మహిళలకు రిజ్వరేషన్ ఇచ్చిన ఘనత బీజేపీదే. ►నన్ను గెలిపిస్తే రామగుండంను స్మార్ట్ సిటీ చేస్తా ►నాకు అధికారం ఇవ్వండి.. స్మార్ట్ సిటీ విషయంలోఇచ్చిన మాట తప్పితే 6 నెలల్లో రాజీనామా చేస్తా ►బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నా 2nd Nov 2023, 12.50 pm ఎన్నికల వేళ మళ్లీ తెర మీదికి రూ.2వేల నోటు ► రిజర్వ్ బ్యాంకు వద్ద పెరిగిన రద్దీ ► ఆర్బీఐ శాఖల వద్దకు క్యూ కడుతున్న ప్రజలు ► రూ.2000 నోట్లు మార్చుకునేందుకు వస్తోన్న ప్రజలు ► అక్టోబర్ 7 నాటికి బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి ముగిసిన గడువు ► ఇప్పుడు కేవలం రిజర్వ్బ్యాంకు శాఖల వద్దే మార్చుకునేందుకు వీలు 2nd Nov 2023, 12.50 pm కోమటిరెడ్డి బంధువు ఇంట్లో తనిఖీలు ► భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ► హైద్రాబాద్ కోకాపెట్ హిడెన్ గార్డెన్ లోని గిరిధర్ రెడ్డి నివాసంలో అధికారుల సోదాలు ► ఉదయం నుండి హైద్రాబాద్ నగరంలో పలువురిర ఇళ్లలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు 2nd Nov 2023, 12.45 pm నాగార్జునసాగర్లో బీజేపీకి షాక్ ► నల్లగొండ జిల్లా : నాగార్జునా సాగర్ లో బీజేపీకి షాక్ ► పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవికి రాజీనామా చేసిన రిక్కల ఇంద్రసేనారెడ్డి ► నాగార్జున సాగర్ టికెట్ ఆశించి రాకపోవడంతో నిరసగా పార్టీకి రాజీనామా ► సాగర్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించడంతో ఆగ్రహంతో ఉన్న రిక్కల ► నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రిక్కల ► గతంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి కుడిభుజంగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి 2nd Nov 2023, 12.25 pm బీజేపీ మూడో జాబితాలో ఉండేది వీరేనా? 01 ఆసిఫాబాద్ తుకారాం 02 చెన్నూరు అందుగుల శ్రీనివాస్ 03 మంచిర్యాల రఘునాథబాబు 04 బాన్సువాడ మాల్యాద్రి రెడ్డి 05 బోధన్ మేడపాటి ప్రకాశ్ రెడ్డి/వడ్డి మోహన్ రెడ్డి 06 నిజామాబాద్ రూరల్ దినేష్ 07 ఎల్లారెడ్డి పైళ్ల కృష్ణారెడ్డి 08 మంథని చందుపట్ల సునీల్ రెడ్డి 09 పెద్దపల్లి గొట్టిముక్కల సురేష్ రెడ్డి/ నల్ల మనోహర్ రెడ్డి/ దుగ్యాల ప్రదీప్ రావు/ గుజ్జుల రామకృష్ణారెడ్డి 10 వేములవాడ తుల ఉమ/వికాస్ రావు 11 జహీరాబాద్ ఢిల్లీ వసంత్/దామోదర రామచంద్ర 12 సంగారెడ్డి దేశ్ పాండే/ పులిమామిడి రాజు 13 నారాయణ ఖేడ్ విజయపాల్ రెడ్డి/సంగప్ప 14 ఆందోల్ 15 మెదక్ 16 హుస్నాబాద్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి/ జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి 17 సిద్దిపేట దూది శ్రీకాంత్ రెడ్డి 18 షాద్ నగర్ విష్ణు వర్ధన్ రెడ్డి/ అందె బాబయ్య 19 ఎల్బీనగర్ సామ రంగారెడ్డి/ మధుసూదన్ 20 రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్ రెడ్డి 21 శేరిలింగంపల్లి రవి యాదవ్ 22 చేవెళ్ల కేఎస్ రత్నం 23 వికారాబాద్ 24 తాండూరు రమేష్ 25 కొడంగల్ చికోటి ప్రవీణ్ / కొస్గి రమేష్ 26 మేడ్చల్ విక్రమ్ రెడ్డి 27 మల్కాజ్ గిరి ఆకుల రాజేందర్/ భాను ప్రకాశ్ 28 కూకట్ పల్లి జనసేన?? 29 ఉప్పల్ వీరేందర్ గౌడ్/ NVS ప్రభాకర్ 30 ముషీరాబాద్ బండారు విజయలక్ష్మి 31 మలక్ పేట కొత్తకాపు రవీందర్ రెడ్డి 32 అంబర్ పేట గౌతమ్ రావు 33 జూబ్లీహిల్స్ జూటూరి కీర్తిరెడ్డి 34 సనత్ నగర్ మర్రిశశిధర్ రెడ్డి 35 నాంపల్లి విక్రమ్ గౌడ్ 36 సికింద్రాబాద్ బండ కార్తీక రెడ్డి 37 కంటోన్మెంట్ సుష్మిత 38 జడ్చర్ల చిత్తరంజన్ దాస్ 39 దేవరకద్ర పవన్ కుమార్ రెడ్డి 40 నాగర్ కర్నూల్ జనసేన ? 41 అచ్చంపేట సతీశ్ మాదిగ 42 వనపర్తి అశ్వద్ధామ రెడ్డి 43 గద్వాల వీరబాబు 44 అలంపూర్ 45 నకిరేకల్ పాల్వాయి రజిని 46 నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ 47 మునుగోడు బూర నర్సయ్య గౌడ్ 48 దేవరకొండ లాలు నాయక్ 49 మిర్యాల గూడ సాదినేని శ్రీనివాస్ 50 హుజూర్ నగర్ చల్ల శ్రీలత రెడ్డి 51 కోదాడ జనసేన 52 తుంగతుర్తి కడియం రామచంద్రయ్య 53 ఆలేరు కాసం వెంకటేశ్వర్లు 54 నర్సంపేట పుల్లారావు చౌదరి 55 పరకాల కాళీ ప్రసాద్ 56 పినపాక 57 కొత్తగూడెం జనసేన 58 అశ్వరావు పేట జనసేన 59 ఖమ్మం జనసేన 60 పాలేరు కొండపల్లి శ్రీధర్ రెడ్డి 61 మధిర అజయ్ రాజ్ 62 వైరా జనసేన 63 సత్తుపల్లి శ్యామ్ నాయక్ 64 ములుగు అజ్మీరా ప్రహ్లాద్/కృష్ణ 65 మక్తల్ జలంధర్ రెడ్డి 66 నారాయణపేట రతన్ పాండురంగారెడ్డి 2nd Nov 2023, 12.15 pm తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సంబంధం లేదు ► ఢిల్లీ: డాక్టర్ లక్ష్మణ్, బిజెపి ఎంపీ ► ఈ నెల 7న హైదరాబాద్ లో బిసి ఆత్మ గౌరవ సభ ఏర్పాటు ► తెలుగుదేశం మా భాగస్వామి కాదు ► తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టిడిపి చెప్పాలి ► టిడిపి ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదు ► ఎవరో చెప్పినంత మాత్రాన ప్రజలు వినే పరిస్థితి లేదు ► తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది ► కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదు ► ప్రజలు... ప్రజల ఓట్లు మాతో ఉన్నాయి ► నేతలు బయటకి వెళ్లినంత మాత్రాన వారి ఓట్లన్నీ వెళ్లిపోవు 2nd Nov 2023, 12.12 pm ఎన్నికల వేళ నగరాన్ని అస్తవ్యస్తం చేస్తారా? ► చంద్రబాబు పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ► నిన్న హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ► చంద్రబాబు పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ► అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో బాబు పై కేసు నమోదు ► ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన చంద్రబాబు, తెలుగుదేశం ► నగరం రోడ్లపై నానా న్యూసెన్స్ ► క్రైం నెంబర్ 531/2023 IPC 341,290,341 and 21r/w76CP act ► హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరల్ సెక్రెటరీ GVG నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు ► సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పేర్కొన్న పోలీసులు 2nd Nov 2023, 12.10 pm నారాయణ.. నారాయణ ► పొత్తుల పై సీపీఐ నారాయణ సెటైర్లు ► ఢిల్లీ : పొత్తుల పై కాంగ్రెస్ తీరు పై నారాయణ విమర్శలు ► నిశ్చితార్థమయ్యాక ఇంకా అందమైన వాళ్లు దొరికితే లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయి ► పొత్తులు, సీట్ల సర్దుబాటు పై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడం పై సీపీఐ నారాయణ అసహనం నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc — Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023 2nd Nov 2023, 12.10 pm చేయిస్తారా? చేయి కలుపుతారా? ► కాంగ్రెస్ కు సీపీఎం డెడ్లైన్ ► వైరా, మిర్యాలగూడ కేటాయించాలంటున్న సీపీఐ ► నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్ లైన్ #Telangana Assembly polls: CPI(M) insists on Wyra and Miryalaguda seats Read: https://t.co/rNgueqJCsK pic.twitter.com/zGTivKs7qC — IANS (@ians_india) October 29, 2023 2nd Nov 2023, 12.00 pm జనసేనతో పొత్తు వద్దంండి ప్లీజ్ ► ఢిల్లీకి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ► తాండూరు, శేరిలింగంపల్లి సీట్లను జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోన్న కొండా ► బీజేపీ హైకమాండ్ కు తన అభిప్రాయాన్ని చెప్పనున్న విశ్వేశ్వర్ రెడ్డి Konda Vishveshwar Reddy & Dharmapuri Arvind strongly lobbying for Ravi Kumar Yadav for Serilingampally seat. BJP is feeling that they gonna loose this seat in alliance? Janasena @PawanKalyan lobbied hard for this seat with Amit Shah ? #TelanganaElections2023 pic.twitter.com/jFwYLLm4cx — Telangana (@TelanganaRT) October 29, 2023 2nd Nov 2023, 12.00 pm కమలం మూడో జాబితా రెడీ ► తెలంగాణలో మూడో జాబితాను సిద్ధం చేసిన బీజేపీ ► ఢిల్లీ : నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ► 40-45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ► జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మరికొన్ని పెండింగ్ ► ఇప్పటి వరకు 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 2nd Nov 2023, 11.30am ఎన్నికల వేళ గెలుపు కోసం రాజశ్యామల యాగం ► సిద్దిపేట : ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండో రోజు కొనసాగుతున్న రాజశ్యామల యాగం ► ఈరోజు యాగంలో రాజశ్యామల యంత్ర పూజ ► పూజలో సీఎం కేసీఆర్ దంపతులు ► యాగ క్రతువును పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 2nd Nov 2023, 11.30am ఇందూరులో సీఎం కెసిఆర్ ► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ ► మధ్యాహ్నం 2 గంటలకు బాల్కొండ నియోజక వర్గంలో సభ ►సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ 2nd Nov 2023, 11.20am బీసీలకు వ్యతిరేకం కాంగ్రెస్ : డాక్టర్ లక్ష్మణ్ ► ఢిల్లీ: బిసి సీఎం చేస్తామన్న బిజెపి ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారు ► బిసి వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు ► పెత్తందార్ల మనస్తత్వం తో బి అర్ ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు ► బిఆర్ఎస్, కాంగ్రెస్ ను తెలంగాణ బిసిలు ఓటుతో తిప్పికొట్టాలి ► బిసి సీఎం అయ్యేందుకు బిసిలు ఏకం కావాలి, తమ సత్తా చాటాలి ► పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3 కు పరిమితం ► తరతరాలుగా బిసిలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ People of Telangana will never forget how the Congress delayed the demand for Telangana, and how because of Congress, over 1200 people had to sacrifice their lives. They will never forget how BRS betrayed their dreams, while KCR looted the state. Congress Killed, KCR Looted. — BJP Telangana (@BJP4Telangana) November 2, 2023 2nd Nov 2023, 11.00am మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాహుల్గాంధీ ► భూపాలపల్లి జిల్లా :మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలించిన రాహుల్ గాంధీ ► ఏరియల్ సర్వే ద్వారా ద్వారా బ్యారేజ్ ని పరిశీలించిన రాహుల్ గాంధీ ► బ్యారెజ్ పరిశీలనకు ముందు అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ. ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట కరెప్షన్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం : రాహుల్ గాంధీ ► లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. ► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలాంటి కుంగుబాటు వచ్చి ఉండేది కాదు. ► ప్రాజెక్టు కు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి ► ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు బీమా తదితర ప్రాజెక్టు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. ► కాళేశ్వరం నిర్మాణం చేసి పట్టుమని పది రోజులు కాకముందే కుంగివడం బాధాకరం. ► చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే తట్టుకొని నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ► కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని చెప్తున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు ఎందుకని చర్యలు తీసుకోకపోవడం లేదు. ► చిన్నపాటి ఇంటి నిర్మాణం కోసం ఇంజనీర్ తో డిజైన్ చేసుకుంటాం. ► లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారు. ► ఇంజనీర్ల పనిని ఇంజనీర్లను చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ► సీఎం కేసీఆర్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు కు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది. Kaleshwaram Project = KCR Family ATM I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana. Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are… pic.twitter.com/BWe8Td9mCq — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2023 సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ► బ్యారేజ్ డ్యామేజ్ కి ప్రభుత్వం భాద్యత వహించాలి ► నాణ్యత లోపంతోనే బ్యారేజ్ కి సంబంధించిన పది పిల్లర్లు కుంగాయి. ► డ్యామేజ్ ని స్వయంగా పరిశీలించాం. ► బ్యారేజ్ తో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. ► కేసిఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారింది. ► ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై బిజెపి బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ► రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు. ► కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ► కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం 2nd Nov 2023, 10.55am కాంగ్రెస్ పొత్తు యూటర్న్పై నారాయణ ట్వీట్ ► పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ► ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 2nd Nov 2023, 10.35am ఇండిపెండెంట్గా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి! ► హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ పొన్నంకు ఖరారు కావడంతో టికెట్ ఆశించి భంగపడిన ప్రవీణ్రెడ్డి ► ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం 2nd Nov 2023, 10.20am బెదిరింపు రాజకీయాలు ► కాంగ్రెస్ పార్టీలో చేరుతావని అని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపీనాథ్ గుండల్ని పంపించి నాపై దాడి చేశారు: రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య 2nd Nov 2023, 10.05am ఐటీ అధికారుల సోదాలు ► మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు ► తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం ► ప్రస్తుతం పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ► మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసం లో కొనసాగుతున్న ఐటీ సోదలు ► తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు 2nd Nov 2023, 9.45am కేసీఆర్ పర్యటన ► నేడు నిజామాబాద్ వేల్పూర్ స్పైస్ పార్క్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వధ సభ ► మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సభకు మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజక వర్గం తో పాటు చుట్టుపక్కల నియోజక వర్గాల నుంచి జన సమీకరణ ► ధర్మపురి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాదం సభలో ప్రసంగించనున్న కేసీఆర్ 2nd Nov 2023, 9.30am చాయ్ చేసి.. ఓట్లు అడిగి.. ► ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజలు చేసే పనుల్లో భాగస్వాములవుతున్నారు నాయకులు ► అల్లాదుర్గంలో బుధవారం అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం 2nd Nov 2023, 9am జయభేరి విన్నాకే.. కాళ్లకు జోళ్లు ► ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ భారాస అభ్యర్థి అనిల్ జాదవ్ ఎన్నికల ప్రచారం ► ఎన్నికల ప్రచారంలో చెప్పులు లేకుండా ఎన్నికల ప్రచారం.. ► ఎన్నికల్లో గెలిచాకే చెప్పులు ధరిస్తా -
అధికారంలోకి రాగానే ఓబీసీ గణన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ / సాక్షి, నాగర్కర్నూల్/కల్వకుర్తి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశాన్ని నడిపించేది లోక్సభ, రాజ్యసభలోని ఎంపీలు కాదని, కేవలం 90 మంది అధికారుల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓబీసీ అధికారులకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓబీసీలకు శక్తి ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టపడవంటూ మండిపడ్డారు. దేశాన్ని నడిపించే అవకాశం ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీలకు రాకూడదా? అని ప్రశ్నించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభతో పాటు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్లు ఉలిక్కిపడేలా చేశా.. ‘దేశంలో, రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాలను పెంచాయి. వీటికి ఎక్కడా స్థానం లేదు. అందుకే నేను ప్రేమ, ఆప్యాయతలు పెంచేలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశా. ఒక బజార్లో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఓ వైపు దొరలు, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారు. వారికి బీజేపీ నేతలే డబ్బులు పంపుతారు. కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ము కూడా ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులకు చేరుతోంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. సీఎం కేసీఆర్పై మాత్రం ఏ దాడులూ ఉండవు. ఇదెందుకో గ్రహించాలి. ప్రధాని మోదీ నన్ను రోజూ తిడుతూనే ఉంటారు. ఆయనతో యుద్ధం చేస్తున్నా. 24 గంటలు తిట్టేలా కదిలించా. నాపై 24 కేసులు పెట్టారు.. నా లోక్సభ సభ్వత్వాన్ని రద్దు చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా లాక్కున్నారు. అయినా నేను భయపడలేదు. యావత్ హిందుస్తాన్, తెలంగాణే నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ కూడా ప్రతి క్షణం ఉలిక్కి పడేలా చేశా. నా పేరు వినపడితే చాలు.. నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు..’ అని రాహుల్ అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదు ‘రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు. లక్ష కోట్ల సొమ్మును సీఎం కేసీఆర్ పేదల జేబు నుంచి లాక్కొని కనీసం ఒక్కదానిని కూడా సరిగ్గా కట్టలేదు. కుంగిపోయిన కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఒక రాజులా పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ డబ్బులు వచ్చే మద్యం, ఇసుక, భూమి వంటి వాటిని కేసీఆర్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు లాభం జరగలేదు. అందుకే ప్రజలంతా కేసీఆర్కు బైబై అంటున్నారు. కేసీఆర్ దోచిన సొమ్ము కక్కించి ప్రతి పైసా పేదల ఖాతాల్లో వేస్తాం. నేను ప్రధాని మోదీలా కాదు. ఆయనలా మాట తప్పను. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాం..’ అని చెప్పారు. ప్రతి ఎకరా తిరిగి పేదలకు పంచుతాం.. ‘భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకొచ్చిన ధరణి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష ఎకరాలు మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాను తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఆ భూములను మళ్లీ పేదలకు పంచి పెడతాం. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం..’ అని హామీ ఇచ్చారు. కేవలం 2% ఓట్లతో ఓబీసీని సీఎం ఎలా చేస్తారు? ‘తెలంగాణలో బీజేపీ లీడర్లు భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల గ్యాస్ తీసేసింది. కారు నాలుగు టైర్లను పంక్చర్ చేసింది. రాష్ట్రంలో ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెబుతోంది. కేవలం 2 శాతం ఓట్లతో సీఎంని ఎలా చేస్తారు. మోదీ అమెరికా వెళ్లి ఓబీసీని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినట్టుగా ఉంది. అమెరికాలో ఓబీసీ ప్రెసిడెంట్ను, ఇక్కడ మీరు.. సీఎంను ఏర్పాటు చేయలేరు..’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేకపోయారని ఆరోపించారు. మొన్న మేడిగడ్డ కుంగితే, నిన్న సుందిళ్ల పగుళ్లు బారిందని అన్నారు. పని మంతుడు పందిరేస్తే, కుక్క తోక తగిలి కూలిపోయినట్టుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించింది కాంగ్రెస్సేనని చెప్పారు. జన గణనతోనే బీసీల అభివృద్ధి: భట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చాలని, భూసంస్కరణలు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మల్లురవి, పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుధ్రెడ్డి, జి. మధుసూదన్రెడ్డి, వీర్లశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కల్వకుర్తి మండలం జిల్లెలకి చెందిన రైతు చంద్రయ్య కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు. నేడు అంబట్పల్లిలో 5వేల మంది మహిళలతో సభ రాహుల్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి రానున్నారు. ఇక్కడ 5 వేల మంది మహిళలతో మహిళా సాధికారతపై సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ)లో పియర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా రాహుల్ సందర్శించనున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడ ఉంటారని సమాచారం. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కాంగ్రెస్ చేసిన విజŠక్షప్తి మేరకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. రాహుల్తో నేతల భేటీ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలు పలువురు రాహుల్తో సమావేశమయ్యారు. రేవంత్, భట్టితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ తదితరులు వీరిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్కు చెందిన సుమారు రెండొందల మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. -
మీరే గెలిపించాలి..
మేం స్వార్థంగా ఆలోచించలేదు.. దళిత బంధు మొదలుపెట్టాక హుజూరాబాద్ నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం. ఆ తర్వాత ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని చింతకాని మండలంలో వంద శాతం కుటుంబాలకు ఇచ్చాం. ఈ పథకం కావాలని మాకు మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు ఇవ్వలేదు. స్వార్థంగా మేం ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత ఉన్న నియోజకవర్గంలోనూ అమలుచేశాం. మా నిజాయితీకి ఇది గీటురాయి. ఇవాళ పెడబొబ్బలు పెడుతున్న మూడు రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు దళితులకు ఏం చేశాయి? అరచేతికి బెల్లం పెడతా.. చక్కెర గోలీలిస్తా.. చాక్లెట్లు ఇస్తా.. అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపించి, మురిపించి దశాబ్దాల తరబడి ఓటుబ్యాంక్గా వాడుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ వెళ్తున్నామని, అందులో భాగంగా వచ్చిందే దళితబంధు అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. దళితుల ఓట్ల కోసమే ఈ పథకం తెచ్చామని కొందరు విమర్శిస్తుండటం సరికాదని.. అలాంటి చిల్లర రాజకీయాలు తాము చేయబోమని స్పష్టం చేశారు. అలా చేసే వాళ్లమే అయితే మొదటి టర్మ్ చివరిలో పెట్టేవాళ్లమని.. కానీ పక్కా ప్రణాళికతో, పద్ధతిగా అమలు చేసేందుకు రెండోసారి గెలిచాక ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అండగా నిలిచిన బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో, భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం మొట్లగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు. రెండు, మూడు నెలలు మేధోమథనం చేసి.. ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, నీరు, రైతు బంధు, ధరణి వంటివి తెచ్చాం. రాష్ట్ర విభజనతో మనం ఎట్లా బతుకుతామని కొందరు మాట్లాడారు. పరిపాలన వస్తదా అన్నారు. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అయితే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. మరి ఈ రోజున మనం అందరికన్నా ముందున్నాం. హెలికాప్టర్లో వస్తూ కిందికి చూస్తే లక్ష్మి అమ్మవారు నేలపై నాట్యం చేసినట్టు కనిపించింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అని అల్లాడిన నేలపై ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. విచక్షణతో ప్రజలు ఓటేయాలి.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎల్లయ్య, పుల్లయ్య బరిలో ఉంటారు. వ్యక్తులతోపాటు వారి చరిత్ర ఏమిటి? వారి కార్యదక్షత ఏమిటి? అనుభవం ఏమిటనేది ప్రజలు చూడాలి. వారిని గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గానికి ఏం జరుగుతుందనేది చూడాలి. అలాంటి వ్యక్తుల వెనుక ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ చరిత్ర, వైఖరి, దృక్పథం ఏమిటనేది ప్రజలు గమనించాలి. ఎవరో చెప్పారని, మా కులం వాడు నిల్చున్నాడని ఓటు వేయడం సరికాదు. ఒక కులాన్ని ద్వేషించడం కూడా సరికాదు. కూరగాయలు కొనేప్పుడే కాదు.. కుండనో, కూజానో కొనేప్పుడు కూడా చేతితో తడిమి చూసి మంచిదా, కాదా అని పరిశీలిస్తాం. అలాంటిది మీ జీవితాలను మార్చే ఓటు హక్కును వినియోగించుకునే అంశంలో మరింతగా ఆలోచన చేయాలి. దళితబంధును పుట్టించిందే కేసీఆర్.. దేశంలో దళితబంధు పథకాన్ని పుట్టించిన మొగోడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు ఇలాంటి పథకం ఉందా? ఈ పథకం పెట్టాలని నన్ను ఎవరూ అడగలేదు. అది పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. దేశానికి 70ఏళ్ల కింద స్వాతంత్య్రం వస్తే.. ఇప్పటికీ దళితుల పరిస్థితి బాగోలేదు. వివక్షకు, అణచివేతకు గురవుతున్నారు. భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. జాషువా వంటి మహాకవి కూడా బాధపడి, గాయపడి దళితుల గురించి కావ్యాలు రాశారు. ఉత్తర భారతంలో రోజూ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్తాన్, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఈ దాడులు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటివెన్నో ఆలోచన చేసి నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్యజ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నా.. దాని నుంచి పుట్టిందే దళితబంధు. బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించాలి సత్తుపల్లి నియోజకవర్గాన్ని దళితబంధు కింద తీసుకున్న కొద్దిరోజుల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. కొందరు దుర్మార్గులు దళితబంధు లాంటి పథకాలను ఆపాలని ఫిర్యాదులు ఇచ్చారు. మిషన్ భగీరథ, రైతు బంధు, దళితబంధు పథకాలు ఎన్నికల కోసం పెట్టామా? మొత్తం తెలంగాణ దళిత సమాజానికి అప్పీల్ చేస్తున్నా. మీ కోసం మంచి చేసిన, మిమ్మల్ని జాగృత పరిచే, మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునే కేసీఆర్ లాంటి నాయకుడ్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని కోరుతున్నాను. పైరవీకారుల రాజ్యం వస్తుంది రాహుల్ గాందీకి ఎద్దు లేదు, ఎవుసం ఎరుకలేదు. ఎవరో సన్నాసి రాసిస్తే అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నాడు. మళ్లీ వీఆర్వోలు, పహణీ నకళ్లు, ఎమ్మార్వో కార్యాలయం, మళ్లీ వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరగాలా? కాంగ్రెస్కు ఓటేస్తే దళారుల రాజ్యం, పైరవీకారుల రాజ్యం వస్తుంది. మీ భూమి మీద పెత్తనం ప్రభుత్వానికి వస్తుంది. అదే బీఆర్ఎస్కు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి బాసులు. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నా ఢిల్లీ వైపు చూడాలి. వాళ్ల స్విచ్ అక్కడే ఉంటుంది. ఇంతకు ముందు అరవై ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను వారి ఖర్మానికి వదిలేసింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సభల్లో మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి అహంకారం! ప్రధాని నరేంద్ర మోదీకి అహంకారం ఉంది. ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు మొత్తం ప్రైవేటైజేషన్ అంటున్నరు. అదే పిచ్చిలో కరెంట్ రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నరు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నడు. నేను చచ్చినా పెట్టనని చెప్పిన. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే కరెంట్ ఉంది. ఏడాదికి రూ.25 వేల కోట్లు భారం పడినా నష్టం భరించామే కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు. నాకు కూడా అంత అహంకారం లేదు ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు.‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు దుర్మార్గులు ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ నుంచి నిలబడిన వారిని అసెంబ్లీ గేటు తొక్కనివ్వమని అంటున్నారు. తెలంగాణ తెచ్చి, సీఎంగా ఇన్ని పనులు చేసిన నేను కూడా అంత అహంకారంగా రానివ్వ, లేవనివ్వ, వాడిని కూర్చోనివ్వ అని మాట్లాడలేదు. నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తదా? ఈ డబ్బు రాజకీయాలు, అహంకార రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు?’’ అని మండిపడ్డారు. -
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Updates: 06:48 PM, నవంబర్ 1, 2023 తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు ►తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ►తెలంగాణలో కాంగ్రెస్పై ప్రజలకు విశ్వాసం లేదు ►బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి ►ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ►చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని ►తెలంగాణలో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ 04:50 PM, నవంబర్ 1, 2023 మాజీ ఎంపీ వివేక్ దారిలో మరో బీజేపీ నేత? ►శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పంచాయితీ ►శేరిలింగంపల్లి సీటును రవి యాదవ్కు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టు ►శేరిలింగంపల్లి జనసేనకు కేటాయిస్తే బీజేపీకి రాజీనామా చేస్తానంటోన్న కొండా 03:30 PM, నవంబర్ 1, 2023 ►న్యూఢిల్లీ: బీజేపీలోకి ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ►సాయంత్రం బిజెపిలో చేరనున్న సుభాష్ రెడ్డి ►గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం ►అధిష్టానానికి తన నిర్ణయం తెలిపిన డీకే అరుణ ►ఇప్పటికే పోటీ నుంచి తప్పుకున్న డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డి ►రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామంటున్న బడా నేతలు ►లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న అరుణ ►బీజేపీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ►కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక 02:50pm, నవంబర్ 1, 2023 డీ రాజా సీపీఐ జాతీయ కార్యదర్శి ►తెలంగాణ లో కాంగ్రెస్ తో పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయి. ►మేం అడిగిన సీట్లు ఇస్తారన్న మాకు నమ్మకం ఉంది. ►జాతీయ స్థాయిలో బీజేపీ ని ఓడించడమే లక్ష్యం. ►ఇండియా కూటమిలో మా పాత్ర కీలకం గా ఉంటుంది. ►బీజేపీ ని ఓడించేందుకు కలిసి వచ్చిన వారితో పొత్తులు పెట్టుకుంటాం నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి ►కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరాం. ►బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నరు. ►సిపిఎం సీట్లపై చర్చ జరుగుతుంది. ►ఇంకా సిపిఎం సీట్లపై స్పష్టత రాలేదు. ►రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుంది. ►ఇండియా కూటమి బలపడటం వల్ల భాజపాను నిలవరించవచ్చు. ►ఊహాగానాలను తాము నమ్మము. ►వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామం. ►చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారు. ►పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తాం. ►అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేము. 02:00pm, నవంబర్ 1, 2023 ప్రకాష్ జవదేకర్, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి ► కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో లక్ష కోట్ల రూపాయలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. ►మేడిగడ్డ తరహాలోనే, అన్నారం బ్యారేజ్ కు ప్రమాదం పొంచి ఉంది. ►ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమాధానం చెప్పాలి. ►వచ్చే ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ కి గుణపాఠం చెప్తారు. ►కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం. 01:00pm, నవంబర్ 1, 2023 జనతా కా మూడ్ సర్వేలో BRSకు ఎడ్జ్ ► తెలంగాణ 2023 - జనతా కా మూడ్ సర్వే ►బీఆర్ఎస్దే మళ్లీ అధికారం ►72-75 సీట్లు గెలుచుకోనున్న బీఆర్ఎస్ పార్టీ ►31-36 సీట్లకు పరిమితం కానున్న కాంగ్రెస్ పార్టీ ►బండి సంజయ్ తొలగింపు, కర్ణాటకలో ఓటమి బీజేపీపై ప్రభావం చూపిందన్న జనతా కా మూడ్ పార్టీ ఓటు షేర్ సీట్లు బిఆర్ఎస్ 41% 72-75 కాంగ్రెస్ 34%. 31-36 బిజెపి 14%. 4-6 ఎం ఐ ఎం 3% 6-7 ఇతరులు 8% 0 ►గత నెల కిందట సర్వే చేశాం. ►లక్ష 20 వేల శాంపిల్స్ సేకరించాము. ప్రతి నియోజకవర్గంలో 1100 మంది శాంపిల్స్ తీసుకున్నాం ►విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ►గత 30 ఏళ్ల లో చూడని మంచి ఫలితాలు కాంగ్రెస్ సాధిస్తుంది. ► 👆భాస్కర్ సింగ్, జనతా కా మూడ్ 12:40pm, నవంబర్ 1, 2023 ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వీరేశం ► నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం బాబాసాహెబ్ గూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు 12:34pm, నవంబర్ 1, 2023 సవాల్కు సవాల్ ►నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బిజెపి అబద్దాలను ప్రచారం చేస్తుందన్నారు బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ► మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. తనపై అవినీతి అరోపణలు చేసిన బిజెపి అభ్యర్థి రామరావు పటేల్తో బహిరంగ చర్చకు సిద్దమన్నారు ఎమ్మెల్యే 12:25pm, నవంబర్ 1, 2023 ఎన్నికల వేళ పూజలు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు ► హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గోపాల్ పూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 12:05pm, నవంబర్ 1, 2023 ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ► యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం సభ నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య. ► ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం 11:45pm, నవంబర్ 1, 2023 భర్తలకు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భార్యలు ► సూర్యాపేట: ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత ► కరీంనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన కుటుంబ సభ్యులు ► మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంజయ్ సతీమణి అపర్ణ, ఇతర కుటుంబీకులు. 11:05pm, నవంబర్ 1, 2023 కిం కర్తవ్యం.! అనుచరులతో వైఎస్ షర్మిల భేటీ ► ఎన్నికల్లో పోటీ చేసే అంశం పై అభిప్రాయాలు తీసుకోనున్న షర్మిల ► నామినేషన్లకు ఇంకా రెండ్రోజుల గడువు ఉండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న షర్మిల ► ఇప్పటికే పలుమార్లు పోటీ అంశం పై అంతర్గత సమావేశాలు నిర్మహించిన షర్మిల 10:45pm, నవంబర్ 1, 2023 కెటిఆర్ స్పీడ్మోటార్ ► కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ► భిక్కనూర్, దోమకొండ మండల కేంద్రాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్. ► కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్ 10:30pm, నవంబర్ 1, 2023 తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు? ► పొత్తులో భాగంగా జనసేనకు 10 సీట్లు ఇచ్చే అవకాశం ► శేరిలింగంపల్లి, అంబర్ పేట, కూకట్పల్లి, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు సీట్లు ఇచ్చే అవకాశం ► మరికొన్ని సీట్లు అడుగుతోన్న జనసేన 10:00pm, నవంబర్ 1, 2023 బీ అలర్ట్ ► తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ► ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమీక్షించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ► సీఎస్, డీజీపీతో సమీక్షించనున్న ఈసీ బృందం -
ప్రజలు గెలవాలి
హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ: ‘ప్రజాస్వామ్యం పరిణతి సంతరించుకోవాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే ప్రజలు గెలుస్తారు. లేదంటే నాయకులు గెలుస్తారు..’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. నాయకులు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే వారికి న్యాయం, అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వ్యక్తిత్వం, మనస్తత్వం గుర్తుంచుకోవాలి. అతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ పార్టీ చరిత్ర, ధృక్పథం, సరళిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుని ఓటు వేయాలి..’ అని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయగాళ్లు వస్తుంటారని, ఒక్క చాన్స్ అని మభ్యపెట్టి గెలిచాక మోసం చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఒరిగిందేమీ లేదు.. ‘1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని ప్రతిపాదన వస్తే ప్రజలు వ్యతిరేకించారు. అప్పుడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. అప్పుడు నోరు మూసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిన పాపాత్ములు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. వారు చేసిన చిన్న పనికి 50 ఏళ్లు ఏడ్చాం..గోసపడ్డాం. 2014లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ప్రస్తుతం మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వారిలో వారు కొట్టుకుంటున్నారు. కానీ అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వారి ధోరణి, వైఖరి, ఆలోచన ప్రజలకు తెలుసు. పేదలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే కాంగ్రెస్ వాడుకుంది. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ బాధలు తప్పించుకుని మంచినీరు తాగుతున్నాం. పల్లెలు పచ్చబడాలని, పంటలు రావాలని, రైతులకు స్వేచ్చ ఉండాలని, రైతులు బాగుపడాలని రైతుబంధు తెచ్చాం. ఈ పథకం బాగుందని దివంగత వ్యవసాయవేత్త స్వామినాథన్తో పాటు యూఎన్ఓ పొడిగింది. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దండుగ అంటున్నారు. రైతుబంధు ఉండాలా.. తీసివేయాలా?.. ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో రైతులకు అన్నీ పైరవీల బాధలు ఉండేవి. ఇప్పడు హైదరాబాద్లో రైతుబంధు డబ్బులు వేస్తే మీ సెల్ఫోన్లో మెసేజ్ వస్తుంది. రైతులను ఆదుకోవడం వల్ల దేశంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ పంజాబ్ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. అంతకుముందు 30 లక్షలు, 50 లక్షల టన్నులు మాత్రమే పండించేవారు..’ అని సీఎం తెలిపారు. కరెంటు 3 గంటలు సరిపోతదా? ‘కరెంటు వేస్టు చేస్తున్నారని ఒకాయన అంటాడు.. 3 గంటలు చాలని మరొకాయన అంటున్నాడు. 3 గంటలు సరిపోతదా.. ఆలోచించాలి. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి తమ రాష్ట్రంలో రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, వచ్చి చూసుకోవాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాంటి వారిని నమ్మితే మోసపోయి గోస పడతాం. తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాందీ, రేవంత్, భట్టి ధరణి తీసివేయాలని మాట్లాడుతున్నారు. భూరికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ను తెచ్చాం. ఒక రైతును ఏడెమినిది మంది రెవెన్యూ అధికారుల బాధలు, అవినీతి నుంచి తప్పించేందుకు ధరణి తెచ్చాం. భవిష్యత్తులో పింఛన్లు క్రమంగా రూ.6 వేల వరకు, రైతుబంధు రూ.16 వేలకు పెంచుతాం, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, బడి పిల్లలకు టిఫిన్, కంటి వెలుగు తదితర పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం..’ అని సీఎం వివరించారు. ఇప్పుడు బతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించాలి ‘రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. దళిత బిడ్డలు అనాదిగా అణచివేతకు గురవుతున్నారు. మా తండాలో మా రాజ్యం అని ఎల్హెచ్పీఎస్ (లంబాడీ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో కొట్లాడారు. అయినా వారిని ఎవరూ పట్టించుకోలేదు. యువత ఆలోచన చేయాలి. దేశం మీది, భవిష్యత్ మీది.. మీ చేతుల్లో ఉంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండకు గోదావరి జాలాలు.. ‘గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు అందించి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గోదావరి జలాలను ఉదయసముద్రం ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు తీసుకువస్తాం. కాంగ్రెసోళ్ల కేసుల వల్లే డిండి లిఫ్టు పనులు ఆలస్యం అయ్యాయి. రానున్న కొద్దిరోజుల్లోనే లిఫ్టు పనులు పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం గీటురాయి. ఈ విషయంలో నాడు పదవ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు మొదటి స్థానంలో నిలిచింది. కడుపు, నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. పదేళ్ల వయస్సున్న తెలంగాణ దేశంలోనే నం.1గా నిలిచింది..’ అని సీఎం చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం సెక్యులర్ రాష్ట్రమే.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కర్ఫ్యూలు, మత కల్లోలాలు లేవు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుంది. ఇటీవల దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిపై దాడి చేశారు. మేము ఏనాడూ అరాచకాలు చేయలేదు. దుర్మార్గాలు, దౌర్జన్యం, కుట్రలకు పాల్పడలేదు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలి..’ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సభల్లో మంత్రి జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్య యాదవ్, టీఎస్ఐఎస్సీ చైర్మన్ బాలమల్లు, బీఆర్ఎస్ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, నలమోతు భాస్కరరావు, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకు?: కాసాని జ్ఞానేశ్వర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయానికి ఎందుకు వచ్చిండో అర్థం కావట్లేదు. బాలకృష్ణ చిటికలేసి చెప్పిండు. తెలంగాణలో నేనుంట అన్నడు. తెలంగా ణ మొత్తం తిరుగుత అన్నడు. తడాఖా చూపిస్త అన్నడు. ఏమైందో తెలియదు’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసాని మాట్లాడుతూ తాను టీడీపీని వదలిపెట్టడానికి గల కారణాలను వివరించారు. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, ఇతర నాయకులు వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. ‘లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థం కాని పరిస్థితి. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. సూర్యచంద్రులకు కూడా దొర కడు. కలుద్దామని 20 సార్లు ఫోన్ చేసిన. కాని ఫోన్ లేపలేదు. హైదరాబాద్లో ఉన్నప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడొచ్చు కదా? నాకు తెలంగాణతో సంబంధం లేదు. ఆంధ్రాకే పరిమితం అన్నట్లుగా ఉన్నడు’అని వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీ నుంచి నయా పైసా తీసుకోలేదు. నేనే పార్టీకి డబ్బులు ఇచ్చిన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడికి నెలకు రూ.50వేలు ఇస్తున్న. నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో రూ.11 లక్షలు రామ్మోహన్ రావుకు ఇచ్చిన. అందులో పార్లమెంటు అధ్యక్షులకు రూ. 50 వేల చొప్పున, మిగతా అటెండర్ల కోసం ఇవ్వమని చెప్పిన. కానీ రూ.లక్ష మాత్రమే అటెండర్లకు ఇచ్చిన్రు. మిగతా 10 లక్షలకు ఇప్పటికీ లెక్కలేదు’అని కాసాని చెప్పారు. గంగలో పోసిన పన్నీరు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పడిన కష్టమంతా గంగలో పోసిన పన్నీరుగా మారిందని కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా బాబు, లోకేశ్ని సంప్రదించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం బాబు ఆహ్వానించడంతోనే తాను ఆ పార్టీలోకి వెళ్లానని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలని బాబు కోరారన్నారు. బాబు ఆదేశాల మేరకు ఖమ్మంలో భారీ బహిరంగసభ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్లి జెండా ఎగరవేశామని, ఇంటింటికి టీటీపీ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్లినట్లు వివరించారు. 17 పార్లమెంటు స్థానాల్లో కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. బీసీలకు హామీలు ఇచ్చాం బీసీలకు అధిక సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ, అటువైపు అడుగులు వేయలేదని కాసాని చెప్పారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చామని, నాయీ బ్రాహ్మణులు, రజకులకు తొలి టికెట్ చంద్రబాబే ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారంతా ఎదురు చూస్తుంటే పోటీ చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటంతో కొంతమంది నేతలు కాంగ్రెస్కు ఓట్లు వేయాలని చెప్పడంతో దూరం పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఎన్నికల కోసం బాలకృష్ణ, లోకేశ్ను సంప్రదించినా స్పందించలేదని, ఇప్పటికే పోటీ కోసం 30 మందిని ఫైనల్ చేసినా వారికీ బీ–ఫారం ఇవ్వలేదని అన్నారు. కేడర్కు అన్యాయం చేయడం తనను కలచివేసిందన్నారు. పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు? ఈ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోటీ చేయాలనుకునే 67 మంది అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు కాసాని చెప్పారు. ఎన్నికల కోసం ఐదేళ్లుగా ఎదురుచూసిన పార్టీ నేతలకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబును శుక్రవారం రాజమహేంద్రవరం జైల్లో కలిసి టీటీడీపీ తరపున పోటీ చేసే అంశం గురించి మాట్లాడితే ‘మనం పోటీ చేయడం లేదు’అని చెప్పారని, దాంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెడితే పార్టీ తెలంగాణ నాయకులు, కార్యకర్తలంతా పోటీ చేయాల్సిందేనని పట్టుపట్టారని అన్నారు. మీటింగ్కు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకాలేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతున్నందున ఇక టీడీపీలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపాలని తాపత్రయపడుతున్నాయని, రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమేనని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే పార్టీ ఎందుకని ప్రశ్నించారు. పోటీ చేయనప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదనే విషయాన్ని అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. తన కేడర్తో మాట్లాడాక భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్న అయన.. కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పారు. గతంలోనే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సంప్రదించారని తెలిపారు. ఏపీలో ఒకలా.. ఇక్కడ ఇంకోలా.. ‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్కు ఓటేయమని క్లియర్గా చెబుతున్నరు. బాబు ను మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయాలంటున్నరు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’అని కాసాని ప్రశ్నించారు. ‘ఆంధ్రాలోబీజేపీ, జనసేనతో టీడీపీ పోటీ చేస్తదట. తెలంగాణలో బీజేపీ వద్దట. ఇదేం పద్ధతి. ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో పోటీ చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి కదా’అని వ్యాఖ్యానించారు. -
నమ్మితే ఉల్టా పల్టానే!
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నారాయణఖేడ్: ఎన్నికలు అనగానే కొందరు ఏమేమో చెబుతూ వస్తుంటారని, వాళ్ల మాటలు విని ఆగమాగం కావొద్దని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లను నమ్మితే అంతా ఉల్టాపల్టా అవుతుందని, వారికి అధికారమిస్తే నిండా ముంచుతారని ఆరోపించారు. ఆలోచనతో, విచక్షణతో ఓటు వేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘2004లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే పదేండ్లు ముందుకు వెళ్లేవాళ్లం. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్ల మరో పదేండ్లు కొట్లాడాల్సి వచ్చింది. 1969 లెక్కనే ఈసారి కూడా ఆగం జేయాలని చూశారు. అలాంటి సమయంలో కేసీఆర్ శవయాత్రనో, జైత్రయాత్రనో తేల్చుకుందామని ఆమరణ దీక్ష చేపడితే.. కేంద్రం దిగివచ్చింది. రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాం తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను అంతా బేరీజు వేసుకోవాలి. అప్పుడు కరెంటు ఉండేది కాదు. నీళ్లు ఉండేవి కాదు. బోర్లు తవ్వి ఎంతో మంది బోర్లా పడ్డారు. నేను గూడా 27 బోర్లు వేసి నష్టపోయినోడినే. ఎన్నో బాధలు అనుభవించినం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. 24 గంటలు కరెంటు ఇçచ్చుకుంటున్నం. మిషన్ కాకతీయతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నం. పదేళ్లలో దేశంలో అగ్రగామిగా నిలిచినం. అప్పట్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో సింగూరు నీళ్ల కోసం ఎన్నో కొట్లాటలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. జుక్కల్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల మధ్యలో ఉంది. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నరు. అక్కడికి, ఇక్కడికి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. ఎక్కడా లేనట్టుగా కరెంటు ఇస్తున్నాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం చూసి పొమ్మంటున్నారు. మనం ఇక్కడ 24 గంటలు కరెంటు ఇస్తుంటే.. వాళ్లు ఐదు గంటల గురించి చెబితే ఏమనాలి? దేనితో నవ్వాలి? మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ అన్నీ బాగుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించాలి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు ఇవ్వడం దుబారానా? రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం దుబారానా? ఆలోచించాలి. రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఏమైనా మిగిలి ఉంటే ఎన్నికల తర్వాత పూర్తవుతాయి. కేసీఆర్ బతికున్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం సెక్యులర్గా ఉంటుంది. బసవేశ్వర ద్వారా 1.80 లక్షల ఎకరాలకు నీరు కాంగ్రెస్ పాలనలోని నారాయణఖేడ్కు, ఇప్పటి బీఆర్ఎస్ పాలనలోని నారాయణఖేడ్కు దునియా ఆస్మాన్ తేడా ఉంది. గతంలో ఇక్కడ అన్నీ రేకు డబ్బాలే కనిపించేవి. ఇప్పుడన్నీ భవంతులు కనిపిస్తున్నాయి. గతంలో తాగేందుకు నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. గిరిజన మహిళా చిమ్నిబాయి మేం ఓటెందుకు వేయాలని అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించిన విషయం అందరికీ తెలుసు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సింగూరు జలాశయానికి లింకు చేసుకున్నాం. నర్సాపూర్ వరకు కాల్వ తవ్వకం పూర్తయింది. ఆ నీళ్లు వస్తే సింగూరు శాశ్వత జల వనరుగా తయారవుతుంది. నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద రెండు పంటలు పండేలా ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తా..’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సభల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, ఎం.భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హత్యా రాజకీయాలు సిగ్గుచేటు ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కొనలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని బాన్సువాడ, నారాయణఖేడ్ సభల్లో తీవ్రంగా ఖండించారు. ‘‘అది ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి కాదు. కేసీఆర్ మీద జరిగిన దాడి చేసినట్టే. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతగాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేశారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు ఇదే హింస అనుకుంటున్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దు. మాకు తిక్కరేగితే.. ఏం జరుగుతుందో ఊహించుకోవాలి. మొండి కత్తో, లండు కత్తో మాకూ దొరుకుతుంది. మేం కత్తులు పట్టుకుంటే రాçష్ట్రం దుమ్ము దుమ్ము అవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో ఎలక్షన్లు జరిగాయి. బీఆర్ఎస్ ఎక్కడా ఇలాంటి ఘటనలకు పాల్పడలేదు. గత తొమ్మిదేళ్లు కర్ఫ్యూలు, కొట్లాటలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే.. కాంగ్రెస్ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
ప్రచారాన్ని పరిగెత్తిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నవంబర్ మూడో తేదీ నుంచి విస్తృతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ప్రచారపర్వం కూడా ఊపందుకుంటుందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ సామాజికవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే అని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన ఏకైక పార్టీ బీజేపీయేనని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలో దేశంలోనే తొలిసారిగా బీసీ వ్యక్తి నరేంద్రమోదీ ప్రధానమంత్రి పీఠం అధిరోహించి.. ప్రపంచం అబ్బురపడేలా నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వివరించారు. కేంద్రంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసి దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారని ధ్వజమెత్తారు. మత రిజర్వేషన్ల పేరుతో బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు. మొదటి కేబినెట్లోనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు హైదరాబాద్లో బీసీలకు 50 కార్పొరేటర్ స్థానాలు రిజర్వ్ చేస్తే.. అందులో 37 సీట్లను మజ్లిస్ ఎత్తుకుపోయిందని కిషన్రెడ్డి నిందించారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి కేబినెట్ లోనే రద్దు చేస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. మజ్లిస్ అనుమతి లేకుండా నాడు కాంగ్రెస్ మంత్రులు, నేడు బీఆర్ఎస్ మంత్రులు పాతబస్తీలో పర్యటించలేని పరిస్థితి ఉందని, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో కేసీఆర్ కుటుంబం పనిచేస్తోందన్నారు. మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కరెంటు బిల్లులు, పన్నులు కట్టడం లేదని, ప్రభుత్వ అధికారులు వెళ్తే వారిపై కత్తులతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారిపై యూపీలో యోగీ ప్రభుత్వం తరహాలో బుల్డోజర్లతో అణచివేస్తామని కిషన్రెడ్డి హెచ్చరించారు. పార్టీలో చేరిన నేతలకు కండువాలు కప్పి.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లెల ఇంద్రకరణ్ రెడ్డి, నలుగురు మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు మంథని నియోజకవర్గ నేత చల్ల నారాయణ రెడ్డికి కిషన్రెడ్డి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
అప్పుల కుప్ప చేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్: సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈ తొమ్మిదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం, అందుకు మద్దతిస్తున్న బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. అవి కలిసే పనిచేస్తున్నాయని చెప్పారు. రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశాయని మండిపడ్డారు. తాము కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని.. కానీ ఈ విషయంలో కేసీఆర్, మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్, మంత్రులు రావాలని, బస్సుల్లో కర్ణాటకకు తీసుకెళ్లి హామీల అమలు వాస్తవాలను చూపిస్తామని సవాల్ చేశారు. అసలు ఎన్నికలప్పుడు హామీలివ్వడం, తర్వాత మాటతప్పడం సీఎం కేసీఆర్ నైజమని విమర్శించారు. ఆదివారం సంగారెడ్డిలోని గంజి మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో, మెదక్లోని రాందాస్ చౌరస్తాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు మెదక్లో పోటీ చేసిన ఇందిరాగాంధీ బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారని.. కానీ కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తోందని ఖర్గే ఆరోపించారు. రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 30 లక్షలకుపైగా ఖాళీలుంటే.. ప్రధాని మోదీ కేవలం రెండు, మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని.. బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలను చేపట్టినదని తమ పార్టీయేనని గుర్తు చేశారు. ఏపీ కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఖర్గే చెప్పారు. సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య రక్షకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మేడిగడ్డతో కేసీఆర్ అవినీతి బయటపడింది: రేవంత్ కేసీఆర్ పాలనలో తెలంగాణను బెల్టుషాపుల రాష్ట్రంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. దీనితో కేసీఆర్ అవినీతి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు ఇసుక కదలడంతో కుంగిందని నీటి పారుదల శాఖ ఈఎన్సీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ కిరాయి మనుషులతో దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తోందని.. సీఎం తేదీ ఖరారు చేస్తే బస్సులో కర్ణాటకకు తీసుకెళ్లి హామీల అమలును చూపిస్తామని చెప్పారు. తెలంగాణకు పట్టిన దరిద్రం వదలాలంటే బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సంపదను పంచడానికే ఆరు గ్యారంటీలు: సీఎల్పీ నేత భట్టి దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాషŠట్రంలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు సాకారం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలందరికీ పంచడానికే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి గడ్డ దమ్మేంటో చూపిస్తాం: జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, సంగారెడ్డిలో భారీ మెజారిటీతో గెలిచి ఈ గడ్డ దమ్మేంటో చూపిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.‘‘హరీశ్రావు చాలెంజ్ చేస్తున్నారు. జగ్గారెడ్డిని ఓడగొడతాడట. ఇక్కడి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నాడా? ఈ గడ్డకు పౌరుషం లేదనుకుంటున్నాడా? సంగారెడ్డి ప్రజలారా.. మీ కష్టాల్లో నేను అందుబాటులో ఉంటా. మీ దమ్మేందో చూపించాలి. హరీశ్రావు సంగారెడ్డిలో ఎలా తిరుగుతారో చూస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
రేవంత్కు అధికారమిస్తే కోఠిలో అమ్మేస్తాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. అమరుల స్తూపం వద్దకు వచ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడు. నోట్లకట్టలతో పచ్చిగా దొరికిన దొంగ నీతులు చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు బతిమాలుతున్నారని.. ఎందుకు చాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు సంచులతో వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని డీకే చెప్పడంపై నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం ‘‘గతంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెంచా గాడు కాదా? గ్రూప్–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసిందే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్. ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే గొడవ చేసిందీ వీళ్లే. కోర్టులో కేసు వేసి గ్రూప్–2 పరీక్షను రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్ పెడతారు వాళ్లు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకుంటున్నా. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా..’’అని కేటీఆర్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదికల ద్వారా తిప్పికొట్టి వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్ల వయసున్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. 2014 ముందు నాటి పరిస్థితులను వారికి తెలియచేయాలని.. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వారి డొల్లతనాన్ని బయట పెట్టాలని సూచించారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేటల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తితోనే తాను బీఆర్ఎస్లో చేరినట్టు ఎర్ర శేఖర్ అన్నారు. ముదిరాజ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
తోడేళ్లలా ఆవురావురు
రాహుల్ గాంధీ ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి, కోదాడ: ‘కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేక ఆకలితో ఆవురావురంటోంది. చాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు పడదాం.. మట్టిగడ్డ కూడా మింగుదామనే ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఉన్నా రు. అలాంటి కాంగ్రెస్ కావాలా? అభివృద్ధిలో ముందుకు పోతున్న బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మేము తెలంగాణ ఇచ్చామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. 14 ఏళ్ల పాటు ఏడిపించారు. ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. ఏడాదిపాటు భయంకరమైన పోరా టం చేస్తే ఇచ్చారు తప్ప పుణ్యానికి ఇవ్వలే..’ అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో, తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ సమర శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. చావునోట్లో తలకాయ పెడితే దిగొచ్చారు.. ‘బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, ఢిల్లీలో అధికారం పొంది ఏడిపించారు తప్ప, మర్యాదగా తెలంగాణ ఇవ్వలేదు. ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలకాయ పెడితే, ప్రజలంతా ఉప్పెనలా ఉద్యమం చేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ కొంతమంది ముందుకు ఎగదోసి రాజీనామా నాటకం ఆడి, వెనక్కి తీసుకున్నారు. తరువాత ఏడాదిపాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మన తెలంగాణ మనకు రాలేదు. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. ఎంతమంది ఉద్యమకారులను జైల్లో పెట్టారు. చెరుకు సుధాకర్ను కూడా జైల్లో వేశారు. అయినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టి, పోరాటం చేశాం కాబట్టి దిగి వచ్చి ఇచ్చారు. శ్రీకాంతాచారి లాంటి వారి ప్రాణాలను బలి తీసుకొని ఇచ్చారు తప్ప పుణ్యానికి తెలంగాణ ఇవ్వలే. ఎవరెవరివో బూట్లు నాకిన వాళ్లు ఇప్పుడు వచ్చి చెప్పే మాటలు నమ్మొద్దు. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు పిడికెడు మందే ఉన్నాం. ఒక్క కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకుడు రాలేదు. జేఏసీ ఏర్పాటు కోసం రాజీనామా చేయమంటే మంత్రి పదవులను వదిలిపెట్ట్టలేదు. ఎన్నికలు వచ్చాయంటే రకరకాల మనుషులు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు ఓటు వేయాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్కు వ్యవసాయం ఎరుకనా? ‘కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ను తీసేస్తామని పదేపదే చెబుతున్నారు. రాహుల్గాంధీ కూడా ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా..? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఒకరి భూములను ఒకరికి రాసిన తంటాలు పోయాయి. ధరణితో మీ బొటన వేలు పడితే తప్ప మీ భూమి బదిలీ కాదు. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. ధరణి తీసివేస్తే వీఆర్ఓలు వస్తారు, అధికారుల రాజ్యం వస్తుంది. పహాణి నకళ్ల కోసం తిరగాలి. రైతుబం«ధు రూ.10 వేలు వస్తే రూ.3 వేలు ఇమ్మంటారు. గతంలో చూసిన దోపిడీ దొంగల రాజ్యమే రావాలా? ధరణి ఉండి రైతులకే అధికారం ఉండాలా? ఆలోచించండి. ధరణిలో భూమి ఉందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంటున్నారు..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ సల్లగ గావాలి.. ‘కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వృధా అంటున్నాడు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల డబ్బును దుబారా చేస్తున్నామని అంటున్నాడు. రైతుబంధు ఉంచాలా..? తీసి వేయాలా..? ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి. రైతుబంధు అనేది ఒట్టిగా ప్రకటించలేదు. ఎంతో ఆలోచించి ప్రారంభించాం. ఓట్ల కోసం తేలేదు. ఎక్కడకెళ్లి అడిగినా రైతుబంధు ఉండాలని లక్షల మంది సభల్లో చెబుతున్నారు. తెలంగాణ రాకముందు 40, 50 లక్షల టన్నుల వడ్లు పండితే.. ఇçప్పుడు 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ఎక్కడిక క్కడే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఒకనాడు రైతు కుటుంబాలకు పిల్లను ఇచ్చేవారు కాదు, ఇప్పుడు పిల్లను ఇవ్వాలంటే భూమి ఉందా? అని అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్నవారు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ సల్లగ గావాలి..రైతుల ముఖాలు తెల్లగ గావాలి.. అప్పుల బాధలు పోవాలి..’ అని ఆకాంక్షించారు. శివకుమార్.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చాడా? ‘24 గంటల కరెంట్ దేశంలో ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నాలుగైదేళ్లుగా ఒక పాలసీ ప్రకారం ఇస్తున్నాం. కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. మీటర్లు పెట్టాల ని వత్తిడి తెచ్చి పెట్టకపోతే ఏడాదికి రూ.25 వేల కోట్ల కోత పెట్టింది. ఇంకో పది వేల కోట్లు కోత పెట్టినా.. నా ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పా. పీసీసీ అధ్యక్షుడేమో 24 గంటల కరెంటు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నారని అంటున్నాడు. 3 గంటలే సరిపోతుందని చెబుతున్నాడు. 3 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయండి. కర్ణాటక ఉప ముఖ్యమంతి శివకుమార్.. మా రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం.. మా గొప్పతనం చూడమంటున్నాడు. నవ్వాలో ఏడ్వాలో తెలవడం లేదు. ఆయన ప్రచారానికి వచ్చాడా.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చాడా?’ అని సీఎం ఎద్దేవా చేశారు. దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు ‘జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దళితులకు ఈ దరిద్రం ఎందుకు ఉండేది? తెలంగాణ వచ్చాక, ఒక దశకు వెళ్లాక దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు పథకం తీసుకొచ్చాం. ఎన్నికలు రావ డంతో కొంతమంది వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకాయన వస్తున్నాడు. ఆయన రాష్ట్రంలో అన్నా నికే గతి లేదు. యూపీ, బిహార్, బెంగాల్ కూలీలు నాట్లు వేయడానికి, బతకడానికి మన రాష్ట్రానికి వస్తుంటే.. ఆ రాష్ట్రాల సీఎంలు వచ్చి మనకు పాఠాలు చెబుతున్నారు..’ అని విమర్శించారు. సంక్షేమంలో ముందున్నాం.. ‘గతంలో తెలంగాణలో ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. వీటన్నింటికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత చరమగీతం పాడాం. తొమ్మిది, పదేళ్లలోనే దేశానికి తలమానికమైన తలసరి ఆదాయంలో నంబర్ వన్ అయ్యాం. పేదల సంక్షేమం, వ్యవసాయ విప్లవం, ఐటీ విప్లవం రావడంతో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం. పేదల పెన్షన్లను పెంచుకున్నాం. కళ్యాణలక్ష్మి ప్రవేశపెట్టి పెంచుకున్నాం. మత్స్య సంపద రూ.33 వేల కోట్లకు పెరిగింది. రైతుబంధును యూఎన్ఓ ప్రశంసించింది..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పింఛన్లు సహా అన్నీ పెంచుకుందాం ‘సమైక్య పాలనలో రూ.40 నుంచి రూ.200 పింఛన్ ఇచ్చేవారు. తెలంగాణ రాగానే రూ.1,000 వరకు పెంచి దాన్ని రూ.2,016 వరకు తీసుకొచ్చాం. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రూ.5 వేల వరకు పెంచుకుందాం. రైతుబంధు కూడా దశల వారీగా పెంచుకుంటూ పోతాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులను నేరుగా పంపుతుంది. ఇలా ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుంది..’ అని సీఎం హామీ ఇచ్చారు. తుంగతుర్తిలో కిషోర్ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట గోపురం అంత ఎత్తున ఓట్లు వేసి ఆలేరులో గొంగిడి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది వ్యతిరేకించినా కోదాడ నుంచి బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్కు టికెట్ ఇచ్చానని, బీసీలందరూ కష్టపడి అత్యధిక మెజారిటీతో ఆయన్ను గెలిపించాలని చెప్పారు. -
పదవితో మారేదేమీ ఉండదు
సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెనుకబడిన వర్గానికి చెందిన నేతను తొలగించిన బీజేపీ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అంటోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ కేటగిరీకి చెందిన వాడైనా బీసీ జనగణన చేపట్టడం లేదని, ఒక వ్యక్తికి పదవి వచ్చినంత మాత్రాన పెద్దగా మారేదేమీ ఉండదని అన్నారు. బీసీ సీఎం అయినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదని, కులం కంటే గుణం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని 2014 డిసెంబర్లోనే సీఎం కేసీఆర్ బీసీ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ముదిరాజ్లకు రూ.1,000 కోట్ల విలువైన చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.30 వేల కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టించామని తెలిపారు. పదవుల కంటే పథకాలు, జాతి ఉద్ధరణ ముఖ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నెపాన్ని బీసీలపై నెట్టేందుకే బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ ఎత్తుకుందనే అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు ‘బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా మార్పు కోసం రాజకీయాలు చేస్తోంది. కానీ విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాలను మార్చేందుకు పనిచేస్తున్నాయి. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. అయితే దాడులు లేదంటే అబద్ధాలతో మోసం చేస్తోంది. సోషల్ మీడియా అబద్ధపు వార్తలకు బీజేపీ ఫ్యాక్టరీలా మారింది. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విష ప్రచారం చేస్తోంది. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు..’అని కేటీఆర్ చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు జైలుకు వెళ్లొచ్చు.. ‘కాంగ్రెస్కు ఇప్పటికే 11 మార్లు అధికారం ఇచ్చిన ప్రజలు మరోమారు అప్పగించేందుకు సిద్ధంగా లేరు. గతంలో ఆరు సూత్రాలు అంటూ మోసగించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారంటీలతో మరోమారు అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో ఐదు గంటల పాటు కరెంటు ఇవ్వలేక లెంపలు వేసుకుంటోంది. దేశానికి ఆ పార్టీ తెల్ల ఏనుగులా తయారైంది. రాష్ట్రంలో పగ, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈపాటికి జైల్లో ఉండేవాడు. ఇప్పటికీ ఆయన జైలుకు వెళ్లొచ్చు..’అని అన్నారు. తొలుత మహారాష్ట్రలో జెండా ఎగరేస్తాం ‘ఇతర పార్టీలను బలహీన పరచడం, మేము బలపడటం లక్ష్యంగా బీఆర్ఎస్లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నాం. జాతీయ పార్టీగా తొలుత మహారాష్ట్రలో జెండా ఎగురవేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం. బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు సుమారు 30 ఏళ్లు పట్టింది..’అని గుర్తు చేశారు. కేసీఆర్కు దీటైన నేతలు లేరు ‘సీఎం కేసీఆర్కు దీటైన నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరు. పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేసీఆర్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రజలు ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కొత్త నమూనా ఆవిష్కరించడం ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యాయి. రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఆచరిస్తున్నాం. లింగ, కుల, మత వివక్ష లేకుండా పాలన సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమానికి నడుమ సమతూకం పాటిస్తున్నాం. అప్పులను రాష్ట్రంలో ఉత్పాదక రంగం, మౌలిక వసతులపై వెచ్చించాం. అన్ని రంగాల అభివృద్ధితో రాష్ట్రం, ప్రజల సంపద పెరిగింది. మా కంటే గొప్పగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వాలు ఏవీ లేవు..’అని కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ప్రతిపక్షాలది పైశాచికానందం ‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది 28 లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరదను కూడా తట్టుకుని నిలిచింది. ప్రాజెక్టులో లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత ఏజెన్సీ ద్వారానే మరమ్మతు పనులు జరుగుతాయి. ప్రజలపై ఎంత మాత్రం భారపడదు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బట్ట కాల్చి మామీదేయడం సరికాదు. గతంలో అన్నారం పంప్హౌస్ మునిగిన సమయంలోనూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందాయి..’అని కేటీఆర్ విమర్శించారు. -
పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?!
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇంకా సిద్ధపడటం లేదా! టీడీపీని, బీజేపీని జత చేయాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయబారం అంత సఫలం కాలేదనే అనుకోవాలా? ప్రస్తుతానికైతే అలాంటి అభిప్రాయమే ఏర్పడుతోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఆలోచించడమే విడ్డూరమనిపిస్తోంది. ఏపీలో అనైతిక పొత్తుకు తెరదీసిన జనసేనతో కలిసి తెలంగాణలో బీజేపీ ఎలా కలిసి వెళ్తుందన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పరిణామంతో తెలంగాణలో ఏదో జరిగిపోతోందని ఎవరూ అనుకోలేదు కానీ, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తుందన్న చర్చ జరిగింది. ఎలాగోలా బీజేపీతో కలవాలని, తద్వారా తమపై వచ్చిన అవినీతి కేసుల నుంచి బయటపడాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అండగా నిలుస్తున్న పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు వంటి వాటిని పట్టించుకోకుండా సమర్థిస్తున్న తీరు జనసేన వర్గాలకే మింగుపడటం లేదు. తాను ఎన్డీయేలో ఉన్నప్పటికీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ దానిని పక్కనబెట్టి పవన్ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. పెళ్లి ఒకరితో, కాపురం మరొకరితో అన్నట్లు ఏపీ రాజకీయాల్లో పవన్ వ్యవహరిస్తున్నా, బీజేపీ పెద్దగా ఫీల్ కాకుండా ఆయనతో తెలంగాణలో పొత్తు కోసం చర్చలు జరిపింది. ఆ క్రమంలో ఆయన అమిత్ షా వద్దకు తీసుకెళ్లాలని కోరారట. దాంతో కిషన్రెడ్డి ఢిల్లీకి వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ షాతో జరిపిన చర్చల్లో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయంట కానీ, జనసేన, టీడీపీ కలిసి ఏపీలో పనిచేస్తున్న విషయం ప్రస్తావనకు రాలేదట. ఇది ఈనాడు పత్రికలో రాసిన కథనంలోని ఒక అంశం. దీనిని ఎవరైనా నమ్ముతారా? తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు గురించి మాత్రమే చర్చకు వచ్చిందట. అందులో సీట్ల బేరసారాలు సాగాయి. వాటిని రాష్ట్రస్థాయిలో తేల్చుకోండని అమిత్ షా వారిని పంపించేశారు. ఏపీలో చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయి జైల్లో ఉన్న విషయం సహజంగానే ప్రస్తావనకు వచ్చి ఉండాలి. అందులో తమ ప్రమేయమేమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని షా చెప్పి ఉండాలి. ఏపీ రాజకీయాలకు లింక్ పెట్టి తెలంగాణలో పొత్తు కుదుర్చుకోవాలన్న పవన్ వ్యూహం అంత సఫలమైనట్లు లేదు. అందుకే పవన్, మనోహర్ ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారనిపిస్తుంది. తదుపరి కిషన్రెడ్డి.. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడుతూ ఆ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి కాదని తేల్చేశారు. నిజంగానే బీజేపీ పొత్తు పెట్టుకోదలిస్తే క్షణాల్లో టీడీపీని ఎన్డీయేలో చేర్చుకున్నట్లు ప్రకటించేది కదా! అయితే కొద్దికాలం క్రితం టీడీపీ నేత లోకేశ్ తాము ఎన్డీయేకి, ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నామని ప్రకటించారు. దాంతో బీజేపీ ఈ విషయంలో చొరవ చూపడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందోగానీ, ఇప్పటికైతే టీడీపీతో పొత్తుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సిద్ధపడట్లేదని స్పష్టమవుతోంది. తెలంగాణలో కూడా టీడీపీని తోడు తీసుకెళ్లాలని అనుకున్న పవన్ వ్యూహం బెడిసినట్లుంది. అదే సమయంలో సొంతంగా పోటీ చేస్తామని మొదట బెదిరించిన టీడీపీ ఆ తర్వాత తోక ముడిచిందన్న వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేనతో పొత్తు అని చెప్పినప్పటికీ అమిత్ షా పాల్గొన్న సూర్యాపేట సభలో పవన్ కళ్యాణ్ లేదా ఆయన పార్టీ నేతలు పాల్గొనకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఒకపక్క పొత్తు కుదిరిందని చెబుతారు. మరోవైపు ఎడమొహంగా, పెడమొహంగా ఉంటున్నారు. బీజేపీకి ఏమైనా కలిసొస్తుందా? ఇక, తెలంగాణలో పవన్ కల్యాణ్ వల్ల బీజేపీకి ఏమైనా కలిసొస్తుందా అన్న చర్చ ఉంది. ఆయా చోట్ల జన సమీకరణకు పవన్ కల్యాణ్ ఉపయోగపడొచ్చు. ఎందుకంటే ఆయన సినీ నటుడిగా ఉన్నారు కనుక. కానీ ఓట్లు, విజయావకాశాలను ఎంతవరకు ప్రభావితం చేయగలర్నది చర్చనీయాంశమే. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లలో కాపు వర్గాన్ని, తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు వర్గాన్ని, సినిమాల పరంగా ఆయనకు ఉన్న అభిమానులను ఆకర్షించడానికి బీజేపీ పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చి ఉండొచ్చు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు ఏపీలో ఉన్నందున, కొంతమంది పవన్ అభిమానులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండటానికీ ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు సాయపడుతున్న నేప«థ్యంలో బీజేపీ ఆ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని టీడీపీతో స్నేహానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. ఆంధ్ర పార్టీతో పొత్తుపై మళ్లీ అదే అస్త్రమా? గత ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బాగా నష్టపోయింది. ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ పొత్తేమిటని బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం చేసింది. ఈసారి పవన్, బీజేపీ కలిస్తే ఆ సమస్య ఎలా ఉంటుదన్నది చూడాలి. సహజంగానే బీఆర్ఎస్ ఈ పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అవసరమైతే మళ్లీ అదే అ్రస్తాన్ని ప్రయోగించవచ్చు. కాకపోతే జనసేనకు టీడీపీకి ఉన్నంత బలం లేనందున అంత సీరియస్గా కూడా తీసుకోకపోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఇచ్చే ఎనిమిదో పదో సీట్లకు జనసేన అంగీకరిస్తుందా? లేదా? అన్నది కూడా చూడాలి. అమిత్ షా వరకు వెళ్లాక ఆ విషయంలో పట్టుబడతారా అన్నది అనుమానమే. బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికే గతంలో జనసేన 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించింది. అది కొంత ఫలించి బీజేపీ చర్చలు జరిపి, అమిత్ షా వరకు తీసుకువెళ్లింది. కాగా జనసేనతోపాటు టీడీపీని బీజేపీతో కలపడానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కొంత ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏపీ రాజకీయాలు. బీజేపీ ఉద్దేశం పవన్ను తెలంగాణలో ఉపయోగించుకోవడం. పవన్ కళ్యాణ్ రాయబారం ఫలించలేదు గానీ, బీజేపీ చెప్పినట్లు పవన్ వినక తప్పని పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహం వస్తుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘చేయి’స్తారా!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో తీవ్ర నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడిపై, అధిష్టానంపై మండిపడుతున్నారు. దొంగ సర్వేలు నిర్వహించి, వాటి పేరిట తమ వారికి టికెట్లు అమ్ముకున్నారని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను మోసం చేసిన వారిని ఎన్నికల్లో ఓడిస్తామంటూ కొందరు బహిరంగంగానే శపథం చేస్తున్నారు. పార్టీ తమకు న్యాయం చేస్తుందనే ఆశతో, ఎంతో ఉత్కంఠతో రెండో జాబితా కోసం ఎదురుచూసిన మరికొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు ఏదేమైనా బరిలోకి దిగుతామంటుంటే (రెబల్స్), మరికొందరు ఏకంగా రాజీనామాల బాట పట్టారు. మరోవైపు పలువురు నేతల అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాందీభవన్పై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు కొందరు రాళ్ల దాడి చేశారు. తమ నేతకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ జెండాలను తగులపెట్టారు. ఇటుక పెళ్లలను విసరడంతో రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి రంధ్రం పడింది. పార్టీతో తెగదెంపులు: టికెట్ దక్కనందుకు నిరసనగా కాంగ్రెస్ అనుబంధ విభాగమైన మైనార్టీ సెల్ చైర్మన్ సోహైల్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీతో 34 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఖర్గేకు లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ తాళం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చేతుల్లో ఉందన్నారు. పాత కాంగ్రెస్ను రేవంత్రెడ్డి చంపేశారని ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత గాందీభవన్లో ఒక్కరు కూడా కనిపించరని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్రెడ్డి కూడా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కార్యకర్తలతో సమావేశమైన ఆయన తనకు పార్టీ అన్యాయం చేసిందని బోరుమన్నారు. ఆయన్ను చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. గత ఎన్నికల్లో తాను టికెట్ త్యాగం చేశానని, ఈసారి ఇస్తామని చెప్పి చివరకు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగుతానని, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావ్ను ఓడించి తీరతానని శపథం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పార్టీ నేత, ఎన్ఆర్ఐ విజయ్కుమార్రెడ్డి చెప్పారు. ముధోల్ కాంగ్రెస్ టికెట్ను ఎంతకు అమ్ముకున్నారో రేవంత్రెడ్డి చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న తనను ఇక్కడికి రప్పించి టికెట్ ఇస్తామని ఆశ చూపి పని చేయించుకున్నారని, ఇప్పుడు వేరే అభ్యర్థికి టికెట్ అమ్ముకుని తనను మోసం చేశారని ఆరోపించారు. కాగా ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసి తగులబెట్టారు. తిరుగుబాటు బావుటాలు టికెట్ దక్కని కాంగ్రెస్ ఆశావహులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరు పార్టీని ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వడ్డేపల్లి సుభాష్రెడ్డితో పాటు మునుగోడు టికెట్ రాని చల్లమల్ల కృష్ణారెడ్డి, హుస్నాబాద్ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి, వరంగల్ వెస్ట్లో జంగా రాఘవరెడ్డి, ఆసిఫాబాద్లో ముందు నుంచి పనిచేస్తున్న తనను కాదని శ్యామ్నాయక్కు టికెట్ కేటాయిచండంపై మండిపడుతున్న ఆదివాసీ మహిళా నాయకురాలు మర్సుకోలు సరస్వతి స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉంటామని స్పష్టం చేశారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా అధిష్టానం తనను వంచించిందని హుస్నాబాద్ నేత అలిగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నా.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్ననని, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. నాయిని రాజేందర్రెడ్డికి ఏ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి కేటాయించడంపై టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్, ముఖ్యనాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, సోమన్నగారి రవీందర్రెడ్డి రగిలిపోతున్నారు. హత్నూర మండలంలోని ఓ ఫాంహౌస్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణం అభ్యర్థిని మార్చాలని, లేకుంటే తమ ముగ్గురిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి.. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. రాహుల్ సభను అడ్డుకుంటామంటున్నారు.. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా వచ్చే నెల 1న జడ్చర్లలో జరిగే రాహుల్గాంధీ బహిరంగ సభను అడ్డుకుంటామని తన అనుచరులు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చెప్పారు. కార్యకర్తలు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ స్థానికులకు ఇవ్వకుంటే రెండ్రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్సాగర్రావు వర్గీయులు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆడె గజేందర్ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్ను వెనక్కి తీసుకుని, స్థానికులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అసంతృప్తి నేతలు పలువురు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోటీ బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నట్లు మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించడం సమంజసం కాదని పీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు దండెం రాంరెడ్డి అన్నారు. మల్రెడ్డి రంగారెడ్డిని కొనసాగిస్తే తాపే రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఖాయమని స్పష్టం చేశారు. నిరాశలో యువనేతలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించిన పలువురు యువ నేతలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, గిరిజన విభాగం అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్లు ఈసారి తప్పకుండా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ వారికి అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ముఖ్యంగా హుజూరాబాద్ టికెట్ను బల్మూరి వెంకట్కు కేటాయించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇచ్చి బలి పశువును చేశారని, ఆ తర్వాత కూడా పార్టీ కోసం ఎంత కష్టపడినా వెంకట్కు పార్టీ గుర్తింపు ఇవ్వలేదని అంటున్నారు. రేవంత్పై ఫిర్యాదుకు సిద్ధం టికెట్లు రాని నేతలు కొందరు పార్టీ నాయకత్వంపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపించడం గమనార్హం. మరోవైపు రేవంత్రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సిద్ధమయ్యారు. శనివారం లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో కొందరు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల పట్ల రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆవేదనతో ఉన్న నేతలు ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. అద్దంకి దయాకర్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారని, తమ భవిష్యత్తు కార్యచరణపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. అభ్యర్థిత్వాలను సమీక్షించండి: సీనియర్ల లేఖ టికెట్ల కేటాయింపు తీరుపై సీనియర్లలోనూ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ల ఖరారు ప్రాతిపదికకు అర్థం లేకుండా పోయిందని, ఏళ్ల తరబడి పార్టీని పట్టుకుని వేలాడిన వారిని పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వారికి పట్టం కట్టారని వాపోతున్నారు. కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా పార్టీతో కలిసి నడుస్తున్న నేతలు, కేడర్లో అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రెండు జాబితాల్లో ప్రకటించిన అభ్యర్థులను చూస్తే ప్యారాచూట్లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, పార్టీకి విధేయులుగా ఉండి ఎన్నికలను ఎదుర్కొనగలిగిన సత్తా ఉన్న నాయకులను పార్టీ అధిష్టానం విస్మరించిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. కేడర్ మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తొలి రెండు జాబితాల్లో ప్రకటించిన పేర్లను సమీక్షించాలి. అప్పుడే పార్టీ కేడర్లో విశ్వాసం పెరగడంతో పాటు పార్టీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్కు పంపిన లేఖలో సీనియర్ నేతలు కోరారు. -
గ్రేటర్ రిజల్ట్స్... ఓటర్ ఇస్తారా?
రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుపొందిన బీజేపీ...మళ్లీ ఇప్పుడు 2023 నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే మ్యాజిక్ను రిపీట్ చేయగలుగుతుందా ? లేదా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. బీఆర్ఎస్కు దీటైన ప్రత్యా మ్నాయంగా బీజేపీనే ఎదుగుతోందనే వాదనలకు బలం చేకూర్చే విధంగా గత మూడున్నరేళ్లలో ఆ పార్టీ సాధించిన రాజకీయ విజయాలు స్పష్టం చేశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్–బీజేపీల మధ్యనే అనేక సందర్భాల్లో ప్రధాన పోటీ జరగడంతో...కాంగ్రెస్ పార్టీ అనేది ‘పూర్ థర్డ్ పొజిషన్’కు చేరుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర రాజకీయాల్లో తమదే పైచేయి అంటూ హైప్ ఇచ్చేలా ఆ పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమాలు కూడా అందుకు దోహదపడ్డాయి. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. సంజయ్ మార్పుపై చర్చ జరగడం, పార్టీపరంగా కార్యకలాపాలు పుంజుకోకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి సంబంధించి దాదాపు 35 వేల పోలింగ్బూత్లలో పూర్తిస్థాయిలో బూత్ కమిటీల అధ్యక్షులు, సభ్యుల నియామకం జరగకపోవడం తదితర కారణాలతో బీజేపీ నాయకులు, కేడర్లో ఒకింత నిస్తేజం ఏర్పడిందనే చెప్పాలి. పెరిగిన అసంతృప్త స్వరాలతో నష్టం? కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి (గతంలోనే మూడుసార్లు ఆ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి–గతంలో రెండుపర్యాయాలు ఏపీ అధ్యక్షుడిగా, ఒకసారి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు) నియామకం తర్వాత పార్టీలో అన్నీ కుదురుకోడానికి కొంత సమయం పట్టింది. ఆ లోగానే ముఖ్యనేతలు, జాతీయకార్యవర్గసభ్యుల స్థాయి నాయకుల అసంతృప్త స్వరాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ఢిల్లీ లిక్కర్స్కాంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి, ఇంతవరకు బెయిల్ రాకుండా జైళ్లో పెట్టగా, ఇదే కేసులో ప్రమేయముందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించినా తదు పరి చర్యలు ఎందుకు తీసుకోలేదు ? కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగసభల్లోనే ప్రస్తావించినా కేసీఆర్ సర్కార్పై తదుపరి చర్యలెందుకు తీసుకోలేదు ?.. దీంతో బీఆర్ఎస్తో బీజేపీకి లోపాయికారి అవగాహన ఉందనే అనుమానాలను పార్టీపెద్దలు ఏ విధంగా దూరం చేస్తారనే ప్రశ్నలు సంధించారు. అసంతృప్త నేతల సమావేశాలు, బీఆర్ఎస్–బీజేపీ దోస్తీపై చర్చ కూడా బీజేపీకి నష్టం చేసిందనే చెప్పాలి. మోదీ మాటలతో మళ్లీ ఊపు ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్ సభల ద్వారా ప్రధాని మోదీ బీఆర్ఎస్ వంటి అవినీతి పార్టీతో బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. దీంతో పాటు తమను ఎన్డీఏలో చేర్చుకోవాలని, జీహెచ్ఎంసీ పాలకమండలిలో బీఆర్ఎస్–బీజేపీ కలిసి పనిచేద్దామంటూ సీఎం కేసీఆర్ తన వద్దకు వచ్చి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించానని స్పష్టం చేశారు. అదేవిధంగా కేటీఆర్ను సీఎం చేసేందుకు సహకరించాలని కోరితే ఇది ప్రజాస్వామ్యమని రాచరికం కాదని చెప్పానని మోదీ పేర్కొన్న తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని, పార్టీలో మళ్లీ ఊపు వచ్చిందని నేతలు చెబుతున్నారు. అప్పుడు 40 సీట్లలో మెజారిటీ.. 2019 లోక్సభ ఎన్నికలపుడు బీజేపీకి వివిధ ఎంపీ సీట్ల పరిధిలో దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ లభించడంతో... అప్పటి నుంచి పార్టీ మరింతగా పుంజుకున్నందున 60–70 సీట్లలోనైనా గెలుస్తామనే విశ్వాసాన్ని ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల తర్వాత వరసగా బీజేపీ బలం పుంజుకోవడంతో పాటు... అధికార బీఆర్ఎస్తో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తలపడి బీజేపీ అభ్యర్థులు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్ గెలుపొందారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకుని దాదాపు 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి ఓటమి పాలయ్యారు. ఐనా అది కూడా తమ నైతిక విజయమేనని, గత ఎన్నికల్లో మునుగోడులో సాధించిన 12వేల ఓట్ల నుంచి 87 వేల ఓట్లకు చేరుకోవడమంటే మామూలు విషయం కాదని బీజేపీ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల తర్వాత 2020 డిసెంబర్ లో జరిగిన జీహేచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడం ద్వారా బీజేపీ సంచలనం సృష్టించింది. అంతకు ముందు ఆ పార్టీకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య 48కు చేరుకోవడం ద్వారా బీజేపీ పట్ల ప్రజల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతం...అర్భన్ఓటర్లలో ప్రభావం పెరుగుతోందని, హిందుత్వ నినాదంతో ఓటర్ల పోలరైజేషన్ దిశగా హైదరాబాద్ ప్రజలు అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా అప్పట్లో బలంగానే సాగింది. అంతకు ముందు 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం 7 శాతం ఓట్లే పార్టీ ఖాతాలో పడ్డాయి. మళ్లీ మరో నాలుగు నెలల్లోనే అంటే 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సొంతంగా పోటీచేసి ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తోపాటు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. గత ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 20 శాతం ఓట్లను సాధించి అందరి అంచనాలను తలకిందులు చేయడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మళ్లీ అలాంటి ప్రదర్శనే కనబరిచి గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలువగలుగుతుందా ? అనే నమ్మకాన్నే, ధీమానే బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. -
నావంతు చేశా.. ఇక మీదే బాధ్యత
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలతోపాటు అన్ని వర్గాలను కాపాడుకునేందుకు తన వంతు పనిచేశానని.. ఇప్పుడు ప్రజలే పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో చోటుచేసుకున్న మార్పును గుర్తించి, ఆలోచించాలని సూచించారు. ఎన్నికల కోసం బహురూపుల వేషాలతో వచ్చే వాళ్లను నమ్మి ఆగమైతే వైకుంఠపాళిలో పాములా మింగేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు, వలసల బతుకులే మిగులుతాయని.. రైతులు గోసపడతారని పేర్కొన్నారు. తాము ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమని, సాధ్యాసాధ్యాలపై ఆలోచించి క్రమపద్ధతిలో అమలు చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. పూటకో పార్టీ మార్చుతూ, డబ్బు మదం, అహంకారంతో వచ్చేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అచ్చంపేట, వనపర్తి, నల్లగొండ జిల్లా మునుగోడులలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘24 ఏళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరిన.. నాడు ఎవడూ లేడు. పక్షిలా ఒక్కడినే తిరిగా. అదే ఇప్పుడు లేసినోడు, లేవనోడు అంతా వచ్చి కేసీఆర్ నీకు దమ్ముందా? అంటున్నారు. కొడంగల్ వస్తవా, గాంధీ బొమ్మకాడికి వస్తవా అంటున్నరు. ఇదేనా రాజకీయం? ఎన్నికలు వస్తయ్, పోతాయ్. కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగుపడతాయి. తెలంగాణకు ముందు ఈ సన్నాసులు ఎక్కడున్నరో, ఎవరి బూట్లు తుడిచారో చెప్పాలి. పదేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో ప్రజలే గమనించాలి. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసింది ఎన్నికలు వస్తున్నాయని అంతా వస్తరు. ఉపన్యాసాలు ఇస్తరు. దేశంలో ఏ సీఎం, పీఎం కూడా మన దాంట్లో పది శాతం కూడా లేరు. కేసీఆర్ దమ్మేంటో ఇండియా చూసింది. నవంబర్ 30న దుమ్ము రేగాలి. నల్లమలలోని అప్పర్ ప్లాటు అమ్రాబాద్కు నీళ్లిచ్చే బాధ్యత నాది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 192 కేసులు వేసి అడ్డంపడ్డది కాంగ్రెస్ వాళ్లే. 1969 ఉద్యమంలో 400 మందిని పిట్టల్లా కాల్చింది, లక్ష మందిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో మన పొత్తుతో గెలిచి 2014 దాకా పదేళ్లు ఏడిపించారు. వాళ్లు ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు. తప్పనిసరై ఇచ్చారు. వాళ్లకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు, ఇక్కడి ప్రజలపై పెత్తనం కావాలి. పైరవీకారుల పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పైరవీకారుల పార్టీ. వాళ్లకు పాత దళారీలు కావాలి. రైతు బంధుకు సంవత్సరానికి రూ.15 వేల కోట్లు ఇస్తుంటే వాళ్లకు కడుపు మంటగా ఉంది. అందులో రెండు వేల కోట్లయినా తినొద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ దుర్మార్గులను రానిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. రైతు బంధు రాంరాం అవుతుంది. దళితబంధు జైభీం అయిపోతది. కరెంటు కాట గలుస్తది. మళ్లీ మొదటికే వస్తది. కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. 5 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. రాహుల్గాంధీ నుంచి రేవంత్రెడ్డి దాకా అందరూ ధరణిని తీసేస్తాం అంటున్నరు. దీన్ని తమాషాగా తీసుకోవద్దు. రైతుకు అధికారం ఇస్తామంటోంది బీఆర్ఎస్ పార్టీ అయితే.. లాక్కుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ.. మీకు ఏ పార్టీ కావాలి? ఇప్పటిదాకా నావంతు పనిచేశా.. ఇప్పుడు మీదే బాధ్యత. నష్టపోయేది ప్రజలే.. దళితబంధుతో దళితుల బతుకులు బాగుపడుతున్నాయి. మమ్మల్ని గెలిపించకపోతే వ్యక్తిగతంగా పోయేదేం ఉండదు. రెస్ట్ తీసుకుంటాం. కానీ నష్టపోయేది ప్రజలే. తెలంగాణ తెచ్చినవాడిగా చెప్తున్నా. రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ఉండాలో ఆలోచించాలి. మేం ఎన్నికల కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం లేదు. రూ.70, వంద అంటూ అర్థంపర్థం లేకుండా ఇచ్చిన పెన్షన్ను బీఆర్ఎస్ వచ్చాక రూ.వెయ్యికి, తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలవగానే రూ.మూడు వేలలకు పెంచి.. తర్వాత దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలోని 93 కోట్ల రేషన్కార్డు దారులకు రైతు బీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తాం. రేషన్పై సన్నబియ్యం ఇస్తాం. అన్నింటినీ బేరీజు వేసుకొని ఆలోచన చేయాలి’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా.. అచ్చంపేట, వనపర్తి సభల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్ , నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్.. మునుగోడు సభలో మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాయకులు పల్లె రవికుమార్, ఎలిమినేటి సందీప్రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో జరిగిన అచ్చంపేట, వనపర్తి సభల్లో స్థానిక ఎంపీ పి.రాములు పాల్గొనలేదు. దీనితోపాటు వనపర్తి సభలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 119 నియోజకవర్గాల అభ్యర్థులంతా కేసీఆర్లే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కేసీఆర్లే. లేచినోడు, లేవలేనోడూ నాపై పోటీ చేస్తామంటూ బీరాలు పలకటం ఏమిటి? మా పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి కేసీఆర్తో సమానులే. డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి ‘‘నల్లగొండ, మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతాలు. మీ చైతన్యం మూగబోవద్దు. పైసలు పట్టుకొని వచ్చేవాళ్లను, పూటకోపార్టీ మార్చేవాళ్లను నమ్మొద్దు. వాళ్లకో నియమం లేదు. సిద్ధాంతం, నిబద్ధత లేవు. నిన్నొక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ. డబ్బు మదం, అహంకారంతో ప్రజలను కొనగలుతాం అనుకుంటున్నారు. అలాంటి వారికి నల్లగొండ, మునుగోడు చైతన్యం చూపించి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చాం. చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. 100 పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ 50–60 ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్తో ప్రజలు నడుములు వంగి, చనిపోయే వరకు చూశారే తప్ప నివారణ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఫ్లోరైడ్ గోస పోయింది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే డిండి ప్రాజెక్టుకు, శివన్నగూడెంకు నీళ్లు వస్తాయి. ఆ బాధ్యత నాది. ఏడాదిన్నరలో మునుగోడు నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. తొలి నుంచీ ఉద్యమాల్లో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మునుగోడులో గెలిపించాలి. -
నేడు మునుగోడుకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని 10 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తరువాత సభ ప్రారంభం కానుంది. సభకు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ఒక్కో గ్రామం నుంచి 500 మందిని తరలించేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాహనాలను సిద్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా 2022 అక్టోబర్ 30న చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మునుగోడును కడుపులో పెట్టి చూసుకుంటానని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపొందారు. ఇచ్చిన హామీల్లో రోడ్లు, చండూరు రెవెన్యూ డివిజన్, 100 పడకల ఆసుపత్రి వంటి డిమాండ్లు నెరవేరాయి. చౌటుప్పల్ ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోన్లూ దాదాపు రూ.500 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కృష్ణా జలాల విషయంలో న్యాయ వివాదాల కారణంగా సాగునీటి సమస్య అలాగే ఉంది. రిజర్వాయర్ల పనులు పెండింగ్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో మునుగోడు నుంచి మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పోటీ చేయనున్నారు. మునుగోడులో 30 పడకల ఆసుపత్రి, ఇంటర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. దీంతో గురువారం నాటి సభలో సీఎం కేసీఆర్ ఏం హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
ఏ క్షణమైనా మలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగానే.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ.. 55మందితో తొలి జాబితాను ప్రకటించిన విష యం తెలిసిందే. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మలిజాబితాపై జాప్యం జరుగుతూ వచ్చింది. మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గత వారం రెండుసార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తిచేసింది. ఇటీవలే అభ్యర్థుల జాబితాను సీఈసీకి నివేదించింది. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీఈసీ భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్గాంధీ పాల్గొని చర్చించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గెలుపు అవకాశాలు, కుల సమీకరణాలు, సర్వేల ఆధారంగా సుమారు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, వనపర్తి, నారాయణ్ఖేడ్, శేరిలింగంపల్లి, తాండూరు వంటి 15కుపైగా నియోజకవర్గాల్లో ఇద్దరేసి అభ్యర్థులను గుర్తించిన చోట గెలుపు అవకాశాలు, విధేయతను దృష్టిలో పెట్టుకొని సీఈసీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా విడుదల చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం.. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోసం మునుగోడు స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఆయనతోపాటు బీజేపీ నుంచి చేరుతారని భావిస్తున్న మరో ఇద్దరు సీనియర్లకు సంబంధించిన సీట్లనూ పెండింగ్లో పెట్టారు. ఇక సీపీఎం కోరుతున్న మిర్యాలగూడ, వైరా సీట్లపై ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా సీఈసీ సమావేశం జరుగుతున్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం బయట ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు కొందరు నిరసన తెలిపారు. ఇల్లందు సీటును పారాచూట్ నేతలకు కేటాయించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో పాగా వేస్తాం: ఖర్గే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎన్నుకోవడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓటమి ఖాయమని గుర్తించిన బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై దాడులు చేస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నారని ట్వీట్లో ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అన్ని నేరాల్లో భాగస్వాములనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ మూడు పార్టీలకు అబద్ధాలు, దోపిడీ, కమీషన్లు తప్ప తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి వేరే అంశాలేవీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజలతో పంచుకునే అపార ప్రేమాభిమానాలు న్యాయం, సంక్షేమం, ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆ స్థానాలపై మాత్రం పీటముడి పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందని సమాచారం. సూర్యాపేట, తుంగతుర్తి, వరంగల్ (వెస్ట్), నిజామాబాద్ అర్బన్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరకాల, ఎల్బీనగర్ తదితర సీట్లతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారనే అంచనాలున్న స్థానాలపై పీటముడి పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వామపక్షాలతో పొత్తులు ఖాయమే అంటున్నా.. వారికిచ్చే సీట్లపై ఏకాభిప్రాయం రావడం లేదని అంటున్నాయి. సీపీఎం ఆశిస్తున్న పాలేరు, మిర్యాలగూడ స్థానాలను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని పేర్కొంటున్నాయి. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి బలమైన అభ్యర్థులని, ఆ సీట్లను సీపీఎంకు ఇచ్చినా ఓటు బదిలీ జరగక ఇరుపక్షాలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీపీఐ అడుగుతున్న కొత్తగూడెం, చెన్నూరు విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అంటున్నారు. కీలకనేతలపై పోటీ ప్రతిపాదన లేనట్టే! ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరహా ప్రయోగం చేయాలని కాంగ్రెస్ నేతలు తొలుత భావించినా వెనక్కితగ్గినట్టు తెలిసింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై పార్టీ సీనియర్లను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. కామారెడ్డిలో రేవంత్, సిద్దిపేటలో ఉత్తమ్, సిరిసిల్లలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గజ్వేల్లో రాజగోపాల్రెడ్డి ఇలా ఎవరెక్కడ పోటీ చేయాలన్న ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. కానీ ఎక్కువ మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని... ఈ ప్రభావం రెండు స్థానాలపైనా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ముందే బుజ్జగింపులు షురూ! కాంగ్రెస్ అధిష్టానం మలి జాబితా విడుదలకు ముందే అసంతృప్తులను అంచనావేసి చక్కదిద్దే పనిలో పడింది. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో టికెట్ వచ్చే అవకాశం లేని వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ అంశంపై బుధవారం రాత్రి భేటీ అయి చర్చించినట్టు తెలిసింది. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని పక్కాగా హామీ ఇవ్వాలని.. రెబెల్ అభ్యర్థులు లేకుండా చూసుకుంటూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవీ లేవన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆశావహులతో ఫోన్లో మాట్లాడటం లేదా సీనియర్ నేతలను పంపి బుజ్జగించడం, ఢిల్లీకి పిలిపించుకుని హామీ ఇవ్వడం వంటి మార్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై వేణుగోపాల్, రేవంత్ చర్చించినట్టు తెలిసింది. కాగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ పెద్దలు.. ఆ సీటును ఆశిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్ను బుజ్జగించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మహేశ్గౌడ్ను కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. -
‘కేసీఆర్ భరోసా’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 17 అంశాలతో ‘కేసీఆర్ భరోసా’పేరిట జనంలోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 11 పర్యాయాలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేశారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గద్దల పాలు చేయొద్దని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో పురోగమిస్తున్న రాష్ట్రాన్ని దగుల్బాజీ, దొంగల పార్టీ అయిన కాంగ్రెస్ చేతిలో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడో ప్రజలకు దూరమైంది కాంగ్రెస్ పార్టీని ఎవరూ సొంతం చేసుకోరని, ఆ పార్టీ ఎప్పుడో ప్రజలకు దూరమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలను పదే పదే మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని, ‘అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట’అనే రీతిలో కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమయ్యిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సాగు, తాగునీరు సమస్యలతో పాటు విద్యుత్ కష్టాలు తీరాయని చెప్పారు. తెలంగాణ పార్టీగా బీఆర్ఎస్ కులమతాలకు అతీతంగా ప్రతి మనిషి, ప్రతి ఇంటి పార్టీగా మారిందని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా’ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.16 వేలు, రైతు బీమా, దివ్యాంగులు, ఆసరా పింఛన్ పెంపు, అన్నపూర్ణ ద్వారా సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు జీవన భృతి, అసైన్డ్ భూములపై హక్కులు, జాబ్ క్యాలెండర్, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి అంశాలను కేసీఆర్ భరోసా పేరిట ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. పదవులు కాదు.. గుర్తింపును ఇవ్వండి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో గతంలో కేసీఆర్ వెంట నడిచామని, కొన్ని రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరినా అక్కడ ఇమడలేక పోయామని పెద్దపల్లి నేత సి.సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ చిత్తశుద్ధి చూసి మళ్లీ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. తమకు పదవుల కంటే గుర్తింపు ముఖ్యమని అన్నారు. పెద్దపల్లి నేత గుర్రాల మల్లేశం, మహబూబ్నగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
27న సూర్యాపేట ఎన్నికల సభకు అమిత్షా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. సభ ముగిశాక నగరంలో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను అమిత్షా ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడనున్నట్టు తెలిసింది. అప్పటికి అభ్యర్థుల రెండోజాబితా కూడా వెలువడే అవకాశాలున్నందున 28వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడం, ప్రస్తావించాల్సిన విషయాలు, ప్రచార శైలి తదితర అంశాలపై ఆయన స్పష్టతనివ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీపరంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సూచనలు చేయనున్నారు. కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. అయితే వారు పాల్గొనే ప్రచార సభ లు, రోడ్షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మళ్లీ రాష్ట్రానికి రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. రెండో విడత బస్సు యాత్రను ఆయన వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రాహుల్గాంధీ ఎక్కడ పాల్గొంటారనేది ఖరారు కావాల్సి ఉందన్నాయి. మొదటి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించిన రాహుల్ ఈసారి దక్షిణ తెలంగాణలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రియాంకాగాంధీ ఈనెల 31న కొల్లాపూర్లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు. ఆ రోజున సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్లి కొల్లాపూర్ సభలో పాల్గొంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర నేతలు మొదటి విడత బస్సు యాత్రను ఈనెల 26, 27 తేదీల్లో కొనసాగించేలా పార్టీ షెడ్యూల్ రూపొందించింది. ఈ రెండు రోజుల్లో మాణిక్రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్తోపాటు మొత్తం 10 మంది నాయకులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో గడప గడపకూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాల కార్డులను పంపిణీ చేయడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసే సభల్లో కూడా నేతలు పాల్గొననున్నారు. సీఈసీ నిర్ణయమే ఫైనల్: మహేశ్కుమార్గౌడ్ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమవుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన గాందీభవన్లో మంగళవారం విలేకరులకు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానాలను మైనార్టీ నేతలు అడుగుతున్నారని, పార్టీ కూడా మైనార్టీలకు న్యాయం చేస్తుందని చెప్పారు. తాను ఆశిస్తున్న నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం మహేశ్కుమార్గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరగనున్న సీఈసీ సమావేశానికి అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగానే ఉన్నా ఆయనకు మైనార్టీ సెగ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఇదే స్థానం తనకు కేటాయించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా గట్టిగా పట్టుపడుతుండటం, అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
బీజేపీకి బిగ్ ఝలక్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో సద్దుమణిగిందని అనుకుంటున్న అసంతృప్తి మళ్లీ రాజుకుందా? అంటే.. తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తుండగా, మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో.. కొందరు కీలక నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నేడో, రేపో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఆయన బాటలో నడవనున్నారని తెలిసింది. కాంగ్రెస్ సంప్రదింపులతో సుముఖత! కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమైన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజ్గోపాల్రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి జాబితాలో తనకు (ఎల్బీనగర్), తన భార్య లక్ష్మికి (మునుగోడు) టికెట్లను రాజ్గోపాల్రెడ్డి ఆశించారు. కానీ నాయకత్వం ప్రకటించిన జాబితాలో ఆ స్థానాలతో పాటు వీరి పేర్లు చోటు చేసుకోలేదు. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు మాత్రం రెండు సీట్లలో (హుజూరాబాద్, గజ్వేల్) పోటీకి అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. రాజగోపాల్ కూడా సానుకూలంగా స్పందించారని, బుధవారం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇదే బాటలో మరికొందరు! రాజగోపాల్రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వీరిలో గతంలో రెండుసార్లు ఎంపీగా ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నేత అసెంబ్లీకి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినా బరిలో నిలవాల్సిందేనని నాయకత్వం ఒత్తిడి తేవడంతో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మాజీ ఎంపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచి కేంద్రమంత్రి కావాలని కోరుకుంటున్నారే తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని ఆయన సన్నిహితుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు తనకు పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన విజయావకాశాలపై సర్వేలు చేయించుకున్న ఆయనకు ఎక్కడా సానుకూల వాతావరణం కన్పించక పోవడంతో పార్టీనే వీడాలనే ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. కొంత కాలంగా నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న మరో మహిళా నేత కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొందరు సైతం ఎన్నికలకు ముందు బీజేపీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇలావుండగా ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితా విడుదలలో జాప్యం చేయడం.. బీజేపీ నుంచి వచ్చే నేతల కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. తొలి జాబితాపై అసంతృప్తే రాజుకుంటోందా? తొలి జాబితాలో రాజగోపాల్రెడ్డితో పాటు కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలకు టికెట్లను ఖరారు చేయకపోవడం, పార్టీ బలంగా ఉన్న సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన వారికి సీట్లివ్వడం లాంటి అంశాలు బీజేపీ నేతల్లో అసంతృప్తికి కారణమౌతున్నాయి. మొత్తంగా బీసీ వర్గాలకు 19 సీట్లు కేటాయించినా వాటిలో కొన్ని ప్రాధాన్యత లేనివి ఇచ్చారనే అసంతృప్తి ఉన్నట్టు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అత్యధిక సీట్లు రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడం, కొంతకాలంగా టికెట్ను ఆశిస్తూ ఆయా నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులకు టికెట్ నిరాకరించడం, కనీసం వారిని పిలిచి పరిస్థితిని వివరించి, బుజ్జగించే పరిస్థితి లేకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నట్టు తెలిసింది. హిందుత్వవాదం బలంగా ఉన్న నిర్మల్ జిల్లాలోని ఓ సీటును పార్టీలో చేరేదాకా ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఒకరికి ఇవ్వడంపై స్థానిక నేతల్లో అంతర్మథనం సాగుతున్నట్టు సమాచారం. ఇక ముధోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన రమాదేవి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరోనేత మోహన్రావు పాటిల్ కూడా టికెట్ కోరుకున్నా రాలేదు. వరంగల్ (పశ్చిమ) టికెట్ను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డికి కాకుండా రావు పద్మకు ఇచ్చినా, కనీసం పిలిపించి మాట్లాడకపోవడంతో ఆయన రెబెల్గా పోటీకి సిద్ధమౌతున్నట్టు తెలిసింది. జనగామ నుంచి జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డికి అవకాశం కల్పించినా, అక్కడ టికెట్ కోరుకున్న బీరప్ప, మరో ఇద్దరు నేతలకు ఈ విషయాన్ని తెలియజేసి బుజ్జగించే ప్రయత్నం చేయపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను సిరిసిల్లలో కేటీఆర్పై పోటీకి దింపడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేపు రెండో జాబితా? బీజేపీ రెండో జాబితాను గురువారం ఢిల్లీలో జాతీయ నాయకత్వం ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం. ఈ మేరకు 26న జరగనున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను ప్రకటించగా..మిగిలిన 67 సీట్లకు ఒకటి లేదా రెండు జాబితాలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలావుండగా తొలి జాబితాలో పార్టీ టికెట్లు దక్కించుకున్నవారు ఈ 28న మంచిరోజు కావడంతో అప్పటి నుంచి ప్రచారం ప్రారంభించాలని నాయకత్వం సూచించింది. ఈలోగా నామినేషన్ దాఖలుకు సంబంధించిన డాక్యుమెంట్లు, అఫిడవిట్లు, ఇతరత్రా సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. -
కాళేశ్వరంతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద చిల్లుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ఇంజనీర్లు తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈరోజు ఆ అనుమానాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ బృందం వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజాసింగ్లతో కలసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరచుకున్నారు. మూడేళ్లలో ప్రాజె క్టు కుంగడం నిజంగా ఇంజనీరింగ్ అద్భు తమే. కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివి, సూపర్ ఇంజనీర్ అవతారమెత్తి, ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు. అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు పంపుహౌజ్లు మునిగి భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతోంది. లోపాలన్నీ బయటపడుతున్నాయి’’అని కిషన్రెడ్డి విమర్శించారు. ఏటా 400 టీఎంసీలు ఎత్తిపోసి రైతులకు ఇస్తామన్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు, ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై తక్షణమే డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశామని కిషన్రెడ్డి చెప్పారు. దసరా తర్వాత రెండో జాబితా విడుదలవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులూ పర్యటించారని తెలిపారు. 27న మరోసారి రాష్ట్రానికి అమిత్షా రానున్నారని, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తారని వెల్లడించారు. దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకుంటామని చెప్పారు. నేతలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. కొన్నిరోజులుగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పాలక పార్టీ ఒత్తిడికి అధికారులు తలొగ్గవద్దని కోరారు. -
బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఆ పార్టీ ఆశావహుల్లో రెండు, మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించింది. 52 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందే చెప్పినట్లు అత్యధికంగా బీసీలకు 19 స్థానాల్లో అవకాశం కల్పించింది. రెడ్డి 12, వెలమ 5, ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వైశ్యులు 1, ఉత్తరాది అగర్వాల్ (లోధి)వర్గానికి చెందిన ఒకరికి చోటు లభించింది. మొత్తంగా 12 మంది మహిళలకు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలు కలుపుకుని) అవకాశం కల్పించింది. ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (కోరుట్ల), సోయం బాపూరావు (బోథ్)లను అసెంబ్లీ బరిలోకి దించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్పై ఆదివారం సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈసారి కూడా గోషామహల్ సీటునే ఇచ్చారు. ఎమ్మెల్యే రఘునందన్రావు మరోసారి దుబ్బాక నుంచి బరిలో నిలిచారు. అధికార బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (సిరిసిల్ల)పై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమను పోటీకి దింపారు. కాగా కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, మరో ఎంపీ కె.లక్ష్మణ్లకు మొదటి జాబితాలో చోటు కల్పించలేదు. నెలాఖరులోగా రెండు లేదా మూడు జాబితాల్లో మిగతా 67 సీట్లకు అభ్యర్థులు ఖరారు కావొచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాలతో ఉమ్మడి జిల్లాలు అన్నీ కవర్ అయ్యేలా (పాతబస్తీ, పార్టీకి అంతగా బలం లేని ఇతర చోట్ల కలిపి), బీసీలు, మహిళలు, రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు సీట్లు ఖరారు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో మాదిరిగా ఇక్కడ కూడా.. గతంలో పార్టీ అభ్యర్థులు 3, 4 స్థానాల్లో నిలిచిన పలు స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. తొలి జాబితాలో పార్టీకి చెందిన పలువురు సీనియర్లకు కూడా కోటు దక్కలేదు. కిషన్రెడ్డి, లక్ష్మణ్ దూరం! తొలి జాబితాలో లేని అంబర్పేట, మునుగోడు, గద్వాల, ముషీరాబాద్, మహబూబ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర స్థానాల్లో ఎవరికి టికెట్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అంబర్పేట నుంచి కిషన్రెడ్డి పోటీ చేస్తారో లేదో చర్చనీయాంశంగా మారింది. కిషన్రెడ్డితో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (ముషీరాబాద్) పోటీకి దూరంగా ఉంటామని జాతీయ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. దీంతో అంబర్పేటలో కిషన్రెడ్డి భార్య కావ్యారెడ్డి లేదా నగర సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్.గౌతమ్రావు బరిలో నిలుస్తారా? మరో బీసీ నేతకు అవకాశం ఇస్తారా? వేచి చూడాల్సి ఉంది. అయితే తాను అంబర్పేట నుంచి పోటీ చేయాలా వద్దా? అన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అది పార్టీ అంతర్గత వ్యవహారమని కిషన్రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఇక ముషీరాబాద్ నుంచి హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మునుగోడు, ఎల్బీనగర్ల నుంచి కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఆయన సతీమణి పోటీ చేయాలని భావిస్తున్నారు. గద్వాల నుంచి పోటీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, మహబూబ్నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి సిద్ధమైనా మొదటి జాబితాలో ఈ సీట్లు ఖరారు చేయలేదు. బలం లేని చోట్ల బీసీలకు? బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించినా పార్టీ బలంగా లేని పాతబస్తీ, ఇతర చోట్ల ఇచ్చారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్డి కులస్తులకు ఎక్కువ సీట్లు కేటాయించారని, అయితే బీసీలకు తగిన ప్రాధాన్యత లేని నియోజకవర్గాల్లో ఇచ్చారని అంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా లాంటి సీట్లు బీసీలకు ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. జనగామలో బలమైన నేత బీరప్పకు ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే ఈ వాదనను ఇతర నేతలు ఖండిస్తున్నారు. బీసీలకు సంబంధించి పలువురికి గెలిచే సీట్లు, పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే అవకాశం కల్పించారని అంటున్నారు. పార్టీ బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పలు సీట్లు బీసీలకు కేటాయించడం వారికి పెద్దపీట వేసినట్టేనని వివరిస్తున్నారు. ఇక వరంగల్ పశ్చిమ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఏనుగుల రాకేశ్రెడ్డి రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. మరోవైపు తనతో పాటు బీజేపీలోకి వచ్చిన కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు వేములవాడ టికెట్ ఇవ్వకపోతే తాను కూడా పోటీకి దూరంగా ఉంటానని ఈటల పేర్కొనడంతో ఆ నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. ‘జనసేన’పై నిర్ణయం తీసుకోలేదు: కిషన్రెడ్డి ఈ ఎన్నికల్లో జనసేనతోనూ సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందనే నాయకత్వం సంకేతాలిస్తోంది. జనసేన 12 సీట్లు కోరుతోందని, హైదరాబాద్లో ఒకటి, మరో రెండు సీట్లు రాష్ట్రంలోని ఇతర చోట్ల ఇవ్వాల్సి ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో జనసేనకు గుర్తింపు లేకపోవడంతో పాటు నాయకులు, కేడర్ లేని పరిస్థితుల్లో ఆ పార్టీకి రెండు, మూడు సీట్లు ఇచ్చినా తమకు నష్టమేనని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. కాగా జనసేనతో పొత్తుపై ప్రాథమికంగా చర్చించామని, అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్రెడ్డి మీడియాకు వెల్లడించారు. సామాజికవర్గాల వారీగా.. – 19 మంది బీసీలలో మున్నూరు కాపు–2, ముదిరాజ్–3, యాదవ్–3, గౌడ్–3, విశ్వకర్మ–1, పద్మశాలి–1, పెరిక–2, అరే కటిక–1, అరే మరాఠా–1, లోధా–2 ఉన్నారు. – 19 ఓసీలలో 12 మంది రెడ్డి, 5 వెలమ, ఒక వైశ్య, ఒక నార్త్ ఇండియన్ అగర్వాల్ ఉన్నారు. – 8 మంది ఎస్సీలలో ఒకరు బైండ్ల, 5 మాదిగ, 2 మాల ఉన్నారు. – 6 మంది ఎస్టీల్లో 4 లంబాడా, ఒక కోయ ఒక గోండు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా.. తొలి జాబితాలో ఎక్కువగా ఉత్తర తెలంగాణ పరిధిలోని నియోకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమౌతోంది. హైదరాబాద్ పరిధిలో 7 నియోజకవర్గాలు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తొమ్మిది చొప్పున స్థానాలు, ఆదిలాబాద్లోని 7, నిజామాబాద్లోని 5, నల్లగొండ, మెదక్లోని నాలుగేసి చొప్పున, రంగారెడ్డిలో 3, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లోని రెండేసి చొప్పున నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల జాబితా: 1) సిర్పూర్ – డా.పాల్వాయి హరీశ్ బాబు 2) బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి 3) ఖానాపూర్ (ఎస్టీ) – రమేష్ రాథోడ్ 4) ఆదిలాబాద్– పాయల్ శంకర్ 5) బోథ్(ఎస్టీ) – సోయం బాపూరావు 6) నిర్మల్– ఏలేటి మహేశ్వర్ రెడ్డి 7) ముధోల్–రామారావు పటేల్ 8) ఆర్మూర్– పైడి రాకేష్ రెడ్డి 9) జుక్కల్ (ఎస్సీ) – టి.అరుణతార 10) కామారెడ్డి– కె.వెంకటరమణా రెడ్డి 11) నిజామాబాద్ అర్బన్– ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 12) బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ 13) కోరుట్ల – ధర్మపురి అర్వింద్ 14) జగిత్యాల– డా.భోగా శ్రావణి 15) ధర్మపురి (ఎస్సీ)– ఎస్.కుమార్ 16) రామగుండం– కందుల సంధ్యారాణి 17) కరీంనగర్ – బండి సంజయ్ కుమార్ 18) చొప్పదండి (ఎస్సీ)– బొడిగ శోభ 19) సిరిసిల్ల– రాణి రుద్రమరెడ్డి 20) మానకొండూరు (ఎస్సీ)– ఆరెపల్లి మోహన్ 21) హుజూరాబాద్›– ఈటల రాజేందర్ 22) నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్ 23) పటాన్చెరు –టి.నందీశ్వర్ గౌడ్ 24) దుబ్బాక – మాధవనేని రఘునందన్ రావు 25) గజ్వేల్ – ఈటల రాజేందర్ 26) కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్ 27) ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్ 28) మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్ 29) ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి 30) కార్వాన్ – అమర్సింగ్ 31) గోషామహల్ – టి.రాజాసింగ్ 32) చార్మినార్ – మేఘారాణి 33) చాంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్ 34) యాకుత్పురా – వీరేందర్ యాదవ్ 35) బహదూర్పురా – వై.నరేశ్ కుమార్ 36) కల్వకుర్తి – తల్లోజు ఆచారి 37) కొల్లాపూర్ – ఎ.సుధాకర్ రావు 38) నాగార్జున సాగర్ – కె.నివేదితా రెడ్డి 39) సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు 40) భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి 41) తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య 42) జనగాం – డా.ఆరుట్ల దశమంత్ రెడ్డి 43) స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) – డా.గుండె విజయ రామారావు 44) పాలకుర్తి – లేగ రామ్మోహన్ రెడ్డి 45) డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత 46) మహబూబాబాద్ (ఎస్టీ) – జాథోత్ హుస్సేన్ నాయక్ 47) వరంగల్ పశ్చిమ – రావు పద్మ 48) వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు 49) వర్ధన్నపేట (ఎస్సీ)– కొండేటి శ్రీధర్ 50) భూపాలపల్లి– చందుపట్ల కీర్తి రెడ్డి 51) ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్ 52) భద్రాచలం (ఎస్టీ) – కుంజా ధర్మారావు -
31న కాంగ్రెస్ పాలమూరు ప్రజాభేరి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక సందర్భంలోనే ప్రియాంకా గాందీతో కొల్లాపూర్లో సభ ఏర్పాటు చేయించాలని భావించినా అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆమెతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సభ ఏర్పాట్లపై హైదరాబాద్లోని మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్రావు, ప్రతాప్గౌడ్, విజయభాస్కర్రెడ్డి ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా రవి, జూపల్లి, జగదీశ్వరరావు మాట్లాడుతూ పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈ ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. -
సోషల్ మీడియాలో హోరెత్తించండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రసార, సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు. ఓట ర్లను ప్రభావితం చేయడంలో సామాజిక మాధ్య మాల పాత్రను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచార వ్యూహం రూపొందించుకోవాలన్నారు. ఆదివారం హైదరాబాద్లోని జల విహార్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య ప్రచారకర్తలు, వార్ రూమ్ ఇన్చార్జిల సమావేశం జరిగింది. కేటీఆర్తో పాటు మంత్రి హరీశ్రావు హాజరై ఎన్నికల ప్రచారం, సమన్వయం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి నియోజక వర్గానికి వార్ రూమ్తో పాటు పర్యవేక్షణకు సెంట్రల్ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ వార్ రూమ్లలో 380 మందికి పైగా పాలుపంచుకుంటున్నారన్నారు. సెంట్రల్ వార్ రూమ్ ద్వారా అందే సూచనలు, ఆదేశాలను క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా ఇన్చార్జిలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటివి వాడండి 2014 ఎన్నికల తర్వాత సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిందని, మోదీ కూడా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రధాని స్థాయికి ఎదిగారని కేటీఆర్ చెప్పారు. వాట్సాప్తో పాటు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాలను ప్రచార వేదికలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలు, చేసే విమర్శలపై స్థానికంగా ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. మేనిఫెస్టోపై విమర్శలను తిప్పికొట్టడంతో పాటు అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు కొత్తరకం ఎన్నికల ప్రచార విధానాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ గుర్తును డీపీగా పెట్టుకోవడంతో పాటు చొక్కాలపై గుర్తును ధరించాలని సూచించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలతో బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: హరీశ్రావు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ నేతలు, కేడర్ కష్ట పడాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అవసరమైన సందర్భాల్లో పార్టీ నేతలు బాధ్యతలు అప్పగించిన చోట నిద్రించాలన్నారు. ప్రతి గడపను చేరుకునేలా ప్రచారం జరగాలని చెప్పారు. -
గురితప్పిన రాహుల్జీ బాణాలు
కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సభలకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగుందని కాంగ్రెస్ వర్గాలు సంబర పడ్డాయి. అంతా బాగానే ఉంది గానీ, ఒక ముఖ్యమైన లోపం మాత్రం కన బడింది. మత్స్య యంత్రాన్ని కొట్టడానికి ఒక నియమం ఉన్నది. ఆ యంత్రం పైన గిరగిరా తిరుగుతుంటే కింద నీటిలో దాని నీడను చూసి పైనున్న చేపను కొట్టాలి. రాహుల్ పద్ధతి ఇందుకు విరుద్ధంగా కనిపించింది. ఆయన పైనున్న చేప వంక చూస్తూ నీటిలోని దాని నీడపైకి బాణాన్ని ఎక్కుపెట్టారు. ఆ బాణాన్ని వదిలితే ఏమవుతుంది? నీళ్లు కదులుతాయి గనుక కాసేపు నీడ కనిపించదు. చేప మాత్రం నిక్షేపంగా తిరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే అసలు ఇవ్వాల్సిన ముఖ్యమైన గ్యారంటీని విస్మరించినట్టు బోధపడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పైనా, బీఆర్ఎస్ పైనా ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన పొలికటికల్ నరేటివ్ లేదా రాజకీయ భాషణ అప్డేట్ అయినట్టు కనిపించడం లేదు. రాజకీయాల్లో గెలవాలంటే ఈ భాషణే ముఖ్యం. ఆ భాషణ కొత్త భావాలతో కూర్చి ఉండాలి. జనాన్ని ఉత్తేజ పరిచేదిగా ఉండాలి. వారికి ఊరటనిచ్చేదిగా ఉండాలి. ఈ మూడు రోజుల రాహుల్ ప్రసంగాల్లోని భాషణ కంటే, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల భాషణే మెరుగ్గా కనిపిస్తున్నది. వాళ్లలో రాజకీయ స్పష్టత ఉన్నది. వారి భాషణ కూడా అందుకు అనుగుణంగా ఉన్నది. ఆర్థికాభివృద్ధిలోనూ, సంక్షేమ రంగంలోనూ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలన ఒక విజయగాథగా గణాంకాల ఆధారంతో వారు చెప్పుకొస్తున్నారు. ఈ జైత్రయాత్రను కొనసాగిద్దామని సూటిగా సుత్తి లేకుండా, వారు సందేశాన్నివ్వగలిగారు. పరిపాలనా రథం జైత్రయాత్ర సాగించాలంటే రాజకీయ సుస్థిరత అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మైనస్ మార్కులు పడేది ఇక్కడే. వారు చెబుతున్న ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కూడా రాజకీయ సుస్థిరత అనే ప్రధానమైన గ్యారంటీ అత్యంత అవసరం. ఈ గ్యారంటీని ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని దాని ట్రాక్ రిపోర్టే కుండబద్దలు కొట్టి చెబుతున్నది. 2004 ఎన్నికల నాటికే రాష్ట్ర కాంగ్రెస్లో తిరుగులేని నేతగా ఎదిగిన వై.ఎస్. రాజశేఖర్రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ రాజకీయ సుస్థిరతను సాధించగలిగింది. ఫలితంగానే అభివృద్ధి – సంక్షేమాల్లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి 2009 ఎన్నికల్లో కూడా గెలవగలిగింది. ఈ ఒక్క ఛాప్టర్ను మూసేస్తే కాంగ్రెస్ కథలో మిగిలిన భాగాలన్నీ కుమ్ములాటల కథలే! కాంగ్రెస్ కీచులాటల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చి అధికారం చేపట్టిన ఉదంతం తెలిసిన విష యమే. 1978–83 మధ్యకాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారడం, పాలన అట కెక్కడం మూలంగా జనం మార్పు కోరు కున్నారు. 1989లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కథ పునరావృతమైంది. ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మార్చకపోయిన ట్లయితే సైబర్ టవర్స్ (హైటెక్ సిటీ)కి శంకు స్థాపన చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని పూర్తిచేసి ఉండేది. చంద్రబాబు డప్పు వాయించుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దురదృష్టవశాత్తు నాలుగు నెలల్లోనే చనిపోయారు. కాంగ్రెస్ అసలు కథ మళ్లీ మొదలైంది. ఏడాదిపాటు సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి కిరణ్కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో మార్పు జరగకపోవడానికి కారణం పార్టీలో వచ్చిన ఐక్యత కాదు. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతం కావడం, రాష్ట్ర విభజన అనివార్యమని తేలడంతో ఆ పదవికి ఎవరూ పోటీపడలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండుసార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రజలు కాంగ్రెస్కు కట్టబెట్టారు. ఆ బాధ్యత నిర్వహణలో కూడా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొదటిసారి 21 మందిని గెలిపిస్తే చివరకు 10 మంది మిగిలారు. రెండోసారి 19 మందిని గెలిపిస్తే ఐదుగురు మిగిలారు. అధికారం అప్పజెప్పినప్పుడు కొట్లాడుకుని పరిపాలనను పడకే యించారు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే సంత బేరాలకు లొంగిపోయారు. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు ప్రజలు ఓటేయాలి? రాజకీయ సుస్థిరతను అందిస్తామనే గ్యారంటీ కదా కాంగ్రెస్ పార్టీ నుంచి జనం ఆశించేది? ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో కనీసం డజన్ మంది ముఖ్యమంత్రి పదవి ఆశావహులున్నారు. ఓ ఆరేడు మందయితే గట్టి పట్టుదలతో పోటీలో ఉన్నట్టు సమా చారం. ఇటువంటి పరిస్థితిలో రాజకీయ సుస్థిరతను ఎలా ఆశించాలి! తెలంగాణ రాష్ట్ర పురోగతికి రాజకీయ సుస్థిరత ప్రాణాధారం. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. గడిచిన పదేళ్లలోనే ఐదు లక్షలమందికి ఐటీ రంగంలో ఉద్యో గాలిచ్చిన నగరం. ఫార్మా తదితర రంగాల్లో ఇంకో ఆరేడు లక్షలమందికి కొత్తగా ఉపాధినిచ్చింది. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్న లక్షలాది మంది పేద కార్మికులకు కడుపు నింపుతున్న నగరం. రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం ఉపాధి రంగం మీద పడుతుంది. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువతీ యువకులు ఐటీ కారిడార్లో ప్రదర్శన చేసినప్పుడు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఉలికిపడింది ఇందుకే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా ఉపాధి రంగాన్ని ఆందోళనలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఇవ్వాల్సిన అసలైన గ్యారంటీ రాజకీయ సుస్థిరత. దాని ట్రాక్ రికార్డ్ దృష్ట్యా నామ్కే వాస్తే హామీ ఇస్తే జనం నమ్మరు. జనాన్ని నమ్మించడానికి ఏం చేయాలో ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆరు గ్యారంటీల గురించి జనం ఆలోచిస్తారు. ఈ ఆరు గ్యారంటీల్లో కొన్ని పాత పథకాలే. వేలంపాటలో పెంచినట్టు కేటాయింపులను కొంచెం పెంచి కొత్త పథకాలుగా స్టాంప్ వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ‘విద్యావికాసం’ అనే కొత్త పేరు పెట్టారు. గృహిణులకు 2,500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించిన విధానాలను అధికారంలోకి వస్తే అప్పుడు తయారు చేస్తారట! కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్న ఈ పథకం అక్కడే ఇంకా బాలారిష్టాలను దాటలేదు.రాజకీయ సుస్థిరత అనే గ్యారంటీ ఇవ్వలేని పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలకైనా... పన్నెండు గ్యారంటీలకైనా విలువ లేదు. గురితప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం దాని రాజకీయ భాషణ. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిత్యం చేస్తున్న విమర్శలనే ఈ మూడు రోజుల్లో రాహుల్ గాంధీ వల్లెవేశారు. ‘కాళేశ్వరం’లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. కుటుంబ పెత్తనం నడుస్తున్నది. ‘ధరణి’ పేరుతో వేలాది ఎకరాలు కబ్జా పెడుతున్నారు. ‘దొరల తెలంగాణ’గా మార్చారు. సామాజిక న్యాయం కరువైంది. బీఆర్ఎస్ బీ–టీమ్గా బీజేపీ పనిచేస్తున్నది. వగైరా వగైరా. వీటిలో కొన్ని ఆరోపణలు 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ కూటమి ప్రజల ముందుంచింది. అయినా ఆ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగలిగింది. ఇప్పుడు మరోసారి చైనా యుద్ధ కాలం నాటి త్రీ నాట్ త్రీ రైఫిళ్లను, డబ్బా ట్యాంకులను తీసుకొచ్చి కాల్పులు జరుపుతున్నారు. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీకి బాగా నచ్చిన మాట... దొరల తెలంగాణకూ, ప్రజల తెలంగాణకూ మధ్య పోరాటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గర్నుంచి రాహుల్ కాపీ కొట్టినట్టున్నారు. రాష్ట్రంలో పేదలకూ, పెత్తందార్లకూ మధ్యన యుద్ధం జరుగుతున్నదని జగన్ మోహన్రెడ్డి పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందుకు అక్కడ సహేతుకమైన కారణం ఉన్నది. ప్రాతిపదిక ఉన్నది. పేదల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అక్కడి పెత్తందారీ శక్తులు తెలుగుదేశం రాజకీయ కూటమి రూపంలో అడ్డుకుంటున్నారు. యెల్లో మీడియా రూపంలో అడ్డుకుంటున్నారు. రకరకాల వేదికల పేర్లతో అడ్డుకుంటున్నారు. కేవలం రాజకీయ విమర్శలతోనే ఆటంకాలు సృష్టించలేదు. కోర్టు మెట్లెక్కి మరీ అడ్డుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించినా, సర్కారు బళ్ల ప్రమాణాలను పెంచినా, ప్రజల ఇంటి ముంగి టకు పరిపాలనను చేర్చినా, ధర్మాసుపత్రుల నాణ్యతను పెంచినా, ఊరూరా ‘రైతు భరోసా కేంద్రాల’ను తెరిచినా, 30 లక్షలమంది మహిళలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టినా సహించలేకపోయారు. వీటన్నింటి మీద కేసులు వేశారు. ఈ నేపథ్యంలో జనాన్ని జాగృతం చేయడం కోసం జరుగు తున్న కుట్రలను విడమర్చి చెప్పడం కోసం జగన్మోహన్రెడ్డి ఆ నినాదాన్ని అందుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో దొరలకు మేలు చేస్తున్నవేమిటి? పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలేమిటి? ఆ పార్టీ దగ్గర ఉన్న పీడిత ప్రజల సాధికారతా కార్యక్రమం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో దొరలు మాత్రమే లబ్ధి పొంది అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటు న్నారా? పేద కుటుంబాలకు ఈ పథకం దక్కడం లేదా? పద్దెనిమిది వందలకు పైగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలు – కళా శాలల్లో ఏడున్నర లక్షలమంది దొరల బిడ్డలే నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారా? ఇటు వంటి గణాంకాలేవో ఉండాలి కదా విమర్శ చేయడానికి! అందుకు తగిన ప్రాతిపదికను చూపెట్టాలి గదా. అప్పుడే ఆ నినాదాన్ని జనం అందిపుచ్చుకుంటారు. అంతే తప్ప పదాలు బలంగా ఉన్నాయి, వాక్యం బరువుగా ఉందని ముచ్చటపడి ఔత్సాహిక కవిలా ఉత్సాహ పడితే రాజకీయాల్లో అభాసుపాలవుతారు సుమా! ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భూస్వామ్య కులంలో పుట్టాడు కనుక ఆయనది దొరల పాలన అనడం ఆమోదయోగ్యం కాదు. నిజమే, ఉత్తర తెలంగాణలోని భూస్వామ్య కులం వారు ఎక్కువమంది బీఆర్ఎస్లోనే ఉన్నారు. అట్లానే దక్షిణ తెలంగాణ భూస్వామ్య కుటుంబాల వారు ఎక్కువమంది కాంగ్రెస్లో ఉన్నారు. నాయకుల పుట్టుక కారణంగా వారు దొరల పక్షమా, పేదల పక్షమా అని నిర్ధారించగలమా? తెలుగునాట దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించినవారెవరు? పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చెన్నమనేని రాజేశ్వరరావు... వీరంతా భూస్వాముల బిడ్డలే కదా? గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవం. ఇందుకు కర్ణాటక ఫలితాలు కొంత దోహదపడ్డాయి. వ్యూహాలు సవరించుకొని బీజేపీ బలం పుంజుకోకపోతే అది కాంగ్రెస్కు మరింత మేలు చేస్తుంది. కొన్ని సీట్లు పెరగొచ్చు, కానీ పరిణామాలు కొంత భిన్నంగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు కనిపించిన వాపును బలుపుగా భ్రమిస్తే కాంగ్రెస్కు మరోసారి భంగపాటు తప్పదు. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్ బలంగా పోటీలో నిలబడాలంటే రెండు షరతులు – 1. రాజకీయ సుస్థిరతను ఇవ్వగలమన్న భరోసాను కల్పించాలి. 2. కాలాను గుణమైన, తెలంగాణ అభివృద్ధికి ఆలంబన కాగల రాజకీయ ఎజెండాను జనం ముందుంచాలి. కర్ణాటక మేనిఫెస్టో తారక మంత్రం కాదు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎడతెగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది. వారు వెంటనే ప్రచార కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. మిగతా అభ్యర్థులకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి.. ఆదివారం సాయంత్రానికి 55 మంది పేర్లతో అధికారికంగా తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. తొలి జాబితా దాదాపు ఖరారైనా జాప్యం కావడం వెనుక.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంగా పునరాలోచన చేయడం, కొందరు అటూ, ఇటూ మారే అవకాశం ఉండటమే కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ రెండో జాబితా వెలువడితే.. అవకాశం దక్కనివారు బీజేపీ వైపు చూడవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయని అంటున్నాయి. అభ్యర్థులు, సీట్ల మార్పుతో.. అధికార బీఆర్ఎస్ నెలన్నర ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు చాలా మందికి బీ ఫారాలు కూడా అందజేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసి, మిగతా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి అభ్యర్థులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఈ నెల 15 లేదా 16న తొలి జాబితా ఉంటుందని ముఖ్యనేతలు ప్రకటించినా విడుదల చేయలేదు. శనివారానికి దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇందులోని దాదాపు 15 వరకు స్థానాల్లో అభ్యర్థుల మార్పు, నేతలు పోటీకి సుముఖత వ్యక్తం చేయని చోట్ల ఇతరులను ఎంపిక చేయాల్సి రావడంతో ప్రకటన ఆగిపోయినట్టు తెలిసింది. ఫోన్ చేసి సమాచారమిస్తూ.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం. సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అభ్యర్థుల తీరు ఎలా ఉంది? ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు (కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ మినహా), ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావులకు తొలి జాబితాలోనే అవకాశం కల్పించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్తోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ రెండు చోట్లా ఈటల రాజేందర్ను బరిలోకి దింపుతున్నట్టు సమాచారం. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసి, ఆయనకు అదే స్థానంలో పోటీ చేసే అవకాశంపై ఢిల్లీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. మరోవైపు చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ధర్మపురి నుంచి ఎస్.కుమార్ల పేర్లు ఖరారయ్యాయని.. అయితే వివేక్ ధర్మపురి నుంచి పోటీకి మొగ్గుచూపుతుండటంతో కుమార్ను చెన్నూరుకు మార్చడంపై ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇదే జరిగితే ఈ రెండు సీట్ల అభ్యర్థులు మారనున్నారు. మరోవైపు కాంగ్రెస్ మలివిడత జాబితా ఇంకా ప్రకటించనందున.. ఒకవేళ అక్కడ టికెట్లు దక్కని బలమైన నాయకులు, బీఆర్ఎస్లోని అసంతృప్తులు బీజేపీలోకి వచ్చే అవకాశాలను కూడా ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన పొత్తులపై అస్పష్టత ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో తెలంగాణలో బీజేపీ పొత్తుపై ప్రచారం జరిగినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కిషన్రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చల్లో రాష్ట్రంలో బీజేపీకి మద్దతివ్వాలని, పోటీ ఆలోచనను విరమించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ భేటీల్లో చర్చ జరిగినా.. ఇరువైపుల నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నెలాఖరులోగా మిగతా జాబితాలు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాతీయ నేతలతో రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించారు. అభ్యర్థుల పేర్లపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఒక్కరే బలమైన అభ్యర్థులున్న సీట్లు, ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలు కలిపి 55 సీట్లలో అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని నేతలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికల్లా ఈ 55 మందితో జాబితా వెలువడే అవకాశం ఉందని తెలిపారు. నెలాఖరులోగా మిగతా అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించనున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ల కంటే అధికంగా బీసీలు, మహిళలు, యువతకు సీట్లు కేటాయించేలా కసరత్తు జరిగిందని వివరించారు. -
బీఆర్ఎస్.. పట్టు బిగించేందుకు.. కాంగ్రెస్.. పాగా వేసేందుకు...
మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ దూకుడు... ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఈఎన్నికల్లో కూడా జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనే తపనతో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్క సంగారెడ్డి మినహా, మిగిలిన తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి పదికి పది స్థానాలను గెలుచుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఒక్క నర్సాపూర్ మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు. ఒకటికి రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇతర పార్టీల నుంచి భారీ చేరికలతో బీఆర్ఎస్ హవా కొనసాగుతోందనే సంకేతాలను క్షేత్రస్థాయికి పంపారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. చేరికలతో పకడ్బందీగా కాంగ్రెస్.. ఉమ్మడి మెదక్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో సంగారెడ్డిని మాత్రమే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ జగ్గారెడ్డి విజయం సాధించారు. ఈసారి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్, ఆయన కుమారుడు రోహిత్కు మెదక్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్కు గాలం వేసిన కాంగ్రెస్.. ఆయనకు జహీరాబాద్ టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ ఆందోల్ నుంచి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి బరిలోకి దిగారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై తకరారు కొనసాగుతోంది. బరిలో అగ్రనేతలు.. గజ్వేల్ నుంచి సీఎం కె.చంద్రశేఖర్రావు, సిద్దిపేట నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు, అందోల్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితర అగ్రనేతలు ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా, ఈసారి ఆయన ఈ స్థానంతో పాటు, కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలుస్తున్నారు. ♦ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధిస్తున్న మంత్రి హరీశ్రావు ఈసారి కూడా ఇదే హవాను కొనసాగించేలా ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మంత్రి హరీశ్రావు ఈసారి అంతకు మించి మెజారిటీ సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇక వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూస్తున్న దామోదర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ♦ ప్రచార శంఖారావం ఇక్కడి నుంచే.. సెంటిమెంట్ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. బలమైన నేతల కోసం బీజేపీ ఎదురుచూపులు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి., భంగపడిన నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది. వారిని పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వ్యూహాలను రచిస్తోంది. సీపీఐ హుస్నాబాద్ అడిగినా.. కాంగ్రెస్తో వామపక్షాల పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీపీఐ అడిగింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సీపీఐకి కేటాయిస్తారా, కాంగ్రెస్ పోటీలో ఉంటుందా చూడాలి. బీఆర్ఎస్ది అభివృద్ధి నినాదం.. ♦ సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధి ♦ మెదక్కు రైలుమార్గం, మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు. ♦ సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం విపక్షాల ప్రచార అస్త్రాలు ♦ దళితబ0ధు అమలులో అవినీతి అక్రమాలు. ♦ బీసీబంధు, మైనార్టీబంధు అందరికీ అందకపోవడం. ♦ అందోల్ ప్రాంతంలో అధ్వానంగా రహదారులు. ♦ బీఆర్ఎస్ నేతలపై భూకబ్జాల ఆరోపణలు, అవినీతి అక్రమాలు. ♦ విచ్చలవిడిగా సాగిన అక్రమ మైనింగ్ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. జహీరాబాద్లో మైనార్టీల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్లో ఎస్టీలు, మిగతా చోట్ల ఎస్సీలు, బీసీల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్లు, లింగాయత్, పద్మశాలి, గౌడ్ వంటి సామాజికవర్గాలు జిల్లాలో అధికంగా ఉన్నారు. ఏడాదికో ఉపఎన్నిక మంచిర్యాల డెస్క్: 2018లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఏడాదికో ఉపఎన్నిక అనివార్యమైంది. 2019లో..: హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్కుమార్రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరగ్గా, ఆయన భార్య పద్మావతిరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. 2020లో..: దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భార్య సుజాత పోటీ చేయగా, ఆమెపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 2021లో..: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించగా, జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి, జానారెడ్డిపై గెలిచారు. 2021లో..: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచారు. 2022లో..: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికరాగా, ఆయనపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలిచారు. ♦ ఇక 2023 నవంబర్ 30న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. - పాత బాలప్రసాద్ -
రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రానుంది: రాహుల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కాటారం: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని, ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆరు గ్యారంటీల పథకాల అమలుపై సంతకాలు చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మీకుల ప్రయోజనాలు కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంలా కాకుండా రాజులా పాలిస్తున్నారని, కీలక శాఖలన్నీ తన కుటుంబసభ్యుల గుప్పిట్లో పెట్టుకుని రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు. బీజేపీ, ఎంఐఎంలకు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని చెప్పారు. తెలంగాణతో తనది రాజకీయ బంధం కాదని ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధమని పేర్కొన్నారు. తనకంటే ముందు నెహ్రూ, ఇందిర, రాజీవ్లతో తెలంగాణకు బంధం ఉందని చెప్పారు. ఇవే మాటలు చెప్పి తన చెల్లి ప్రియాంకా గాందీని రాష్ట్ర పర్యటనకు తీసుకొచ్చానని తెలిపారు. విజయభేరి యాత్రలో భాగంగా గురువారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మంథని రోడ్షోలో, పెద్దపల్లి బహిరంగ సభలో, కరీంనగర్ రాజీవ్చౌక్ కార్నర్ మీటింగ్లో రాహుల్ ప్రసంగించారు. దేశంలోనే నంబర్ 1 అవినీతి సీఎం ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని 2004లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2014లో మాట నిలబెట్టుకుంది. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతామని తెలిసినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ ఈ పదేళ్లలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. కాళేశ్వరంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది. అయినా ఎకరం కూడా తడపలేకపోయారు. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం కేసీఆర్ మిత్రులైన బడా కాంట్రాక్టర్లు లాభపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తెచ్చిన ధరణితో పేదల లక్షల ఎకరాలు మాయమయ్యాయి. దేశంలోనే నంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో దొరల పాలనకు స్వస్తి పలకాలి. ఓ రాజు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు..’ అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ చేసి చూపిస్తుంది ‘డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ అటకెక్కాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు వల్ల ఎందరికి ప్రయోజనం కలిగింది? దేశంలో బొగ్గు ధరల విషయంలో అదాని కంపెనీలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటున్నాయి. మోదీ రూ.15 లక్షలు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ చెప్పినవన్నీ చేసి చూపిస్తుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో పథకాలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయి. బీఆర్ఎస్ను అడ్డుపెట్టుకొని మోదీ తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రాబోతోంది. ఢిల్లీలో బీజేపీని, ఇక్కడ బీఆర్ఎస్ను ఓడించాలి..’ అని రాహుల్ పిలుపునిచ్చారు. కులగణన దేశానికి ఎక్స్రే లాంటిది ‘దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైంది. నిత్యం ఓబీసీ ప్రయోజనాలపై మాట్లాడే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు ఏనాడూ కులగణన ప్రస్తావన తీసుకురారు. దేశాన్ని ఎంపీలు కాకుండా 90 మంది కార్యదర్శులు నడిపిస్తుంటారు. బడ్జెట్ కేటాయింపులు రూపొందించేది వారే. ఈ కేటాయింపులు జరిపే కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందిన వారున్నారు. దేశంలో మెజారిటీ వాటా ఉన్న ఓబీసీలకు రూ.44 లక్షల కోట్ల బడ్జెట్లో దక్కుతున్నది కేవలం 5% మాత్రమే. అందుకే ఓబీసీ కులగణన జరగాలి. అది దేశానికి ఎక్స్రే లాంటిది. అది చేపడితే ప్రజలు అప్రమత్తమవుతారన్న భయంతోనే వారు కులగణనపై వెనకడుగు వేస్తున్నారు. ప్రజల పక్షాన బీజేపీపై నేనొక్కడిని ఒంటరి పోరాటం చేస్తున్నా. నా పోరాటాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాపై అక్రమంగా 24 కేసులు పెట్టింది. లోక్సభ సభ్యత్వం రద్దు చేసి ఇల్లు కూడా లాగేసుకుంది. ఎన్ని అవరోధాలు కల్పించినా భయపడేది లేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తా..’ అని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వకపోతే అడుక్కుతినేవారు: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా లేదా బిర్లా గుడి దగ్గర అడుక్కుతినే వారని విమర్శించారు. కేటీఆర్ అమెరికాలో బాత్రూములు కడుక్కునే వారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండా సురేఖకు గాయాలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ కాన్వాయ్లోనే ఉండి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ బైక్ ర్యాలీలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఆమె స్కూటీపై వెళ్తుండగా స్కిడ్ కావడంతో కిందపడిపోయారు. దీంతో ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్పృహ తప్పిన సురేఖను వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మీ బతుకుల్లో వెలుగులు నింపుతాం – ఆదాయ పన్ను రద్దు చేస్తాం – సింగరేణి కార్మీకుడి ఇంట్లో రాహుల్ ఆకస్మిక భేటీ సాక్షి, పెద్దపల్లి: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మీకుల సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రకృతికి విరుద్ధంగా, కృత్రిమ పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి పని చేస్తూ దేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మీకుల బతుకుల్లో వెలుగులు నింపుతామని వారికి భరోసా కల్పించారు. కార్మీకులకు ఆదాయ పన్ను రద్దు చేస్తామన్నారు. ప్రైవేటీకరణ కాకుండా సింగరేణిని కాపాడతామని చెప్పారు. విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలో సింగరేణి కార్మీకులతో రాహుల్ సమావేశమవుతారంటూ కాంగ్రెస్ ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది. దానికి తగినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే రాహుల్ రామగిరి మండలం లద్నాపూర్లో ఆకస్మికంగా ఆగారు. అక్కడ సింగరేణి కార్మీకుడు పోచయ్య ఇంటికి వెళ్లారు. సాదాసీదాగా ఇంట్లోకి వచ్చిన రాహుల్గాందీని చూసి పోచయ్య కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అక్కడే సుమారు 50 మంది సింగరేణి కార్మీకులతో వారి వస్త్రధారణ, నెత్తిపై టోపీతో రాహుల్ భేటీ అయ్యారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఆదాయ పన్ను రద్దు చేయాలి లేదా స్లాబ్ పెంచాలని, ప్రైవేటీకరణను ఆపివేయాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే మైన్స్ ప్రైవైట్కి కాకుండా సింగరేణికి కేటాయించాలని వారు కోరారు. రాహుల్ వారికి స్పష్టమైన హామీలు ఇచ్చి భరోసా కల్పించారు. కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్రెడ్డి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి కార్మీకుల పోరాటం, త్యాగాలు మరువలేనివని అన్నారు. భరోసా కల్పించేలా హామీలిచ్చారు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్న వైనాన్ని వివరించాం. గతంలో 1.10 లక్షల మంది పర్మీనెంట్ కార్మికులు ఉంటే నేడు 45 వేల మందే ఉన్నారని చెప్పాం. మా సమస్యలన్నీ విని, మాకు భరోసా కల్పించేలా రాహుల్ హామీలిచ్చారు. – ఎ.శ్రీనివాస్, జనరల్ మజ్దూర్ రాహుల్గాంధీ వచ్చారంటే నమ్మలేకపోతున్నా.. మా ఇంటికి రాహుల్గాంధీ వస్తాడని ఊహించలేదు. ఆయన రావడం, మాఇంట్లో సమావేశం నిర్వహించడం నమ్మలేకపోతున్నా. సుమారు 40 నిమిషాల పాటు మా ఇంట్లో ఉన్నారు. మా మనవరాలికి చాక్లెట్ ఇచ్చారు. – ఓదెమ్మ, సింగరేణి కార్మీకుడి భార్య -
బీజేపీ బీసీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ.. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల గోదాలో తలపడనుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కనపెట్టి, ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతర పార్టీల కంటే ఎక్కువగా.. కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ, ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ జనాభాలో 54 శాతానికిపైగా బీసీలే ఉన్నారని.. వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించాయి. అంతేగాకుండా 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీసీల ఓట్లు తోడ్పడతాయని ఆశిస్తున్నట్టు వివరించాయి. భారీ సభ వేదికగా ప్రకటన! పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదా కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్లో భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన బీసీగర్జన సభలోగానీ, మరోచోట నిర్వహించే బహిరంగ సభలోగానీ దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సాంప్రదాయం కాదని.. దానిని పక్కనపెట్టి అయినా ఓ కీలకనేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారంలో భాగస్వాములను చేస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామన్న భరోసా కల్పించనున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించినట్టు నేతలు వివరించారు. రెడ్డి వర్గం ఫోకస్గా ఇంద్రసేనారెడ్డికి పదవి! బీసీ నినాదంతో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రెడ్డి, ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకూ బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కిషన్రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్రెడ్డికే అప్పగించింది. తాజాగా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో బీసీ నేతలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా రెడ్డి, బీసీ కాంబినేషన్లో ఎన్నికలకు వెళుతున్న సంకేతాలను పార్టీ ఎప్పుడో ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీసీలకు పెద్దపీట, సీఎంగా బీసీ అభ్యర్థికి అవకాశం అంశాలపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జులు, ముఖ్య నేతలు పలుమార్లు కసరత్తు చేశారని.. రెడ్డి సామాజికవర్గం సహా అందరు ముఖ్య నేతలు బీసీ ఎజెండాకు మద్దతు ఇచ్చారని అంటున్నారు. బీసీ కీలక నేతల్లో.. చాన్స్ ఎవరికి? ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె.లక్ష్మణ్కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చారని.. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ నియమితులయ్యారని పేర్కొంటున్నారు. మరోవైపు ఉద్యమకాలం నుంచీ బీఆర్ఎస్లో నంబర్ టూగా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కులసంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి. -
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య సమరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలోంచి పుట్టిన కాంగ్రెస్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ ఇది ప్రస్తుతం దొరల తెలంగాణగా మారిందని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీలు ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న సమరంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను ప్రధాని మోదీ కనుసన్నల్లో ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ను ఓడించేందుకు ఆ మూడు పార్టీలూ ఒక్కటయ్యాయని చెప్పారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కులగణన చేయనిదే సామా జిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్(ఎం) మండలం రామాంజాపూర్ నుంచి వారు కాంగ్రెస్ ఎన్నికల శంఖం పూరించారు. తొలుత రామప్ప రామలింగేశ్వరస్వామి ఆ లయంలో రాహుల్, ప్రియాంక పూజలు చేశారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత రామాంజాపూర్లో ఏర్పాటు చేసిన విజయ భేరి బహిరంగసభలో మాట్లాడారు. నిరుద్యోగుల ఆత్మహత్యల బాట: రాహుల్ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో మా అమ్మ సోనియాగాంధీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా తన రాజనీతిని మరువలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రభుత్వం 40 లక్షల మంది నిరుద్యోగులకు మొండిచేయి చూపడంతో వారు ఆత్మహత్యల వైపు పయనించే ప్రమాదం నెలకొంది. ఉద్యోగ ఖాళీలు నింపలేక, కుటుంబ పాలన కోసం కోసం పాటుపడే క్రమంలో 18 శాఖలు తమ చేతుల్లో పెట్టుకొని, జనాభాల్లో బీసీలు 50 శాతం ఉంటే ముగ్గురు బీసీలకు మాత్రమే కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వడం సామాజిక న్యాయాన్ని విస్మరించారనేందుకు నిదర్శనం. ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులను నింపకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేసి పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీ, రాజీవ్గాంధీలు దూరదృష్టితో ఐఐటీ, ఐఎంఎ వంటి సంస్థలను నెలకొల్పితే మోదీ సర్కారు బీహెచ్ఈఎల్, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది..’ అని రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ‘తెలంగాణలో బీఆర్ఏస్, కాంగ్రెస్ల మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్లు మిలాఖత్ అయ్యాయని, అవి ఎంఐఎంతో కలిసి ఉన్నాయనడానికి పార్లమెంటులో బీజేపీ ఏమి కోరుకుంటే బీఆర్ఎస్ దానికి మద్దతు పలకడమే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. బీఆర్ఏస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీఆర్ఎస్ పాలన మోదీ రిమోట్ ద్వారా నడుస్తోంది. విపక్ష నేతలందరిపై కేసులు పెట్టినా.. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ కేసులు లేవు. నన్ను మా నేతలను మాత్రం కేంద్రం వేధిస్తోంది. నా ఎంపీ సభ్వత్వాన్ని రద్దు చేసి 24 కేసులు పెట్టారు. అయినా సిద్ధాంతాలతో కూడిన లౌకిక పార్టీ కాంగ్రెస్ను ఎవరూ ఏమీ చేయలేరు..’ అని రాహుల్ అన్నారు. ఇందిరమ్మ మాదిరి చేయూతనిస్తాం.. ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలు చేస్తాం. ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం. ఈ ప్రాంత ఆదివాసీలకు ఇందిరమ్మ మాదిరిగా చేయూతనిస్తాం. అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తాం..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. లూటీలు చేస్తూ దండుకుంటున్నారు: ప్రియాంకా గాంధీ ‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆశలు, అకాంక్షలు నెరవేర్చకపోగా.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో లూటీలు చేస్తూ దండుకుంటున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వం ప్రజలను సామాజిక న్యాయానికి దూరం చేసింది. భూదాన్ భూములకు రక్షణ లేకుండా ధరణి పోర్టల్తో స్కామ్లు చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తోంది. బంగారు తెలంగాణ పేరిట ప్రజల్ని మోసం చేస్తూ లక్షల కోట్లు దండుకుంటూ 50 శాతం బీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్ను ఆచరణలో 23కి తీసుకువచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దండుకున్నారు. ధరణి పోర్టల్ పెద్ద స్కామ్. డబుల్బెడ్ రూమ్లు ఇవ్వలేదు. రూ.లక్ష రుణమాఫీ చేయలేదు..’ అని ప్రియాంకా ధ్వజమెత్తారు. కర్ణాటక, రాజçస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇచ్చిన హామీలు నెరవేర్చామని, రాజస్థాన్లో ఉచితంగా వైద్యం హామీ కింద రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్లో వరి ధాన్యానికి రూ.2,500 గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పాలనకు సోనియమ్మ ఆరు గ్యారంటీలు: రేవంత్రెడ్డి ‘కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించడానికే రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించడానికి సోనియమ్మ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2,500 అందించడానికి సోనియమ్మ మాట ఇచ్చారు. రూ.500కే సిలిండర్ను మీ ఇంటికి తెచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకుంది. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, ఉపాధి కూలీలకు రూ.12 వేలు కాంగ్రెస్ అందించనుంది. 200 యూనిట్ల వరకు ప్రతిఇంటికీ ఉచితంగా విద్యుత్ అందించనున్నాం. కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం అందించనుంది..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. నియంత పాలనకు చరమ గీతం పాడుదాం: భట్టి విక్రమార్క ‘రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత కేసీఆర్ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదాం. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, పార్టీ నేతలు ఉత్తమ్కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, డి.శ్రీధర్రాబు, మధుయాష్కీగౌడ్, మల్లు రవి, జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామప్ప శిల్ప సంపదకు ఫిదా వెంకటాపురం(ఎం) : రామప్ప ఆలయ శిల్ప సంపదకు రాహుల్, ప్రియాంకా ఫిదా అయ్యారు. పూజలు చేసిన తర్వాత వారు ఆలయాన్ని పరిశీలించారు. ఏ సంవత్సరంలో నిర్మించారు? రామప్ప ఆనే శిల్పి ఒక్కడే నిర్మించాడా? ఎన్నేళ్ల పాటు నిర్మించారు? అంటూ గైడ్ విజయ్ని ఆరా తీశారు. శిల్పాలను చూసి ముగ్ధులైన ప్రియాంకగాంధీ నంది విగ్రహాన్ని ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు. నంది విగ్రహం వద్ద వారు ఫొటోలు దిగారు. నేడు పెద్దపల్లిలో రాహుల్ పర్యటన సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: రాహుల్గాంధీ బస్సుయాత్ర రెండవ రోజు గురువారం పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథనిలో రోడ్డ్షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామగిరి మండలంలో సింగరేణి గెస్ట్హౌస్ ప్రాంగణంలో సింగరేణి కారి్మకులతో సమావేశమవుతారు. సాయంత్రం పెద్దపల్లిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడతారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని 8 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి కరీనంగర్లోనే బస చేయనున్నారు. రామప్ప వయా హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: రాహుల్, ప్రియాంకా గాందీలు బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు వారికి స్వాగతం పలికారు. రాహుల్, ప్రియాంకా వారితో కొద్దిసేపు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేత జి.నిరంజన్ గురువారం చార్మినార్ వద్ద నిర్వహించనున్న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను అందజేశారు. అనంతరం వారు హెలికాప్టర్లో రామప్పకు బయలుదేరి వెళ్లారు. -
వాళ్లొస్తే కాటగలుస్తం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, మేడ్చల్ జిల్లా: నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 20 గంటలు కరెంటు ఇస్తామని మాట తప్పిందని.. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే కాటగలుస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాడని గుర్తు చేశారు. వాళ్లొస్తే కరెంటుకు కటకట తప్పదని.. రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ఆపేస్తారని ఆరోపించారు. అడ్డం పొడుగు ఏదో మాట్లాడి గోల్మాల్ చేయాలని చూస్తున్న వారి మాటలను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. అందరికీ మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని, కారుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బుధవారం జడ్చర్ల, మేడ్చల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. 20 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఏమైంది? కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు గంటల కరెంటు ఇస్తామంటున్నారు. పొద్దున సగం, రాత్రి సగమని చెప్తున్నారు. ఉచిత కరెంటు ప్రధాన మంత్రికి సైతం చేతకావడం లేదు. ఆయన సొంత రాష్ట్రంలోనూ కరెంట్ లేదు. రైతులు రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారు. దేశం మొత్తంలో రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పూర్తవుతోంది. మంచినీళ్ల బాధ కూడా పోయింది. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్గా ఉన్నాం. కులమతాలకు అతీతంగా పేదలందరినీ ఆదుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంట్ బాధలు వస్తాయి, పరిశ్రమలు దెబ్బతింటాయి. ఇక్కడి బాధలు చూసి పాట రాశా.. ఒకనాడు జయశంకర్ సార్, నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్లడానికి నవాబ్పేట అడవి గుండా వస్తున్నాం. అమ్మవారి గుడి ఉంది అక్కడ. పక్కన చిన్న అడవిలో ఉన్న ఆ దేవాలయం దగ్గర లైట్ల వెలుగు అంత దూరం కనిపించింది. మహబూబ్నగర్లో మనుషులే కాదు.. చివరికి అడవి కూడా బక్కపడిందని బాధపడ్డాం. మహబూబ్నగర్లో గంజి, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలవిసేలా బాధకలిగేది. పక్కనే కృష్ణానది పారుతున్నా ఎందుకీ దుర్గతి? ఆ బాధలు చూసి ‘‘పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ఎట్టా పంటలు ఎండిపాయె..’’ అంటూ పాట రాశా. మహబూబ్నగర్ దరిద్రం పోవాలంటే పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని, ప్రజలు గెలిపిస్తారని జయశంకర్ సార్ చెప్పారు. ఇదే జిల్లా నుంచి పోటీ చేశా. ఆనాడు నన్ను గెలిపించినది లక్ష్మారెడ్డిగారే. 15 ఏళ్లు పోరాటం చేసినప్పటికీ మహబూబ్నగర్ ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి నిలిచిపోయింది. దద్దమ్మ ఎమ్మెల్యేలు అడగక నష్టపోయాం ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులోని దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు తెరవక, అడగలేక నష్టపర్చారు. అడిగేవారు లేక నాటి పాలకులు జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు తీసుకోవాలని సోర్స్ ఇచ్చారు. జూరాల బెత్తెడు ప్రాజెక్టు.. అందులో ఉండే నీళ్లు 9–10 టీఎంసీలే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనం రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. ఆ లెక్కన జూరాలలో నీళ్లు మూడ్నాలుగు రోజుల్లో అయిపోతాయి. అందుకే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలంను సోర్సుగా ఎంపిక చేశాం. ఆ ప్రాజెక్టు ఎవరి జాగీరు కాదు. రైతుల బాధలు తీర్చేందుకు ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశా. కానీ ఇక్కడి దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చూశారు. ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్కు పేరొస్తుందని కుట్రలు చేశారు. అయినా మొండిపట్టుతో రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తి చేసుకున్నాం. రెండు, మూడు నెలల్లో బ్రహా్మండంగా నీళ్లను చూడబోతున్నాం. కాంగ్రెస్ వల్లే తెలంగాణకు 60ఏళ్ల గోస.. 1956లో కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రలో కలిపి 60 ఏళ్ల గోసకు కారణమైంది. సమైక్య రాష్ట్రంలో ఆ బాధలు కళ్లారా చూశా. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. నేను సైతం చావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది. 60ఏళ్లు గోస పడేట్టు చేసిన కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు మళ్లీ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతుండటం సిగ్గుచేటు. రైతుల బతుకులు మారాలనే.. నిన్నగాక మొన్ననే మేనిఫెస్టో విడుదల చేశాం. రైతుల బతుకులు మారాలన్నదే నా లక్ష్యం. నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇండియాలోనూ ఎక్కడా లేదు. రైతుల కోసం రూ.37 వేలకోట్ల రుణమాఫీ చేశాం. ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాం. ఇంకో పదేళ్లు కష్టపడితే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడతాయి. బీఆర్ఎస్ మళ్లీ గెలవగానే.. రాష్ట్రంలో 93 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు రైతు బీమా తరహాలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం. సన్న బియ్యం అందిస్తాం. ఆసరా పెన్షన్లను రూ.5 వేల వరకు పెంచుతాం. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేలు అందిస్తాం. రైతుబంధు సాయాన్ని రూ.16 వేల వరకు పెంచుతాం. అగ్రవర్ణాల పిల్లలకు 110 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తాం’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. జడ్చర్ల సభలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మేడ్చల్ సభలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి అభ్యర్థులు వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంటరిగా పోరాడి సాధించా.. నాడు తెలంగాణలో తాగు, సాగునీరు లేక ప్రజలు వలసపోయారు. పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడి వెళ్లిన. వాళ్లకు సాయం చేయాలంటూ నాటి సీఎంను జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంత దుర్మార్గపు పాలనను అనుభవించాం. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని నాడు సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 20ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిప్పుడు ప్రతి ఒక్కరూ నవ్వులాటగా చూశారు. హేళనగా మాట్లాడారు. నా మీద ఎన్నో నిందలు వేసి అవమానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉద్యమంలో నాతో కలసి రాకపోయినా ఒంటరిగా పోరాటం చేశాను. దాని ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. నేడు అదే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. -
సంక్షేమం భళా..మౌలికం ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికల హామీలిస్తున్నాయి. ప్రచారంలో కానీ, పార్టీ ప్రణాళికల్లో కానీ సంక్షేమ ఆధారిత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్తో పాటు బీఎస్పీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంతవరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఇక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంక్షేమ సూత్రాన్నే ప్రధానంగా అనుసరించినా.. అభివృద్ధి, ఉపాధి అంశాలకు కూడా చోటిస్తూ తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. అయితే దేశాభివృద్ధికి కీలకమైన రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏ పార్టీ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కీలకమైన విద్య, వైద్యానికి సంబంధించి తమ విధానమేమిటో? బడ్జెట్లో ఏ మేరకు నిధులు పెంచుతారన్న అంశాలను ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ విద్య, వైద్యంపై చేసిన వ్యయం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కాగా అతి ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంక్షేమం సరే.. సంక్షేమ పథకాలను ఎవరూ తప్పుబట్టడం లేదని, అదే సమయంలో సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడే కార్యక్రమాలపై పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. విద్య, వైద్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు, చేస్తున్న వ్యయం పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వ్యయం చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యపై వ్యయం ఎంత పెరిగితే.. భవిష్యత్ కు అంత పెట్టుబడి అనే అంశాన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని అంటున్నారు. అలాగే రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల గురించి ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా విన్పిస్తుండటం గమనార్హం. ఎన్నికల హామీలు ఇలా.. కాంగ్రెస్: ఆరు గ్యారంటీల పేరిట పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. మరిన్ని సంక్షేమ పథకాలపై కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మహాలక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ. 2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంట బోనస్ రూ.500, అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షల ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత ఆర్థిక సహాయం, మహిళలకు రూ.4,000 పింఛను. బీఆర్ఎస్: ప్రధానంగా రైతుబంధు పెంపు, పెన్షన్ల పెంపు, రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ, తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల జీవితబీమా, అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి, రూ.400కే సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు, పేదలకు ఇళ్ల స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, అస్సైన్డ్ భూములపై ఇక హక్కుదారులకే పూర్తి అధికారం. బీఎస్పీ: ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరా భూమి, మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు, ఉచిత వాషింగ్ మిషన్లు, వృద్ధులకు వసతి గృహం, ఉచిత వైద్యం, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, పల్లె, పట్టణాల్లోని వారికి 150 రోజుల ఉపాధి, రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్యానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్, రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, 600 సబ్సిడీ క్యాంటీన్లు, ఇల్లు లేని వారికి 550 చ.గజాల స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల ఆర్థిక సాయం. నెగ్గడానికి షార్ట్కట్ మార్గాలు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలే అట్టడుగు వర్గాల ప్రజల నిజమైన అభివృద్ధికి దోహదపడతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే.. కానీ అవి వారికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే విద్య, వైద్యం, యువత, ఉపాధికి సంబంధించిన అంశాలను అవి పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలన్న తపనే రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇరవై ముప్పయ్ కోట్లు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచాక అవినీతితో పెద్ద ఎత్తున సంపాదించాలనే దృష్టి ఉంటుంది తప్ప,అభివృద్ధి చేయాలనే తపన ఎందుకు ఉంటుంది? – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ -
రేపు బీజేపీ తొలి జాబితా?
సాక్షి. హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ అవకాశం ఉంటే బుధవారం రాత్రే జాబితా ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా... ఏకాభిప్రాయం కుదిరిన సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముంనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోకు ఓపిక పట్టండి అధికార బీఆర్ఎస్ 98 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 55 మందితో తొలిజాబితా ప్రకటించేసింది. అదీగాక ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోను సైతం ప్రకటించి ప్రచారంలో ముందున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా తొలి జాబితాను కూడా ప్రకటించకపోవడంపై పార్టీ నాయకుల్లో ఒకింత ఆందోళన ఉంది. అదీగాక మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా... ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. మేనిఫెస్టోలో ప్రతిపాదించే విషయాలను రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించాక... వారే ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తారని చెబుతున్నారు. మేనిఫెస్టో ప్రకటనతోపాటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం విస్తృతంగా చేపట్టేలా ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, బీసీలకు తగిన గుర్తింపు, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిసింది. సకల జనుల ద్రోహి పేరుతో... కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారంటూ ‘సకల జనుల ద్రోహి కేసీఆర్’ పేరిట ఎన్నికల ప్రచారం చేపట్టాలని కమలం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం రాష్ట్ర పార్టీ ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి తదితరులు ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్, కాంగ్రెస్కు భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా కొత్తపంథాలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీల (మేనిఫెస్టో, క్యాంపెయిన్, సోషల్ ఔట్రీచ్, స్క్రీనింగ్ తదితరాలు) సమావేశాలతో పార్టీ కార్యాలయమంతా సందడి నెలకొంది. మేనిఫెస్టో, అభ్యర్థుల స్క్రీనింగ్, క్యాంపెయిన్, ఎన్నికల మేనేజ్మెంట్ తదితరాలపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటల, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది. -
మద్యం, డబ్బుతో కేసీఆర్ సిద్ధం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసేలా అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలంటూ తాను విసిరిన సవాల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించకపోవడంతో ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. మునుగోడు, హుజూరాబాద్ తరహాలో మరోసారి మద్యం, డబ్బుతో ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుందని, డబ్బు, మద్యం పంపిణీ చేయదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఎక్కడా మద్యం, డబ్బు పంచలేదు దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్ని కని ఆనాడు విశ్లేషకులు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. మునుగోడులో కూడా మద్యం ఏరులై పారిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండు చోట్లా చుక్క మందు కానీ, డబ్బు కానీ పంచలేద న్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధిని కేసీఆర్ పక్కనబెట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ను తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలి పేలా ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రవళిక మరణంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ప్రవళిక కుటుంబ సభ్యు లను తాను రాహుల్గాంధీ వద్దకు తీసుకెళ్లాలను కుంటే.. ప్రగతిభవన్లో బంధించారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి రాష్ట్రంలో రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని, వీరికి ఎన్నికల నియ మావళి వర్తించదా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. బంధువులు, కావలసిన కొందరు రిటైర్డ్ అధికారు లను ప్రైవేటు సైన్యంగా చేసుకొని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని, కానీ 2 లక్షల ఉద్యోగాల ఊసు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని, అప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగులు కేసీఆర్పై కదం తొక్కాలని, 30 లక్షల నిరుద్యోగ యువకులు కాంగ్రెస్కు ఓటు వేయడంతో పాటు తల్లిదండ్రులతో కూడా వేయిస్తే 90 లక్షల ఓట్లతో పాటు 90 సీట్లు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకా లు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గోషామహల్లో ఎంఐఎం పోటీ చేయదా? కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎన్నికవుతూ వస్తున్న షబ్బీర్ అలీ అనే మైనారిటీ నేతను ఓడించేందుకు కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఓ మైనారిటీని ఓడించేందుకు పోటీ చేస్తున్న కేసీఆర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మద్దతివ్వడం వెనుకున్న ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఎంఐఎంను, ఒవైసీ కుటుంబాన్ని దూషించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల న్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురు ఒక్కటేనని, వారి ఒప్పందంలో భాగంగానే గోషా మహల్లో రాజాసింగ్పై ఎంఐఎం పోటీ చేయడం లేదని చెప్పారు. -
1,000 నుంచి 5,000 ఓట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్షాలు ఎన్నికల రణరంగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అయితే పొత్తు, సీట్ల వ్యవహారంపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్తో రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఒప్పందం జరగలేదని సీపీఐ చెపుతోంది. కాగా, రాష్ట్రంలో తాము అనేక అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలమని, ఇది కాంగ్రెస్కు కలసి వస్తుందని సీపీఐ, సీపీఎం నేతలు చెబుతున్నారు. తమ ఓట్లతో బీఆర్ఎస్, బీజేపీలను మట్టికరిపించవచ్చనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని లెఫ్ట్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము గెలిచే స్థితిలో లేకపోయినా, మిత్రులను గెలిపించడంలోనూ, శత్రువులను ఓడించడంలోనూ కీలకంగా ఉంటామని చెబుతున్నారు. దీంతో వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్కు కీలకంగా మారనుంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికంగా ఓట్లు : రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 30 స్థానాల్లో అంటే నాలుగోవంతు సెగ్మెంట్లలో తాము పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలమని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. 30 స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలకు వెయ్యి నుంచి 5 వేల మధ్య ఓట్లు ఉంటాయని సీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అధిక స్థానాల్లో ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇక 100 నుంచి వెయ్యి వరకు ఓట్లున్న స్థానాలు 60 వరకు ఉంటాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో అప్పుడు సీపీఎం తరఫున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి 11 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. భద్రాచలంలో కూడా సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావుకు 14 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సీపీఐకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు ఉన్నాయి. ఈ స్థాయి ఓట్లు కాంగ్రెస్కు కలసి వస్తాయని, గెలుపు అవకాశాలను నిర్ణయిస్తాయని లెఫ్ట్ నేతలు అంటున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలతోపాటు, గణనీయంగా ఓట్లున్న 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే లెక్కలతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతోందని చర్చా సాగుతోంది. -
ఆపద మొక్కులకు ఆగం కావొద్దు!
సిద్దిపేట రక్తమే నన్ను ఇంతటివాడిని చేసింది యావత్ దేశం ఆశ్చర్యపడేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నానంటే ఈ గడ్డ పుణ్యమే. సిద్దిపేట నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలమే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. చింతమడకలో అమ్మ చనుబాలు తాగే సమయంలో అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఊర్లో ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది. సిద్దిపేటే నన్ను సాది పెద్ద చేసి, చదువు చెప్పింది. రాజకీయంగా జన్మనిచ్చి నాయకుణ్ణి చేయడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. –కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికల సమయంలో కొందరు ఆపద మొక్కులవారు వస్తారు. అలవిగాని హామీలతో మభ్యపెట్టాలని చూస్తారు. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దు. మోటార్లకు మీటర్లు పెట్టేవారిని, మత పిచ్చోళ్లను కూడా నమ్మొద్దు. ముఖ్యంగా రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. మూడేళ్లు కష్టపడి ధరణిని రూపొందించాం. గతంలో వీఆర్వో నుంచి రెవెన్యూ సెక్రటరీ దాకా ఎవరికి కోపమొచ్చినా రైతుల భూమి మాయమయ్యేది. కానీ ధరణితో రైతుల అనుమతి లేకుండా.. సీఎం కూడా రైతు భూమి జోలికి వెళ్లలేని స్థితి కల్పించాం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తే.. రైతులు భూములపై ఆశలు వదులుకోవాల్సిందే..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. సిద్దిపేట రక్తం, మాంసం, బుద్ధి, బలమే తనను ఇంతవాణ్ణి చేశాయన్నారు. సిరిసిల్లను సోలాపూర్లా మారుస్తామని, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రం, సిద్దిపేటల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ మొండిపట్టుతోనే 24 గంటల కరెంటు ‘గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు, ఆగిన మగ్గాలు, పాముకాట్లు, తేలు కాట్లతో రైతుల ప్రాణాలు పోవడం తప్ప వారు చేసిందేమీ లేదు. ప్రస్తుతం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్లు 3 గంటలు మాత్రమే చాలు అంటున్నారు. మీకు 24 గంటలు కావాలా? 3 గంటలు కావాలా? (అంతా 24 గంటలు కావాలంటూ కేకలు వేశారు) ప్రధాని మోదీ సొంత ఊర్లో కూడా 24 గంటల కరెంటు రావడం లేదు. కానీ మనకు అది ఎలా సాధ్యమైంది? కేవలం కేసీఆర్ మొండిపట్టు పట్టడం వల్లే. ఇదొక్కటే కాదు..అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1గా ఉంది. విద్యుత్తు వినియోగం, ఇంటింటికీ నల్లా కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మోటార్లకు మీటర్లు అంటూ బీజేపీ వాళ్లు బెదిరించాలని చూసినా జంకలేదు. హిందు–ముస్లిం అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతపిచ్చిగాళ్లు కూడా వస్తున్నారు. మనం ఏళ్లుగా గంగా జమునా తెహిజీబ్లా ఒకే కుటుంబంలా కలిసి ఉన్నాం. మన మధ్య పంచాయితీలు పెట్టేందుకు వచ్చే వారితో జాగ్రత్త..’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. నిరుపేదలకు సూపర్ ఫైన్ బియ్యం ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి కొత్తగా చెప్పేదేం లేదు. కల్యాణలక్ష్మి కింద తొలుత రూ.50 వేలు ఇచ్చాం. క్రమంగా దాన్ని రూ.లక్షకు పెంచాం. పింఛన్ కూడా రూ.1,000 నుంచి రూ.2,000 చేశాం. క్రమంగా దాన్ని రూ.5 వేలు చేస్తాం. కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో 30 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. అందుకే నిరుపేదలకు సూపర్ ఫైన్ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నాం..’ అని తెలిపారు. సిరిసిల్లను షోలాపూర్గా మారుస్తాం.. ‘నేను చదువుకుంటున్న రోజుల్లో ఎగువ మానేరు నీటితో కళకళలాడేది. ముస్తాబాద్లో పదుల సంఖ్యలో రైస్ మిల్లులు కూడా ఉండేవి. కానీ నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాక.. సమైక్య పాలనలో మానేరు నీరు, రైస్ మిల్లులు క్రమంగా కనుమరుగయ్యాయి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎటుచూసినా కరువు నేలలతో ఉన్న సిరిసిల్ల నేడు నదులు, ప్రాజెక్టుల్లో నీటితో సజీవ జలధారగా మారింది. పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. ఉద్యమ సమయంలో సిరిసిల్లలో ఆత్మహత్యలు కలచివేసేవి. సిరిసిల్ల ఎమ్మెల్యే, చేనేత మంత్రి కేటీఆర్ కావడం మీ అందరి అదృష్టం. చేనేత మగ్గం నడవాలి, నేత కార్మికులకు ఉపాధి రావాలని పట్టుబట్టి ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల పనులను సిరిసిల్ల చేనేతలకు అప్పగించాడు. అన్ని మతాల పండగల సమయంలో పేదలు కొత్తబట్టలు కట్టుకోవాలన్న ఆశయంతో.. చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ కొందరు ఆ చీరలను కాల్చి, కార్యక్రమాన్ని అవమానించారు. భవిష్యత్తులో సిరిసిల్లను షోలాపూర్గా మారుస్తాం. విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కేటీఆర్ గురించి నా కంటే బాగా మీకే తెలుసు. మరోసారి ఆశీర్వదించండి..’ అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమ విజయానికి పునాది ఇక్కడే... ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు ఆత్మీయులు వందలాది మంది ఉన్నారన్నారు. కొండంరాజ్పల్లి మాదన్న.. మా నవాబ్ సాబ్.. నాకు డిపాజిట్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. తాగునీటి కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు చెప్పలేం. లోయర్ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషన్ భగీరథకు పునాది. దళితబంధుకు ప్రేరణ రామంచ గ్రామం. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరడుగుల బుల్లెట్ హరీశ్రావు ‘ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహా్మండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశాడు. హరీశ్రావు మీద ఒక జోక్ ఉంది. ‘అటు ఇటు తిరుగుతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు’ అని చెబుతారు. ఇక్కడికి అన్నీ వచ్చాయ్. నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తళ్లు దుంకుతున్నాయి. ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే రావాలి. హరీశ్ స్థానంలో నేనున్నా ఇంతలా చేసేవాడిని కాదేమో. అంత అద్భుతంగా పని చేస్తున్నాడు. గత ఎన్నికల రికార్డును తిరగరాసి భారీ మెజార్టీతో హరీశ్ను గెలిపించాలి..’ అని సీఎం కోరారు. ఎక్కడ నిలబడ్డా కోనాయిపల్లి వెంకటేశ్వస్వామి ఆశీర్వాదం ‘కరీంనగర్, మహబూబ్నగర్ ఎంపీగా పోయినా.. గజ్వేల్ ఎమ్మెల్యేగా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా..కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టే పోతా అనే విషయం మీకు తెలుసు. బ్రహ్మాండంగా 50 ఏండ్లు కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు నేలగా ఉన్న సిరిసిల్లను కాళేశ్వరం జలాలతో పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. సిరిసిల్ల సాధించిన అభివృద్ధి, ఇక్కడి భూగర్భ జలాల గురించి ట్రైనీ ఐఏఎస్లు తమ శిక్షణలో భాగంగా తెలుసుకునే స్థాయికి కేసీఆర్ చేర్చారని కొనియాడారు. సిద్దిపేట ప్రజలు చూపిస్తున్న అభిమానానికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని అక్కడి సభలో మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు అన్నారు. చివరి శ్వాస ఉన్నతం వరకు సీఎం కేసీఆర్కు, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. -
కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లకు ఎరవేసేం దుకు కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి భారీగా డబ్బులను తరలిస్తున్నారని, ఆయా రాష్ట్రాల సరిహ ద్దుల వెంట పటిష్ట నిఘా ఉంచి కట్టడి చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ ఎన్నికల అధికారులను కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ మంగళ వారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశమై వారి అభి ప్రాయాలు, సూచ నలను సేకరించారు. అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. సోమ భరత్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో కొందరు చెలరేగి పోతున్నారని, అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్పై రాజకీయ పార్టీల గుర్తులను వృద్ధులు సులువుగా గుర్తు పట్టేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు సదుపాయం కల్పించాలన్నారు. ప్రగతిభవన్లో బీ–ఫారాల పంపిణీపై విచారణకు ఆదేశం.. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ–ఫార్మ్లు పంపిణీ చేయడాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్య క్షులు జి.నిరంజన్ ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్ పబ్లిక్ ప్రాపర్టీ అని, అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం విచా రణకు ఆదేశించిందన్నారు. అక్టోబర్ 4న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాకు తోడుగా త్వరలో అనుబంధ ఓటర్ల జాబితాను సైతం ప్రచురిస్తామని సీఈఓ వికాస్రాజ్ తెలిపారన్నారు. ఓటర్లుగా దర ఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్ని కల నిబంధనలపై సరైన అవగాహన లేదన్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమ తుల జారీపై స్వయంగా ఎన్నికల సంఘమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాంపల్లి నియోజక వర్గంలో బోగస్ ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ కోరారు. సజావుగా ఎన్నికలు జరిపేందుకు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దింపాలని సూచించారు. ఆ అధికారులను బదిలీ చేయాలి.. బీజేపీ బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికా రులను బదిలీ చేయాలని బీజేపీ నేత అంథోని రెడ్డి కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల పరిశీలకు లను, కేంద్ర బలగాలను దించాలని సూచించారు. మునుగోడులో జప్తు చేసిన డబ్బు ఏమైంది? ఇటీవల ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహా రావు కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో జప్తు చేసిన డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. పోలింగ్కు 5 రోజుల ముందు ఓట ర్లందరికీ స్లిప్పులు జారీ చేయాలని సూచించారు. బోగస్ ఓట్లను తొలగించాలని, అక్రమ డబ్బు తరలింపును కట్టడి చేయాలని టీడీపీ నేత సతీష్ సూచించారు. ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయా లను నిషేధించాలని, ఓటును ఆధార్కార్డుతో అనుసంధానం చేయాలని ఆప్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు జరపాలని ప్రజాశాంతి పార్టీ కోరింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులపై సీఈఓకి ఫిర్యాదు చేసినట్టు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ రావు తెలిపారు. అలాగే పాతబస్తీలో బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరామన్నారు. -
అడుగడుగునా ‘కట్టల’ పాములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం పట్టుబడుతు న్నాయి. ఈ నెల 9న రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి మంగâý వారం ఉదయం వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.130 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ని కల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడి ంచారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్లు, 95 అంతర్రాష్ట్ర చెక్పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డబ్బే డబ్బు! ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రాలు లేకుండా తర లిస్తున్న రూ.71.55 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్రాజ్ వివరించారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం మొత్తం విలువ రూ.7.75 కోట్లు ఉంటుందన్నారు. 1694 కిలోల గంజాయి విలువ రూ.4.58 కోట్లు, పట్టుబడిన బంగారు, వెండి మొత్త విలువ రూ. 40.08 కోట్లు ఉంటుందని వివరించారు. ఇందులో మొత్తం 72.267 కిలోల బంగారం, 429.107 కిలోల వెండి, 42.03 క్యారట్ల వజ్రాలు న్నాయని స్పష్టం చేశారు. ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి విలువ మొత్తం రూ.6.29 కోట్లు అని వికాస్రాజ్ తెలిపారు. ఈనెల 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు మొత్తం రూ.21.84 కోట్ల విలువైన వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియమా వళి అమల్లో ఉన్న రోజుల్లో రూ.103 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తు వులు స్వాధీనం చేసుకోగా.. ఈసారి ఇప్పటికే ఆ మొత్తం విలువ రూ.130 కోట్లు దాటడం విశేషం. 5,529 ఆయుధాలు స్వాధీనం: డీజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా 5,529 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం తెలి పింది. వీటితోపాటు మరో మూడు అక్రమ ఆయు ధాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. 5,252 బైండోవర్ కేసులలో మొత్తం 17,128 మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన 184 మందిపై 56 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. -
పైరవీల రాజ్యం మళ్లీ రావాలా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణిని తెచ్చామని.. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే రెవెన్యూ అధికారుల అధికారాలను ధరణితో రైతుల చేతికి అందించామని.. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి అధికారులను రైతుల నెత్తిన రుద్దుదామని, మళ్లీ పైరవీల రాజ్యం తేవాలనేది కాంగ్రెస్ ఉద్దేశమని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలిపితే అందరం బాగుంటామని వ్యాఖ్యానించారు. పదేళ్ల అభివృద్ధిని ఆగం చేయాలని చూసే వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సోమవారం జనగామ, భువనగిరిలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. అందులో జనగామ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ రాకముందు అరిగోసపడ్డాం. జనగామ ప్రాంతాన్ని చూసి కండ్లనీళ్లు పెట్టుకున్నా.. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉండేది. ఎక్కడికి వెళ్లి చూసినా వలసలు, ఎండిపోయిన పంటలు, ఇబ్బందులు చూస్తే దుఃఖం ఆగకపోయేది. నిలబడి, కలబడి అందరి ఆశీర్వాదం, మద్దతుతో తెచ్చుకున్న తెలంగాణలో.. చీకట్లో బాణం వేసినట్టు పనులు మొదలుపెట్టాం. మేధోమథనం చేసి పథకాలు తెచ్చాం. పదేళ్లలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. ఒకప్పుడు కరువున్న తెలంగాణలో ఇవాళ రెండు నెలల పాటు వేలాది లారీల్లో ధాన్యం తరలివెళ్తుంటే సంతోషమేస్తోంది. ఎన్నికల కోసం మేనిఫెస్టోలు తేలేదు తెలంగాణ ప్రజల గోస, బాధలను చూసినవాడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోసం అబద్ధాల మేనిఫెస్టోలను తేవడం లేదు. మేనిఫెస్టోలో పేర్కొన్నవే కాకుండా చెప్పని అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో తెచ్చాం. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. 93లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తాం. రైతుబీమా తరహాలోనే ఎవరైనా చనిపోతే వారంలోనే రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అత్యధిక కాలం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏనాడూ దళితులను పట్టించుకోలేదు. అందుకే దళితులతో కోసం దళితబంధు ప్రారంభించాం. కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంత వరకు దళితబంధు సహా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయి. రోల్ మోడల్గా జనగామ ఉద్యమ సమయంలో సిద్దిపేట నుంచి సూర్యాపేటకు వెళ్తూ బచ్చన్నపేటలో ఆగాను. ఆ ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్లను అడిగితే.. ఊరిలో యువకులంతా పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లారని చెప్పారు. అలాంటి బచ్చన్నపేటలో ఇప్పుడు 365 రోజులు నీళ్లు ఉంటున్నాయి. జనగామ జిల్లాను అభివృద్ధిలో పథంలో రోల్మోడల్గా మారుస్తాం. మెడికల్ కశాశాల మంజూరుతో అనివార్యంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాల కూడా వస్తాయి. మళ్లీ గెలిచిన నెలలోపే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తా. నాడు చంద్రబాబు మోసపూరిత విధానాలతో దేవాదుల ప్రాజెక్టుకు పూజలు చేసి వదిలేశారు. మేం సమ్మక్క బ్యారేజీని 7.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేశాం. ముత్తిరెడ్డిని నేనే వద్దన్నా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నాకు మంచి మిత్రుడు. కొన్ని అంశాల వల్ల పోటీచేసి సీటు పోగొట్టుకోవద్దని నేనే చెప్పి వద్దన్నాను. జనగామను అగ్రగామి నిలిపేందుకు మన ఇంట్లో మనిíÙలా ఉండే పల్లా రాజేశ్వర్రెడ్డిని అభివృద్ధి దూతగా పంపాను. ఆయనను లక్ష మెజారీ్టతో గెలిపించుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యా: పొన్నాల కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సోమవారం జనగామ సభా వేదికపై గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. జనగామ ప్రాంతంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. ఇక్కడ పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కరెంటు మాయం.. దళితబంధు ఆగం – కాంగ్రెస్ వస్తే రైతుల భూములకు ఎసరు: భువనగిరి సభలో కేసీఆర్ సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. మూడు గంటల కరెంటు చాలంటున్నరు నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిçమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు. సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు. నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. మతం పేరిట విభేదాలు సృష్టించే కుట్ర ఒకప్పుడు కుల, మత ఘర్షణలతో అట్టుడికిపోయే హైదరాబాద్లో గత పదేళ్లుగా ఎలాంటి మతకలహాలు లేవు. శాంతి సామరస్యాల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కానీ కొందరు వచ్చి మతం పేరిట విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఓటంటే వజ్రాయుధం. ఓటు మన తలరాతను, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అబద్ధాలు చెప్పేవారిని నమ్మి అలవోకగా ఓటేస్తే పరిణామాలు వేరే తీరుగా ఉంటాయి. ఆలోచించి వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. -
గత హామీలు ఏమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓట్ల కోసం మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన హామీలు విస్మరించి ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు కొత్తవి ప్రకటించారని మండిపడ్డారు. వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, కేసీఆర్ సకల జనుల ద్రోహి అని దుయ్యబట్టారు. ఆదివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్ బయట పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ అమలు చేయలేదన్నారు. అప్పులు పెంచారు.. అవినీతి పెంచారు.. అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదని విమర్శించారు. పెట్రోల్పై పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం కేసీఆర్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అప్పులపాలు చేసి భ్రష్టు పట్టించారని కిషన్రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ మీద కేంద్రం తమకు వచ్చే ఆదాయం తగ్గించుకొని ట్యాక్స్ తగ్గిస్తే... అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలిసి కొంత పన్ను తగ్గించాయి. పన్ను తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. ‘24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయిలో 24 ఆస్పత్రులు కడతామని హామీ ఇచ్చి ఒక్కటీ కట్టలేదు. మూడెకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి లాంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. మూతపడ్డ కంపెనీలు తెరుస్తామని ఒక్కటీ తెరవలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్కు ఇండ్రస్టియల్ కారిడార్ అన్నారు.. అది ఎక్కడ పోయింది?’ అని కిషన్రెడ్డి నిలదీశారు. గ్రాఫిక్స్ చూపెట్టి మభ్యపెట్టారు ‘ప్రతి ఊరిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ.. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్.. హామీలు ఏమయ్యాయి? కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామాలకు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, పునరుజ్జీవనం చేస్తామన్నారు.. ఏదీ లేదు.. హైదరాబాద్ ఉత్తరాన విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తది అటుంచితే.. వరంగల్ ఎయిర్పోర్టుకు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆకాశ హరŠామ్యలు.. గ్రాఫిక్స్ చూపెట్టి ప్రజలను మభ్యపెట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి ఒక కార్పొరేషన్, రోడ్లకు ఒక కార్పొరేషన్.. హుస్సేన్ సాగర్కు ఒక కార్పొరేషన్.., వాటర్కు ఒక కార్పొరేషన్, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్.. ఇలా లెక్కలేనన్ని కార్పొరేషన్లు చేస్తున్నారు. అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, బ్యాంకుల్లో విచ్చలవిడిగా అప్పులు చేశారు’ అని కిషన్రెడ్డి అని ధ్వజమెత్తారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా.. తెలంగాణను ఉద్ధరిస్తామని మళ్లీ మేనిఫెస్టో తెచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వడ్డీలకే పోతోందన్నారు. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. బెస్ట్ కరప్షన్ ఫ్యామిలీ పాలసీ ‘బెస్ట్ ఎకనమికల్ పాలసీ అని కేసీఆర్ అంటున్నాడు... అది బెస్ట్ కాదు.. వరస్ట్ ఎకనామికల్ పాలసీ. పవర్ పాలసీ బెస్ట్ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్ కాదు.. డేంజర్ పవర్ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉన్నది. బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ అట.. అది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదు.. బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ వాటర్ పాలసీ. బెస్ట్ ఇరిగేషన్ పాలసీ అన్నడు.. అది బెస్ట్ కమీషన్ ఇరిగేషన్ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్ అంటున్నాడు.. కానీ కేసీఆర్ బెస్ట్ కరప్షన్ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్ పాలసీ అమలుచేస్తున్నాడు’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 55 మంది పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోని మొత్తం 55 స్థానాల్లో.. 17 మంది రెడ్లు, ఏడుగురు వెలమ, 12 మంది బీసీ, ముగ్గురు ముస్లిం, ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు కల్పించారు. వీటితోపాటు 12 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్రావు ఇద్దరికీ సీట్లు దక్కాయి. మరోవైపు ఎంపీ ఉత్తమ్తోపాటు ఆయన భార్య పద్మావతిలకు తొలి జాబితాలోనే సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితర సీనియర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. లెఫ్ట్ పొత్తు తేలాక రెండో జాబితా ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచి్చన తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు పూర్తిచేసి విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ తొలి జాబితా ఇదీ.. 1) కొడంగల్: ఎనుమల రేవంత్రెడ్డి 2) మధిర (ఎస్సీ): మల్లు భట్టి విక్రమార్క 3) ఆందోల్ (ఎస్సీ): దామోదర రాజనర్సింహ 4) హుజూర్నగర్: ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి 5) కోదాడ: ఎన్.పద్మావతి 6) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 7) మంథని: దుద్దిళ్ల శ్రీధర్బాబు 8) సంగారెడ్డి: తూర్పు జగ్గారెడ్డి 9) ములుగు (ఎస్టీ): ధనసరి అనసూయ (సీతక్క) 10) భద్రాచలం (ఎస్టీ): పోడెం వీరయ్య 11) కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు 12) మల్కాజ్గిరి: మైనంపల్లి హన్మంతరావు 13) మెదక్: మైనంపల్లి రోహిత్రావు 14) నాగార్జునసాగర్: జయవీర్రెడ్డి 15) జగిత్యాల: టి.జీవన్రెడ్డి 16) బెల్లంపల్లి: గడ్డం వినోద్ 17) మంచిర్యాల: కొక్కిరాల ప్రేమ్సాగర్రావు 18) నిర్మల్: కూచాడి శ్రీహరిరావు 19) ఆర్మూర్: పి.వినయ్కుమార్ 20) బోధన్: పి.సుదర్శన్రెడ్డి 21) బాల్కొండ: సునీల్కుమార్ ముత్యాల 22) ధర్మపురి(ఎస్సీ): అడ్లూరి లక్ష్మణ్కుమార్ 23) నకిరేకల్(ఎస్సీ): వేముల వీరేశం 24) వేములవాడ: ఆది శ్రీనివాస్ 25) రామగుండం: ఎం.ఎస్.రాజ్ఠాకూర్ 26) పెద్దపల్లి: సీహెచ్.విజయరామారావు 27) మానకొండూరు (ఎస్సీ): కవ్వంపల్లి సత్యనారాయణ 28) జహీరాబాద్(ఎస్సీ): ఆగం చంద్రశేఖర్ 29) గజ్వేల్: తూముకుంట నర్సారెడ్డి 30) మేడ్చల్: తోటకూర వజ్రేశ్ కుమార్ 31) కుత్బుల్లాపూర్: కొలను హన్మంతరెడ్డి 32) ఉప్పల్: ఎం.పరమేశ్వర్రెడ్డి 33) చేవెళ్ల(ఎస్సీ): పమేన భీంభారత్ 34) పరిగి: టి.రామ్మోహన్రెడ్డి 35) వికారాబాద్ (ఎస్సీ): గడ్డం ప్రసాద్కుమార్ 36) ముషీరాబాద్: అంజన్కుమార్ యాదవ్ 37) మలక్పేట్: షేక్ అక్బర్ 38) సనత్నగర్: కోట నీలిమ 39) నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్ఖాన్ 40) చాంద్రాయణగుట్ట: బోయ నగేశ్ (నరేశ్) 41) కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ హజ్రీ 42) గోషామహల్: మొగిలి సునీత 43) యాకూత్పుర: కె.రవిరాజు 44) బహదూర్పుర: రాజేశ్కుమార్ పులిపాటి 45) సికింద్రాబాద్: దామ్ సంతోష్కుమార్ 46) అలంపూర్(ఎస్సీ): ఎస్.ఏ.సంపత్కుమార్ 47) అచ్చంపేట(ఎస్సీ): చిక్కుడు వంశీకృష్ణ 48) గద్వాల: సరితా తిరుపతయ్య 49) నాగర్కర్నూల్: కూచుకుళ్ల రాజేశ్రెడ్డి 50) కల్వకుర్తి: కసిరెడ్డి నారాయణరెడ్డి 51) షాద్నగర్: కె.శంకరయ్య 52) ఆలేరు: బీర్ల ఐలయ్య 53) స్టేషన్ ఘన్పూర్: సింగాపురం ఇందిర 54) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి 55) భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు -
60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం ఒరగబెట్టింది.. మరో చాన్స్ ఎందుకివ్వాలి?
సాక్షి, సిద్దిపేట/ హుస్నాబాద్: ‘‘కొన్ని పార్టీలు వచ్చి తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాయి. కానీ ప్రజలు ఇప్పటికే పది చాన్సులు ఇచ్చారు కదా.. 60ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే రాజ్యమేలింది కదా.. ఏం ఒరగబెట్టారు? వారికి ఇంకో చాన్స్ ఎందుకివ్వాలి?’’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు ఇంకా ఇంత దుస్థితిలో ఉన్నారంటే.. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. 60, 70 ఏళ్ల కిందే దళితబంధు వంటి పథకాన్ని ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో పేదరికం ఉండేదా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఇవాళ ఎవరు ఒక్క చాన్స్ అడుగుతున్నారో.. వాళ్లకు 10, 12 చాన్సులు ఇచ్చినా ఏమీ చేయలేదని, వారి విధానాల లోపమే ప్రస్తుత దుస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘సభలో చెప్పిన మాటలు ఇక్కడే విడిచిపెట్టి పోవద్దు. మీ పట్టణం, గ్రామానికి, తండాకు వెళ్లిన తర్వాత కేసీఆర్ చెప్పినదాంట్లో నిజమెంత, అబద్ధమెంత అనేది ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి పోతాయి. కానీ ప్రజలు ఆగమాగం కావద్దు. రాయి ఏదో, రత్నమేదో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ‘తీర్థం పోతాం సమ్మక్క అంటే నేను కూడా వస్తా రామక్క..’ అన్నట్టు అలవోకగా ఓటేయొద్దు. బామ్మర్ది చెప్పాడనో, మా మేనమామ చెప్పాడనో ఓట్లు వేయొద్దు. స్పష్టంగా ఆలోచించి ఓట్లు వేయాలి. మేధో మథనం చేసినం.. మెదడు కరగదీసినం తొమ్మిదిన్నరేళ్ల కింద తెలంగాణలో ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి ఉండేది. వలసలు, కరువు.. సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కొత్తకుండలో ఈగ సొచ్చినట్టు.. కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి? ఏవిధంగా పైకి తీసుకెళ్లాలి?ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే సమస్య ఉండేది. తెలంగాణ వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ మీదనే బాధ్యత పెట్టడంతో.. ఆర్థిక నిపుణులతో రెండు మూడు నెలల పాటు మేధోమథనం చేసినం. మెదడు కరగదీశాం. ఇప్పుడు అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్, సాగు, తాగునీటిలో, పచ్చదనం, పంచాయతీరాజ్ వ్యవస్థ, పారిశ్రమిక విధానం అమలులో టాప్గా మారింది. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చాం.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించింది. భూగర్భ జలాలు కూడా పెరిగి వ్యవసాయానికి స్థిరత్వం వచ్చింది. కడుపు నిండా కరెంట్.. కల్లాల నిండా వడ్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటంతో మోటార్లు కాలడం లేదు. రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ కరువు ప్రాంతం. గతంలో హుస్నాబాద్ వాగుపై ఒక్క చెక్డ్యాం ఉండేది కాదు. నీళ్లుండేవి కాదు. ఇవాళ హెలికాప్టర్లో వస్తుంటే.. వాగుపై వరుసగా మూడు చెక్డ్యాంలు, వాటిలో నిండా నీళ్లు, కనుచూపు మేర పచ్చని పంటపొలాలు కనిపించాయి. కేంద్ర సహకారం లేకున్నా, ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కుట్రలు చేసినా.. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేసుకున్నాం. ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలలు కష్టపడితే అది పూర్తయి లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి. హుస్నాబాద్తో గెలుపునకు నాంది 2018లో ఎన్నికల ప్రచారం కోసం హుస్నాబాద్కే వచ్చా, ఈ గడ్డ ఆశీర్వాదంతో 88 సీట్లతో విజయం సాధించాం. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, ఆశీర్వాదం కోరడానికి వచ్చా. హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలి. ఇవాళ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శం అయ్యాం, మళ్లీ గెలిపిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాం. ఎమ్మెల్యే సతీశ్బాబు 50– 60వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ఉంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గొంతు గరగరతో సీఎం ప్రసంగం ఇటీవల సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. హుస్నాబాద్లో సభలో ఆయన గొంతు గరగరతోనే ప్రసంగించారు. మధ్య మధ్యలో గొంతును సరిచేసుకుంటూ 21 నిమిషాల పాటు మాట్లాడారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్కు సభ వేదికపైనే పార్టీ బీఫారంను కేసీఆర్ అందజేశారు. సభలో బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు: హరీశ్రావు సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూసి ప్రజల హృదయాలు ఉప్పొంగిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే 88 సీట్లతో విజయం సాధించామని గుర్తు చేశారు. మళ్లీ ఇక్కడి నుంచే బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి ఎల్లమ్మ దయతో ఈసారి సెంచరీ సాధించి తీరుతామన్నారు. సీఎం కేసీఆర్ ఏ మాటిచ్చినా తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. -
బీసీ ‘కమలం’!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్ఎస్కు వందమందికి పైగా సిటింగ్ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది. కాంగ్రెస్కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు. వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్పాత్ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు. మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు. 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు. ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో వెళ్లండ’ని సీనియర్ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది. వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్రిజర్వ్డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్మెంట్ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘బీ’.. రె‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో పరుగులు పెడుతున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం మరో కీలక ముందడుగు వేస్తోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నామినేషన్ల ప్రక్రియకు 18 రోజుల ముందే బీ ఫారాలు అందజేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ఇంతవరకు తమ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే బీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. పార్టీ అభ్యర్థులుగా ఇప్పటికే ఖరారైన వారితో పాటు రాష్ట్ర కార్యవర్గం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలకు సంబంధించిన దిశా నిర్దేశంతో భేటీ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం హుస్నాబాద్లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను సుమారు రెండు నెలల క్రితమే ఆగస్టు 21న కేసీఆర్ ప్రకటించారు. 119 స్థానాలకు గాను 115 మందితో జాబితాను విడుదల చేశారు. వీరిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడారు. దీంతో పెండింగులో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్తో పాటు మల్కాజిగిరికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే భేటీలో 114 మందితో పాటు పెండింగ్లో ఉన్న మిగతా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని సమాచారం. పెండింగ్ స్థానాల్లోనూ అభ్యర్థులు ఖరారు? పెండింగ్లో ఉన్న మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్కు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిల పేర్లు ఖరారయ్యాయి. నాంపల్లి నుంచి ఆనంద్గౌడ్, గోషామహల్ అభ్యర్థులుగా నందకిషోర్ వ్యాస్ పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా వారికి పార్టీ నుంచి ఇంకా సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో ప్రకటించిన 114 మందిలో ఆలంపూర్ అభ్యర్థితో సహా ఒకరిద్దరి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతోంది. అసంతృప్తి సద్దుమణగక పోవడం, గెలుపు అవకాశాలు, బీసీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు ఉంటుందని భావిస్తున్నారు. మేనిఫెస్టో సిద్ధం ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, విపక్షాల ఎన్నికల హామీలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రైతులు, మహిళలు, యువత, దళిత, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోకు రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనాకర్షక హామీలతో కూడిన మేనిఫెస్టోను ఆదివారం కేసీఆర్ విడుదల చేయనున్నారు. రైతుబంధు, ఆసరా పింఛను మొత్తం పెంపు, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం/ భారీ సబ్సిడీతో ఇవ్వడం, జర్నలిస్టులకు పింఛను వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. ప్రచార సభలు, సమన్వయంపై దిశా నిర్దేశం కేసీఆర్ ఆదివారం నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేశారు. పోలింగ్ తేదీ నాటికి ఆయన సుమారు వంద సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు 54 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలో బహిరంగ సభల నిర్వహణ, జన సమీకరణ, సమన్వయం, ప్రచార అంశాలు తదితరాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని తెలిసింది. విపక్ష పార్టీల ఎన్నికల వ్యూహాలు, ప్రచారం తదితరాలపై కూడా పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం. కాగా ఆదివారం సాయంత్రం హుస్నాబాద్లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో మేనిఫెస్టోలోని అంశాలను తొలిసారిగా ప్రజల ముందు పెట్టనున్నారు. లక్ష మందితో సభ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 20 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ తొలి సభను హుస్నాబాద్లో నిర్వహించనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్కు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. -
Telangana: రింగ్ లీడర్లు.. ఆ సీట్లపై కమలం నేతల కన్ను
కె.రాహుల్ : హైదరాబాద్తోపాటు నగరం చుట్టుపక్కల రింగ్రోడ్డు చుట్టూ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్లగొండ మరికొన్ని ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పోటీపై పలువురు ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు జోరుగా సాగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తమకున్న వ్యవసాయ భూములకు భారీ డిమాండ్ రావడంతో.. ఆర్థికంగా బలంగా ఉన్నవారంతా టికెట్ సాధనకు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. వీరంతా ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు వెనుకాడే పరిస్థితి లేకపోవడంతో పార్టీ నాయకత్వంలో కూడా వీరిపట్ల కొంత సానుకూలత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. విజయావకాశాలు ఉన్నాయనే.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఏకంగా 48 సీట్లు గెలుపొందింది. ఆ తర్వాత కూడా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అంచనాలతో పలువురు ముఖ్య నేతలు హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులను ఆహ్వానించడంతో...పలువురు నేతలు హైదరాబాద్ పరిసరాల్లో (హెచ్ఎండీఏ పరిధిలో) రెండు, మూడు స్థానాలపై ఆసక్తి చూపిస్తూ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్యెల్యేగా రాజీనామా చేసి మునుగోడు నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి..ప్రస్తుతం మునుగోడుకు బదులు ఎల్బీనగర్ నుంచి పోటీకి జాతీయ నాయకత్వం నుంచి గ్రీన్సిగ్నల్ సాధించినట్టు చెబుతున్నారు. బీజేపీలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సీటు దక్కకపోతే ఇక లోక్సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. గోషామహల్ నుంచి పోటీకి (సస్పెన్షన్ ఎత్తేస్తే) ప్రస్తుత ఎమ్మెల్యే టి.రాజాసింగ్, మాజీ మంత్రి ఎం.ముఖే‹Ùగౌడ్ కుమా రుడు ఎం.విక్రమ్గౌడ్, షాద్నగర్ నుంచి జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి కుమారుడు మిథున్రెడ్డి /అందె బాబయ్య (ముదిరాజ్), భువనగిరి నుంచి బీజేపీ నేత గూడూరు నారాయణ్రెడ్డి/ శ్యాంసుందర్ రావు (వెలమ), మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్/ టి.వీరేందర్గౌడ్, కుత్భుల్లాపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, శేరిలింగంపల్లి నుంచి యోగానంద్ (వైశ్య)/ రవికుమార్ యాదవ్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ /టి. వీరేందర్గౌడ్, మేడ్చల్ నుంచి విక్రమ్రెడ్డి /మోహన్రెడ్డి గట్టిగా పోటీపడుతున్నట్టు సమాచారం. ఇవి కాకుండా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఒక్కోదానికి ఇద్దరు, ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందని, ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు పార్టీలో చర్చ సాగుతోంది. మీకు తెలుసా 1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొన్ని జిల్లాలతో కలసి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. అప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్కు 38 సీట్లు, పీడీఎఫ్ 36, సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది. 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1957లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి. దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కల్పించింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 68, పీడీఎఫ్ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్.సి.ఎఫ్ ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు. తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నిక సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ తరఫున పోటీచేసి భువనగిరి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా విజయం సా«ధించారు. పార్లమెంట్ సభ్యునిగా రావినారాయణరెడ్డి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామం బొల్లేపల్లి.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఉంది. గాసిప్ టైమ్ ధీమా.. బెంగా? రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరే వేరు. వారి రూటే సెపరేటు. అధికారంలోకి వస్తామన్న ధీమానో...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే బెంగనో కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆఖరుకు కుమారుడి కంటే తనకే టికెట్ ముఖ్యమని, అన్ని కలిసి వస్తే మంత్రి పదవి దక్కుతుందని నగరానికి చెందిన ఓ మాజీ ఎంపీ భావిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలేమో ఏకంగా సీఎం సీటునే ఆశిస్తున్నారు. బీజేపీకి పూర్తి భిన్నంగా కాంగ్రెస్ వైఖరి ఉందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్లో అందరూ పెద్దనాయకులే.. అందరూ సీఎం పదవికి పోటీదారులే. అందుకే వారంతా ఎప్పుడో మరో ఐదారు నెలలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా గడప ముందున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే సిద్ధమైపోతున్నారు. అన్ని బాగుండి అధికారంలోకి వస్తే... సరేసరి. ఒకవేళ ఓడిపోయినా.. తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుందన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరిగి పార్లమెంట్కు ఎన్నికై కాంగ్రెస్ వాణిని, రాష్ట్ర సమస్యలను గట్టిగానే వినిపించారన్న పేరు ఉంది. -
రెంటికీ చెడ్డా... ఇంటిపోరు..!
మేకల కళ్యాణ్ చక్రవర్తి : 2014, 2018 ఎన్నికల్లో పరాభవం తర్వాత మూడోసారైనా ప్రజలు తమకు పట్టం కట్టబోతారా అనే కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రెండు ఎన్నికల్లోనూ ఓటమిపాలైనా త్వరలో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో విజయతీరాలకు చేరడం ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాందీకి బహుమానంగా అధికారాన్ని అప్పగించాలని కలలు కంటోంది. పదేళ్లుగా అధికారానికి దూరం కావడం ద్వారా ఏర్పడిన నైరాశ్యానికి తోడు పార్టీలో ముదిరిన అంతర్గత విభేదాలు వెరసి మళ్లీ పాత ఫలితాలే పునరావృతమవుతాయేమో అనే సందేహాలు లేకపోలేదు. కానీ నేతలు వెళ్లినా పార్టీని విడిచి వెళ్లని కేడర్ భుజాలపై ఎక్కి ప్రభుత్వ వ్యతిరేకత అనే తూటాలను పేల్చుకుంటూ పవర్ ‘అ్రస్తాన్ని’ దక్కించుకునేందుకు పాట్లు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ముంచిన ‘మహా కూటమి’... రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ రెండోసారి కూడా వ్యూహం లేక చతికిలబడిపోయింది. కాంగ్రెస్ అంచనాలకు అందకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడం ద్వారా కేసీఆర్ ఆ పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఇతర పార్టీలతో పొత్తులు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంపముంచాయి. టీడీపీ పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కుదేలైంది. చంద్రబాబు ఎంట్రీ వరకు ఓటర్లలో ఎంతోకొంత సానుకూలత వ్యక్తమైనా, ’బాబుగోరు’ ప్రచారం ప్రారంభించిన నాటి నుంచే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పతనమయ్యాయి. సీపీఐ, టీజేఎస్ లాంటి పార్టీల తోడ్పాటు ఏ మాత్రం లభించకపోవడంతో కేవలం 19 స్థానాల్లో గెలుపొంది మరోమారు విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. ‘చేతి’లో సత్తువ లేకుండానే... వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమితో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పదేళ్లు అధికారంలో లేకపోవడంతో పార్టీ కేడర్ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. చెప్పుకోదగిన పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో హస్తం పార్టీ చేతిలో సత్తువ లేదనే స్థాయికి వెళ్లిపోయింది. అయితే, నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు వీడి వెళ్లినా కేడర్ మాత్రం మిగిలే ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. పార్టీ కేడరే శ్రీరామరక్షగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గెలిపిస్తుందన్న ధీమాతో ఈసారి 2023లో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతోంది. 2014లో అలా...! రాష్ట్ర ఏర్పాటు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హడావుడి చేసింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం నుంచి రాష్ట్ర ఏర్పాటు తేదీ వరకు నానా హంగామా చేసినా ఆనాడు టీఆర్ఎస్ దూకుడు ముందు నిలవలేకపోయింది. కేసీఆర్ ఆర్భాటానికి తోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై వెల్లువెత్తిన వ్యతిరేకతతో 2014లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలో 21 సెంబ్లీ స్థానాల్లోనే గెలుపుతో సరిపెట్టుకుంది. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. అదే సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరింత కంగుతింది. రెండు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేంతవరకు నిర్వహించిన దాదాపు అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా... ఇక ఇప్పుడు.. పార్టీ కేడర్ చెక్కుచెదరలేదని, కర్ణాటక రాష్ట్రంలో గెలుపుతో వచ్చిన కొత్త ఉత్సాహంతో బీజేపీని వెనక్కునెట్టి అధికారం దక్కించుకునే రేసులోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, ఆ పార్టీకి ఎప్పటిలాగే వర్గపోరు శాపంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కలహాలు, కీచులాటలకు కేరాఫ్ అడ్రస్గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. సీనియర్లు, జూనియర్లనే విభేదాలకు తోడు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి, నేతల మధ్య తీవ్ర విభేదాలు వెరసి ఇప్పటివరకు టికెట్లను కూడా ప్రకటించలేని పరిస్థితి కాంగ్రెెస్లో నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చెక్కుచెదరని కేడర్ను ముందు నడిపిస్తూ బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ, ఆరు గ్యారంటీ పథకాలతో విజయానికి బాటలు వేసుకుని ఈసారైనా అధికార పీఠం ఎక్కాలనేది కాంగ్రెస్ లక్ష్యం. -
అసంతృప్తిపై వారు..అభివృద్ధిపై వీరు..
భాషబోయిన అనిల్ కుమార్ : గోదావరి నది ఒడ్డున సింగరేణి కార్మికక్షేత్రం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి ధార్మిక క్షేత్రాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలయం. ఉద్యమాలకు, పోరాటాలకు పురిటిగడ్డగా ఉంటూనే సెంటిమెంటుకు ఆలవాలంగా, విలక్షణ తీర్పులకు వేదికగా ప్రసిద్ధికెక్కింది. ఉద్యమాల ఖిల్లా, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్లో 2014 నుంచి నేటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ హవా సాగుతోంది. అభ్యర్థుల ప్రకటనతో దాదాపుగా నెలరోజులు ముందుగానే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ప్రచారం ప్రారంభించారు. ఈసారి కూడా సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ మేరకు గెలుపు వ్యూహాలు రచిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్.. అభివృద్ధి జపం! తెలంగాణకు ముందు– తరువాత పరిస్థితులను చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళికలను రచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మునుపెన్నడూలేని భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన వేల ఎకరాలు, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, జాతీయ రహదారులు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, దళితబందు, రైతబంధు, రైతుబీమా, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు తమను ఉమ్మడి జిల్లాలో మరోసారి గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో 13 అసెంబ్లీ స్థానాలున్న కరీంనగర్ జిల్లా పాత్ర కీలకం. ప్రతిసారీ 12 స్థానాలు గెలుస్తుండగా..పార్టీని వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి గెలవడంతో ఇక్కడ బలం 11 స్థానాలకు చేరింది. అయితే ఈసారి మొత్తం 13 సీట్లూ తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పథక రచన చేస్తోంది. విపక్షాల ప్రచారాస్త్రాలు ♦ తమ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ♦ ప్రజావ్యతిరేకత, పాలనపై ఉద్యోగుల్లో అసంతృప్తి, యువ ఓటర్లలో సానుకూలత తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. ♦మైనార్టీ రుణాలు, బీసీబంధు కేటాయింపులో కొన్నిచోట్ల అర్హులకు చోటు దక్కకపోవడాన్ని విపక్షాలు ప్రచారా్రస్తాలుగా చేసుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ ఆయుధాలు..! ♦ సంక్షేమ పథకాలు, దళితబంధు, పైలట్ ప్రాజెక్టులు.. ♦ ఉమ్మడి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, సిరిసిల్లలో ఆక్వా హబ్, కరీంనగర్లో మానేరు రివర్ ♦ ఫ్రంట్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు. ♦ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్, స్మార్ట్సిటీ నిర్మాణం, కొండగట్టు, వేములవాడ మాస్టర్ప్లాన్లు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై తకరారు..! కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలను కొందరు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జగిత్యాల, మంథని, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మానకొండూరు, పెద్దపల్లి స్థానాలు తమ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ దీమాతో ఉంది. అయితే పార్టీలో అంతర్గత కలహాలు, ప్రతి స్థానానికీ పదుల సంఖ్యలో ఆశావహులు (అధికారికంగా 85 మంది) పోటీపడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయా స్థానాల్లో నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక బీజేపీ విషయంలో సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగిలిన వారి విషయంలో స్పష్టత రాలేదు. వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మానకొండూరులకు అభ్యర్థులు దొరికినా ఇంకా ఖరారు కాలేదు. కారుకు స్పీడ్బ్రేకర్లు ఇవే..! ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన పునాదులు ఉన్నా.. కొన్ని విషయాలు పార్టీని కలవరపెడుతున్నాయి. పెద్దపల్లిలో పార్టీ రెబెల్ నల్ల మనోహర్రెడ్డి బరిలోకి దిగితే కారు ఓట్లు చీలే అవకాశముంది. రామగుండంలో రెబెల్ కందుల సంధ్యారాణి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యతిరేక వర్గం పార్టీకి ప్రతికూలంగా తయారయ్యారు. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు స్థానంలో చెలిమెడ లక్ష్మీ నరసింహారావుకు పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో రమేశ్ ఎంతమేరకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్కు పోటీగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో దిగితే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓటమికి బీఆర్ఎస్ చెమటోడ్చాల్సి ఉంటుంది. మంథనిలో శ్రీధర్బాబును ఓడించడానికి కారు పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఎంపీ బండి సంజయ్ బలమైన నాయకుడు అయినప్పటికీ.. కరీంనగర్లో పోటీపై అనాసక్తిగా ఉన్నారని సమాచారం. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్కు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి. చొప్పదండిలో సొంత పార్టీ నేతల అసంతృప్తి కలవరపెడుతోంది. -
ఎన్నికల సందడి.. స్టార్ క్యాంపెయినర్లతో విమానాలకు డిమాండ్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు. ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అద్దె లక్షల్లోనే... బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్సెట్గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది. జాతీయ పార్టీల నుంచి డిమాండ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో.. హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు. ప్రచార రథాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి. అంబర్పేట్ పటేల్నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్నగర్కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రచార రథాలకు మేకప్.... నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. -
ఒక్క నియోజకవర్గాన్నీ వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో దూకుడుగా ముందుకెళ్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. వరుసగా పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్షోలు, స్థానికంగా అభ్యర్థులు పాల్గొనే ప్రచార సభలతో.. ఏ నియోజకవర్గాన్ని, వాటి పరిధిలోని గ్రామాలను వదలకుండా ‘కార్పెట్ బాంబింగ్’ను తలపించేలా ‘కార్పెట్ కాన్వాసింగ్ (ప్రచారం)’ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలని, ప్రతిపక్షాలను ఉక్కిరిబి క్కిరి చేసేలా వ్యూహాలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి తన్నీరు హరీశ్రావులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, జన సమీకరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీ నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పలువురు కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన అంశంపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఎక్కడా వదలకుండా.. సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 10న నామినేషన్ల గడువు ముగిసి, తుది అభ్యర్థులు ఖరారవుతారు. ఆ తర్వాత మరో 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనేలా సభల షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ‘కార్పెట్ బాంబింగ్’ తరహాలో వరుసగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం పాల్గొనే సభలన్నింటికీ భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ సుమారు 60కిపైగా నియోజకవర్గాల్లో రోడ్షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ పరిధిలో కేటీఆర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్రావు స్థానిక ప్రచార ఇన్చార్జులుగా ఉంటూనే.. తాము పోటీచేసే నియోజకవర్గాల్లో, ఇతర చోట్ల సమన్వయ బాధ్యతలను చూడాల్సి ఉండనుంది. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు పార్టీలో సమన్వయంతోపాటు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పనిచేయనున్నారు. ఇక పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించడం, ఇతర కీలక నేతలతో సమన్వయం కోసం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జుల నియామకాన్ని చేపట్టారు. ప్రస్తుతానికి 54 మంది పేర్లు ఖరారు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ కీలక నేతలు ఈ ఇన్చార్జుల జాబితాలో ఉన్నారు. ఇక నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే బాధ్యతను హరీశ్రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ‘వార్ రూమ్’తో వ్యూహాల అమలు బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులతోపాటు విపక్షాల సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించేలా సిద్ధం చేశారు. బూత్స్థాయి నుంచీ పార్టీల బలాలు, బలహీనతలు, స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు వంటివన్నీ అందుబాటులో పెట్టారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యులు జగన్మోహన్రావు, దినేశ్ చౌదరి, సతీశ్రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు వార్రూమ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు. చేరికలపై మరింత ఫోకస్ బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విపక్షాల్లోని బలమైన నేతలెవరు, వారిలో బీఆర్ఎస్లో చేరేందుకు ఉన్న అవకాశం, పార్టీలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చొరవపై ఓ ప్రైవేటు సర్వే సంస్థ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తోంది. దీని ఆధారంగా ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. విపక్షాల్లో టికెట్ దక్కని అసంతృప్తులను బీఆర్ఎస్ గూటికి చేర్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డితోపాటు ఓ మాజీ మంత్రి త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. సాంస్కృతిక బృందానికి దిశానిర్దేశం కవి గాయకుడు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్షోలతోపాటు ఎన్నికల ప్రచారంలో కీలకమైన సాంస్కృతిక, కళా బృందాలు ఏమేం చేయాలన్న దానిపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని చాటడంతోపాటు తెలంగాణ ఉద్యమకాలం నాటి సెంటిమెంటును రగిల్చేలా ఆటపాటలు ఉండాలని సూచించారు. -
పదేళ్ల అభివృద్ధితో ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు అన్ని నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉందని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు తీసుకెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల సమన్వయం కోసం నియమించిన 54 మంది నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిలతో మంత్రి హరీశ్రావుతో కలిసి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతీ ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలిచ్చేందుకు వేదికలు మాత్రమేనని, బీఆర్ఎస్కు మాత్రం తాము చేసిన అభివృద్ధిని వివరించే అద్భుత అవకాశమన్నారు. ఇన్చార్జిలు తక్షణమే రంగంలోకి దిగి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సహకారం అందించండి: హరీశ్ రాబోయే 45 రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని ఇన్చార్జిలకు హరీశ్ విజ్ఞప్తి చేశారు. -
TS Politics: బీసీ రూట్లో బీజేపీ!
ప్రధాని మోదీ బీసీ అంటూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేపీ జెండా.. బీసీలకు అండ’ నినాదంతో ముందుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. బీసీ అయిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, గతంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన బీఎస్ యడ్యూరప్ప తదితరులు వెనుకబడిన వర్గాల వారేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ బీసీలకు అండగా నిలిచేది, అవకాశాలు ఇచ్చేది బీజేపీనే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తు న్నట్టు వివరిస్తున్నారు. బీసీల ఓటును కూడగట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రూట్లో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రయోగానికి దారులు వేస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం, అధికారంలో తగిన వాటా, గుర్తింపుతోపాటు అన్ని కలసి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆ వర్గాలకు చెందిన వారినే కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేకపోవడంతో.. ఎన్నికల సమరం ముగిసేదాకా బీసీ సీఎంను ప్రకటించడం జరగకపోవచ్చని ఆ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. ఎస్సీ 19, ఎస్టీ 12 రిజర్వ్డ్ సీట్లు పోగా, మిగతా 88 సీట్లలో 40కిపైగా సీట్లను బీసీలకు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. వెనుకబడిన వర్గాలను ఆకర్షించేలా.. రాష్ట్ర జనాభాలో 50శాతానికిపైగా బీసీలు ఉండటంతోపాటు ఎస్సీ, ఎస్టీలనూ కలిపితే 85శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారే ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ వర్గాల ఓట్లను సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉన్నాయని.. వాటిలో ఏది అధికారంలోకి వచ్చినా బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. వారు బీసీని సీఎం చేయడం కాదుగదా.. కేబినెట్లోనూ తగిన అవకాశాలు కల్పించడం కష్టమేనని చెప్తున్నారు. ఆ పార్టీలు ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జాతీయ స్థాయిలో ఎక్కడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచాక టీఆర్ఎస్ కేబినెట్లలో బీసీవర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవని.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా కల్పించలేదని విమర్శిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పథకాలు సరిగా అమలు కాలేదని.. బీసీ బంధు అమలు కూడా నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించేలా ప్రచారం చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని చెప్తున్నారు. బీసీలలో బీజేపీ పట్ల విశ్వాసాన్ని కల్పించేలా అసెంబ్లీ ఎన్నికల్లో 40కిపైగా సీట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవకాశాలు వివరిస్తూ.. బీసీల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోదీ సారథ్యంలో.. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు ప్రాతినిధ్యం, దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీసీల కోసం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు.. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన ఎంబీసీల కోసం పీఎం విశ్వకర్మయోజన పథకం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, సదుపాయాల కల్పన వంటివి చేపట్టినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ చర్యల ద్వారా జాతీయ స్థాయిలో బీసీల మద్దతు కూడగట్టగలిగామని.. తెలంగాణలోనూ ఈ ఎజెండాతో ముందుకు తీసుకెళ్లాలని నాయకత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీలోనూ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా కె.లక్ష్మణ్కు అవకాశం కల్పించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం, అధ్యక్ష పదవి మార్పు తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్కు పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియామకం, ఎంపీగా ధర్మపురి అర్వింద్కు అవకాశం వంటి వాటిని వివరిస్తున్నారు. బీసీ నేతలను ముందు నిలిపి.. ఇప్పటికే రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకునేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణను లక్ష్మ ణ్, సంజయ్, ఈటల తదితరులకు బీజేపీ అప్పగించింది. ఆయా కుల సంఘాలు, వర్గా ల వారీగా పార్టీ సదస్సులు, సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు బీసీ నేతలను ముందు నిలిపి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయం, వారు నిర్లక్ష్యానికి గురైన తీరును గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని.. ఇదే సమ యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను భావిస్తోంది. -
దసరా తర్వాతే బస్సు యాత్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలసి నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ యాత్రను ముందుగా అనుకు న్నట్టు ఈ నెల 15 నుంచి కాకుండా దసరా పండుగ తర్వాత ప్రారంభించాలని పీసీసీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా బస్సు యాత్రను కొనసాగించడం ద్వారా అప్పటివరకు పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని కొనసాగించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో అసమ్మతి బెడద నుంచి బయటపడేందుకే యాత్రను వాయిదా వేసినట్టు పలువురు నేతలు పేర్కొంటున్నారు. రెండు ప్రతిపాదనలు వాస్తవానికి ఈనెల 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున అన్ని జిల్లాలను చుట్టివచ్చేలా బస్సుయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు పీఏసీలో బస్సుయాత్రపై చర్చించిన నేతలు రెండు ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 15 నుంచి 22 వరకు యాత్ర చేయాలని.. లేదంటే దసరా తర్వాతి నుంచి ఎన్నికలదాకా నిర్వహించాలని.. ఈ రెండింటిలో జాతీయ నాయకత్వం సూచన మేరకు ఏదో ఒక షెడ్యూల్ను ఖరారు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మీడియాకూ చెప్పారు. ఇందులో రెండో ప్రతిపాదనకే అధిష్టానం మొగ్గు చూపిందని, దసరా తర్వాతే యాత్రకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ఐక్యంగా ఉన్నామని చాటేందుకే.. బస్సు యాత్ర వాయిదా వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఈ నెల 16న లేదా 18న ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తేలకుండానే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోజనం ఉండదన్న ఆలోచన వచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా ఈనెల 15 నుంచి ప్రారంభిస్తే యాత్ర మధ్యలో ఉండగానే అభ్య ర్థులను ప్రకటించాల్సి ఉంటుందని, టికెట్లు రాని వారి అసమ్మతి ప్రభావం యాత్రపై పడుతుందన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. ఈ మేరకు గొడవల మధ్య యాత్ర నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉండదనే భావనకు అధిష్టానం వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దసరా తర్వాత యాత్ర చేపట్టడం ద్వారా.. ఆ సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించి.. ఎన్నికల ప్రచారానికి ఊపు తేవచ్చనే ప్రణా ళికతో వాయిదాకే మొగ్గుచూపినట్టు వివరిస్తు న్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నారని ప్రజల్లో భావన కలిగించే ఉద్దేశమూ దెబ్బ తినదన్న ఆలోచన చేసినట్టు పేర్కొంటున్నాయి. -
తెలంగాణ ఎన్నికలు.. బీజేపీ బ్రహ్మాస్త్రాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి దీటైన ఆయుధాలను కాషాయ దళం సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే క్రమంలో తన అమ్ముల పొదిలోని అ్రస్తాలను ఒక్కొక్కటిగా బయటకు తీయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ భృతి వంటి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన వాగ్దానాలను సైతం నెరవేర్చక పోవడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో అవినీతి, ‘ధరణి’లో అక్రమాలు, ఆయా అంశాలకు సంబంధించి వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనన్న తమ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒక్కటేనన్న అభిప్రాయం ప్రతి ఒక్క ఓటరుకూ కలిగేలా వివరించేందుకు వివిధ అంశాలను సిద్ధం చేసుకుంటోంది. తద్వారా అధికార బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఓటుకు కోట్లు’ కేసును, 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరడాన్ని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్లోకే వెళతారనే విష యాన్ని ప్రజల హృదయాల్లో నాటుకునేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ‘ఓటుకు కోట్లు’పై స్పెషల్ ఫోకస్ ‘ఓటుకు కోట్లు’ కేసులో.. నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన సంగతి తెలిసిందే. కాగా కేసీఆర్ సర్కార్ ఈ కేసులో ఏసీబీ తదుపరి విచారణ జరపకుండా అటకెక్కించడాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం సాగించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీని ఇది స్పష్టం చేస్తోందంటూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని సాగుతున్న దు్రష్పచారాన్ని తిప్పి కొట్టేందుకూ ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ ఆస్త్రం ఎన్నికల్లో తమకు బాగా ఉపయోగ పడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. 2015లో తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు టీడీపీ పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభాలకు గురిచేయడాన్ని స్పై కెమెరాలతో రికార్డ్ చేయడంతో పాటు రేవంత్రెడ్డిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొన్నిరోజులు జైల్లో గడిపిన రేవంత్రెడ్డి బయటకు రాగా.. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కైన బీఆర్ఎస్ దీనిపై తదుపరి విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా అటకెక్కించిందని బీజేపీ ముఖ్యనేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి విదితమే. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం కారణంగానే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. దీనితో పాటు రేవంత్రెడ్డికి, బీఆర్ఎస్ నాయకురాలితో ఉన్న రహస్య వ్యాపార సంబంధాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ రెండు పార్టీలు ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లో బలపడేలా చేయాలని యోచిస్తోంది. అలాగే ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కాదని కాంగ్రెస్, ఇతర పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలపడం, ప్రధాని మోదీపై కాంగ్రెస్, ఇతర పక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా బీఆర్ఎస్ మద్దతు పలకడం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. వైఫల్యాలపై విస్తృత ప్రచారం గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టడాన్ని, నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతి ఇవ్వకుండా అన్యాయం చేయడాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని భావిస్తోంది. తద్వారా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువజనులను (పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు) బీజేపీ వైపు తిప్పుకునేలా పావులు కదుపుతోంది. అలాగే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు హామీ పూర్తిస్థాయిలో నిలుపుకోకపోవడం, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అనుయాయులకు ఎక్కువగా కేటాయించడం ఎండగట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జరిగిన నష్టం, అన్యాయం గురించి, వివిధ పథకాల పేరిట ప్రచారమే తప్ప పెద్దగా మేలు చేయకపోవడం, ప్రయోజనం కల్పించకపోవడాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈ వర్గాల మద్దతును కూడా కూడగట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, తదితర పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమైన తీరును, గిరిజన బంధు, బీసీ బంధు అంటూ ఊరించడం తప్ప ఎలాంటి కార్యాచరణను చేపట్టకపోవడాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అవినీతి, అక్రమాలు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అవినీతిని బాగా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. కాళేశ్వరం కేసీఆర్ సర్కార్కు ఏటీఎంలా మారిందని బీజేపీ అగ్రనేతలు సైతం పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధరణి పోర్టల్ తెచ్చి రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా బీజేపీ ఆరోపిస్తున్న విషయం విదితమే. కాగా ఇప్పుడు కూడా ధరణితో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని తమ సొంత భూములపై హక్కుల విషయంలో ఆందోళనకు గురిచేసి పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ అవకాశమిచ్చిందంటూ ప్రచారం చేయాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ అ్రస్తాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి బాధిత రైతులు, ప్రజలు, వారి కుటుంబసభ్యుల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. -
ప్రజలకు ఏం కావాలో గ్రహించలేదా?
తెలంగాణకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. పార్టీలు సైతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 15న మేనిఫెస్టోను విడుదల చేస్తామని అధికార బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకా కసరత్తు జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని బీజేపీ పేర్కొంటున్నది. దీంతో ప్రజలకు ఏం కావాలో ప్రధాన పార్టీలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్య మున్నా ఎన్నికల కదన రంగంలో మాత్రం కాంగ్రెస్ ముందుగానే దూకిందని చెప్పాలి. గత మేలో వరంగల్లో రాహుల్ గాంధీతో సభ నిర్వహించి ‘రైతు డిక్లరేషన్’ను ‘హస్తం’ పార్టీ ప్రకటించింది. అధికా రంలోకి వస్తే రైతులకు ఏమేం చేసేదీ దాంట్లో పేర్కొన్నది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, యూత్ డిక్లరేషన్లను ప్రకటించింది. దీంతోపాటు మహిళలు, బీసీలు తదితరులపై డిక్లరేషన్లను ప్రకటించడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ‘ఆరు గ్యారెంటీ’ల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్తృతంగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. అయితే మేనిఫెస్టోను ఇప్పటికీ ఎందుకు ఫైనల్ చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇంకెంత కాలం అభిప్రాయాలను సేకరిస్తుందోననే అనుమానం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే ఉంది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ ఇప్పటికీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే అక్టోబర్ 15న రిలీజ్ చేస్తామని ఇటీవల తేదీని నిర్ణయించింది. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. దీంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తే బడ్జెట్ సెట్ చేయడం కష్టమేనని బీఆర్ఎస్కు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందనిపిస్తోంది. ‘గృహలక్ష్మి’, బీసీ, మైనార్టీలకు ‘చేయూత’ లాంటి స్కీమ్స్ను లేటుగా అయినా ప్రవేశపెట్టి అమలు ప్రారంభించి తాము ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నామనే సంకేతాన్ని పంపడానికి ప్రయత్నించింది. అయితే తూతూమంత్రంగా అమలు చేయడంతో వీటి వల్ల ప్రజల్లో పార్టీ పట్ల పాజిటివిటీ రాలేదు. మరోవైపు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తుండడంతో తప్పని సరిగా మేనిఫెస్టోలో పలు హామీలను చేర్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయినట్లు తెలుస్తున్నది. మహిళల కోసం బీఆర్ఎస్ తెచ్చే స్కీమ్ ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేస్తుందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించడం కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రభావంతోనే అని అర్థమవుతోంది. కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. అయితే కన్నడ ఓటర్లు బీజేపీని తిరస్కరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. మరోవైపు బండి సంజయ్ను స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో బీజేపీ పతనం మొదలైంది. మేనిఫెస్టో తయారీని కూడా ఆ పార్టీ లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతున్నది. తాము ఉచితాలకు వ్యతిరేకమని ఇప్పటికే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. సంక్షేమమే తమ ధ్యేయ మనేది వారి మాట. దీంతో బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజల్లోనూ ఆసక్తి కనిపించడం లేదు. షెడ్యూల్ రావడానికి ఐదు రోజుల ముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ‘మేనిఫెస్టో కమిటీ’ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఇది నోటిమాటగానే తప్ప దీన్ని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. దశా బ్దాలుగా ప్రజలను పాలించిన, పాలిస్తున్న పార్టీలు ప్రజలకు ఏం కావాలో ఇప్పటికీ గ్రహింపు లేక పోవడం విడ్డూరంగానే ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మొబైల్: 96404 66464