kharif
-
కొనుగోలు కేంద్రాలు క్లోజ్!
సాక్షి, అమరావతి: ఇటు మద్దతు ధరలు లేవు.. అటు కొనుగోలు చేసే నాథుడు లేడు! ధాన్యం రైతులను టీడీపీ కూటమి సర్కారు ముప్పుతిప్పలు పెడుతోంది. రైతు సేవా కేంద్రాల్లో కేవలం పేరుకు మాత్రమే సేకరణ చేస్తూ అన్నదాతల కష్టాన్ని దళారులు, మిల్లర్లకు దోచిపెడుతోంది. సంక్రాంతి తర్వాత నూర్పిడులు చేసిన ధాన్యం రాసులు ఇప్పటికీ శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుప్పలుగా పంట పొలాల్లోనే కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముందస్తు దిగుబడి అంచనాలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం దారిదాపుల్లో కూడా లేదు. రబీ సాగు ఊపందుకున్నా.. పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లే సమయాల్లో లక్ష్యం తగ్గిపోతూ వచ్చింది. అతి కష్టంమీద 33. లక్షల టన్నులను సేకరించారు. గోదావరి జిల్లాల్లో జనవరి నెలాఖరు నుంచి కొనుగోళ్లు క్రమంగా నిలిపివేశారు. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో ఇప్పటికీ ఖరీఫ్ రెండో ముందస్తు అంచనాలతోనే కొట్టుమిట్టాడుతోంది. ఖరీఫ్లో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వ్యవసాయ శాఖ అక్టోబర్ ముందస్తు అంచనాల ప్రకారం 84 లక్షల టన్నుల దిగుబడి, జనవరి రెండో ముందస్తు అంచనా ప్రకారం 79 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. విపత్తులతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇందులో ఎంత కాదనుకున్నా సుమారు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంచనాలకు ఆమడ దూరంలో కొనుగోళ్లు వైఎస్సార్ జిల్లాలో 1.71 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా ప్రభుత్వం కొనుగోలు చేసింది 18 వేల టన్నుల ధాన్యం మాత్రమే. పల్నాడులో 2.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా అయితే కొన్నది 12 వేల టన్నులే. బాపట్లలో దిగుబడి అంచనా 5.54 లక్షల టన్నులు అయితే 87 వేల టన్నులే కొనుగోలు చేశారు. గుంటూరులో 3.69 లక్షల టన్నులకు గాను 36 వేల టన్నులు కొన్నారు. అనకాపల్లిలో 2.70 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తే 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఫైన్ వెరైటీలకు మార్కెట్లో పెద్దగా రేటు రాకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు. రైతు సేవా కేంద్రాల వారీగా టార్గెట్లు ధాన్యం కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాల వారీగా ప్రభుత్వం టార్గెట్లు విధించింది. టార్గెట్ పూర్తయిన చోట ధాన్యం విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గత నెలలో కృష్ణా జిల్లాలో, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సిండికేట్గా మారిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరించడం లేదు. కనీసం ఆన్లైన్లో కూడా నమోదు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు షెడ్యూల్ ఇస్తే గోతాలు వస్తాయి. వాటిల్లో పంటను భద్రపరిచి జాగ్రత్త చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దళారులు, మిల్లర్ల కనుసన్నల్లో సేకరణ జరుగుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. మధ్యవర్తులు, దళారులు, కమీషన్ ఏజెంట్లు నిర్దేశించిన రేటుకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.బస్తాకు రూ.400–500 నష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల దోపిడీని ప్రోత్సహించింది. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్కు రూ.1740గా మద్దతు ధర ప్రకటించింది. కానీ తేమ శాతం పేరుతో రైతుల నడ్డి విరిచేశారు. దీంతో రైతులు ఒక్కో బస్తా రూ.400 – 500 నష్టానికి విక్రయించిన దుస్థితి. దీంతో టన్నుకు సుమారు రూ.6 వేలకుపైగా నష్టం వాటిల్లింది. ఈ లెక్కన ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ.7,790 కోట్ల విలువైన 33.80 లక్షల టన్నుల్లో రైతులకు దక్కాల్సిన సుమారు రూ.2 వేల కోట్లకు పైగా మద్దతు ధరను మధ్యవర్తులు, మిల్లర్లు మాటున దోచేశారు. మిల్లరు కనుసైగ చేస్తే తప్ప కల్లాల్లో నుంచి ధాన్యం కదలని పరిస్థితి. పోనీ జీఎల్టీ వస్తుంది కదా అని రైతు సొంతంగా వాహనం సమకూర్చుకుని ధాన్యం తరలిద్దామనుకుంటే దించేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కుప్పల్లో.. కల్లాల్లోనే ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి తర్వాతే పంట విక్రయానికి వస్తుంది. ఖరీఫ్లో 4.90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు తాత్కాలిక టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ 7.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం కావాలనే తక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుప్పల్లో, కల్లాల్లో సుమారు 1.50 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. మరోవైపు ధాన్యం ఉన్న చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. ఇచ్చాపురం, కవిటి, కంచలి, పలాస, రణస్థలం, లావేరు, ఎచెర్ల, తదితర మండలాల్లో 118 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారు. 20 – 30 రోజులు గడిచినా సొమ్ము ఖాతాల్లోకి జమ కావడం లేదని రైతులను వాపోతున్నారు. ఇదే అదనుగా దళారీలు 75 కిలోల బస్తాకు మద్దతు ధర కంటే సుమారు రూ.400–300 వరకు తగ్గించి కొంటున్నారు. నెల్లూరులో ఇప్పుడిప్పుడే పంట కోతకు రావడంతో తాత్కాలికంగా 20 వేల టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చారు. నాడు కట్టడి.. నేడు ఇష్టారాజ్యం.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్లు దందాను కట్టడి చేసింది. ప్రభుత్వమే సంపూర్ణ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. బహిరంగ మార్కెట్లో సైతం ధాన్యం రేట్లు పెరిగాయి. తొలిసారిగా దొడ్డు బియ్యానికి మంచి గిరాకీ లభించింది. తాము తక్కువ రేటు ఇస్తే రైతులు ప్రభుత్వానికే పంటను విక్రయిస్తారని గ్రహించిన దళారులు సైతం మద్దతు ధరకు మించి పంటను కొనుగోలు చేసిన సందర్భాలు తొలిసారిగా కనిపించాయి. కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం పరిస్థితి తలకిందులైంది. సాధారణ రకాలకు మద్దతు ధర లేకపోగా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నాలకు (ఫైన్ వెరైటీలు) ధర పడిపోయింది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని పండించిన రైతులకు దళారులు చుక్కలు చూపించారు. 75 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుందని రైతులు ఆశించగా రూ.1,400 – రూ.1,500కి మించి కొనలేదు. కడప ప్రాంతంలోనూ సన్నాలకు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. కృష్ణా డెల్టాలో అధికంగా పండించే ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్ ఫైన్ వెరైటీ రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. -
రాష్ట్రానికి 17.31 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ –2025 సీజన్ కోసం రాష్ట్రానికి 17.31లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తూ కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన ఖరీఫ్–2025 పంటల జోనల్ సదస్సులో ఈ మేరకు ప్రకటన చేసింది. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా 55.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 71 శాతం నేలల్లో నత్రజని, 17.56 శాతం నేలల్లో భాస్వరం, 13 శాతం నేలల్లో పొటా‹Ù, 38 శాతం నేలల్లో సూక్ష్మపోషకాలైన జింక్, 31 శాతం నేలల్లో ఐరన్, 21 శాతం నేలల్లో బోరాన్, 13 శాతం నేలల్లో మాంగనీస్ లభ్యత తక్కువగా ఉన్నట్టుగా గుర్తించామన్నారు. యూరియా, డీఏపీ ఎరువుల స్థానంలో నానో యూరియా, నానోడీఏపీ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. -
మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మునిగిన పత్తి రైతు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. దేశంలోనే మూడో స్థానం ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.వరి దిగుబడి పెరగడంతో ఆనందం ఈ ఖరీఫ్లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్తో ధరలు పెరిగాయి. ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది. -
దిక్కులు చూస్తున్న దుక్కులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తీవ్ర ఒడిదుడుకుల మధ్య రైతన్నలు ఖరీఫ్ సాగు చేపట్టగా ముందస్తు రబీ ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. రైతన్న చేతికి ఇంతవరకూ పెట్టుబడి సాయం అందకపోవడం.. డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులను సమకూర్చకపోవడం, ఇన్నాళ్లూ చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఒకపక్క ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి..! కానీ రెండో పంటకు నీరు అందుతుందనే భరోసాను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతన్న కదం తొక్కుతున్నాడు!! ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల ఆశలను నీరుగార్చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం రబీ పంటల సాగుపై పడింది. గతేడాది ఈపాటికి 40 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా ఈ ఏడాది 5–10 శాతం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. రబీ సాగు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండో పంటకు నీరివ్వడంపై సర్కారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కృష్ణా జిల్లా సహా పలు చోట్ల రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కనిష్టంగా సాగు..ఈ ఏడాది పెట్టుబడి సాయం లేక, సకాలంలో విత్తనం అందక, ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించే నాథుడు లేక రబీ సాగు నత్తనడకన సాగుతోంది. 3.65 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా ఇప్పటి వరకు కేవలం 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్ చేయగలిగారు. వాటిలో 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు. ప్రధానంగా 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం కావాలని రైతులు కోరగా 1.10 లక్షల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. దీంతో ముందస్తు రబీ సాగు జరగని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి అత్యల్పంగా 4.65 లక్షల ఎకరాల్లో మాత్రమే రబీ ప్రధాన పంటల సాగు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ ముగిసే నాటికి కనిష్ట స్థాయిలో రబీ పంటల సాగు నమోదయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఐదేళ్లూ.. సాధారణం కంటే మిన్నగారబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా 8.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు, వరదలతో నారుమళ్లు దెబ్బతిన్నప్పటికీ 80 శాతం సబ్సిడీపై వైఎస్ జగన్ ప్రభుత్వం విత్తనాలను సమకూర్చింది. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం, సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్లో దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించడం లాంటి చర్యల కారణంగా రైతులు రబీ సాగుకు ముందుకొచ్చారు. నవంబర్ 10వ తేదీ నాటికి 2019–20లో 18.45 లక్షల ఎకరాలు, 2020–21లో 15.85 లక్షల ఎకరాలు, 2022–23లో 16.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో విఫలంఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా ఈసారి అతి కష్టంమ్మీద 70 లక్షల ఎకరాల్లో సాగైంది. దాదాపు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాని దుస్థితి నెలకొంది. సాగైన చోట్ల కూడా వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు కారణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విఫలమైంది. ఖరీఫ్లో నష్టపోయిన రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడంతో రెండో పంట సాగు కోసం దిక్కులు చూస్తున్నారు. -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
AP: 54 కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.కరువు మండలాలు కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరుఅనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం. -
తగ్గిన ‘నానో’ ఎరువుల అమ్మకాలు
గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతిఏపీలో తగ్గిన అమ్మకాలుగడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్లెట్స్తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. కాగా వచ్చే రబీ సీజన్లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్లెట్స్తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్తో కూడిన కిసాన్ డ్రోన్స్ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.500 మిల్లీ లీటర్ల బాటిల్లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది. గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్లో 2.12 కోట్ల బాటిళ్లు, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు . దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. తగ్గిన నానో విక్రయాలు.. -
ఖరీఫ్ ‘భరోసా’ బోల్తా
‘ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వలేం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం చేసిన ప్రకటన రైతులకు శరాఘాతమైంది. ఈ వానాకాలం సీజన్కు రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. – సాక్షి, హైదరాబాద్ ఆర్భాటంగా కేబినెట్ సబ్ కమిటీకాగా, జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. సమావేశాలు పెట్టి.. అభిప్రాయాలు సేకరించి..జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు. జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం స్పష్టం చేయడంతో రైతులు కంగుతిన్నారు. రైతు భరోసాకు బదులుగా సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కాగా, వరదలు, భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ ముగిసినా రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తారన్న నమ్మకంతో రైతులున్నారు. చివరికి ఇలా జరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక పథకానికి తొలి ఆటంకం..వాస్తవానికి సీజన్కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్లో మాత్రం తొలిసారిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పథకం ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈ వానాకాలం సీజన్కు ఇచ్చినా బాగుండేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని సీజన్కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేది ఉద్దేశం. గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్న వారిలో ఐదెకరాల్లోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం.కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల్లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల్లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల్లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది కాగా.. వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అనేక మందికి కోత పడుతుంది. భూములున్న ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు.. ఇలా చాలామందికి కోతపడే అవకాశాలున్నాయి. చివరికేం జరుగుతుందో చూడాలి. -
ఖరీఫ్ కుదేలు...సాగు.. బాగోలేదు
సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఖరీఫ్ సీజన్ చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సాగులో రైతులకు అండగా ఉండకపోవడం.., విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం.., ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం, అతివృష్టి, అనావృష్టికి తగ్గట్లుగా పంటల ప్రణాళిక రచించకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరిచేయగా, వాటికి మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ప్రారంభమైన ఈ సీజన్ చివరికి 69.70 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఎన్నడూ లేని రీతిలో 15.95 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉండిపోయాయి. ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలతో పనికిరాకుండా పోయాయి. వర్షాలు కురిసినా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తొలకరిలో మంచి వర్షాలే కురవడంతో సాగుకు తిరుగుండదని రైతులు ఆశించారు. జూన్ నుంచి సెపె్టంబర్ మధ్య 574.70 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 689 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. జూలై, సెపె్టంబర్లో భారీ వర్షాలు, వరదలతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాయలసీమలో రైతులను దెబ్బతీశాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, అందుకు తగిన సహకారంతో ముందుకు రావాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు. సాగైన ప్రాంతాల్లో సైతం ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు.లక్ష్యం కుదించినా.. సాగవని పంటలు గత ఏడాది సాగు కొంత తగ్గడంతో ఈ ఏడాది ఖరీఫ్లో సాగు లక్ష్యాన్ని 89. 37 లక్షల ఎకరాల నుంచి 85.65 లక్షల ఎకరాలకు కుదించారు. అయినప్పటికీ లక్ష్యానికంటే తక్కువగా అతికష్టం మీద 69.71 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో సాగు లక్ష్యం 37.59 లక్షల ఎకరాలకు 24 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. ఒక్క జిల్లాలో కూడా లక్ష్యం మేరకు 100 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవలేదు. ఖరీఫ్లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 34.62 లక్షల ఎకరాల్లోనే సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా 4.88 లక్షల ఎకరాల్లో నాట్లే పడలేదు. వర్షాలు, వరదలకు మరో 5 లక్షల ఎకరాల్లో సాగైన పంట పూర్తిగా దెబ్బతింది. సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, మినుము మాత్రమే ఆశాజనకంగా సాగయ్యాయి. ఆముదం, సోయాబీన్ మినహా ఇతర నూనె గింజలు, పత్తి సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొత్తంగా ఆహార ధాన్యాల పంటలు 50 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 8.50 లక్షల ఎకరాల్లో, పత్తి 6.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 167.15 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. విస్తీర్ణం తగ్గడంతోపాటు వర్షాలు, వరదలు, తెగుళ్లతో 140 లక్షల టన్నులు కూడా రావడం కష్టమని అంచనా వేస్తున్నారు. ధాన్యం దిగుబడి లక్ష్యం 85.47 లక్షల టన్నులు కాగా, ఈసారి 70 లక్షల టన్నులు దాటదని చెబుతున్నారు. పత్తి, వేరుశనగ దిగుబడి సగానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో పరిస్థితి దయనీయం రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ మండలాల్లో 60 రోజులకుపైగా చినుకు జాడలేదు. జూన్లో 7, జూలైలో 95, ఆగషు్టలో 76 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. జూలైలో 113 మండలాలు, ఆగస్టులో 244 మండలాల్లో వర్షాలే లేవు. దీంతో పంటల సాగు తగ్గిపోయింది. రాయలసీమలో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ప్రస్తుతం 6.25 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 8 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 6 లక్షల ఎకరాలు మించలేదు. 4.39 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి 3 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ఇతర పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల బోర్లన్నీ ఒట్టిపోయాయిు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు దూరమైన చోట ప్రత్యామ్నాయ పంటలకు 70 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా, ప్రభుత్వం అతికష్టమ్మీద 24 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయగలిగింది. దీంతో రైతులకు ప్రత్యామ్నాయం కూడా లేకపోయింది. -
ఉల్లి రేటు.. మహా ఘాటు
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బతినడం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో రూ. 60కి పైగా ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిషేధించి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవడంతో పాటు నాఫెడ్ ఆధ్వర్యంలోని నిల్వలను కూడా మార్కెట్లోకి పంపితేనే ధరలు తగ్గు ముఖం పడతాయంటున్నారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి సాగవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా 87,500 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తుండగా.. 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తుండగా.. ఐదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో ఉత్పత్తి కూడా తగ్గుతోంది. రైతుల నుంచి మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం భారీగా తగ్గింది. నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట ఉల్లి ధరలు పెరగడానికి మహారాష్ట్రలో గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది. జూలై 24, 25 తేదీల్లో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క నాసిక్ జిల్లాలోనే 48 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కేవలం ఆ జిల్లానుంచే సుమారు 7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. జూలై మూడు, నాలుగో వారంలో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రాల్లోనూ పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉల్లిలో తేమ శాతం, ఘాటు ఎక్కువ. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏపీలో పండే ఉల్లిని ఉత్తర భారతదేశంలో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ఉల్లిని విక్రయిస్తారు. మిగిలిన రాష్ట్రాల్లో పండించే ఉల్లిలో తేమ శాతం, ఘాటు తక్కువ. వాటిని ఏడాది నుంచి రెండేళ్లపాటు నిల్వ చేయొచ్చు. అందుకే ఈ ఉల్లిని దేశీయంగా వినియోగించడంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏపీలో వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. ఉత్తర భారతదేశంలో వర్షాలతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్కు ఉల్లి రావడం లేదు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. రూ.5 వేలకు చేరే అవకాశం ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్కు రూ.4,500–రూ.5 వేల వరకూ చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 50 శాతం కొనుగోళ్లు తాడేపల్లిగూడెం నుంచే.. కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు జరుగుతాయి. మిగిలిన 80 శాతం పంటను తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారులను నియమించుకుని, వారి ద్వారా రైతులకు ముందుగానే అప్పులు ఇచ్చి, పంట చేతికి రాగానే మార్కెట్ ధల ప్రకారం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపారులు కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 50 శాతం కొనుగోలు చేస్తారు. అక్కడి ప్రైవేట్ మార్కెట్లో విక్రయాలు సాగించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతులపై నిషేధం విధిస్తేనే ధరలకు కళ్లెం ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఎగుమతులు నిషేధించడంతో పాటు నాఫెడ్లోని నిల్వలను కేంద్రం మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు దిగొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. 2019లోఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికింది. అప్పట్లో రిటైల్లో కిలో ఉల్లి రూ.150కి చేరింది. వినియోగదారులు ఇబ్బంది పడకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించింది. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
వరద పోటు.. కరువు కాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క అతివృష్టి, వరదలు.. మరో ప్రాంతంలో అనావృష్టి. రెండూ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. ఖరీఫ్ మొదలై 70 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు కొన్ని చోట్ల నీట మునగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో రైతుకు అండగా నిలవాల్సిన సమయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతాంగాన్ని మరింతగా ఊబిలోకి నెడుతోంది. ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం కుదేలైపోయింది.రాష్ట్రంలో జూన్ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కురిసిన వర్షాన్ని పరిశీలిస్తే 286 మిలీమీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటికే 370.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29.5 శాతం అధికం. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగడం, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిలింది. ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జిల్లాల్లో చాలా చోట్ల గత 50 రోజులకు పైగా వర్షపు చుక్క లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో జూన్లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, జూలై నుంచి ఈ నెల మొదటి వారం వరకు చుక్క వాన పడలేదు.2 లక్షల ఎకరాల్లో పంటలు వరద పాలుభారీ వర్షాలు, కృష్ణా, గోదావరి నదుల వరద ఉధృతికి ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎర్ర కాలువకు పోటెత్తిన వరద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యే ఈ కాలువ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, అత్తిలి మండలాల్లోని 1.49 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ఇటీవలి భారీ వర్షాలకు ఈ జిల్లాలో 13 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాలు, వరదలతో ముంపు నీరు దిగే దారి లేక గోదావరి డెల్టాలో సాగు చేయలేక వేలాది ఎకరాలను రైతులు ఖాళీగా వదిలేస్తున్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను సాగు చేయలేక ఖాళీగా వదిలేశారు.రాయలసీమలో 40 శాతానికి మించని సాగువర్షాభావ పరిస్థితుల వలన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సగటున 40 శాతానికి మించి పంటలు సాగవని పరిíస్థితి నెలకొంది. తిరుపతి, కర్నూల్లో ఒకింత మెరుగ్గా ఉంది. ప్రకాశం జిల్లాలో 19 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగవగా, అన్నమయ్య జిల్లాలో 23 శాతం, వైఎస్సార్ జిల్లాలో 28 శాతం, చిత్తూరు జిల్లాలో 32 శాతం, అనంతపురంలో 40 శాతం, నంద్యాలలో 47 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రాయలసీమలో అత్యధికంగా సాగయ్యే వేరుశనగ పంట ఇప్పటి వరకు 40 శాతానికి మించలేదు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కనీస సాగు కూడా లేదు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ పత్తి, కంది, జొన్న పంటల్లో ఎదుగుదల కన్పించడంలేదు. ఎకరాకు వేరుశనగకు రూ. 20 వేలు, కందికి రూ.10 వేలు, పత్తికి రూ.15 వేల చొప్పున ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. పంటలు ఎదుగూబొదుగూ లేకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి కన్పించడంలేదు. ప్రత్యామ్నాయంగా ఉలవలు, అలసంద, జొన్న, కొర్ర, పెసర నాటుకోవాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. అదను దాటిపోవడంతో మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటలూ వేయడంలేదు. పొలాల్ని ఖాళీగా వదిలేస్తున్నారు.ఆశనిపాతంలా ప్రభుత్వ నిర్ణయాలుఆపత్కాలంలో రైతులకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అన్నదాతను మరింత కుంగదీసే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కార్యక్రమాలకు బాబు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడంతో ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి ప్రస్తుత సీజన్లో అందాల్సిన పంటల బీమా పరిహారమూ రైతులకు దక్కలేదు. మరొకపక్క పైసా భారం పడకుండా రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఉచిత పంటల బీమాపైనా బాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ పథకాన్ని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే అమలు చేస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కౌలు రైతులకు అండగా నిలుస్తున్న పంట హక్కు సాగుదారుల చట్టాన్ని చాప చుట్టేయాలని బాబు సర్కారు నిర్ణయించింది.ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా లేనట్టే..గత ఐదేళ్లుగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతాంగానికి అన్ని విధాలుగా అండదండగా నిలిచాయి. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు అన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందేవి. దీంతో రైతులు ట్రాక్టర్లు, ఆటోలకు ఖర్చు పెట్టుకొని మండల కేంద్రాలు లేదా పట్టణాలకు వెళ్లి వీటిని తెచ్చుకోవాల్సిన వ్యయప్రయాసలు తప్పాయి. సమయానికి ఎరువులు, మందులు చల్లడంవల్ల పంటలకు మేలు కలిగేది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్బీకే వ్యవస్థను బాబు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ కష్టకాలంలో రైతులకు వెన్నంటి నిలవాల్సిన ఆర్బీకే సిబ్బందిని మరుగుదొడ్ల సర్వే వంటి వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తోంది. సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సీజన్ ప్రారంభమయ్యే సమయానికే 62 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేలలో నిల్వ చేశారు. ఆ తర్వాత ఒక్క టన్ను కూడా కేటాయించబోమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇప్పుడు అనేక ఆర్బీకేల్లో ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్బీకేల్లో ఉన్న కొద్దిపాటి ఎరువులను స్థానిక టీడీపీ నేతలు వారు చెప్పినవారికే ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతులంతా గతంలోలా మండల కేంద్రాలు లేదా సమీపంలోని పట్టణాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందుల సరఫరాను కూడా బాబు ప్రభుత్వం నిలిపివేసింది. కనీసం రైతులు కోరుకున్న విత్తనాలను కూడా సరఫరా చేయడంలేదు. బీపీటీ 5204, జేఎల్జీ 384 వంటి విత్తన రకాలు బ్లాక్ మార్కెట్కి తరలిపోయాయి. దళారులు వీటిని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతును దోపిడీ చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. సీజన్ ప్రారంభమై 70 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ క్రాప్ నమోదు కాలేదు. సీసీఆర్సీ కార్డులు రెన్యువల్ చేసుకున్న కౌలు రైతులకు సరిపడిన మేరకు రుణ పరపతి కల్పించడంలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను మొక్కుబడి తంతుగా మార్చేశారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.» రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు» ఇప్పటి వరకు సాగైంది 40 లక్షల ఎకరాలు–49%» గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే సాగైంది 39 లక్షల ఎకరాల్లో» 2022 ఖరీఫ్లో ఇదే సమయానికి సాగయింది 48 లక్షల ఎకరాల్లో» ప్రధానంగా వరి 48% సాగవగా, వేరుశనగ 40, పత్తి 55, కంది 57% విస్తీర్ణంలో సాగయ్యాయి.ఇది ‘అనంత’ వేదనఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. జూన్లో 142 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా, జూలైలో సాధారణం కంటే 61.8 శాతం, ఆగస్టులోæ 48.7 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. మొత్తంగా సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 31.5 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. కానీ ఏకంగా 52 రోజులు వర్షమే లేకపోవడం జిల్లాలో వ్యవసాయాన్ని దెబ్బ తీసేసింది. ఐదు మండలాల్లో రెండు డ్రై స్పెల్స్ నమోదయ్యాయి. ఈ జిల్లాలో 3,46,733 హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఇప్పటి వరకు 1,43,332 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 1,97,884 హెక్టార్లు కాగా కేవలం 53,974 హెక్టార్లలో అంటే కేవలం 27.3 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. పత్తి 48,586 హెక్టార్లకు గాను 21,907 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే దుస్థితి. ఈ జిల్లాల్లో 3.87 లక్షల ఎకరాల సాగు లక్ష్యం కాగా, కేవలం 66 వేల ఎకరాల్లోనే సాగయింది.నారు వేసి వదిలేశాంఅల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలోని నాకున్న 4 ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్ పంటకు విత్తనాలు చల్లుకున్నాం. నారుమడి సిద్ధం చేసిన నాటి నుంచి నెలరోజులు వర్షం కురిసింది. ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడంలేదు. భారీ వర్షాల కారణంగా రెల్లుగడ్డ గ్రామంల్లో సుమారు 200 ఎకరాల్లో ముంపు ఏర్పడి నారుమళ్లు పూర్తిగా కుళ్లిపోయాయి. ఖరీఫ్లో వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలతో పంట ముంపు బారిన పడుతుండడంతో కనీసం పెట్టుబడి కూడా దక్కడంలేదు. అల్లవరం మండలంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం లేకపోతే వ్యవసాయం చేయడానికి ఏ రైతూ ముందుకు రాడు. – మొల్లేటి రామభద్రరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాఆదుకొనే పరిస్థితులుకనిపించడంలేదుఎర్రకాల్వ వరదకు ఆరుగాలం శ్రమ వరదలో కొట్టుకుపోయింది. ఎకరాకు రూ.15 వేల ఖర్చు చేసి ఊడ్పులు ఊడ్చిన తర్వాత ముంపు వచ్చింది. నాలుగు రోజుల తర్వాత వరద తగ్గితే మళ్లీ నారుమడులు వేశాం. దమ్ము చేయించాం. దీనికి మరో ఐదు వేల రూపాయలు ఖర్చయింది. మొత్తం ఎకరాకు రూ.20 వేలు ఖర్చయ్యింది. ఒక్క ఆరుళ్ల గ్రామంలోనే వెయ్యి ఎకరాలకు ముంపు వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటే గట్టెక్కుతాం. కానీ ఆదుకొనే పరిస్థితులే కనిపించడంలేదు. – సతీష్, రైతు, ఆరుళ్ళ, ప.గోదావరి జిల్లాప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ?ప్రస్తుత ఖరీఫ్లో 4 ఎకరాల్లో వేరుశనగ, 4 ఎకరాల్లో కంది సాగు చేసా. ఇప్పటివరకు వేరుశనగ పంటకు రూ.60 వేలు, కందికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాల్లేకపోవడంతో పంట ఎండిపోయింది. రూ.లక్ష పెట్టుబడి కోల్పోయాను. ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – నాగభూషణం, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లాపెట్టుబడి సాయమైనా జమ చేయలేదుఖరీఫ్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఓ వైపు అధిక వర్షాలు, మరో వైపు వర్షాభావ పరిస్థితులు. ఇటువైపు పంటలు మునిగిపోతుంటే.. అటువైపు పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయడంలేదు. ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ అమలు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. – జి.ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
సాగుకు రూ.1.52లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవసాయానికి బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25బడ్జెట్ ప్రసంగంలోవెల్లడించారు. పరిశోధనలకు ప్రోత్సాహం‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం. 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలువచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం. సహకార సంఘాలు,స్టార్టప్లకు ప్రోత్సాహంఅధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధిపప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం. డిజిటల్ క్రాప్ సర్వేపైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం.రొయ్యల ఉత్పత్తి ఎగుమతిరొయ్యల సాగు కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.జాతీయ సహకార విధానంసహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.భూసారం పెంపు,జీవవైవిధ్యానికిదోహదంసుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్ ఫ్రేమ్వర్క్ ద్వారా వీలు కలుగుతుంది.యూరియాకు బడ్జెట్లో సబ్సిడీ తగ్గింపు సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ. 1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ. 86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ. 45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు. అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో໖ 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ. 14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ. 23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 22,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ? కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కలి్పంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది. -
గుర్తుకొస్తున్నాయి...!
⇒ జగనన్న ప్రభుత్వంలో ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రైతు భరోసా అందించి ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పింది. ఇంతవరకూ ఆ హామీకి అతీగతీ లేదు. వ్యవసాయానికి ఇదే అదును. ఈ సమయంలో చేతిలో సొమ్ములేక అప్పులు చేయల్సివస్తోంది. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. – మిడితాన కన్నంనాయుడు, బాసూరు గ్రామం, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. రైతు భరోసా పథకం రైతులకు ఎంతో చేదోడుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని రైతు భరోసా పథకాన్ని తెచ్చి అండగా నిలిచారు. పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడిస్తుందో అంతుబట్టడం లేదు. –పోల్నాటి శ్రీనివాసరావు, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా⇒ వైఎస్ జగన్ క్రమం తప్పకుండా సాయం అందించి రైతులను ఆదుకున్నారు. ప్రభుత్వం మారాక ఇంతవరకు రైతు భరోసా పడలేదు. పెట్టుబడుల కోసం ఏం చేయాలో తోచడం లేదు. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, రైతు, పోతేపల్లి గ్రామం, బందరు మండలం, కృష్ణాజిల్లా⇒ గత ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కొత్త ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జూన్ ముగుస్తోంది. తక్షణం సాయం అందిస్తే బాగుంటుంది. –తోక కృష్ణ, రైతు, వెల్దుర్తిపాడు, పెనుగంచిప్రోలు మండలం⇒ ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి దిగులు లేకుండా సాగు చేసుకున్నాం. ఇప్పుడు సాగు ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. – సుంకుగారి భాస్కర్రెడ్డి, గోపాయపల్లె గ్రామం, రాజుపాలెం మండలం. వైఎస్సార్జిల్లా.⇒ వర్షాలు కురుస్తున్నాయి. ఆరుద్ర కార్తె కూడా వచ్చింది. పంటల సాగుకు ఇదే మంచి అదును. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఠంఛనుగా అందేది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు దాటినా రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. జగన్ మళ్లీ సీఎం అయి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కావు. – కృష్ణారెడ్డి, రైతు, హస్తవరం, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా⇒ గత ప్రభుత్వంలో ఏ సీజన్కు ఆ సీజన్లో రైతు భరోసా డబ్బులు మా బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు మాత్రమే జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాలేదు. – రంగయ్య, రైతు, కమ్మవారిపల్లె, నంద్యాల జిల్లా ⇒ గత ప్రభుత్వంలో ఈ సమయానికి రైతు భరోసా అందించేవారు. ఆ సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడింది. టీడీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20 వేలుకు పెంచినట్లు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. వ్యవసాయ పనుల సీజన్లో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీకాంత్రెడ్డి, రైతు, పి.జలాలపురం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా⇒వరి సాగు చేస్తా. గత ప్రభుత్వం రైతు భరోసాతో ఆదుకోవడంతో పెట్టుబడి కష్టాలు తొలగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సాయం అందలేదు. దీంతో మళ్లీ 2019 మునుపు పరిస్థితులు వస్తాయని భయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు పెట్టుబడి సాయంతో ఆదుకోవాలి. లేదంటే ఈ ఏడాది సాగుకు దూరం కాక తప్పదు.– గుల్లేలు నారాయణరావు, మర్రిపుట్టు గ్రామం, గుల్లేలు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా⇒ ఏటా మే నెలలో రైతు భరోసా డబ్బులు మా ఖాతాల్లో పడేవి. ఈ ఏడాది జూన్ వెళ్లిపోతున్నా ఇంకా అందలేదు. వర్షాలు పడుతున్నాయి. పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదు. –పెచ్చెట్టి సుబ్బారావు, కౌలు రైతు, జిన్నూరు, పోడూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా⇒ ఏటా 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాడిని. గత ప్రభుత్వం మే నెలలోనే రైతు భరోసా కింద రూ.5,500 ఖాతాల్లో జమ చేసేది. ఖరీఫ్ పెట్టుబడికి ఆ డబ్బులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఊసే లేదు. సకాలంలో రైతుకు సాయం అందకపోతే చాలా ఇబ్బందులు పడతారు. – వి. హరినాథరెడ్డి, రైతు, చెరువుమరవపల్లి, తలుపుల మండలం, శ్రీసత్యసాయి జిల్లా⇒ వరి, చెరకు సాగు చేస్తున్నా. జగన్ సీఎంగా ఉన్న కాలంలో సీజన్లో పెట్టుబడులకు సాయం అందించారు. రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలి. – కాండ్రేగుల కిరణ్కుమార్, రైతు, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి జిల్లా⇒గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా అందింది. ఈ ఏడాది జూలై వస్తున్నా పెట్టుబడి సాయం అందక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. – చిన్నభగవంతప్ప, రైతు, ఆరేకల్, ఆదోని మండలం -
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్లో రూ.76,200 కోట్లతో గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
జోరుగా విత్తన పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదుఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.సరిపడా విత్తన నిల్వలుగతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీగిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
92% మందికి ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్ఎస్కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్ఎంఎస్కు ప్రతిపాదనలు పంపింది.ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలుదేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్కు ఆ సీజన్లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబునాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.ఆ కథనాల్లో నిజం లేదు..ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
ఖరీఫ్కు కొత్త వరి వంగడాలు సిద్ధం
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్డీఎల్ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్ఎల్ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు. ఎంటీయూ 1271 అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీ 2846 కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం. బీపీటీ 2841 అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం. ఎన్ఎల్ఆర్ 3238 అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్కి అనువైన రకం.విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్ఎల్ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలుఎంటీయూ 1275 పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.బీపీటీ 3050 కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్ఎస్లలో ఫౌండేషన్, సర్టిఫైడ్ సీడ్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్ఎస్) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్ సీడ్ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్ సీడ్ (ఎన్డీఎల్ఆర్7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్ (ఎన్డీఎల్ఆర్–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు. బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్డీఎల్ఆర్ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్జీఎల్ 2537 వంటి ఫైన్ వెరైటీస్కు చెందిన ఫౌండేషన్ సీడ్ కిలో రూ.45, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్ సీడ్ కిలో రూ.40, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వంఖరీఫ్ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభంఖరీఫ్ సీజన్కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్ మొదలైంది. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్పంపిణీకి విత్తనాలు సిద్ధంసీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. » గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి. » గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు. » వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది. » అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. » పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్లైన్లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
నేడు మూడో విడత రైతు భరోసా జమ
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది. -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్సీఐకి రావాల్సి ఉన్నా, రైస్మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
సంతోషాల మకరందం.. పల్లెల్లో సంక్రాంతి శోభ
ఆనందాలు ముంగిళ్లలో రంగవల్లులై మెరిసినట్టు.. ఉత్సాహధ్వానాలు హరిదాసుల కీర్తనలై మార్మోగినట్టు.. సంక్షేమ సిరులు పాలపొంగళ్లై పొంగినట్టు.. ‘‘నవరత్నాలు’’ పొదిగిన నవ్వుల ఇంద్రధనస్సులు భోగిమంటల వెలుగులో దేదీప్యమానమై శోభిల్లినట్టు.. ధాన్యలక్ష్మి బసవన్నలతో కలిసి లయబద్ధంగా నర్తించినట్టు.. ప్రతిపతాక గగనాన పతంగులై సగర్వంగా రెపరెపలాడినట్టు.. ‘‘గడపగడపా’’ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతోంది. సంతోషాల ‘మకర’ందాలు గ్రోలుతోంది. పండగ కళతో ఉట్టిపడుతోంది. సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి కాంతులతో తళుకులీనుతున్నాయి. దూరప్రాంతాల నుంచి బంధుమిత్రుల మిత్రుల రాకతో జన తరంగమై పరవళ్లు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోడిపందేలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయి పంటల దిగుబడులు రావడంతో కర్షకుల ఇంట ఆనందం తొణికిసలాడుతోంది. పెద్ద పండగను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త దుస్తులు, కొత్తవస్తువుల కొనుగోళ్లకు తరలివెళ్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్తోపాటు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు సర్కారు ప్రకటించడంతో యువతరంలో కొత్త జోష్ కనిపిస్తోంది. సంక్షేమ ‘సిరి’నవ్వులు గడిచిన నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతినెలా ఏదో పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించారు. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. సేద్యలక్ష్మి కటాక్షం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతన్నలను కలవరపెట్టినప్పటికీ సాగైన విస్తీర్ణంలో మాత్రం రికార్డు స్థాయి దిగుబడులు రావడం రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వరి ఎకరాకు గతేడాది సగటున 30–35 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు సగటున 35–40 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నల గాదెలన్నీ ధాన్యపురాశులతో నిండిపోయాయి. వాహనాల అమ్మకాల జోరు మరొక వైపు కొత్త అల్లుళ్ల రాకతో రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న విక్రయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్ తర్వాత పది లక్షలకు పడిపోగా, గతేడాది 12 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి. కాగా ఈ ఏడాది కనీసం 15 లక్షలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కార్ల అమ్మకాలు. కోవిడ్కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే, ఆ తర్వాత 3.5 లక్షలకు చేరినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 4లక్షలకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో 20 శాతం వృద్ధి సంక్రాతి అమ్మకాల్లో వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలదే అగ్రస్థానంగా ఉంది. వస్త్ర వ్యాపారం గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ళీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ సంక్రాంతికి రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర, బంగారం దుకాణాల ద్వారా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారం, కిరాణా దుకాణాల్లో మొత్తం రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని విక్రయదారుల అంచనా. వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతం వృద్ధిరేటు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులూ కిక్కిరిసిపోతున్నాయి. నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త అల్లుళ్లు, బంధువులతో కళకళ బంధువులు, కొత్త అల్లుళ్లతో పల్లెలు కళలాడుతున్నాయి. వారి కోసం సంప్రదాయ పిండివంటల తయారీ చేయడంతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొమ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. -
Fact Check: తొందరపడి తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకూ వరినాట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జనవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూచన. సాధారణంగా ఖరీఫ్ వరికోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్ చివరి వరకూ సాగు చేస్తారు. తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది. అడ్డగోలు రాతలు... అబద్ధాలు వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు. రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నష్టపరిహారం పంపిణీకి చర్యలు ♦ ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది. ♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి. ♦ ఖరీఫ్ సీజన్లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ♦ తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్ 1 నుంచి 14 వరకు తుఫాన్ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు ♦ఈ సీజన్లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి నవంబర్ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ♦ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్ 9, 25, డిసెంబర్ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్ 3, 17, 20, 29, డిసెంబర్ 18న సమీక్షించారు. ♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్ 10 నుంచి 28 వరకు జాయింట్ ఇరిగేషన్ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు. ♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది. ♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది. ఖరీఫ్కు అనుకూలించని వర్షాలు ♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్ చివరి వరకు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదంటూ ఈనాడు ఆరోపించింది. ♦ ఖరీఫ్ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అపరాలు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 లక్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.26.46 కోట్లు వెచ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్రణాళికలో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వేరుశనగ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు. -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్గా కాకుండా రైతు యూనిట్గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
పక్కాగా పరిహారం
సాక్షి, అమరావతి: కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు కొలిక్కి వచ్చాయి. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తరువాత డిసెంబర్ 1న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. డిసెంబర్ నెలాఖరులోగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రుతుపవనాలు మొహం చాటేయడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. ఈ ప్రభావం రాయలసీమ జిల్లాల్లో కొంతమేర చూపించింది. ఖరీఫ్లో 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 487.2 మిల్లీమీటర్లు నమోదైంది. 7 జిల్లాలో 21 నుంచి 35 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల 64.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఉద్యాన పంటల సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా.. 28.94 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 103 మండలాల గుర్తింపు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు నిర్వహణ మాన్యువల్ ప్రకారం మండలాన్ని యూనిట్గా తీసుకొని 4 సూచికల ఆధారంగా మూడు దశల్లో పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కరువు మండలాలను గుర్తించారు. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని.. 23 మండలాల్లో స్వల్పంగా ఉందని అధికారులు గుర్తించారు. మొత్తంగా 7 జిల్లాల పరిధిలో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు ప్రభావిత మండలాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాదాపు నెల రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంట నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయ పంటల వారీగా నష్టం అంచనాలు కొలిక్కిరాగా.. ఉద్యాన పంటల నష్టం అంచనాలు నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానున్నాయి. పత్తి, వేరుశనగ పంటలకే నష్టం వ్యవసాయ పంటలకు వాటిల్లిన నష్టం పరిశీలిస్తే.. 7 జిల్లాల పరిధిలో 7.06 లక్షల రైతులకు చెందిన 14.91 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వర్షాధారం కింద సాగయ్యే ప్రాంతాల్లో 14.17 లక్షల ఎకరాలు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 74 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 6.92 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఆ తర్వాత అనంతపురంలో 4.66 లక్షల ఎకరాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం చూపినట్టు గుర్తించారు. పంటల వారీగా చూస్తే అత్యధికంగా 5.59 లక్షల ఎకరాల్లో పత్తి, 3.93 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.41 లక్షల ఎకరాల్లో కంది, లక్ష ఎకరాల చొప్పున ఆముదం, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, 43 వేల ఎక ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక అంచనాల మేరకు కరువు సాయం కోసం ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు. నెలాఖరులోగా పంపిణీ పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయింది. తుది జాబితాలను డిసెంబర్ 1న ప్రచురిస్తాం. అర్హులకు డిసెంబర్ నెలాఖరులోగా పంట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) జమ చేసేలా కసరత్తు చేపట్టాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
దిగుబడి వరిస్తోంది
సాక్షి అమలాపురం: వర్షాభావ పరిస్థితులు.. గోదావరి నదిలో అరకొరగా వచ్చిన ప్రవాహ జలాలు గోదావరి డెల్టాల్లో ఖరీఫ్కు కలిసొచ్చింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోంది. వర్షాలు లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం గోదావరి కాలువలకు సంవృద్ధిగా సాగునీరు అందించడంతో డెల్టాల్లో ప్రాంతాన్ని బట్టి 34 బస్తాలు (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి లభిస్తోంది. ఇప్పటికే కోతలు మొదలైన తూర్పు డెల్టాలోని రాయవరం, మండపేట, పశ్చిమ డెల్టా పరిధిలోని నిడదవోలు వంటి మండలాల్లో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈశాన్యం వల్ల భారీ వర్షాలు, వాయుగుండాలు, తుపానులు రాకుండా ఉంటే ఈ ఖరీఫ్లో లాభాలు కళ్లజూస్తామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో 3.90 లక్షల ఎకరాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 3.90 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 3.80 లక్షల టన్నులు. వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం డెల్టాలో ఖరీఫ్ దిగుబడి సగటున 28 బస్తాలు. కానీ.. కోనసీమ జిల్లాలో ఇక్కడ ఎకరాకు సగటున 32.50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అధికారుల చెబుతున్నారు. వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. జిల్లాలోని ఆత్రేయపురంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు సగటు 34 బస్తాల దిగుబడిగా తేలింది. రాయవరం మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇక్కడ 42 నుంచి 46 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో 32 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలో వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సగటున 35 బస్తాల దిగుబడిగా వస్తుండగా.. పశ్చిమ డెల్టా పరిధిలోని పెరవలి మండలంలో 38 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం పరిధిలో ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 బస్తాల వరకు పండింది. గత కొన్నేళ్లుగా ఖరీఫ్ సాగు అనుకున్న స్థాయిలో దిగుబడి రావడం లేదు. పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. పంట పండినా దిగుబడి రావడం లేదు. కోనసీమ జిల్లాలో గత ఖరీఫ్ కొన్ని ప్రాంతాల్లో 24 బస్తాలు మించి పండలేదు. వర్షాభావం కలిసొచ్చింది ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల డెల్టాలో మంచి దిగుబడి వస్తోంది. ఎండల వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటం దిగుబడి పెరగడానికి కారణమైంది. మండపేట, రాయవరం వంటి మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాలలో సగటు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. – బోసుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అక్టోబర్ చివరి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతన్నకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) నుంచే అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించి మార్చి నెలాఖరులోగా సేకరణ పూర్తి చేయనుంది. ఇటీవల ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు కనీస మద్దతు ధరను రూ.163 మేర పెంచి రూ.2,203 గా ఖరారు చేసింది. సాధారణ వరి రకానికి రూ.143 పెంచి రూ.2,183గా నిర్ణయించింది. రాష్ట్రంలో వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో సుమారు 5 లక్షల టన్నులు బాయిల్డ్ వెరైటీలు కొనుగోలు చేయనుంది. ఈ ఖరీఫ్లో 3,500 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా 10,500 మంది సిబ్బంది భాగస్వామ్యంతో ధాన్యం సేకరిస్తారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని 1,670 మిల్లుల్లో మర ఆడిస్తారు. ఇందులో 53 బాయిల్డ్, 550 డ్రయర్ సౌకర్యాలున్న మిల్లులు ఉన్నాయి. వర్షాలకు ఎక్కడైనా ధాన్యం తడిస్తే రైతుకు నష్టం కలగకుండా దానిని కూడా కొని డ్రయర్ ఉన్న మిల్లులకు తరలిస్తారు. గోనె సంచులతోపాటు హమాలీలు, రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. రైతులే గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే వాటికయ్యే ఖర్చును రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ధాన్యం తరలింపునకు 5 వేల ట్రక్కులను సిద్ధం చేస్తున్నారు. అవి నిర్దేశిత మిల్లులకు వెళ్లేలా జీపీఎస్, మొబైల్ ట్రాకర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో బయట మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇలా లక్ష్యానికి మించి ధాన్యం వచ్చినా కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంకంటే ముందే.. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి బయోమెట్రిక్ ఆధారిత కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఖరీఫ్లోనే పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా చేసిన ఈ క్రాప్ నమోదు ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నారు. తద్వారా దళారులు, మిల్లర్ల మోసాలను అరికట్టి రైతులకు మద్దతు దక్కేలా చేస్తున్నారు. గతంలో దళారులు రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొని తిరిగి అదే రైతుల పేరుతో ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధరను కొట్టేసేవారు. ఇటువంటివి జరగకుండా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీఓ) సమయంలో ఆధార్ను తప్పనిసరి చేశారు. ధాన్యం నగదు చెల్లింపులను సైతం ఆధార్ సీడింగ్ కలిగిన రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతులను మిల్లర్లు ఇబ్బందిపెట్టకుండా చర్యలు ధాన్యం కొనుగోళ్ల సమయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకే పరిధి నుంచి ధాన్యాన్ని దూరంగా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఆ మండలంలోని మిల్లులను ట్యాగ్ చేస్తాం. ఇప్పటికే జిల్లాలవారీగా సేకరణ అంచనాలను రూపొందిస్తున్నాం. గోనె సంచుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. రైతులకు నగదు చెల్లింపు సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసఫరాల సంస్థ కస్టమ్ మిల్లింగ్పై పర్యవేక్షణ ఇప్పటికే 1,474 మిల్లుల్లో సీసీ కెమెరాల ద్వారా కస్టమ్ మిల్లింగ్ను పర్యవేక్షిస్తున్నాం. మిల్లుల సామర్థ్యం ఆధారంగా సీఎంఆర్ కేటాయిస్తున్నాం. మిల్లుల్లో విద్యుత్ వినియోగం లెక్కలనుబట్టి కస్టమ్ మిల్లింగ్ జరిగిందా లేదా అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 49, మార్చిలో 33, ఏప్రిల్లో 118, మే – జూన్లో 53 మిల్లుల్లో డీవియేషన్ను గుర్తించాం. ఇందులో 31 మిల్లులపై చర్యలు తీసుకున్నాం. మిగిలిన వాటిపై విచారణ జరుగుతోంది. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. గతేడాది ఖరీఫ్లో 6.39 లక్షల మంది రైతుల నుంచి రూ.7,222 కోట్లు విలువైన 35.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నాం. ప్రస్తుత ఖరీఫ్లో 15.25 లక్షల హెక్టార్లలో వరి సాగవగా 80 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. ఇందులో 40 లక్షల వరకు సేకరణకు ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. దీనిని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 28 లక్షల టన్నులకు పైగా బియ్యం వస్తుందని ఆశిస్తున్నాం. రైతులు మద్దతు ధరలో పైసా కూడా నష్టపోకుండా, ఆర్బీకేల్లోనే ధాన్యం విక్రయించేలా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి -
2025 ఖరీఫ్కు పోల‘వరం’
పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు మంచి చేయడమే మా సంకల్పం. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో నేను ఒకటే చెప్పా.. అయ్యా! మీరే బటన్ నొక్కండి.. నేరుగా మీరే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపించండి..! మేమే చేయా లని ఆరాట పడటం లేదు. క్రెడిట్ ఎవరికి వచ్చినా ఫర్వా లేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టును 2025 ఖరీఫ్ కల్లా కచ్చితంగా పూర్తిచేసే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు, నిధులకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పామన్నారు. ఇవన్నీ చేసిన నేపథ్యంలో వారిలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణంతో ధరలను రివైజ్ చేసి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 41.15 మీటర్ల పరిధిలో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఎన్నికలకు ముందే ఆరేడు నెలల్లోగా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ బాధితులను స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో అమలైన సహాయ చర్యలను పరిశీలించారు. కూనవరం, గొమ్ముగూడెంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. బుద్ధి లేకుండా బాబు సంతకాలు.. పోలవరం డ్యామ్ను మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో పూర్తిగా నింపుతారు. అందులో మొదటి స్టేజ్.. మొదటి ఏడాది 41.15 మీటర్ల వరకు నింపుతారు. దశలవారీగా నింపడం ద్వారా ఒక్కో దశలో ఏవైనా లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల్లో మూడు ఫేజ్ల్లో డ్యామ్ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. 41.15 మీటర్ల వరకు నింపితే కటాఫ్ అయిపోయే గ్రామాలు ఇంకా ఉంటాయి. వాటిని ఫస్ట్ ఫేజ్లోకి తేకుంటే ఆ ఊళ్లకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లైడార్ సర్వే నిర్వహించి 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్లను (ఆవాస ప్రాంతాలు) మళ్లీ యాడ్ చేయించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం కిందా మీదా పడుతున్నాం. మన ఖర్మకొద్దీ ఇదంతా ఎందుకు మొదలైందంటే గత ప్రభుత్వం 2013–2014 రేట్లతోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని అండర్ టేకింగ్ ఇచ్చింది. దీంతో అంతకంటే ఎక్కువ డబ్బులివ్వమని, నాటి మీ ముఖ్యమంత్రే ఇందుకు ఒప్పుకుని సంతకం చేశారని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. నేను నేరుగా ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి వారికి అన్ని రకాలుగా నచ్చచెప్పా. 2013–14 రేట్ల ప్రకారం ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం? ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా మారిపోతాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం చేశాడు గానీ మీరైనా ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశా. శ్రీశైలం ప్రాజెక్టు ఎంతతో స్టార్ట్ చేశారు? ఎంతతో పూర్తైంది? ఈ నెలాఖరు కల్లా శుభవార్త! ఇవన్నీ వివరించిన తరువాత వారిలో (కేంద్రం) కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్ చేసి ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేశాం. ఇది జరగాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎస్టిమేట్స్ తయారు చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఇప్పటికే పంపించింది. వాళ్లు మరో వారంలో అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత జల్శక్తి శాఖ వద్దకు వస్తుంది. అనంతరం కేబినెట్లో పెడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే నాకు తెలిసి బహుశా ఈ నెలాఖరు కల్లా కేబినెట్కు ఇది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం తొలి ప్రాధాన్యతా పనుల కోసం రూ.17 వేల కోట్లు మనకు ఇచ్చేందుకు ఆమోదం లభిస్తుంది. దీనివల్ల అత్యంత ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. డ్యామ్ పూర్తి హైట్కు కంప్లీట్ అవుతుంది. 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపేందుకు ఆర్ అండ్ ఆర్ పూర్తిగా అందుతుంది. లైడార్ సర్వే ద్వారా గుర్తించిన 48 ఆవాస ప్రాంతాలను కూడా మొదటి పునరావాస ప్రాధాన్యత కింద ఆమోదించాలని కోరాం. దాని తర్వాత రెండో ఏడాది సెకండ్ ఫేజ్, అనంతరం మూడో ఏడాది మూడో దశ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది కాబ ట్టి! బహుశా జగనే కడితే మొదట మీకు (నిర్వా సితులకు) ఇచ్చి తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో! కేంద్ర ప్రభుత్వం డబ్బు లు ఇస్తోంది కాబట్టి ఫేజ్ ప్రకారం జరగాల్సిందే. 20 వేల కుటుంబాల తరలింపు! నేను కూడా అనుకున్నంత వేగంగా చేయలేక పోయిన పని ఒకటి ఉంది. అది పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాకపోవడంతో కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధార పడాల్సి వస్తోంది. వాళ్ల మీద ఒత్తిడి తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. ఏదైనా టైమ్ రావాలి. ఇవన్నీ జరిగేదాకా వారు డబ్బులివ్వరు. డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు. పని జరగకపోతే, డబ్బులు ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వలేం. ఈ వాస్తవాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరు కల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించి రూ.17 వేల కోట్లకు అప్రూవల్ వస్తే 41.15 మీటర్లకు, 48 హ్యాబిటేషన్లకు సంబంధించి రూ.5,200 కోట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. గట్టిగా ఒత్తిడి తెచ్చి వచ్చే జనవరికల్లా ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యేలా చూస్తాం. మన ప్రభుత్వం రాక ముందు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. గత నాలుగేళ్లలో ఇప్పటికే 12 వేల కుటుంబాలను షిఫ్ట్ చేశాం. మరో 8 వేల కుటుంబాలను అంటే మొత్తంగా 20 వేల కుటుంబాలను తరలిస్తున్నాం. తరలించాల్సిన 8 వేల కుటుంబాల కోసం రూ.800 కోట్లు డబ్బులు అవసరం. మనమే కిందమీద పడి ఎలాగో చేసేస్తాం. బహుశా ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకల్లా పూర్తి చేస్తాం. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో సీఎం వారికి మిగతా రూ.3.5 లక్షలు ఇస్తాం పోలవరం ప్రాజెక్టుకు తొలుత నాన్న (వైఎస్సార్) హయాంలో భూసేకరణ జరిగినప్పుడు రూ.లక్ష, రూ.లక్షన్నరకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి నేను రూ.5 లక్షలు ఇస్తానని చెప్పా. ఆ మిగిలిన రూ.3.5 లక్షలు కచ్చితంగా ఇస్తాం. మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినప డదని చెబుతున్నా. మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ చేయడని గుర్తు పెట్టుకోండి. కేంద్రం రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్రం రూ.3.2 లక్షల ప్యాకేజీ ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు రూ.3.2 లక్షల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. ఇప్పటికే జీవో జారీ చేశాం. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి జరగాల్సిన మంచి ఆరేడు నెలల్లోనే జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీ బిడ్డ మీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. బాబు ఘోర తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం స్పిల్వే కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. మొదట స్పిల్వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రం వాల్ తర్వాత వెనకాల కట్టాలి. అలా చేస్తే డ్యామేజ్ అనేది జరగదు. మన ఖర్మ కొద్దీ ఆ రోజుల్లో కేవలం కాంట్రాక్టర్లకు మంచి చేయడం కోసమే పనులు చేపట్టి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేశారు. స్పిల్వే పనులు అసంపూర్తిగా వదిలేశారు. కాబట్టే నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్ చేయలేకపోయారు. నీళ్లు డైవర్ట్ చేయలేకపోయారు. కాబట్టి అటువైపు పంపించలేకపోయారు. పైగా అది పూర్తి కాకుండానే మధ్యలో కాఫర్ డ్యామ్ మొదలు పెట్టారు. వరదలకు డయాఫ్రం వాల్ కోతకు గురైంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తాం ఇప్పుడు నిపుణులు అధ్యయనం చేసిన తర్వాత కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా మనం కాఫర్డ్యాంలు పూర్తిచేశాం. స్పిల్వే పూర్తిచేసి దానిమీదుగా నీళ్లు పంపిస్తున్నాం. ఇవన్నీ మనం చేయగలిగాం. గత సర్కారు నిర్వాకాల కారణంగా ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్లో ముందుకు వెళ్లలేకపోయింది. వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దేవుడి దయ వల్ల గాడిలో పడింది. 2025 ఖరీఫ్కల్లా కచ్చితంగా పోలవరం పూర్తి చేసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్లో బుష్ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
రైతుబంధుకు బ్యాంకర్ల మోకాలడ్డు.. బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వానాకాలానికి సంబంధించి రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న వారంతా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందుకోకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. పంట రుణం బకాయిలున్నాయంటూ ఈ రైతుబంధు డబ్బులను డ్రా చేసుకోనివ్వడం లేదు. ఆయా రైతుల ఖాతాలను హోల్డ్లో పెడుతున్నారు. ఈ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క శాఖలోనే 500 ఖాతాలు హోల్డ్ ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 53 శాఖలు ఉన్నాయి. ఒక్క వట్పల్లి బ్రాంచ్లోనే సుమా రు 500 మంది రైతుల ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్లో పెట్టారు. వీరి ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు, ధాన్యం డబ్బులను విత్డ్రా చేసుకోనివ్వడం లేదు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లగా.. ఫీల్డ్ ఆఫీసర్ లేడని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. సాగు ఖర్చుల కోసం.. ప్రస్తుతం వానాకాలం పంట సీజను ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ కిరాయి ఇలా సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు అవసరం ఉంటుంది. వచ్చిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఖర్చుల కోసం తాము ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. అధిక వడ్డీకైనా అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత రబీ సీజనులో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం డబ్బులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసింది. పంట రుణం రెన్యువల్ చేసుకోలేదంటూ ఈ డబ్బులను కూడా డ్రా చేసుకోనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. రెన్యువల్ చేసుకుంది 20 శాతం లోపే.. రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాలను ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. మాఫీ కాని చాలామంది రైతులు తమ పంట రుణా లను రెన్యువల్ చేసుకోలేదు. కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం ఎలాగైనా మాఫీ చేస్తుందని రెన్యు వల్ చేసుకోలేదు. రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతు లు 20 శాతంలోపే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో మిగిలిన 80 శాతం మంది రైతుల్లో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని అంచనా. బదిలీపై వచ్చిన మేనేజర్లకు తెలియక కొన్ని బ్రాంచ్లకు మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వస్తుంటారు. రైతుబంధు డబ్బులు ఆపొద్దని తెలియక వారు ఖాతాలను హోల్డ్లో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతుబంధు డబ్బులు ఆపొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. రుణమాఫీ అవుతుందనే కారణంగా చాలామంది పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం లేదు. – గోపాల్రెడ్డి, లీడ్బ్యాంకు మేనేజర్, సంగారెడ్డి ఈ రైతు పేరు నరేందర్గౌడ్. సంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామం. తన 2.62 ఎకరాలకు సంబంధించి రైతుబంధు కింద రూ.13,100 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఖరీఫ్ పంట సాగు ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు వట్పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకుకెళ్లాడు. అయితే, బ్యాంకు అధికారులు రూ.1.60 లక్షల పంట రుణ బకాయి ఉందని, ఈ రుణాన్ని రెన్యువల్ చేసుకోనందున ఖాతాను హోల్డ్లో పెట్టామని చెప్పారు. దీంతో రైతుబంధు డబ్బులు డ్రా చేసుకోలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలపూర్ డీకే గ్రామానికి చెందిన అంబయ్యకు మూడెకరాల భూమి ఉంది. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రూ.80 వేల వరకు పంట రుణం ఉంది. ఇటీవల రైతుబంధు కింద ఖాతాలో జమ అయిన డబ్బులను పంట పెట్టుబడికి డ్రా చేసుకుందామంటే బ్యాంకర్లు అనుమతించడం లేదని అంబయ్య వాపోయాడు. -
ఆయకట్టు రైతులందరికీ ‘తోటపల్లి’ ఫలాలు
సాక్షి, అమరావతి: తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా గతంలో ఎన్నడూలేని రీతిలో జూన్ 12నే ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసింది. కుడి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తిచేయడం.. రివిట్మెంట్ పూర్తిచేసి, 2,151 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించి బ్యారేజ్లో పూర్తి సామర్థ్యం మేర 2.51 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా మిగిలిపోయిన 85,765 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టింది. కుడి ప్రధాన కాలువలో అంతర్భాగంగా చేపట్టిన గజపతినగరం బ్రాంచ్ కెనాల్ను పూర్తిచేసి మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద 1908లో బ్రిటిష్ సర్కార్ తోటపల్లి వద్ద నాగావళి నదిపై రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు నీళ్లందించేది. ఇది శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో.. రెగ్యులేటర్కు ఎగువన 2.51 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్ను నిరి్మంచి.. అదనంగా 1,06,765 ఎకరాలకు, తోటపల్లి కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యతగా తోటపల్లి.. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లు పూర్తిచేసిన ముఖ్యమంత్రి.. తోటపల్లిలో మిగిలిన పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో మిగిలిన పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఇక జూన్ 12న పూర్తయిన పనుల ద్వారా పాత, కొత్త కలిపి 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువలో ప్యాకేజ్–1లో 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 37 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. ప్యాకేజ్–2లో 8.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 47 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. కోతలు పూర్తయ్యేదాకా అంటే డిసెంబర్ దాకా కాలువల పనులు చేయడానికి వీలుకాదు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట కోతలు పూర్తయ్యాక కుడి కాలువలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వుతున్న గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 2.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 27 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ.. తోటపల్లి బ్యారేజ్ గరిష్ఠ నీటినిల్వ 2.51 టీఎంసీలు. బ్యారేజ్లో ముంపునకు గురయ్యే 20 గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకుగాను 3,478 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కానీ, బ్యారేజ్ మట్టికట్టకు రివిట్మెంట్ పనులు పూర్తికాలేదు. దీంతో బ్యారేజ్లో రెండు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. ఈ పనులు పూర్తిచేసి.. మిగతా 2,151 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వచ్చే ఏడాదికి బ్యారేజ్లో 2.51 టీఎంసీలను నిల్వచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం ద్వారా తోటపల్లి ఆయకట్టు రైతులందరికీ జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
ఆర్బీకేల్లో పంటల బీమా జాబితాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 సీజన్లో పంటల్ని నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన నిర్వహించే రైతు దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారాలను జమ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలను ఆర్బీకేల్లో గురువారం నుంచి ప్రదర్శిస్తున్నారు. జూలై 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అనంతరం తుది జాబితాలను ప్రకటిస్తారు. 10.20 లక్షల మంది రైతులకు పరిహారం ఖరీఫ్–2022 సీజన్లో దిగుబడి ఆధారిత పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా.. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రైతుల వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను బీమా కంపెనీలకు చెల్లించింది. ఖరీఫ్–2022 సీజన్లో పంటలు నష్టపోయిన వారిలో 10.20 లక్షల మంది అర్హత పొందగా.. వీరికి రూ.1,117.21 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రూ.572.59 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి రూ.544.62 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చారు. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. పంట విస్తీర్ణం తదితర అంశాలపై ఏదైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆర్బీకేలో జూలై 3వ తేదీ వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. -
చిరుధాన్యాలకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలు పండించే రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తూ ఖరీఫ్ నుంచి ఆర్బీకేల ద్వారా రాగులు, జొన్నలు, కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా ధాన్యం మాదిరిగానే నేరుగా కల్లాల్లో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పౌర సరఫరాల సంస్థ మద్దతు ధరకు సేకరించనుంది. పంట వేసిన తర్వాత ఆర్బీకేలో నమోదు చేసే ఈ–క్రాప్ వివరాల ఆధారంగా కొనుగోలు చేయనుంది. క్వింటాల్ కందులకు కనీస మద్దతు ధర రూ.7 వేలు, రాగులకు రూ.3,578, జొన్నలకు రూ.2,970(హైబ్రీడ్), రూ.2,990 (మల్దండి) చొప్పున ప్రకటించింది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారంలోగా వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల టన్నుల కందులు, 64,738 టన్నుల రాగులు, 3.63 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తుల దిగుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు రాగులు, జొన్నలు, కందుల కొనుగోళ్ల వివరాలను పౌర సరఫరాల సంస్థ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోనే సేకరణ.. రాయితీపై విత్తనాలు ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ప్రతి నెలా కార్డుకు మూడు కేజీల బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మద్దతు ధరకు జొన్నల కొనుగోలు చేపట్టగా రాగులను కర్ణాటక నుంచి సేకరిస్తోంది. అయితే మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, కందులను స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వర్షాధార, మెట్ట పంటలైన రాగి, జొన్నల సాగును ప్రోత్సహించేందుకు 50 శాతం రాయితీపై రైతులకు విత్తనాలను అందిస్తోంది. రైతులపై భారం లేకుండా.. పంట ఉత్పత్తులను నేరుగా కల్లాల్లోనే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా, హమాలీ ఖర్చుల భారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తోంది. గోనె సంచులు, లోడింగ్, మిల్లు వద్దకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకవేళ రైతులు వాటిని స్వయంగా సమకూర్చుకుంటే అందుకు అయిన ఖర్చులను తిరిగి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచికి (50 కేజీలు) రూ.3.39, లేబర్ చార్జీ కింద రూ.22 చొప్పున అందచేస్తోంది. పోటీతో రైతులకు లాభసాటి ధర చిరుధాన్యాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. స్థానికంగా పంటలను కొనుగోలు చేసి స్థానికులకే పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బృహత్తర ప్రణాళిక ఇది. తొలుత ఖరీఫ్లో ఆర్బీకేల ద్వారా జొన్నలు, రాగులు, కందుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని మార్కెట్లో వ్యాపారులే కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వం ముందుకు రావడంతో పోటీ పెరగనుంది. తద్వారా రైతుకు మద్దతు ధర మించి లాభసాటి రేటు దక్కుతుంది. రైతులు కచ్చితంగా ఈ–క్రాప్లో నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
జూలైలో ‘చనాకా–కొరాటా’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నదిపై నిర్మించిన తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు చనాకా–కొరాటా బ్యారేజీ, ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ వచ్చే నెల తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. బ్యారేజీ, పంప్హౌస్ల నిర్మాణం పూర్తికావడంతో ఈ ఏడాది నుంచి బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావిస్తోంది. గ్రావిటీ కాల్వ ద్వారా 48 వేల ఎకరాలు, ఎత్తిపోతల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 80 కి.మీ.ల పొడవునా కాల్వ ఉండగా 49వ కి.మీ. వద్ద ఐదు పంపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో థాంసీ, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దీంతోపాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని కేలాపూర్ తహసీల్ పరిధిలో 9 గ్రామాలకు సాగునీరు అందించనున్నారు. డిస్ట్రిబ్యూటరీ మెయిన్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు ఇప్పట్లో సాగునీరు అందించే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య 1975లో ఒప్పందం జరగ్గా మళ్లీ 2016లో ఇరు రాష్ట్రాలు కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి. 28న ఇంటర్స్టేట్ బోర్డు సమావేశం.. చనాకా–కొరాటా ప్రాజెక్టు బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 28న మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కూడిన ఇంటర్స్టేట్ బోర్డు సమావేశమై చర్చించనుంది. నీటి నిల్వ, వినియోగంపై చర్చించి ఓ అంగీకారానికి రానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు చివరి దశలో ఉన్నాయి. టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఇప్పటికే అనుమతి జారీ చేయగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి రావాల్సి ఉంది. -
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
వేసవిలోనూ పెన్నా బేసిన్లో జలరాశి
సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం. సోమశిల రిజర్వాయర్లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి. పెన్నా బేసిన్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి. -
అది రామోజీ అబద్ధాల సాగు
సాక్షి, అమరావతి : నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదచల్లుడు వంటకాన్ని వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ ప్రత్యక్షంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం చేసింది. సకాలంలో మంచి వర్షాలు.. సీజన్లో కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నిర్ణీత సమయానికి ముందే నీటి విడుదల.. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు.. ప్రతి దశలోనూ అన్నదాతకు తోడుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. వెరసి రాష్ట్రంలో నాలుగేళ్లుగా వ్యవసాయం పండగైంది. ఈ విషయాన్ని ఏ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా నిస్సందేహంగా నిజమేనని చెబుతారు.. ఒక్క రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్టచతుష్టయం తప్ప. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల మార్పిడి ఫలించడం మీకు తెలీదా రామోజీ? మెట్ట ప్రాంతాల్లో లాభదాయకం కాని వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతుండటం వాస్తవమో కాదో గ్రామీణ ప్రాంతాల్లోని మీ నెట్వర్క్నే అడిగి చూడండి. డ్రైస్పెల్స్ నమోదైనా ఆ ప్రభావం దిగుబడులపై చూపక పోవడం, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలాన్ని నమోదు చేసే పరిస్థితి రాకపోవడం నిజం. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హెక్టార్కు సగటు దిగుబడులు పెరిగాయి. వ్యవసాయ రంగంలోనే కాదు.. ఉద్యాన, పశుగణాభివృద్ధి, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో సైతం జాతీయ సగటు వృద్ధిరేటు కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాసుకునే లెక్కలు కావు. కేంద్ర ఆర్థిక, గణాంకాల శాఖ రూపొందించిన గణాంకాలని మీకు తెలియదా రామోజీ? ఇంతకూ మీరు చెప్పిన అంశాల్లో నిజానిజాలు ఏమిటో చూద్దాం. ఆరోపణ: సాగు విస్తీర్ణం తగ్గింది వాస్తవం : పంటల మార్పిడి కింద మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగయ్యే పంటల స్థానే ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా నాలుగేళ్లలో 5.52 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే వరి, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల స్థానంలో ఉద్యాన పంటలైన మామిడి, అరటితో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవొకాడో, కాఫీ, అల్లం, పసుపు, అనాస, బొప్పాయి, కమల, జామ వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఆరోపణ: పొడి వాతావరణాన్ని పట్టించుకోలేదు వాస్తవం : రాష్ట్రంలో 2022 ఖరీఫ్ పంట కాలంలో జూన్–జూలైలో 172 మండలాల్లో బెట్ట వాతావరణం (డ్రై స్పెల్స్) కనిపించినప్పటికీ, ఆయా మండలాల్లో పంటల సాగు ఆలస్యమైందే తప్ప సాగు ఆగలేదు. మరో 101 మండలాల్లో ఆగస్టు, సెపె్టంబర్ మధ్య డ్రైస్పెల్స్ సంభవించాయి. ఆ సమయంలో పంటలు కీలక దశకు రాకపోవడంతో దిగుబడులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆరోపణ: దిగుబడులు ఎక్కువ చేసి చూపిస్తున్నారు వాస్తవం : 2021–22లో వరి సగటున హెక్టార్కు ఖరీఫ్లో 4,800 కిలోలు, రబీలో 6,601 కిలోల దిగుబడులొస్తే, మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022–23 ఖరీఫ్లో 5,195 కిలోలు, రబీలో 6,944 కిలోల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. 2021–22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులు రాగా, 2022–23లో 166.63 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా, 363.04 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ఫలితంగా హెక్టార్కు సగటు దిగుబడులు పెరిగాయి. ఆరోపణ: సాగు తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? వాస్తవం : వృద్ధి రేటు పెరుగుదల, తగ్గుదల అనేది సాగు విస్తీర్ణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుగణాభివృద్ధి, అటవీ, ఉద్యాన రంగాల పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. పంటల సగటు దిగుబడి, విలువ ఆధారిత ఉత్పత్తుల పెరుగుదల వంటి కారణాలతో వృద్ధి రేటు పెరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2022–23లో వృద్ధి రేటు 13.18 శాతం నమోదు కాగా, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే 2 శాతం ఎక్కువ. వ్యవసాయ రంగంలో 20.72 శాతం, ఉద్యాన రంగంలో 12.58 శాతం, పశుగణాభివృద్ధి రంగంలో 7.32 శాతం, మత్స్య రంగంలో 19.41 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇవన్నీ కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలే. రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం ప్రకటించే పరిస్థితులే లేవు. కోనసీమ, పశ్చిమగోదావరి, వైఎస్సార్, బాపట్ల జిల్లాల్లో గతం కంటే మిన్నగా పంటలు సాగయ్యాయి. sak -
వేరుశనగలో ‘విశిష్ట’మైనది
సాక్షి, అమరావతి: వేరుశనగ రైతులకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తీపి కబురు అందించింది. బెట్ట పరిస్థితులు.. ఆకుమచ్చ తెగులును తట్టుకోవడమే కాకుండా.. 15 శాతం అదనంగా గింజ దిగుబడినిచ్చే కొత్త వంగడం టీసీజీఎస్–1694 (విశిష్ట) రకాన్ని రానున్న ఖరీఫ్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన టీసీజీఎస్–1694 (విశిష్ట) ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారం కింద కదిరి–6 (కే–6), నారాయణి, ధరణి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టీఏజీ–24, కే–6 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ.. ఈ రకాలు బెట్ట (నీటి ఎద్దడి)ని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు వీటి దిగుబడులపై టిక్కా ఆకుమచ్చ తెగులు తీవ్ర ప్రభావం చూపుతోంది. తెగుళ్ల నివారణకు రెండు, మూడుసార్లు ఖరీదైన శిలీంధ్ర నాశిని మందులను పిచికారీ చేయాల్సి రావడం రైతులకు భారంగా పరిణమించింది. గింజ శాతంలో కదిరి లేపాక్షిని మించి.. రాష్ట్రంలో ఖరీఫ్లో 16.85 లక్షల ఎకరాలు, రబీలో 2.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతోంది. వర్షాధార భూముల్లో బెట్ట, తెగుళ్లను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా.. అధిక దిగుబడి ఇచ్చేలా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీసీజీఎస్–1694 (విశిష్ట) వంగడాన్ని రూపొందించింది. కదిరి–6, ఐసీజీ (ఎఫ్డీఆర్ఎస్)–79 రకాలను సంకరపరచడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. 2022లో విడుదల చేసిన ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఇది 25 రోజుల వరకు బెట్టను తట్టుకోగలదు. జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన కదిరి లేపాక్షి హెక్టార్కు 20నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. గింజ దిగుబడి 60 శాతం దాటడం లేదు. కొత్తగా అభివృద్ధి చేసిన విశిష్ట రకం మాత్రం బెట్ట, ఆకుమచ్చ తెగులును తట్టుకోవడంతోపాటు గింజ దిగుబడి శాతం 72నుంచి 75 శాతం నమోదవడం రైతులకు లాభించే అంశం. దీని విశిష్టతలివీ ♦ పంటకాలం 100–105 రోజులు (ఖరీఫ్), 105–110 రోజులు (రబీ). ♦పొడవు 31–37 సెం.మీ. (ఖరీఫ్), 28–30 సెం.మీ. (రబీ). ♦హెక్టారుకు సగటు దిగుబడి 22–25 క్వింటాళ్లు (ఖరీఫ్), 25–30 క్వింటాళ్లు (రబీ). ♦ 100 గింజల బరువు 42–45 గ్రాములు. గింజ శాతం 72–75.. నూనె శాతం 50. ♦ పైరు లేత ఆకుపచ్చ రంగులో సన్నగా పొడవుగా ఉంటుంది. ♦ఊడలు ఒకేసారి దిగడం వల్ల కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. ♦ గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా నున్నగా ఉంటాయి. బెట్ట, తెగుళ్లను తట్టుకుంది మాది సముద్ర తీర ప్రాంతం. ఇప్పటివరకు టీఏజీ–24 రకాన్ని ఎక్కువగా సాగు చేశా. కాయల దిగుబడి 16–20 క్వింటాళ్లకు మించి రాలేదు. దాదాపు ప్రతి సీజన్లో ఆకుమచ్చ తెగులు బారినపడటంతో సాగు ఖర్చులు భారంగా ఉండేవి. విశిష్ట రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశా. టీఏజీ–24తో పోలిస్తే పంట కాలం 7నుంచి 10 రోజులు ఆలస్యమైనా బెట్ట, తెగుళ్లను తట్టుకుంది. గింజ నాణ్యత చాలా బాగుంది. సగటు దిగుబడి 22 క్వింటాళ్లు వచ్చింది. – మధుసూదనరావు, రామతీర్థం, నెల్లూరు జిల్లా గింజ దిగుబడి 75 శాతం నమోదైంది కే–6 రకం సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండేది. కదిరి లేపాక్షి రకాన్ని కూడా సాగు చేశా. అది ఎకరాకు 13 æక్వింటాళ్లు వచ్చింది. చీడపీడల ఉధృతి కాస్త తట్టుకున్నప్పటికీ గింజ శాతం తక్కువగా నమోదైంది. ఇప్పుడు విశిష్ట రకాన్ని సాగు చేశా. ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ.. గింజ శాతం 75గా నమోదైంది. గింజ నాణ్యత కే–6 రకాన్ని పోలి ఉండడంతో మార్కెట్ ధరకు ఢోకా లేదు. – అల్లాబక్షు, తోపుదుర్తి, అనంతపురం వర్షాభావ ప్రాంతాలకు అనుకూలం టీసీజీఎస్–1694 (విశిష్ట) వర్షాభావ ప్రాంతాల్లో సాగుకు ఎంతో అనువైనది. ఎకరాకు 50 కేజీల విత్తనం సరిపోతుంది. శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తే పెట్టుబడి ఎకరాకు రూ.25 వేలకు మించదు. పంటకాలంలో రెండుసార్లు ఎకరాకు అరకిలో సూక్ష్మ ధాతువులు వేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మదర్ సీడ్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయి విత్తనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సీడ్స్ కృషి చేస్తోంది. – డాక్టర్ ఎ.ప్రసన్న రాజేష్, ప్రధాన శాస్త్రవేత్త, వేరుశనగ పరిశోధనా కేంద్రం -
పుష్కలంగా ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైంది. సాగువిస్తీర్ణం స్వల్పంగా తగ్గినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైనట్లు 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధాన్యం ఉత్పత్తిలో కూడా 9.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక ఏడాది ఖరీఫ్, రబీలో కలిపి 121.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 133.65 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తొలి ముందస్తు అంచనాల్లో సర్వే పేర్కొంది. డిసెంబర్ ఆఖరు వరకు రాష్ట్రంలో 109.33 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 7,34,157 మెట్రిక్ టన్నుల మాంసం, 1784.01 లక్షల గుడ్లు ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది. 2021–22లో రాష్ట్రం 2645.03 లక్షల గుడ్ల ఉత్పత్తితో అగ్రస్థానంలో, 1025.59 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తితో రెండో స్థానంలో, 154.03 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో ఐదో స్థానంలో నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. 2021–22లో రాష్ట్రంలో 48.13 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగితే, 2022–23 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు 37.18 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,66,390 కోట్లు వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. ఇది గత ఆర్థిక ఏడాదితో పోల్చితే పది శాతం అదనం అని తెలిపింది. 2023–24లో రూ.1,395.45 కోట్ల వ్యయంతో కొత్తగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇందులో రూ.1,171.81 కోట్లు సబ్సిడీగా ఉంటుందని వెల్లడించింది. -
29న వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: అన్నదాతల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే లక్ష్యంతో రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీనందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమ చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇప్పటికే రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో ఆదివారం (నేటి) నుంచి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. ఖరీఫ్–2021 జాబితా వాలిడేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీనందిస్తోంది. టీడీపీ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు చెల్లిస్తూ రైతులకు బాసటగా నిలిచింది. 2014–19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్–2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019–20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్ 2020 సీజన్లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. రబీ 2020–21తో పాటు ఖరీఫ్–2021 సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమచేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ–క్రాప్లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించనుంది. అలాగే, రబీ 2020–21 సీజన్లో సున్నా వడ్డీ రాయితీ పొందేందుకు 2,54,568 మంది అర్హత పొందినట్లుగా నిర్ధారించారు. వీరికి ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమచేస్తారు. జిల్లాల వారీగా వీరి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఈనెల 22లోగా వీటిని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ వివరాలను ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నా వడ్డీ పంట రుణాల పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ అనే వెబ్సైట్లో "know your status" విండోలో తమ ఆధార్ నంబర్ ఎంటర్చేస్తే వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు.. నవంబర్ 29న ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన రైతులకు కూడా సున్నా వడ్డీ రాయితీని జమచేయనున్నారు. ఈ సీజన్లో పంట రుణాలు తీసుకున్న 10.76 లక్షల మంది వివరాలను బ్యాంకర్లు అప్లోడ్ చేయగా, వారిలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణం పొందడం, ఈ–క్రాప్లో పంటల నమోదు ప్రామాణికంగా వ్యాలిడేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఖరీఫ్–2021 అర్హుల జాబితాను కూడా సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. తప్పొప్పులు సరిచేసుకోవచ్చు.. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకుని తమ పేర్లు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ఒకవేళ అర్హత ఉండి తమ పేరు జాబితాలో లేకపోతే పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత బ్యాంకు అధికారి ధ్రువీకరణతో రైతుభరోసా కేంద్రాల్లో సమర్పిస్తే పునః పరిశీలన చేసి అర్హుల జాబితాలో చేరుస్తారు. – చేవూరు హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. 3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్ నమోదును పూర్తిచేశారు. వచ్చే 16 నుంచి ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది. రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు. ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్ అధికారిని కూడా నియమించారు. దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. పారదర్శకంగా కొనుగోళ్లు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులు ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
తొలకరి సాగులో సరికొత్త ఒరవడి
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇవి సాగు చేయాలి ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి) ఇన్ని విత్తనాలు అవసరం ∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం ∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం ∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది. విత్తనశుద్ధి చేసుకోవాలి సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు. – సీహెచ్కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ -
ఎండే అండ! సోలార్ విద్యుత్ దిశగా అడుగులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గొట్టా బ్యారేజీ వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సోలార్ విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లు ఖరీఫ్, రబీలో పచ్చని పైరుతో మెరవాలంటే హిరమండలం రిజర్వాయర్లో 19.05 టీఎంసీల నీటిని నింపాలి. డెడ్స్టోరేజ్లో 2.5 టీఎంసీల నీరు ఉంది. ఫ్లడ్ఫ్లో కెనాల్, కొండ చరియలు నుంచి వచ్చే నీరంతా కలిపి 4టీఎంసీలు ఉంటుంది. మిగిలిన 12 టీఎంసీల నీటిని నింపాలంటే.. ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేక గొట్టాబ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటుచేయడమే మార్గం. అయితే దీనికి వంశధార ఇంజినీర్లు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వంశధార కుడి కాలువ ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా కాలువను ఆధునీకరించేందుకు డిజైన్లు చేశారు. పాత కాలువ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా దాన్ని మరో వెయ్యి క్యూసెక్కులు అదనంగా నీరు పారేలా కాలువను 10 మీటర్లు వెడల్పు పెంచేందుకు డిజైన్ చేస్తున్నారు. కాలువ సామర్థ్యం పెంచి దానిలోంచి ఎత్తిపోసిన నీటిని హిరమండలం రిజర్వాయర్లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ ఏర్పాటుకు ప్రణాళిక హిరమండలం రిజర్వాయర్లోకి 12 టీంఎంసీల నీటిని నింపేందుకు సాధారణంగా విద్యుత్ వినియోగం 45 మెగావాట్స్ అవ్వవచ్చని నిపుణులు అంచనా. అందుకు సుమారు రూ.25కోట్లు విద్యుత్ చార్జీలు అయ్యే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోయడమనేది వర్షాకాలంలో సుమారు 100 రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఎత్తిపోతల అవసరాలు పూర్తయ్యాక మిగిలిన 9 నెలల కాలంలో సోలార్ విద్యుత్ని ప్రజా అవసరాలకు పు ష్కలంగా అందించవచ్చు. దాని వల్ల వచ్చే ఆదా యంతో సోలార్ప్లాంట్ నిర్మాణ ఖర్చులు, లిఫ్ట్కి అయ్యే విద్యుత్ చార్జీలను రాబట్టుకోవచ్చనే ఓ అంచనా వేస్తున్నారు. సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద స్థలం అవసరం. హిరమండలం రిజర్వాయర్ ఫోర్షోర్, రిజర్వాయర్ గట్టు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. 45 మెగావాట్స్ విద్యుత్ తయారు చేసేందుకు కావాల్సిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకి సుమారు రూ.300కోట్లు ఖర్చు ఉండవచ్చని అంచనా. అయితే ఏటా ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ వినియోగించగా మిగిలిన రోజుల్లో వచ్చే విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చు 8 ఏళ్లలో వచ్చేస్తుంది. ప్లాంట్ నిర్మాణం కంటే రైతులకు ఏటా పండించే పంట అంతకు రెట్టింపుగా ఉంటుంది. సోలార్తో ప్రయోజనం అవసరమైన విద్యుత్ని సోలార్ నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్ లోటు తగ్గుతుంది. లిఫ్ట్ అవసరాలు తీరగా ప్రజా అవసరాలను తీర్చేందుకు అవ కాశం ఉంటుంది. గతంలో భీమవరంలో ఎస్ఈగా పనిచేసిన సమయంలో లోసరి కెనాల్పైన సోలార్ సిస్టమ్ని ఏర్పాటుచేశాం. ఇప్పటికీ విజయవంతంగానే పనిచేస్తోంది. హిరమండలం రిజర్వాయర్లో ఉన్న ఫోర్షోర్ ఏరియాలో సోలార్ సిస్టమ్ అమర్చవచ్చు. – డోల తిరుమలరావు, ఎస్ఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, శ్రీకాకుళం -
ఖరీఫ్కు ముందే ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692 మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి కలగనుంది. ముందస్తుగా సాయం... ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అర్హులందరికీ వర్తించేలా... వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధీమాతో సాగుకు సై... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. (చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
AP: ఖరీఫ్కు భరోసా
సాక్షి, కాకినాడ: ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంట సాగుకు పెట్టుబడిగా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఒక్కో రైతుకు రూ.13,500 అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే ప్రక్రియలో అధికారులు తలమునకలవుతున్నారు. మే నెలలో నగదు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నదాతలను అవసరానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకానికి అంకురార్పణ చేసింది. దీనికింద అర్హులైన రైతులకు సాగు పెట్టుబడి నిమిత్తం ఏటా ఆర్థిక సాయం అందజేస్తోంది. తద్వారా పెట్టుబడి కోసం వారు అప్పులు చేయకూడదన్నది దీని ఉద్దేశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల మంది రైతులకు రూ.317 కోట్లు అందజేస్తోంది. ఖరీఫ్కు ముందుగానే.. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రబీ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. 2022–23 ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేందుకు సుమారు మరో రెండు నెలలు పట్టనుంది. అంతకంటే ముందుగానే అన్నదాతలకు రైతుభరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1,60,901 మంది రైతులు ఉండగా.. రూ.34.83 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. అర్హులందరికీ పథకం వర్తింపజేసే క్రమంలో కొన్ని నిబంధనలు సడలించారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే వారి కుటుంబంలో మరొకరు సాయం పొందే ప్రక్రియను సులభతరం చేశారు. పేరు మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు. కౌలు రైతులకు.. కౌలు రైతులకు సైతం భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పథకానికి అవసరమైన కౌలు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. కార్డులు పొందాలనుకునే వారి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మండల వ్యవసాయ అధికారి, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు భరోసా పథకం సాధ్యాసాధ్యాలు, అర్హతలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు పాసు పుస్తకం తీసుకుని సమీప రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లో సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామ వలంటీర్, సచివాలయం, వ్యవసాయ అధికారిని సంప్రదించినా పథకంలో లబ్ధి పొందవచ్చు. పథకం కింద ఏటా రూ.13,500 నగదును మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అర్హులందరికీ భరోసా వైఎస్సార్ రైతు భరోసా పథకంలో అర్హులెవరూ నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అర్హుల జాబితా రూపొందించాం. అర్హత ఉండి తమకు పథకం వర్తించకుంటే సంబంధిత ఆర్బీకేలో సంప్రదిస్తే పరిశీలించి న్యాయం చేస్తారు. మే నెలలో భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. – ఎన్.విజయకుమార్, జేడీ అగ్రికల్చర్, కాకినాడ జిల్లా -
దిగుబడులు ఘనం
సాక్షి, అమరావతి: రైతన్నను జవాద్ తుపానుతో పాటు వరదలు, అకాల వర్షాలు చివరిలో కలవరపెట్టినా ఈసారి ఖరీఫ్లో రికార్డు స్థాయి దిగుబడులు నమోదవుతున్నాయి. పంటకోత ప్రయోగాల అనంతరం విడుదల చేసిన రెండో అంచనా నివేదిక ప్రకారం ఈదఫా మంచి దిగుబడులొచ్చాయి. 2020 ఖరీఫ్లో 165.68 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు రాగా 2021 ఖరీఫ్లో దాదాపు 174 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు రానున్నాయి. పెరిగిన సాగు విస్తీర్ణం, సమృద్ధిగా కురిసిన వర్షాలు దిగుబడులు పెరిగేందుకు దోహదపడినట్లు అధికారులు చెబుతున్నారు. మిరప తోటలను తామర పురుగు దెబ్బ తీయకుంటే ఖరీఫ్ 2019కు దీటుగా దిగుబడులు వచ్చేవని పేర్కొంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో సాగు.. ఖరీఫ్ 2019లో రాష్ట్రంలో 90.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా రికార్డు స్థాయిలో 194.07 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొచ్చాయి. ఖరీఫ్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వరి 38.15 లక్షల ఎకరాల్లో సాగవగా 80.13 లక్షల ఎంటీల దిగుబడి వచ్చింది. కృష్ణా, గోదావరి వరదలతో ఉప్పొంగినా వరితో సహా చెరకు, పత్తి, వేరుశనగ.. దాదాపు అన్ని పంటల దిగుబడులు ఊహించని స్థాయిలో వచ్చాయి. దీంతో ఖరీఫ్ 2020లో రెట్టించిన ఉత్సాహంతో రైతులు రికార్డు స్థాయిలో 93.57 లక్షల ఎకరాల్లో సాగు చేయగా వరదలతో పాటు నివర్ తుపాను, అకాల వర్షాల ప్రభావంతో దిగుబడి 165.68 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. 40.02 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 67.60 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రికార్డు దిశగా ధాన్యం ఖరీఫ్ 2021లో రైతన్నలు 94.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. పంటకోత ప్రయోగాలు పూర్తికావడంతో రెండో తుది అంచనాల ప్రకారం ఈ ఏడాది 174 లక్షల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కోతల వేళ వర్షాలు, వరదలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికి దిగుబడులపై ప్రభావం చూపలేదు. ఖరీఫ్లో ఈసారి 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. హెక్టార్కు 4,933 కేజీల చొప్పున 80.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తున్నాయి. ధాన్యం దిగుబడుల్లో గడిచిన మూడేళ్లలో ఇదే రికార్డు. మొక్కజొన్న, కందులు, మిరప సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ మిరప పంటను తామర పురుగు చిదిమేసింది. గతేడాది 80 వేల ఎంటీల దిగుబడి వచ్చిన కందులు ఈసారి 1.19 లక్షల ఎంటీలు రానున్నాయి. ఎకరాకు 36 బస్తాలు రెండెకరాల్లో వరి సాగు చేశా. చివరిలో వర్షాలు కలవరపెట్టినప్పటికీ ఎకరానికి 36 బస్తాల దిగుబడి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. – తోకల వెంకట్రావు, ఏడిద, మండపేట (తూర్పు గోదావరి) వైపరీత్యాలకు ఎదురొడ్డి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేశా. వైపరీత్యాలను తట్టుకొని ఎకరాకు 32 బస్తాల దిగుబడి వచ్చింది. వర్షాలు, వరదలకు పైరు పడిపోలేదు. తెగుళ్లు సోకలేదు. మంచి దిగుబడులొచ్చాయి. – టి.వీ.రావు, ఉండ్రపూడి, కృష్ణా జిల్లా రెండేళ్ల కంటే మిన్నగా.. ఖరీఫ్ 2020తో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరిగింది. గత సీజన్తో పోలిస్తే ఈసారి ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయి. గత రెండేళ్ల కంటే మిన్నగా ఈసారి దిగుబడులొచ్చాయి. –హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ ఆ ప్రభావం దిగుబడులపై లేదు.. ప్రభుత్వ తోడ్పాటుతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో సాగు చేశారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాం. చివరిలో తుపాన్లు, వరదలు, వర్షాలు కొంతమేర పంటలను దెబ్బతీసినప్పటికీ ఆ ప్రభావం దిగుబడులపై పడలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. –కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది. దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
AP: కొనుగోళ్లకు ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ వడివడిగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరితో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాల్లోని 123 మండలాల పరిధిలోని 774 రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రూ.189.62 కోట్ల విలువైన 98 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతులకు చెల్లింపు చేస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా పంట కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంలేదు. ఇప్పట వరకు 8,277 మంది రైతులు ధాన్యం విక్రయించగా 1,977 మందికి తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా నగదు జమచేశారు. గతేడాది రూ.8,868 కోట్లతో 47.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం 50 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించారు. నిబంధనలు సడలింపు కోరుతూ.. వర్షాల కారణంగా కోస్తాలోని కొన్ని మండలాల్లో కోతలు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు వారాల కిందటే కోతలు ప్రారంభించాల్సి ఉండగా తుపాను హెచ్చరిక నేపథ్యంలో రైతులు సాహసించడంలేదు. ఇక రాయలసీమ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అయితే.. రైతులెవ్వరూ ఆందోళన చెందక్కర్లేదని.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17లోపు ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వర్షాలతో కోతకొచ్చిన పంటతో పాటు కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆర్బీకేల వద్ద శాంపిళ్లను పరీక్షిస్తే తేమ శాతం 23కు పైగా ఉంటోంది. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా నిబంధనలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 84.60 లక్షల గోతాలు అందుబాటులో.. రైతులకు గిట్టబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం 13 జిల్లాల్లోని 6,884 ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. తేమ శాతం పేరుతో మధ్యవర్తులు, దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా కల్లాల్లోనే నమూనాలు సేకరించి ఆర్బీకేల్లో పరిశీలించేలా ఏర్పాట్లుచేసింది. గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.1,960, సాధారణ రకం క్వింటాకు రూ.1,940 అందిస్తోంది. అలాగే.. ఆధార్ అనుసంధానంతో ధాన్యం విక్రయించిన 72 గంటల నుంచి 21 రోజుల్లో చెల్లింపులు పూర్తిచేస్తోంది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, ధాన్యం రవాణాకు 84.60 లక్షల గోతాలు అందబాటులో ఉంచారు. ఆధార్ నంబర్తో చెల్లింపులు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రైతులపై భారం పడకుండా కల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలను సడలించాలని కేంద్రానికి లేఖరాశాం. రైతులు అధైర్యపడాల్సినఅవసరంలేదు. – వీరపాండియన్, ఎండీ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హమాలీ ఖర్చులు వెంటనే ఇచ్చేశారు నా పేరు గొలుగూరి ఈశ్వర్రెడ్డి. మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామం. మా ఊరి ఆర్బీకేలో బుధవారమే 202.8 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించాను. అక్కడి సిబ్బంది కల్లం వద్దకు వచ్చి శాంపిళ్లు తీసుకున్నారు. వారే వాహనంలో ధాన్యాన్ని తరలించారు. లోడింగ్కు హమాలీలను నేను ఏర్పాటుచేసుకున్నా. ఆ ఖర్చును కూడా క్వింటాకు రూ.25 చొప్పున నాకు రూ.5వేల చెక్కును వెంటనే ఇచ్చేశారు. ఇక ధాన్యానికి రూ.3.93 లక్షలను 21 రోజుల్లోనే జమచేస్తామని చెప్పారు. -
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
కరువుతీరేలా ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్లో ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్ఫెడ్ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. సాగు విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని«విధంగా ఆర్బీకేలు, సొసైటీలు ఎరువుల విక్రయాలను చేపడుతున్నాయి. సీజను ప్రారంభానికి ముందే రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులోకి తెస్తున్నారు. లక్ష్యానికి మించి నిల్వలు.. ఖరీఫ్లో దాదాపు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్క్ఫెడ్ ప్రతి నెలా కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలు చేసి ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తోంది. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో కనీసం 1.50 లక్షల టన్నులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మార్క్ఫెడ్ ప్రభుత్వ లక్ష్యానికి మించి 1.77 లక్షల టన్నులను నిల్వ చేసింది. ఎరువుల రవాణాలో జాప్యం జరిగినా, కొరత ఏర్పడినా ఈ బఫర్ స్టాక్ను వినియోగించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాముల్లో 1,52,449 టన్నులు నిల్వ ఉండగా సహæకార సంఘాల గోదాముల్లో 25 వేల టన్నులు నిల్వ ఉన్నాయి. గత సర్కారు హయాంలో ధర్నాలు గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు పలుదఫాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధిక ధరలు, ఎరువుల కొరత సమస్యలతో సతమతమయ్యారు. ఈ బాధల నుంచి రైతన్నలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సహకార సంఘాల్లోనూ ఎరువుల విక్రయాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పది వేల టన్నులు కొనుగోలు ఇప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న 577 సహకార సంఘాల్లో 25 వేల టన్నులు, 4,166 రైతు భరోసా కేంద్రాల్లో 68 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోదాముల్లో 84 వేల టన్నుల ఎరువులను నిల్వ చేశారు. ప్రైవేట్ మార్కెట్ కంటే ఆర్బీకేలు, సంఘాల్లో ఎరువుల ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటికే 10 వేల టన్నులను కొనుగోలు చేశారు. ఎరువుల కొరత రానివ్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఖరీఫ్లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు వ్యూహంతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు విక్రయించేందుకు వీలుగా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అధికంగా సిద్ధం చేస్తున్నాం. కనీసం 1.50 లక్షల బఫర్ స్టాక్ ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతకు మించి నిల్వలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,950 సహకార సంఘాలకుగానూ ఆర్ధికంగా, క్రియాశీలకంగా ఉన్న 577 సంఘాలను తొలి విడత ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేశాం. మిగిలిన సంఘాల పరిస్థితిని సమీక్షించి విక్రయాలను చేపడతాం. – ఎం.ఎస్. ప్రద్యుమ్న, మార్క్ఫెడ్ ఎండీ తప్పిన ఇబ్బందులు గ్రామస్థాయిలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యయ ప్రయాసలు తొలగాయి. గతంలో వ్యవసాయ పనులు మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతుకు సమయం ఆదా అవుతోంది. -
పత్తి.. వరి.. కంది
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. పత్తి, వరితో పాటు కంది పంటలను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈసారి రాష్ట్రంలో కంది, పత్తి, వరి ఈ మూడు పంటలే అత్యధికంగా సాగు కానున్నాయి. గతంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఈసారి మొక్కజొన్న స్థానంలో కంది పంట వచ్చి చేరింది. దేశంలో మొక్కజొన్న నిల్వలు ఎక్కువగా ఉండటం, ధర, డిమాండ్ లేని నేపథ్యంలో ఈ పంట సాగును తగ్గించాలని ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, వరికి మరింత ప్రోత్సాహం 2012–22 వానాకాలం సీజన్(ఖరీఫ్)కు సంబంధించిన సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. గతేడాది వానాకాలంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది పత్తి 44.50 లక్షల ఎకరాలు సాధారణ సాగుగా నిర్ధారించగా, 54.45 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి 70.04 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండాలని, ఆ మేరకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పత్తికి మంచి ధర ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సాగు నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 27.25 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 41.19 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 41.85 లక్షల ఎకరాలుగా నిర్ధారించారు. మొక్కజొన్న 22 శాతానికే పరిమితం ఇప్పటివరకు పత్తి, వరి తర్వాత అత్యంత కీలకమైన పంటగా ఉన్న మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గనుంది. గతేడాది వానాకాలం సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 11.76 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 10.11 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 2.27 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. అంటే మొత్తం పంటల్లో దాదాపు 22.45 శాతానికే మొక్కజొన్న పరిమితం కానుంది. ఇక విత్తన కొరత, ఇతర కారణాలతో సోయాబీన్ సాగు కూడా తగ్గిపోనుంది. గతేడాది వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 4.88 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది. తాజాగా దీనిని కేవలం 1.33 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. కందికి మంచిరోజులు ఈసారి పత్తి, వరితో పాటు కంది సాగును బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.61 లక్షల ఎకరాలు కాగా, 7.38 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో కందిని సాగు చేయించాలని నిర్ణయించారు. ఈసారి 20 రకాల పంటలకు సంబంధించిన 1.40 కోట్ల సాధారణ సాగు విస్తీర్ణంలో పత్తి, కంది, వరి సాధారణ సాగు విస్తీర్ణమే ఏకంగా 1.31 కోట్ల ఎకరాలు (94.13 శాతం) ఉండటం గమనార్హం. ఇలావుండగా ఈ సీజన్కు మొత్తం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం 6.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. చదవండి: Telangana: తొలి మాసం.. శుభారంభం -
విపత్తులోనూ విత్తనాలు సిద్ధం
అనంతపురం (అగ్రికల్చర్): వేరుశనగ రైతులకు ఖరీఫ్ వేరుశనగ విత్తనాలను ఈ నెల 17 నుంచి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ కావడంతో 2.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కేటాయించారు. కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు 1.60 లక్షల క్వింటాళ్లు వెరసి 4.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. క్వింటాల్ విత్తనాల ధర రూ.8,680గా నిర్ణయించగా.. అందులో 40 శాతం అంటే రూ.3,472 రాయితీ ఇస్తున్నారు. రైతులకు క్వింటా విత్తనాలను రూ.5,208కే అందజేస్తారు. సోమవారం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అవసరమైన రైతుల రిజి్రస్టేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 17 నుంచి వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు. ముందుగానే మద్దతు ధర ప్రకటించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే వేరుశనగకు మద్దతు ధర ప్రకటించడంతో రైతులకు గిట్టుబాటు అయింది. అనంతపురం జిల్లాలో ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ వేర్వేరుగా రెండు మూడు రోజులు పర్యటించి వేరుశనగ సేకరణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లాలో 2.90 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించి.. రూ.193 కోట్ల వరకు వెచ్చించి 20వేల మంది రైతుల నుంచి 3 లక్షల క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేశారు. చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా ఇదేవిధంగా సేకరించి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17నుంచి మూడు విడతలుగా విత్తనాలు పంపిణీ చేసేలా మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ‘అనంత’లో 4.70 లక్షలహెక్టార్లలో సాగు అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్లో 4.70 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు అవుతుందని అంచనా వేశాం. అందుకోసం రైతులకు 40 శాతం రాయితీపై 2.90 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో రైతులు, అధికారులు ఇబ్బంది పడకుండా మూడు దశల్లో సాఫీగా పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఆర్బీకే వేదికగా విత్తనం కోసం రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులకు గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం. విత్తనాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా పంట సాగు చేసి ఈ–క్రాప్లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు వర్తిస్తాయి. – వై.రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు
సాక్షి, అమరావతి: రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత గతంలో చెప్పినట్లుగానే 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి కల్లా రైతులకు బకాయిలను పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిర్ణీత లక్ష్యం ప్రకారం ఖరీఫ్ ధాన్యం సేకరణ జరపాలని సూచించారు. ధాన్యం సేకరణ, ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 3వ వారంలో డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం.. ఇంటి వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈనెల 3వ వారంలో ప్రారంభమవుతాయి. అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్స్ ఆవిష్కరణ ఉంటుంది. ఫిబ్రవరి 1వతేదీ నుంచి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ మొదలవుతుంది. ఇందుకోసం 9,260 మొబైల్ యూనిట్లు, అధునాతన తూకం యంత్రాలు సిద్ధమయ్యాయి. 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు రెడీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లక్ష్యానికి మించి నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను కేటాయించాం. ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85 వాహనాల కేటాయింపు జరిగింది. వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ ఇస్తుండగా 10 శాతం వాటాను వారు భరించాలి. 60 శాతం బ్యాంకు రుణం అందుతుంది. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందచేస్తున్నాం. ప్రతి జిల్లాలో రుణాల మంజూరు క్యాంపులు నిర్వహిస్తున్నాం. -
ధాన్యం సేకరణకు 50 లక్షల ఓవెన్ బ్యాగ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గోనె సంచుల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరు నెలలుగా సరఫరా ఆగిపోవడంతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా 50 లక్షల సంచులను (ఓవెన్ బ్యాగులు) కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించగా.. అందుకు అవసరమైన సంచులను సిద్ధం చేస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి సేకరిస్తున్నా.. సంచుల కొరత నుంచి గట్టెక్కేందుకు బియ్యం పంపిణీ కోసం వినియోగించిన గోనె సంచులను రేషన్ డీలర్ల నుంచి పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. రైస్ మిల్లర్ల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఆ సంచులు ఏమాత్రం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనం పొందేందుకు 50 లక్షల సంచులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. -
గత ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఖరీఫ్, రబీతో కలిపి బ్యాంకర్లు రైతులకు లక్ష్యాన్ని మించి పంట రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్మును కూడా చెల్లిస్తామని ప్రకటించడంతో బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేశాయి. నిజానికి గత ఏడాది ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.51,240 కోట్లు కాగా.. రూ.51,511 కోట్లను అందించాయి. అలాగే.. గత రబీలో పంట రుణాలు రూ.32,760 కోట్లకుగాను రూ.37,762 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 115.27 శాతం. మొత్తం వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది రూ.1,15,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,13,997 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 99.13 శాతం. సర్కారు దన్నుతో రుణాలకు బ్యాంకుల ఆసక్తి ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ కలిపి రూ.94,524 కోట్లు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.18,323 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. అలాగే, ఖరీఫ్, రబీ కలిపి వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.34,036 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.1,639 కోట్లను మంజూరు చేశాయి. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకులు కూడా పంట రుణాలను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. -
ఖరీఫ్ సాగుపై చిగురించిన ఆశలు
సాక్షి, అమరావతి బ్యూరో: సకాలంలో వర్షాలు కురవడంతో రైతుల పంటల సాగులో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్నాడు వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. పల్నాడు ప్రాంతంలో రైతులు పత్తి విత్తనాలు ముమ్మరంగా నాటుతున్నారు. పశి్చమ డెల్టా ప్రాంతంలో వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో వెద పద్ధతిలో వరి సాగుచేస్తున్నారు. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్నెట్లో మిరప నారు పోస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్ కింద, పెసర, మినుము, నూగు పంట సాగుచేశారు. పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించి 6,140 ఎకరాల్లో పంట సాగు అయింది. గత ఏడాది పత్తి, పసుపు పంటలకు ఆశించిన మేర ధర లేదు. దీనికి తోడు పత్తి పంటకు గులాబీ రంగు పురుగు కొన్ని ప్రాంతాల్లో సోకవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో మిరప పంటకు సంబంధించి ధరలు ఆశాజనకంగా ఉండటం, దిగుబడులు సైతం బాగానే వచ్చాయి. దీంతో ఈ ఏడాది రైతులు మిరప పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పత్తి పంట సాగు కొంత మేర తగ్గి, మిరప పంట సాగు పెరుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో పంట సాగు లక్ష్యం 12,68,970 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పత్తి పంటకు సంబంధించి సాగు లక్ష్యం 4,50,000 ఎకరాలు, మిరప పంట సాగు లక్ష్యం 1,89,265 ఎకరాలుగా నిర్ణయించారు. జిల్లాలో పంటల సాగు ఇలా జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 83.4 మిల్లీమీటరు. 114.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పదునైంది. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, దుర్గి, రెంట చింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, ఫిరంగిపురం, క్రోసూరు, యడ్లపాడు మండలాల్లో 26,142.5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. పశి్చమ డెల్టా పరిధిలోని వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో 255 ఎకరాల్లో వెద పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఇవి కాకుండా ముందస్తు ఖరీఫ్ కింద పెసర పంట 1032.5 ఎకరాలు, మినుము పంట 3422.5 ఎకరాలు, నువ్వులు 1740 ఎకరాల్లో మొత్తం 6,195 ఎకరాల్లో పంట సాగు చేశారు. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన పంటలు 6,485 ఎకరాల్లో సాగు అయ్యాయి. మిరప నారు 187.5 ఎకరాల్లో పోశారు. చిరు ధాన్యాల పంటలు 357.5 ఎకరాలు, పసుపు పంట 1505 ఎకరాల్లో సాగు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 46,557.5 ఎకరాల్లో సాగయ్యాయి. ఉత్సాహంగా పంటల సాగు... ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. జూన్ నెల చివరి నాటికి పట్టిసీమ నీరు రావడంతో పశి్చమ డెల్టా రైతులు వెద పద్ధతితోపాటు, వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు త్వరగానే నిండుతాయని రైతులు ఆశిస్తున్నారు. దీని ద్వారా ఈ ఏడాది పంటలకు సంబంధించి సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నారు. పంట రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ప్రొత్సహిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో అన్నదాతలు పంటలు సాగు చేస్తూ ముందుకు వెళుతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 14వేల క్వింటాళ్ల వరి, 1540 క్వింటాళ్ల మిరప, 12.84 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, రైతులకు అందుబాటులో ఉంచాం. ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కలి్పస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు -
కోటి ఆశలతో ఖరీఫ్
-
కోటి ఆశలతో ఖరీఫ్
-
సోయా.. ఏదయా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోయా సబ్సిడీ విత్తనాల సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వానాకాలం సీజనులో రైతులకు సరఫరా చేయాల్సిన సోయా విత్తనాల్లో కనీసం సగం కూడా జిల్లాలకు చేరలేదు. మరో వారం రోజుల్లో ఖరీఫ్ పనులు ఊపందుకోనున్న నేపథ్యంలో.. ఈసారి పూర్తి స్థాయిలో సోయా సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయలేమని వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. రైతులు తమకు అవసరమైన సోయా విత్తనాలను ప్రైవేటు విత్తన వ్యాపారుల వద్ద కొనుగోలు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి రావాల్సిన ఈ విత్తనాలు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. (హార్ట్టచింగ్: నేలకు దిగిన న్యాయం!) ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బఫర్ నిల్వలు 16,500 క్వింటాళ్లు ఉండగా, మిగిలిన 1.28 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేసే బాధ్యతలను తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హాకా, ఎన్ఎస్సీ, మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ సంస్థలకు అప్పగించింది. అయితే 1.45 లక్షల క్వింటాళ్లలో ఇప్పటి వరకు సుమారు 80 వేల క్వింటాళ్లు కూడా జిల్లాలకు చేరలేదు. ఒక్క నిజామాబాద్ జిల్లానే పరిశీలిస్తే 32 వేల క్వింటాళ్లు సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపితే కేవలం 19,820 క్వింటాళ్ల మాత్రమే కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు 9,532 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సాగు రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సోయా సాగవుతుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా రైతులు ఈ పంటను వేసుకుంటారు. గత వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన వ్యవసాయ విధానంలో ఈ సోయా సాగు విస్తీర్ణాన్ని మూడు లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. రైతులకు విత్తన భారం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా సోయా విత్తనాలపై సబ్సిడీని ఇస్తోంది. ఒక్కో క్వింటాలుపై రూ.810 ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా, రైతులు రూ.1,183 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పూర్తి ధర చెల్లించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు విత్తన వ్యాపారులు ధరలను పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. (చదవండి: సొంతూళ్లోనే కాయకష్టం) -
ఇకపై వానాకాలం, యాసంగి!
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఈ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాఖాపరమైన ఉత్తర్వుల్లో వానాకాలం, యాసంగి అనే పేర్కొనాలని సూచించారు. -
ఖరీఫ్ను మించి 'యాసంగిలో'..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలతో నిండిన ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీటి సరఫరా జరగడం, చెరువుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి గత ఖరీఫ్ కంటే అధికంగా ఉండనుంది. ఈ యాసంగిలో ఏకంగా 59 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇది గత ఖరీఫ్ లో సేకరించిన దానికన్నా ఏకంగా 12 లక్షల టన్ను లు అధికంగా వచ్చే అవకాశం ఉండటం విశేషం. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో విస్తృతంగా వరి సాగు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతల జరిగి ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు అందడం, నాగార్జునసాగర్, ఇతర మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టుల కింద వరిసాగు పెరిగింది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరగ్గా ఈ ఏడాది అది ఏకంగా 28.55 లక్షల ఎకరాలకు పెరిగింది. 10 లక్షల ఎకరాల మేర సాగు పెరగడంతో ఈ సీజన్లో వరి ధాన్యం భారీగా మార్కెట్లోకి వ స్తుందని అంచనా. గతేడాది యాసంగిలో పౌరసర ఫరాల శాఖ 37 లక్షల వరి ధాన్యాన్ని కొనుగోలు చే సింది. మొన్నటి ఖరీఫ్లో 47.11 లక్షల టన్నులు సేకరించింది. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర చరిత్ర లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 59 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేశాయి. ఖరీఫ్కన్నా ఏకంగా 12 లక్షలు, గతేడాది యాసంగికన్నా 22 లక్షల టన్నుల మేర అధికంగా వచ్చే అవకాశాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి. ఖరీఫ్ లోనే 3,670 కొనుగోలు కేంద్రాలు, 12 కోట్ల గోనెసంచులు అందుబాటులో ఉంచగా ఈ ఏడాది అం తకుమించి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని శాఖలు తేల్చాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్యను 4 వేలకు పెంచే అవకాశాలున్నాయి. ఇక ఖరీఫ్లో రూ. 8,626 కోట్లు సేకరణకు వెచ్చించగా ఈ సీజన్లో రూ. 10 వేల కోట్లు అవసరం ఉంటుందని లెక్కిస్తున్నారు. ఈ సీజన్లో సైతం క్వింటాలు గ్రేడ్–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్ వెరైటీకి రూ. 1,815 చొప్పున అందించనున్నారు. రైతులకు అవగాహన: యాసంగి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశాన్ని సోమవారం వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు నిర్వహించనున్నాయి. ఈ భేటీకి మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డితోపాటు ఇరు శాఖల అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం విక్రయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ నాణ్యత, పరిమాణం విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను ధాన్యం సేకరణలో భాగస్వామిని చేయనున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్చార్జిగా నియమించడం, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం మార్కెట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. -
రైతు ఇంట లక్ష్మీకళ!
సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా వ్యవసాయ పంటల సాగుకు ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీలు, ట్రాక్టర్ల అద్దె తడిసిమోపెడవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి. అదును దాటిపోకూడదనే ఉద్దేశంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు తెచ్చుకోవడానికి అవస్థలు పడేవారు. ఈ సంవత్సరం మాత్రం అన్నదాతలకు ఆ తిప్పలు తప్పాయి. పంటలను బట్టి రుణాలు సాఫీగా మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం స్పందించింది. రుణపరిమితి కూడా గత ఏడాది కన్నా ఈ ఖరీఫ్లో అదనంగా పెంచడానికి జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ ఆమోదముద్ర వేసింది. జిల్లాలో అత్యధికంగా పండే వరి సహా ప్రధాన పంటల రుణపరిమితి పెరిగింది. రుణాల లక్ష్య సాధనలోనూ మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఖరీఫ్లో 91 శాతం లక్ష్యసాధన.. జిల్లాస్థాయి బ్యాంకుల కమిటీ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2019 ఖరీఫ్లో రూ.3,006 కోట్లు, రబీలో రూ.1,762 కోట్లు రుణాల మంజూరుచేయాల్సి ఉంది. ఖరీఫ్లో 3,18,153 మంది రైతులకు రూ.2,264 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలి. టర్మ్ రుణాలు 73,237 మంది రైతులకు రూ.742 కోట్లు మంజూరు చేయాలి. ఈ లక్ష్య సాధనకు బ్యాంకులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కృషి చేశారు. ఫలితంగా 3,19,547 మంది రైతులకు పంటరుణాల కింద రూ.2,102 కోట్లు (93 శాతం) మంజూరయ్యాయి. అలాగే 72,469 మందికి రూ.647 కోట్లు మేర (87 శాతం) టర్మ్ రుణాలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో మొత్తంమీద 3,92,016 మంది రైతులకు రుణల రుపేణా రూ.2,749 కోట్లు (91 శాతం) మంజూరయ్యాయి. రబీలో సాఫీగా రుణాల ప్రక్రియ.. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించడంతో రైతులు ఉత్సాహంగా రబీ సీజన్కూ సిద్ధమయ్యారు. జిల్లాలో 2,23,217 మంది రైతులకు పంటరుణాలు కింద రూ.863 కోట్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకూ1,43,759 మందికి రూ.573 కోట్లు (66 శాతం) మంజూరయ్యాయి. టర్మ్ రుణాలు కూడా 73,237 రైతులకు గాను ఇప్పటివరకూ 42,157 మందికి రూ.498 కోట్లు మంజూరయ్యాయి. లక్ష్యం రూ.899 కోట్లలో ఇది 55 శాతం. ‘వైఎస్సార్’ పథకంతో రైతుకు భరోసా.. గతంలో కన్నా ఈసారి రైతులు ఎక్కువగా బ్యాంకు రుణాల వైపు చూపడానికి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రధాన కారణమైంది. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పంటల బీమా ప్రీమియంలో రైతు తన వంతుగా ఒక్క రూపాయి చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. రబీ సీజన్ నుంచి రైతులు ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించాలి్సన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్బీవై)లో పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియం విలువలో రైతులు 2 నుంచి 5 శాతం వరకూ సొమ్ము చెల్లించేవారు. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించేవి. ఈసారి రైతులు చెల్లించాలి్సన ప్రీమియం బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ పథకంపై వ్యవసాయ శాఖ, బ్యాంకింగ్ అధికారులు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్ల్లో మొత్తం రూ.4,768 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,820 కోట్ల మేర (80 శాతం) రుణాలు మంజూరయ్యాయి. కౌలు రైతులకు సర్కారు అండ భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి భూమిని సాగుచేసుకుంటున్న కౌలురైతులకు 11 నెలల పాటు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలుదార్ల చట్టం తీసుకొచి్చంది. దీంతో కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు పంటల బీమా, నష్టపోయిన పంటలకు పరిహారం పొందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రకారం జిల్లాలో 12,561 మంది కౌలుదార్లకు రుణఅర్హత పత్రాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. మరో 2,906 మందికి భూయజమానుల ద్వారా సాగుహక్కు పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పించారు. ఇలా మొత్తంమీద 15,467 మంది కౌలుదార్లకు మేలు జరిగింది. ఆయా పత్రాల ఆధారంగా జిల్లాలో 11,376 మంది కౌలుదార్లకు రూ.23.26 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
ధాన్యం కొనుగోలుకు వేళాయె..!
ఖరీఫ్ (సార్వా) పంట రైతుల చేతికొచ్చింది. అనుకూల వర్షాలతో జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడి ఆశాజనంగానే ఉంది. చాలాచోట్ల ఇప్పటికే వరికోతలు పూర్తయ్యాయి. మిగతాచోట్ల ముమ్మరంగా కోత పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ధాన్యం మద్దతుధరలనూ ప్రకటించింది. ఈ ప్రకారం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. అధికారులు అందుకతగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూమి విస్తీర్ణం 1,07,428 హెక్టార్లు. దీనిలో సాధారణంగా సాగు అయ్యే విస్తీర్ణం 1,02,312 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్లో దాదాపు 97,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. వర్షాలు అనుకూలించడంతో దిగుబడి పెరిగిందని రైతులు ఆనందంలో ఉన్నారు. దాదాపు 3,68,752 మెట్రిక్ టన్నుల వరకూ ఉంటుందని అంచనా. దీనిలో రైతులు సొంత వినియోగానికి 1,08,657 మెట్రిక్ టన్నుల వరకూ మినహాయించుకున్నా, మిగతా 2,60,095 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి రావాల్సి ఉంది. జిల్లాలో 34 రైస్మిల్లులు ఉన్నాయి. ఈ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 55 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ)ను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. వీటిలో ఐదు వెలుగు (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చోడవరం వ్యవసాయ మార్కె ట్ యార్డు, యలమంచిలి మండల సమాఖ్య (లైన్ కొత్తూరు), నాతవరం మండల సమాఖ్య, నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు, పద్మనాభం మండల సమాఖ్య ఆవరణల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా 50 పీపీసీలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు వీటిని తెరుస్తారు. ఇవన్నీ మార్చి నెల వరకూ పనిచేస్తాయి. దళారీలకు అడ్డుకట్ట... రైతుల వద్ద తక్కువ ధరకు ముందుగానే ధాన్యాన్ని కొనేసి లబ్ధి పొందుతున్న దళారీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తాము సాగు చేసిన పంటను ధాన్యం రకాలతో సహా ఈ–క్రాప్లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత మండల వ్యవసాయాధికారిని లేదా వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలి. గ్రామ సచివాలయంలోని గ్రామ వ్యవసాయ సహాకుల సలహా, సహకారాలు తీసుకోవచ్చు. కౌలురైతులు రుణ అర్హతపత్రం లేదా సాగు ధ్రువీకరణ పత్రం సంబంధిత కార్యాలయం నుంచి పొందాలి. ధాన్యం కొనుగోలు సమయంలో వెబ్ల్యాండ్/ఈ–క్రాప్లో నమోదైన వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. దళారీలకు అడ్డుకట్ట వేసి నిజమైన రైతులకు న్యాయం చేయడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగైదేళ్లుగా తమ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరు నమోదుచేసుకోని రైతులు ఎవ్వరైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్కార్డు, పాసుపోర్టు సైజ్ ఫొటోతో పాటు బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం కాపీలను తీసుకెళ్లాలి. అంతకన్నా ముందు అసలు బ్యాంకు ఖాతా మనుగడలో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పనిచేయని ఖాతా నంబరు ఇస్తే ధాన్యం ధర చెల్లింపు విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రైతులు తాము ఏ రోజు పీపీసీకి తీసుకొచ్చేదీ ముందుగానే అక్కడి సిబ్బందికి తెలియజేయాలి. అందుకోసం టోకెన్ తీసుకోవాలి. నాణ్యత ప్రమాణాల ప్రకారమే ధర... ధాన్యానికి కనీస మద్ధతు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం సాధారణ రకం క్వింటాల్కు రూ.1,815 చొప్పున, ఏ గ్రేడు రకం ధాన్యానికి రూ.1,835 చొప్పున ధర రైతులకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఈ ధాన్యం సేకరణలో పాటించాలి్సన నాణ్యత ప్రమాణాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో మట్టిరాళ్లు, ఇసుక తదితర వ్యర్థాలు, గడ్డి, చెత్తతాలు, పొట్టు 1 శాతం వరకూ ఉండవచ్చు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తొలచిన ధాన్యపు గింజలు 4 శాతానికి మించకూడదు. పరిపక్వంకాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన గింజలు 3 శాతం వరకూ ఉండవచ్చు. ఏ గ్రేడు ధాన్యంలో కేళీలు 6 శాతం మించి ఉండకూడదు. ఏ గ్రేడు, సాధారణ రకాలైన సరే తేమ 17 శాతం వరకే ఉండాలి. సమీప కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలి. తక్కువ ధరలకు దళారీల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందండి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని సొంత ఖర్చుతోనే కేంద్రానికి తీసుకెళ్లాలి. ధాన్యం కొనుగోళ్లకు అన్ని పీపీసీల్లోనూ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ నాణ్యత పరిశీలనలో ఆమోదం పొందిన ధాన్యాన్ని గోనెసంచుల్లో నింపడం, కాటా వేయడం, బస్తాలు కుట్టడం, మార్కింగ్ వేసి లారీలకు లోడు చేయడం తదితర పనులకు అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరిస్తుంది. – వి.వినయ్చంద్, జిల్లా కలెక్టరు ధాన్యం రకాలన్నీ కలిపేయవద్దు.. నూర్పుడి సమయంలోనే ధాన్యం కలిపేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకానికి ఆ రకమే ప్రత్యేకంగా నూర్పిడి చేయాలి. వాటిని ప్రత్యేక సంచుల్లో నింపాలి. తేమ శాతం 17 శాతం మించకుండా కళ్లాల్లో బాగా ఆరబెట్టిన తర్వాత రైతులు ఆ ధాన్యాన్ని పీపీసీకి తీసుకెళ్లాలి. అక్కడి సిబ్బందికి అప్పగించి వారి నుంచి తగు రసీదు పొందాలి. ధాన్యం విలువను నిర్ధారించిన తర్వాత ఎఫ్టీవోను తప్పకుండా అడిగి మరీ తీసుకోవాలి. – పి.వెంకటరమణ, జిల్లా మేనేజరు, జిల్లా పౌరసరఫరాల సంస్థ -
నవ్వులు నాటిన ‘నైరుతి’!..
సాక్షి, హైదరాబాద్: ‘నైరుతి’వెళ్లిపోయింది.. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా నిష్క్రమించాయి.. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణంగా 759.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 805.6 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణానికి అటుఇటుగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయగా, అంతకుమించి వర్షం కురవడం గమనార్హం. 2016 తర్వాత ఈసారి తెలంగాణలో 6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2016లో 19 శాతం అధికంగా వర్షం కురిసింది. అంతకుముందు 2013లో 26 శాతం, 2010లో 32 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. జూన్లో లోటు.. సెప్టెంబర్లో అధికం గత పదేళ్లలో ఈ సీజన్తో కలిపి ఐదు సార్లు అధిక వర్షాలు నమోదు కాగా, మిగిలిన ఐదు సార్లు లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో తెలంగాణలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జూలైలో 12 శాతం లోటు రికార్డయింది. ఇక ఆగస్టులో వర్షాలు ఊపందుకున్నాయి. ఆ నెలలో 11% అధిక వర్ష పాతం నమోదు కాగా, సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం 589 మండలాలుంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కొమురంభీం, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. దేశంలో కూడా రికార్డు దేశవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ వందేళ్ల రికార్డు దేశంలో ఒకటి నమోదైంది. సరిగ్గా వందేళ్ల కిత్రం అంటే 1917 సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 165 శాతం వర్షపాతం నమోదైతే, మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్లో 152 శాతం వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గణనీయంగా ఖరీఫ్ సాగు.. నైరుతి రుతుపవనాలు తెచ్చిన భారీ వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా నమోదైంది. ఖరీఫ్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు ఏకంగా 1.10 కోట్ల ఎకరాల్లో (102 శాతం) పంటలు సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 31.47 లక్షల ఎకరాల్లో (131 శాతం) నాట్లు పడ్డాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128 శాతం, నారాయణపేట జిల్లాలో 122 శాతం పంటల సాగు నమోదైంది. అతి తక్కువగా జనగామ 83 శాతం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం పంటలు సాగయ్యాయి. ఇక రబీ సాగుకు కూడా ఈ వర్షాలు దోహదం చేశాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో రబీలో అంచనాలకు మించి పంటల సాగు నమోదవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో మహబూబాబాద్లో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గత పదేళ్లలో నమోదైన వర్షపాతం –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఏడాది సాధారణంతో పోలిస్తే నమోదైన వర్షపాతం (శాతంలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 2009 –35 2010 32 2011 –13 2012 4 2013 26 2014 –34 2015 –21 2016 19 2017 –13 2018 –2 2019 6 -
రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం!
సాక్షి , మహబూబ్నగర్ : వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు భవిష్యత్లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి అక్కడ్నుంచి జూరాలకు తరలించే ఆలోచనతో ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన రిజర్వాయర్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు ఆయన ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను మూడు షిఫ్టులకు పెంచి నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వాడుకునేలా రెండు నదులను అనుసంధానం చేస్తామని, దీనిద్వారా మహబూబ్నగర్తో పాటు వికారాబాద్, నల్లగొండ (పాక్షికం) జిల్లాకు తాగు, సాగు నీటితో పాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పిన కేసీఆర్ త్వరలోనే చర్చలు జరిపి జలాల వినియోగంపై ఓ ఒప్పందానికి వస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న కరివెన, నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. ఏదుల రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు. గత పాలకుల అసమర్థత, వివక్ష కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పనులు ఆగిపోయి తాగు, సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ‘కొంతమంది చవటలు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తీసుకురావాలని చెబుతున్నరు. అసలు వాళ్లకు ప్రాజెక్టులపై అవగాహన లేదు. జూరాల 6 టీఎంసీల ప్రాజెక్టు.. దాని కింద ఉన్న నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు, భీమా, గట్టు, కోయిల్సాగర్ కింద సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతో పాటు మిషన్ భగీరథ కోసం 3.37 టీఎంసీల నీళ్లు అవసరముంటది. ఇందుకోసం 71.1% నీటిని వాడుకుంటున్నం. జూరాలలో నీళ్లు లేకపోతే ఆయా ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితి. ఇప్పుడే జూరాలకు నీరు రాక ప్రతి ఏటా కర్ణాటకను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు ఎక్కడొస్తయ్? అందుకే శ్రీశైలం బ్యాక్ వాటర్ను పాలమూరు–రంగారెడ్డికి వాడుకుంటున్నం’ అని సీఎం అన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 15–20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నో శక్తులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆ ఆటంకాలను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నామని.. అదే స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సాధించింది శూన్యమే ! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లాభం కలిగించే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంకుచితంగా ఏదేదో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘గతంలో బాబ్లీ విషయంలోనూ ఇలాంటి గొడవే. సాధించింది గుండు సున్నా. ఎక్కడ ప్రాజెక్టు అన్నా.. బస్తీమే సవాల్ అనడం.. కోర్టుకెళ్లడం.. హంగామా చేయడం తప్ప సాధించిందేం లేదు. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత మహారాష్ట్రకు పొయి బాబ్లీ విషయంలో అగ్రిమెంట్ చేసుకుంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. బ్రహ్మాండంగా 570 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు లేదా ఆయనలాగా ఆలోచించేవారికి ఇప్పుడు ఒక్కటే చెబుతున్న రేపు కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం విషయంలో నీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందానికి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’అని కేసీఆర్ స్పష్టంచేశారు. పనులపై అసంతృప్తి ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని 4రిజర్వాయర్ల వద్ద జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఇప్పటి వరకు జరగాల్సిన పనులెంత? అయిన పనులెన్ని? పనుల జాప్యానికి కారణాలంటేని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆశించిన మేరకు పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మూడు షిఫ్టుల్లో పనులు పూర్తిగా చేపట్టి.. వచ్చే ఖరీఫ్ నాటికి నీరందించాలన్నారు. కరివెన ప్రాజెక్టు పనులపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పండి? చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. పనులు చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు’అని అసహనం వ్యక్తంచేశారు. వచ్చే 4నెలల్లో కరివెన పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఏదుల రిజర్వాయర్ పరిశీలించిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం మంజూరైందన్నారు. నిధులకొరత లేనందున.. ఎప్పుడేం కావాలన్నా చెప్పాలని.. ఉదయం ఇండెంట్ పెడితే సాయంత్రాని కల్లా బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. ‘మీరు బిల్లులకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రానికి క్లియర్చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్ట్లు పెంచుకోండి. అధికారులు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని.. అంతకు ముందే పని పూర్తిచేయండి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇకపై పదిహేను రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. పనుల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించే ఇంజనీర్లపై చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్ల టెండర్లను రద్దు చేసి ఇతరులకు పని కల్పించాలన్నారు. వారంలో వట్టెం పూర్తవ్వాలి 16.7 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పనులను వారం రోజుల్లో మూడు షిఫ్టుల్లో పూర్తి చేయాలని పనులు దక్కించుకున్న మూడు నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్మికులను రప్పించుకోవాలని కోరారు. రివిట్మెంట్ పనులను వచ్చే మార్చిలోపే పూర్తిచేయాలని ఆదేశించారు. రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను సమాంతరంగా పూర్తిచేయాలన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్ పనులను ఏరియల్వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం పనులకు సంబంధించి తక్షణమే రూ.200 కోట్ల నిధులు విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆగొద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే 100% నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదుల రిజర్వాయర్లో ఇతర మార్గాల ద్వారా నీటిని తెచ్చి నింపుకోవాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం మాదిరి ఇక్కడ కూడా బాహుబలి పంపు మోటార్లను వినియోగించనున్నారు. వాటిని బయటనుంచి కాకుండా వీలైనంతవరకు బీహెచ్ఈఎల్ కంపెనీ ద్వారానే కొనుగోలు చేయాలి అని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి మెగా కృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం! సమైక్య పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తానని సీఎం స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ప్రతి రైతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నడు. రైతు ఆర్థికంగా బలపడాలంటే మరో ఎనిమిదేళ్లు కూడా పట్టొచ్చు. తర్వాత ప్రతి రైతు బ్యాంకుఖాతాలో సొంతగా నగదు జమ కావాలి. అప్పటి వరకు కచ్చితంగా ఉచిత కరెంటందిస్తాం. అందుకోసం రూ.15వేల కోట్లయినా ఖర్చు చేస్తాం. ఇప్పటికే నీటి తీరువా రద్దు చేశాం. ఇది మా పాలసీ.. మా పార్టీ సిద్ధాంతం.. ప్రభుత్వ సిద్ధాంతం’అని సీఎం అన్నారు. ఇకపై సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాలమూరు–రంగారెడ్డి పనుల పురోగతిపై ప్రతి 10రోజులకోసారి వచ్చి సమీక్ష జరుపుతారని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్చించి తమ అభిప్రాయాలను ఆమెకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, పార్లమెంటు సభ్యులు పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లు శ్వేతామహంతి, శ్రీధర్, రొనాల్డ్రోస్, ఈఎన్సీ మురళీధర్, సీఈ రమేష్, మెగా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత ఈఎన్సీ కృపాకర్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. అతి త్వరలో ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపుల నిర్మాణం సంపూర్ణంగా పూర్తిచేసి తాగునీటిని అందించాలని ఆదేశించారు. -
వచ్చే ఖరీఫ్కు ‘పాలమూరు’
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పాక్షికంగా అందుబాటులోకి తెచ్చేలా నిర్మాణ పనులు సాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. కనిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా పంప్హౌస్, టన్నెల్, కాల్వల పనులు పూర్తి చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్లోనే 7 లక్షల ఎకరాలకు నీరందించాలని స్పష్టం చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ రమేశ్, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ద్వారా అందనున్న రుణాలు, వాటి వినియోగం, వచ్చే ఏడాది ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు, దానికి తగ్గట్లు నిర్మాణ పనులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. మొత్తం 12.3 లక్షల ఎకరాలకు.. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఇందుకు 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఇందులో 30 టీఎంసీలు డిండికి కేటాయించగా, 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి కేటాయించారు. ఈ మొత్తం ఆయకట్టులో వచ్చే ఏడాది ఖరీఫ్లో నాగర్కర్నూల్ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 1.03 లక్షలు, నారాయణపేట 9 మండలాల పరిధిలో 1.6 లక్షలు, మహబూబ్నగర్ జిల్లాలో 13 మండలాల పరిధిలో 2.35 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 3.6 లక్షల ఎకరాల ఆయకట్టులో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. ఈ ఆయకట్టుకు నీరందిచేలా శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 రోజుల్లో తీసుకునేలా నిర్మాణ పనులు చేయాలని సూచించారు. ప్రాజెక్టులోని ప్రధానమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్ధండాపూర్ పంప్హౌస్లలో 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను అమర్చాల్సి ఉండగా, ఇందులో తొలిదశలో 4 చొప్పున మోటార్లను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయాలని, 2021 మార్చి–ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. నిధుల కొరత లేకుండా చూస్తా.. ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ పనులు మాత్రం పూర్తిగా చేయాలని తెలిపినట్లుగా సమాచారం. నిర్మాణ పనుల పూర్తికి సంబంధించిన టైమ్ షెడ్యూల్ను సైతం ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఇక వీటికి అనుగుణంగా జంట టన్నెల్ నిర్మాణాలు ఉన్న చోట కనీసం ఒక టన్నెల్ నిర్మాణ పనులైనా పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాల పూర్తికి వీలుగా పీఎఫ్సీ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాల ఒప్పంద ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రుణాలను వినియోగిస్తూ పంప్హౌస్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, మిగతా వాటికి ప్రభుత్వపరంగా నిధుల కొరత లేకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే వారం పాలమూరు ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తానని చెప్పినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. నార్లాపూర్లో రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలన్న గత ప్రతిపాదనను పక్కన పెట్టారని, ఇక్కడి రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం 8.5 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గిస్తూ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం మాదిరి వేగంగా..: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మిగతా సగానికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టు పూర్తి చేసి.. వచ్చే వర్షాకాలంలో సాగునీరు అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌస్లు, కాల్వల పనులు సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. -
వాన కురిసే.. సాగు మెరిసే..
సాక్షి, అమరావతి: చినుకు జాడ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న రైతుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు. మెట్ట పంటలతో పాటు మాగాణుల్లో నాట్లు వేయడం మొదలైంది. అడుగంటిన జలాశయాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతుండటంతో నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే వారంలో మంచి వానలు పడే అవకాశం ఉండటం కూడా రైతుల్లో భరోసా నింపుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రుతుపవనాలు విస్తరించి ఉండడం కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో విత్తన పంపిణీ నిరాటంకంగా సాగుతోంది. వర్షాధారిత పంటలు వేయడం ఊపందుకుంది. జొన్న, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల పంటల సాగు సైతం పుంజుకుంది. మొత్తం సాగు విస్తీర్ణం 42,04,218 హెక్టార్లు కాగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ను 38,30,466 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఇందులో ఇప్పటికి 19,73,041 హెక్టార్లలో విత్తనాలు పడాల్సి ఉంటే సుమారు 13.84 లక్షల హెక్టార్లలో విత్తినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప వంటి పంటలు 26 శాతం నుంచి 50 శాతం వరకు వేయడం పూర్తయింది. చెరకు నాటు దాదాపు 75 శాతం పూర్తయింది. డెల్టాలో ముమ్మరంగా నాట్లు... కృష్ణా, గోదావరి డెల్టాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాట్లు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ పెట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటికి 6.27 లక్షల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికి 4.81 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పెరుగుతుండటంతో అనుకున్న లక్ష్యం మేరకు వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేరుశనగ పరిస్థితి ఇలా... వేరుశనగను ఈ సీజన్లో 9.16 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 7.53 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటికి 5.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలు పడాల్సి ఉంటే 2.43 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. మంచి వర్షాలు పడితే వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్టపంటలు, ఇతర ఆహార ధాన్యాల సాగు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం.. గత వారంలో 36 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఈ వారానికి 27 శాతానికి చేరింది. మున్ముందు ఇది మరింత తగ్గి సాధారణ స్థితికి చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 556 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఇప్పటికి 245 మిల్లీమీటర్లు కురవాలి. కానీ ఇప్పటికి 178.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్లో జూలై 31 వరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదవలేదు. ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మినహా మిగతా మూడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం మినహా కృష్ణా, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. రాయలసీమలో చిత్తూరు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వరి రైతులకు సూచనలు ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆయా మండలాలకు సిఫార్సు చేసిన భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలైతే 25, 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుంటే 20 నుంచి 25 రోజుల నారు నాటుకోవాలి. ప్రతి 2, 3 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఒకసారి, పిలకల దశలో రెండో సారి, అంకురం దశలో మూడో సారి వేసుకోవాలి. పొటాష్లో సగభాగాన్ని మొదటి దశలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. కలుపు నివారణకు నాట్లు వేసిన 3, 5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి ఒకటిన్నర లీటర్ల బుటాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా ఆక్సాడయార్జిల్ 35– 50 గ్రాములు లేదా బెన్సల్ఫూరాన్ మిథైల్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించింది. -
సాగైంది 26 శాతమే
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగు చతికిలపడింది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వచ్చినా ఇప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు నిరాశాజనకంగా ఉంది. ఖరీఫ్లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.49 లక్షల (26%) ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రభుత్వానికి బుధవారం ఒక నివేదిక పంపింది. ఆ నివేదిక ప్రకారం.. ఖరీఫ్ పంటల సాగు దారుణంగా ఉంది. సాధారణంగా ఇప్పటివరకు 39.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. కానీ ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు సాగు తగ్గింది. ఇప్పటివరకు సాగైన 28.49 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి 19.73 లక్షల (46%) ఎకరాల్లో సాగైంది. ఇక ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం.. 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.31 లక్షల (22%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు విస్తీర్ణం 7.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.52 లక్షల (22%) ఎకరాలకే పరిమితమైంది. ఇక ఖరీఫ్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.21 లక్షల (18%) ఎకరాలకే పరిమితమైంది. ఇక కీలకమైన వరి ఖరీఫ్ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 61,615 ఎకరాల్లోనే నార్లు పోశారు. ఇప్పటికే నార్లు పోయడానికి సమయం కూడా తీరిపోయింది. ఇక మధ్య లేదా స్వల్పకాలిక వరి నార్లు వేయడంపైనే దృష్టి సారించాల్సి ఉంది. మరోవైపు వివిధ జిల్లాల్లో పంటల సాగులో తీవ్రమైన వ్యత్యాసం కనిపించింది. ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలో అత్యధికంగా 73 శాతం పంటలు సాగు కాగా, అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో కేవలం 3 శాతానికే పంటల సాగు పరిమితమైంది. వనపర్తిలో 5 శాతం, నిజామాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో 6 శాతం చొప్పున మాత్రమే పంటలు సాగయ్యాయి. మంచిర్యాలలో 8 శాతం పంటలు సాగయ్యాయి. 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు... రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతం 146.3 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 105 ఎంఎంలే నమోదైంది. అంటే 28 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో రాష్ట్రంలో 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగాం, యాదాద్రి, మేడ్చల్, నల్లగొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఖమ్మం జిల్లాలో కరువుఛాయలు నెలకొన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాల్లోనైతే ఏకంగా 72 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 62 శాతం, సూర్యాపేట జిల్లాల్లో 60 శాతం లోటు నమోదైంది. హైదరాబాద్లో మాత్రం 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాధార పంటలైన జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, సోయాబీన్, పత్తి సాగు ఊపందుకుందని వ్యవసాయశాఖ తెలిపింది. వచ్చే 2 వారాల్లో వరి నార్లు ఊపందుకుంటాయని పేర్కొంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను తాము సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. ఇప్పటివరకు వేసిన పంటల పరిస్థితి బాగుందని వివరించింది. -
‘మృగశిర’ మురిపించేనా!
ఖరీఫ్ సాగుకు కోటి ఆశలతో అన్నదాత సన్నద్ధమయ్యాడు. తెల్లవారుజాము కోడి కూత మొదలుకొని హలం పట్టి పొలం దున్నడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ ఖరీఫ్కు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా గతేడాది వర్షాభావ పరిస్థితుల పుణ్యమా అని పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొని చినుకు రాలలేదు. అన్నదాత తీవ్ర స్థాయిలో నలిగిపోయాడు. ఈసారి ఖరీఫ్కు సంబంధించి సాగుకు అన్నదాత సిద్ధమయ్యాడు. అందులోనూ రోహిణికార్తె సమయంలో రోళ్లు సైతం పగలిపోతాయని నానుడి ఉంది. రోహిణికార్తె పోయి మృగశిర వచ్చింది. ప్రస్తుతం ఆశలన్నీ మృగశిరపైనే నెలకొన్నాయి. సాక్షి కడప : జిల్లాలో అన్నదాతలు ప్రస్తుతం పొలాలను దున్ని.. పంటలు సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఎక్కువగా వేరుశనగ, వరి పంటలు సాగవుతాయి. ఖరీఫ్లో వర్షాధారం కింద ఒకపక్క, ఇంకోపక్క కేసీ కెనాల్ కింద కూడా వరి పంటను కూడా సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉండగా..1,79,929 హెక్టార్లలో పంటల సాగు చేసే అవకాశముందని వ్యవసాయశాఖ గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ప్రస్తుతం మృగశిర కార్తె మురిపిస్తుందని రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది జూన్లో వర్షాలు రావడం, సాగుతోపాటు పంటలు వేయడం జరుగుతుంది. అయితే గత రెండు, మూడేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈసారి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్న నేపధ్యంలో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. రోహిణిని మరిపిస్తున్న ఎండలు జిల్లాలో రోహిణికార్తె శకం ముగిసినా ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. జూన్ నె ల ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎండల వేడి మాత్రం తగ్గలేదు. పైగా వేడిగాలులు కూడా భయపెడుతున్నాయి. ఒకప్రక్క ఎండలు, మరోప్రక్క వేడిగాలులు, ఇంకోప్రక్క ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రోహిణికార్తె సమయంలోనే ఎండలు అధికంగా ఉంటాయి. అలాంటిది కార్తె పోయినా కూడా మరిపించేలా ఇప్పుడు ఎండలు కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఏది ఏమైనా భారీ వర్షాలు కురిస్తే తప్ప ఉపశమనం కనిపించడం లేదు. రుతు పవనాలపైనే ఆశలు రాష్ట్రంలోకి నైరుతి రుతు వపనాలు నాలుగైదు రోజుల్లో ప్రవేశించనున్నాయి. రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి వర్షాలు కురిస్తే ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ప్రారంభించవచ్చని అన్నదాతలు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అక్కడక్కడ తొలకరి జల్లులు మాత్రమే కురిశాయి. కొంతమేర భారీ వర్షాలు వస్తేనే ప్రస్తుత ఖరీప్ సీజన్లో సాగుకు అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆకాశం మేఘావృతం అవుతున్నా గా>లులు, ఇతర కారణాలతో సరైన వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం జూన్కు సంబంధించి 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా....ఇప్పటివరకు 14.9 మి.మీ. కురిసింది. మరో 58.5 మి.మీ. లోటు వర్షపాతం కురిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాలపైనే రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయశాఖ సన్నద్దం ఖరీఫ్సాగుకు వ్యవసాయశాఖ సన్నద్దమైంది. అందుకు సంబంధించి ప్రభుత్వం సరఫరా చేసే వేరుశనగ విత్తనకాయల ధరలను నిర్ణయించగా....ఇప్పటికే విత్తన కాయలను మండలాలను మంజూరు చేశారు. జిల్లాకు 32,175 క్వింటాళ్లను కేటాయించారు. అంతేకాకుండా వేరుశనగతోపాటు మిగతా అన్ని రకాల పంటలకు సంబంధించి వ్తితనాలను కలుపుకుని మరో 49 వేల క్వింటాళ్లు అవసరమని ప్రణాళికలు రూపొందించారు. విత్తనాలను అందించి రైతన్నలను సిద్దం చేయడం ద్వారా ఎప్పుడు వర్షం పడినా అప్పటికప్పుడు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంతేకాకుండా 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా అవసరమని ఇప్పటికే వ్యవసాయశాఖ జూన్ మొదటివారంలోనే నివేదికలు పంపారు. -
రైతుల ఖాతాల్లోకి రూ.2,233 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం నిధులను అధికారులు విడతలవారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ–కుబేర్ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. మంగళవారం నాటికి మొత్తం 21.22 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,233.16 కోట్లు రైతుబంధు డబ్బు జమ చేశారు. మిగిలిన సొమ్మును వారం పది రోజుల్లో జమా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఖరీఫ్ సాగు మొదలైన నేపథ్యంలో పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో వారు నష్టపోకుండా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సహకార, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.1,080 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఖరీఫ్ రైతుబంధుకు రూ.6,900 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో రైతుబంధు పథకం అమలుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 6,900 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేస్తారు. సొమ్ము మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి పంపిస్తామని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ఎంత మేరకు మొదటి రోజు పంపిస్తారన్న దానిపై తమకు స్పష్టత లేదని, ఆర్థికశాఖ తన వద్ద ఉన్న నిధుల నుంచి విడుదలవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడంతో వీలైనంత త్వరగా రైతులందరికీ విడతల వారీగా సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుం దని తెలిపాయి. వాస్తవంగా ఖరీఫ్కు పెట్టుబడి సాయాన్ని మే నెలలోనే ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు ఎన్నికల కోడ్ కొనసాగడంతో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. 2019–20 బడ్జెట్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుబంధు అమలుకోసం సర్కారు రూ. 12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 6,900 కోట్లు ఖరీఫ్ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.38 కోట్ల ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. ఆ మేరకు దాదాపు 54.5 లక్షలమంది రైతులకు రైతుబంధు అందించా ల్సి ఉంది. అయితే అందులో ఇంకా కొందరు రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్లను వ్యవసాయ శాఖకు ఇవ్వలేదు. సాంకేతికంగా పట్టాదారు పాసు పుస్తకం రాకుండా అన్నీ సరిగా ఉన్న రైతులు తమను సంప్రదించాలని సర్కారు ఇప్పటికే విన్నవించింది. మూడు వారాల్లోగా అందరి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత రబీ సీజన్లో కొందరు రైతులకు పెట్టుబడి సాయం చేతికి రాలేదు. వారికి ఈ ఖరీఫ్తో కలిపి ఇస్తారా లేదా అన్నదానిపై వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గోపాల్ తనకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందిందని, కానీ రబీ సాయం రాలేదని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సరస్వతికి కూడా రబీ సొమ్ము అందలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖరీఫ్ సొమ్ముతో కలిపి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇలా లక్షలాది మంది రైతులు రబీ సాయం అందక వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు రైతుబంధు.. అటు పీఎం–కిసాన్ గతేడాది ప్రభుత్వం ఒక సీజన్కు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా, ఈ సీజన్ నుంచి రూ.5 వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచిన సంగతి విదితమే. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఐదెకరాలున్న రైతు గతంలో రూ.20 వేలు అందుకుంటే, ఈసారి రూ.25 వేలు అందుకోనున్నారు. ఒకేసారి ఇంత పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో పీఎం–కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వరకు సొమ్ము అందుకున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఐదెకరాల షరతును తొలగించి ఎన్నెకరాలున్న రైతులకైనా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణలోని రైతులందరికీ కూడా ఆ మేరకు లాభం జరగనుంది. తెలంగాణలో రైతు బంధు ఇస్తున్న ఆసరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నెకరాలున్నా రూ.6 వేలు మాత్రమే ఇవ్వడం, అదీ రూ.2 వేల చొప్పున మూడు విడతలు చేయడంతో దీనిపై రైతుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. -
ఇక పడావు భూముల్లోనూ పంటలే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కోటి ఎకరాల వరకు ఉండగా, ఈ ఏడాది ఖరీఫ్లో మరో 7 లక్షలకు చేరుకుంటుందని, మొత్తంగా 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నా యి. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని లెక్కగడుతున్నాయి. 2019–20 వ్యవసాయ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఆ శాఖ నిమగ్నమైంది. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు అందించడంపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఖరీఫ్లో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. ఈసారి అదికాస్తా 1.10 కోట్ల ఎకరాలకు చేరుకునే అవకాశముందని చెబుతున్నారు. పత్తి వైపే రైతుల చూపు రానున్న ఖరీఫ్లో రైతులు మళ్లీ పత్తిసాగు చేసేందుకే మొగ్గుచూపుతారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మద్ధతు ధర పెరగడమే కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందంటున్నారు. రైతుబంధుతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులతో మరింతగా వరి సాగు పెరుగుతుందనీ అంచనా వేస్తోంది. సోయాబీన్ సాగు ఈసారి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేగాక రైతుబంధు పథకం వల్ల ఇప్పటివరకు సాగు కాని భూములనూ రైతులు దున్నడం ప్రారంభిస్తారని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వెట్రన్ విజయవంతం కావడంతో ఈ ఖరీఫ్ నుంచే నీళ్లు ఇచ్చేందుకు పనులు వేగవంతం చేసింది. ఈ ఖరీఫ్లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
వచ్చే ఖరీఫ్ నాటికి రుణమాఫీ...
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి పంటల రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ కొనసాగుతుండటం, ఆ తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రుణమాఫీని ఖరీఫ్ ప్రారంభం నాటికి చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రుణమాఫీ కోసం ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనే దానిపై ఇటీవలే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల హామీగా.. కేసీఆర్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అంటే రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు మాఫీ కానున్నాయి. రుణాల మాఫీకి కటాఫ్ తేదీగా గతేడాది డిసెంబర్ 11ని ప్రకటించింది. ఆ తేదీని గడువుగా లెక్కించి అప్పటివరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది. బ్యాంకర్ల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 48 లక్షల మందికి రూ. 30 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు ఒక విడతగా కేటాయించిందంటే, మొత్తంగా ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనూ రుణమాఫీ అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. -
ఆహారధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి రెండో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28.13 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 3.88 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, 2018–19లో ఏకంగా 11.56 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 45.9 లక్షల టన్నులు పెరగడం గమనార్హం. ఇక కీలకమైన పత్తి దిగుబడి మాత్రం పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2018–19లో 3 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 39 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.40 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.15 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దిగుబడి ఢమాల్.. తెలంగాణలో పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. గతం కంటే ఈసారి సాగు తగ్గడం, 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉండగా పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. 2017–18 సంవత్సరంలో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఇక 2018–19 ఖరీఫ్లో వరి ఉత్పత్తి 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరి ధాన్యం ఉత్పత్తి ఖరీఫ్లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇరవై ఏళ్లలో ఇంతటి స్థాయి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇక ఈ రబీలో 34.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. -
పంటల బీమాకు కంపెనీల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమాను అమలు చేసేందుకు కంపెనీలను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. పంటల బీమా అమలు, పెండింగ్ క్లెయిమ్స్పై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరానికి ఇఫ్కో టోక్యోకు రెండు క్లస్టర్లు, ఏఐసీకి నాలుగు క్లస్టర్లు అప్పగించామన్నారు. అలాగే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టమాటా పంటను చేర్చామన్నారు. 2019– 20 ఏడాదిలో ఖరీఫ్, రబీలకు కలిపి 15 రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత రబీకి నమోదు చేసుకున్న రైతుల పంటలు వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నట్లయితే, విపత్తు సంభవించిన 72 గంటలలో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియపరచాలన్నారు. 2017–18 ఖరీఫ్, రబీ క్లెయిమ్స్ల చెల్లిం పుల నిర్దేశిత గడువు ఈ నెల 20వ తేదీగా నిర్ణయించామన్నా రు. స్థానిక విపత్తుల సమాచారాన్ని నివేదించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏఐసీ –18005992594, బజాజ్ అలయెంజ్ –18002095959కు ఫోన్ చేయవచ్చన్నారు. -
యాభై ఎకరాలు దాటితే రైతుబంధు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్లో వ్యవసాయ భూమి ఎంతున్నా పెట్టుబడి సొమ్ము అందజేసిన వ్యవసాయ శాఖ, రబీలో సీలింగ్ అమలు చేస్తుండటం సంచలనం రేపుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా లేక స్వతహాగా అమలు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. సీలింగ్పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్షణం పేద, మధ్యతరగతి రైతులకు ముందు ఇచ్చి మిగిలిన వారికి తర్వాత ఇవ్వాలని అనుకుంటున్నామని, 50 ఎకరాలకు మించి రైతులకు లక్షలకు లక్షలు ఒకేసారి ఇచ్చే బదులు, ఆ సొమ్మును ఇతర రైతులకు ఇవ్వాలని భావిస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. సీలింగ్ చట్టం ప్రకారం 56 ఎకరాలకు మించి ఎవరికీ వ్యవసాయ భూమి ఉండకూడదనీ, అలా ఉన్న వారికి రైతుబంధు సొమ్ము ఇస్తే ఎన్నికల సమయంలో సమస్య వస్తుందన్న భావనతో ఇలా చేస్తున్నామని మరికొందరు అధికారులు అంటున్నారు. ఖరీఫ్లో వంద ఎకరాలకు మించి ఉన్న వారికీ పథకం అమలు చేసిన సంగతి విదితమే. ఖాతాలున్న వారందరికీ పంపిణీ పూర్తి... ఖరీఫ్లో గ్రామసభల్లో రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేసిన సర్కారు, ఎన్నికల కమిషన్ ఆదేశంతో రబీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్మును బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడి నిధుల మంజూరు కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించగా, వాటన్నిటికీ కలిపి రూ. 4,581 కోట్లు పెట్టుబడి సొమ్ము బదిలీ చేసినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఇంకా ఏడు లక్షల మంది ఖాతాలను సేకరించాల్సి ఉందని, వాటిని ఎన్నికల లోపుగానే సేకరించి సొమ్ము బదిలీ చేస్తామని అంటున్నారు. ఖరీఫ్లో దాదాపు 52 లక్షల మంది రైతులకు ఈ మొత్తం అందింది. రబీలో 50 లక్షల మంది వరకే ఉంటారంటున్నారు. వీటిలో ఎన్ఆర్ఐ ఖాతాలుండటం, కొందరు చనిపోవడం వల్ల ఈసారి తగ్గిందంటున్నారు. ‘గివ్ ఇట్ అప్’కు స్పందనేది? ధనిక రైతులు ఎవరైనా పెట్టుబడి సొమ్ము వద్దనుకుంటే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం గతంలో స్వచ్ఛంద ‘గివ్ ఇట్ అప్’కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ఖరీఫ్లో సీఎం సహా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమ్మతి ఇచ్చారు. ఒకరిద్దరు సీనియర్ ఐఏఎస్లు వీరిలో ఉన్నారు. ఇప్పుడు రబీలో ఎవరూ ముందుకు రావడంలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్ కారణంగా నేతలు, ధనిక రైతులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ‘గివ్ ఇట్ అప్’కు స్పందించడంలేదని చెబుతున్నారు. మరో వైపు సీలింగ్ దాటి భూములున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు తమ ఔదార్యాన్ని చాటుకోక పోగా రైతుబంధు సొమ్ము ఇంకా తమ బ్యాంకులో ఎందుకు జమ కాలేదంటూ వ్యవసాయశాఖకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిందిస్థాయి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
దుర్భిక్షం సాగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వర్షాల పరిస్థితి నాలుగేళ్లుగా సరిగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతోంది. రుతుపవనాల రాకలో జాప్యం, వానలు లేక పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. చక్రవడ్డీలతో రైతులు రుణఊబిలో కూరుకుపోతున్నారు. సీమలో తీవ్ర వర్షాభావం... ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 19.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణం కంటే 36 శాతానికిపైగా తక్కువ వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లాలో కురవాల్సిన సాధారణ వర్షంతో పోల్చితే సగమే కురిసింది. రాయలసీమలో 390 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి 94 మండలాలకు తీవ్ర అన్యాయం చేసింది. 2016 ఖరీఫ్లో కూడా 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 2017 ఖరీఫ్లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆగస్టు, సెప్టెంబరులో అల్పపీడనాలవల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కి తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకుండా రైతులకు ద్రోహం చేసింది. ఏడు జిల్లాల్లో దుర్భిక్షం ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్లో (జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు) పది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం ఏడు జిల్లాల్లో సాధారణం సగటు కంటే 19 శాతానికి పైగా తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా 390 మండలాల్లో సాధారణ వర్షం కంటే తక్కువ వాన కురిసింది. రాయలసీమలో వేరుసెనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎండుతున్న వేరుసెనగ సెప్టెంబరు చివరలో కురిసిన వర్షాలతో పచ్చబడ్డా అప్పటికే పంటకాలం దాదాపు పూర్తి కావటంతో కాయలు రాలేదు. పడిపోయిన పంటల సాగు ఖరీఫ్లో ఐదేళ్లుగా పంటల సాగు తగ్గడం దుర్భిక్షం పెరుగుదలను సూచిస్తోంది. 2014 ఖరీఫ్లో 40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇదే సీజన్లో 35.75 లక్షల హెక్టార్లకు పడిపోవడం గమనార్హం. 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో సాగు తగ్గినా కరువు మండలాలను మాత్రం కుదించడం గమనార్హం. ఖరీఫ్లో సాగు విసీర్ణం (లక్షల హెక్టార్లలో) సంవత్సరం సాగువిస్తీర్ణం కరువు మండలాలు 2014 40.96 238 2015 36.34 359 2016 38.62 301 2017 35.92 0 2018 35.75 296 పడిపోయిన పంటల సాగు ఖరీఫ్లో ఐదేళ్లుగా పంటల సాగు తగ్గడం దుర్భిక్షం పెరుగుదలను సూచిస్తోంది. 2014 ఖరీఫ్లో 40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇదే సీజన్లో 35.75 లక్షల హెక్టార్లకు పడిపోవడం గమనార్హం. 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో సాగు తగ్గినా కరువు మండలాలను మాత్రం కుదించడం గమనార్హం. -
అంచనాలను మించిన వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో వరి అంచనాలకు మించి సాగైంది. గత నెల విస్తారంగా వర్షాలు పడటంతో వరి విస్తీర్ణం 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా వరి నాట్లు పడే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 17 జిల్లాలకు అది వ్యాపించింది. పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుంది. 12 జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు పురుగు సోకిందని నివేదికలో తెలిపారు. ఇక కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్ పంటలు పూత దశలో ఉన్నాయి. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం.. గత నెల విస్తారంగా వర్షాలు కురిసినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్లు ఆశాఖ తెలిపింది. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద సాధారణ వర్షపాతం రికార్డవ్వగా, నెలల వారీగా చూస్తే జూన్, ఆగస్టుల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 30%లోటు వర్షపా తం రికార్డయింది. సెప్టెంబర్లో ఇప్పటివరకు 75% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొందని పేర్కొంది. రబీ ‘రైతుబంధు’కు సన్నద్ధం బ్యాంకులతో వ్యవసాయశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీలో సరఫరా చేయాల్సి న రైతుబంధు పెట్టుబడి కోసం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్లో 8 బ్యాంకులు పెట్టుబడి చెక్కులను రైతులకు సరఫరా చేశాయని, ఈసారి మరిన్ని బ్యాంకులు ఇందులో పాల్గొనాలని కోరారు. అందుకు ఇతర బ్యాంకుల జాబితాను పంపాలన్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు పంట రుణాలు ఏమేరకు ఇచ్చారో సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారులతోనూ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలు, పంటల పరిస్థితులు, పంట నష్టం, ఎరువులు, రైతు బంధు, రైతుబీమా పైనా జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సీజన్లో ఎంత మేర పంట నష్టం జరిగిందో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకంలో పంపిణీ చేసిన, చేయని చెక్కులను, ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేసి, సంబంధిత నమూనా పత్రాలలో నమోదు చేసి చెక్కుల పరిశీలనకు రావల్సిందిగా సూచించారు. ఆయా జిల్లాల్లో పంటల విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఎరువులను సమకూర్చుకోవాలని సూచించా రు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, జాయింట్ డైరెక్టర్ విజయగౌరి పాల్గొన్నారు. -
సగమే రుణం... తప్పని భారం
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగియనుంది. ఇప్పటికే కోటి ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో లక్ష్యానికి మించి వరి నాట్లు పడుతున్నాయి. అయితే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11,400 కోట్లే బ్యాంకులు ఇచ్చాయి. అంటే లక్ష్యంలో సగం కూడా విడుదల చేయలేదు. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రాకపోవడం వల్లే రుణాలు ఇవ్వడంలేదని చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్నాయి. ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కుదువబెట్టుకోకుండానే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారం సరిచూసుకున్న తర్వాతే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యంకాలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ధరణి వెబ్సైట్కు, రుణాలకు లంకె పెట్టడంపై విమ ర్శలు వస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
‘ఖరీఫ్ కంది 75% కొనుగోలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75% మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కోరనుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి హరీశ్రావు త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కేంద్ర అర్థ, గణాంక శాఖ ముందస్తు అంచనాల ప్రకారం మద్ద తు ధరకు కొనుగోలు పథకం కింద సేకరణకు అనుమతినిస్తుంది. దీని ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 40% మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ ఖరీఫ్లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరా ల్లో వేశారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. గతేడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. మొదటి ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. తర్వాత రాష్ట్రమే రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 మద్దతు ధర తో 1.13 లక్షల మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఖరీఫ్కు ఊపిరి.. సాగర్కు కృష్ణమ్మ
సాక్షి, హైదరబాద్: ఖరీఫ్ ఆయకట్టు ఆశలను మోస్తూ నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తడారిన గొంతుల్ని తడిపేందుకు.. ఆయకట్టు పంటలకు ప్రాణం పోసేందుకు వరద పోటెత్తుతోంది. చాలా రోజుల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం ఆదివారానికి మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వరదకు సాగర్ మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకు గానూ 532 అడుగుల్లో 172.27 టీఎంసీల నిల్వలున్నాయి. వచ్చేదంతా సాగర్కే.. కృష్ణానదీ బేసిన్లో సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నా రు. దీంతో జూరాలకు రోజూ స్థిరంగా 1.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఈ నీటిని దిగువ శ్రీశైలానికి వదలడం, ఈ ప్రవాహానికి సుం కేసుల నుంచి వస్తున్న వరద తోడవడంతో శ్రీశైలంలోకి 3.53 లక్షల క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 200 టీఎంసీలకు చేరడంతో శనివారం ఉద యం ఆరుగేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. సాయంత్రం మరో 2 గేట్లు ఎత్తారు. దీనికి అదనంగా కుడి, ఎడమ కాల్వల పవర్హౌస్ల ద్వారా ఏపీ, తెలంగాణ 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి. కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకి 2,025, పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటి వినియోగం జరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో సాగర్కు శనివారం సాయంత్రానికి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవా హం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వలు 312 టీఎంసీలకు గానూ 172.27 టీఎంసీలకు చేరాయి. మరో 140 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇకపై వచ్చిన ప్రవాహాలు వచ్చినట్లుగా సాగర్కు చేరనున్నాయి. ఇవే ప్రవా హాలు కొనసాగినా 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎగువ వరద ఆగినా నదీ గర్భంలోనే 100 నుంచి 120 టీఎంసీలు ఉంటాయ న్న అంచనా సాగర్ ఖరీఫ్ఆశలను సజీవం చేస్తోంది. సాగర్ అవసరం.. 52.50 టీఎంసీలు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నిల్వలు పెరు గుతుండటంతో నీటి అవసరాలపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ సమర్పించింది. మొత్తంగా ఈ సంవత్సరం నవంబర్ వరకు తాగు, సాగు నీటి అవసరాలకు కలిపి 52.50 టీఎంసీలు కావాలని కోరింది. ఇందులో సాగర్ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 33 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కలిపి మొత్తంగా 52.50 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ అవసరాలపై బోర్డు సోమవారం తర్వాత నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగస్టు వరకు తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశలు రేపుతున్న ఎస్సారెస్పీ గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 42,520 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిల్వ 30 టీఎంసీలకు చేరింది. మరో 60 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. క్రమంగా నిల్వ లు పెరుగుతుండటంతో ఇక్కడి 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే స్ప ష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతోంది. 38 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి మట్టం ఉండటంతో 43 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. -
యూరియా.. ఇదేందయా?
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులు మోసం చేస్తే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. కానీ సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే రైతులను మాయ చేస్తే..? ఎవరికి చెప్పుకోవాలి? రైతుల పక్షాన నిలవాల్సిన మార్క్ఫెడ్ పక్కా వ్యాపార సంస్థగా మారింది. ఒకవైపు వర్షాల్లేక రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు గడ్డ కట్టిన యూరియాను సరఫరా చేసి మరో బండ మోపుతోంది! మూడు నాలుగేళ్ల కిందట కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యూరియా గడ్డ కట్టడంతోపాటు దానిలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఉపయోగం లేదని తెలిసినా మార్క్ఫెడ్ అధికారులు ఒత్తిడి చేసి మరీ రైతులకు అంటగడుతున్నారు. ఈ యూరియా తమ కొద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఈ యూరియా కొన్నా అది పనిచేయక రెండుసార్లు చల్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. గడ్డ కట్టిన యూరియాను కంపెనీలకు వెనక్కి ఇచ్చి కొత్తగా తీసుకోకుండా రైతులకు మార్క్ఫెడ్ అన్యాయం చేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వల వెనుక భారీ స్కాం? ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 66.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ పంటల కోసం రాష్ట్రానికి దాదాపు 8 లక్షల టన్నుల యూరియా అవసరం. అందులో 2 లక్షల టన్నుల యూరియాను మార్క్ఫెడ్ బఫర్స్టాకుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పాత నిల్వలను బయటకు పంపిస్తూ మళ్లీ అంతే మోతాదులో కొత్త సరుకును బఫర్ స్టాకుగా ఉంచాలి. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద 1.27 లక్షల టన్నుల యూరియా ఉండగా, అందులో 30,394 టన్నుల యూరియా గడ్డ కట్టినదే కావడం గమనార్హం. కొన్నాళ్లుగా బఫర్ స్టాకును కదిలించకుండా చాలావరకు కొత్త సరుకును రైల్వే రేక్ పాయింట్ల నుంచి నేరుగా ఎరువుల డీలర్లకు పంపిస్తున్నారు. దీంతో మార్క్ఫెడ్ వద్ద మూడు నాలుగేళ్లుగా 2 లక్షల టన్నులకుపైగా యూరియా గడ్డ కట్టుకుపోయింది. రేక్ పాయింట్ల నుంచే యూరియాను మార్కెట్కు పంపిస్తున్నారు. దీంతో లోడింగ్, అన్లోడింగ్, నిర్వహణ వంటి ఖర్చులన్నీ మిగులుతున్నాయి. ఆయా ఖర్చులన్నీ కాగి తాల్లో కనిపిస్తున్నాయే కానీ ఎక్కడా వాస్తవ ఖర్చులేదు. మార్క్ఫెడ్ అధికారులు కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాల నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి. యూరియా నిల్వల నిర్వహణలో భారీ కుంభకోణం దాగి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కక్కుర్తి వల్లే బఫర్ స్టాక్ యూరియా నిల్వలు కాస్తా గడ్డకట్టుకు పోయాయి. తక్కువ ధర అంటూ... రెండు మూడేళ్ల క్రితం బఫర్ స్టాక్కు అదనపు నిల్వలు తీసుకున్నామని, కానీ కాలం కలిసి రాకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని మార్క్ఫెడ్ అధికారు లు చెబుతున్నారు. పాతవి వదిలించుకోకపోవ డం, కొత్త సరుకు నిల్వ చేయకపోవడం వల్లే వ్యవహారం గందరగోళంగా మారింది. బఫర్స్టాక్ను అధికంగా ఉంచడంలోనూ మాయ జరిగిందన్న విమర్శలున్నాయి. మిగిలిన గడ్డకట్టిన యూరియాను తక్కువ ధర అంటూ అంటగడుతున్నారు. యూరియా నాణ్యమైనదే అయితే తక్కువ ధరకు ఎందుకు అంటగడుతున్నారు? పాత దానికి కొత్త దానికి తేడా లేకపోతే ధర తగ్గించాల్సిన అవసరమేంటన్న దానికి సమా ధానం లేదు. 45 కిలోల యూరియా ధర రూ.252 కాగా గడ్డ కట్టిన 50 కిలోల బస్తా యూరియా ధర రూ.264 ఉంది. గడ్డ కట్టింది కాబట్టే తక్కువకు ఇస్తున్నామని అధికారులు అంటున్నా, యూరియా ఆరు నెలలు దాటితే నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డ కట్టిన యూరియా పనిచేయడం లేదని అటు రైతులు, ఎరువుల డీలర్లు మార్క్ఫెడ్కు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ తీసుకోవాల్సిందేనంటూ మార్క్ఫెడ్ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరు డీలర్లు అయితే కమీషన్లు ముట్టజెప్పుకొని కొత్త యూరియాను దక్కించుకుంటున్నారు. లేకుంటే వారికి గడ్డ కట్టిన యూరియానే ఇస్తున్నారు. -
జాడలేని చినుకు కమ్ముకొస్తున్న కరువు
కడప నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది ఖరీఫ్లో దుర్భిక్షంతో పంటలు పోగొట్టుకుని అప్పుల పాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్లో పరిస్థితి బాగుంటుందని, పంటలు పండించుకుని నాలుగు రూకలు కళ్లజూద్దామని ఆశపడ్డారు. చినుకు జాడ లేకపోవడంతో అవన్నీ అడియాశలవుతున్నాయి. వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. తమ బతుకులు బాగుపడేదెలా దేవుడా! అనుకుంటూ వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీడు భూములు దుర్భిక్షానికి అద్దం పడుతున్నాయి. ఏడు జిల్లాల్లో తీవ్ర కరువు రాయలసీమతోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో దుర్భర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జూన్ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. వేరుశనగ విత్తనం వేసే సీజన్ కూడా దాటిపోయింది. ఈ ఖరీఫ్లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. విత్తనాలు ఆమ్ముకుంటున్న రైతులు వేరుశనగ విత్తడం కోసం రైతులు విత్తనకాయలు కొనుగోలు చేసిన వాటిని వలిచి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. సీజన్ దాటినా వర్షం జాడ లేకపోవడంతో వేరుశనగ పప్పును కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, సీజన్ దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక ధరలకు విత్తనకాయలు కొని చౌకగా పప్పులు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షపాతం లోటు రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 247.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఈ నెలల్లో 215.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 2016లో ఇదే కాలంలో 283.2 మిల్లీమీటర్లు, 2017లో 239.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈఏడాది ఇంకా తక్కువ కురిసింది. జూన్లో ఒక శాతం లోటు నమోదైన వర్షపాతం జూలైలో ఏకంగా 20 శాతానికి చేరింది. అన్నదాతకు దెబ్బమీద దెబ్బ రాష్ట్రంలో వరుస కరువులు అన్నదాతలను అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. 2016, 2017లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2017లో ఖరీఫ్లో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది. 2016లో అతి తక్కువ మండలాలను కరువు జాబితాలో చేర్చి మోసం చేసింది. ఎండుతున్న పంటలు రాయలసీమ జిల్లాల్లో చినుకు లేకపోవడంతో నామమాత్రంగా సాగైన పంటలు కూడా వాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి మొక్కలు వాడిపోయాయి. జొన్న, పెసర తదితర పంటలు కూడా ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు పొలాలను దున్ని పదును లేక విత్తనాలు వేయకుండా వదిలేశారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోయింది. బోర్లలో నీరు లేక పండ్ల తోటలు సైతం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు అమ్ముకుంటున్నాం ‘‘వాన కోసం రెండు నెలలుగా ఎదురు చూశాం. కానీ, ఇప్పటికి బలమైన పదును వానలు కురవలేదు. వేరుశనగ సాగు చేయడానికి సిద్ధమైనా వానలు కురవలేదు. ఇక సాగు చేయలేని పరిస్థితి నెలకొనడంతో విత్తనాలలు అమ్ముకుంటున్నాం. గతంలో విత్తనం వేయలేని దుర్భరస్థితి ఎప్పుడు రాలేదు’’ – నాగసుబ్బయ్య, రైతు, కత్తులూరు, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా నేడు ఉన్నతస్థాయి సమీక్ష ఏడు జిల్లాల్లో ఖరీఫ్లో తీవ్ర దుర్భిక్షం నేపథ్యంలో ముఖ్యమైన పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించేందుకు ఏడు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మురళీధర్రెడ్డి శుక్రవారం కడపలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పడిపోయిన సాగు విస్తీర్ణం అధికారిక గణాంకాల ప్రకారం చూసినా 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు భారీగా పడిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇదే కాలంలో సాగు 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే 2018లో 5.89 లక్షల హెక్టార్లలో పంట సాగు పడిపోవడం కరువు తీవ్రతను చాటుతోంది. గత ఏడాదితో పోల్చినా సాగు తగ్గిపోయింది. -
సాగుకు నీళ్లు నిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్కుమార్లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు. ప్రవాహాలు వచ్చేదాకా అంతే... నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
ఆశల చిగుళ్లు!
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ కింది ఆయ కట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. గత 15 రోజులుగా కృష్ణమ్మ పరవళ్లతో గతంలో ఎన్నడూ లేనట్లుగా జూలైలోనే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండటం, దిగువ శ్రీశైలంలో 150 టీఎంసీలు చేరడం.. దిగువ సాగర్లో ఖరీఫ్ ఆశలకు జీవం పోసింది. దీనికితోడు లభ్యత జలాల్లో సాగర్ ఎడమ కాల్వ కింది అవసరాలకు 12 టీఎంసీల నీటిని కేటాయించడం, ఇప్పటికే లభ్యతగా ఉన్న జలాల్లో మరో 40 టీఎంసీల వరకు దక్కే అవకాశా లున్న నేపథ్యంలో సాగర్ కింద ఉన్న 6.6 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీటిని అందిస్తామని ప్రాజెక్టు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా కష్టాలే.. ఈసారే ఆశలు.. సాగర్ ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో నల్లగొండ జిల్లాలోని జోన్–1 కింద 3.80 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని జూన్–2 కింద 2.60 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. మొత్తంగా సాగర్ ఎడమ కాల్వల కింద 132 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయితే కృష్ణాలో ప్రవాహాలు తగ్గడం, ఎగువ నుంచి సాగర్కు నీళ్లు వచ్చి, అది నిండేందుకు అక్టోబర్ వరకు పడుతుండటంతో ఖరీఫ్ కన్నా రబీ మీదే ఎక్కువ ఆశలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15 ఖరీఫ్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో 6.40 లక్షల ఎకరాలకు గాను 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు జరిగింది. దీనికోసం మొత్తంగా సాగర్ నుంచి 83.16 టీఎంసీల నీటి విడుదల జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత మాత్రం ఖరీఫ్ ఆయకట్టుకు నీరందిన దాఖలాలే లేవు. 2015–16లో పూర్తిగా కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎకరం ఆయకట్టుకూ నీరందలేదు. 2016–17 ఖరీఫ్లో 3.18 లక్షల ఎకరాల సాగు జరగ్గా కేవలం 19.45 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ఇక గత ఏడాది ఖరీఫ్లోనూ 3.60 లక్షల ఎకరాలు సాగు జరిగినట్లుగా లెక్కలున్నా సాగర్ నుంచి విడుదల అయింది మాత్రం కేవలం 4.42 టీఎంసీలు మాత్రమే. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై ఆశలు సన్నగిల్లడంతో, రైతులంతా బోర్ల వైపు మళ్లడంతో భూగర్భజలాల ద్వారానే సాగు జరిగింది. ఈ ఏడాది సైతం అవే పరిస్థితులు ఉంటాయని భావించినా ఎగువ నుంచి వస్తున్న జలాలతో ఆశలు చిగురించాయి. నీటి నిల్వతో శ్రీశైలం శ్రీశైలంలో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 150 టీఎంసీలకు చేరడంతో తొలి విడతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవసరాలకు బోర్డు 55 టీఎంసీలు పంచింది. ఇందులో సాగర్ ఆయకట్టు అవసరాలకు 12 టీఎంసీలు కేటాయించింది. ఇవి కేవలం ఆగస్టు అవసరాలకే కేటాయించ గా, మున్ముందు లభ్యతను బట్టి మరో 40 టీఎంసీలు దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో పూర్తి ఆయకట్టుకు నీరందించాలని తెలంగాణ భావిస్తోంది. గత ఏడాది రబీలో నీటి యాజమాన్య పద్ధతులు, ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలతో సమన్వయం కారణంగా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు పంటలకు నీరందించగలిగారు. కేవలం 44.77 టీఎంసీలతో 5.25 లక్షల ఎకరాలకు నీరందించారు. టీఎంసీ నీటితో 11,796 ఎకరాలకు నీరందింది. ఈ మారు సైతం సుమారు 50 టీఎంసీల నీటితో సమర్థ నీటి వినియోగం, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన నీరు విడుదల చేస్తే 6.40 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు సాగర్ ఎడమ కాల్వల కింద ఏపీలోని గుంటూరు జిల్లా ఆయకట్టుకు కృష్ణాబోర్డు 3.5 టీఎంసీలు కేటాయించింది. మున్ముందు మరిన్ని కేటాయింపులకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు వరకు నీటి విడుదల చేయాలన్నా మధ్యలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టును దాటించాల్సిందే. ఈ లెక్కన చూసినా చివరి ఆయకట్టు వరకు నీరందుతుందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్కు నీటి విడుదల.. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 22 వరకు రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి సాగర్కు పవర్హౌస్ల ద్వారా నీరు విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆదేశించిన నేపథ్యంలో నీటి విడుదల మొదలైంది. శ్రీశైలం నుంచి 19,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తంగా శ్రీశైలం నుంచి సాగర్కు 52 టీఎంసీల నీటి విడుదల జరగనుంది. ఇందులో తెలంగాణ 20 టీఎంసీలు, ఏపీ కుడి, ఎడమ కాల్వల కింద 11 టీఎం సీలు వాడుకోనున్నాయి. -
పంటల బీమాకు కంపెనీల తూట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావడంలో బీమా కంపెనీలు విఫలం అవుతున్నాయి. ఇప్పటివరకు 50 లక్షల ఎకరాలకు పైనే ఖరీఫ్ పంటలు సాగైతే కనీసం ఐదు లక్షల ఎకరాల రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంట వస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైగా ఇదే సాగవుతోంది. ఇప్పటికే 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అటువంటి పత్తికి పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెల 15తో ముగిసింది. కానీ పత్తి బీమా ప్రీమియం చెల్లించని రైతులు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా రైతులు పత్తి సాగు చేస్తే, లక్షన్నర మందిని కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలున్నాయి. అన్ని పంటలకు కలిపి ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. పైగా ఈ నెలలో వరుసగా 14, 15వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయంలో ముందే మేల్కొనాల్సిన వ్యవసాయశాఖ గడువు ముగిసిన తరువాత బీమా కంపెనీలకు రెండు రోజులు పెంచాలని కోరింది. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ, జాతీయ వ్యవసాయ బీమా కంపెనీలు ఈ నెల 17 వరకు పెంచేందుకు అంగీకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ రాసిన లేఖకు ఏఐసీ సుముఖత వ్యక్తం చేసినా మిగతా రెండు కంపెనీలు గడువు పెంచేందుకు ససేమిరా అన్నాయి. ఇలా బీమా కంపెనీలు రైతుతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాంకుల సహకారం సున్నా... మన రాష్ట్రంలో మొత్తం ఆరు క్లస్టర్లుగా పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇందులో ఈ వానాకాలం బీమాను రెండు క్లస్టర్లను వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) అమలు చేస్తుండగా, ఎన్ఐసీ మూడు, టాటా ఒక క్లస్టర్లో అమలు చేస్తున్నాయి. ఏఐసీ పత్తికి రెండ్రోజుల పొడిగింపునకు అంగీకరించినప్పటికీ ఆ పరిధిలోని రైతులకు తెలియజేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. ఫలితంగా ఆ క్లస్టర్ పరిధిలో 10 జిల్లాల్లోని రైతులు నష్టపోయారుఇటు బ్యాంకులపై ఒత్తిడి పెంచి రుణాలు ఇప్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించగా, రుణం తీసుకోని రైతులను ప్రీమియం కట్టేలా అవగాహన కూడా కల్పించలేకపోయారు. వాస్తవంగా ఖరీఫ్లో పంట రుణాలు రూ.25 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.6 వేల కోట్లలోపే ఇచ్చాయి. వాస్తవంగా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు సగంపైనే సాగైతే, రుణాలు మాత్రం నాలుగో వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకు రుణాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా జూన్లోపే రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు రైతులను సతాయిస్తున్నాయి. అటు బీమా కంపెనీలు, ఇటు బ్యాంకులు రైతులను బీమా పరిధిలోకి తీసుకు రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. 50 శాతం బీమా లక్ష్యానికి సమస్యలు.. మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో బీమా పరిధిలోకి వచ్చే భూమి కేవలం 20 శాతం వరకే ఉంటుంది. ఒక్కోసారి అది 15 శాతానికే పరిమితమవుతోంది. అయితే కేంద్రం ఈ ఏడాది బీమా పరిధిలోకి 50 శాతం భూమిని తీసుకురావాలన్న నిబంధన పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రంలో 2016లో వానాకాలం, యాసంగిలతో కలిపి 1.39 కోట్ల ఎకరాలు సాగు కాగా, కేవలం 20.95 లక్షలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. అంటే సాగులో 15 శాతమే. అలాగే 2017లో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాలలో సాగు కాగా 30 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చింది. అంటే 21 శాతం. ఈసారి అంత మొత్తంలో రావడం కష్టమేనని అధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ ఏడాది 50 శాతమైనా బీమా పరిధిలోకి తీసుకు రావాలన్న లక్ష్యం నీరుగారే ప్రమాదముంది. పరిహారం చెల్లింపుల్లో నిబంధనలు పక్కాగా పాటించని బీమా కంపెనీలు, గడువు తేదీల విషయంలో మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు గులాబీ పురుగు సోకితే పరిహారం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. -
రైతుల ఆదాయం, వృద్ధికి బలం
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 కోట్ల భారం పడుతుంది. అయితే, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనపు ఆదాయం అందేలా చూస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దిశగా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం. ‘‘రైతుల సమస్యల నివారణకు మద్దతు ధరల పెంపు కచ్చితమైన లేదా సరైన పరిష్కారం కాదు. కానీ, దీర్ఘకాలిక సంస్కరణలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతకాలం పాటు రైతులను కష్టాల్లో ఉండనీయకూడదు. మొత్తం వినియోగంలో గ్రామీణ ప్రాంతం 70% వాటా కలిగి ఉంది. గ్రామీణులకు తగినంత కొనుగోలు శక్తి రానంత వరకు భారత పరిశ్రమలకు డిమాండ్ పుంజుకోదు’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనను ధాన్యం, కూరగాయల మార్కెట్లలో యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా పరిష్కరించొచ్చని రావత్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమయ్యే మార్కెట్ దళారులకు కళ్లెం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించగలవన్నారు. ద్రవ్యోల్బణం, జీడీపీపై ప్రభావం: డీబీఎస్ న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపు వల్ల జీడీపీపై 0.1– 0.2% వరకు ప్రభావం పడుతుందని, దీనికి తోడు ద్రవ్యోల్బణంపైనా దీని ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ ఓ నివేదిక విడుదల చేసింది. ద్రవ్య పరమైన వ్యయాల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. జీడీపీపై ప్రభావం నేపథ్యంలో అధిక ఆదాయ మద్దతు అవసరమని లేదా మూలధన వ్యయాలను తగ్గించుకుంటేనే 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లు కేటాయించగా, మద్దతు ధరల పెంపు వల్ల సబ్సిడీ బిల్లు రూ.2లక్షల కోట్లు దాటిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మద్దతు ధరల పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ద్రవ్యోల్బణంపై 25–30 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని డీబీఎస్ నివేదిక తెలియజేసింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ మరో విడత రేట్లను పెంచొచ్చని అంచనా వేసింది. -
‘పెట్టుబడి’ వదులుకున్నది కొందరే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని వదులుకునేందుకు ధనికులెవరూ పెద్దగా ఇష్టపడలేదు. పెట్టుబడి సొమ్ము వదులుకోవాలని (గివ్ ఇట్ అప్) స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా స్పందన కరువైంది. ఇప్పటివరకు కేవలం దాదాపు వెయ్యి మంది మాత్రమే రూ. 1.71 కోట్ల విలువైన సొమ్మునే వదులుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా పంట పెట్టుబడి సాయం వదులుకోవడానికి ముందుకు రాలేదని సమాచారం. పెట్టుబడి పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇచ్చింది. ఇప్పటివరకు 43 లక్షల మంది రైతులు దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు సొమ్ము తీసుకున్నారు. అందులో దాదాపు లక్ష మందికిపైగా 20 ఎకరాలకు మించినవారున్నారని అంచనా. అందుకే స్వచ్ఛందంగా పెట్టుబడి సొమ్ము వదులుకునే వారిని ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. ముందుగా ముఖ్యమంత్రే ముందుకు వచ్చారు. ఇతరులనూ ముందుకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలామంది పెద్దలు పెట్టుబడిపై మమకారం పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. మనసు రావడం లేదు... రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు అందుతుంది. ఒక ధనిక రైతుకు 100 ఎకరాలుంటే, అతనికి ఏడాదికి ఏకంగా రూ.8 లక్షలు అందుతుంది. కొందరికి 10–15 ఎకరాలే ఉన్నా కోట్ల రూపాయల టర్నోవర్తో ఇతర వ్యాపారాలున్నాయి. అటువంటి వారు కూడా తమకొచ్చే డబ్బులు తీసుకున్నారు. కొందరు సినిమావాళ్లు, పారిశ్రామికవేత్తలు కూడా డబ్బులు తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి సొమ్మును వదులుకుంటే ఆ సొమ్మును రైతు కార్పొరేషన్కు అందజేస్తామని, దాన్ని రైతుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పినా స్పందన రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్గా సురేశ్ బాబు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలకు ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బాబు నియమితులయ్యారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు జూన్ 25 నుంచి విచారణకు రానున్నట్లు ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ పీఎస్ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులున్నా తమ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. రూ.30 లక్షల వరకు క్లెయిమ్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
దిగులే దిగుబడి
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడి రైతన్నకు దిగులు మిగిల్చింది. ఈసారి వరి ధాన్యం ఉత్ప త్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగినా, ఉత్పత్తి తగ్గడం గమనార్హం. 2017–18లో 94.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అర్థగణాంక శాఖ వర్గాలు తయారు చేసిన 2017–18 ఖరీఫ్, రబీ మూడో ముందస్తు అంచనా నివేదికను వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. 2016–17లో ఖరీఫ్, రబీల్లో 45.72 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 97.04 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం పండింది. 2017–18 వ్యవసాయ సీజన్లో 48.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 94.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గతం కంటే ఈసారి 2.43 లక్షల ఎకరాల్లో అదనంగా వరి సాగైనా, ఉత్పత్తి మాత్రం 2.73 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గడం విస్మయం కలిగిస్తోంది. ఖరీఫ్లో ఆకుచుట్టు పురుగు, కాండం తొలిచే పురుగు తదితర చీడపీడల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయశాఖ నిర్దారణకు వచ్చింది. రబీలోనూ కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నల్ల గొండ, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్కర్నూలు జిల్లా ల్లో చీడపీడలతో పెద్దఎత్తున వరికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. కాగా, వరి ఉత్పత్తి పడిపోయినా పత్తి, కంది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. -
పరిహారం..పరిహాసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్ ఒకటినుంచి మే 31 వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. 1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. -
ఖరీఫ్ కొత్త ఆయకట్టు 8.89 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ నాటి(ఖరీఫ్)కి 8.89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా నీటిపారుదల శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. మరుసటి ఏడాదికి మరో 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాల్లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1.60 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే నాటికి మొత్తం 52.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. 2004 నుంచి 2018 ఫిబ్రవరి వరకు మొత్తం 16.65 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం 68.86 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో 2014 నుంచి ఇప్పటివరకు కొత్త రాష్ట్రంలో 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపింది. 2017–18లో గణనీయంగా కొత్త ఆయకట్టు 2004లో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా 2014 వరకు మరో 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మార్చి నాటికే 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. 2016–17లో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి కేవలం 4.75 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వగా, 2017–18లో ఏకంగా 7.66 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చారు. ఇందులో మహబూబ్నగర్లోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కిందే 5.50 లక్షల ఎకరాలున్నాయి. ఈ ఖరీఫ్లో భారీ ప్రాజెక్టుల కింద 7.57 లక్షలు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద 1.32 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఇందులో ఎస్సారెస్పీ–2, దేవాదుల, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వల కింద 5 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకుంది. 2019 జూన్ నాటికి మరో 6.55 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామన్న నీటి పారుదల శాఖ మొత్తం 15.44 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకుంది. -
3 కంపెనీలకు ఖరీఫ్ పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్లో రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసేందుకు మూడు కంపెనీలను వ్యవసాయశాఖ ఎంపిక చేసింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా 13 కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. వాటిలో తక్కువ కోట్ చేసిన జాతీయ బీమా కంపెనీ (ఎన్ఐసీ), వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), టాటా బీమా కంపెనీలను ఎంపిక చేసింది. వాటి ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కంపెనీలు ఎంతెంత కోట్ చేశాయన్న వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించడంలేదు. అయితే వరి, పత్తి పంటలకు సంబంధించి గతేడాదికంటే అధికంగా పంటల బీమా ప్రీమియం ధరలు పెరిగాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్ఐసీకి మూడు క్లస్టర్లు... రాష్ట్రంలో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఒకటో క్లస్టర్లో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలున్నాయి. రెండో క్లస్టర్లో నిర్మల్, నిజామా బాద్, కామారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలున్నాయి. మూడో క్లస్టర్లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలున్నాయి. నాలుగో క్లస్టర్లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఐదో క్లస్టర్లో భద్రాద్రి, వరంగల్ (అర్బన్), వరంగల్ (గ్రామీణ), వనపర్తి జిల్లాలున్నాయి. ఆరో క్లస్టర్లో మేడ్చల్, మహ బూబ్నగర్, జోగుళాంబ గద్వాల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. ఇందులో ఎన్ఐసీకి ఒకటి, రెండు, ఆరో క్లస్టర్లను వ్యవసాయశాఖ కేటాయించింది. ఏఐసీకి నాలుగు, ఐదో క్లస్టర్లను, టాటాకు మూడో క్లస్టర్ను కేటాయించింది. ఖరీఫ్ ఆహారధాన్యా ల పంటలకు రైతుల నుంచి రెండు శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. అయితే జిల్లాలను, అక్కడి వాతావరణ పరిస్థితులనుబట్టి ప్రీమియం రేటు మారుతుంటుంది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి పంట నాశనమైతే మాత్రం బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం లేదు. -
పంట ఇవ్వని విత్తనానికి రేటు పెంచడంలో ‘బీజీ’!
సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తన ధరలు పెంచేందుకు పలు కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచా యి. ఆయా పత్తి విత్తన కంపెనీలు చేస్తున్న ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 22న కేంద్ర పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నందున ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. గతేడాది కంటే ఈసారి బీజీ–2 విత్తన ధరను రూ.170 అదనంగా పెంచాలని కంపెనీలు కేంద్రానికి విన్నవించాయి. ఇదిగాక రాయల్టీని వేరుగా వేస్తే రైతులకు అదనపు భారమే కానుంది. వాస్తవానికి గులాబీ రంగు పురుగుతో పత్తి నాశనం అవుతున్నా మళ్లీ బీజీ–2నే అదీ అధిక ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. రూ.169 కోట్ల భారం రాష్ట్రంలో అన్ని పంటల కంటే పత్తినే అధికంగా సాగవుతోంది. గత ఖరీఫ్లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో సగం పత్తి పంటే ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో కోటి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్ (450 గ్రాములు) ధర రూ.781, కాగా దానికి రాయల్టీ రూ.49 కలిపి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) రూ.830గా ఖరారు చేశారు. ఈసారి కంపెనీలు రాయల్టీ కాకుండా రూ.950గా ప్రతిపాదించాయి. గతేడాదితో పోలిస్తే రూ.169 అదనంగా విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. రాయల్టీ విషయాన్ని ఎక్కడా ప్రతిపాదించకున్నా గతేడాది ప్రకారం రాయల్టీ ఇచ్చినా ఒక్కో ప్యాకెట్ రూ.999 కానుంది. ఇలా రాష్ట్ర రైతాంగాన్ని దోపిడీ చేసేందుకు పత్తి కంపెనీలు కుట్రలు పన్నాయి. ధరలు పెంచడం ద్వారా ఏకంగా రూ.169 కోట్లు అదనంగా రాబట్టాలని నిర్ణయించుకున్నాయి. రైతుకు గత్యంతరం లేదనేనా? రైతుకు గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. జీవ వైవిధ్యానికి ముప్పు కారణంగా బీజీ–3కి అనుమతి లేదు. బీజీ–2 వేసినా గులాబీ రంగు పురుగు సోకి రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట సర్వనాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్ సీజన్కు అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు విత్తన కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. రానున్న ఖరీఫ్లో రైతులు పత్తి వేయాలంటే విఫలమైన ఈ విత్తనాలే గత్యంతరమయ్యాయి. వాటికి ప్రత్యామ్నాయంగా ఏ విత్తనమూ రాలేదు. ఏ విత్తనం వేయాలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడంలేదు. -
విత్తన సబ్సిడీకి రూ.224 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ కోసం అందించే విత్తన సబ్సిడీ కోసం రూ.224 కోట్లు ఖర్చు కానుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 3.3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కంపెనీలు సరఫరా చేస్తాయి. వాటిలో సోయా బీన్ విత్తనాలు 2 లక్షల క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు లక్ష క్వింటాళ్లు, మిగిలిన వాటిలో జనపనార, పిల్లిపెసర విత్తనాలున్నాయి. సోయాబీన్ క్వింటా విక్రయ ధర రూ.5,800గా ఖరారు చేశారు. దానికి 37 శాతం ప్రకారం రూ.2,146 సబ్సిడీ అందనుంది. ఇక జీలుగ విత్తనాల విక్రయ ధర క్వింటాలుకు రూ.7,100 కాగా, 65% సబ్సిడీ కింద రూ.4,615 నిర్ధారించారు. జనపనార విక్రయ ధర క్వింటాలుకు రూ.8 వేలు. దానికి 65 శాతం సబ్సిడీ ప్రకటించారు. ఇక పిల్లిపెసర విక్రయ ధర క్వింటాలుకు రూ.13,500. రైతులకు 65% సబ్సిడీతో రూ.4,725కి విక్రయిస్తారు. సబ్సిడీ ఇచ్చేందుకు సోయాబీన్కు రూ.116 కోట్లు, జీలుగ విత్తనాలకు రూ.71 కోట్లు, జనపనారకు రూ.24 కోట్లు, పిల్లిపెసరకు రూ.13.50 కోట్లు కేటాయించారు. -
పత్తి వద్దు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్లో పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు పప్పుధాన్యాలను సాగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. వరి సాగు పెంచాలని భావిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఇదే అంశాన్ని సూచించింది. ఖరీఫ్ పంటల సాగుపై ఆ శాఖ వచ్చే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. పత్తి మిగిల్చిన నష్టంతో... 2016–17 ఖరీఫ్కు వ్యవసాయశాఖ చేసిన ప్రచారంతో ఆ సీజన్లో పత్తి సాగు తగ్గి పప్పుధాన్యాల సాగు పెరిగింది. ఆ ఏడాది మార్కెట్లో పత్తి ధర భారీగా పెరగ్గా.. పప్పుధాన్యాల ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 2017–18 ఖరీఫ్లో 98 లక్షల ఎకరాల్లో రైతులు అన్ని పంటలను సాగు చేస్తే, అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే 10 లక్షల ఎకరాలకు పైగా బీజీ–2 పత్తికి గులాబీరంగు పురుగు సోకడం, అకాల వర్షాలతో అనేకచోట్ల పత్తి రంగు మారిపోవటం, అనుమతి లేని బీజీ–3 పత్తిని కంపెనీలు అంటగట్టడం, నకిలీ విత్తనాలతో పత్తిరైతుకు ఈ ఏడాది అప్పులే మిగిలాయి. రాష్ట్రంలో 3 కోట్ల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తే, అందులో సగం కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. నికార్సయిన విత్తనమేదీ? బీజీ–2 వైఫల్యంతో ఏ పత్తి విత్తనం నికార్సయిందో ప్రభు త్వం నిర్ధారించే పరిస్థితి లేదు. బీజీ–3 జీవవైవిధ్యానికి గండికొడుతుండటంతో దానికి కేంద్రం అనుమతివ్వలేదు. పత్తిలో మరో కొత్త విత్తనాన్ని వ్యవసాయశాఖ సూచించలేదు. దీంతో ఖరీఫ్లో రైతులు ఏ పత్తి విత్తనం వేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. వ్యవసాయశాఖ సూచిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ పంటలసాగుపై ప్రభు త్వం ప్రచారం చేసినా రైతులు ముందుకు రావడంలేదు. కందిని కనీసమద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేయ డంలో పరిమితులు, పప్పుధాన్యాల ధరలు పడిపోవడం తో ఏ పంట వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. వ్యవసాయశాఖ స్పష్టత ఇస్తేనే ముందుకు సాగాలని యోచిస్తున్నారు. -
పంట పండేనా..?
దండేపల్లి(మంచిర్యాల) : కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు ఆందోళనకరంగా మారింది. డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించడంతో చాలా మంది రైతులు పంటలు సాగు చేసుకున్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం పైప్లైన్ తరచూ మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరాకు ఆటకం కలుగుతోంది. ఒకోసారి వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతోంది. దీంతో గూడెం ఎత్తిపోతల కింద ఇప్పటికే సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆయకట్టు పరిస్థితి ఇదీ.. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రతి యేటా ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఆయకట్టు కింద ఖరీప్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటారు. కడెం నీటిని రబీ సాగుకు ఇచ్చిన దాఖలాలు తక్కువే. రబీ సీజన్లో చెరువులు మాత్రం నింపుతారు. గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభం అయినప్పటినుంచి మాత్రం ఖరీఫ్కు పూర్తిస్థాయిలో, రబీకి డీ1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. రెండోసారీ రబీకి.. కడెం ఆయకట్టు కింద డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని రబీ సాగుకు అందించడం ఇది రెండోసారి. అయితే గత సంవత్సరం ఖరీఫ్లో కడెం నీటిని ఆయకట్టు చివరి వరకు అందించారు. ఖరీఫ్ సాగు పూర్తయ్యేనాటికి కడెం ప్రాజెక్టులో 692 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికితోడు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ నుంచి తెచ్చి 2016–17లో రబీకి కూడా డి1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించారు. ఈ సమయంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయి. 2017 ఖరీఫ్కు కడెం నీటిని డీ1 నుంచి డి42 వరకు అందించారు. ప్రస్తుత యాసంగికి మాత్రం కడెంలో సరిపడా నీళ్లు లేవు. 685 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో డి1 నుంచి డి22 వరకు రెండు తడుల నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో తీర్మానించారు. ఈనెల 15 నుంచి 23 వరకు మొదటి విడత నీటిని విడుదల చేశారు. రెండో విడత ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేయనున్నారు. డీ30 నుంచి డి42 వరకు మాత్రం గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23 నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత రబీకీ నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఎత్తిపోతల పథకం ఇప్పటికి మూడుసార్లు మరమ్మతులకు గురయ్యింది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంటలు పండుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతుల ఆందోళనలు గూడెం ఎత్తిపోతల నీటిని అధికారికంగా డి30 నుంచి డి42 వరకు ఇవ్వాల్సి ఉంది. అయితే తానిమడుగు వద్ద గల ఎత్తిపోతల పథకం డెలివరీ సిస్టర్న్ వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఖరీఫ్ సమయంలో ఈ గేట్లు ఎత్తితే కడెం నీళ్లు డి1 నుంచి డి42 వరకు వెళ్తుంటాయి. రబీ సమయంలో ఈ గేట్లు మూసి గూడెం ఎత్తిపోతల నీటిని డీ30 నుంచి డి42 వరకు అందిస్తుంటారు. ఈ సమయంలో గేట్ల నుంచి లీకయిన కొద్దిపాటి నీళ్లు ఎగువ ప్రాంతాలైన దండేపల్లి, మామిడిపల్లి వరకు వెళ్లడంతో ఈ ప్రాంత రైతులు రబీలో పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కడెం నీటిని డీ1 నుంచి డి22 వరకు చెరువులు నింపేందుకు విడుదల చేయగా, డీ–30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. మిగిలిన డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28లకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. గూడెం ఎత్తిపోతల నీళ్లు మొదట్లో కొద్ది రోజులు ఎగువకు రావడంతో గత ఏడాది మాదిరి ఈసారి కూడా పంటలు సాగు చేశారు. అయితే ఎత్తిపోతల పైప్లైన్ పగిలింది. దానికి మరమ్మతు చేసినప్పటి నుంచి ఎత్తిపోతల నీరు ఎగువకు వెళ్లకుండా పూర్తిగా సీజ్ చేశారు. దీంతో డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28 కింది సుమారుగా 5వేల ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా మారాయి. కొందరు రైతులు సాగు చేసిన పొలాలు నీళ్లందక ఎండుతున్నాయి. అయితే వీటికి తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా ఉన్న గేట్లను ఎత్తితే ఇక్కడి వరకు సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. మళ్లీ నిలిచిన నీటి సరఫరా.. గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23న విడుదల చేశారు. అప్పటినుంచి మూడుసార్లు పైప్లైన్ మరమ్మతులకు గురయ్యింది. దీంతో పైప్లైన్ లీకయినప్పుడల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో 6న ఒకసారి, 10న మరోసారి, తాజాగా 28న పైప్లైన్ మరమ్మతులకు గురయ్యింది. -
వ్యవసాయ బీమాలకు ఉమ్మడి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటికీ ఉమ్మడి నోటిఫికేషన్ జారీ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సోమవారం పంటల బీమాపై జరిగిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఉన్నట్లే వచ్చే ఖరీఫ్లోనూ పలు జిల్లాలకు సంబంధించిన 6 క్లస్టర్లను కొనసాగిస్తామన్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, సోయాబీన్, పసుపు, వేరుశెనగ పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద, పత్తి, మిర్చి, బత్తాయి, పామాయిల్ పంటలు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఉంటాయని తెలిపారు. నష్టపరిహారం కోసం చెల్లించే స్థాయిని 80 శాతంగానే నిర్ణయించామన్నారు. ఈ రెండు బీమాలను ఒకే బీమా కంపెనీ అందజేస్తుందన్నారు. యూనిఫైడ్ ప్యాకేజీ స్కీం కింద గతంలో నిర్ణయించిన విధంగానే జిల్లాల్లో కొనసాగుతాయన్నారు. విధివిధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంటల బీమా గడువు తేదీలు గత ఖరీఫ్ ప్రకారమే ఉంటాయన్నారు. సమావేశంలో వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ విత్తన భాండాగారం వైపు అడుగులు తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ నూతన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధ్రువీకరణ, సేంద్రియ ధ్రువీకరణ విభాగాల ద్వారా ఏడాదిలో దాదాపు 17 వేల క్వింటాళ్ల జొన్న, వరి తదితర విత్తనాలను ఈజిప్టు, సూడాన్, వంటి దేశాలకు ఎగుమతి చేశామన్నారు. వివిధ రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. దీన్ని గుర్తించిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ అధికారులను తెలంగాణకు అప్పగించిందన్నారు. ఆన్లైన్ ధ్రువీకరణ పద్ధతితో కల్తీ విత్తనాల సరఫరాను నియంత్రించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ విత్తన సదస్సు ఆసియా ఖండంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జరగనుందని పార్థసారథి వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
‘సమన్వయం’ ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రైతుకు పెట్టుబడి పథకంపై ప్రభుత్వం కసరత్తులో మునిగింది. వచ్చే ఖరీఫ్నుంచి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో గ్రామాల వారీగా రైతుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. రైతు పెట్టుబడి పథకం, పండించిన పంటలకు మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు ఇలా వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాలపై వచ్చే ఖరీఫ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమీక్షల మీద సమీక్షలతో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే రైతులకు సహకారం అందించడంలో గ్రామాల్లోని రైతు సమన్వయ సమితులు, అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. జిల్లాలో 561 రెవె న్యూ గ్రామాల్లో ఇప్పటివరకు రైతు సమన్వయ సమితులు ఏర్పడ్డాయి. ఎప్పుడో సమన్వయ సమితులు ఏర్పడినా ఇప్పటివరకు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో గ్రామస్థాయిలో సమన్వయ సమి తుల బాధ్యులు మాత్రం .. ఎప్పు డు ‘సమన్వయం’అంటూ నైరాశ్యంలో ఉన్నారు. గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే బ్రేక్ భూ ప్రక్షాళన నుంచే రైతు సమన్వయ సమితులు కీలకం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించినా చాలా గ్రామాల్లో ఈ కమిటీలు నామమాత్రంగా మారాయి. రాష్ట్రస్థాయిలో చైర్మన్ నియామకం కాకపోవడం, విధివిధానాలు ఖరారు కాకపోవడంతో గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే వీటి కి బ్రేక్ పడింది. గ్రామస్థాయిలో చైర్మన్లను ఎన్నుకోవడంతోపాటు మండల, జిల్లా స్థాయిలో సభ్యులు, చైర్మన్లను నియమించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల నుంచి చివరకు రాష్ట్రస్థాయి చైర్మన్ ఎంపిక జరగనుంది. గ్రామస్థాయి చైర్మన్ల ఎంపికతోనే ఈ ప్రక్రియను సరిపెట్టారు. ఇన్నిరోజుల నిలిచిపోయిన రైతు సమన్వయ సమితుల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేయాలని భవిస్తోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం అమలు చేస్తుండడం, రానున్న ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాల్లో గ్రామ స్థాయి సమితులకు కీలకం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెట్టుబడి పథకం రైతులకు సరిగ్గా అందుతుందా..? లేదా..? అన్నది పరిశీలించడానికి అధికారులతో పాటు ఈ సమితుల బాధ్యులకు కూడా పరిశీ లించే బాధ్యతలను అప్పగించనుంది. జిల్లాలో మొత్తం 563 రెవెన్యూ గ్రామాలుంటే 561 గ్రామాలకు అధికారికంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో వీరు భూ ప్రక్షాళనలో క్రియాశీలకంగా పాల్గొనలేదు. ప్రభుత్వంనుంచి ఈ సమితులకు సంబంధించి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభుత్వ దూకుడు చూసి సమన్వయ బాధ్యతలు ఇకనైనా ఉంటా యా..? అని గ్రామాల్లో ఎంపికైన సమన్వయ సమితుల చైర్మన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల ఎదురుచూపు .. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు మరోవైపు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైతు సమన్వయ సమితి చైర్మన్లుగా ఎంపికైనవారు.. ప్రభుత్వం బాధ్యతలు ఇస్తే సర్పంచ్ ఎన్నికల పోటీ బరినుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఇక అధికార పార్టీ మండలస్థాయి నేతలు మాత్రం మండల సమితి చైర్మన్ల కోసం పోటీ పడుతున్నారు. జిలాస్థాయి చైర్మన్లపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా ఈ పదవికి కూడా ఆ పార్టీలోని నేతలు సై అంటున్నారు. ఎవరికివారు తమకు ఈ పదవులు కావాలని ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలకు చెప్పారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పడడం, దీనికి నిధులు కూడా భారీ ఎత్తున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మండల, జిల్లాస్థాయి చైర్మన్ పదవులకు ఆశావహుల జాబితా పెరుగుతోంది. -
సాగునీటి కోసం అన్నదాతల నిరీక్షణ
-
వచ్చే ఖరీఫ్కు పెన్గంగ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి పెన్గంగ నీళ్లు ఆదిలాబాద్ జిల్లా బీడు భూములను తడుపుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. చనాక–కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుపై సభ్యుడు రాథోడ్ బాపూరావు అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, జైనూర్ ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 59 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలెంజ్గా తీసుకున్నామని, 2018లోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్నాయని విమర్శించారు. ‘స్వయంగా నేనే ఏడు సార్లు మహారాష్ట్రకు వెళ్లి.. ప్రాజెక్టు పనులపై చర్చించి అనుమతులు తీసుకున్నా. ఉద్యమ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేశా. ఇప్పుడు నా నేతృత్వంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటం అదృష్టంగా భావిస్తున్నా’అని పేర్కొన్నారు. ఎర్ర రొయ్యలు ఎప్పుడొస్తయి.. ఈ ఏడాది రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగార్జున సాగర్, సింగూరు, పాలేరు, కోయిల్ సాగర్, అలీ సాగర్, ఘనపురం, ఎల్లంపల్లి, సింగభూలపాల చెరువుల్లో రొయ్య పిల్లలను పెంచుతున్నామని చెప్పారు. ఎర్ర రొయ్యలు ఎప్పుడు వస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నలకు తలసాని పై విధంగా స్పందించారు. మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు జీవన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, చిన్నారెడ్డి, రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం వద్ద మత్స్య పరిశ్రమ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పెబ్బేరు కళాశాలలో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కుంటలు, చెరువులతోపాటు అన్ని రిజర్వాయర్లలో 45 కోట్ల చేప పిల్లలను వదిలామని చెప్పారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం గిరిజన దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. సభ్యులు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, కిషన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 3 వేల దేవాలయాలు ఈ పథకం పరిధిలోకి వస్తున్నాయని అన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద రూ.2,000 పూజ సామాగ్రి కోసం, రూ.4,000 అర్చకుని వేతనంగా ఇస్తున్నామని చెప్పారు. -
39 శాతం పత్తికే మద్దతు ధర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 33.25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు మార్కెట్లకు 15.16 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా, అందులో 5.87 లక్షల క్వింటాళ్ల (39%) పత్తికి కనీస మద్దతు ధర లభించిందని పేర్కొంది. ఖరీఫ్లో పండించిన వివిధ పంటలు, ధర తదితర వివరాల నివేదికను విడుదల చేసింది. 60 శాతం వరకు రంగు మారిందే.. ఇప్పటి వరకు వరంగల్ మార్కెట్కు వచ్చిన పత్తిలో దాదాపు 60 శాతం వరకు రంగు మారింది. దీని తేమ శాతం సరాసరి 25 శాతం ఉంది. 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తి మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 12 శాతం నుంచి 25 శాతమున్న పత్తి, రంగు మారిన పత్తిని బీ గ్రేడ్గా పరిగణించి కొనాలని కేంద్రానికి విన్నవించినట్లు ఆ నివేదికలో తెలిపింది. పెసరకు మద్దతు ధర రూ.5,575 రాష్ట్రంలో ఖరీఫ్లో పెసర 2.75 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపుగా 1.1 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం క్వింటాలు పెసరకు రూ.5,575 మద్దతు ధర ప్రకటించింది. 12 కేంద్రాల ద్వారా 2,512 మంది రైతుల నుంచి రూ.11.62 కోట్లతో 2,084 మెట్రిక్ టన్నుల పెసర కొన్నట్లు నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో మినుములు 80 వేల ఎకరాల్లో పండించారు. దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇప్పటివరకు 13 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 23.26 కోట్లతో 4,308 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొక్కజొన్న 11.45 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపు 28.12 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. దాదాపు 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. 19.38 లక్షల ఎకరాల్లో వరి.. ఖరీఫ్లో 19.38 లక్షల ఎకరాల్లో వరి పండించారు. దాదాపు 46.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం ఏ గ్రేడ్ రకానికి రూ.1,590, బీ గ్రేడ్ రకానికి రూ.1,550 మద్దతు ధర ప్రకటించింది. 2,902 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల 31 నాటికి 914 కేంద్రాలు ఏర్పాటుచేసి 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. -
శృతి తప్పిన 'నైరుతి'
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాదీ ఖరీఫ్ రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. గత ఏడాది వర్షాభావం వల్ల నష్టాలు మిగల్చగా ఈ ఏడాది ఆలస్యపు వర్షాలతో రైతులను చిక్కుల్లోకి నెట్టా యి. ఈ సంవత్సరం ప్రస్తుత సీజన్లో ఆగస్టు మొదటి వారం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉండగా, చివరలో కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. చాలా వరకు ఎండిపోయిన పంటలను ఈ వర్షాలు ఏమాత్రం బతికించలేకపోయాయి. జూన్ ఏడో తేదీన సకాలంలో రాష్ట్రంలో ప్రవేశించిన ‘నైరుతి’ ఆరంభంలో వర్షాలతో ఆశలు రేకెత్తించింది. జూన్ చివరి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకూ వరుణుడు మొహం చాటేయ డంతో అరకొరగానే పంటలు సాగయ్యాయి. చినుకు జాడలేక జూన్లో విత్తిన పంటలు జూలైలో చాలా వరకూ ఎండిపోయాయి. పత్తి, వేరు శనగ, సజ్జ, జొన్న, కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. రాయలసీమలో ఈ పంటలు గిడస బారి భూమికి ఆనిన సమయంలో.. ఆగస్టు రెండో వారంలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో పంటలు పచ్చగా మారినా దిగుబడిపై దుష్ప్రభావం పడింది. ఆగస్టు మొదటి వారం వరకూ లోటే.. ఆగస్టు రెండో వారం వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 16 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్లో42 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఆగస్టు మొదటి వారం వరకూ 45 శాతం విస్తీర్ణంలో కూడా విత్తనం పడలేదు. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అయితే సాధారణం కంటే 20 శాతం పైగా లోటు వర్షపాతం ఉండింది. దీంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. రాయలసీమలో 9.20 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా నాలుగు లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. అనంతపురంలో వేరుశనగ సాగు దారుణంగా పడిపోయింది. సాగైన విస్తీర్ణంలోనూ దిగుబడి సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదని రైతులతో పాటు అధికారులు కూడా చెబుతున్నారు. ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్లో సాగైన విస్తీర్ణంతో కలిపితే ఖరీఫ్లో సుమారు 85 శాతం వరకు విత్తనం పడింది. అయితే చివర్లో వేసిన పంటలను వ్యవసాయ శాఖ పరిభాషలో లేట్ ఖరీఫ్ లేదా ముందస్తు రబీ అంటారు. ఆగస్టు మూడో పక్షంలో, సెప్టెంబర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో లోటు పూడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. సాంకేతికంగా సగటు వర్షపాతం నమోదు రాష్ట్రంలో 556 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం (30 ఏళ్ల సగటు) కాగా, 567.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 19 శాతం ఎక్కువైనా, తక్కువైనా సాధారణ వర్షపాతంగానే వాతావరణ శాఖ పరిగణిస్తుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 33.1 శాతం, వైఎస్సార్ జిల్లాలో 23.4 శాతం అధిక వర్షం కురిసింది. మిగిలిన అన్ని జిల్లాలు సాధారణ సగటు వర్షపాత జాబితాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 26 మండలాల్లో కరువు పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 8.8 శాతం సగటు వర్షపాత లోటు ఉంది. తూర్పు గోదావరి జిల్లా 8.4 శాతం వర్షపాత లోటుతో రెండో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ‘రాజస్తాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నైరుతి నిష్క్రమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పశ్చిమ/ నైరుతి గాలులు కొనసాగుతున్నాయి. ఇవి ఆగిపోయి తూర్పు/ఈశాన్య గాలులు ఆరంభమైతే నైరుతి నిషŠక్రమించినట్లవుతుంది. ప్రస్తుతం అరేబియా మహా సముద్రం నుంచి గాలులు వీస్తున్నాయి. ఇవి వస్తున్నంత కాలం నైరుతి కొనసాగుతున్నట్లే. ఇవి దిశ మారి బంగాళాఖాతం నుంచి ఈశాన్య/ తూర్పు దిశగా గాలులు వస్తాయి. అప్పుడు నైరుతి నిషŠక్రమంచినట్లు నిర్ధారిస్తాం’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిపతి డాక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆదుకుంటుందా? టెక్నాలజీతో తప్పుకుంటుందా? ఈ సీజన్లో (జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ నాటికి) రాష్ట్రంలో 247 మండలాల్లో వర్షపాత లోటు ఉంది. తర్వాత వర్షాలు కురవడంతో ప్రస్తుతం వర్షాభావ మండలాల సంఖ్య 93కు తగ్గిపోయింది. దీంతో కరువు మండలాల ప్రకటనకు వేటిని పరిగణనలోకి తీసుకుంటారనే అంశం కీలకంగా మారింది. తాజా కరువు నిబంధనావళి ప్రకారం జూలై చివరి వరకూ కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ మండలాలు కరువు జాబితాలోకి వస్తాయి. దీంతో జూన్, జూలైలో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయిన, పంటల దిగుబడి పడిపోయి నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ పొందే వెసులుబాటు లభిస్తుంది. రుణాలు రీ షెడ్యూల్ అవుతాయి. కేంద్రం నుంచీ రాష్ట్రానికి సాయం అందుతుంది. కరువు మండలాల ప్రకటనకు వర్షపాత లోటుతో పాటు డ్రైస్పెల్ (వర్షానికి మరో వర్షానికి మధ్య విరామం), పంటల సాగు విస్తీర్ణం, భూమిలో తేమ శాతం, పంట దిగుబడి.. తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. అయితే వర్షపాత లోటు అనేది ప్రథమ ప్రాధాన్య అంశం. గతంలో ఒక వర్షానికి మరో వర్షానికి మధ్య విరామం 21 రోజులు ఉంటేనే డ్రైస్పెల్ ఉన్నట్లు డ్రాట్ మాన్యువల్ (కరువు నిబంధనావళి) పరిగణనలోకి తీసుకునేది. కొత్త మాన్యువల్ ప్రకారం 21 రోజుల మధ్య వర్షం కురిసినా సాధారణం కంటే 50 శాతం లోటు ఉంటే పరిగణనలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా సాంకేతిక కారణాలు చూపి.. ఇప్పటి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం రైతులు నిండా మునిగినట్లే. ఈ విషయంపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఈ పరిస్థితి రబీకి అనుకూలం.. అక్టోబర్ ఒకటో తేదీ (ఆదివారం) నుంచి రబీ సీజన్ ఆరంభమైంది. సెప్టెంబర్ చివర్లో, అక్టోబర్ ఆరంభంలో కూడా వర్షాలు కురుస్తున్నందున రబీ పంటల సాగుకు పరిస్థితి అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 40.64 లక్షల హెక్టార్లకన్నా ఆరు లక్షలు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రబీ సీజన్లో 24.63 లక్షల హెక్టార్లను పూర్తిగా సాగులోకి తీసుకువచ్చి ఖరీఫ్ లోటును భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వేరుశనగ, శనగ, కంది, మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, అలసంద, ఉలవ, జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి మెట్ట పంటల సాగుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అన్ని రకాల విత్తనాలను సిద్ధం చేసింది. మొక్కజొన్న, సజ్జ, ఆముదం, జొన్న, పొద్దుతిరుగుడు హైబ్రీడ్ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. జాతీయ ఆహార భద్రతా పథకం పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వరి విత్తనాలను క్వింటాల్కు రూ.500 రాయితీ చొప్పున పంపిణీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల శాఖ రాష్ట్రంలోని సాగు ఆధారంగా ఎరువులను సకాలంలో రైతులకు అందించేందుకు మార్క్ఫెడ్ను నోడల్ సంస్థగా నియమించింది. ఆధార్ అనుసంధానిత ఇ–పాస్ పద్ధతిన ఎరువులను డీలర్లు సరఫరా చేస్తారు. అక్టోబర్ నెలకు కావాల్సిన 2.30 లక్షల టన్నుల పొటాష్, నైట్రోజన్, భాస్వరం ఎరువుల్ని సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలో సుమారు 7 వందల క్లస్టర్లలో ప్రభుత్వం ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి, బహుళ ప్రయోజక విస్తరణాధికారిని నియమించింది. -
ఆశనిరాశల ఖరీఫ్..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ ఆశనిరాశల మధ్య ముగిసింది. ఇక వచ్చే నెల 1 నుంచి రైతులు రబీ పనుల్లో మునిగిపోనున్నారు. ఈ ఖరీఫ్లో ఆహార ధాన్యాల కంటే పత్తి పంటే ఎక్కువగా సాగైంది. వర్షాలు పూర్తిస్థాయిలో లేకపోవడం.. జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో వరి విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన ఖరీఫ్ చివరి నివేదికలో తెలిపింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఈసారి ఏకంగా 47.72 లక్షల(114%) ఎకరాల్లో సాగు కావడం విశేషం. గతేడాది పత్తి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో 2016 ఖరీఫ్లో 31 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. కానీ అప్పట్లో పత్తికి మార్కెట్లో డిమాండ్ పెరిగి మంచి రేటు రావడంతో ఈసారి రైతులు పత్తివైపు మొగ్గు చూపారు. ఖరీఫ్లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 40.72 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఏకంగా 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 19.07 లక్షల(82%) ఎకరాలకే పరిమితమైంది. ఆహారధాన్యాల్లో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, 9.27 లక్షల ఎకరాలు సాగైంది. 10 జిల్లాల్లో లోటు.. నైరుతీ రుతుపవనాలు మొదట్లో ఊపందుకున్నా, ఆ తర్వాత ఉధృతి తగ్గింది. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలంలో లోటు వర్షపాతమే నమోదైంది. జూన్లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 40 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 12 శాతం, సెప్టెంబర్లో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఈ నాలుగు నెలల కాలంలో కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డు అయింది. హైదరాబాద్, మేడ్చల్, గద్వాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. రబీకి సన్నద్ధం.. రానున్న రబీ సాగు కోసం ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే నెల 1 నుంచి రబీ సాగు మొదలు కానుండటంతో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. రబీకి కేంద్రం 12.10 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, ఇప్పటికే డీలర్లు, మార్క్ ఫెడ్, కంపెనీల వద్ద 6.35 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.33 లక్షల క్వింటాళ్ల శనగ, 2.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
ఖరీఫ్.. కన్నీళ్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద ఆశలు అడుగంటి పోయాయి.. వానల్లేక ఎక్కడా చెప్పుకోదగ్గ నీటి నిల్వల్లేవు.. జూరాల, కడెం మినహా భారీ ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ల నుంచి ఖరీఫ్ ఆయకట్టుకు చుక్క నీరందడం లేదు.. వెరసి ఏకంగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది! భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరినా.. తాగునీటి అవసరాల దృష్ట్యా సాగుకు నీరందించడం కష్టంగానే ఉండొచ్చు. ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమే 19 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం 5 టీఎంసీల నీళ్లే సాగర్లోకి వచ్చాయి 2.14 టీఎంసీల నీళ్లే నిజాంసాగర్లోకి వచ్చాయి తుపాన్లు వస్తేనే ప్రాజెక్టులు నిండే అవకాశం ఏ ప్రాజెక్టు చూసినా.. సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా.. గతేడాది అత్యధికంగా 26 లక్షల ఎకరాల మేర నీరందించారు. ఈ ఏడాది మాత్రం దారుణంగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద 6.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎకరా భూమికి కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం సాగర్లోకి 5 టీఎంసీల నీరు మాత్రమే రావడంతో తాగునీటికే ఎగువ ప్రాజెక్టుల వైపు చూడాల్సి వస్తోంది. కనీసం 70 టీఎంసీల నీరొస్తేనే ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఆయకట్టు రైతులు ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 40 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయకట్టుకు వదలడం లేదు. మరో 27 టీఎంసీలు వస్తే కానీ ఖరీఫ్ నీటి విడుదలపై చెప్పలేని పరిస్థితి. గతేడాది ఈ ప్రాజెక్టు కింద 8.60 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందింది. నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఏడాది ప్రాజెక్టులోకి 2.14 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. దీంతో ఇక్కడా ఆయకట్టుకు నీటి విడుదలపై ఆశలు అడుగంటిపోయాయి. శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఈ ఏడాది 3 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినా... తాగునీటి అవసరాలే తీరడం లేదు. అక్టోబర్, నవంబర్లో తుపాన్లు సంభవిస్తే ప్రాజెక్టుల్లోకి నీరొచ్చే అవకాశం ఉంటుంది. అలా వస్తేనే ఖరీఫ్ ఆయకట్టుకు చివరి తడికైనా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఖరీఫ్ ఆశలు గల్లంతు కానున్నాయి. ఏం చేయాలోఅర్థం కావడం లేదు సాగర్లో నీళ్లు లేక వరిపై ఆశలు సన్నగిల్లాయి. నాకు రెండెకరాల భూమి ఉంది. గతేడాది 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశా. ఈసారి నీళ్లు లేక ఐదెకరాలే కౌలుకు తీసుకున్నా. పంట ఎండిపోయే టట్లుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నా. – సోమిరెడ్డి, త్రిపురారం, నల్లగొండ కన్నీళ్లే మిగిలాయి సాగర్ కాల్వకు నీరు విడుదల చేయక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. వేలకు వేలు పోసి బోర్లు వేస్తే నీరు పడతలేదాయె. అప్పుల పాలవుతున్నాం. బోర్ల వద్ద కొంత నాటు వేసినా నీరు సరిపోవడం లేదు. నీళ్ల కోసం చూస్తే కన్నీళ్లే మిగిలాయి – గడ్డం సైదిరెడ్డి, నారమ్మగూడెం, నల్లగొండ నమ్మకం లేదు వరినాట్లకు సమయం మించిపోయింది. ఇప్పటి వరకు కల్వకుర్తి నుంచి నీరందకపోవడంతో ఈసారి పంటలు పండుతాయన్న నమ్మకం లేదు. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రకటన చేయాలి. – చిక్కొండ్ర బాలయ్య, నాగర్ కర్నూల్ -
నిరాశే!
- రైతులను ఆదుకోని ఖరీఫ్ - 20 మండలాల్లో లోటు వర్షపాతం - జూన్లో వేసిన పత్తి పంటకు అపార నష్టం – ముందుకు సాగని వరి – వెలవెలబోతున్న చెరువులు, కుంటలు కర్నూలు(అగ్రికల్చర్)/ కోడుమూరు రూరల్ ఖరీఫ్ సీజన్ రైతులను నిరాశపరుస్తోంది. ఆగస్టు నుంచి ఆశాజనకంగానే వర్షాలు కురుస్తున్నా పలు మండలాల్లో లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ నుంచి ఈ నెల 12 వరకు నమోదయిన వర్షపాతాన్ని పరిశీలిస్తే 20 మండలాల్లో ఖరీఫ్ పంటల పరిíస్థితి నిరాశాజనకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లాలో పత్తి భారీగానే సాగైనప్పటికీ జూన్లో వేసిన పంట వర్షాభావం వల్ల పూర్తిగా ఎత్తిపోయింది. వరి సాగులోనూ పురోగతి లేదు. మొత్తమ్మీద చూస్తే ఖరీఫ్ పరిస్థితి మెరుగ్గా లేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6,36,403 హెక్టార్లు. ఇప్పటి వరకు 4,86,556 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో 76శాతం మాత్రమే పంటలు వేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికీ బీడు ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 100 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకున్నా రైతుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే అదను దాటిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఆగస్టు నుంచి పలు ప్రాంతాల్లో ఆశాజనకంగానే వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ పత్తికొండ, డోన్, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు మాత్రం నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. జూన్ నుంచి ఈ నెల 12 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 376.9 మి.మీ ఉండగా.. 358.4 మి.మీ నమోదైంది. 4.9 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. మండలాల వారీగా పరిశీలిస్తే 20 ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంది. దీన్నిబట్టి కరువు పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి. 8 మండలాల్లో అధిక వర్షపాతం జిల్లాలోని కేవలం ఎనిమిది మండలాల్లోనే అధిక వర్షపాతం నమోదయింది. అవుకు, డోన్, గూడూరు, మహనంది, పగిడ్యాల, ఓర్వకల్, వెలుగోడు, బనగానపల్లి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా..మరో 26 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. పత్తి రైతుకు కష్టకాలం ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది పత్తికి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పోటీ పడి ఈసారి పంట సాగు చేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు 2,08,221 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 2,24,482 హెక్టార్లలో వేశారు. ఇందులో జూన్ నెలలోనే దాదాపు 70 వేల హెక్టార్లలో పంట సాగైంది. జూలైలో వర్షాలు బాగా పడిఉంటే ఈ పంట కాసులు కురిపించేదే! కానీ ఆ నెలలో వర్షాలు లేక పంటకు తీవ్ర నష్టం కలిగింది. ఆగస్టులో వర్షాలు పడినప్పటికీ జూన్లో వేసిన పంట కోలుకోలేదు. దీంతో దేవనకొండ, కోడుమూరు, కర్నూలు, కల్లూరు, ప్యాపిలి, ఆలూరు తదితర మండలాల్లో జూన్లో వేసిన పత్తి పంటను తొలగించి రబీలో శనగ పంట వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 50 వేల హెక్టార్లలో పత్తి పంటను తొలగిస్తున్నారు. వరిసాగు ప్రశ్నార్థకమే జిల్లాలో వరి సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడిప్పుడే కాలువలకు నీళ్లు వదులుతున్నా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. వరి సాగు చేసుకుంటే కీలకమైన సమయంలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,474 హెక్టార్లు ఉండగా.. ప్రస్తుతానికి 16,305 హెక్టార్లలో మాత్రమే వేశారు. కేసీ కెనాల్, ఎల్ఎల్సీలకు నీళ్లు వదిలినప్పటికీ ఆరుతడి పంటలే శరణ్యమవుతున్నాయి. దీనికితోడు వరి సాగుకు అదను కూడా దాటుతోంది. ఈ నెల 15 వరకే వరి నాట్లు వేసుకోవచ్చని, ఆ తర్వాత వేయడం మంచిది కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
ఆశలు ఆవిరి..
► 76 శాతానికే ఖరీఫ్ వరి నాట్లు పరిమితం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ వరిపై ఆశలు ఆవిరి అవుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.65 లక్షల(76 శాతం) ఎకరాలకే పరిమితమైంది. పావు శాతం నాట్లు పడలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రుతుపవనాలు మందగించడం, జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరదలా పత్తి.. గతేడాది పత్తి సాగు తగ్గడం, మార్కెట్లో ధర అమాంతం పెరగడంతో ఈసారి రైతులు పత్తి పంటకు జై కొట్టారు. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఖరీఫ్లో 31 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి ఏకంగా 46.52 లక్షల(111 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈసారి పత్తికి సరైన ధర ఇప్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇప్పటికే 150 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.12 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా, 40 వేల (24 శాతం) ఎకరాలకే పరిమితమైంది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకుగానూ 6.25 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్లో కంది ఏకంగా 10.77 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. నిరాశాజనకమే.. రాష్ట్రంలో పత్తి మినహా ఏ పంటా ఆశాజనకంగా లేదు. ఖరీఫ్ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 39.25 లక్షల(81 శాతం) ఎకరాల్లోనే సాగయ్యాయి. గతేడాది ఖరీఫ్లో 48.07 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాలు సాగైతే, ఈసారి 8.82 లక్షల ఎకరాలు తగ్గింది. ఆహారధాన్యాల్లో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఖరీఫ్లో 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.22 లక్షల(88 శాతం) ఎకరాలకే పరిమితమైంది. ఈసారి వరికి ఉరే.. వరి సాగు విస్తీర్ణం తగ్గడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్లు, బావుల కిందే వరి నాట్లు పడ్డాయి. జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో వరి సాగు పావు శాతానికి తగ్గింది. ఈ సీజన్లో జూన్లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 40 శాతం లోటు నమోదైంది. ఆగస్ట్లో 12 శాతం, సెప్టెంబర్లో ఇప్పటివరకు 27 శాతం లోటు రికార్డు అయింది. ప్రస్తుతం కురిసిన వర్షాలు మెట్ట పంటలు గట్టెక్కడానికే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికీ 197 మండలాలు వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. 280 మండలాల్లో సాధారణం, 107 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో వరి నాట్లు పూర్తిస్థాయిలో పడలేదు. నాగార్జున సాగర్ పరిధిలోని ఆయకట్టు పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వర్షాలు కురిస్తే ముందస్తు రబీకి వెళ్లాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు ఖరీఫ్లో నాట్లు పడింది 17.65 లక్షల ఎకరాలు పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు ఈసారి పత్తి సాగైంది 46.52 లక్షల ఎకరాలు. -
సాగు ప్రశ్నార్థకమే !
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ఇప్పట్లో లేనట్టే - శ్రీశైలం నీటి మట్టం 70.7 అడుగులు దాటితేనే ఆశలు - రెండుపంటలను కోల్పోనున్న ఆయకట్టు రైతులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ, తెలుగుగంగ, కేసీ ఆయకట్టు కాల్వ కిందనున్న ఆయకట్టులో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖరీఫ్పై ఆశలు వదులుకున్న రైతులు రబీకి నీరందుతుందా లేదానని ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు చుక్కనీరు అందాలన్నా పోతిరెడ్డిపాడు ద్వారానే కృష్ణానది నీరు విడుదల కావాలి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల సాధ్యమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం జలాశయంలోకి ఆగస్టు పూర్తయినా వరద నీరు చేరక పోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిధిలోని 5,03,288 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఏటా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదలై రెండు పంటలు సాగు చేసేవారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు డ్యామ్లో ఆశించిన మేర నీరు లేకపోవడంతో రబీపై కూడా ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. తప్పని కన్నీటిసేద్యం: పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ కింద 1,88,788 ఎకరాలు, తెలుగుగంగ కాల్వ కింద 1,14,500 ఎకరాలు, కేసీ ఎస్కేప్ కాల్వ కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటివిడుదల జరిగితేనే కాల్వల కిందున్న ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 783.30 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 70.7అడుగుల నీటిమట్టం పెరిగితేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పట్లో శ్రీశైలం జలాశయంలో ఏ కోసాన నీటిమట్టం పెరిగే అవకాశాల్లేవు. గత రెండేళ్లుగా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదల అవుతోంది. 2015లో ఆగస్టు 1 నాటికి శ్రీశైలం జలాశయంలో 802.70 అడుగుల నీటిమట్టం ఉండగానే ఆగష్టు 5న పోతిరెడ్డిపాడు నుంచరి నీటిని విడుదల చేశారు. 2016 ఆగస్టు 1న శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా ఆగస్టు 2న పోతిరెడ్డిపాడు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు మాసం ముగుస్తున్నా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కేవలం 783.30 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. రబీకి నీరందేనా: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. వర్షాలు లేక, కాల్వకు నీరు లేక భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. మరో వైపు శ్రీశైలం జలాశయంలోకి ఆశించిన స్థాయిలో వరదనీరు చేరక పోవటంతో రబీ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించి సంవృద్ధిగా వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయం త్వరగా నిండితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల రబీపంటలనైనా సాగుచేసుకోవచ్చుననే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
‘ఖరీఫ్’ మార్కెటింగ్కు సిద్ధం
► అధికారులతో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు సమీక్ష ► ఈ–నామ్ సాఫ్ట్వేర్ సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ► జాతీయ ప్రమాణాలతో కోహెడ, పటాన్చెరు మార్కెట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఖరీఫ్ దిగుబడి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్ యంత్రాం గం సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఖరీఫ్ దిగుబడుల సేకరణ, ఈ–నామ్, కోల్డ్ స్టోరేజీలు తదితర అంశాలపై మంగళవారం ఆయన సమీక్షిం చారు. ఈసారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే తెలంగాణలో 44 వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్ విజయవంతంగా అమలవుతోం దని, అయితే సాఫ్ట్వేర్ సమస్యలు తరచూ తలెత్తుతున్నందున వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. నాబార్డు నిధులు సమీకరించి 9 కోల్డ్ స్టోరేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో దడవాయిల సంఘం ప్రతినిధులు హరీశ్ను కలసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో.. వ్యవసాయ మార్కెట్లలో దడవాయిల లైసెన్సు బదిలీ దరఖాస్తులను 15 రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో దడ వాయిల సౌకర్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కోహెడ, పటాన్చెరులలో తలపెట్టిన మార్కెట్లను అత్యంత ఆధునికంగా జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ఆదేశించారు. కోహెడ మార్కెట్ల నిర్మాణానికి సంబంధించి వీటితో ముడిపడిన బిల్డర్లు, బ్యాంకర్లు, ట్రేడర్లు, రైతులు అందరితోనూ విస్తృతంగా చర్చలు జరపాలని సూచించారు. ఆయా వర్గాలకు కావలసిన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ రెండు మార్కెట్ల నిర్మాణంపై సమగ్ర నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగులో ఉన్న నిమ్మ, దొండ, బత్తాయి మార్కెట్ల నిర్మాణాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు లోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జేడీ లక్ష్మణుడు, పి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం, ఓఎస్డీ జనార్దన్రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులు పార్థసారథి సాక్షి, హైదరాబాద్: దళారుల ప్రమేయాన్ని నిలువరించేందుకు గతేడాది పత్తి రైతులకు 25 లక్షల గుర్తింపు కార్డులు ఇచ్చామని, ఈ సారి కూడా బార్కోడెడ్ కార్డులు అంద జేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడిం చారు. పత్తి రైతుల వివరాలు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఈ మేరకు జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవ సాయ వర్సిటీ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా పత్తి కనీస మద్దతు ధర స్థిరీకరణకు నిర్వహిస్తున్న ప్రాజెక్టు అంచ నాలు, సూచనలు సెప్టెంబర్ నెలాఖరు కల్లా వెల్లడయ్యే అవకాశముందని తెలిపా రు. పత్తి కొనుగోలు కోసం 150 సీసీఐ కేంద్రాలు కావాలని కోరగా, కేంద్రం సాను కూలంగా స్పందించిందన్నారు. దాదాపు 130కేంద్రాలు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, యాజమాన్యంపై చర్యలు తీసుకో వాలని కోరారు. మార్కెటింగ్శాఖ డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. -
ఇక రబీయే దిక్కు!
► రాష్ట్రంలో దారుణంగా ఖరీఫ్ పంటల పరిస్థితి ► ముసురుకుంటున్న తీవ్ర కరువు పరిస్థితులు ► ఇప్పటికే నెల రోజులుగా జాడలేని వర్షాలు ► ముందస్తు రబీకి వెళ్లక తప్పదంటున్న వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ► రైతులను, ఖరీఫ్ పంటలను వదిలేసి సమగ్ర సర్వేపైనే అధికారుల దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఇలా కళ్లముందే పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పం టల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా వ్యవసా యాధికారులు ఏమీ పట్టనట్టు ఉండిపోతు న్నారు. కేవలం సమగ్ర రైతు సర్వేపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ముందస్తు రబీకి వెళ్లాలని.. ఇప్పటికే పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దుర్భరంగా పరిస్థితి జూలైలో 40% లోటు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల దాదాపు నెల రోజులుగా వర్షాల జాడలేదు. దీంతో డ్రైస్పెల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 జిల్లాల్లో లోటు నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణంగా, మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 214 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న 82.8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 44 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఎండిపోయే దశలో ఉందని వ్యవ సాయ శాఖ అధికారులే చెబుతున్నారు. డ్రైస్పెల్ కారణంగా అనేక జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. 43 రోజులకు మించియ వర్షాలు పడకపోతే∙తీవ్ర కరువు ప్రాంతాలుగా నిర్ధారి స్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరో 10 రోజులు కొనసాగితే తీవ్ర కరువు ముంచెత్తనుంది. పట్టించుకోని అధికారులు: అయితే, వ్యవసాయ శాఖలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. ఖరీఫ్ పంటల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలకు వెళ్లాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ దాటి కాలు బయటపెట్టడం లేదు. పైగా రైతు సమగ్ర సర్వే అంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. చివరికి మండల వ్యవసాయాధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండటం లేదని.. రైతు సమగ్ర సర్వే వివరాల నమోదు పనిలోనే ఉంటున్నారని పేర్కొంటున్నారు. ముందస్తు తప్పదా? ఖరీఫ్ సాగు కష్టంలో పడడంతో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్న పంటలపై 2 శాతం యూరియా స్ప్రే చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. పత్తి, వరి విషయంలో కొద్దిరోజులు వేచి చూడాలని.. నెలాఖరు వరకు కూడా వర్షాలు కురవక, పంటల పరిస్థితి కుదుటపడకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే దిక్కు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రబీ సాగు అక్టోబర్ నుంచి మొదలవుతుంది. -
మూడో వంతు రైతులకే రుణాలు
► 36 లక్షల మందిలో 12 లక్షల మందికే పంట రుణాలు ► ఖరీఫ్ మొదలై రెండు నెలలైనా పట్టించుకోని బ్యాంకులు ► చేసేదిలేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్న రైతన్నలు సాక్షి, హైదరాబాద్: ప్రకృతి కన్నెర్ర.. బ్యాంకర్ల చిన్న చూపు రైతులను కుంగదీస్తున్నాయి. ఓవైపు వర్షాలు రాక వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటం.. మరోవైపు పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకి నాశనం చేస్తుంటే కాపాడుకోలేని నిస్సహాయ దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంటలకు పురుగు మందులు, ఎరువులు కొనాలంటే బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మూడో వంతు మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఖరీఫ్లో ప్రతీ ఏడాది సరాసరి 36 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు కేవలం మూడో వంతు అంటే 12.42 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలిచ్చాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా, జూలై 31 నాటికి బ్యాంకులు రూ.10,514 కోట్లే రుణాలిచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. సర్కారు బకాయిలు రూ.271 కోట్లు మరోవైపు బ్యాంకర్లు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాల బకాయిలు రూ.271 కోట్లు ఇంకా విడుదల చేయలేదని మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం మంజూరు చేసినా ఆ సొమ్ము ఇప్పటికీ విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల నిర్లిప్తత రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులకు పంట రుణాలు మంజూరు చేసినా బ్యాంకుల్లో కరెన్సీ లేక డబ్బు చేతికి ఇవ్వడం లేదు. రైతు ఖాతాల్లోనే ఆ రుణ నగదును జమ చేసి వట్టి చేతులతో పంపిస్తున్నారు. దీంతో రైతులు ఆ నగదు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 23,851 కోట్ల రూపాయలు – ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం 10,514 కోట్ల రూపాయలు – జూలై 31 నాటికి బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు 80.42 లక్షల ఎకరాలు – రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైంది వడ్డీ చెల్లించాల్సిందే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 80.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 43.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 3.95 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 10.70 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తం ఖరీఫ్ పంటల సాగు 74 శాతం పూర్తి కాగా, అందులో పత్తి పంట విస్తీర్ణం 104 శాతానికి చేరుకుంది. అయితే ఈ స్థాయిలో పంటల సాగు జరిగితే రుణాలు మాత్రం సగానికి కూడా చేరుకోలేదు. పైగా రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకం అమలవుతున్నా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. కొత్త రుణం సంగతి దేవుడెరుగు, తీసుకున్న రుణాలకు వడ్డీ వసూలు చేస్తూ పీడిస్తు న్నాయి. కొన్నిచోట్ల కొత్త రుణం ఇస్తూనే, ఆ రుణం సొమ్ము నుంచే వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో బ్యాంకులకు నచ్చజెప్పడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. -
ఖరీఫ్ కకావికలం
– ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనా 5.36 లక్షల హెక్టార్లు - 48,942 క్వింటాళ్ల విత్తనాలు అవసరం – ప్రధాన పంటలు 2.65 లక్షల హెక్టార్లు – కమిషనరేట్కు ప్రణాళిక పంపిన అధికారులు అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ లాంటి ప్రధాన పంటల సాగు సమయం ముగిసిపోవడంతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ నెల 1వ తేదీన బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు సమావేశమై ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరిజవహరలాల్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ నాయుడు, ఎక్స్టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి సమక్షంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు, సాగైన విస్తీర్ణం, ఇంకా సాగులోకి రావాల్సిన విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలపై చర్చించి జిల్లాల వారీగా ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మరోసారి సమావేశమై ప్రత్యామ్నాయ పంటలు, వాటికి అవసరమైన విత్తనాలు, ఏ రకం విత్తనాలు అనువైనవనే దానిపై ప్రతిపాదనలతో కూడిన విత్తన ప్రణాళిక గురువారం కమిషనరేట్కు పంపినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధాన పంటలు 2.65 లక్షల హెక్టార్లు జూన్, జూలై నెలల్లో కురిసిన అరకొర వర్షాలకు పంటల సాగు పడకేసింది. 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ జూలై 31వ తేదీ నాటికి అన్ని పంటలు కలిపి 1.94 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 6.04 లక్షల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 1.60 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఆగస్టు మొదటి వారం వచ్చే నివేదిక ప్రకారం 2.65 లక్షల హెక్టార్లలో ప్రధాన పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఇక మిగతా 5.36 లక్షల హెక్టార్లు బీళ్లుగా మిగిలే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 48,942 క్వింటాళ్ల విత్తనం అవసరం 5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. జొన్న, ఉలవ, అలసంద, కొర్ర, సజ్జ, కంది, పొద్దుతిరుగుడు, పెసర, ఆముదం, మినుము పంటలకు సంబం«ధించి 48,942 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. అయితే ఈ విత్తనాలు ఎపుడు సరఫరా అవుతాయి..? ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు..? ఉచితంగానా లేదంటే రాయితీతో ఇస్తారా...? అనేది రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
అంచనాలను మించి పత్తి సాగు
► ఖరీఫ్లో అన్ని పంటల సాగు 75 లక్షల ఎకరాలైతే... అందులో పత్తే 42 లక్షల ఎకరాలు ► ఊపందుకోని వరి నాట్లు... జలాశయాలు నిండకపోవడమే కారణం ► 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు ► వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి అంచనాలకు మించి సాగవుతోంది. ఇప్పటికే వంద శాతం మైలు రాయిని దాటేసింది. ఇంకా సాగు పెరిగే అవకాశముందని వ్యవసా యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పంటల సాగు పెద్దగా ఊపందుకోలేదు. ముఖ్యంగా ఆహారధాన్యాల పంటల సాగు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంది. జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో వరి నాట్లు అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. పత్తి తప్ప మిగతా పంటల సాగు సంతృప్తికర స్థాయిలో లేదని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పుంజుకోని వరి నాట్లు... ఖరీఫ్లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.72 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 25.90 లక్షల ఎకరాల్లో (53%) సాగయ్యాయి. అందులో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 12.12 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగయ్యాయి. ఇక వరి నాట్ల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. చెరువులు, జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో నాట్లు పుంజుకోలేదని అంటున్నారు. మరిన్ని వర్షాలు పడి వరదనీరు వచ్చి చేరితేనే నాట్లు ఊపందుకుంటాయని అంటున్నారు. ఖరీఫ్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 6.72 లక్షల ఎకరాల్లో (29%) నాట్లు పడ్డాయి. ఇక నూనె గింజల పంటల్లో కీలకమైన సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3.77 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి సోయా ఏకంగా 6.95 లక్షల ఎకరాల్లో సాగైంది. 144 మండలాల్లో లోటు వర్షపాతం రాష్ట్రంలో 584 మండలాలకు గాను 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. 254 మండలా ల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 183 మండలాల్లో అధిక వర్షం కురిసింది. మూడు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో 15 మండలాలు, నిర్మల్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, కొమురంభీమ్ జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 10 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 42.17 లక్షల ఎకరాలకు చేరిన పత్తి.. రాష్ట్రంలో ఖరీఫ్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం సాగు కావడం నివ్వెరపరుస్తోంది. గతేడాది సర్కారు మాట విని ఇతర పంటలు అధికంగా వేయడం, పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని భావించిన రైతులు ఇప్పుడు పత్తికి జై కొట్టారు. గతేడాది ఇదే సమయానికి పత్తి సాగు విస్తీర్ణం కేవలం 26.80 లక్షల ఎకరాలు మాత్రమే. -
వ్యవసాయ యంత్రాల జాడేదీ!
- ఖరీఫ్ ప్రారంభమైనా నిర్లక్ష్యం - ధరలు ఖరారైనా వాటికి ఆమోద ముద్ర వేయని ఆగ్రోస్ - నిధుల్లేక ఈ ఏడాది హాలిడే ప్రకటిస్తారన్న ప్రచారం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఇప్పటికీ వాటి ధరలను ప్రకటించలేదు. మార్కెట్లో అన్ని సరుకులకూ జీఎస్టీకి అనుగుణంగా ధరలు ప్రకటించినా, ఆ శాఖ మాత్రం జీఎస్టీని సాకుగా చూపి యంత్రాల ధరలు ప్రకటించలేదు. దుక్కిదున్నే యంత్రాల నుంచి స్ప్రేయర్ల వరకు సన్న, చిన్నకారు రైతు ఉపయోగించే పరికరాలు అందుబాటులో లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ధరలు ప్రకటిస్తారో కూడా అధికారులు చెప్పట్లేదు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్రం నుంచి మరో రూ.134 కోట్లు రానున్నాయి. అసలు కారణాలేంటి? జీఎస్టీని వర్తింపజేసి ధర ఖరారు చేయడానికి కంపెనీలకు పెద్ద ఇబ్బందేమీ లేదు. కానీ జీఎస్టీ కారణంగా ఆగ్రోస్ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ధరల జాబితా తయారు చేసి ఆగ్రోస్ యంత్రాంగం ఫైలును సిద్ధం చేసింది. దానిపై సంతకం చేయడానికి ఆగ్రోస్ ఎండీ వీరబ్రహ్మయ్య ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆయన సహకార కమిషనర్గా, ఆగ్రోస్ ఇంచార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. తిరిగొచ్చాక వీరబ్రహ్మయ్యకు ఆగ్రోస్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడలేదని చెబుతున్నారు. సహకార బాధ్యతల వరకే తిరిగి ఉత్తర్వులు ఇచ్చారని, ఆగ్రోస్కు ఇవ్వనందున రావట్లేదని తెలిసింది. మరోవైపు ఆగ్రోస్ చైర్మన్ కిషన్రావుకు, ఎండీ వీరబ్రహ్మయ్యకు మధ్య కోల్డ్వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరబ్రహ్మయ్య తనకు ఆగ్రోస్ బాధ్యతలు వద్దని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఈ రెండు కారణాలతో ఆయన ఆగ్రోస్ వైపే చూడట్లేదు. దీంతో యంత్రాల ధరల జాబితా ఫైలు ఎవరితో సంతకం చేయించాలో తెలియక అధికారులు గందరగోళంలో ఉండిపోయారు. హాలిడే ప్రకటిస్తారా? గతేడాది సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలకు సంబంధించి కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్ములో రూ.100 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాదికి యంత్రాలివ్వాలంటే పాత బకాయిలు తీర్చడంతో పాటు, ఈ ఏడాది బడ్జెట్ నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది హాలిడే (విక్రయాలు దాదాపు ఎక్కువ శాతం నిలిపేసి) నెట్టుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్నుత్నట్లు చెబుతున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున వచ్చే ఏడాది అధికంగా యంత్రాలు సరఫరా చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు ఆగ్రోస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాదికి గ్రీన్హౌస్ కోసం వచ్చే ఏ దరఖాస్తుకూ ఉద్యానాధికారులు అనుమతివ్వట్లేదు. వ్యవసాయ యంత్రాలపై ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
లక్ష్యానికి దూరంగా..
ఇదీ సర్కారు రుణ ప్రణాళిక సగం ఖరీఫ్ ముగిసినా అందని రుణాలు లక్ష్యంలో 40 శాతమే పంపిణీ వ్యవసాయ రుణప్రణాళిక 6,526 కోట్లు.. ఖరీఫ్కు ఇవ్వాల్సిన రుణాలు 3,263 కోట్లు రైతులకు ఇచ్చామంటున్నది రూ. 1500 కోట్లు రీషెడ్యూల్ చేసింది సుమారు రూ. 900 కోట్లు నికరంగా ఇచ్చింది రూ. 600 కోట్లు కౌలు రైతులకు ఇచ్చామంటున్నది 150 కోట్లు వాస్తవంగా ఇచ్చిందేమీ లేదు. బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే సాక్షి ప్రతినిధి, ఏలూరు: రుణ ప్రణాళిక అమలు ఎంత వాస్తవ దూరంగా ఉందో ఈ లెక్కలే చెబుతాయి. ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవానికి పొంతన లేదన్నది వాస్తవం. ఇప్పటి వరకూ రూ. 1500 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నా అందులో 900 కోట్ల రూపాయలు బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. వాస్తవంగా రైతుల చేతికి ఇచ్చిన రుణం రూ. 600 కోట్లు మాత్రమే. ఈ ఖరీఫ్లో ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున చూసినా కేవలం వరి కోసమే రెండువేల కోట్ల రూపాయలకు పైగా రైతులకు పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే బ్యాంకుల నుంచి ఇచ్చిన రుణాలకు.. అవసరానికి చాలా తేడా ఉంటోంది. జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది కౌలు రైతులు ఉంటే డెల్టాలోనే సుమారు రెండు లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. ఈ ఏడాది 6,526 కోట్ల రూపాయల రుణ లక్ష్యం కాగా అందులో 10 శాతం కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం రైతులకు అందాల్సింది 652 కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకూ అధికారులు ఇచ్చామని చెబుతున్నది రూ. 150 కోట్లు. ఈ మొత్తం కూడా బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. వాస్తవానికి కౌలు రైతులకు అందింది శూన్యం. ఈ ఏడాది 2,97,485 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 2,33,887 మందికి ఇచ్చారు. అంటే ఇంకా 63,599 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. రైతులకు ఇచ్చామని చెబుతున్న వాటిలో కూడా 30 శాతం ఇంకా అధికారుల వద్దే ఉన్నట్లు సమాచారం. బ్యాంకుల వద్దకు రుణాలకు వెళ్తుంటే ఒక సర్వే నెంబర్పై ఒకసారి మాత్రమే రుణం ఇస్తామని చెబుతున్నారు. భూ యజమానులు 98 శాతం ఇప్పటికే పంట రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ పాత రుణాలు రెన్యువల్. దీంతో కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. జిల్లాలో 53 వేల మందికి రూ. 160 కోట్లు రుణమాఫీ చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో 40 కోట్లు మాత్రమే రుణమాఫీ కాగా ఇంకా 120 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉంది. సర్వే నెంబర్లు లేవని, భూమి డాక్యుమెంట్లు లేవని సాకులు చూపిస్తూ వీరికి రుణమాఫీ వర్తింప చేయలేదు. రుణమాఫీ వస్తుందని వీరు రుణం చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారారు. బ్యాంకుల్లో ఒకరిద్దరు రుణాలు పెండింగ్లో ఉన్నా మిగిలిన వారికి రుణాలు ఇవ్వడం లేదు. పాత రుణాలు రెన్యువల్ చేసి బుక్ అడ్జస్ట్మెంట్లు మాత్రమే చేస్తున్నారు. గత ఏడాది రుణ లక్ష్యం రూ. 5176 కోట్లు. జిల్లాలోని మూడు లక్షల 98 వేల మంది రైతులకు మంజూరు చేయగా, వ్యక్తిగత, రైతు మిత్ర గ్రూపులు, జెఎల్జీ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు దక్కింది కేవలం 21 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 0.4 శాతం కూడా కౌలు రైతులకు దక్కలేదు. బ్యాంకులకు రుణం విషయంలో ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వం నుంచి పత్రికా ప్రకటనలు మాత్రమే వస్తున్నాయని, తమకు ఎలాంటి ఆదేశాలు రాతపూర్వకంగా లేకపోవడంతో తాము ఏం చేయలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. -
రైతుల నగదు కష్టాలపై 14న ధర్నా: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో రైతులు పడుతున్న నగదు కష్టా లపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు కాం గ్రెస్ ఆందోళనలకు నడుంకడుతోందని పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల రుణమాఫీ, వడ్డీ బాధలు, ఉపాధి హామీ కూలీల నగ దు కష్టాలపై పాత జిల్లా కేంద్రాల్లోని బ్యాం కుల ఎదుట 14న ధర్నాలు చేపడతామని చెప్పారు. రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా సకాలంలో ఇవ్వ కపోవడంతో వారు అవస్థలు పడుతున్నారన్నారు. వారి అవస రాలకు తగినన్ని డబ్బులను బ్యాంకులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ నాలుగో విడత నిధులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు -
ఇదేందిరబ్బీ!
►అన్నదాతకు అందని పంట డబ్బు ►ధాన్యం కొనుగోలులో సర్కారు చిత్రం ►ఖరీఫ్ వచ్చినా.. సొమ్ములివ్వని వైనం ►జిల్లా వ్యాప్తంగా రూ.7కోట్ల బకాయిలు ►రైతుల ఆందోళన పట్టించుకోని అధికారులు రబీ అయిపోయిది. ఖరీఫ్ ఆరంభమైంది. అన్నదాతలు నాట్ల దశకు చేరారు. అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా రబీ పంట డబ్బు అందలేదు. ఫలితంగా వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏలూరు (మెట్రో) : ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఖాతాల్లో 48 గంటల్లో సొమ్మును జమ చేస్తాం. మద్దతు ధర అందేలా చూస్తాం.’ ఇదీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా చెప్పిన మాట. ఆయన చెప్పినట్టు 48 గంటల్లో కాదు కదా.. మూడు నెలలు పూర్తయిపోయినా.. ఖరీఫ్ సీజన్ వచ్చినా.. ఇంకా రబీ పంట డబ్బు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా సుమారు రూ.7కోట్ల 26 లక్షలు రైతులకు చెల్లించాలి. రబీలో కొనుగోలు ఇలా.. గత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 283 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొన్నారు. 85,284 మంది రైతుల వద్ద నుంచి 10,18,449.88 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. అన్నదాతలకు 1,523.41 కోట్లు నిధులు చెల్లించాల్సి ఉండగా.. రూ.1,516.14కోట్లు చెల్లించారు. ఈ నిధులనూ 48గంటల్లో కాకుండా ధాన్యం కొన్న 10, 15 రోజులకు, ఒక్కో రైతుకు 30 రోజులకూ చెల్లింపులు చేశారు. ఇంకా రూ.7.26 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అన్నింటిలోనూ ముందు వరుసలోనే.. రబీ సీజన్లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ఈ జిల్లాలన్నింటిలో పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక మంది రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. అధిక నిధులు కూడా చెల్లించింది. అదే స్థాయిలో రైతులకు ఆలస్యంగా నిధులు చెల్లించిన జిల్లాగానూ, ఇంకా అత్యధికంగా సొమ్ములు బకాయి పడిన జిల్లా కూడా మనదే. ఇబ్బందుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక సతమతమవుతున్నారు. రుణమాఫీ, ఇతరత్రా కారణాల వల్ల బ్యాంకులు అన్నదాతలకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రబీ పంట డబ్బులు వెంటనే చెల్లిస్తే తమకు కొంతలో కొంత ఉపశమనంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. తక్షణం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఎవుసం సాగేనా..?
రోనిలో రోకండ్లు పగిలిపోయేంత ఎండలు కొట్టేవి. ఆ తర్వాత మృగశిర కార్తెలో ఎవుసం పనులు మొదలు పెట్టేటోల్లం. సాగువాటు చేసి వానలు పడగానే దుక్కులు దున్నించి విత్తనాలు వేసేందుకు భూములను సిద్ధం చేసేటోల్లం. ఆరుద్రలో వానలు బాగాపడేవి. పూర్వకాలంలో పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేటోల్లం. ఇప్పుడు కార్తెలు కదిలిపోతున్నట్లుగానే కాలమూ పోయింది. వానలు లేవు, పనులు లేవు. వేసిన విత్తనాలు భూముల్లోనే ఉండిపోయాయి. మొలిచినవి ఎండిపోతున్నయ్. ఇదీ..తిరుమలగిరి మండలం గరకనేట్తండాకు చెందిన సపావట్ భోజ్యానాయక్ ఆవేదనే కాదు.. కాలాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసే మెట్టప్రాంత రైతులదీ ఇదే పరిస్థితి. ⇒ ముఖం చాటేసిన వరుణుడు ⇒ ముగిసిన ఆరుద్ర కార్తె.. దాటిపోతున్న కాలం ⇒ వాడిపోతున్న పత్తి మొక్కలు ∙ఆందోళనలో రైతులు త్రిపురారం/పెద్దవూర/తిరుమలగిరి : ద్రోణిరూపంలో జూన్ మొదటివారంలోనే తొలకరి పలకరించడంతో ఆనందంగా రైతన్నలు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ముందే వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు కదల్లేక కదులుతుండటంతో కర్షకుల్లో నిరాశ కనిపిస్తోంది. దుక్కులు దున్నిన రైతులు వర్షాలకోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఆయకట్టులో నాగళ్ల సవ్వడి వినిపిస్తున్నా కరుణించని మేఘంతో ఖరీఫ్ సేద్యానికి విత్తనం వేయడం అనుమానంగానే కనపడుతోంది. తొలకరితో మురిపించిన మేఘాలు తర్వాత ముఖం చాటేశాయి. జూన్లో కురవాల్సిన సాధారణ వర్షాలకు పుడమి నోచుకోలేదు.వానలు కురవకపోగా వేడి వడగాలులు వీయడంతో వేడెక్కిన పుడమితల్లితో ఉన్న కొద్దిపాటి పదును కాస్తా పోయి ఖరీఫ్ సాగు కదలకుండాపోయింది. నాగార్జునసాగర్ కెనాల్(ఆయకట్టు) ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మరో 10వేల ఎకరాలు బోరు, బావుల ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు.12లక్షల ఎకరాలు నాన్ఆయకట్టు (వర్షాధారం) కింద కర్షకులు పత్తి, కందులు, పెసర్లు తదితర పంటలను సాగుచేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 45–50వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. అడుగంటిన సాగరం.. అందోళనలో రైతులు వ్యవసాయానికి ప్రధాన సాగు నీటి వనరుగా ఉన్న సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం డెడ్స్టోరేజీలో ఉండటం, జూలై నెలవచ్చిన నీటి మట్టం పెరగకుండా ఉండటంతో పాటు కృష్ణాపరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి ఇన్ఫ్లో వచ్చే జాడ కనబడడం లేదు. దీంతో ఖరీఫ్ సేద్యంపై రైతన్నలు క్రమ క్రమంగా ఆశలు వదులుకొనే పరిస్థితులు ఆయకట్టులో కనిపిస్తున్నాయి. జూన్లో సాధారణ వర్షాలు కురవకపోవడం, జూలై వచ్చినా వరుణుడి జాడే లేకపోవడంతో ఖరీఫ్ సేద్యం చేసేందుకు రైతులు సాహసించే పరిస్థితి కనపడడం లేదు. ఖరీఫ్ మొదలైందంటే నెల ముందే ఒప్పందాలను చేసుకుని పనులను మొదలుపెట్టే కౌలు రైతులు ప్రస్తుత ఆయకట్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో భూములను తీసుకునేందుకు ముందుకురావడం లేదు. ఖరీఫ్పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న రైతులు వేలాది రూపాయలు పెట్టి ఇప్పటికే విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేశారు. దుక్కులు దున్ని నార్లు పోసేందుకు ఎదురుచూస్తున్న రైతులకు నెలదాటిన వరుణుడి మోహం చాటేయడంతో అన్నదాతల పరిస్థితి ఆందోళకరంగా మారింది. సహజంగా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వర్షాలు కురిస్తే విత్తనాలను వేసేవారు. రోహిణీ కార్తెలో విత్తనాలను విత్తడం వలన అధికలాభం వస్తుందని రైతుల నమ్మకం. కానీ మృగశిరకార్తె, రోహిణి, ఆరుద్ర కార్తెలు వెళ్లిపోయాయి. రుతుపవనాలు కనికరించి ఆలస్యంగా సేద్యం చేస్తే దిగుబడి తగ్గిపోయి,పంటలు రోగాలబారిన పడి న ష్టాలు తప్పవనే రైతులు భావిస్తున్నారు. సకాలం లో వర్షాలు పడకపోతే ఖరీఫ్లో ఇబ్బందులు పడక త ప్పదని ఆయకట్టు రైతులు దిగులు చెందుతున్నారు. మొక్కలు వాడుబట్టినయ్.. జూన్ నెలలో పడిన మొదటి వర్షానికే ఎనిమిది ఎకరాలలో పత్తి విత్తనాలను వేశాను. ఎకరాకు మూడు బ్యాగుల చొప్పున మొత్తం 24 పత్తి విత్తనాల పాకెట్ల వేశా. ఒక్క ప్యాకెట్కు రూ.780 చొప్పున మొత్తం రూ.19 వేలు విత్తనాలకు, అరకలకు రూ.3వేలు, కూలీలకు రూ.3వేలు పెట్టి విత్తనాలు వేశాను. బాగానే మొలిచాయి. ఇరవై రోజులుగా వర్షాలు పడక పోవడంతో మొక్కలు వాడుబట్టాయి. ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురుచూస్తున్నా. వర్షం లేకుంటే అప్పుల పాలే గతి. – కర్నాటి లక్ష్మారెడ్డి, రైతు, పెద్దవూర ఈ ఏడు కాలం కష్టమే.... ఈ ఏడాది కాలం అయ్యేది కష్టంగా ఉంది. నేను వ్యవసాయం చేసినప్పటి నుంచి మృగశిర, ఆరుద్రకార్తెలలో పంటలను సాగుచేసేవాళ్లం. ఆ కార్తెలో పంటలు బాగా పండేవి. గురువారంతో పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. ఆ కార్తెలో పంటలను సాగుచేసిన పెట్టుబడులు కూడా రావు. – శాగం కోటిరెడ్డి రైతు, తిరుమలగిరి మొలకలు రాలేదు పది రోజుల క్రితం చిరుజల్లులు కురిస్తే నాకున్న నాలుగు ఎకరాల్లో పత్తిని విత్తాను అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో ఇంతవరకు విత్తులు మొలకెత్తలేదు. ఇంకో మూడురోజుల దాక వర్షం కురువకపోతే విత్తనాలు మొలకెత్తవు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. –బద్దెల వెంకన్న, రైతు -
50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
► అందులో పత్తి సాగే 30.85 లక్షల ఎకరాలు ► ఇంకా మొదలుకాని వరి నారు... సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ జోరుమీదుంది. అధిక వర్షాలు నమోదు కావడంతో పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోతోంది. రుతుపవనాలు మొదల య్యాక ఇప్పటివరకు 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఏకంగా 46 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కావడం ఇటీవల కాలంలో ఇదే రికార్డు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ఇదే సమయానికి 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈసారి ఒక పత్తి సాగే 30.85 లక్షల ఎకరాల్లో జరిగింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 41.9 లక్షల ఎకరాలు కాగా, 74 శాతం విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి సాధారణం కంటే అధికంగా పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పడిపోతున్న పప్పుధాన్యాల సాగు... రైతులు పెద్దఎత్తున పత్తి వైపే మరలిపోతుం డటంతో పప్పుధాన్యాల సాగు గణనీ యంగా పడిపోతోంది. ఖరీఫ్లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 7.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి కేవలం 4.82 లక్షల ఎకరాలకే వాటి సాగు పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే కాలానికి 4.97 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి 3.20 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. గతేడాది కంది పంటకు గణనీయంగా మార్కెట్లో ధరలు పతనం కావడంతో రైతులు ఆ పంట వైపు వెళ్లడానికి జంకుతున్నారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల ఎకరాల్లో సాగైం ది. సోయాబీన్ 5.80 లక్షల ఎకరా లకు ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి నార్లకు ఇంకా సమయం ఉండ టంతో సాగు పుంజుకోలేదు. సాధారణంగా ఖరీఫ్లో 23.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పటివరకు బావులు, బోర్ల కింద లక్షన్నర ఎకరాల్లో నార్లు వేశారని వ్యవ సాయ శాఖ వెల్లడించింది. మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు... వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో లక్సెట్టిపేటలో 6 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. మంథని, కోయిదా, జూలపల్లిల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
నీటి మూటలు!
హంద్రీనీవా.. ఉనికిపాటు నీటి విషయంలో మాట నిలుపుకోని టీడీపీ డిస్ట్రిబ్యూటరీలను అటకెక్కించిన ప్రభుత్వం నెల రోజులుగా పనులు నిలిపేసిన ఏజెన్సీలు 33, 34 ప్యాకేజీలతో గత ఏడాది ఖరీఫ్కే నీళ్లిస్తామని ప్రకటన ఈ ఏడాదీ ఫలించని రైతుల ఆశలు 2014 ఖరీఫ్కు నీరిస్తాం. ఆ తర్వాత 2015.. 2016.. ఇలా గడువు మారుతుందే తప్పిస్తే టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా జలాలతో అనంత పొలాలను తడపలేకపోతోంది. జిల్లా ఎమ్మెల్యేలు.. మంత్రులు మొదలు.. నీటి పారుదల శాఖ మంత్రి కూడా ఈ విషయంలో ఇక్కడి ప్రజలను మోసగించారు. ఇక మీదట నమ్మించలేమని తెలుసుకున్న నేతలు మౌనమే మేలనే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి తెర తీయగా.. ఉలిక్కిపడిన ఎమ్మెల్సీ పయ్యావుల పోటీ పర్యటనకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: హంద్రీనీవా ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణాజలాలు చేరుకున్నాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడమే తరువాయి. ఈ క్రమంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు చేయొద్దంటూ 2015 ఫిబ్రవరిలో జీఓ జారీ చేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. హంద్రీనీవా పనుల పురోగతిపై జీడిపల్లి రిజర్వాయర్లో 2015లో జరిగిన సమీక్షలో ఆయకట్టుకు నీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రిని నిలదీశారు. ‘మీ ప్రాధాన్యతలు మీకుంటాయి. మా ప్రాధాన్యతలు మాకుంటాయి’ అని సీఎం మాట దాట వేశారు. దీనిపై విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలో దీక్ష చేపట్టారు. ఆపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా నిర్వహించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కనీసం 33, 34 ప్యాకేజీలు పూర్తి చేద్దామనే నిర్ణయానికి వచ్చింది. ఈ పనులకూ బ్రేక్ 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్(ఇంజనీరింగ్ ప్రాజñక్టు ఇండియా లిమిటెడ్) చేస్తోంది. రాగులపాడు లిఫ్ట్ నుంచి 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వాలి. ఆ తర్వాత మైనర్, సబ్ మైనర్( ఉప, పిల్లకాలువలు) తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. కొంతమేర కాలువను తవ్వారు. నెల రోజులుగా పనులు నిలిచిపోయాయి. ఇదేంటని ఆరా తీస్తే రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. 5–6 కిలోమీటరు మధ్య కిలోమీటరు మేర రాయి పడింది. దీన్ని బ్లాస్టింగ్ చేయాలి. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి. ఇది ఆలస్యం కావడంతోనే పనులు ఆపేశారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మైనర్, సబ్ మైనర్తో పాటు మేజర్ కెనాల్లోని కల్వర్టులను పూర్తి చేయాలి. ఇవి కూడా చేయడం లేదు. దీంతో పాటు ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే గతేడాది పనులు చేసేందుకు ఉపక్రమించిన ఏజెన్సీకి అప్పుడు రేట్ల వ్యత్యాసం ఎందుకు గుర్తుకు రాలేదనేది తేలాల్సి ఉంది. దీంతోపాటు 33 పక్కనే 34 ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. ఇందులో డీ–1, డీ–2 అని రెండు ప్రధాన కాలువలు, వాటి కింద మైనర్, సబ్ మైనర్ కాలువలు తవ్వాల్సి ఉంది. ఈ పనులను ఆర్వీసీపీఎల్(రెడ్డి వీరన్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) పనులు చేస్తోంది. పనుల్లో డీ–1, 8.25, డీ–2 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకూ బ్రేక్ పడింది. ఇందులోనూ కొంత మేర డిస్ట్రిబ్యూటరీ ప్రధాన కాలువను తవ్వి నిలిపేశారు. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. ఈ రెండు ఏజెన్సీలు టెండరు చేసుకునే ముందు ధరల్లో వ్యత్యాసం, గిట్టుబాటు అవుతుందా? లేదా? అనేది తేలీదా అనే విషయం తేలాల్సిన అంశం. లేదంటే ఈ ముసుగులో మరింత దండుకునే వ్యూహం పన్నుతున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. కనీసం ఈ రెండు డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే ఫేజ్–1లోని 1.18లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 28వేల ఎకరాలకైనా నీరందుతుంది. కానీ దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించని పరిస్థితి. దీంతో ఈ నెల 2న పనుల పరిశీలనకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వెళ్లారు. ప్రభుత్వానికి ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదని, అందుకే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్సీ కేశవ్ 3న అదే ప్రాంతంలోని పనులను పర్యవేక్షించారు. ఈ పోటాపోటీ పర్యటనలతో ఆయకట్టుకు నీరిచ్చే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది జిల్లాకు 28 టీఎంసీలు వస్తే ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఖరీఫ్కు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. 33, 34 ప్యాకేజీలను చూస్తే ఈ ఖరీఫ్కు నీళ్లొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ప్రధాన కాలువ పూర్తి కాలేదు. కల్వర్టలు నిర్మించాల్సి ఉంది. ఉప, పిల్ల కాలువలు తవ్వాలి. ఇవేవీ చేయలేదు.. పైగా ఏజెన్సీ పనులు చేయకుండా వెళ్లిపోయింది. గత ఖరీఫ్కు నీరిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది. అదీ నిలుపుకోలేకపోయింది. - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే -
చినుకు.. కునుకు
కురవని మేఘాలు ► ఎండుతున్న పైర్లు ► ముందుకు సాగని ఖరీఫ్ ►అయోమయంలో రైతన్న ► ఈ ఏడాది నష్టాలేనని పెదవి విరుపు పైరు బతుకుతుందో లేదో? మాకు రెండు ఎకరాల మెట్ట భూమి ఉంది. గత ఏడాది వర్షాభావంతో సాగు చేసిన కంది పూర్తిగా దెబ్బతినింది. పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కలేదు. ఈ సారైనా..వ్యవసాయం కలసివస్తుందనే అశతో ఖరీఫ్కు సిద్ధమయ్యాం. ఇంతవరకు వర్షాలు అంతంతమాత్రంగానే పడ్డాయి. పైరు మొలక దశలోనే ఎండిపోతోంది. బతుకుతుందో లేదో? – చిన్న చెంచన్న, నేరడుచెర్ల గ్రామం, ప్యాపిలి మండలం కర్నూలు అగ్రికల్చర్ /పత్తికొండ రూరల్ : ముందస్తుగా ఊరించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పలు మండలాల్లో ఇరవై రోజులుగా చినుకే కరువైంది. తొలకరి జల్లులతో పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూమిలో తేమ శాతం లేకపోవడంతో మొలకదశలోనే పైర్లు వాడిపోతున్నాయి. జూన్ నెలలో 13 మండలాల్లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. వివిధ మండలాల్లో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ భూమిలో పదును శాతం తక్కువగా ఉంది. గత ఏడాది జూన్ నెలలో సాధారణ వర్షపాతంకంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి కళకళలాడుతూ కనిపించాయి. ఈ ఏడాది కూడా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసినా పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..నీరు లేక వెలవెలబోతున్నాయి. వేరుశనగ సాగుకు జూలై 15వరకు అవకాశం ఉందని.. అంతవరకు విత్తనాలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలుకురవకపోవడంతో విత్తనాలకు డిమాండ్ అంతగా కనిపించడం లేదు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించగా 36వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. జిల్లాకు బీటీ విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు కేటాయించగా..4లక్షల ప్యాకెట్లు మాత్రమే అమ్మకం అయ్యాయి. వానలు తక్కువే.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చేస్తోంది. ఈ మేరకు ఎర్రనేలల్లో పత్తి వేయవద్దని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచిస్తునఆనరు. వర్షాధారం క్రింద నల్లరేగడిలో మాత్రమే పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు. సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి పంటల్లో ఒకసారి గుంటెక పాయడం వల్ల పైపొర కదిలి బెట్టకు రాకుండా ఉంటాయని సలహాలు ఇస్తున్నారు. నీటి పారుదల పరిస్థితి.. గత ఏడాది జూన్ నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో జూలై నెలలోనే రైతులు వరి నారు పోసుకున్నారు. ఈ సారి వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆయకట్టు సాగుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీ కెనాల్ కింద 1,21,678 హెక్టార్లు, బోర్లు, బావులు కింద 1,14,703 హెక్టార్లు, లిప్ట్ ఇతర నీటి వసతి కింద 20,278 హెక్టార్ల భూములు ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఆయకట్టు సాగు కలసి వస్తేందా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతోంది. ఈయన పేరు కాలయ్య ఆచారి. పత్తికొండ–రాతన పొలాల్లో సొంత పొలం 2ఎకరాలు ఉండగా 18ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ముందస్తు వర్షాలతో 12ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. విత్తనాలు, సేద్యపు పనులకు, కూలీలకు ఎకరాకు రూ.5వేల ప్రకారంగా 12ఎకరాలకు రూ.60వేలు పెట్టుబడి పెట్టాడు. పైరు మొలకెత్తిన తరువాత వానలు లేక మొక్కలు వాడుముఖం పట్టాయి. వాన కోసం ఈ రైతు ఆశగా ఆకాశం కేసీ ఎదురు చూస్తున్నాడు. పదును ఆరుతోంది: నాకున్న 6 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాను. విత్తనాలు, కూలీలకు రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. మేఘాలు ఊరిస్తున్నాయి గానీ వర్షం మాత్రం రావడం లేదు. మొలకదశలోనే పైర్లు ఎండిపోతున్నాయి. ఇరవై రోజులుగా చినుకు జాడ లేదు. భూమిలో తేమ తగ్గి పదును అరుతోంది. - గజ్జికాశీనాథ్, రైతు, పుచ్చకాయలమాడ -
‘బయో’త్పాతం
- జిల్లాలో నకిలీ బయో ఉత్పత్తులు – వ్యవసాయాధికారుల దాడి – రూ. 25 లక్షల విలువ చేసే మందులు సీజ్ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీప్ సీజన్ మొదలు కావడంతోనే మార్కెట్లోకి నకిలీ బయో ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు నగరాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమార్కులు నకిలీల దందా నడుపుతున్నట్లు çస్పష్టం అవుతోంది. శనివారం గుట్టుచప్పుడు కాకుండా తరలుతున్న బయో ఉత్పత్తులను వ్యవసాయాధికారుల సీజ్ చేశారు. గోదాముపై దాడులు చేసి.. రూ.25 లక్షల విలువ చేసే బయో ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్టు ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండటాన్ని వ్యవసాయాధికారులు గుర్తించారు. కర్నూలు బాలాజీ నగర్లోని కేశవరెడ్డి స్కూల్ సమీపంలోని 72–1–72–5 నెంబరు ఇంటిపై కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, అగ్రానమీ ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డి తదితరులు దాడి చేశారు. ఓసో కంపెనీకి చెందిన 15 రకాల బయోలను దివ్య ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ చేస్తోంది. దీనిపై వ్యవసాయాధికారులకు కనీస సమాచారం కూడా లేదు. దొంగ ఉత్పత్తులు కావడం వల్లనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బయోల్లో పురుగుమందులు ఉన్నాయా అనే దానిని తేల్చేందుకు శ్యాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపుతున్నట్లు వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డి తెలిపారు. -
ఖరీఫ్కు వీలైనంత త్వరలో సాగునీరు
అందించాలని అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం ► సింగూరు, ఘనపురం, కడెం ప్రాజెక్టుల నుంచి నీరివ్వాలని సూచన ► సాగునీటి కార్యాచరణ ప్రణాళిక, ఆయకట్టు లక్ష్యాలపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల నుంచి వీలైనంత త్వరలో ఖరీఫ్కు సాగునీరు విడుదల చేయాలని నీటిపారుదల హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సాగునీటి కార్యాచరణ ప్రణాళికపై గురువారం సచివాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సింగూరు, ఘనపురం, కడెం, నీల్వాయి, మత్తడి వాగు, కుమ్రం భీం, గొల్ల వాగు, నల్లవాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్కు ముందస్తు నీటి విడుదలకు చర్యలు తీసుకోవా లన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టు ల్లో సింగూరు నుంచి 40 వేల ఎకరాలు, ఘనపురం నుంచి 20 వేల ఎకరాలు కడెం నుంచి 50 వేల ఎకరాలు, నీల్వాయి నుంచి 7 వేలు, గొల్లవాగు నుంచి 6 వేలు, కుమ్రం భీం నుంచి 21 వేలు, మత్తడి వాగు నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిం చాలని ఆదేశించారు. ఇందుకుగాను ఎస్సారె స్పీ, నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని హరీశ్రావు సూచించారు. వివిధ ప్రాజెక్టుల డ్యాంల గేట్లను పటిష్టం చేయాలని, మరమ త్తు పనులను పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ను ముందస్తుగా ప్రారంభించడం వల్ల యాసంగిలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే వీలవుతుందన్నారు. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై మరో వారంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో గతేడాది అమలు చేసిన ‘టెయిల్ టు ఎండ్’ విధానం విజయవంతమై నందున ఇదే ప్రయోగాన్ని వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలలో ప్రవే శపెట్టాలని హరీశ్రావు సూచించారు. నిజాం సాగర్ కింద గతేడాది సమర్థంగా సాగు నీటి యాజమాన్యం జరిగిందని, అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టుల్లోనూ కొనసాగించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వికాస్రాజ్, ఈఎన్సీలు మురళీధర్, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఈలు శంకర్, హరిరామ్, ఖగేందర్ సుధాకర్, శ్యామసుందర్, సురేశ్, మధుసూదన్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలుగా ఆర్ అండ్ ఆర్ కాలనీలు! ప్రతి ప్రాజెక్టు కింద నిర్ధారిత ఆయకట్టు లక్ష్యాల సాధనకు పకడ్బందీ ప్రణాళికలు రచించి అమలు చేయాలని హరీశ్రావు ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నిర్వాసి తుల కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రధాన కాలువ తోపాటు డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాలువలను ఇరిగేషన్ ఇంజనీర్లు తనిఖీ చేసి లీకేజీలుంటే యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలన్నారు. -
ఆశల సాగు ఆరంభం
రైతులు తమ ఆశల సాగు ఆరంభించారు. ఉదయాన్నే పలుగు..పార పట్టి ఎద్దులు.. ట్రాక్టర్లతో పొలంబాట పట్టారు. ఏ మాయదారి తెగుళ్లు రాకుండా విత్తనాలకు మందులు చల్లి.. నాగళ్లతో దుక్కిదున్ని విత్తు వేశారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం, నరసనేకుంట, తాటిచెర్ల, కమ్మూరు గ్రామాల్లో గురువారం రైతులు ఇలా ముంగారు సేద్యం చేశారు. - సాక్షి ఫొటోగ్రాఫర్ -
రుణ పంపిణీ వేగం పెంచండి
బ్యాంకర్లకు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణాల పంపిణీని వేగవంతం చేయాలని బ్యాంకర్లకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రైతులకు తక్కువ వడ్డీతో రుణాల మంజూరుకు రూ.20,339 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. స్వల్ప కాలిక పంట రుణాలపై వడ్డీలో రాయితీని ఇవ్వడానికీ కేంద్రం సిద్ధమైందన్నారు. ఖరీఫ్లో రైతుల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలైనందున రుణాల మంజూరులో వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూడాలన్నారు. ఇప్పటికే రూ.2,573 కోట్ల రుణ పంపిణీ పూర్తి అయినట్లు వివరించారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో భాగంగా మ్యాచింగ్ ఫండ్స్ ను విడుదల చేయాలని దత్తాత్రేయ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. -
వర్షించిన ఆశలు
జిల్లాలో భారీ వర్షం - ఆస్పరిలో అత్యధికంగా 77 మి.మీ., వర్షపాతం - ముమ్మరంగా ఖరీఫ్ పనులు కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న రైతులకు వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు పడుతుండటంతో సకాలంలో విత్తనం వేసుకునే అవకాశం లభించింది. గురువారం రాత్రి నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ఆస్పరిలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హాలహర్వి, తుగ్గలి, శ్రీశైలం మండలాలు మినహా జిల్లాలోని ఆన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఆస్పరి, ఆదోని, కౌతాళం, నందవరం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడివేముల, వెలుగోడు, ఆత్మకూరు, కోడుమూరు, వెల్దుర్తి, హొళగుంద, చిప్పగిరి, మద్దికెర మండలాల్లో తేలికపాటి వర్షాలు పడగా.. మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. 29 మండలాల్లో 10 మి.మీ.,కు పైగా వర్షపాతం నమోదయింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 18 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ., ఉండగా 16 రోజుల్లోనే 71.7 మి.మీ., వర్షపాతం నమోదయింది. దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉక్కిరిబిక్కిరి చేసిన నీటి సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతోంది. వర్షాల రాకతో పత్తి, ఆముదం, కంది విత్తనం పనులు ఊపందుకున్నాయి. కర్నూలు, ఆదోని డివిజన్లలో పత్తి సాగు ముమ్మరంగా సాగుతోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి కర్నూలు, కల్లూరు సహా వివిధ మండలాల్లో వర్షం కురిసింది. గ్రామాల్లో నకిలీ బీటి పత్తి విత్తనాలదే హవా వర్షాలు ఆశాజనకంగా పడుతుండటంతో నకిలీ విత్తనాలు గ్రామాల్లో వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వర్షాలు పడటం, పత్తి సాగు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో నకిలీలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది 3 లక్షలకు పైగా హెక్టార్లలో పత్తి సాగు అయ్యే అవకాశం ఉంది. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు జిల్లాలో తిష్టవేసి నకిలీలను మార్కెట్లోకి విస్తరింపచేస్తున్నట్లు తెలుస్తోంది. గద్వాల ప్రాంతానికి చెందిన కొందరు గ్రామాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, ఆస్పరి తదితర మండలాల్లో నకిలీ బిటీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం మండలం వర్షపాతం(మిల్లీమీటర్లలో) ఆస్పరి 77 ఆదోని 51.2 కౌతాళం 46.4 నందవరం 44 కోసిగి 43.4 శిరువెళ్ల 39.4 కల్లూరు 37.6 కర్నూలు 36.4 మహనంది 36.2 బండిఆత్మకూరు 34.2 సంజామల 34.2 డోన్ 32.2 చాగలమర్రి 31.2 నంద్యాల 30 -
ఖరీఫ్లో 8 లక్షల ఎకరాలకు నీరు
► పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి హరీశ్రావు ► పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్లోనే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. జూలై చివరికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజె న్సీలతో పాటు సంబంధిత ఇంజనీర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఆయన జలసౌధలో మంత్రి లక్ష్మారెడ్డితో కలసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీ క్షించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ సాగునీటి పథకాలపై సమీక్షిం చారు. కల్వకుర్తి నుంచి 3లక్షలు, బీమా నుంచి 2 లక్షలు, నెట్టెంపాడు నుంచి 1.5 లక్షలు, కోయిల్సాగర్ నుంచి 50వేల ఎకరాలకు ఈ ఖరీఫ్లో సాగునీరు అందించాల్సిందేనన్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్నారు. చెరువులు నింపాలి... ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హరీశ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాజెక్టుల నిర్వహణ విషయాలను తక్షణం సమీక్షించాలని ఇంజనీ రింగ్ అధికారులను కోరారు. పంప్ హౌస్లలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లను వెంటనే నియమించాలని అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ విజయప్రకాశ్కు సూచించారు. సకా లంలో పనులు చేయని ఏజన్సీలపై ‘60 సీ’ నిబంధన కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని గద్వాల, మహబూబ్నగర్, వనపర్తి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అలాగే ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్లను తనిఖీ చేయాలని, ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్లు తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ నెల మూడో వారంలో పాలమూరు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సమీక్షలో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సీఈ ఖగేందర్రావు, ఓఎస్డీ దేశ్పాండే, వివిద ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ కదిలేదెలా?
► వానాకాలం సీజన్ వచ్చినా రైతులకు రుణాలివ్వని బ్యాంకులు ► ఏప్రిల్ ఒకటి నుంచే రుణాలివ్వాలన్న నిబంధనకు తూట్లు ► ఇప్పటికీ రుణ ప్రణాళిక ప్రకటించని ఎస్ఎల్బీసీ ► రైతు ఖాతాల్లోకి చేరని నాలుగో విడత రుణమాఫీ సొమ్ము ► పంటల బీమా సంస్థలను ఖరారు చేయని వ్యవసాయశాఖ ► ఎప్పట్లాగే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్న రైతులు సాక్షి, హైదరాబాద్: చినుకు సవ్వడి మొదలైంది.. రైతన్న సాగు పనులకు సిద్ధమవుతున్నాడు.. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు చేతిలో పైసలుంటేనే నాగలి ముందుకు సాగేది! కానీ పెట్టుబడులే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. వారిని ఆదుకోవడంలో అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలేదు. బ్యాంకులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్కు అవసరమైన పంట రుణాలు ఇవ్వాల్సిన ఉన్నా ఇప్పటిదాకా దిక్కులేదు. అసలు రాష్ట్ర పంటల రుణ ప్రణాళికే ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే బ్యాంకుల వారీగా లక్ష్యాలు ప్రకటించాలి. కానీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు మళ్లీ ప్రైవేటు అప్పుల వైపే చూస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఇక్కట్లు గతేడాది కంటే ఈసారి ఖరీఫ్ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 2016–17లో ఖరీఫ్లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18లో 1.08 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటారని అంచనా. వీరిలో సన్న, చిన్నకారు రైతులే 50 లక్షల మంది. మధ్య తరహా రైతులు 8 లక్షల మంది ఉంటారు. వీరే అధికంగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. గత లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఈసారి ఈ సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమంది రైతులు సాగు చేస్తుంటే వారికి సకాలంలో రుణ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.3 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేసినట్లు సమాచారం. రైతు ఖాతాలకు చేరని రుణమాఫీ ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినా రైతు ఖాతాల్లోకి చేర్చడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. చివరి విడత రూ.4 వేల కోట్లు విడుదల చేయగా.. ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లోకి చేరాయి. మిగిలిన సొమ్ము రైతు ఖాతాలకు చేరలేదని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అంటూ విభజన లేకుండా లబ్ధిదారులైన రైతులందరి బ్యాంకు ఖాతాలకు సొమ్ము విడుదల చేశారు. ఈసారి అలాకాకుండా ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చాకే సొమ్ము విడుదల చేస్తామని మెలికపెట్టారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతుల సంఖ్య తేలని బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది కేంద్రం నుంచి వచ్చిన ఇన్ఫుట్ సబ్సిడీ సొమ్ములో మిగిలిన రూ. 350 కోట్లు కూడా రైతు ఖాతాల్లో జమచేయలేదు. ఖరారు కాని పంటల బీమా వచ్చే ఖరీఫ్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయశాఖ టెండర్లు పిలిచింది. మూడు క్లస్టర్లను చోల ఎంఎస్ కంపెనీ దక్కించుకోగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు ఒక్కో క్లస్టర్ చొప్పున దక్కించుకున్నాయి. కానీ వ్యవసాయ శాఖ ఈ టెండర్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు ప్రీమియం చెల్లించడానికి వీలుపడదు. మరోవైపు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని చెప్పే సర్కారు ఇప్పటివరకు యంత్రాల ధరలు ఖరారు చేయలేదు. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ధరలను ఖరారు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతీ లేదు. రుణమాఫీ పైసలు అందలేదు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకు నుంచి ఇంకా నాలుగో విడత రుణమాఫీ అందలేదు. బ్యాంకులకు వెళ్తే నిబంధనలు చెబుతున్నరు. నాలుగో విడత రుణమాఫీ పైసలు ఇవ్వాలని అడిగితే.. రుణమాఫీ మొత్తం చెల్లించి రెన్యూవల్ చేసుకుంటేనే ఇస్తమని అంటున్నరు. పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. – చిద్రాపు రమేశ్, ఖాజాపూర్ రైతు ఇబ్బందులు పడుతున్నం విత్తనాలు వేసుకునే సీజన్ వచ్చింది. ఇప్పటి వరకు బ్యాంకు రుణం అందలేదు. రుణం కోసం బ్యాంకుకు వెళితే అప్పుడూ ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలి. – రాములు, ఉదండాపూర్, జడ్చర్ల మండలం -
ఎందుకంత వివక్ష?
విజయనగరం ఫోర్ట్: కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మం డలాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయి తీ) పేరుతో ఆర్థిక సాయం అం దివ్వాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కు ఆ నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వీటిని కొన్ని జిల్లాలకు విడుదల చేసి... ఈ జిల్లాను విస్మరించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. గత ఏడాది ఖరీఫ్లో జిల్లాలోని ఆరు మండలాల్లో కరువు ఏర్పడింది. ప్రభుత్వం సైతం గంట్యాడ, విజయనగరం,మెంటాడ, దత్తిరాజేరు, కొత్తవలస, వేపాడ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో 2108.5 హెక్టార్లకు చెందిన 73.057మంది రైతులకు రూ.3.16 కోట్లు నిధులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇలా విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోగల 300కు పైగా మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇటీవల అధికశాతం మండలాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేసింది. కాని విజయనగరం జిల్లాకు మాత్రం విడుదల చేయలేదు. దీంతో రైతులు ఇదేం తీరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన విజయనగరం జిల్లాకు నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం తగదని వాపోతున్నారు. 10 నెలలుగా ఎదురు చూపులు ప్రకృతి సహకరించక ఆరు మండలాల రైతాంగం ఎంతో నష్టాన్ని చవిచూసింది. కనీసం ఆదుకోవాల్సి సర్కారు సాయం అందివ్వడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. మళ్లీ ఖరీఫ్ వచ్చేస్తోంది. రైతాంగం సాగుజూదానికి సమాయత్తమవుతోంది. గడచిన పది నెలలుగా రైతులు వాటికోసం ఎదురుచూస్తున్నా... సర్కారులో చలనం లేదు. దీనిపై వ్యవసాయ శాఖ డెప్యూటీ డైరెక్టర్ అప్పలస్వామివద్ద సాక్షి ప్రస్తావించగా జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీ ని«ధులు ఇంతవరకు విడుదల కాని మాటవాస్తవమేనని తెలిపారు. అవి రాగానే అందజేస్తామని పేర్కొన్నారు. -
వేరుశెనగకు డిమాండ్ కొంతే
– ఇప్పటి వరకు పంపిణీ 13065 క్వింటాళ్లు మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. జిల్లాలో మే 30 నుంచి వేరుశెనగ పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు పంపిణీ అయింది కేవలం 13065 క్వింటాళ్లు మాత్రమే. ఖరీప్ సీజన్ ఈ నెల1వ తేదీతో ప్రారంభమైనా ఇంత వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఖరీప్ సీజన్కు సంబంధించి రైతులకు సబ్సిడీ వేరుశెనగకు నిర్ణయించిన ధర రూ.7700. ప్రభుత్వం దళారీలకు లబ్ధి చేకూర్చేందుకే ధరను ఇలా నిర్ణయించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ కిలో వేరుశెనగ ధర రూ.77 నిర్ణయించి సబ్సిడీ 40 శాతం ఇచ్చింది. కిలోకు సబ్సిడీ రూ.30.80 ఉండగా రైతులు రూ.46.20 చెల్లించాల్సి ఉంది. మార్కెట్లో వేరుశెనగ క్వింటాం ధర రూ.4000 నుంచి రూ.4500 వరకు ఉంది. మార్కెట్ ధర కంటే సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగ ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ముందుకు రావడం లేదు. మార్క్ఫెడ్, ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్లు వేరుశెనగను సరఫరా చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు దళారీలపై ఆధారపడ్డాయి. దీంతో వేరుశెనగ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం, అందులోను వర్షాలు లేకపోవడంతో సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ లేకుండా పోయింది. జిల్లాకు వ్యవసాయశాఖ 60,600 క్వింటాళ్లు కేటాయించింది. అయితే 10 వేల క్వింటాళ్లు బఫర్లో ఉంచి మిగిలిన 50,600 క్వింటాళ్లను మండలాలకు కేటాయించారు. కర్నూలు, ఆలూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలో వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. కాగా పత్తికొండ, ఎమ్మిగనూరుల్లో వేరుశనగ పంపిణీ శనివారం నుంచి మొదలైంది. -
కొనసాగుతున్న భగభగలు!
- ఖరీఫ్ మొదలైనా తగ్గని ఉష్ణోగ్రతలు - గత ఏడాదితో పోలిస్తే 12 డిగ్రీలు అధికం - గూడూరులో అత్యధికంగా 42.53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలైనా..ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత ఏడాది జూన్ 2వ తేదీన ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకే ఉన్నాయి. అయితే ఈ నెల 2వ తేదీన అత్యధికంగా 42.53 డిగ్రీలు ఉండటం గమానార్హం. వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఖరీప్ సీజన్ మొదలయినా చినుక జాడ లేకపోవడం సర్వత్రా అందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఖరీప్ ప్రారంభంతోనే వర్షాలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీనుంచే విత్తనం పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం వేసవి కొనసాగుతుండడం అందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా అండమాన్ నికోబార్ దీవులను తాకినా.. వర్షాల జాడ మాత్రం కనిపించలేదు. మే నెలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడ్డాయి. జూన్ నెలలో ఎండల తీవ్రత తగ్గాల్సి ఉండగా యథావిధిగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంఓ సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు డిమాండ్ లేకుండా పోయింది. శుక్రవారం నాటి ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మండలం నమోదయిన ఉష్ణోగ్రతలు గూడూరు 42.53 నందికొట్కూరు 42.32 చాగలమర్రి 42.28 ఆళ్లగడ్డ 42.08 రుద్రవరం 41.93 డోన్ 41.86 -
మెరిసేనా..సేను మురిసేనా మోము!
ఖరీఫ్ చుట్టూ కష్టాలే! ► రెండు రోజుల్లో సీజన్ మొదలు ► ఇప్పటికీ జాడలేని వరుణుడు ► విత్తనానికి సిద్ధం కాని భూములు ► వరుస కరువుతో పెట్టుబడుల కోసం అవస్థలు ► మొదలు కాని పంట రుణాల పంపిణీ ► దళారీల గుప్పిట్లో బ్యాంకులు ► వేదిస్తున్న విత్తనాల కొరత కర్నూలు(అగ్రికల్చర్) : వరుస కరువు రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీస జాలి చూపని పరిస్థితి నెలకొంది. పీకల్లోతు కష్టాల్లోని అన్నదాత ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సాగు సాఫీగా సాగడం ప్రశ్నార్థకం అవుతోంది. గత ఏడాది వర్షాలు జూన్, జూలై నెలల్లో మురిపించి.. ఆ తర్వాత ఉసూరుమనిపించడంతో రైతుల ఇంట కన్నీటి వరద పారింది. ఖరీఫ్ సాధారణ సాగు 6,36,403 హెక్టార్లు కాగా.. 16,18,950 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఒకవైపు విత్తనాల కొరత, మరోవైపు పెట్టుబడుల సమస్య.. ఇంకోవైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా వరుణుడి జాడ లేకపోవడం, ఇతరత్రా సమస్యలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పాటికి భూములను ఖరీఫ్ సీజన్కు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. జూన్ నెల ప్రారంభంతో ఖరీఫ్ మొదలవుతుంది. కానీ ఇంతవరకు వానలు లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మే నెల సాధారణ వర్షపాతం 38.5 మిల్లీమీటర్లు. ఈ మేరకు వర్షాలు పడితే రైతులు వేసవి దుక్కులు చేసుకొని జూన్ నెల ప్రారంభంతోనే విత్తన పనులు మొదలు పెడతారు. అయితే ఇంతవరకు భూములను విత్తనానికి సిద్ధం చేసుకునేందుకు వీలుగా వర్షాలే పడకపోవడంతో ఖరీఫ్ గట్టెక్కేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మే నెల సాధారణ వర్షపాతం 38.5 మి.మీ., ఉండగా.. నెల ముగుస్తున్నా 26.4 మిల్లీమీటర్లకే పరిమితమైంది. అంటే సాధారణ వర్షపాతంలో 31 శాతం తక్కువ నమోదయింది. ఈ సమయానికి ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మే నెల చివరి నుంచే వర్షాలు మొదలయ్యాయి. గత ఏడాది ముందస్తు వర్షాలతో ఖరీఫ్ ప్రారంభమైనా.. ఈ సారి వర్షాలు సకాలంలో కురుస్తాయో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాలు ఇంతవరకు రాష్ట్రంలోకి ప్రవేశించక పోవడమే తొలకరి జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఖరీఫ్ మరో మూడు రోజుల్లో ప్రారంభం అవుతుండగా రైతులు ఆకాశంతో పాటు బ్యాంకుల వైపు ఆశగా చూస్తున్నారు. సమస్యగా మారిన పెట్టుబడులు వరుస కరువుతో అల్లాడుతున్న రైతులకు ఖరీఫ్లో పెట్టుబడి పెద్ద సమస్యగా మారింది. రైతులు బ్యాంకుల వైపు చూస్తున్నా ఇప్పటి వరకు పంట రుణాల పంపిణీ ప్రక్రియను చేపట్టలేదు. కొన్ని బ్యాంకులు పంపిణీని చేపట్టినా రెన్యూవల్కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. పంట రుణాల పంపిణీలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఎస్బీఐలదే ప్రధాన పాత్ర. అలాంటిది.. ఏపీజీబీలో దళారీలను ఆశ్రయిస్తే తప్ప పంట రుణాలు పొందలేని పరిస్థితి. కమీషన్ల మత్తులో బ్యాంకర్లు దళారీలను ఏర్పాటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇకపోతే పంట రుణంగా ఇచ్చిన మొత్తంలో కూడా 25 శాతం డిపాజిట్ చేసుకుంటున్నారు. కమీషన్లు, డిపాజిట్లు పోతే రైతు చేతికొస్తున్నది అంతంత మాత్రమే కావడం గమనార్హం. పొంచి ఉన్న విత్తనాల కొరత ఖరీఫ్ సీజన్కు విత్తనాల కొరత పొంచి ఉంది. ప్రధానంగా పత్తి, వరి, వేరుశనగ సాగు చేస్తారు. అయితే అంచనా సాగుకు, కేటాయించిన విత్తనాలకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరుశనగ విషయంలో అవసరమైన విత్తనంలో సగమే కేటాయించడం గమనార్హం. పత్తి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది దాదాపు 3లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉన్నా.. బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో బ్లాక్ మార్కెట్ అధికమైంది. కొత్త రుణాలు ఇవ్వట్లేదు గిట్టుబాటు ధర లేక గతేడాది సాగు చేసిన శనగ పంటనంతా ఇంట్లోనే ఉంచుకున్నా. ప్రస్తుతం పొలాల గుత్తలు కట్టేందుకు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగినాయి. బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడం లేదు. – తిప్పారెడ్డి, రైతు, కోడుమూరు -
రూ.149 లక్షలతో చంద్రన్న రైతు క్షేత్రాలు
- 122 నుంచి 93కు తగ్గిన పొలం బడులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 268 యూనిట్లలో చంద్రన్న రైతు క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రైతులకు రూ.149 లక్షల విలువైన ఇన్పుట్స్ పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్లో 10 హెక్టార్లుంటుందని, మొత్తంగా 2,680 హెక్టార్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. జీలుగ, జిప్సమ్, జింక్, బోరాన్లను రైతు అవసరాన్ని బట్టి సరఫరా చేస్తామని, ఇందుకు రూ.1700 రాయితీ ఉంటుందన్నారు. ఇవన్ని ఒకే రైతుకు ఇవ్వడం జరుగదని, ఇందులో ఏదీ అవసరమైతే దానిని ఇస్తామని తెలిపారు. జీవన ఎరువులు, విత్తన శుద్ధి మందు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ను రైతుల అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు రూ.800 రాయితీ ఉంటుందన్నారు. వేపచెక్క 120 కిలోలు, 5 లీటర్ల వేపనూనె పంపిణీ చేస్తామని, ఇందులో రూ.1000 సబ్సిడీ ఉంటుందని, మొత్తంగా హెక్టారుకు రూ.4500 విలువైన ఇన్పుట్స్ ఇస్తామని తెలిపారు. కర్నూలు, డోన్,నందికొట్కూరు, నంద్యాల, ఆలూరు సబ్ డివిజన్లలో 25, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్లలో 25, ఆదోని సబ్ డివిజన్లో 23 ప్రకారం చంద్రన్న రైతు క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తగ్గిన పొలంబడులు... ఖరీఫ్లో పొలంబడులను తగ్గించారు. గత ఏడాది ఖరీఫ్లో 122 పొలంబడులు నిర్వహించారు. ఈ ఖరీఫ్లో 93 పొలంబడులు మాత్రమే నిర్వహిస్తున్నారు. నూనెగింజల అభివృద్ధి పథకం కింద వేరుశనగలో 29, ప్రొద్దుతిరుగుడులో 5, రాష్ట్ర ప్రణాళిక కింద వరిలో 3, మొక్కజొన్నలో 16, పత్తిలో 30, పప్పు ధాన్యాల పంటల్లో 10 ప్రకారం పొలం బడులు నిర్వహిస్తారు. విత్తనం వేసింది మొదలు కోత వరకు 14 వారాల పాటు వీటిని నిర్వహిస్తారు. ఒక్కో పొలం బడిలో 35 మంది రైతులుంటారు. వీరికి ఐపీఎం కిట్స్ పంపిణీ చేస్తారు. -
30 నుంచి విత్తనాల పంపిణీ
- జేడీఏ ఉమామహేశ్వరమ్మ - ఏర్పాట్లు చేసుకోవాలని ఏడీఏ, ఏఓలకు ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సంబంధించి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ ఏడీఏ, మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేరుశనగ సహా ఇతర అన్ని రకాల విత్తనాలను బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలన్నారు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించారు. 10 వేల క్వింటాళ్లు బఫర్లో పెట్టుకొని మిగిలిన 50,600 క్వింటాళ్లను సాగు విస్తీర్ణాన్ని బట్టి మండలాలకు కేటాయించారు. రైతుకు ఉన్న భూమిని బట్టి గరిష్టంగా నాలుగు ప్యాకెట్ల వేరుశనగ( 120 కిలోలు) పంపిణీ చేస్తారు. డి- క్రిషి యాప్ 2. 1. 5 వర్షన్ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తారు. -
నగదు కోసం రైతుల తిప్పలు
► ఖాతాల్లో డబ్బు ఉన్నతీసుకోలేని ధైన్యం ► బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు ► ఏక మొత్తంలో ఇవ్వని బ్యాంకర్లు చొప్పదండి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రోజుల తరబడి పడిగాపులు కాచి అమ్ముకున్న ధాన్యం డబ్బులు ఖాతాల్లో పడుతున్న ఆ ఆనందం ఎంతో సేపు ఉండటం లేదు. బ్యాంకుల్లో తగినంత నగదు నిలువ లేకపోవడంతో రైతులకు బ్యాంకు సిబ్బంది ఏకమొత్తంలో ఇవ్వడం లేదు. నగదు తీసుకుందామని ఆశతో వచ్చిన రైతులకు రూ.ఐదు వేల నుంచి పది వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో కూడా నగదు పెట్టకపోవడంతో రైతులు బ్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. వరి కోతలకు, కూలీలకు, సరుకు రవాణాకుల కోసం చేసిన రుణాలు చెల్లించాలని రైతులు వాపోతున్నారు. చొప్పదండి మండలంలో రబీ సీజన్లో తొమ్మిది ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు అమ్మకం జరిపారు. ఖాతాలు సమర్పించిన రైతులకు ఇప్పటి వరకు సుమారు రూ.ఎనిమిది కోట్ల నగదు బదిలీ అయింది. సుమారు ఎనిమిది వందలకు పైగా రైతులు ఇప్పుడు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయడం కోసం తిప్పలు పడుతున్నారు. మరో 71 మందికి చెందిన రూ.61 లక్షలు రెండు మూడు రోజుల్లో ఖాతాల్లో జమకానున్నాయి. ఇక సివిల్ సప్లై ద్వారా 461 మంది రైతులకు రూ. 4.40 కోట్ల నగదు రైతుల ఖాతాలకు రావాల్సి ఉంది. బ్యాంకు శాఖల్లో తగినంత నగదు నిలువలు లేవని చెబుతుండటంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మెజారిటీ రైతులకు ఆన్లైన్ ఖాతాల నిర్వహణ తెలియకపోవడంతో బ్యాంకులో ఇచ్చే నగదుపైనే ఆధారపడుతున్నారు. రోజుకు కొంత నగదు ఇస్తామని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీప్ సీజన్లో పెట్టుబడులకు డబ్బు అవసరమని, బ్యాంకర్లు ఇవ్వకపోతే బయట అప్పులు చేయాల్సి వస్తొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తీర్చాలని కోరుతున్నారు. -
‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం!
నకిలీ పత్తి విత్తనాల అడ్డా కర్నూలు - బీటీ విత్తనాలపై లోపించిన నిఘా - ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచే రవాణా - ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో జోరుగా విక్రయాలు - గ్రామాల్లో కిలోల చొప్పున దందా - మౌనం వీడని వ్యవసాయ శాఖ గత ఏడాది ఏప్రిల్ నెలలో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ప్రాసెసింగ్ చేసి గ్రామాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 268 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. హొళగుంద మండలంలో గత ఏడాది మేలో వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి 148 కిలోల బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి దాదాపు రూ.కోటి విలువ చేసే బీటీ పత్తి విత్తనాలపై స్టాప్ సేల్ విధించారు. ఈ సీజన్లో మొదటిసారి ఎమ్మిగనూరులో 60 నకిలీ బీటీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. వాస్తవానికి గ్రామాల్లో ఇప్పటికే నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతున్నా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులను కలవరపరుస్తోంది. గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. నకిలీల కారణంగా మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాయ రాకపోవడంతో రైతులు పంట నష్టపోయారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో దాదాపు 5వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినడం గమనార్హం. ఈ నకిలీ వ్యాపారంలో కొందరు టీడీపీ నేతలు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్లో దాదాపు 80 శాతం గ్రామాల్లో టీడీపీ వర్గీయులు ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. అందువల్లే వ్యవసాయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత ఏడాది మొత్తం మీద పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, గులాబి రంగు పురుగు బెడద తగ్గడం.. ధరలు కూడా మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది పత్తి భారీగా సాగయ్యే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం 2.05 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కావచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం జిల్లాకు వివిధ కంపెనీలకు చెందిన 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు కేటాయించింది. అయితే ఇంతవరకు బీటీ విత్తన ప్యాకెట్లు పొజిషన్ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో నకిలీ బీటీ పత్తి విత్తనాల బెడద అధికమైంది. ఇటీవల ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తాజాగా పత్తికొండ మండలం కనకదిన్నెలో నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోనే కాకుండా.. గుంటూరు, ఒంగోలు జిల్లాలకూ ఈ నకిలీలు తరలివెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ నకిలీ విత్తనాలపై రైతులకు అనుమానం రాకుండా పేరొందిన కంపెనీలు, వాటి విత్తన రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్లో విక్రయిస్తుండటం గమనార్హం. కర్నూలు సబ్ డివిజన్తో పాటు ఆదోని డివిజన్లోని దాదాపు ప్రతి గ్రామంలో నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుని విక్రయించుకోవచ్చు. కానీ కొందరు అక్రమార్కులు పత్తి జిన్నింగ్ మిల్లుల నుంచి విత్తనాలు సేకరించి ప్రాసెసింగ్ చేసే రంగులు అద్ది, అందగా ప్యాక్ చేసి బీటీ–2 పేర్లతో మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్పోర్టు కంపెనీల ద్వారా కూడా నకిలీ బీటీ విత్తనాలు ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు సమాచారం. కొరవడిన తనిఖీలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా నకిలీ విత్తనాలపై ఇటు వ్యవసాయ శాఖ, అటు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడం లేదు. గత ఏడాది జనవరి నెల నుంచే నకిలీ బీటీ విత్తనాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈసారి తనిఖీలు కొరవడ్డాయి. నిఘా లేకపోవడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనధికార విత్తనాలు కొనొద్దు రైతులు గ్రామాల్లో విక్రయించే అనధికార విత్తనాలు కొనుగోలు చేయరాదు. లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలి. నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అనధికారికంగా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. - ఉమామహేశ్వరమ్మ, జేడీఏ -
ఈసారీ అంతే!
ఖరీఫ్లో హంద్రీ–నీవా నీరు లేనట్టే! ఫేజ్–1లోని ఆయకట్టు 1.18లక్షల ఎకరాలు గతేడాది ఖరీఫ్కు 20 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రకటన ఇప్పటికీఖరారుకాని 36వ ప్యాకేజీ టెండర్లు.. 33, 34 ప్యాకేజీల్లోనూ తూతూ మంత్రంగానే పనులు పనులు పూర్తయ్యేందుకు మరో ఏడాదికిపైగా సమయం మూడేళ్లుగా రైతులకు మాయమాటలతో కాలయాపన ప్రధాన కాలువ విస్తరణ పేరుతో ఈ ఏడాదీ ఎత్తిపోతలకు బ్రేక్! ‘హంద్రీ–నీవా మొదటి విడతలోని ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్కు నీరిస్తాం’’ - 2014 నుంచి సీఎంతో సహా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమతో పాటు జిల్లా మంత్రులు కూడా మూడేళ్లుగా ప్రకటనలతో ఊరిస్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం చేతులెత్తేశారు. హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం చెరువులకు నీరు నింపి చేతులు దులుపుకునేలా వ్యవహరిస్తోందని మొదటి నుంచి విపక్షాలన్నీ ఘాటుగా విమర్శిస్తున్నాయి. రైతులు తమ మాటను విశ్వసించడం లేదని గ్రహించిన మంత్రులు గతేడాది ఆరంభంలో హంద్రీ–నీవా సీఈ జలంధర్, ఎస్ఈ సుధాకర్బాబుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ప్రకటన చేయించారు. 33, 34 ప్యాకేజీల పరిధిలో 2016 ఆగస్టులో 20వేలు, డిసెంబర్లోగా మరో 20వేల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. 2017 మార్చికి మొదటివిడత పరిధిలో 1.18లక్షల ఎకరాలకు పూర్తిగా సాగునీరు అందిస్తామని ప్రకటించారు. ఇదీ పరిస్థితి.. మొదటి విడతలో 30 –36 ప్యాకేజీలు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇందులో 33వ ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీలో 17,300, 36వ ప్యాకేజిలో 80,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో గతేడాది 33, 34 ప్యాకేజీలలో డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించారు. వజ్రకరూరు మండలం చాబాల, ధర్మపురిలో జరుగుతున్న ఈ పనులు తూతూమంత్రంగా చేశారు. ప్రస్తుతం ఈ పనులను అర్థంతరంగా నిలిపేశారు. 34వ ప్యాకేజీలో ఇప్పటికీ భూసేకరణ జరగాల్సి ఉంది. గతేడాది ఖరీఫ్కు నీరిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ పనులు పూర్తి చేసేందుకు 2017 జూన్ వరకూ అగ్రిమెంట్ను పొడిగించారు. ఈ లెక్కన గతేడాది పనులు పూర్తికావు, నీళ్లివ్వలేమని అధికారులకే తెలుసు! కానీ వారు కూడా సత్యదూరమైన ప్రకటనలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం వచ్చే నెలకు పనులు పూర్తికావాలి. వాస్తవానికి మరో ఏడాది వరకు పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. 36వ ప్యాకేజీలోనూ అసత్య ప్రకటనలే.. 2017 మార్చిలోపు 36వ ప్యాకేజీ పరిధిలోని ఆయకట్టుకు కూడా నీరందిస్తామని సీఈ, ఎస్ఈ గతేడాది ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టు ఉంది. రూ.93.92కోట్లతో ఈ పనులను ఓం – రే (జాయింట్ వెంచర్) చేసేది. కానీ ఈ టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయం భారీగా పెంచి కొత్తగా రూ.336.15 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది చివరి త్రైమాసికంలో జీఓ విడుదల చేసింది. ఈ పనులకు టెండర్లు ఖరారై పనులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు పడుతుంది. కానీ ఈ మార్చికే నీళ్లిస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. ఈ ప్యాకేజీ పరిధిలో 805.62 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంటే 202.34 ఎకరాలు ఇంకా రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. పాలకుల నిర్లక్ష్యం...ఆయకట్టు రైతులకు శాపం హంద్రీ–నీవా మొదటి విడత ప్రధాన కాలువ పనులు 2012లోనే పూర్తయ్యాయి. అప్పటి నుంచి జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికే మొదటి విడత పనులు పూర్తయ్యాయి. కేవలం డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తిచేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వొచ్చు. నీరు పొలాలకు పారి ఉంటే ఓమోస్తారుగా కరువు తీరేది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో కొందరైనా బతికేవారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కేవలం చెరువులకు నింపి చేతులు దులుపుకుంటోంది. కనీసం చెరువుల కింద ఆయకట్టుకు కూడా ఇవ్వడం లేదు. హంద్రీ–నీవాపై విపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా మనసు మారలేదు. ఈ ఏడాది నీటి ఎత్తిపోతల లేనట్లే !! హంద్రీ–నీవా ద్వారా గతేడాది 28 టీఎంసీలు జిల్లాకు చేరాయి. ఈ ఏడాది 30 టీఎంసీల దాకా తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రధాన కాలువ విస్తరణ పేరుతో నీటి ఎత్తిపోతలు నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఏడాది కృష్ణాజలాలు ‘అనంత’లో కన్పించవు. గతేడాది ఖరీఫ్కే కనీసం 20 వేల ఎకరాలకు నీరిస్తామన్న అధికారులు ఈ ఏడాది కూడా ఇవ్వలేరు. -
ఊపందుకున్న వ్యవసాయ పనులు
– జిల్లాలో తేలికపాటి వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భూములను ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు రోజుల కిత్రం ఆదోని, హొళగొంద, హాలహర్వి, పెద్దకడుబూరు తదితర మండలాల్లో వర్షాలు పడటం వల్ల వల్ల వేసవి దుక్కులు ప్రారంభించారు. తాజాగా గోనెగండ్ల, వెల్దుర్తి, గూడూరు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గొనెగండ్లలో 26.4 మిమీ, వెల్దుర్తిలో 21.2, గూడూరులో 14.0, సి.బెలగల్లో 10.0మిమీ, క్రిష్ణగిరిలో 10.0 మి.మీ వర్షఽం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఖరీప్ విత్తనం పనులు కూడా ముందస్తుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేలో సాధారణ వర్షపాతం 38.5 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 17.1 మి.మీ., నమోదైంది. -
తొలకరి ఆశలతో సాగుకు సన్నద్ధం
►ఈసారీ అడపాదడపా చినుకులు ►అన్నదాతలో మొలకెత్తిన ఉత్సాహం ►వెంటాడుతున్న విత్తన కొరత ►వేరుశనగ రైతాంగం ఆందోళన దశాబ్దకాలంగా ఏటా నష్టాలు చవిచూస్తున్న జిల్లాలోని వేరుశనగ రైతులు ఈ ఏడాది ఖరీఫ్పై ఆశలు పెంచుకుంటున్నారు. అయితే తొలకరి జల్లుగా పలకరించి.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తుండడంతో సాగుపై సందిగ్ధత నెలకొంది. గతేడాది ప్రభుత్వం రెయిన్గన్లతో పంటలను రక్షిస్తామంటూ ఊదరగొట్టినా చివరికి ఫలితం మా త్రం తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. అయితే ప్రస్తుతం ఊరిస్తున్న కారుమబ్బులతో ఈ ఏడాది పంటకు పెట్టుబడి, విత్తనాల కోసం రైతులు వెతుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వం మాత్రం సగం పంటకు సరిపోయే విత్తనాలను మాత్రమే సబ్సిడీపై అందించనుంది. చిత్తూరు (అగ్రికల్చర్): ఏటా ఖరీఫ్ సీజనులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జిల్లాలోని రైతులు పంట నష్టపోతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో వేరుశనగ పంటసాగుకు పూనుకుంటు న్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే తొలకరి పలకరించడంతో ఎంతో ఉత్సాహంగా వేరుశనగను సాగుచేయడం, ఆఖరికి నష్టాలను చవిచూడడం పరిపాటైపోయింది. అదే తరహాలోనే గత రెండు వారాలుగా జిల్లాలో అడపాదడపా తొలకరి చినుకులు పలకరిస్తున్నాయి. నిత్యం కారుమబ్బులతో వరుణుడు దోబూచులాడుతుండడంతో రైతుల్లో సాగుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని రైతులు ఏటా ఖరీఫ్ సీజన్లో వర్షాధార వేరుశనగను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తారు. అత్యధికంగా పడమటి మండలాల రైతులు ఈ పంటను సాగుచేయడం పరిపాటి. తూర్పున 15 మండలాలు మినహా మిగిలిన 51 మండలాల్లో 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశనగ పండిస్తారు. సకాలంలో వర్షాలు కురిస్తే జూన్ 7 నుంచి ప్రారంభమయ్యే మృగశిర కార్తె, జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే ఆరుద్రకార్తెలో వేరుశనగను విత్తడం పూర్తి చేస్తారు. ఈ సమయంలో విత్తిన పంటల నుంచి దిగుబడి ఆశించిన మేరకు రావడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగానే ఈ ఖరీఫ్కు గాను గత పదిరోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో వేరుశనగ పంట సాగుపై ఆశలు చిగురించాయి. గతఏడాది తీవ్ర నష్టం 2015 నవంబరులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని రైతులు రబీ సీజనులో పంటలను ఎంతో ఉత్సాహంగా సాగు చేశారు. తరువాత 2016 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో వేరుశనగ పంటను జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 1.21 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అయితే ఆగస్టు మొదటి వారం నుంచి పూర్తిగా వరుణుడు కనుమరుగయ్యాడు. తీవ్ర వర్షాభావం ఏర్పడడంతో రైతులు విత్తిన వేరుశనగ గింజలు నేలపాలయ్యేయే గానీ, పంట చేతికందలేదు. ఫలితంగా జల్లా రైతులకు ఈ ఖరీఫ్కు విత్తేందుకు అవసరమైన విత్తన కాయలు కూడా లేకుండా పోయాయి. విత్తనాల కోసం అన్వేషణ ప్రారంభం ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తన కాయల కోసం రైతులు అన్వేషణ ప్రారంభించారు. హెక్టారు విస్తీర్ణంలో విత్తేందుకు గాను 150 కిలోల వేరుశనగ కాయలు అవసరం. జిల్లాలో మొత్తం 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో విత్తేందుకు గాను దాదాపు 2.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు అవసరం ఉంది. ఏటా ప్రభుత్వం సబ్సిడీపై అందించే వేరుశనగ కాయలుతో పాటు రైతులు తమ వద్ద ఉండే కాయలను కూడా కలుపుకుని విత్తేవారు. అయితే గత ఏడాది ఏమాత్రం పంట చేతికందని కారణంగా రైతులకు విత్తన కాయలు కూడా చేతికందలేదు. ప్రభుత్వం మాత్రం ఈ ఖరీఫ్కు జిల్లాకు 84,500 కింటాళ్ల వేరుశనగ కాయలు మాత్రమే కేటాయించింది. దీంతో రైతులు విత్తన కాయలు కోసం వెదుకులాట ప్రారంభించారు. భారీగా విత్తన కాయల ధరలు.. రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటూ, కిలో కాయలు రూ. 50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ విత్తేందుకు గాను కాయలకే రూ. 3 వేల నుంచి రూ. 3,600 వరకు వెచ్చించాల్సి ఉంది. దీనికితోడు దుక్కులు దున్నేందుకు గాను ట్రాక్టర్కు గంటకు రూ. 600 నుంచి రూ. 800 వరకు Ðð చ్చించాలి. అదేగాక జిప్సం, కూలీలు తదితరాలు కలిపి ఖర్చులు మోపెడవుతున్నాయి. ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి పంట సాగు చేసినా ఆశించిన మేరకు దిగుబడి అందుతుందనే నమ్మకం రైతుల్లో ఏమాత్రం లేదు. అధిక మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి రావడంతో ఈ ఖరీఫ్కు వేరుశనగ సాగయ్యేనా..? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అదుకోవాలి వేరుశనగ సాగు చేయాలంటే పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టాలి. గతేడాది తీవ్ర నష్టం వాటిళ్లడం వల్ల ప్రస్తుతం రైతుల వద్ద విత్తనకాయలు లేవు. దీనికితోడు ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేరుశనగ రైతులను ఆదుకోవాలి. సబ్సిడీ కాయలు రైతులకు కావలసిన మేరకు అందించాలి. -
విత్తనాలు బ్లాక్లో అమ్మితే చర్యలు తప్పవు
– జేడీఏ ఉమామహేశ్వరమ్మ కర్నూలు(అగ్రికల్చర్): మిరప, బీటీ పత్తి విత్తనాలను బ్లాక్లో అమ్మితే చర్యలు తప్పవని జేడీఏ ఉమామహేశ్వరమ్మ సీడ్ కంపెనీల ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం తన చాంబరులో సీడ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జేడీఏ మాట్లాడుతూ ఖరీప్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మిరప, పత్తి విత్తనాల అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. ప్రతి కంపెనీ మిరపలో దేశవాలీ, హైబ్రిడ్ విత్తన రకం వారిగా ఏఏ పంపిణీ దారుకు ఎంత క్వాంటిటీ విత్తనాలు సరఫరా చేశారనే వివరాలు తక్షణం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బ్లాక్లో అధిక ధరలకు మిరప, పత్తి విత్తనాలను విక్రయించారని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు బీటీ పత్తి విత్తనాలు 10.15 లక్షల ప్యాకెట్లను ప్రభుత్వం కేటాయించిందని, ఇందులో అత్యధికంగా కావేరి, నూజివీడు కంపెనీలే సరఫరా చేయాల్సి ఉందని ఈ మేరకు విత్తన ప్యాకెట్లను పొజిషన్ చేయాలని ఆదేశించారు. బ్లాక్లో విత్తనాలు అమ్మకుండా నిఘా పెంచినట్లు తెలిపారు. నర్సరీలను ఉద్యాన శాఖ అధికారులు రిజిష్టర్ చేయాలని ఏడీలకు సూచించారు. నర్సరీలపై నిఘా లేకపోతే వాటికి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై స్పష్టత ఉండదన్నారు. నారు పెంచి అమ్ముకునే అన్ని నర్సరీలకు వెంటనే లైసెన్స్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి, ఏఓ శారద, ఉద్యానశాఖ ఏడీలు రఘునాథరెడ్డి, సతీష్ పాల్గొన్నారు. -
గతంలో వలే కాకూడదు !
⇒‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ⇒పకడ్బందీగా నిర్వహణకు ప్రభుత్వం ఆదేశం ⇒పర్యవేక్షణకు జిల్లాకు కన్సల్టెంట్ నియామకం ⇒అనుబంధశాఖల ఉద్యోగులతో సమావేశం ⇒ప్రణాళికలు సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖ సుభాష్నగర్ (నిజామాబాద్ అర్బన్) : రాబోయే ఖరీఫ్కు అన్నదాతలను సమాయత్తం చేయడానికి వ్యవసాయశాఖ నడుం బిగించింది. నూతన యాజ మాన్య పద్ధతులు, శాస్త్రసాంకేతికను జోడించి రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కార్యక్రమాన్ని ఈనెల 5 నుంచి 16వ వరకూ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్ర ణాళికలు రూపొందిం చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తియేటా నిర్వహిస్తున్నప్పటికీ అనుకున్నంత సత్ఫలి తా లు రాలేదు. అందుకు గల కారణాలు, వైఫల్యాలు, లోపాలను అధిగమించి ఈ యేడాది పకడ్బందీగా ని ర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇ ప్పటికే వ్యవసాయ, అనుబంధశాఖల అ ధికారులను ఆదేశించారు. ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ను రైతులు అధిక సంఖ్య లో వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. పకడ్బందీగా.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సు మారు 4.30 లక్షల మంది రైతులు ఉన్నా రు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు చైతన్య సదస్సు’ల పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ నిర్వహిస్తోంది. అయినప్పటికీ సత్ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. రాష్ట్రంలో సాగును యజ్ఞం లా చేపట్టాలని కేసీఆర్ పిలుపుతో ఈయేడాది నిర్వహించే ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ నకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో వలే సదస్సులను తూతూమంత్రంగా కాకుండా పకడ్బం దీగా నిర్వహించేలా ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి రోజు రెండు నుంచి మూడు గ్రామాల్లో సదస్సులు నిర్వహించేలా ప్లాన్ రూపొం దించారు. ఉదయం 7.30 గంటల నుంచే అధికారులు గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్ధేశం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనరేట్లో కన్సల్టెంట్గా ఉన్న రిటైర్డ్ వ్యవసాయ అధికారి నజీముద్దీన్ను కేటాయించింది. శనివారం ఆయ న ప్రగతిభవన్లో వ్యవసాయం, దాని అనుబంధశాఖల అధికారులతో ఇప్పటి కే సమావేశం నిర్వహించారు. కార్యక్ర మ ం విజయవంతం చేయడానికి చేయాల్సి న ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారు ల సమన్వయం, రైతువారీగా సేకరించాల్సి న సమాచారం, క్రాప్కాలనీల ఏర్పా టు, తదితర అంశాల గురించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్న తరుణంలో కార్యక్రమ ఉద్దేశం, గ్రామా ల్లో ని ర్వహించే సదస్సులకు హాజ రుకావాల్సినఅధికారుల బృందం,చర్చించాల్సిన , తదితర అంశాల గురించి వివరిం చారు . ఆయన ఈ కార్యక్రమం ముగిసేవరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. సదస్సులో పాల్గొనే అధికారులు.. జిల్లాలో ఈనెల 5 నుంచి 16 వరకు నిర్వహించే ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ కార్యక్రమానికి వ్యవసాయం, అనుబంధశాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు మండలంలో వివిధశాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడ్డారు. బృందానికి మం డల వ్యవసాయాధికారి కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. సదస్సుకు మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల పశువైద్యాధికారి, హార్టికల్చర్, మత్య్సశాఖ, మార్కెటింగ్, సోషల్ ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్పంచి, ఏఈఓలు, తదితర శా ఖల అధికారులు తప్పనిసరిగా హాజ రుకావాలి. సదస్సులు జరిగినన్ని రోజులు పైన పేర్కొన్న అధికారులు పాల్గొని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించాలి. రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సి ఉం టుంది. సదస్సులకు హాజరుకాని వారి వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్, సం బంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. -
నల్ల మట్టికి భళే డిమాండ్
పంటపొలాల్లో వేయిస్తున్న రైతులు భూసారం పెంపునకు దోహదం మోర్తాడ్ (బాల్కొండ) : జొన్నకోతలు పూర్తయ్యాయి. ఆ భూముల్లో ఖరీఫ్లో పసుపు విత్తేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నడం పూర్తిగా, ఆయా భూముల్లో భూసారం పెంచేందుకు నల్లమట్టి వేస్తున్నారు. దీంతో నల్లమట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. రబీలో సాగు చేసిన ఎర్రజొన్న, మొక్కజొన్న కోతలు పూర్తి కావడంతో రైతులు ఆయా భూముల్లో నల్లమట్టి వేయిస్తున్నారు. వాణిజ్య పంటలను ఎక్కువగా పండించే మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్పల్లి, ధర్పల్లి మండలాల్లోని రైతులు భూసారం పెంపుపై దృష్టి సారించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వద్ద సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పంట పొలాల్లో నల్లమట్టి సమృద్ధిగా లభిస్తోంది. పంట పొలాలను కోల్పోతున్న రైతులు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఇదే మార్గం అని భావించి నల్లమట్టిని విక్రయిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నల్లమట్టిని నింపి, అవసరం ఉన్న రైతులకు విక్రయిస్తున్నారు. నిర్మల్ ప్రాంతంతో పాటు భీమ్గల్ మండలంలోని బెజ్జోరా చెరువులోనూ నాణ్యమైన నల్లమట్టి లభిస్తుంది. ఇక్కడి గ్రామాభివృద్ధి కమిటీ నల్లమట్టి విక్రయానికి టెండర్ నిర్వహించి, ఓ కాంట్రాక్టర్కు అప్పగించింది. లారీ నల్లమట్టికి రూ.5 వేల నుంచి రూ.6 వేలు, ట్రాక్టర్ అయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పంట పొలాల దూర భారాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలో మార్పు చేస్తున్నారు. సాధారణంగా మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణలో భాగంగా నల్లమట్టిని ఉచితంగా తరలించుకునే వీలుంది. అయితే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చాలా చెరువుల్లో నీరు బాగా నిండింది. దీంతో చాలా చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో నల్లమట్టి తీసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తమ పొలాలకు నల్ల మట్టి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పడిపోతున్న తరుణంలో, త్వరలోనే అక్కడి నుంచి కూడా నల్లమట్టి తరలించే అవకాశం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. నల్లమట్టితో భూసారం అభివృద్ధి చెంది పంటల దిగుబడి బాగా వస్తుందని, అందుకే రూ.వేలు వెచ్చి కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. -
కొనబొతే కొరివి..!
– సామాన్యులకు అందని సన్నబియ్యం – ఆరుమాసాల్లో క్వింటాపై రూ.1000 పెరుగుదల – అధిక దిగుబడులు వచ్చినా తగ్గని ధరలు నంద్యాల అర్బన్: గత ఖరీఫ్ వరిలో ఎకరాకు 45నుంచి 50బస్తాల దిగుబడులు వచ్చినా సన్న బియ్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. బియ్యం ధరల పెరుగుదలతో సన్న బియ్యం పండుగ పూటలకే సరిమితమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల డివిజన్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మహానంది మండలం బుక్కాపురం గ్రామ రైతు పన్నాగి రమణయ్య వరి సాగులో హెక్టార్కు 11,062.5కిలోల దిగుబడి సాధించి రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు రూ.15వేల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. అయితే ఆశించిన దిగుబడులు రావడమే తరువాయి రైతులు పొలాల్లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. డిసెంబర్ చివర, జనవరి మొదటి వారాల్లో ఖరీఫ్ దిగుబడులు అయిన కర్నూలుసోనా రకం 78కేజీల వడ్ల బస్తా రూ.1250 నుంచి రూ.1300తో అమ్మకాలు జరిగాయి. అప్పట్లో మొదటి రకం బియ్యం క్వింటా రూ.2750, రెండో రకం రూ.2650 ఉండేది. ఫిబ్రవరిలో మొదటి రకం రూ.3300, రెండో రకం రూ.3200, మార్చి నెలలో క్వింటా మీద రూ.450 పెరిగి మొదటి రకం రూ.3750తో అమ్మకాలు జరుగుతున్నాయి. నంద్యాల సోనా రకానికి మరింత డిమాండ్ ఉంది. డిసెంబర్లో క్వింటా రూ.4100 ఉండగా, ప్రస్తుతం రూ.4400కు చేరింది. ప్రస్తుతం కర్నూలు సోనా రకం వడ్లు రూ.1900లకు చేరింది. మొదట్లో పంట దిగుబడులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే అమ్ముకొని తీవ్ర నష్టాలకు గురయ్యారు. దళారుల మాటలు నమ్మి మరికొంత మంది రైతులు మోసపోయారు. రైతుల పంట దిగుబడుల అమ్మకాలతో మిల్లర్లు, దళారులు లక్షలాదిరూపాయలు ఆర్జించారు. వారానికి ఒకసారి పెరుగుతున్న బియ్యం ధరలతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సన్నబియ్యం కొనలేని పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ధరలు పెరుగుతున్నాయంటూ.. జూన్ నాటికి క్వింటా బియ్యం రూ.6వేలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు వినియోగదారులను అయోమయాలకు గురి చేస్తున్నారు. ఆరుమాసాల క్రితం పాతబియ్యం క్వింటా రూ.3500 నుంచి రూ.3700 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4300 నుంచి రూ.4700కు చేరింది. ఆరునెలల్లోనే రూ.1000 పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మన రాష్ట్రంలో పండించిన వరిపంటలు ఇతర రాష్ట్రాలకు తరలించడం, గోదాముల్లో అక్రమ నిల్వలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దుకాణాదారులది అదే తీరు.. బియ్యం ధరల పెరుగుదలను అదునుగా తీసుకొని మార్కెట్లో వాటిని విక్రయించే కొందరు వ్యాపారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తక్కువ క్వాలిటీ రకాలను తెచ్చి ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పౌరసరఫరాల శాఖ నిబంధనలకు విరుద్ధంగా రైస్మిల్లుల్లో భారీగా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నంద్యాలలో బియ్యం నిల్వలు చేస్తున్న రైస్ మిల్లులు, గోదాములపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ బియ్యం కేజీ రూ.15 పైమాటే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రూపాయకే కిలో బియ్యం కాస్త సాధారణ రిటైల్ దుకాణాల్లో కేజీ రూ.15 నుంచి రూ.18 వరకు విక్రయిస్తున్నారు. కొందరు లబ్ధిదారులతో పాటు రేషన్ దుకాణాల ద్వారా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్న బియ్యం తిరిగి దుకాణాలు, రైస్ మిల్లులకు నేరుగా చేరుతున్నాయి. నిరుపేదలు తమకు వచ్చిన బియ్యంతో పాటు అదనంగా బియ్యం కొనుగోలు చేయాల్సి ఉంటే దుకాణాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుంది. మామూలు రకం బియ్యం ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. బియ్యం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. బియ్యం కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్న వ్యాపారుల పట్ల విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బియ్యం ధరలు అనుకూలంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రేషన్ బియ్యమే తినాల్సి వస్తుంది: జయరాజు, భీమవరం పెరుగుతున్న ధరలతో సన్నబియ్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉంటున్నాయి. రేషన్ బియ్యంతో కాలం గడుపుకోవాల్సి వస్తుంది. రెండుమూడు నెలలకు ఒకసారి ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. సన్నబియ్యం పండుగలకే పరిమితమయ్యే పరిస్థితులు దాపురించేలా ఉంది. -
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిద్దాం
- అదనపు క్లస్టర్లను గుర్తించండి - రాయలసీమ కన్సల్టెంటు సుబ్బారావు సూచన కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఖరీప్ సీజన్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయం రాయలసీమ జిల్లాల కన్సల్టెంటు సుబ్బారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో సీఏలు, సీఆర్పీలు, ఆత్మ బీటీఎం, ఏటీఎంలతో ఆయన సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ముందుగా వేసవిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి దుక్కులను ప్రోత్సహించాలని, ఇందువల్ల పంటలకు హాని చేసే పురుగులను చాలావరకు నివారించుకోవచ్చన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఇందువల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుందన్నారు. ఖరీప్ సీజన్లో గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ఇంత వరకు జిల్లాలో 11 క్లస్టర్లలోనే ఈ వ్యవసాయాన్ని చేపడుతున్నామని, వచ్చే ఖరీప్లో మరిన్ని క్లస్టర్లలో చేపట్టాలని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నందునా పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, పండిన పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కారణంగా వ్యవసాయ దిగుబడులకు మార్కెట్లో ఆశించిన ధరలు లభించడం లేదని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు తావులేదని, కేవలం ద్రవ,ఘన జీవామృతాలు, కషాయాలతో పంటలు పండించడం జరుగుతోందని తెలిపారు. సమావేశంలో ఆత్మపీడీ రవికుమార్, డీడీఏలు మల్లికార్చునరావు, గణపతి, డీపీఎం నాగరాజు, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్లోగా మధ్యతరహా ప్రాజెక్టులు
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల పథకాలన్నీ వచ్చే ఖరీఫ్లోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్రావు అధి కా రులను ఆదేశించారు. ఈ పథకాలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ధపాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ వేసవిలోగా కాలువల పూడిక తొలగింపు, ‘అటవీ’క్లియరెన్స్ తదితర కార్యక్రమాలు పూర్తిచేస్తేనే ఖరీఫ్లో రైతులకు సాగునీరం దించగలమని తెలిపారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకా లను పూర్తిస్థాయి అంచనాలు రూపొందించి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింది నిధుల కోసం ప్రతిపాదనలు పంపాల న్నారు. జిల్లాల వారీగా పెండింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షిం చారు. అలాగే జిల్లాల వారీగా మైనర్ ఇరిగే షన్ కింద ఖరీఫ్, రబీలో జరుగుతున్న ఆయ కట్టు వివరాలను సమీక్షించారు. ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ కింద పెరి గిన, అదనపు ఆయ కట్టును కచ్చితంగా నమోదు చేయాలని.. ఆ మేరకు తనకు నివే దికలు ఇవ్వాలన్నారు. ఇదివరకే పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వాస్తవంగా జరగవలసిన ఆయకట్టులో ’గ్యాప్’ ఆయకట్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై పదిరోజులకోసారి మిషన్ కాకతీయ మీడియా కాన్ఫరెన్స్ జరుగుతుందని తెలి పారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలు వల పరిస్థితిపై రెండు, మూడు రోజులలో సమీక్షిస్తానని, సింగూరు కాల్వల వెంట క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్సీ విజయప్రకాశ్, సీఈలు సునీల్, అనిల్, లింగరాజు, నాగేందర్ రావు, సురేశ్ కుమార్, బంగారయ్య, శంకర్నాయక్, శంక ర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే పాల్గొన్నారు.