prostitution
-
రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్బెంగాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్్కఫోర్స్కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. -
Gachibowli: విదేశీ యువతులతో వ్యభిచారం
గచ్చిబౌలి: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. మంగళవారం రాత్రి టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఒక విటుడు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. టాంజానియా, కజికిస్తాన్కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నైజీరియన్ యువతులతో వ్యభిచారం...
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్ ఎదురుగా ఉన్న మంగమాల్ నగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ అరుల్ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్ మహిళలను మైలాపూర్లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: వీధుల్లో వ్యభిచారం!
మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో బస్టాప్లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్టీయూ, షీ టీమ్స్తో పాటు కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీసులతో బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 7 మంది ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు. బుధవారం రాత్రి భాగ్యనగర్ బస్టాప్, కూకట్పల్లి, కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం–1956 కింద కూకట్పల్లిలో మూడు, కేపీహెచ్బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్స్లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం టెక్సాస్లోని డెంట¯న్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగువారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటి ఉన్నారు. వీరిలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్ను అరెస్ట్ చేశామని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్, అమిత్కుమార్, పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడంతోపాటు 18 ఏళ్లలోపు మైనర్ను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జైకిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణలపై రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్ఠలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో ఇద్దరి వద్ద అక్రమ ఆయుధాలు సైతం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలున్న ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, పట్టుబడిన తెలుగు యువకులు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కో–ఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
నా కుమార్తెను వ్యభిచారంలోకి దించేందుకు నా ఫ్రెండ్ ప్రయత్నిస్తోంది
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్లు!
మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్లను లీజ్కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందా.. ఫాంహౌస్లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిఘా వైఫల్యం! ఫాంహౌస్ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్లపై జరుగుతున్న దాడులు ఎస్ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం. వరుస ఘటనలు... మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్లో ఉన్న రాజు ఫాంహౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. -
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం ఇద్దరు అరెస్ట్
కర్ణాటక: ఆంధ్రాకు చెందిన సినీ సహాయ నటీమణులను తీసుకువచ్చి చైన్నె వేలచ్చేరిలోని నివాస ప్రాంతంలో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. చైన్నె వేలచ్చేరి కరుమారియమ్మ నగర్ గోల్డెన్ అవెన్యూ ప్రధాన రోడ్డులో ఉన్న నివాస ప్రాంతంలోని ఒక భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వ్యభిచార నిరోధకపు విభాగం సహాయ కమిషనర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సెల్వరాణి నేతృత్వంలో పోలీసులు గురువారం అర్ధరాత్రి నిఘా చేశారు. ఆ సమయంలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి వ్యభిచారం నడుపుతున్న బ్రోకర్లు తిరునల్వేలి జిల్లాకు చెందిన సుమియోన్ జార్జ్ (26), కాంచీపురానికి చెందిన కాళిదాసు (28)ను అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మొదట్లో భూకబ్జాలు..సెటిల్మెంట్లు ఆపై మోసాలు...బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: మొదట్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేశాడు.. అవి సెట్ కాలేదు...దీంతో ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తి సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు.. చివరకు వ్యభిచారదందా కూడా నిర్వహించాడు.. మోసాలు, బెదిరింపులకు లెక్కేలేదు. మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్పార్టీ నిర్వహిస్తూ గురువారం తెలంగాణస్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ఫిల్మ్ ఫైనాన్షియర్ కారుమూరి వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకటరమణారెడ్డి ఘనచరిత్ర ఇది. ఇతడితోసహా చిక్కిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన గుడిమల్కాపూర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన వెంకటరత్నారెడ్డి డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. చేసేందుకు ఏ ఉద్యోగమూ దొర కలేదు. దీంతో బతుకుతెరు వుకు స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి దిగాడు. అందులోనూ నష్టాలు రావడంతో మోసాలు చేసి డబ్బు దండుకోవాలని పథకం వేశాడు. నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి.. నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారం ఎత్తిన వెంకటరత్నారెడ్డి ఆ పేరుతో సినీ నిర్మాతలు సి.కల్యాణ్, రమేష్ల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. తిరుమలలో దర్శనానికి కేవీ.రత్నారెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా తనతో సహా 9 మందికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసి చిక్కాడు. ఓ ఐఆర్ఎస్ అధికారిణిని వివాహం చేసుకొని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై మహిళలను టార్గెట్ చేసి.. ఎన్నారై మహిళలను టార్గెట్గా చేసుకుని, తానూ ఎన్నారైనే అంటూ నమ్మబలికి పెళ్లి పేరుతో మోసాలకు తెరలేపాడు. భర్త నుంచి విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన ఓ మహిళ భారత్మాట్రిమోనీలో ఇతగాడి ప్రొఫైల్ చూసి వివాహమాడింది. ఆమెతో పాటు అమెరికా వెళ్లిన వెంకట్ కేవలం 20 రోజులే కాపురం చేశాడు. ఆపై అత్యవసర పని ఉందని, ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇక్కడకు వచ్చాడు. ఆ తర్వాత పత్తా లేకపోవడంతో ప్రొఫైల్ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన బాధితురాలి మేనమామ అతడికి నేరచరిత్ర ఉందని, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. మరో ముగ్గురు ఎన్నారై మహిళలకు ఇతగాడు ఎర వేసినట్టు అప్పట్లో తేలింది. వెంకట్పై జూబ్లీహిల్స్ పరిధిలో వ్యభిచార కేసు కూడా ఉంది. విదేశీ మద్యం అక్రమఅమ్మకం, తాను గుంటూరు ఎస్పీ గన్మెన్ అని చెప్పి మోసం చేయడం, దొంగ పాస్పోర్టు పొందడం సహా ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోని వివిధ ఠాణాల్లో 25 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని రాజీ కాగా, మరికొన్ని వీగిపోయాయి. 10 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 18 మంది కోసం వేట ముమ్మరం వెంకట్తోపాటు అరెస్టు అయిన బాలాజీ కాల్డేటాను పరిశీలించిన టీఎస్–నాబ్ అధికారులు 18 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. విశాఖకు చెందిన రామ్తో పాటు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమ్మోది చికూడి ముగుముల్, ఇగ్వారే, థామస్ అన్హాల నుంచి వీరు డ్రగ్స్ ఖరీదు చేస్తున్నట్టు నిర్ధారించి గాలిస్తున్నారు. వీరి కస్టమర్లు రామ్చంద్, అర్జున్, రవి ఉప్పలపా టి, సుశాంత్రెడ్డి, ఇంద్రతేజ, కల్హర్రెడ్డి, సురే ష్, రామ్కుమార్, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్, ఇటాచి, మహ్మద్అ జామ్, అమ్జద్ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వెంకట్ దగ్గర డ్రగ్స్ కొన్నవారిలో నటులు, ప్రముఖులున్నట్టు అనుమానిస్తున్న అధికారులు ఆరా తీస్తున్నా రు. గతంలో ఇతగాడు ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి నగరంలో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించేవాడు. కొన్నాళ్లుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. -
స్పా ముసుగులో వ్యభిచారం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్పై భవానీపురం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్చేసి, 11 మంది యువతులను హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం బైపాస్ రోడ్డు దియాస్ బార్ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీవిద్య తనిష్క బ్యూటీ వరల్డ్ అండ్ స్పా నిర్వహిస్తోంది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్పై పోలీసులు దాడిచేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు. స్పా సెంటర్ నిర్వాహకురాలు శ్రీవిద్య, ఆమె భర్త సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి నట్లు సీఐ సలాం తెలిపారు. 11 మంది యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం హోంకు తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
Hyderabad: మసాజ్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు సెలూన్పై దాడులు చేశారు. ప్రకాశ్ అనే వ్యక్తి.. ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పది మంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెలూన్ను సీజ్ చేశారు. -
వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని
హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్కాట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. గుట్కా, కారు సీజ్ హోసూరు: కర్ణాటక నుంచి కరూర్కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్కాట్ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. సిఫ్కాట్ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్ (28) అనే డ్రైవర్ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు. చదవండి హైదరాబాద్: మీర్పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి.. -
HYD: వ్యవభిచార కూపాలుగా స్పా సెంటర్లు!
క్రైమ్: వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్ల గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వెస్ట్ జోన్ పరిధిలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో పలు మసాజ్ సెంటర్లు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్ పార్లర్ల మీద దాడులు చేసి.. 34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం మీద దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు. -
బంజారాహిల్స్ స్పాలో వ్యభిచారం... ప్రముఖుల కుమారులు
బంజారాహిల్స్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా సహ నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు.12లోని పీస్ రెయిన్ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు చేశారు. సహ నిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్, విటులు ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్లను అరెస్టు చేశారు. వీరంతా నగరంలోని ప్రముఖుల కుమారులని తెలిసింది. స్పాలో ఉద్యోగం పేరిట ఐదుగురు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఈ ఐదుగురిని రెస్క్యూ హోంకు తరలించారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గుట్టుగా వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
తమిళనాడు: సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి చెరలో ఉన్న ముగ్గురు యువతులకు విముక్తి కలిగించారు. తిరువళ్లూరు జిల్లా శివందినగర్ ప్రాంతంలోని సలూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మల్లికకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు మంత్ర సలూన్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చైన్నెకు చెందిన రాజేష్(47) అన్ననూర్కు చెందిన గాయత్రి(23)లను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ముగ్గురు యువతులను రిమాండ్కు తరలించారు. కాగా పరారీలో ఉన్న విఘ్నేష్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బంజారాహిల్స్.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు...
హైదరాబాద్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రువాన్ థాయ్ స్పాపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వివరాలివీ... రోడ్ నెం. 12లోని రువాన్ థాయ్ స్పాలో థాయ్లాండ్కు చెందిన నన్ని, సుజి, హనా, అవా, ఆప్లే మసాజ్ థెరపిస్టులుగా పని చేస్తున్నారు. స్పా యజమాని సల్మాన్, ఖాలీద్ అనే వ్యక్తులు వీరిని సెక్స్ వర్కర్లుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి సదరు స్పాపై దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు సల్మాన్ పరారు కాగా, ఖాలీద్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రసూన్ ప్రకాష్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పది మంది విటులకు నోటీసులు జారీ చేశారు. -
తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు
విజయనగరం (క్రైమ్): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజనీర్ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్కు ఫోన్చేసి చైల్డ్ లైన్ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది. శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్లైన్ 1098కి కాల్ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్ హోమ్కు తరలించారు. అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ జరిపారు. -
మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం
హోసూరు: హోసూరు ప్రాంతంలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత రెండు నెలలుగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో 20 మందికిపైగా నిందితులను అరెస్ట్ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ల పేరుతో మహిళలను ఉంచి వ్యభిచారాలు కొనసాగుతున్నాయని సోమవారం రాత్రి డీఎస్పీకి రహస్య సమాచారం అందింది. దీంతో మసాజ్ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా, దీపిక (32), చూడప్ప (40), తులసీరామన్ (21)లు వేశ్యావాటికలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద ఉన్న 7 మంది మహిళలకు విముక్తి కల్పించి అనాథ శరణాలయాలకు తరలించారు. మసాజ్ సెంటర్లపై నిఘా ఉంచి తప్పుడు పనులు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటితో సహా ఓ మోడల్, ఏజెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) ఇన్స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్లో ఏజెంట్తో కలిసి భోజ్పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్ను అక్కడికి పంపాం. ఏజెంట్ను ఆన్లైన్ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్ని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని వెల్లడించారు. -
మోడల్స్తో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
ముంబయి పోలీసులు హై లెవెల్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మోడల్స్తో వ్యభిచారం నిర్వహిస్తున్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోరెగావ్లోని ఓ హోటల్లో వ్యభిచార దందా నడుస్తోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటి సుమన్ కుమారిని అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మోడల్స్ను పోలీసులు రక్షించారు. ఈ దందాలో భోజ్పురి నటి యువతులను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భోజ్పురి నటి వయసు 24 ఏళ్లు కాగా.. గోరేగావ్లోని రాయల్ పామ్ హోటల్లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించగా.. నటి చీకటి దందా బయటపడింది. కాగా.. భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన సుమన్ కుమారి ‘లైలా మజ్ను సినిమాలో నటించింది. అలాగే వెబ్ సిరీస్ జామ్స్టిక్ బాక్స్, భోజ్పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈనె హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా పనిచేసింది. Maharashtra | A Bhojpuri actress Suman Kumari (24) has been arrested by Mumbai Police for allegedly forcing girls (models) into prostitution. Police also rescued 3 models. Further investigation is being done: Crime Branch, Mumbai police — ANI (@ANI) April 21, 2023 -
Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. అమ్మాయిలు మస్త్ మస్త్గా ఉన్నారు!
ఫొటో చూడు.. క్యాష్ ఎంత ఇస్తావో చెప్పేయ్.. సమయాన్ని బట్టి ధర..నాకు ఎంత.. పోలీసోళ్లను కూడా చూసుకోవాలి.. మా వాళ్లే అన్ని చూసుకుంటారు.. ఇబ్బంది లేకుండా.. కొంత ఎక్కువే చెప్పండి.. ఇదే కాదు, ఇంకా చాలా ఫొటోలు ఉన్నాయి.. అమ్మాయిలు మస్త్ మస్త్గా ఉన్నారు.. లెక్క కుదిరితే తీసుకెళ్తా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ బ్రోకర్ అదే జిల్లాకు చెందిన యువకుడితో ఇటీవల సంభాషించిన మాటలు ఇవి. జిల్లాలో వ్యభిచార దందా ఏ విధంగా సాగుతుందో దానితోపాటు ఖాకీల చెడు సావాసానికి ఇది అద్దం పడుతోంది. న్యూడ్కాల్స్ వ్యవహారానికి సంబంధించి ‘డర్టీ పిక్చర్’ సంఘటనను జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలు ఇంకా మరిపోనేలేదు. జిల్లా ప్రతిష్ట మసక బార్చేలా వ్యవహరింన తీరుపై అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయ్యారు. అయినా ఆ శాఖలోని పలువురు అవినీతి ఖాకీలు తమ పంథాను మార్చుకోలేదు. జిల్లాలో వ్యభిచార దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనికంతటికీ ఆమ్యామ్యాల కక్కుర్తే కారణం. అనుమానం వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తప్ప ఎలాంటిచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసాంఫిక కార్యకలాపాలపై పకడ్బందీగా నిఘా పెట్టి ఉక్కు పాదం మోపాల్సిన వారే.. అక్రమార్కులకు ప్రత్యక్షంగా, లేకుంటే పరోక్షంగా సహకారం అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సృజన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వ్యభిచార దందాకు సహకరిస్తున్న కీలక పోలీసులు ఎవరు..రాజకీయ నేతల పాత్ర ఏమిటి.. ఎవరి ఒత్తిళ్లు ఏఅధికారిపై ఉన్నాయి.. అనే కోణంలో గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. అరోపణలు ఇలా ► ఫిబ్రవరి 19న గద్వాల పట్టణం భీం నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. వ్యభిచారకేంద్రం నిర్వాహకురాలితో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనే కేసు పెట్టారు. కానీ.. ఈ సంఘటనలో కొందరిని తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ► 2022 ఆగస్టు 7న గద్వాల బీరోలు రోడ్డు (తాయమ్మ గుడి) సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యురాలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎవరి పైనా చర్యలు లేకుండాపోయాయి. ►2021 మే 6న గద్వాల పట్టణంలోని సాయిహోంకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామునే సోదాలు చేసి ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రెండురోజుల పాటు విచారణ చేశారు. ఓ అధికారప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడితో పాటు పలువురు చోటామోటా నాయకులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ కేసు నమోదుచేయలేదు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు విజయవాడకు చెందిన ముఠాసభ్యులు గద్వాల కేరాఫ్ అడ్రాస్గాఎంచుకుని గుట్టుగా శివారు కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా ఒక్కో యువతిని దిగుమతి చేసుకుంటూ.. ఇళ్లు మారుస్తూ వ్యభిచార దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా గద్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, విజయవాడ, కర్నూలు, గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరునుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పడుపువృత్తి చేయిస్తున్నారు. -
కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..!
తిరుపతి రూరల్: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్ఐ ఏ స్టేషన్లో పనిచేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు. ట్రాన్స్ఫర్ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్ పరిధిలోని లింగేశ్వరనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్లో దాడులుచేశారు. మహిళా ఎస్ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్ఐ మెడికల్ లీవ్లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: స్పా ముసుగులో క్రాస్మసాజ్ చేస్తూ వ్యభిచార గృహాలుగా మార్చిన నాలుగు స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను పునరావాసకేంద్రాలకు తరలించారు. ఈ స్పాలన్నీ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కృష్ణ టవర్లో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, రోడ్ నెం.12లోని హదర్వా హమామ్ స్పా, కిమ్తి స్వేర్లోని ఎఫ్2 లగ్జరీ థాయ్ స్పా, బంజారాగార్డెన్ బిల్డింగ్లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు. మసాజ్ థెరపిస్ట్ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్ మసాజ్కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దాడుల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయ్లాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. థాయ్లాండ్ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్ సమీర్పై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు జంగం సుధాకర్ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలానీ, యజమాని భీమ్సింగ్లను కూడా అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా కస్టమర్ ఎంట్రీ రిజిష్టర్ లేకుండా, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వీటిని కొనసాగిస్తున్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్కుమార్ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ మామునూరు పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్ఫోన్లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్పాషా, రోజాలను ఈస్ట్జోన్ డీసీపీ అభినందించారు. -
కేరళ, కర్ణాటక యువతులను ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని అంబత్తూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విజయలక్ష్మీ పురానికి చెందిన కల్యాణి (30), మొగప్పేర్కు చెందిన రాజేష్ (40) కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతులను కొరటూరులోని ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయించారు. సమాచారం అందుకున్న అవడి పోలీస్ కమిషనర్ దాడి చేశారు. కల్యాణి, రాజేష్లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి ప్రభుత్వ మహిళా ఆశ్ర మంలో చేర్పించారు. నిందితులు ఇప్పటికే రెండుసార్లు వ్యభిచారం కేసుల్లో పట్టుబడినట్లు గుర్తించారు. కల్యాణినిపై గూండా చట్టం ప్రయోగించాలని ఆవడి మున్సిపల్ పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ శనివారం ఆదేశించారు. -
వ్యభిచారం దందా బట్టబయలు.. బాడుగ ఇళ్లు తీసుకుని
యశవంతపుర(బెంగళూరు): బెంగళూరులో బాడుగ ఇళ్లు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న 8 మంది బంగ్లాదేశ్వాసుల్ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. కెంగేరి, సోలదేవనహళ్లి రెండు చోట్ల దాడులు జరిపి ఇద్దరు మహిళలు, ఆరుమంది పురుషులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో తాము భారతీయులమంటూ బాడుగ ఇళ్లు తీసుకొని మహిళలను, విటులను రప్పించి పడుపు వృత్తి చేయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర పౌరులమని ఇంటి యజమానులకు ఆధార్ కార్డులను చూపారు. పోలీసుల విచారణలో బంగ్లాదేశ్లో కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్లతో పాటు భారతీయులు కాదని నిరూపించే ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: హనీమూన్లో విషాదం.. వివాహమై 20 రోజులు కాకుండానే.. -
సాఫ్ట్వేర్ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం
బెంగళూరు: కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్తే.. భార్యను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇతరులతో పడక పంచుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. సంపిగేహళ్లికి చెందిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2011లో వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా డ్రగ్స్కు అలవాటు పడిన భర్త.. భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు. స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింహలకు గురిచేశాడు. మద్యం మత్తులో ఆమెను కొట్టేవాడు. భార్య మరొకరితో బెడ్రూంలో గడిపిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేసి రాక్షసానందం పొందాడు. భర్తతో విసిగిపోయిన భార్య.. అతని నుంచి విడాకులు కోరగా.. తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని వివాహిత చివరికి పోలీసులను ఆశ్రయించింది. భర్త తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. భర్త డ్రగ్స్ అలవాటు పడి, ఇంట్లోని పూల కుండీలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం -
వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్
సాక్షి, థానె: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ మహిళను మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ విభాగం పోలీసులు రెడ్ హ్యెండెడ్గా పట్టుకున్నారు. రాష్ట్రంలోని థానె నగరంలో ఓ ఖరీదైన ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన మహిళ బయట ప్రాంతాలకు చెందిన నలుగురు యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తోందన్న సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. కాగా ఈ వ్యభిచార ముఠా నుంచి నలుగురు యువతుల్ని పోలీసులు రక్షించారు. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరిని వ్యభిచార రొంపిలోకి దించిన సదరు మహిళను పోలీసులు అరెస్టు చేసి ఆమెపై ఐపీసీ, మావన అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరిపై పీడీయాక్ట్
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. చదవండి: మహిళా యూట్యూబర్పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి..
తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై సాలిగ్రామంలో లాడ్జిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఆర్కాడు రోడ్డులోని ఓ లాడ్జిలో యువతులను పిలిపించి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఈ మేరకు పోలీసుల ఇన్స్పెక్టర్ లక్ష్మి నేతృత్వంలో పోలీసులు గురువారం రాత్రి సంబంధిత లాడ్జిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ రెండో అంతస్తుల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకుని యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడున్న బ్రోకర్లు రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన కర్ణన్ (36), తిరువన్నామలైకు చెందిన మనికంఠన్ (30), విల్లుపురం పట్టణానికి చెందిన శివప్రసాద్(24)ను అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసులు విచారణ జరపగా వారు వ్యభిచార నిర్వహణకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని నడుపుతున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరి కొందరు బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం -
యువతిపై అఘాయిత్యం.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం మండ్యకు చెందిన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమె ప్రియుడు నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను ఒక గదిలో ఉంచి ప్రియుడు, ఆపై మరికొందరు ఒకేసారి ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. శివానందసర్కిల్ వద్ద గల ఒక లాడ్జి యజమాని సంతోష్ కూడా ఇందులో ఉన్నాడు. తరువాత యువతిని వ్యభిచార ముఠాకు విక్రయించారు. ఇటీవల పోలీసులు ఒక లాడ్జిలో జరుగుతున్న పడుపు దందాపై దాడి చేయగా పట్టుబడిన ఈ యువతి దీనగాథను వివరించింది. ఈ ఘటనపై హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, మంజుల, బ్రహ్మేంద్ర, సంతోష్ కుమార్లను శనివారం అరెస్టు చేశారు. అలాగే మోసపోయిన యువతి స్టేట్మెంట్ను రికార్డు చేసిన అనంతరం గ్యాంగ్ రేపుపై మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
వెంచర్లో వ్యభిచారం.. పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వెంచర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఎస్ఐ మధు తెలిపారు, కొన్ని నెలలుగా పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్ ప్లాట్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు యువతులతో..
సాక్షి,విజయనగరం క్రైమ్: స్థానిక కస్పా హైసూ్కల్ సమీపంలో ఒక గ్రూప్ హౌస్లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. కస్పా హైస్కూల్ సమీపంలో ఉన్న గ్రూప్హౌస్ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని -
శ్రీలంక మహిళల దుస్థితి.. బుక్కెడు బువ్వ, మందుల కోసం సెక్స్ వర్కర్లుగా..
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి 'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిల దండేనియా తెలిపారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం.. నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆహారం, ఔషధాల కోసం కొంతమంది మహిళలు దుకాణ యజమానులతో శృంగారంలో పాల్గొంటున్నారనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కొలంబో పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి చోట్ల పోలీసుల సహకారంతో వ్యభిచారం జరుగుతున్నట్లు నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యభిచారం సాఫీగా చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మహిళలను పోలీసులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నట్లు వెల్లడించాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్.. జీవనోపాధి కల్పిస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మసాజ్ సెంటర్పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్ వెల్నెస్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీ బ్యూటీ అండ్ సెలూన్ వెల్నెస్ సెంటర్లో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది. దీంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు రాధామనోహర్రెడ్డి, మేనేజర్ ప్రశాంత్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, జవహర్గనర్(హైదరాబాద్): వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జవహర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడలోని వాయుష్కినగర్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మల్కాజిగిరి ఎస్వోటీ, జవహర్నగర్ పోలీసుల సంయుక్త ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఘటనలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.3690 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్గూడకు చెందిన వినోద్కుమార్ (40)ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
జీడిమెట్ల.. వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు -
అప్పు వంకతో నీచమైన పనులు
తనకు బాకీ పడ్డ సొమ్మును తీర్చేందుకు ఓ అమ్మాయికి దారుణమైన పనిని అప్పగించింది ఓ యువతి. ఒకరోజులో 17 మందితో.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు ఆ పని చేసింది. విషయం బాధితురాలి తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో.. కోర్టుకు చేరుకుంది ఈ అఘాయిత్యం. ఇంగ్లండ్లో వ్యభిచారం చట్టవిరుద్ధమైన చోట ఎస్కార్ట్ ఏజెన్సీలు వెలుస్తుంటాయి. డబ్బు తీసుకుని క్లయింట్లకు తోడును అందించడం ఈ ఏజెన్సీల పని. అలాంటి ఏజెన్సీలో పనిచేస్తోంది 23 ఏళ్ల జార్జియా అలియాస్ టైలర్ జో వాకర్. ఇన్స్టాగ్రామ్ ద్వారా సదరు టీనేజర్తో పరిచయం పెంచుకుంది. ఆపై ఆర్భాటాల ద్వారా ఆ టీనేజర్ను ఎట్రాక్ట్ చేసింది. సుందర్ల్యాండ్లోని తన అపార్ట్మెంట్కు రావాల్సిందిగా యువతిని ఆహ్వానించింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది సదరు యువతి. ఇందుకోసం ట్యాక్సీ, ఇతర ఖర్చులను కూడా వాకరే భరించింది. ఆపై యువతిని అభ్యంతరకరంగా చిత్రీకరించింది. ఆపై యువతి వయసును 18 ఏళ్లుగా చెబుతూ.. ఫొటోలతో సహా ఎస్కార్ట్ఏజెన్సీ ప్రొఫైల్లో అప్లోడ్ చేసింది. దీంతో క్లయింట్లు వాకర్ ఇంటికి రాగా.. యువతి భయంతో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే బాకీ తీర్చకపోతే వ్యక్తిగత ఫొటోల్ని బయటపెడతానని బెదిరించింది వాకర్. పైగా తాను చెప్పినపని చేస్తే తక్కువ టైంలో బోలెడంత డబ్బు వస్తుందని టీనేజర్కు ఆశపెట్టింది. అలా రెండు వారాల్లో 30 మందితో బలవంతంగా చేయికూడని పనులు చేయించింది. వచ్చిన సొమ్ములో 700 పౌండ్లను వాకర్ తీసుకోగా.. 3000 పౌండ్లు మాత్రం యువతికే ఇచ్చింది. దీంతో మురిసిపోయిన యువతి లగ్జరీ ఐటెమ్స్తో ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నేరం ఒప్పుకున్న వాకర్కు 16 నెలల జైలు శిక్ష, అక్కడి చట్టాల ప్రకారం.. నిరుద్యోగ భృతి కింద అందాల్సిన వేతనంలోనూ రెండేళ్లపాటు కోత విధిస్తున్నట్లు న్యూక్యాజిల్ క్రౌన్ కోర్టు Newcastle Crown Court తీర్పు ఇచ్చింది. అంతేకాదు వాకర్ను మరోసారి వ్యభిచారం వైపు మళ్లకుండా చూడాలంటూ ఆమె తరపు న్యాయవాదిని జడ్జి ఆదేశించింది. -
హై ప్రొఫైల్ వ్యభిచారం.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి.. ఇన్ఫార్మర్ని హోటల్కి పంపించి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని హోటల్స్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార దందాను ఢిల్లీ పోలీసులు (ఐజీఐ) చేధించారు. ఈ ఘటనలో.. దందా నడిపిస్తున్న సూత్రధారి, ఒక అమ్మాయితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో హైప్రోఫైల్ వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంపై దాడులు చేసేందుకు పోలీసు అధికారులు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. ఈ దందా నడుపుతున్న వ్యక్తి దగ్గరకు పోలీసులు తమ రహస్య ఇన్ఫార్మర్ ద్వారా సంప్రదించారు. ప్లాన్ ప్రకారం హోటల్ హాలిడే ఇన్లో ఒక గదిని కూడా బుక్ చేశారు. ఇన్ఫార్మర్ వేచి ఉన్న హోటల్కు సూత్రధారి ఓ అమ్మాయిని తీసుకుని వచ్చి హోటల్ వరండాలో దించి అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత హోటల్లో గదికి యువతి చేరుకోగానే డెకాయ్ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆ పరిసరాల్లోనే ఉన్న బృందం యువతిని, ఆమెను డ్రాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి నవీన్గా గర్తించారు. అతనిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. చదవండి: భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో... -
యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి..
సాక్షి, ఉప్పల్: యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్న యువకుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాసవి రవితేజ (35), రామంతాపూర్ గోకులేనగర్లో నివాసముంటున్నాడు. అమాయక యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గత నెల 7న రవితేజను రిమాండ్కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు శనివారం పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాసవి రవితేజ (35) చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్లో ఉన్న ఓయో రూమ్లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్లోని విద్యుత్ టవర్స్లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి..
యశవంతపుర(కర్ణాటక): పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బెంగళూరుకు తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరాయనపురకు చెందిన మధు (43), అసోంవాసి రఫికుల్ ఇస్లాం (21), పశ్చిమ బెంగాల్వాసి రుబేల్ మండల్ నిందితులు. దొడ్డబొమ్మసంద్ర కృష్ణ టెంపుల్రోడ్డులో ఈ దందా చేసేవారని తేలింది. (చదవండి: బార్లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో.. ) మరో ఘటనలో.. కుటుంబ కలహాలతో ఆత్మహత్య హోసూరు: హోసూరు సమీపంలోని జొనబండ గ్రామానికి చెందిన వెంకటేష్ (33) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. బుధవారం ఏర్పడిన గొడవల్లో విరక్తి చెందిన వెంకటేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం.. బెంజ్ కారులో వచ్చి..
సాక్షి, హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో హ్యాపీ థాయ్ స్పా సెంటర్పై బంజారాహిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది యువతులు, ఇద్దరు విటులను, ఇద్దరు మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్లో బాయ్ఫ్రెండ్ అయితే ఈ స్పాను ఓయువతి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడిన ఒక విటుడైన గోపాల గుప్తా ఏకంగా బెంజ్ కారులో ఇక్కడికి వచ్చి పోలీసులకు చిక్కాడు. స్పాలో మరో బాగస్వామి అయిన మహేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. -
రాజేంద్రనగర్ కస్తూర్బా ఆశ్రమం నుంచి 14 మంది మహిళలు పరార్
-
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు.. 14 మంది మహిళలు పరార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 19 - 25 సంవత్సరాల వయసు గల మహిళలను కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా అనాథాశ్రమంలో చేర్పించారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఆశ్రమం నిర్వాహకులు నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య) -
సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఇద్దరు మహిళలు, విటుడు అరెస్ట్
సాక్షి, అడ్డగుట్ట: స్పా అండ్ సెలూన్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ నిర్వాహకుల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. ఈస్ట్ మారేడుపల్లిలోని గీతా టిఫిన్స్ ఎదురుగా ఉన్న లరీసా ఎక్స్క్లూసివ్ స్పా అండ్ సెలూన్ సెంటర్ నిర్వాహకులు రంగం కిషోర్(35), అనీష్(25) సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తుకారాంగేట్ పోలీసులు సెంటర్పై దాడి చేశారు. సెంటర్ యజమానులు కిషోర్, అనీష్లతో పాటు ఇద్దరు మహిళలను, విటుడు ఆంటొనీ(46)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు సెల్ఫోన్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకొని మంగళవారం రంగం కిషోర్, అనీష్, ఆంటొనీలను రిమాండ్ చేశారు. మహిళలను ప్రజల్వ హోంకు తరలించినట్లు తెలిపారు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు -
బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..
సాక్షి, చెన్నై: ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది. ఈ క్రమంలో త్రిపురకు చెందిన నలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు. చదవండి: (Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య) ఈసీఆర్ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు ఆ నలుగురు బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..
సాక్షి, హైదరాబాద్(నాగోలు): ఎల్బీనగర్ పోలీసులు ఓ వ్యభిచార గృహం గుట్టును రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి(68) బైరామల్గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. చదవండి: (కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..) సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. తనకు తెలిసిన సెక్స్వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటకు వచ్చిన వెంకటలక్ష్మి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి..) -
అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం
లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు. (చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం) ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్డ్రైవర్తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. సదరు క్యాబ్ డ్రైవర్ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. (చదవండి: పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
సాక్షి, మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్పై గత రెండు రోజులక్రితం దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్పై నాచారం పోలీసులు దాడి చేశారు. సీఐ కిరణ్కుమార్ తెలిపిన మేరకు.. నాచారం హెచ్ఎంటీనగర్ ప్రధాన రహదారిలో బాలానీనగర్ జవహర్నగర్కు చెందిన రజిత అలియాస్ సుప్రియ స్పైసీ హెయిర్ బ్యూటీపార్లర్ సెంటర్లో క్రాస్ జెండర్ మసాజ్ నడుపుతున్నారు. చదవండి: విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి.. గురువారం రాత్రి పోలీసులు మసాజ్ సెంటర్పై దాడి చేసి నిర్వాహకులు ఎం.రజిత (37), ఆమె భర్త నాగేందర్ (39), బోడుప్పల్ హేమానగర్కు చెందిన సహాయకుడు కె.శివ (34), వీరితో పాటు మసాజ్ సెంటర్లో పని చేస్తున్న ముగ్గురు మహిళలు, కస్టమర్ బండి బాలకృష్ణను (34) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు, ఫోన్ పే స్కానర్, ఎంటీఎం కార్డు, స్వైప్ మీషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకోని రిమాండ్కు తరలించిన్నట్లు సిఐ తెలిపారు. -
విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి..
సాక్షి, అల్వాల్: మానవ అక్రమ రవాణకు పాల్పడుతూ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నిందితుడిపై రాచకొండ పోలీసులు పీడి చట్టాన్ని నమోదు చేసి జైలుకు పంపించారు. రాచకొండ కమిషనరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం... టాంజానియా దేశానికి చెందిన కబాంగిలా వారెన్ అలియాస్ అండ్రూ హసన్ నేరేడ్మెట్లోని జీకే కాలనీలో నివాసముంటున్నాడు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. ఆదిలాబాద్లో షాక్! ఇతను విదేశాల నుండి విద్య కోసం విద్యార్థినులను వీసాపై ఇండియాకు రప్పిస్తున్నాడు. వారికి ఆశ్రయం కల్పించి ఆదాయం సమకూర్చుతానని నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్నాడు. స్థానికంగా తన పరిచయాల ద్వారా మహిళల వద్ద విటులను పంపిస్తున్నాడు. రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ నేరేడ్మెట్ పోలీసులతో కలిసి జూన్ 28న నిందితుడు కబాంగిల వారెన్ను అరెస్టు చేశాడు. ఇతనిపై పీడియాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: పేదరికం తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ) -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
సాక్షి, పటాన్చెరు టౌన్: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం అమీన్పూర్ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్మెంట్లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్ సింగ్, మోహన్ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్గూడ భెల్మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు
సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. శివాజీచౌక్లో ఓ ఫంక్షన్ పక్కనే గల లాడ్జీపై పట్టణ సీఐ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న 8 మంది విటులతోపాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే సంబంధిత లాడ్జీ యజమాన్యంపై కేసు నమోదు చేశారు. విషయమై పట్టణ సీఐ వివరణ కోరగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
బంజారాహిల్స్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం అయితే ఈ మసాజ్ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. -
మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి..
సాక్షి, చెన్నై: నగరంలో అనుమతులు లేకుండా సాగుతున్న మసాజ్ సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఏసీబీకి చిక్కారు. మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ల నుంచి వీరు లక్షల్లో లంచం తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా మసాజ్ సెంటర్లు, స్పాలపై దృష్టి పెట్టాయి. ఎనిమిది మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. నగరంలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు, స్పాలు ఉండగా ఇందులో 63 సెంటర్లకు అనుమతులు కూడా లేవని తేలింది. ఈ సెంటర్లకు సీల్ వేశా రు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
కూకట్పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి..
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4లో ఎంఐజీ గృహాన్ని అద్దెకు తీసుకున్న బి.రాజు (52), నూర్పాషా కాసింబీలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. చదవండి: యూట్యూబ్లో నేర్చుకుని.. వయసు 17.. మోసాలు 16 సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి నిర్వాహాకులిద్దరితో పాటు మహిళను, శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. -
Nalini Jameela: అందుకే ‘సెక్స్ వర్కర్’గా మారింది.. కానీ ఇప్పుడు
Nalini Jameela Gets Kerala Film Award: నళినీ జమీలా తన ఆత్మకథ రాసి సంచలనం రేపింది కేరళలో.ఎందుకంటే ఆమె జీవితం ‘సెక్స్ వర్కర్’గా గడిచింది. ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’గా వచ్చిన ఆ పుస్తకం ఎన్నో భాషల్లో అనువాదం అయ్యింది. ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న నళిని తాజాగా ఒక సినిమా కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసింది. ఆమె ఎంత బాగా పని చేసిందంటే 2020 సంవత్సరానికి గాను శనివారం కేరళ ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. నిజంగానే ఆమెది ఒక చిత్రమైన ప్రయాణం.. సెక్స్వర్కర్గా జీవించడంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవడం, సమాజాన్ని ఎదుర్కొనడం కంటే పోలీసుల హింసని, విటుల దాష్టీకాన్ని భరించడం కష్టం. 2005లో కేరళలోని త్రిశూర్ జిల్లాలోని కల్లూర్ అనే చిన్న ఊరి నుంచి నళినీ జమీలా 52 ఏళ్ల వయసులో తన జీవితం ఆధారంగా ‘ఒక సెక్స్వర్కర్ ఆత్మకథ’ పేరుతో పుస్తకం రాసి దేశంలో ఒక రకమైన సంచలనం రేపింది. ఆ పుస్తకం స్త్రీలు గతిలేని స్థితుల్లో ఎలా సెక్స్ వర్కర్లుగా మారుతారో చెప్పడమే కాదు పోలీసులు, సంఘంలోని పెద్ద మనుషులు, కుటుంబం ఎలా సెక్స్వర్కర్లను కీలుబొమ్మలుగా చేస్తారో కూడా చెప్పింది. అంతే కాదు... మగవారి ప్రవర్తన మీద లోతైన పరిశీలనలు చేసింది. దేశంలోని అనేక భాషలతో పాటు తెలుగులో కూడా వెలువడ్డ ఈ పుస్తకం (హెచ్బిటి ముద్రణ) పెద్ద చర్చను లేవదీసింది. ఇప్పుడు ఆ నళినీ జమీలా తన 67వ ఏట ఒక సినిమా కాస్ట్యూమ్ డిజైనర్గా కేరళ ప్రభుత్వ ప్రత్యేక అవార్డు పొందడం పెద్ద విశేషంగా మారింది. నళినీ జమీలాను ఒక విశేష వ్యక్తిగా మళ్లీ చర్చకు తెచ్చింది. భర్త మరణించాక నళినీ జమీలా బాల్యం ఏమీ సౌకర్యంగా నడవలేదు. తండ్రి పిల్లల్ని దగ్గరకు తీసేవాడు కాదు. పెళ్లయ్యాక ఇద్దరు అమ్మాయిలు పుట్టాక భర్త కేన్సర్తో మరణిస్తే జరుగుబాటు చాలా కష్టమైంది. కొన్నాళ్లు ఇంటి పనులు వెతుక్కున్న జమీలాకు ఒక స్నేహితురాలు వ్యభిచార వృత్తి గురించి చెప్పింది. ఆమే జమీలాను ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకు పంపింది. ఆ గెస్ట్హౌస్ నుంచి తెల్లవారుజామున ఇంటికి వెళుతుంటే పోలీసులు ఆమెను పట్టుకుని హింసించడంతో జమీలా సెక్స్వర్కర్ జీవితం మొదలవుతుంది. ఆ లైఫ్లో ఆమె ఎందరో పోలీసుల, విటుల, గూండాల టార్చర్ను అనుభవించింది. అయినా సరే కూతుళ్ల కోసం రాటుదేలుతూ వృత్తిలో కొనసాగింది. దాని నుంచి బయట పడ్డాక కొందరు మిత్రుల సూచన మేరకు ఆత్మకథ రాసి సంచలనం రేపింది. ఆ పుస్తకం తెచ్చిన పేరుతో మరో మూడు నాలుగు పుస్తకాలు వెలువరించింది. రచయిత్రిగా, సెక్స్వర్కర్ల విముక్తికి పని చేసే యాక్టివిస్ట్, రిలేషన్స్ కౌన్సిలర్గా పని చేస్తూ వస్తున్న జమీలాకు ఇంత పేరు ఉన్నా ఆమెను ఆమె గతం వెంటాడుతూనే ఉంది. ‘సెక్స్వర్కర్లకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. నేను ఇంటి కోసం ఎన్ని బాధలు పడుతున్నానో నాకే తెలుసు. ఒకరకంగా నేను ఇప్పటికీ నా మొఖం దాచుకుని దొంగబతుకు బతకాల్సి వస్తోంది’ అంటుంది జమీలా. ‘సెక్స్వర్కర్ల పట్ల కేరళలో దారుణమైన చిన్నచూపు ఉంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కొంచెమైనా వారితో మెరుగ్గా ప్రవర్తిస్తారు. సెక్స్వర్కర్లు పొట్టకూటి కోసం ఆ పని చేస్తారు. ఆడపిల్లలను ఆ వృత్తిలో దింపే ట్రాఫికర్స్ దుర్మార్గులు. ఆ తేడాను నేను సమాజానికి పదే పదే తెలియచేస్తున్నాను’ అంటుందామె. కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తమ్ముడు సంజీవ్ శివన్ జమీలా జీవితం మీద ‘సెక్స్, లైస్ అండ్ ఏ బుక్’ అనే డాక్యుమెంటరీ తీశాడు. తన జీవితం ఆధారం గా ఒక సినిమా రావాలని జమీలాకు ఉందికాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈలోపు ఇటీవల ‘భరతపుజా’ అనే సినిమాకు ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసే అవకాశం వచ్చింది. ‘ఆ సినిమా దర్శకుడు మణిలాల్ నాకు చాలాకాలం నుంచి తెలుసు. ఆ కథ కూడా ఒక సెక్స్వర్కర్ జీవితానికి సంబంధించిందే. అందుకని మీరు ఆమె కాస్ట్యూమ్స్ చూడండి అని కోరాడు. సరేనన్నాను. మధ్య వయసులో ఉన్న ఆ హీరోయిన్ (నటి సిజి ప్రదీప్) బట్టలను నేను ఆ వయసులో ఎలాంటి బట్టలు కడుతూ వచ్చానో ఎలా కనిపించానో దాని ఆధారంగా డిజైన్ చేశాను. 13 చీరలు మాత్రమే కొన్నాను. వాటిలో పూనమ్ చీరలే ఎక్కువ. మరో రెండు ఆ తర్వాత కొనాల్సి వచ్చింది. రాత్రిళ్లు గాఢమైన రంగుల చీరలను, పగలు తేలిక రంగుల చీరలను హీరోయిన్ కోసం ఉపయోగించాను. యూనిట్తో పాటు నేనూ ఉన్నాను. ఆ సినిమాకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా నాకు అవార్డు ఇవ్వడం ఊహించలేకపోతున్నాను. నా జీవితంలో ఇది నాకు గొప్ప ఘనత’ అంది జమీలా. వృద్ధ సెక్స్వర్కర్ల కోసం ‘ఒకప్పుడు విమానం ఎక్కితే చాలనుకున్నాను. కాని అనేక దేశాలు తిరిగి చూడగలిగాను. ఇప్పుడు నా కోరిక ఒక్కటే. వృద్ధ సెక్స్వర్కర్ల కోసం ఒక హోమ్ కట్టాలి. వారికి జరుగుబాటు లేక భిక్షాటన చేస్తున్నారు. వారిని ఆదుకోవాలి.’ అంది జమీలా. 1970–2000 సంవత్సరాల మధ్య 8 మంది విటులతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని ‘రొమాంటిక్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ఎ సెక్స్వర్కర్’ పేరుతో 8 కథలుగా రాసిన జమీలా పుస్తకం ఇంకా తెలుగులో రావాల్సి ఉంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! -
కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడు, ఓ విటుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా వెన్నెలగడ్డ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అపార్ట్మెంట్కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో గత నెలలో పలుసార్లు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. ఈ క్రమంలో పేట్బషీరాబాద్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మసాజ్ సెంటర్కు కస్టమర్ లాగా వెళ్లి కూపీ లాగారు. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ముగ్గురు మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని టెన్త్ విద్యార్థిని దారుణం.. -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్బీ పోలీస్లు రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, బంజారాహిల్స్: సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్లోని కిమ్ బ్యూటీ అండ్ స్పాపై దాడులు నిర్వహించి ఓనర్ కిమ్పై కేసు నమోదు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ప్రొఫెషనల్ థెరపిస్ట్ కూడా లేడని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా కొనసాగుతోందని.. మసాజ్ కోసం సెక్స్ వర్కర్ను నియమించుకున్నట్లు గుర్తించారు. కిమ్తో పాటు కొడుకు కాంతిలాల్పై కేసు నమోదు చేశారు. కిమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వ్యభిచార గృహంపై.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో వీ.ఎన్. బ్యూటీ స్టూడియో ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ డి.అజయ్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడు ఎ. వేణుగోపాల్, స్పా మేనేజర్ ఎన్.రాకేష్, ఎ.సురేందర్రాజులపై కేసు నమోదు చేశారు. ఇక్కడ నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని బాలిక సంరక్షణా కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్ చేసి సవాల్? -
తాలిబన్ల పైశాచికత్వం: ఇకపై పశు వ్యభిచారం
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గనిస్థాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అధికారం చేపట్టకున్నా దమనకాండను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం-హెల్ప్లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం అఫ్గన్లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్, మజర్ ఏ షరీఫ్, హెరత్, జలాలాబాద్, జోవ్జాన్ ప్రావిన్స్లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. చదవండి: పదేళ్లు మగాడి వేషంలో.. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్ డైరెక్టర్ మార్గరేట్ స్మిత్ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ సెటైర్లు పేల్చారు ఆమె. చదవండి: షరియా.. ఉల్లంఘిస్తే ఉరే! -
ఉపాధి కోల్పోవడంతో వేశ్యలుగా మారిన తల్లీకూతుళ్లు
చండీగఢ్: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోయాయి. మహమ్మారి కట్టడి కోసమని ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ కారణంగా చాలా రంగాలు కుదేలవడమే గాక వాటిపై ఆధారపడుతున్న బతుకులను తలకిందులు చేసిందనే చెప్పాలి. కొందరి పరిస్థితి దయనీయంగా మారి పూటకు కూడా తిండి దొరకని తిప్పలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కనీస అవసరాలను తీర్చుకోవాడానికి ఓ తల్లి కూతుర్లు వేశ్య వృత్తిని ఎంచుకునేలా చేసింది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వేరేదారి లేక వేశ్యలుగా మారాం వివరాలు ప్రకారం.. పంజాబ్లోని ముక్త్సార్లో ఇటీవల విధించిన లాక్డౌన్ కారణంగా ఓ తల్లి తన కూతురు వారి ఉద్యోగాన్ని కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో రోజులు గడిచే కొద్ది వాళ్ల పరిస్థితి దయనీయ స్థితికి చేరుకుంది. ఎంత ప్రయత్నించినా వేరెక్కడా పని దొరకలేదు. ఒక్కోరోజు తిండి తినడానికి కూడా కష్టమవడంతో, చివరికి వేరేదారిలేక పొట్టకూటి కోసం ఆ తల్లి వేశ్యగా మారింది. అంతేకాదు తన కూతురిని కూడా వేశ్యగా మార్చేసింది. వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి ఓ ప్రాంతంలో రైడ్ చేయగా అందులో ఈ తల్లి కూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ మహిళ ఆకలి బాధ తట్టుకోలేక, వేరే పని దొరకకపోవడంతో ఇలా వేశ్య వృత్తిని ఎంచుకున్నట్లు వాపోయింది. -
ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్గా ఫోన్చేసి..
సాక్షి, చైతన్యపురి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగాండా వాసులు అయిదుగురిని రాచకొండ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. లొకాంటో యాప్ ద్వారా యువతుల చిత్రాలు పోస్ట్ చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి వారి ఆటకట్టించాలని పోలీసులు నిర్ణయించారు. డెకాయ్ బృందంలోని సభ్యుడు కస్టమర్గా యాప్లోని ఫోన్కు కాల్ చేసిన సాలి మిల్లి అలియాస్ నాగబాలా షేక్ అలియాస్ షీలాను సంప్రదించాడు. ముగ్గురు యువతులు ఉన్నారని చెప్పడంతో దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ వద్దకు రావాలని లోకేషన్ షేర్ చేశాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులు రావడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారి వద్ద నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్ (మత్తుమందు) కలిగి ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి అయిదు సెల్ఫోన్లు, రూ.5500 నగదు, 5గ్రాముల కెటామైన్ డ్రగ్, 17 గ్రాముల గుర్తుతెలియని మత్తుమందు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి చట్టవిరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. టోలిచౌకిలో వీరు నివాసముంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్లో వ్యభిచారం.. -
గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు
సాక్షి, గచ్చిబౌలి: పోలీసులు ఓ హోటల్పై దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ ఉమెన్ ట్రాకింగ్ సెల్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి సదరు హోటల్పై దాడి చేశారు. విటులు బిజ్యూపాయల్(27), దీపక్కుమార్ (25), సంగం కిషోర్దాల్(24), నితిన్జాషన్ అలియాస్ ఆరుట్ల నిఖిల్ (31), బంది నారాయణ (38), వెంకటేష్గౌడ్(58)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ 32,510 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్ వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం -
ఢిల్లీ యువతి ఫిర్యాదుతో బట్టబయలైన వ్యభిచార గుట్టు
రాంగోపాల్పేట్: ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి మహిళలు, యువతులను నమ్మిస్తూ వారిని వ్యభిచారంలోకి దించుతున్న ముఠాలోని ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్గౌడ్ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్కుమార్(28), వరంగల్కు చెందిన సురేష్(19), ఈస్ట్గోదావరికి చెందిన పవన్(20)తో పాటు అకిల్, తేజ, చరణ్ ముగ్గురు స్నేహితులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి బేగంపేటలో నివాసం ఉంటూ ఓ ఐస్క్రీం పార్లర్లో పనిచేసేవారు. జీతం సరిపోకపోవడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని సిద్ధమయ్యారు. సినిమాపై వ్యామోహంతో, ఉపాధి, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే ఒంటరి మహిళలు, యువతులకు ఈ ముఠా మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారితో వ్యభిచారం చేయిస్తుండేవారు. వారి ఫొటోలను తీసి కస్టమర్లకు పంపించి నచ్చితే వారి దగ్గరకు పంపించేవారు. ఢిల్లీకి చెందిన ఓ యువతి(19)కి తల్లిదండ్రులు చనిపోయారు. అక్కడ ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఉంటోంది. ఫేస్బుక్లో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. హైదరాబాద్కు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. దీంతో ఆమె కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చింది. యువతిని సతీష్కు పరిచయం చేసింది. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ఒత్తిడి తీసుకుని రావడంతో ఈ నెల 11వ తేదీన తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పారిపోయి వచ్చింది. ఆ యువతిని వెంబడిస్తూ వచ్చిన గ్యాంగ్ సభ్యులు తమతో తీసుకుని వెళ్లేందుకు యత్నిస్తుండగా గోపాలపురం పెట్రోకార్ సిబ్బంది అక్కడికి వచ్చారు. పోలీసులను చూసి వారు పారిపోయారు. యువతి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు నిందితులపై పీటా యాక్ట్ కేసు నమోదు చేశారు. శుక్రవారం సతీష్, సురేష్, పవన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సహజీవనం చేసిన మహిళను వ్యభిచారం చేయాలంటూ..
కామారెడ్డి : భర్త దూరం అయిన ఆమెపై ట్రావెల్ యజమాని కన్నేశాడు. ఆమె అవసరాలు తీరుస్తూ నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో ఆమెను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇదే గ్రామానికి చెందిన నందిని అనే మహిళకు 20 ఏళ్ల క్రితం నవీన్పేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా పెళ్లయిన ఆరేళ్లకే వీరికి విడాకులు అయ్యాయి. దీంతో ఆమె దేవునిపల్లి గ్రామంలో తన కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ లో పని చేసేది. ఈ క్రమంలో యజమాని రమేష్తో పరిచయం సహజీవనానికి దారితీసింది. కరోనా కారణంగా ట్రావెల్స్ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రమేష్...నందినినీ వ్యభిచారం వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకోకపోతే తనను వేశ్యగా ప్రచారం చేస్తానని, అంతేకాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, తనకు రక్షణ కల్పించాలని మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. చదవండి : (అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య) (పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్) -
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ దాడులు
ఆదిలాబాద్/ఎదులాపురం: పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ఫోర్స్ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ రామకృష్ణతో కలిసి సంయుక్తంగా దాడి చేశారు. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని కైలాస్నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ తెలిపారు. గత కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నట్లు వివరించారు. (పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం అతడ్ని..) ఇందులో వడ్డెర కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్, శాంతినగర్కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్ మండలం పెండల్వాడకు చెందిన ఠాకూర్ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్ మండలం పెడల్వాడకు చెందిన చుక్కలవార్ ఆకాశ్లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు నిర్వాహకులతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వన్టౌన్ ఎస్సైలు జి.అప్పారావు, జాదవ్ గుణవంత్రావు, టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు షేక్ తాజొద్దీన్, ఎం.రమేష్కుమార్, సయ్యద్ రాహత్, హనుమంత్రావు, ఎంఏ కరీమ్, మంగళ్సింగ్, ఠాకూర్ జగన్సింగ్, ఎన్.నగేష్, మహిళ కానిస్టేబుళ్లు మమత, సోనీ తదితరులు ఉన్నారు. (భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య ) -
ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ చంద్రమౌళి తెలిపిన కథనం ప్రకారం.. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదిలాబాద్ గ్రామీణ సీఐ పురుషోత్తంతో కలిసి వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి మహిళ, వ్యభిచార గృహ నిర్వాహకుడు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, డైరీలు, రూ.7700 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నిర్వాహకుడైన ప్రధాన నిందితుడు ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన పిండి మల్లికార్జున్, విటులు కరీంనగర్ పట్టణంలోని రాంనగర్కి చెందిన సిందం కుమార్, తాంసి మండలంలోని గోట్కూరికి చెందిన దర్శనాల సాయికుమార్ ఉన్నారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ సీఐ పురుషోత్తం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన ఉట్నూర్ మండలం గంగన్న పేటకు చెందిన పిండి మల్లికార్జున్ కొంతకాలంగా ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఎస్కే తాజొదీ్దన్, జగన్సింగ్, రహాత్, మావల ఏఎస్సై గంగాధర్, కానిస్టేబుళ్లు సరిత, మౌనిక, సోనీ, తదితరులు పాల్గొన్నారు. -
మోడల్స్తో వ్యభిచారం.. ఆ ఖర్చులను మీరే భరించాలి..!
ముంబై: నగరంలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆయన.. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి.. వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. నవీన్ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిన పోలీసులు కస్టమర్లా నవీన్కు ఫోన్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్.. ఇండస్ట్రీలో మోడల్గా, ఆర్టిస్ట్గా పనిచేస్తోన్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చారు. అయితే.. ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పారు. పోలీసులు అందుకు అంగీకరించడంతో అమ్మాయిలతో కలిసి హోటల్కు వచ్చిన నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదగిరి గుట్టలో కొనసాగుతున్న దాడులు
-
స్పా సెంటర్ కాదది.. నరకకూపం
సాక్షి, న్యూఢిల్లీ: స్పా సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దేశ రాజధానిలో ఓ మైనర్ బాలికపై కొందరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఇంటి నుంచి పారిపోవాలన్న తప్పుడు నిర్ణయమే ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే ముఠా చేతుల్లో బంధీ అయిన ఆమె.. నాలుగు రోజులపాటు నరకం చవిచూసింది. డ్రగ్స్ ఇచ్చి మరీ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్పా సెంటర్ మాటున... స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో భారీ సెక్స్ రాకెట్ నడిచినట్లు తెలిపారు. అమ్మాయిలను ట్రాప్ చేసి స్పా సెంటర్లో పని ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి విక్కీ, రాకేశ్ గోయల్లు వ్యభిచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ ఇచ్చి మరీ బలవంతంగా ఈ కూపంలోకి లాగుతున్నట్లు డీసీపీ సంజు కురువిల్లా వెల్లడించారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా ఈ రొంపిలోకి దిగగా.. లొంగని వారికి డ్రగ్స్ ఇచ్చి వారిపై దాష్టీకానికి పాల్పడినట్లు చెప్పారు. సుమారు పాతిక మంది అమ్మాయిలు ఈ స్పా సెంటర్ బాధితులుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తిండి పెట్టకుండా వారిని చిత్రవధ చేసేవారని, ఫలితంగా వారిలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. విక్కీతోపాటు ముఠాకు చెందిన మరో అర డజను మంది పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన సదరు బాలిక(16) గతవారం బాయ్ ఫ్రెండ్తో పారిపోయింది. హరిద్వార్ వెళ్లిన వీళ్లిద్దరూ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని, నాలుగు రోజులు అక్కడే గడిపారు. అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యుడు విక్కీ.. వీరిని గమనించి ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. ముందుగా సదరు యువకుడి నుంచి బాలికను వేరు చేసి ఓ ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ తన స్నేహితులతో గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. ఆపై మత్తు పదార్థాలు ఇచ్చి బాలికను రోహిణి ఏరియాలోని ఓ స్పా సెంటర్కు తరలించాడు. స్పా సెంటర్ యాజమానితోపాటు మరో నలుగురు వ్యక్తులు సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చివరకు మేడపై నుంచి దూకి తప్పించుకోవాలని ఆమె యత్నించగా.. ముఠా సభ్యులు ఆమెను లాక్కొచ్చి గదిలో బంధించారు. ఆపై మత్తు మందు ఇస్తూ పలువురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా నాలుగు రోజుల తర్వాత ఓరోజు ధైర్యం చేసిన యువతి.. నేరుగా ప్రధాన ద్వారం నుంచే పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె స్నేహితుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. -
మసాజ్ ముసుగులో.. గుట్టురట్టు!
సాక్షి, గుంటూరు : నగరంలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. లక్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్పై తర్వాత దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ను నాలుగేళ్ల నుంచి రామచంద్రరావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను బ్యూటీ పార్లర్లో వర్కర్లుగా పనిచేయిస్తున్నాడు. అయితే నష్టాలు రావడంతో నిర్వాహకుడు రామచంద్రరావు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడమే కాకుండా వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు. అర్బన్ ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్పై నిఘా పెట్టిన పోలీసులు దాడులు నిర్వహించారు. -
‘డర్టీ డజన్’గ్యాంగ్ ...
► అక్కడికి వెళ్లాక అంగడి బొమ్మలవుతున్న మహిళలు ► షేక్ల సమక్షంలో వేలం పాటలు.. లైంగిక దాడులు ► వారికి ఎదురుతిరిగితే బెదిరింపులు ► వ్యభిచారంలోకి దింపి నరకం చూపుతున్న వైనం ► పురుషులతో వెట్టి చాకిరీ ► 12 మంది నిందితుల్లో ఏడుగురు అరబ్ దేశాల్లో తిష్ట ► ఐదుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు సాక్షి, హైదరాబాద్ : దుబాయ్లో జాబ్ అంటారు.. వేలల్లో జీతమని నమ్మబలుకుతారు.. మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతారు.. తీరా వారి మాటల్ని నమ్మి వెళ్తే నరకకూపంలో దిగినట్టే! మహిళలు, యువతులు అరబ్ షేక్ల ముందు అంగడి బొమ్మలై ఏళ్లకేళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతారు. పురుషులు బానిస సంకెళ్లలో బందీ అయిపోయి దేశంకాని దేశంలో నానా అగచాట్లు పడతారు. గత పదేళ్లుగా అమాయకులపై ఇలా వల విసిరి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్లోని ఐదుగురిని పట్టుకున్నారు. మరో ఏడుగురు దుబాయ్లో ఉండటంతో వారికోసం విదేశీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ‘డర్టీ డజన్’గ్యాంగ్ గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు 100 మందిని అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఠా నాయకుడు.. దుబాయ్ శ్రీను మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా సూత్రధారి పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతడు అమలాపురం నుంచి వెళ్లి దుబాయ్లో స్థిరపడ్డాడు. ఈ దందా కోసం అక్కడా, ఇక్కడా మొత్తం 11 మంది దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రాంతానికే చెందిన మరియమ్మ, అల్ప శ్రీను, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు కేరళకు చెందిన కరీంను శ్రీనుబాబు అరబ్ దేశాలకు పిలిచించుకున్నాడు. వీరిని దుబాయ్, మస్క ట్, కువైట్, ఖతార్ల్లో ఉంచి.. ఆయా చోట్ల మ్యాన్పవర్ కన్సల్టెన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేశాడు. ఈ ఏడుగురికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యు.త్రిమూర్తులు, ఎం.తాతాజీ, పి.దాసు, జి.రామారావు (మరియమ్మ భర్త), ఎస్.మురళి సహకరిస్తున్నారు. వీరంతా తమ చుట్టుపక్కల ప్రాంతా ల్లో చిన్న చిన్న పనులు చేస్తున్న వారిలో అరబ్ దేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తారు. వారి వివరాలను దుబాయ్ శ్రీనుకు చేరవేస్తారు. అరబ్ దేశాల్లో ఇంటి సహాయకురాలు, కుక్, క్లీనర్స్, కేర్ టేకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చని బా« దితులకు ఎర వేస్తారు. అక్కడకు పంపడానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అవుతాయని చెప్పి అందినకాడికి వసూలు చేస్తారు. ఆపై అరబ్ దేశాల్లో ఉన్న మ్యాన్పవర్ కన్సల్టెన్సీల సాయంతో బో గస్ ఉద్యోగ ఆఫర్ లెటర్స్ పంపించి నమ్మిస్తారు. మహిళల వేలం పాట ముఠా సభ్యులు.. తమ మాటల్ని నమ్మి డబ్బు చెల్లించిన వారిలో కొందరికి విజిట్ వీసా, మరికొందరికి జాబ్ వీసాలు ఇప్పిస్తున్నారు. దుబాయ్కి వెళ్లాక పురుషులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇక మహిళల్ని స్థానికంగా ఉన్న మ్యాన్పవర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏజెన్సీలు అరబ్ షేక్లకు అనుబంధంగా పనిచేసే కన్సల్టెన్సీల సహకారంతో వేలంపాట నిర్వహిస్తుంటాయి. అరబ్ షేక్ల సమక్షంలో జరిగే ఈ వేలంపాటల్లో ఆకర్షణీయంగా ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఆ షేక్ల కబంధ హస్తాల్లో చిక్కిన తర్వాత ఆ మహిళల నుంచి పుస్తెలతాడు, మెట్టెలు తీయించేస్తున్నారు. తమ ఇళ్లకు తీసుకువెళ్లి బుర్ఖాలు ధరించాలని ఒత్తిడి చేస్తూ బానిసలుగా చూస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పాస్పోర్టులు సైతం షేక్ల అధీనంలోనే ఉండడంతో వారంతా ఆ నరకాల్లో మగ్గుతున్నారు. విజిట్ వీసాతో వచ్చి పని చేస్తున్నందున బయటకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరించి తమ ఇళ్లలోనే బందీ చేస్తున్నారు. ఎవరైనా మరీ గొడవ చేస్తే వారిని తిరిగి ‘దుబాయ్ శ్రీను అండ్ కో’కు అప్పగించేస్తున్నారు. ఆ ముఠా.. ఇక్కడున్న బాధితుల సంబంధీకుల నుంచి మళ్లీ డబ్బు వసూలు చేసి, టికెట్లు కొని పంపిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. చిత్రంలో నిందితులు ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రస్తుతం ఘట్కేసర్లోని అన్నోజీగూడలో నివసిస్తున్నారు. వీరిని సంప్రదించిన త్రిమూర్తులు దుబాయ్ పంపుతానంటూ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది వచ్చిన దుబాయ్ శ్రీను ఈ జంట నుంచి అదనంగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి.. రూ.70 వేలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరి 12న భార్యను, పది రోజుల తర్వాత భర్తను దుబాయ్ పంపాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో పెట్టడంతో పాటు అక్కడున్న పరిస్థితుల్ని గమనించిన వీరు తిరిగి వెళ్లిపోతామంటూ గొడవ చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వీరి బంధువు నుంచి మరో రూ.70 వేలు వసూలు చేసి, ఆ తర్వాత టికెట్లు కొని పంపారు. అక్కడ్నుంచి తిరిగొచ్చిన ఈ జంట గతేడాది జూన్లో ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు త్రిమూర్తులు, తాతాజీ, దాసు, రామారావు, మురళీలను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, వివిధ బోగస్ పత్రాలు, విజిట్ వీసా కాపీలు స్వాధీనం చేసుకుంది. దుబాయ్ శ్రీను సహా పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్ట్
కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని సాయి రామకృష్ణ లాడ్జి పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులతో పాటు లాడ్జి మేనేజర్ను అరెస్ట్ చేశారు. నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతులకు కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వ్యభిచారం పై పూర్తి నిఘా ఉందని, ఎప్పటికైనా దీనిని నిర్వహించే వారు మానుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీ పాన బసవతారకనగర్లో నివా సాల మద్య వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టూటౌన్ పోలీ సులు దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో పాటు వేశ్యలు, విటుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి సీఐ యల్లమరాజు వెల్లడించారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన అలివేలమ్మ బసవతారకనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని శింగనమలకు చెందిన ఓ మహిళ, తూర్పుగోదావరి జిల్లాకు పెద్దాపురంకు చెందిన ఓ మహిళను పిలిపించుకుని గుట్టుగా వ్యభిచారం సాగిస్తోంది. ఆదివారం ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రఘు అనే విటుడుతో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. డ యల్–100కు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు వివరించారు. నిందితులను రిమాం డ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..
♦ పోలీసులను ఆశ్రయించిన యువతి ఘట్కేసర్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఎఫ్సీనగర్లో చెందిన యువతి(17)కి ఇంటికి తరుచుగా వచ్చే శ్రీనివాస్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లికి తెలిపింది. దీంతో ఆ యువతి తల్లి అతనికే సహకరించమని డబ్బులు ఇస్తాడని అనడంతో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతని ఆగడాలు మితిమీరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లేడీ డాన్ సంగీత ఉచ్చులో బడా ‘బాబు’లు
హైదరాబాద్ : నైజీరియన్ డ్రగ్స్ ముఠా కేసులో అరెస్ట్ అయిన లేడీ డాన్ సంగీత పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో అనేక విషయాలు వెలుగు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆమె ఓ వైపు డ్రగ్స్ విక్రయిస్తూనే మరోవైపు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే తన మాట వినకపోతే యువతుల న్యూడ్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రియుడు జాన్తో కలిసి సంగీత నగర శివారులోని ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసేది. బంజారాహిల్స్కు చెందిన పలువురి ప్రముఖుల పిల్లలు ఆమె ఉచ్చులో ఉన్నట్లు విచారణలో వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి ఆరుగురిని ప్రశ్నించిన పోలీసులు, వారి రక్త నమూనాలును సేకరించారు. కాగా విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్బుక్లో సూడాన్కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్సిటీలో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే గతనెల 23న ఎల్బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్లోని తిరు అపార్ట్మెంట్లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
సీవో అంటే కొకైన్.. బ్లాక్బెర్రీ అంటే అమ్మాయి
- డ్రగ్స్ రవాణా, వ్యభిచారం చేస్తున్న నైజీరియన్ ముఠా అరెస్టు - రూ.2 లక్షల నగదు, 8 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం - డ్రగ్స్, యువతుల సమాచారాన్ని డైరీలో కోడ్ భాషలో రాసుకున్న నైజీరియన్లు సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా, వ్యభిచారానికి పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు నైజీరియన్లతోపాటు వారికి సహకరిస్తున్న విజయవాడకు చెందిన ఓ మహిళను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి 2,04,000 నగదుతో కలుపుకొని రూ.9,70,000 విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్టాప్లు, 6 పాస్పోర్టులు, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఫేస్బుక్లో పరిచయం నుంచి.. విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్బుక్లో సూడాన్కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్సిటీలో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. పక్కా సమాచారంతో.. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎల్బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్లోని తిరు అపార్ట్మెంట్లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కోడ్ లాంగ్వేజ్తో రాతలు సీవో అంటే కొకైన్.. బ్లాక్బెర్రీ అంటే అమ్మాయి.. నైజీరియన్ ముఠా సభ్యులు తమ దందాలను కోడ్ భాషలో రాసుకునే పదాలివి. వారు నైజీరియన్ యువతులతో యాప్రాల్ కేంద్రంగా.. కుషాయి గూడ, ఏఎస్రావు నగర్, జవహర్నగర్, నేరేడ్ మెట్లలో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు గాబ్రిల్ కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాకు గోవాలోని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు తేలింది. దీనిపై పోలీసులు గోవా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో డ్రగ్స్ కేసుల్లో అరెస్టైన వారికి, ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న దిశగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
తాడేపల్లిలో హైటెక్ వ్యభిచారం
► ఢిల్లీ యువతి, విజయవాడ యువకుడు అరెస్టు ► పత్తాలేని నిర్వాహకుడు కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని కుంచనపల్లిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ ఢిల్లీ యువతి, విజయవాడ యువకుడు శనివారం పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెళితే... విజయవాడకు చెందిన యువకుడు ఫోన్ల ద్వారా విటులతో మాట్లాడి వ్యభిచారం నిర్వహించే మహిళలను సాంప్రదాయబద్ధంగా కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్కు పంపించి, బ్యాంక్ అకౌంట్ ద్వారా గాని, వచ్చిన మహిళలకు గాని డబ్బులు ఇచ్చిపంపేటట్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్లో ఓ ప్లాట్ తీసుకొని, దానిని అమ్మకానికి పెట్టినట్లు నమ్మించి, ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే విధంగా జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులకు సమాచారం అంది దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన యువతి, విజయవాడకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వేశ్యలకు బహిరంగ ఉరి
సియోల్: నది పరివాహక ప్రాంతాలు, పాఠశాలల క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు. ఒకదానికి మరొదానికి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా?. ఇవన్నీ ఉత్తరకొరియా బహిరంగంగా ఉరి తీయడానికి వినియోగించే ప్రదేశాలు. అవును. అక్కడి పాఠశాలల్లో విద్యార్థులు ఉరి తీయడాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. వ్యభిచారులను, పరిశ్రమల నుంచి వస్తువులు దొంగిలించినవారిని, దక్షిణ కొరియాకు దేశ సమాచారాన్ని చేరవేసిన వారిని బహిరంగంగా ఉరి తీస్తారు. దీన్ని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ చూస్తారని దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్ధ తన రిపోర్టులో పేర్కొంది. ఉత్తరకొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న 375 మంది ఈ విషయాన్ని చెప్పారని సదరు సంస్ధ వెల్లడించింది. ఉత్తరకొరియా మ్యాప్లో బహిరంగ ఉరి తీసే ప్రదేశాలను గుర్తించి ప్రచురించింది కూడా. 2014లో నియంతగా కిమ్ జోంగ్ ఉన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హక్కుల ఉల్లంఘన మరింత పెరిగిందని యూనైటెడ్ నేషన్స్ కమిషన్ పేర్కొన్న విషయం తెలిసిందే. భారీ జైళ్లు, క్రమపద్దతిలో హింస, ఆకలితో మాడ్చి చంపడం, ఉరి తీయడం లాంటి శిక్షలు నాజీ కాలం కన్నా ఘోరంగా ఉత్తరకొరియాలో అమలు జరుగుతున్నాయని సంస్ధ తెలిపింది. -
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
చెన్నై: పుదుచ్చేరిలోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందకు సెంటర్కు పంపారు. వీరు మసాజ్ సెంటర్కు వెళ్లగానే తలా మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు. పోలీసులు ఎంపిక చేసుకున్న ఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోని ఆరుగురు మహిళలను రక్షించారు. వారిలో పుదుచ్చేరి సామిపిల్లై తోటకు చెందిన శశి(32), తమిళ్సెల్వి(31), దిండివనంకు చెందిన కార్తిక్(23), లాస్పేట్కు చెందిన గురుసామి(33)గా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన నలుగురిని శుక్రవారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలులో ఉంచారు. -
పెడదోవకు కేరాఫ్ హైవే
రాజానగరం : ఇంతవరకు వాహాన ప్రమాదాలకే తావిస్తున్న జాతీయ రహదారి, వాటితోపాటు సుఖ వ్యాధులు వ్యాప్తికి కూడా కారణమవుతుంది. మొన్నటి వరకు ఈ రహదారి వెంబడి ఉన్న పలు కాకా హోటళ్లే అడ్డాగా సాగిన అసాంఘీక కార్యకలాపాలు ఇప్పుడు చెట్టు పుట్ట అనే తేడా లేకుండా, పగలు, రాత్రి అనే సమయంతో నిమిత్తం లేకుండా యధేచ్చగా జరిగిపోతున్నాయి. దీనితో అభం, శుభం తెలియని కుర్రకారు వీటి ఆకర్షణకు లోనై ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన సుఖవ్యాధులను అంటించుకుని మొగ్గ దశలోనే జీవితాలను బలిచేసుకుంటున్నారు. వీటిని నిరోధించవలసిన పోలీసులు పరిధి, వారధి అంటూ మడికట్టుకుని కూర్చుంటే అవకాశవాదులు బ్రోతల్స్తో చేతులు కలిపి అంకిన కాడికి విఠులను దోచుకుంటున్నారనే ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో తుని నుండి రావులపాలెం వరకు సుమారు 130 కిమీ పొడవున 16వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి ఉంది. ఈ రహదారిలో రావులపాలెం నుండి వేమగిరి వరకు కూరగాయల తోటలు, పూల నర్సరీలు ఉంటే, వేమగిరి నుండి తుని వరకు మామిడి, జీడిమామిడి తోటలుతోపాటు పుంకానుపుంకాలుగా వేసిన లేఅవుట్లు ఉన్నాయి. దివాన్చెరువు, లాలాచెరువులో 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు కూడా ఉంది. ఏ ప్రాంతంలో ఏమున్నాగాని వాటినే అడ్డాగా చేసుకుని అసాంఘీక కార్యకలాపాలకు నిర్భయంగా సాగిస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం నుండి రాజానగరం వరకు ఆదికవి నన్నయ యూనివర్సిటీతోపాటు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఎక్కువగా ఉండటంతో తెలిసీ తెలియని వయస్సులో యవ్వన దశలో ఉన్న యువత వీటికి ఆకర్సితులై నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. టార్చిలైట్స్తో సిగ్నల్స్ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న తోటలు, లేఅవుట్లలో పెరిగిన తుప్పలు అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా తయారువుతున్నాయి. లాలాచెరువులోని పుష్కర వనం ప్రాంతంతోపాటు దివాన్చెరువు నుండి గైట్ కళాశాల వరకు ఉన్న రిజిర్వు ఫారెస్టు, నన్నయ యూనివర్సిటీ సమీపంలోని ఆర్కె టైన్ షిప్, జెకె గార్డన్స్, పగటి సమయంలో కూడా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఈ ప్రాంతాలతోపాటు రహదారి పొడవునా రాత్రి సమయాలలో విటులను టార్జిలైట్స్ వేసి మరీ ఆకర్షిస్తున్నా నిఘా వ్యవస్త నిశ్చేతనంగా చూస్తుంది. దారి పొడవునా ఉన్న తోటులు, తుప్పల నుండి టార్చ్ లైట్ సిగ్నల్స్ వస్తే చాలు అటుగా పోయే విటులు తమ వాహనాలను సైతం రోడ్డు ప్రక్కన పార్కు చేసి లైట్ సిగ్నల్స్ వచ్చిన వైపు వెళ్లి, కోరిక తీర్చుకుని వస్తున్నారు. ఈ సమయంలో వారికి అంటుకునే రోగాల గురించి, తమనే నమ్ముకున్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం లేదు. అయితే ఏ అవకాశం లేని వారు ఈ రొంపిలోకి వస్తారని, కుటుంబ పరిస్తితులే వారిని ఈ విధంగా మారుస్థాయని బ్రోతల్స్ పట్ల జాలి చూపించే వ్యక్తులు వారి ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత గురించి కూడా ఆలోచించాలి. ఇదో రకమైన దోపీడీ .. జాతీయ రహదారి వెంబడి పెరిగిపోతున్న అసాంఘీక కార్యకలాపాలను నియంత్రించవలసిన పోలీసు వ్యవస్త ఈ విషయంలో పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పవచ్చు. తమ పై బాస్లు కూడా ఈ విషయమై పెద్దగా సీరియస్నెస్ చూపకపోవడంతో కొంతమంది పోలీసు కానిస్టేబుల్స్ బ్రోతల్స్ సాయంతో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు ఇటీవల కాలంలో ఎక్కువగా వీరి ఆకర్షణకు లోనవుతున్నారు. అటువంటి వారిలో బాగా రిచ్గా కనిపించిన వారు ఎవరైనా ఉంటే బ్రోతల్స్ ఫోన్ ద్వారా తనకు టచ్లో ఉండే కానిస్టేబుల్కి వర్తమానం పంపడం, ఆ పై అతను వేగిరమే అక్కడకు చేరుకుని ఇరువురిని చెడామడా తిట్టి, పోలీసు స్టేషనుకు రమ్మంటూ బెదిరించడం, దానితో ఆ యువకుడు భయపడిపోయి, తన వద్ద ఉన్నదంతా నిలువుదోపిడీగా అతని చెల్లించుకోవడం ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఇదే విషయాన్ని కొంతమంది పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినాగాని ఎటువంటి ప్రయోజనం లేదు, సరికదా వారి వివరాలు ఇస్తే యాక్షన్ తీసుకుంటామనడం కొసమెరుపు. ఉపాధి చూపితే ఈ పని మానేస్తాం ఈ పని చేయడానికి మాకు కూడా రోతగానే ఉంది. కాని ఏం చేస్తాం, మా జీవితాలతోపాటు మరికొందరి జీవితాలను కూడా మేమే పోషించాలి. గత్యంతరం లేని స్థితిలో ఈ పనిచేస్తున్నాం. ప్రభుత్వం మాలాంటోళ్లకు సరైన ఉపాధి చూపితే ఈ పని మానేసి, హాయిగా సంసార పక్షంగా బ్రతుకుగడపాలను కుంటున్నాం. కాని మాకు ఉపాధి ఎవరు చూపుతారు, నాయకులు మాటలు చెప్పడమేగాని ఆచరణలో కనిపించడం లేదు. - పేరు వద్దని ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరించింది. -
విలాసవంత జీవితం కోసం..
► జిల్లాకేంద్రంలో నివాస గృహాలే అడ్డాలు..! ►జాతీయ రహదారి వెంటా అదే తరహాలో.. ►గురువారం దాడితో మరోసారి వెలుగులోకి వచ్చిన దందా మహబూబ్నగర్ క్రైం: చూడటానికి అవి నివాస గృహాలే.. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కొందరు కనిపిస్తారు. లోపల జరిగే తతంగం వేరు. అదే వ్యభిచార కేంద్రం జిల్లాలో ఈ పాడు వృత్తి కేంద్రాలు పెద్దసంఖ్యలో ఏర్పడుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. సెల్ఫోన్లోనే బేరసారాలు చేస్తున్నారు. వేశ్యలు.. కొందరు గృహిణులకు సైతం ప్రలోభాలతో ఆశచూపి ఈ రంగంలోకి దించుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల, భూత్పూర్తోపాటు మరికొన్ని పట్టణాలలో విస్తరిస్తున్న హైటెక్ వ్యభిచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జడ్చర్ల, భూత్పూర్ జాతీయ రహదారుల వెంట ఈ దందా బాగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేక పాడువృత్తిలో దిగిన మహిళలు కొందరే ఉండగా మరికొందరు మరింత విలాసవంత జీవితం కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వేశ్య వృత్తి చేసేవారు మంచి కుటుంబాల మహిళలను ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండటమే ఆందోళనకంగా మారింది. ప్రతిరోజు జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యల ఇళ్లలో, ముఖ్యమైన హోటల్స్తోపాటు చిన్న లాడ్జింగ్లలో ఈ దందా నడుస్తోందంటే ఇది ఎంత శృతిమించిందో అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్లో ఫొటోలు చూసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మంచి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలస్తోంది. దీనికోసం చాలామంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకుపోతున్నారు. పైగా సెల్ఫోన్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాకే సదరు మహిళ ఫొటో విటునికి పంపించి బేరమాడుకుంటున్నారు. మరికొందరు సెల్ఫోన్లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో.. లేక మార్కెట్లో ఫలానాచోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధరణ చేసుకున్నాకే బేరమాడుతున్నారు. రూ.5నుంచి 10వేల వరకు వసూలు కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. హైదరాబాద్తోపాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశ చూపెట్టి ఈ రంగంలోకి దించుతూ.. వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పరిచయస్తులైన యువతులకు సైతం గాలం వేస్తున్నారు. మధ్యవర్థులే విపరీతంగా సంపాదిస్తున్నారు. జిల్లాకేంద్రంలో రూరల్, టూటౌన్, వన్టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నా, పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నివాసగృహాలతోపాటు హోటల్స్, లాడ్జీల్లో.. ప్రత్యేకంగా వ్యభిచార కేంద్రాలని ఎవరికి అనుమానం కల్గకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకున్నారు. జిల్లాకేంద్రం లోని హౌజింగ్బోర్డు, శ్రీనివాసకాలనీ, వెంకటేశ్వరకాలనీ, రాజీవ్గృహకల్ప, అశోక్టాకీస్, పాతబస్టాండ్ పలు కాలనీల్లోని ఇళ్లల్లో ఈ దందా నడుస్తోంది. బంధువులు వచ్చారనో, సామగ్రి కొనుగోలు చేస్తున్నామనో పట్టపగలే విటులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. అనుమానం రాకుండా ప్రధాన ద్వారం మూయకుండా ఇద్దరుముగ్గురు మహిళలు మాట్లాడుకుంటున్నట్లు బయటకు కనిపిస్తూ.. లోపల గదిలో దర్జాగా పగలే దందా చేయిస్తున్నారు. చాలామటుకు సొంతిళ్లలోనే ఈ వ్యభిచారం నడిపిస్తుండగా కొందరు అద్దె ఇళ్లలో ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ఓ ఇంటికి ఉదయం 11నుంచి సాయంత్రం 4 గంటల వరకు రూ.వేయి అద్దె చెల్లించినట్లు సమాచారం.కొత్త వస్త్రాలతో కనిపిం చాలనే ధ్యాస, విలాసవంతంగా ఉండాలనే చాలా మంది మహిళలు ఈ ప్రలోభావాలకు ఆకర్షితులై పాడువృత్తిలోకి దిగి పక్కదారి పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సమాచారం ఉందా? ఒక్కో విటుడి నుంచి రూ.1000నుంచి మొదలు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. సదరు మహిళ, యువతిని బట్టి ఈ ధర ఉంటుంది. దినంలోనైతే ఒక ధర, రాత్రి మొత్తం ఉంటే మరో ధర అని మాట్లాడుకుంటున్నారు. దీనికి అలవాటు పడ్డ యువత చాలామంది రోడ్డున పడుతున్నారు. అనర్థాలు జరగక ముందే పోలీసులు స్పందించాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
సోమాజిగూడ హోటల్లో వ్యభిచారం గుట్టు రట్టు
-
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్: అన్ లైన్ ద్వారా వ్యభిచారం నడిపిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు అయింది. ఈ సంఘటనకు సంబంధించి యాప్రాల్లో ముగ్గురు యువతులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పరారయ్యాడు. పట్టుబడిన యువతులను జవహర్ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
వ్యభిచార గృహంపై దాడులు
హైదరాబాద్ : నగరంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేపట్టారు. చింతల్లోని ప్రసూననగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై పోలీసులు బుధవారం అర్థరాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచారంలోకి దించితే కఠిన చర్యలు
డీజీపీ అనురాగ్శర్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: మహిళలు, మైనర్ బాలికలను వ్యభి చార కూపంలోకి దింపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్నూతోపాటు మెదక్ జిల్లాలో వ్యభిచార కేంద్రాలపై సీఐడీ దాడులు చేసి పెద్ద సంఖ్యలో బాధితులను రక్షించిందన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘మానవ అక్రమ రవాణా’ అంశంపై జరిగిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించి వారు కోలుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. విద్య వల్ల మానవ అక్రమ రవాణా అరికట్టొచ్చని యునిసెఫ్ స్టేట్హెడ్ జేరూ మాస్టర్ అభిప్రాయపడ్డారు. మానవ అక్రమ రవాణాలో దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ నాయర్, సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా పాల్గొన్నారు. -
ఈ నగరానికేమయింది...
ఆధ్యాత్మిక కోటలో అలజడి ఆందోళన కలిగిస్తున్న హత్యలు యథేచ్ఛగా దొంగతనాలు... రౌడీయిజం బెంబేలెత్తిస్తున్న కిడ్నాపర్ల ఆగడాలు మహిళలకు పగలే కరువైన రక్షణ వాడవాడలా విజృంభిస్తున్న వ్యభిచారం తిరుపతి ఆధ్యాత్మిక నగరంగానూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానూ అందరికీ పరిచయమే. ఒకప్పుడు ఇక్కడ ఎక్కడా లభించని ప్రశాంతత, ఆనందం దక్కేవి. వాడవాడలా గోవింద నామస్మరణే. తండోప తండాలుగా కొండపైకి తరలి వెళ్లే భక్తుల సందడి...వీనుల విందుగా తన్మయత్వానికి గురిచేసే మంగళ వాయిద్యాల హోరు. బస్టాండ్లో దిగింది మొదలు...ఎటు చూసినా కల్మషం లేని మనుషులు, స్వార్థం ఎరుగని అధికారులతో నగర వాతావరణం ప్రశాంతతకు పట్టుగొమ్మగా ఉండేది. ఇప్పుడు ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఏడాది కాలంగా నేరాలు పెరిగాయి. రౌడీయిజం, దొంగతనాలు, కిడ్నాప్లు, ఆస్తి గొడవలు, వరకట్నపు చావులు పోలీసులకు సవాల్గా మారాయి. ఇటీవల పెరిగిన హత్యోదంతాలు, హత్యాయత్నాలు నగర ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. పోలీసులు ఉన్నా లేనట్లేనన్న భావన కనిపిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ పెరిగిన నేర ప్రవత్తి నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. తిరుపతి/తిరుపతి క్రైం : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లపై నడుస్తుందన్న సామెత తిరుపతిని చూస్తే నిజమన్న భావన కలుగుతోంది. ఇక్కడున్న పోలీస్ వ్యవస్థలో సరైన ప్రణాళికలు కొరవడం, నిబద్ధత లోపించడం, భయపెట్టే తత్వం తగ్గడం వంటివి శాంతిభద్రల విఘాతానికి కారణంగా కనిపిస్తోంది. దీన్ని అలుసుగానూ, అదునుగానూ తీసుకున్న నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. కళ్లాలు లేని గుర్రాల్లా నేర సామ్రాజ్యంలో పరుగులు తీస్తున్నా రు. విలాసాల మోజులో ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల సెంటర్లలో మెల్లమెల్లగా రౌడీయిజం పెరుగుతోంది. యువకులు రోడ్లపైనే మద్యం సేవిస్తూ నిమ్మకాయల వీధిలో గొడవలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను బెదిరించే చోటా మోటా నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. తుడా కార్యాలయం పక్కనే ఉన్న మార్కెట్ ప్రాంతంలోనూ రాత్రిళ్లు రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. వీరి తీరుకు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో భూ ఆక్రమణలకు అంతు లేకుండా పోతుంది. ఉన్న కొద్దిపాటి జాగాను కోల్పోయిన సామాన్యుడిది అరణ్య రోదనవుతోంది. భక్తులను ఏమార్చి బ్యాగులతో పరారయ్యే చిన్నచిన్న దొంగలు రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీదేవీ కాంప్లెక్సు, హరేరామ హరేకృష్ణ ఆలయాల సమీపంలో దొంగతనాలు జరిగాయి. నగరంలో హత్యలు పెరిగాయి. నాలుగు రోజుల కిందట తిరుపతి రూరల్ పరిధిలోని సీ మల్లవరంలో భార్య తల నరికిన ఉదం తం గగుర్భాటుకు గురిచేసింది. దీన్ని మరవక ముందే బుధవారం నగరంలోని అబ్బన్నకాలనీలో మరో దారుణం జరిగింది. ఉన్మాదిగా మారిన సాత్విక్కుమార్ భార్య, కుమార్తెలపై కత్తితో దాడిచేశాడు. గురువారం అలిపిరి బస్టాండ్ దగ్గర మరో హత్య వెలుగు చూసింది. కలవరపెడుతున్న కిడ్నాప్లు.. నగరంలో వేళ్లూనుకుంటున్న కిడ్నాప్లు జనాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పల్లెవీధిలోని ఓ ఫైనాన్స్ర్ను తమిళనాడుకు చెందిన ముఠాతో కలిసి స్థానికులు కిడ్నాప్నకు పాల్పడి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న కిడ్నాపర్లు అమాయకుల అప్రమత్తంగా లేని సమయంలో పిల్లల్ని సైతం కిడ్నాప్ చేస్తున్నారు. వారం కిందట తిరుమలలో జరిగిన బాలిక నవ్యశ్రీ ఉదంతమే ఇందుకు నిదర్శనం. పోలీసులు నేరస్థులను అరెస్టు చేసినప్పటికీ ప్రజల్లోని భయాందోళనలను మాత్రం తొలగించలేకపోయారు. విస్తరిస్తున్న వ్యభిచారం.. పవిత్రతకు నెలవైన నగరంలో వ్యభిచారం వేళ్లూనుకుంటోంది. కీలక ప్రాంతాల్లోనూ, కొన్ని లాడ్జీల్లోనూ హైటెక్ వ్యభిచారం విస్మయాన్ని కలిగి స్తోంది. బెంగళూర్, చెన్నై, పూనే ప్రాంతాల నుంచి యువతులను రప్పించి యువతకు ఎర వేసే బ్రోకర్లు పెరిగారు. వరకట్న వేధింపులు, గల్ఫ్ మోసాలు కూడా బయటపడుతున్నాయి. అమాయకులు రోడ్లపాలై గగ్గోలు పెడుతున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్న జనం గోడు పట్టించుకున్న వారే కరువయ్యారు. స్పెషల్ బ్రాంచి అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. బందోబస్తు డ్యూటీలే ఎక్కువ.. తిరుపతి అర్బన్ పరిధిలోని పోలీసులకు, అధికారులకు బందోబస్తు డ్యూటీలు, ప్రోటోకాల్ విధులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైన ఈవెంట్లు తిరుపతిలోనే జరుగుతుండటంతో ఆయా కార్యక్రమాలకు హాజర య్యే వీవీఐపీలకు బందోబస్తు నిర్వహించడంతోనే పోలీసులకు సరిపోతుంది. నేరాలను ముందే పసిగట్టి, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకునే వెసులుబాటే ఉండటం లేదు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. -
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న మసాజ్ సెంటర్పై పోలీసులు దాడి చేసి 9మందిని అదుపులోకి తీసుకున్నారు. పనామా సెంటర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్లో గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం అకస్మికంగా దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా సెంటర్ నిర్వాహకుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. పట్టుబడ్డవారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
వ్యభిచార గృహాలపై దాడులు
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,500 స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేశారు. -
సెక్స్రాకెట్లో దొరికిపోయిన బ్యూటీ క్వీన్
వియత్నాం: ఆమె ఓ అందమైన యువతి. విశ్వవిద్యాలయంలో గొప్ప విద్యనభ్యసించింది. అదొక్కటే కాదు స్థానికంగా జరిగిన అందమైన యువతుల పోటీల్లో తొలి రన్నరప్గా నిలిచింది. కానీ, ఆ గతాన్ని మరుగునపడేసేంత చెత్త పనిచేసింది. సెక్స్రాకెట్లో పోలీసులకు దొరికిపోయింది. ఆమె మరో యువతి కలిసి ఓ హోటల్లో మరో ఇద్దరు విఠులతో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయి ఇప్పుడు కటకటాలపాలయింది. వివరాల్లోకి వెళితే.. తారన్ డక్ థై లియాన్ అనే యువతి 2014 తాను చదువుతున్న యూనివర్సిటీలో నిర్వహించి బ్యూటీ క్వీన్ కాంటెస్ట్లో పాల్గొని తొలి రన్నరప్గా నిలిచింది. అయితే, ఇటీవల ఆమె తన అనుచరురాలు డోవాన్ ఎన్గోక్ మిన్హా(26) కలిసి వియత్నాంలోని క్వాంగ్ నిన్స్ ప్రావిన్స్లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో లియాన్కు మూడున్నర జైలు శిక్ష పడగా.. ఆమె అనుచరురాలుకి రెండు సంవత్సరాల మూడు నెలల శిక్షపడింది. అంతేకాదు, వీరు 2,900 డాలర్ల మొత్తాన్ని కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది. -
కన్న కూతుళ్లతో వ్యభిచారం
రాజస్తాన్లోని కంజర తెగలో దురాచారం బుండీ: రాజస్తాన్ బుండీ జిల్లాలోని సంచార కంజర తెగలో కన్న కూతుళ్లను తల్లిదండ్రులే వ్యభిచారం రొంపిలోకి దింపుతారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కంజర తెగ వారు తమ కూతుళ్లు యుక్త వయసుకు రాకముందే వారిని అమ్మేయడం, కుదువ పెట్టడం చేస్తుంటారు. ‘చారి ప్రథ’అనే ఈ సంప్రదాయాన్ని ఎవరైనా ఎదిరిస్తే తెగ పెద్దలు బాలిక తల్లిదండ్రులపై రూ.లక్షల జరిమానాలు విధిస్తారు. చారి ప్రథను రూపుమాపే ఉద్దేశంతో బుండీ జిల్లా అధికారులు కంజర తెగ ప్రజలతో సమావేశం నిర్వహించారు. తెగ పెద్దలను శిక్షిస్తేనే ఈ దురాచారానికి ముగింపు పలకవచ్చని సమావేశానికి హాజరైన వారు పేర్కొన్నారు. -
బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం..
హైదరాబాద్: బ్యూటీ పార్లర్ ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టును తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించిన వివరాలివీ.. హయత్నగర్కు చెందిన ఎ.వీరాస్వామి నాయుడు ముసారాంబాగ్ ప్రాంతంలో వీఎస్ యునెక్స్ బ్యూటీ పార్లర్ అండ్ స్పా నిర్వహిస్తున్నాడు. ఏపీలోని ఏలూరుతో పాటు నల్లగొండ ప్రాంతానికి చెందిన కె.శ్రీకాంత్, డి.దామోదర్లతో కలిసి బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, కోల్కతా, బెంగళూరు నుంచి యువతుల్ని తీసుకువచ్చి ఈ రొంపిలో దింపుతూ ధనార్జన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం దాడి చేశారు. వీరాస్వామి, శ్రీకాంత్, దామోదర్లతో పాటు విటులుగా వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి రూ.26 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. -
వ్యభిచారం కేసులో 9 మంది అరెస్ట్
కడప అర్బన్: కడప వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్లో ఓ ఇంటిలో వ్యభిచారం నడుపుతున్న నిర్వాహకుడు ఫ్రాన్సిస్తోపాటు మరో 8 మంది మహిళలను వన్ టౌన్ ఇన్చార్జి సీఐ మోహన్ ప్రసాద్, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో కలిసి వెళ్లి శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, రూ.2700 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు నేరుగా వచ్చిన సమాచారం మేరకు సదరు వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. మహిళలను మహిళా సంరక్షణ కేంద్రానికి పంపారు. వారిలో నిందితులను శనివారం కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. -
వ్యభిచారం చేయాలని టీవీ నటిపై ఒత్తిడి!
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఫోన్లలో చివరిసారిగా జరిగిన సంభాషణలను 'ముంబై మిర్రర్' వెల్లడించింది. మూడు నిమిషాల నిడివున్న ఈ ఫోన్ సంభాషణలు ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగినట్టు తెలిపింది. 'నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నటించడానికి, పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్... నీకు తెలీదు ఇప్పడు నేనెంతగా కుమిలిపోతున్నానో. నువ్వు స్వార్థపరుడివి. నా పేరును చెడగొట్టావు. జనం నన్ను, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నార'ని ప్రత్యూష ఫోన్ లో వాపోయింది. వ్యభిచారం చేయమని ప్రత్యూషను రాహుల్ ఒత్తిడి చేశాడని ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపించారు. ప్రత్యూష చివరిసారిగా రాహుల్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు 'వ్యభిచారం' అనే పదం వాడిందని తెలిపారు. అయితే ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని రాహుల్ అంతకుముందు చెప్పాడు. డబ్బుకోసమే ప్రత్యూష తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ప్రత్యూషకు అవకాశాలు దొరకప్పుడు తానే అండగా నిలిచానని బెయిల్ పై విడుదలైన రాహుల్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 1న ఆంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకుంది. -
వ్యభిచారం కేసులో నలుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడపలోని మృత్యుంజయకుంటలో సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్టు చేసినట్లు చిన్నచౌకు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. అరెస్టు అయిన వారిలో నిర్వాహకురాలు పద్మ అలియాస్ పార్వతి, మరో మహిళ ధనలక్ష్మి, విటులలో వల్లూరు మండలం గోటూరుకు చెందిన మోహన్రెడ్డి, ఒంటిమిట్ట మండలం మాధవరంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న గంగాధర్ ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నామని ఎస్ఐ తెలిపారు. -
మకాం మార్చిన ‘నాయకీ’
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం హైటెక్ వ్యభిచారంపై పోలీసు నిఘా వర్గాల ఆరా అమరావతి : రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం వ్యవహారం కలకలం రేపుతోంది. మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా ఓ రాజకీయ పార్టీ నాయకురాలు గుట్టుగా నడిపిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని ‘సాక్షి’ రట్టు చేయడంతో సదరు నాయకీ వెంటనే మకాం మార్చేసింది. నియోజకవర్గ సరిహద్దులు దాటి వెళ్లి అక్కడ వ్యాపారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సాక్షి’లో ‘రింబోల.. రింబోల’ పేరుతో ఇటీవల రాజధానిలో హైటెక్ వ్యభిచారంపై కథనం వచ్చిన విషయం విదితమే. దీంతో వ్యభిచారగృహ నిర్వాహకురాలి వద్ద మమూళ్లు తీసుకుని అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్థానిక పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. కొన్ని రోజులపాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. అందువల్లే ఆమె నియోజకవర్గ సరిహద్దులు దాటి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో అద్దెకు తీసుకున్న అన్ని ఫ్లాట్లు ఖాళీ చేసి తెనాలి వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు హైటెక్ వ్యభిచారంపై పోలీస్ నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. అయితే తమ మాముళ్ల వ్యవహారం బయటపడుతుందనే ఆందోళనతో స్థానిక పోలీసులు... ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆందోళనలో టీడీపీ నేత వ్యభిచార గృహాల నిర్వాహకురాలికి అండగా ఉన్న టీడీపీ నియోజకర్గ నాయకుడు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి విషయం వెలుగులోకి వస్తే తన పరువు పోతుందని భయపడుతున్నట్లు సమాచారం. వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన వాయిస్ ‘సాక్షి’ ప్రతినిధులకు ఎలా చేరిందని, జాగ్రతగా ఉండాలని నిర్వాహకురాలిని ఆయన మందలించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై అధికార పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో నేతలు కక్కుర్తిపడితే పార్టీ పరువు పోతుందని మందలించినట్లు తెలిసింది. -
వ్యభిచారం కేసులో కానిస్టేబుల్
నాగోలు: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి 7వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ టి.రమేష్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఏపీఎస్ఈబీ కాలనీలో.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం ఇంటిపై దాడి చేయగా రమేష్ పారిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. గదిలో ఉన్న రమేష్ గుర్తింపుకార్డు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకొండలో హైటెక్ వ్యభిచారం
పాలకొండ రూరల్ : అన్నవరం పంచాయతీ పరిధిలోని పాలకొండ–రాజాం రోడ్డులోని ఓ నూతన గృహాన్ని వ్యభిచారానికి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆ గృహంపై ఎస్ఐ ఎం.చంద్రమౌళి పోలీస్ సిబ్బందితో దాడి చేశారు. ఓ మహిళతో పాటు న లుగురు విటులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి రూ.2 వేలు నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కొన్ని రోజులుగా... రేగిడి మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పాలకొండకు సమీపంలో ఓ గృహాన్ని అద్దెకు తీసుకున్నాడు. తనకున్న పరిచయాలతో వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురం, రాజాం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి మహిళలను రప్పిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నాడు. ఎక్కువగా యువతను ఆకర్షిస్తూ సెల్ఫోన్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తన హైటెక్ వ్యభిచారాన్ని దర్జాగా కొనసాగిస్తూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. -
విదేశీ వ్యభిచార గృహాల్లో ఆడపడుచులు!
ఉద్యోగాల ఆశచూపి వేశ్యలుగా మార్చేస్తున్నారు డబ్బులు కడితేనే అక్కడ్నించి విముక్తి మలేషియాలో 150 మంది రాష్ట్ర మహిళలు తూ.గో, ప.గో, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం.. జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వెళ్లి చిక్కుకున్న వైనం చిత్తూరు (అర్బన్): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి మహిⶠలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి దాదాపు 150 మంది వేశ్య గృహాల్లో అమ్మేశారు. చిత్తూరు పోలీసుల దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత రెండు రోజుల కిందట సత్యవేడు పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. మలేషియాలో హౌస్ కీపింగ్ కోసం మనుషులు కావాలని తెలిసిన వాళ్లు చెప్పడంతో ఓ మధ్యవర్తి ద్వారా ఎనిమిది నెలల క్రితం పాస్పోర్టు, వీసా తీసుకుని వెళ్లాలని పేర్కొంది. తీరా అక్కడకు వెళ్లిన తరువాత ఓ వేశ్య గృహానికి తనను తీసుకెళ్లి, వ్యభిచారం చేయమని చెప్పి శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది. తినడాకి తిండి లేకుండా చావు బతుకుల మధ్య వ్యభిచారం చేస్తూ నెలల పాటు ఇక్కడే ఉన్నానని, తనను రూ.1.30 లక్షలకు మలేషియాలోని వేశ్య గృహంలో అమ్మేసినట్లు తెలుసుకున్నట్లు పోలీసులకు తెలియచేసింది. తీరా ఏడు నెలల కాలంలో వ్యభిచారం చేసి వేశ్య గృహం నిర్వాహకురాలికి రూ.1.80 లక్షలు చెల్లించి స్వదేశానికి తిరిగొచ్చినట్లు పేర్కొంది. తనలాంటి వాళ్లు ఇక్కడ వందలాది మంది ఉన్నారని దీనిపై కేసు పెట్టాలని ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. దీనిపై ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓఎస్డీ రత్న, డీఎస్పీ గిరిధర్ల నేతృత్వంలోని ఓ బృందం దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో తేలిన అంశాలు... పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. చెన్నైకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో 30 మందిని విచారించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 150 మందిని మలేషియాకు పంపినట్లు నిందితులు అంగీకరించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, మన రాష్ట్రంలోని నెల్లూరు, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో మధ్యవర్తుల ద్వారా మహిళల్ని విదేశీ వేశ్య గృహాల్లో అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. ఇందులో ప్రధానంగా భర్తకు దూరమైన వాళ్లు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మలేషియాలో చిన్న పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటిపని చేయడానికి మనుషులు కావాలన్నట్లు పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, మహిళలకు టూరిస్ట్ వీసా తీసుకుని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు లంచాలు ఇచ్చి వేశ్య గృహాలకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. డీజీపీతో మాట్లాడాం మహిళల తరలింపు ఓ చైన్లింక్లా ఉంది. విచారిస్తూ వెళుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మా ఎస్పీ.. రాష్ట్ర డీజీపీతో మాట్లాడాం. మలేషియాలోని వేశ్య గృహాల్లో చిక్కుకున్న మహిళల్ని అక్కడి నుంచి బయటపడేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. – రత్న, ఓఎస్డీ, చిత్తూరు -
ఉద్యోగాల పేరుతో.. విదేశాల్లోని వ్యభిచార గృహాలకు
చిత్తూరు: ఉద్యోగాల పేరిట మహిళల్ని మోసం చేసి మలేషియాలోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసు శాఖలోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) రత్న బుధవారం స్థానికం పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత నుంచి తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఉద్యోగం పేరిట మోసం చేసి తనను మలేషియాలోని వ్యభిచార గృహంలో అమ్మేసినట్లు తెలిపిందని, ఏడు నెలల పాటు వేశ్యగా మారి వచ్చిన డబ్బుతో అక్కడి వ్యభిచార గృహ నిర్వాహకులకు రూ.1.80 లక్షలు చెల్లించి భారత్కు తిరిగి వచ్చినట్లు ఫిర్యాదు రావడంతో కేసు దర్యాప్తు చేశామన్నారు. తమిళనాడులో చెన్నైలోని కొడుజూర్కు చెందిన ఎ.రఫి (41)ను తొలుత అరెస్టుచేసి విచారిస్తే ఓ ప్రైవేటు విమాన టికెట్ల బుకింగ్ సెంటర్ పెట్టుకున్నట్లు తెలిసిందన్నారు. ఇక్కడ దుబాయ్, మలేషియా, షార్జాకు వెళ్లే వాళ్లకు టికెట్లు, వీసా ఇపిస్తూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని మధ్యవర్తుల ద్వారా గుర్తించి వీళ్లను మలేషియాలోని వేశ్య గృహాలకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. మలేషియాలోని ధను అనే మహిళకు చెందిన వేశ్య గృహంలో ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో మహిళల్ని విక్రయించినట్లు అంగీకరించాడు. తనకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 19 మంది ఏజెంట్లు ఉన్నారని వీళ్ల ద్వార మహిళల్ని విదేశాలు పంపుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఇతనితో పాటు ఈ అక్రమ రవాణాలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూరుకు చెందిన పాండియరాజన్ (38) అనే వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో పట్టున్న ఇతను రఫీకి పలువురు మహిళల్ని పరిచయం చేయించి వాళ్లను అక్రమంగా వేశ్య గృహాలకు విక్రయించడంలో తోడ్పడేవాడు. నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని రత్న తెలిపారు. -
పట్టుబడ్డ వ్యభిచార ముఠా
గతంలో పట్టుబడ్డ నిందితులే కీలక సూత్రధారులు భార్యభర్తలు పేరిట ఓ అపార్ట్మెంట్లో కార్యకలాపాలు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు పాత శ్రీకాకుళం : ఎచ్చెర్ల పోలీస్స్టేషన్ పరిధిలో పదిహేను రోజుల కిందట పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని వన్టౌన్ పరిధిలో గల అపార్ట్మెంట్లో భార్యభర్తలుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుధవారం రాత్రి పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. వన్టౌన్ సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాలు...స్థానిక టీపీఎం స్కూల్ వెనుకనున్న సాయిమౌళి అపార్ట్మెంట్లో(రూం నంబరు–909) కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాటువేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. భార్యభర్తల పేరిట అసాంఘిక కార్యకలాపాలు ఆమదాలవలస మండలం అక్కివరంకు చెందిన తాండ్ర శ్రీనివాసరావుతో పాటు మరో మహిళ భార్యభర్తలుగా చెలామణి అవుతూ కొత్త వ్యక్తులచే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరిద్దరూ విశాఖపట్నం, విజయనగరానికి చెందిన మహిⶠను తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడ్డ వారిలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. శ్రీనుకు విశాఖపట్నం, విజయనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయని కమీషన్ పద్ధతిపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. 15రోజులు క్రితమే శ్రీనుతో పాటు మరో మహిళను వ్యభిచారం కేసులో ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. రామ్ సరసన గెస్ట్రోల్గా... ఇదిలా వుండగా పట్టుబడ్డ ముగ్గురి మహిళల్లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ రామ్ సరసన ఓ కొత్తసినిమాలో గెస్ట్రోల్గా నటిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉందని ఆమె వెల్లడించింది. రాఖీ పండుగ సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చానని విలేకరులకు తెలిపింది. కొన్ని టీవీ సీరియల్స్లో నటిస్తున్నట్లు చెప్పింది. నగదు, సెల్ఫోన్ స్వాధీనం పట్టుబడ్డ విటుల నుంచి వన్టౌన్ పోలీసులు రూ.15వందల రూపాయలు నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ఐస్క్రీం పార్లర్లలో వ్యభిచారం
చెన్నై: ఐస్క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాగర్కోవిల్ సహా కన్యాకుమారి జిల్లాలో అనేక ఐస్క్రీం పార్లర్లు వున్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. ఈ ఘటనలపై అనేకమార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువత వస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ఐస్క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్క్రీం పార్లర్పై దాడి జరిపిన ఘటనలో ఒక యువజంట పోలీసులకు చిక్కింది. అనంతరం పార్లర్ యజమానిని పోలీసులు విచారణ జరిపారు. కాగా అరెస్టయిన వ్యక్తిని అన్నాడీఎంకేలోని ఒక నేత సిఫార్సుతో పోలీసులు వదిలిపెట్టారు. -
సెక్స్వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా?
న్యూఢిల్లీ: భారత దేశంలో వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పించాలంటూ ఇప్పటి వరకు ఎన్నోసార్లు తెరమీదకు వచ్చిన డిమాండ్ ఇది. పలు మహిళా, సామాజిక సంఘాలు ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ డిమాండ్ను తీసుకొచ్చినా అధికారంలోవున్న భారత ప్రభుత్వం ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఇదే డిమాండ్తోని హిమాచల్లోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్ధులు ఓ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టిన నిఫ్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థి 23 ఏళ్ల అమిత్ చౌహాన్ దీనికి ‘నాత్ ఉట్రాయ్’ అని పేరు పెట్టారు. అమిత్, తనతోపాటు చదువుకుంటున్న మరో ఐదుగురు విద్యార్థులతో కలసి ఈ ప్రాజెక్టును చేపట్టి ఇంతవరకు దేశంలోని ఎంతోమంది వేశ్యలను ఇంటర్వ్యూ చేశారు. ఛిద్రమైన వారి జీవితాలకు సంబంధించిన కథలను ప్రపంచం దృష్టికి తీసుకరావడం వారి ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా వారు ఆరుగురు వేశ్యకథలను డాక్యుమెంటరీగా తీస్తున్నారు. వాటినే వచ్చే జనవరి నెలలో పుస్తకంగా విడుదల చేస్తామని అమిత్ మీడియాకు తెలిపారు. తాము ఎంపిక చేసిన ఆరుగురు వేశ్యలలో ముగ్గురు రాజస్థాన్కు, మరో ముగ్గురు ఢిల్లీ రెడ్లైట్ ఏరియాకు చెందిన వారని ఆయన చెప్పారు. తాము కలుసుకున్న వేశ్యల్లో ఎక్కువ మంది పిల్లా పాపలతో కాపురాలు చేస్తున్నారని, వారికి బడికి కూడా పంపించి చదివిస్తున్నారని, ఇదంతా కూడా వారు తమ శరీరాలను తాకట్టు పెట్టే సంపాదిస్తున్నారని తెలిపారు. భారత్లో వేశ్యవృత్తికి చట్టబద్ధత లేకపోవడం వల్ల వారిని దళారులు మోసం చేస్తున్నారని, విటులు హింసిస్తున్నారని, ఎయిడ్స్ లాంటి మహమ్మారి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు విటులు తీసుకోవడం లేదని, దేశంలో ఆడపిల్లల అక్రమ రవాణా కూడా పెరిగిపోతోందని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధతను కల్పించినట్లయితే ఈ సామాజిక సమస్యల నుంచి విముక్తి కల్పించవచ్చని, వేశ్యల డేటాను నమోదు చేయడం, దళారుల ప్రమేయాన్ని అరికట్టడం, ఆడవాళ్ల అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమని, ఆరోగ్య సూత్రాలను పాటించడం, వ్యాపార నియమాలను నిర్దేశించడం సాధ్యమవుతుందని ఆయన వాదిస్తున్నారు. చట్టబద్ధత కల్పించడమంటే వృత్తిని ప్రోత్సహించడం కాదని, నియంత్రించడం అనీ, అమాయకులను దౌర్జన్యంగా ఆ వృత్తిలోకి దింపకుండా నిరోధించడమని ఆయన చెప్పారు. 2014లో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమార మంగళం కూడా ఇలాంటి అభిప్రాయలనే వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పిస్తే వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చని, వృత్తిని నియత్రించవచ్చని ఆమె చెప్పారు. దేశంలో 16 రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మంది సభ్యులు గల అఖిల భారత సెక్స్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతీ దేవీ కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తున్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కల్యాణ్నగర్ వెంచర్-3 లో ఓ ఇంటిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలు, మహిళతోపాటు ఓ విటుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన మహిళ లక్షల్లో వడ్డీ వ్యాపారం చేస్తుందని పోలీసులు తెలిపారు. కల్యాణ్నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఆగంతకుడు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు. -
మైనర్ బాలికల అమ్మకాల్లో ఇద్దరు అరెస్ట్!
థానెః బాలికలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెడుతున్న ఇద్దరు వ్యక్తులను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను వ్యభిచార వృత్తిలోకి నెట్టే ప్రయత్నం చేసిన నిందితులను థానే మీరారోడ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సంజయ్ సింగ్, సరోజ్ దేవీ లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ సైడోల్ జిల్లా ఛిపాయ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మైనర్ బాలికలను ఆగ్రాకు చెందిన పింకి సింగ్ ద్వారా నిందితులు మార్చి నెలలో అమ్మకానికి పెట్టినట్లు మీరారోడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇనస్పెక్టర్ జగదీష్ షిండే తెలిపారు. బాధిత బాలికలు సైడోల్ జిల్లా భివారీ తెహసిల్ కు చెందినవారుగా వెల్లడించారు. బాలికల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 372 కింద (వ్యభిచారం కోసం బాలికల అమ్మకం), వ్యభిచార నిరోధానికి సంబంధించిన ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా), ప్రొటెకక్షన్ ఆఫ్ ఛిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. -
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం గృహం నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించి రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలతో పాటు దీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
భారత్లోని వ్యభిచార కూపాల్లో లక్షలాది మంది బాధితులు
అమెరికా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: భారతదేశంలో లక్షలాది మంది మహిళలు, పిల్లల్ని బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దింపుతున్నారని అమెరికాకు చెందిన స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ కనీస నిబంధనలు అమలు చేయలేకపోతుందని, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని తన నివేదికలో పేర్కొంది. ‘మానవుల అక్రమరవాణా నివేదిక 2016’లో భారత్ను టైర్-2 జాబితాలో స్టేట్ డిపార్ట్మెంట్ పొందుపర్చింది. ఈ జాబితాలో టైర్-1 సురక్షిత దేశాలు కాగా, టైర్-3 దేశాలు ప్రమాదకరమైనవి. భారత్తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు కూడా టైర్-2 జాబితాలోనే ఉన్నాయి. ఏదైనా దేశం రెండేళ్ల పాటు టైర్-2 జాబితాలో ఉంటే దాన్ని టైర్-3లోకి చేర్చుతారు. భారత్లో పురుషులు, మహిళలు, చిన్నారులచే అక్రమంగా పనులు చేయించడంతో పాటు మహిళలు, చిన్నారుల్ని వ్యభిచారంలోకి దింపుతున్నారని నివేదిక వెల్లడి ంచింది. వీటి నివారణ కోసం న్యాయ విచారణ, శిక్షల్ని సమర్ధంగా అమలుచేయాలని భారత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మానవుల అక్రమ రవాణా భారత్లో అతి పెద్ద సమస్యగా మారిందని, పూర్వీకులు చేసిన అప్పుల కోసం వెట్టి చాకిరీ చేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. -
అథ్లెట్ మెడకు వ్యభిచార ఉచ్చు
సింగపూర్: సింగపూర్ కు చెందిన పారా అథ్లెట్ ఒకరు కటకటాలపాలయ్యాడు. వ్యభిచారం చేయించేందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ ద్వారా మహిళలను, మైనర్లను కొనుగోలు చేస్తున్నందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 38 నెలల జైలు శిక్ష విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అదామ్ కామిస్ అనే వ్యక్తి సింగపూర్ జాతీయ పారా అథ్లెట్ గా ఉన్నాడు. ఓ ప్రమాదంలో గాయపడిన అతడు వికలాంగుడిగా మారాడు. 2013లో ఫేస్ బుక్ ఖాతా తెరిచి దానిద్వారా వ్యభిచారం చేయించేందుకు 11మంది మహిళలను రిక్రూట్ చేశాడు. ఒక మైనర్ బాలికను కూడా రిక్రూట్ చేసి వ్యభిచార కూపంలోకి దించాడు. వారి వద్ద నుంచి ఐదు నుంచి యాబై శాతం వరకు కమిషన్ తీసుకునే వాడు. ఒక ఎస్కార్ట్ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకొని డబ్బు ఎరగా వేసేవాడు. వెంటనే డబ్బు దక్కుతుందని ఆశతో మహిళలు తొందరగా అతడితో మాటలు కలిపేవారు. ఆ క్రమంలో వారిని వ్యభిచారంలోకి మెల్లగా లాగేవాడు. ఇక పదహారేళ్ల విద్యార్థినిని కలిసి తన అపార్ట్ మెంట్కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించడమే కాకుండా ఆమెతో కూడా వ్యభిచారం చేయించే కుట్ర చేశాడు. ఎంతో చాకచక్యంతో పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి అతడిని అరెస్టు చేశారు. 30 అభియోగాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. గతంలో 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్కు ప్రతినిధిగా కూడా పనిచేశాడు. -
వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్
ముంబయి: కొందరు యువతుల కష్టాలను అవకాశంగా తీసుకొని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మోడల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బారిన పడిన పలువురు మోడల్స్కు విముక్తి కలిగించారు. పశ్చిమ ముంబయిలోని వర్సోవా అనే ప్రాంతంలో ప్రొడక్షన్ హౌజ్ పేరిట ఓ నివాసం ఉంది. అందులో ఓ 24 ఏళ్ల మోడల్ ఉంటోంది. ఆమె సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను లక్ష్యంగా చేసుకొని వారికి లేనిపోని ఆశలు కలిగించి వ్యభిచార రొంపిలోకి దింపింది. దాంతోపాటు పలువురు మైనర్స్ను కూడా కొనుగోలు చేస్తూ వారితో ఇలాంటి పాడుపని చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నివాసంపై రైడింగ్ చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకొన్నారు. అందులో ఎంతోమంది మోడల్స్ ఫొటోలతోపాటు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. -
వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడులు
హైదరాబాద్: సరూర్నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ప్రగతినగర్లోని సాయిప్రతాప్ అపార్టుమెంట్లో కొనసాగుతున్న వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నలుగురు మహిళలు, నలుగురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, రూ.6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. -
యువతిని అశ్లీలంగా చిత్రీకరించి...
ఆచంట: భర్త చెడుమార్గంలో నడిస్తే సరిద్దాల్సిన భార్యే అతడికి వంతపాడింది. ఓ యువతిని అశ్లీలంగా చిత్రీకరించి.. కామ వాంఛలు తీర్చుకునేందుకు సహకరించింది. అంతేకాకుండా వ్యభిచారం చేయాలని ఆ యువతిపై ఆ భార్యాభర్తలిద్దరూ ఒత్తిడి తెచ్చారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో గురువారం వెలుగు చూసింది. పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. ఆచంట పంచాయతీ పరిధి కొత్తూరు ప్రాంతానికి చెందిన నెక్కంటి శ్రీనివాస్, సుశీల భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన, డిగ్రీ చదువుతున్న ఓ యువతి తరచూ వారి ఇంటికి వస్తుండేది. గతేడాది మే 1న సాయంత్రం ఆ యువతి శ్రీను ఇంటికి వెళ్లింది. శ్రీను దంపతులు పథకం ప్రకారం ఆమెకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతితో భర్త అశ్లీలంగా వ్యవహరించిన తీరును స్వయంగా భార్యే సెల్ఫోన్లో చిత్రీకరించింది. అప్పటినుంచి వారిద్దరూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు
ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. కస్టమర్లను, మధ్యవర్తులను కలుసుకునేందుకు వీరు ఇక్కడ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బ్రోకర్లు ఆష్రాఫ్, సైరా, ఆమన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిల వరకు తీసుకుని హైప్రొఫైల్, కార్పొరేట్ కస్టమర్ల వద్దకు వీరు అమ్మాయిలను పంపుతుంటారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో మరాఠీ సినిమా నటి, వర్ధమాన మోడల్, టీవీ సీరియల్ నటి ఉన్నారని వెల్లడించారు. -
24న ఆత్మహత్య.. అదేరోజు స్పీడ్పోస్టులో సూసైడ్నోట్!
వ్యభిచారం చేయాలంటూ తన తల్లి, భర్త బలవంతం చేశారని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝాన్సీ సూసైడ్ నోట్ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఝాన్సీ హైదరాబాద్ నుంచి ఈనెల 23న ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెబుతోంది. 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఆమె వెల్లడించింది. అయితే.. సరిగ్గా అదేరోజు ఝాన్సీ పేరుతో హైదరాబాద్లోని సరూర్నగర్ ప్రాంతం నుంచి స్పీడ్ పోస్టు ద్వారా సూసైడ్ నోట్ నకిరేకల్ పోలీసు స్టేషన్కు వచ్చింది. ఈనెల 24న ఆమె ఆత్మహత్య చేసుకుంటే, మరి స్పీడ్పోస్ట్ ఎవరు చేశారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పైపెచ్చు, ఆమె సూసైడ్ నోట్ మొత్తం టైప్ చేసి ఉంది. దాని కింద ఆమె సంతకం చేసింది. ఝాన్సీ సంతోష్నగర్లోని ఐఎస్ సదన్ హాస్టల్లో ఉండేది. కానీ స్పీడ్పోస్ట్ మాత్రం సరూర్నగర్ నుంచి వచ్చింది. తన భర్తకు, తల్లికి వివాహేతర సంబంధం ఉందని.. అందువల్ల తాను అతడితో కలిసి ఉండేది లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్
వివాహిత బలవన్మరణం నాకు రూ. 20 లక్షలు ఇస్తేనే విడాకులిస్తా.. అంత డబ్బు ఇవ్వలేనంటే ఎట్లా.. అందంగానే ఉన్నావుగా.. ప్రస్తుతం మార్కెట్లో నీ లాంటి వారికి మంచి డిమాండ్ ఉంది.. దుకాణం పెడితే లక్షలు సంపాదించవచ్చు.. నేను చెప్పినట్టు వింటే సరేసరి..లేదంటే నిన్ను అమ్మేస్తా... లేకుంటే చంపేస్తా అని నా భర్త వేధిస్తున్నాడు. నా కన్నతల్లి కూడా అతడికే వత్తాసు.. అందుకే చనిపోతున్నా. నా భర్తపై చర్య తీసుకోండి. ఇవీ .. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన ఝాన్సీరాణి తన భర్త విజేందర్రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు, జడ్జి, మహిళా రక్షణ సెల్కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖల్లో పేర్కొన్న అంశాలు. విడాకులివ్వాలని కోరితే నిరాకరణ ♦ అందుకు రూ. 20 లక్షలివ్వాలని డిమాండ్ ♦ అమ్మేస్తా లేదంటే చంపేస్తానని బెదిరింపు ♦ కన్నతల్లి కూడా భర్తకే వత్తాసు ♦ భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా.. ♦ పోలీస్ ఉన్నతాధికారులు, జడ్జి, ♦ మహిళా రక్షణ సెల్కు ఝాన్సీ లేఖలు కష్టమొస్తే కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి ఓ వైపు.. కలకాలం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త ఇంకో వైపు డబ్బు కోసం నరక కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోయింది.. విడాకులిస్తే నా దారి నేను చూసుకుంటానని వేడుకున్నా కనికరించలేదు.. మృగాడి కబంధ హస్తాల కింద నలిగిపోయేకంటే చావే శరణ్యమనుకుందో.. ఏమో.. ఆ చిట్టితల్లి. తనకుతానే మరణశాసనం లిఖించుకుంది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గూడూరు ఝాన్సీ ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయే ముందు కారకులు, కారణాలను విశ్లేషిస్తూ తెలంగాణ డీజీపీ, ఎస్పీ, జడ్జి, మహిళా రక్షణ సెల్, నకిరేకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖలు సోమవారం అందాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నకిరేకల్: ఆలస్యంగా వెలుగుచూసిన ఝాన్సీ ఆత్మహత్యపై రిజిస్టర్పోస్ట్లో అందిన సూసైడ్నోట్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గుర్రం పద్మ వెంకట్రెడ్డి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మ భర్త వెంకట్రెడ్డి 2013 లో చనిపోయారు. తల్లి పద్మ నకిరేకల్లోని మూసీరోడ్డులో ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. కుమార్తె ఝాన్సీ హైదరాబాద్లోని ఎంవీఎస్ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా కుమారుడు శివ లారీడ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆర్థిక స్థితిగతి బాగా లేకపోవడంతో పద్మ తన మేనల్లుడైన నల్లగొండ మండలం దీపకుంటకు చెందిన గూడూరు విజయేందర్రెడ్డి వద్ద రూ. 4 లక్షలు అప్పుగా తీసుకుంది. అప్పు కింద కూతురినివ్వు.. కొంత కాలానికి విజయేందర్రెడ్డి తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని పద్మపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు చెల్లించే స్థితిలో పద్మ కుటుంబం లేదు. అప్పు కింద కూతురు ఝాన్సీని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. అందుకు పద్మ సరేనంది. అతడి ప్రవర్తన సక్రమంగా లేదని ఝాన్ని తన తల్లి వద్ద మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. రెండు కుటుంబాల పెద్దలు 2014 ఆగ స్టు 22వ తేదీన విజయేందర్రెడ్డితో ఝాన్సీకి వివాహం జరిపిం చారు. వివాహం అనంతరం కూడా ఝాన్సి హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటూ బిటెక్ చదువుతోంది. ఇటీవల ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసింది. అది చూసి జీర్ణించుకోలేక పోయా.. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని ఎన్నో సార్లు తన తల్లికి చెప్పినా వినిపించుకోలేదు. అతడితోటే ఉండాలని పట్టుబట్టింది. తన తల్లి, భర్త ప్రవర్తన సక్రమంగా లేదని గుర్తించా.. ఓ రోజు వారిద్దరినీ పడకగదిలో చూసి జీర్నించుకోలేకపోయా. అప్పుడే నిర్ణయించుకున్నా ఇక భర్తతో కలిసి జీవించొద్దని. గుట్టుచప్పుడు కాకుండా.. ఈనెల 23వ తేదీన ఝాన్సీ హైదరాబాద్ నుంచి నకిరేకల్కు వచ్చింది. ఇంటికి వచ్చిన మరుసటి రోజు నివాసంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పద్మ తన అల్లుడు విజయేందర్రెడ్డికి తెలపడంతో ఎలాంటి కేసు కూడా పెట్టకుండా వారు వచ్చి వారి స్వగ్రామమైన నల్లగొండ మండలం దీపకుంటకు తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కలకలం సృష్టించిన రిజిస్టర్ పోస్ట్ నకిరేకల్ పోలీస్స్టేషన్కు సోమవారం వచ్చిన రిజిస్టర్ పోస్ట్ కలకలం సృష్టించింది. ఈ లేఖ ఆధారంగా నకిరేకల్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నర్సింహారావు నేతృత్వంలో విచారణ చేపట్టారు. సదరు ఝాన్సీ తల్లిని, భర్త విజయేందర్రెడ్డిని విచారించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేరేపించిన తల్లి పద్మ, భర్త విజయేందర్రెడ్డిలపై, సాక్ష్యాలు లేకుండా శవాన్ని దహనం చేసిన విషయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఝాన్సీ చదువుతున్న కళాశాలకు వెళ్లి కూడా విచారణ చేపడతామని, ఆమె వాడిన సెల్ డాటా వివరాలను కూడా సేకరిస్తామని, ఆమె దహనం చేసిన అస్తికలను కూడా సేకరించి ల్యాబ్కు పంపించి కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ లేఖ ఝాన్సీనే పంపించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు. వ్యభిచార కూపంలోకి నెట్టేస్తానంటే.. తనకు విడాకులు కావాలని భర్తను అడిగా. అందుకు రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చే స్థితిలో లేనంటే వ్యభిచారం చేస్తే రూ. లక్షలు సంపాదించవచ్చని చెప్పాడు. చెప్పినట్టు వినాలని.. బతికి ఉండే వరకు వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఆదేశించాడు. అమ్మేస్తా లేదా చంపేస్తానని బెదిరించాడు. ఇదే విషయం తల్లితో చెబితో భర్త చెప్పినట్టు నడుచుకోవాలని అతడికే వత్తాసు పలికిందని లేఖలో పేర్కొంది. నాకు సంబంధం లేదు నా కూతురు ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన లేఖని అంశాలపై నాకు ఏలాంటి సంబంధం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ఎవ్వరు ప్రేరేపించలేదు. బిటెక్ చదివేందుకు ఖర్చు కూడా నా అల్లుడు భరించాడు. ఈనెల 23న పరీక్షలు పూర్తి అయిన అనంతరం ఇంటికి చేరుకుంది. 24న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు మాకు తెలపలేదు. నా కూతురు మృతి విషయాన్ని నల్లగొండ మండలం దీపకుంటలో ఉంటున్న నా అల్లుడు విజయేందర్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. - తల్లి పద్మ మా ఇద్దరి మధ్య గొడవలు లేవు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైళ్లి అయిన నాటి నుంచి ఆమె హాస్టల్లోనే ఉంటూ చదువుతోంది. చదువు ఖర్చులు కూడా నేనే భరించా. మా మద్య ఏలాంటి విభేదాలు లేవు. ఆమె ఆత్మహత్యకు నాకు సంబందం లేదు. ఆమె రాసిన లేఖలో కూడా అంశాలు వాస్తవం కాదు. - ఝాన్సీ భర్త గూడూరు విజేందర్రెడ్డి -
వ్యభిచార కేంద్రంపై దాడి
నెల్లూరు(క్రైమ్) : బాలాజీనగర్ లక్ష్మీనగర్లో ఇళ్ల మధ్యలో ఉన్న ఓ వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విడవలూరు మండలం పురిణికి చెందిన ఎస్కే భాను రెండునెలల కిందట ఆమె లక్ష్మీనగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొంత కాలంగా యువతులను తీసుకువచ్చి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు శుక్రవారం కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్లు, మూలాపేటకు చెందిన పి. శివకుమార్, సంతపేటకు చెందిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
‘పంచ’తంత్రం
► జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగ్, మట్కా, వ్యభిచారం, పేకాట, నంబర్గేమ్ ► మట్కా కింగ్ను అరెస్టు చేసినా మారని తీరు ► మూడో కంటికి తెలీకుండా నంబర్గేమ్ ► అసాంఘిక కార్యకలాపాలకు ‘అనంత’ అడ్డా చోద్యం చూస్తున్న పోలీసులు (సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంత’ ‘పంచ’తంత్రంలో చిక్కుకుపోయింది. జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట మాత్రమే కాదు.. కొత్తగా నంబర్గేమ్ వచ్చింది. ఇక వ్యభిచారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ఐదింటి దెబ్బకు వందలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొందరు భారీగా అప్పులు చేసి ఆస్తులను అమ్ముకుంటుంటే... ఇంకొందరు ‘కాల్మనీ’ చేతుల్లో చిక్కి శల్యమవుతున్నారు. ఆగని మట్కా అనంతపురంలో మట్కా జోరుగా నడుస్తోంది. మట్కా కింగ్ మంగలి చంద్రను పోలీసులు అరెస్టు చేసినా అడ్డుకట్ట పడలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలోనూ ఇదే పరిస్థితి. గతంలో రతన్లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కా ఆరురోజులు నడుస్తోంది. ఈ మాట్కా నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా సాగుతోంది. కళ్యాణ్, సత్తా మట్కాలకు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీల డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతో చాలామంది మట్కా రాయుళ్లు సాయంత్రం నుంచి నంబర్ వచ్చేదాకా టెన్షన్తో గడుపుతున్నారు. అనంతపురం వన్టౌన్ పరిధిలో బీటర్లు అధికం. వారెవరన్నది పోలీసులకూ తెలిసినా బ్రేక్ వేయలేకపోతున్నారు. సత్సంబంధాలే ఇందుకు కారణం. టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్టౌన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఈ ఊబిలో పడి వేలాది కుటుంబాలు నాశనమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. బెట్టింగ్కు అడ్డా క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు ‘అనంత’లోనూ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. ఐపీఎల్ నేపథ్యంలో నెలన్నరగా బెట్టింగ్రాయుళ్లు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఓ బంగారు వ్యాపారి నెలరోజుల్లోనే రూ.9లక్షలు, ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు. విద్యార్థులు కూడా కోచింగ్ ఫీజుల పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వచ్చి బెట్టింగ్ వేస్తున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్తో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీలో గ్రూపులుగా కూర్చొని బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. నెలన్నరలో రూ.30-40కోట్లదాకా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నంబర్గేమ్ ‘నంబర్గేమ్’ పేరుతో కొత్త వ్యసనం ‘అనంత’లోకి ప్రవేశించింది. కళ్యాణదుర్గం, బళ్లారి బైపాస్రోడ్లలో కొందరు గుంపులుగా చేరి ఈ గేమ్ ఆడుతున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే లారీలు, బస్సుల నంబర్లు కూడితే 20 ప్లస్ ఉంటుందని కొందరు, మైనస్ ఉంటుందని కొందరు బెట్టింగ్ కాస్తారు. వేసవి కావడంతో వీరు బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్లోకి మకాం మార్చారు. బస్టాండ్లోకి వచ్చే బస్సు నంబర్లపై పందేలు కాస్తున్నారు. దీంతో పాటు అంకెలపైనా బెట్టింగ్ వేస్తున్నారు. 0-9 వరకూ ఓ అంకెను ఎంచుకుంటారు. వచ్చే వాహనంలో ఆ అంకె ఉంటుందని ఒకరు, ఉండదని మరొకరు పందెం కాస్తారు. దీని గురించి పోలీసులుకు తెలిసినా పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వ్యభిచారం వ్యభిచారం అనంతతో పాటు తాడిపత్రి, గుంతకల్లులో జోరుగా సాగుతోంది. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్, బస్టాండ్ వద్దనున్న లాడ్జీలలో కొన్ని పూర్తిగా వ్యభిచారానికి అడ్డాగా మారాయి. శారదానగర్లో ఓ మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్విహ స్తోందని సమాచారం. నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి అమ్మాయిలు వస్తారని తెలుస్తోంది. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తాడిపత్రిలో ఇటీవల అరెస్టు చేసినా ఆగలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు వచ్చి పనిచేస్తున్నారు. వారు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పేకాట పాపారావులు ఎక్కువే.. అనంతలో పేకాటరాయుళ్లు ఎక్కువగానే ఉన్నారు. చాలామంది జిల్లా నుంచి కర్ణాటక ప్రాంతాలకు కూడా వెళుతున్నారు. జిల్లాలోని మిడ్పెన్నార్డ్యాం, పెన్నహోబిలం, పెనుకొండ వద్ద స్థావరాలున్నాయి. వీరిలో పోలీసుకానిస్టేబుళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇద్దరు గన్మెన్లు పేకాట ఆడే కానిస్టేబుళ్లకు వడ్డీకి అప్పులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం
గోల్కొండ (హైదరాబాద్): మాయమాటలతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం చి నగరానికి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులు చందు, చంద్రకళ నగరంలోని షేక్పేట్ ఓయూ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో భాగంగా తమ స్వరాష్ట్రంలోని హోటళ్లు, పబ్లలో పని చేసే యువతులను హైదరాబాద్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రప్పించేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవారు. కాగా, బుధవారం వీరి ఇంటి నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. పోలీసులను చూసి మిగిలిన వారు పారిపోగా, చంద్రకళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి(22)ని పోలీసులు విచారించారు. తనతో వ్యభిచారం చేయిస్తున్నారని బాధిత యువతి చెప్పడంతో చంద్రకళను రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అవును, నేను వేశ్యనే..
రోజుకు ముగ్గురు కస్టమర్లు వస్తారు.. అమినత తలదించుకుని చెప్పింది. ఆమె వయసు 15. ఈ వయసులో వేశ్యగా మారిందంటే కారణం.. ఆకలి. అవును.. చదువుకోవాలనే ఆకలి.. చదువుకుని జీవితంలో ఎదగాలనే ఆకలి.సియెరా లియోన్.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న దేశం. నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకోవడమంటే అదిక్కడ లగ్జరీ కిందే లెక్క. అదీ ఆడపిల్లలంటే మరింత చిన్నచూపు. ఏడాది చదువుకు రూ.4 వేలు. దీంతో ఇక్కడ ఇలాంటి అమినతలు ఎందరో కనిపిస్తారు. చదువుకు ప్రతిగా తమ దేహాన్ని అమ్ముకుంటూ.. ఏదో ఒకరోజు తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో జీవించేస్తూ.. అమినత లాంటిదే మేరీ కూడా. మేరీ క్లాస్లో టాపర్. చదువంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లు చదివించలేమన్నారు. ఓ వ్యక్తి తనతో గడిపితే చదువుకయ్యే డబ్బులిస్తానన్నాడు. తన ముందు మరో మార్గం లేదు. కొన్నాళ్లు బాగానే నడిచింది. మేరీ గర్భవతి అయ్యాక అతడి అసలు రంగు బయటపడింది. వదిలి వెళ్లిపోయాడు. చదువు ఆగిపోయింది. లాయర్ కావాలన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది.సియెరా లియోన్లో నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ‘మెయిల్ ఆన్లైన్’ (బ్రిటన్లోని డెయిలీ మెయిల్ టాబ్లాయిడ్ తాలూకు ఆన్లైన్ వెబ్సైట్) చేపట్టిన స్ట్రీట్ చిల్డ్రన్ కార్యక్రమంలో పలువురిని కదిలించినప్పుడు ఇలాంటి గాథలెన్నో వినిపించాయి. ఇంట్లో వాళ్లు చదివించక.. కుటుంబం మద్దతు కోల్పోయి.. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిళ్లు వేశ్యగా.. ఉదయం విద్యార్థినిగా మారుతున్న ఎన్నో ఉదంతాలు వారిని కదిలించాయి. కొందరు వేశ్యలుగా మారుతుంటే, మరికొందరు.. చదివిస్తామంటూ కొందరు మగాళ్లు చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మి.. వారి కామదాహానికి బలైపోతున్నారు. వీరి విషయంలో కొన్నాళ్లు బాగానే నడుస్తున్నా.. గర్భవతులయ్యేసరికి పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. గర్భం దాల్చడంతో వీరి చదువుకు ఫుల్స్టాప్ పడిపోతోంది. ఇంకో విషయం.. అమినత ఇప్పుడు గర్భవతి. దీని వల్ల ఆమె స్కూల్కు కూడా వెళ్లడం లేదు. అయితే, త్వరలోనే స్కూలుకు తప్పకుండా వెళ్తానని అమినత చెబుతోంది. ఎందుకంటే అమినత మరో మేరీ కాదు. అమినత చావనైనా చస్తుంది.. కానీ చదువుతుంది.. -
వీడిన 'బాలికల అదృశ్యం' మిస్టరీ..
ఇల్లెందు (ఖమ్మం జిల్లా) : గుండాలలో అదృశ్యమైన బాలికల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంగళవారం ఇల్లెందు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోలారం గ్రామానికి చెందిన ఇస్లావత్ కిషోర్ గుండాలలో వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేశాడు. ఈ క్రమంలో గుండాల గిరిజన బాలికల హాస్టల్లో చదువుకుంటున్న రోళ్లగడ్డ తండాకు చెందిన ఓ విద్యార్థిని పరిచయమైంది. ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అదే తండాకు చెందిన మరో బాలికను కిషోర్ వివాహం చేసుకున్నాడు. దీంతో కిషోర్ మీద కోపంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాలిని తీసుకొని గత డిసెంబర్ 16న తేదీన హాస్టల్ నుంచి అదృశ్యమైంది. గుండాల నుంచి ఇల్లెందు మీదుగా మహబూబాబాద్ చేరుకున్నారు. అక్కడ తన బంధువు భద్రూ తారసపడి ప్రశ్నించగా, పెళ్లికి వెళుతున్నానని చెప్పి రైల్లో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ వీరికి ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. పని కల్పిస్తామని చెప్పి కొత్తగూడెం నెట్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి మరో మహిళ పార్వతి ఇంటికి తరలించారు. అక్కడ ఆ బాలికలను వ్యభిచార ఊబిలోకి దించాలని యత్నించగా వారు నిరాకరించారు. దీంతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు యాదగిరికి ఆ ఇద్దరినీ విక్రయించారు. యాదగిరి చెరలో నరకం అనుభవిస్తున్న వీరిలో ఒక విద్యార్థిని తన వద్దకు వచ్చిన కస్టమర్ ఫోన్ నుంచి మహబూబాబాద్ సమీపంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఇది గమనించిన యూదగిరి కుటుంబసభ్యులు ఆ బాలికపై దాడి చేశారు. దీంతో ఎలాగైనా వ్యభిచార కూపం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. యాదగిరికి విషయాన్ని వివరించింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ విద్యార్థిని పరిస్థితిని గమనించి యాదగిరి చేతి ఖర్చుకు డబ్బులు ఇచ్చి రైలు ఎక్కించాడు. మహబూబాబాద్ చేరుకున్న ఆ విద్యార్థిని సోదరి సాయంతో గుండాల సీఐ రవిని ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐ రవి, యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు వెళ్లి యూదగిరి చెరలో ఉన్న ఆ విద్యార్థినిని విడిపించి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై విద్యార్థినిని మోసగించిన డ్రైవర్ కిషోర్, వ్యబిఛార గృహ నిర్వాహకుడు యాదగిరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
బ్యూటీ పార్లర్లో వ్యభిచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్కు చెందిన కోట సంపత్కుమార్(36) వనస్థలిపురంకు చెందిన మరో మహిళ (30) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యేకాలనీ సమీపంలో లోటస్ ఫ్యామిలీ సెలూన్ పేరుతో కొంత కాలంగా బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడ్డ వీరిద్దరూ ఎన్బీటీ నగర్కు చెందిన రఘు అనే బ్రోకర్తో పరిచయం పెంచుకొని సెలూన్లో పనిచేసే యువతులను వ్యభిచారం కూపంలోకి దింపారు. పార్లర్లో వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి సిబ్బందితో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడంతో గుట్టురట్టయింది. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులను, బ్రోకర్ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెంటర్ పై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని అమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముగ్గురు యువతులతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కూతురుకు మత్తుమందు ఇచ్చి..
హైదరాబాద్: కూతురి పట్ల ఓ సవతి తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కూతురును బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ యువతి తన సవతి తల్లి నుంచి రక్షణ కల్పించమని సైఫాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైఫాబాద్లో ఓ మహిళ తన కూతురుకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించింది. అయితే కూతురు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ విషయం తెలిసిన సవతి తల్లి, రౌడీలతో వెళ్లి అక్కడ గొడవ చేసింది. అంతేకాకుండా తన కూతురు కనిపించడం లేదంటూ, బంగారం దొంగలించిందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన యువతి... జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. తన తల్లి వ్యభిచారం చేయమని బలవంతం చేస్తోందని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా అండగా నిలిచి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు
♦ ఫాంహౌస్లలో అనైతిక చర్యలు ♦ తరచూ ఘటనలు ♦ తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ♦ హైదరాబాద్ యువకులు పరిగి: అసాంఘిక కార్యకలాపాలకు ఫాంహౌస్లు అడ్డాలుగా మారుతున్నాయి. డివిజన్ పరిధిలోని పూడూరు, పరిగి పరిసరాల్లో దాదాపు 200-250 ఫాంహౌస్లు ఉన్నాయి. నగరానికి ఈ ప్రాంతం చేరువగా ఉండడంతో జల్సారాయుళ్లు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో అయితే పోలీసుల దాడులు జరుగుతాయని భావించి నగరానికి దూరంగా ఉన్న ఈ ఫాంహౌస్లను సురక్షిత ప్రాంతాలుగా భావించి ఇక్కడికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరు మండలంలోని మీర్జాపూర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతో పాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్లలో అసాంఘిక కార్యకలపాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అక్రమార్కుల కన్ను పరిగి ప్రాంతంలోని ఫాంహౌస్లపై పడినట్లు తెలుస్తోంది. భారీగా ఫాంహౌస్లు.. రియల్ భూ సమయంలో బడా బాబులు పరిగి, పూడూరు తదితర మండలాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఫాంహౌస్లు ఏర్పాటు చేసుకొని పలు రకాల తోటలు పెంచుకుంటున్నారు. కొందరు ఫాంహౌస్లలో విలాసవంతమైన భవనాలను నిర్మించుకొని అందులో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా పెద్దఎత్తున ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు పోలీసులను కూడా తమ ఫాంహౌస్లలోకి అనుమతించడం కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆందోళనలో స్థానికులు... మంచికి, మానవత్వానికి మారుపేరైన పల్లె వాతావరణం కలుషితమవుతోంది. ఫాంహౌస్లలో అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూడడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆవేదనకు గురవుతున్నారు. ఫాంహౌస్లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జంటల తాకిడి.. సిటీలో నిత్యం పని ఒత్తిడి, కలుషిత వాతావరణంలో గడిపే నగర వాసులు సెలవు దినాల్లో వారానికి ఒకటిరెండు రోజులు వచ్చి ఫాంహౌస్లలో సేద తీరుతున్నారు. అయితే, ఇటీవల కొన్ని ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫాంహౌస్లకు జంటల తాకిడి బాగా పెరిగిందని, స్థానికులు వారెవరనే విషయంపై ఆరా తీయడానికి వెళ్తే వాళ్లు వాహనాల్లో పారిపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫాంహౌస్ల నిర్వాహకులు కొందరు డబ్బులకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలకు కిరాయికి ఇస్తున్నట్లు సమాచారం. గతంలో పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలో, పూడూరు మండల పరిధిలోనూ పలు ఘటనలు వెలుగుచూశాయి. -
ఫాంహౌస్లో వ్యభిచారం
యజమాని, నలుగురు యువకులు, నలుగురు యువతుల అరెస్ట్ పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఓ ఫాంహౌస్లో వ్యభిచారానికి పాల్పడుతున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతోపాటు ఫాంహౌస్ యజమానిని పోలీ సులు అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన సత్తార్కు మీర్జాపూర్ సమీపంలో ఫాంహౌస్ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దానిపై దాడులు జరిపారు. వ్యభిచారానికి పాల్పడుతున్న పాతబస్తీకి చెం దిన మెకానిక్లు మహమ్మద్ సమీర్, రహీం, అబ్దుల్ నదీమ్, సయ్యద్ అదిల్, ఫాం హౌస్ నిర్వాహకుడు అబ్దుల్ సత్తార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురు యువకుల తోపాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని రిమాండ్కు తరలించినట్లు చేవెళ్ల సీఐ ఉపేందర్ తెలిపారు. యువతులను నగరంలోని ప్రజ్వల హోంకు పంపించినట్లు చెప్పారు. -
2 లాడ్జీల్లో వ్యభిచారం
పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు యజమానులపై కేసు నమోదు పెబ్బేరు : రెండు లాడ్జీల్లో వ్యభిచారం కొనసాగుతుండగా పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పెబ్బేరులోని జయదేవ్, సాయి లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం జరిగే సంతకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కొందరు వచ్చి ఇక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ లాడ్జీల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. ఈ మేరకు లాడ్జీల యజమానులు చెన్నయ్య, రుక్మందరెడ్డిలపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అసాంఘిక శక్తుల అడ్డా.. కాచాపూర్ గుట్ట
► యథేచ్ఛగా వ్యభిచారం ► గుట్టపై గుడుంబా తయూరీ కేంద్రాలు, పేకాట స్థావరాలు ► చల్లూరు యువతిపై గ్యాంగ్రేప్ జరిగింది ఇక్కడే ► గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ► పట్టించుకోని పోలీసులు వీణవంక : వీణవంక నుంచి శంకరటప్నం వెళ్లేదారిలో ఆరో నంబర్ కిలోమీటర్ రాయి సమీపంలో 110 ఎకరాల్లో విస్తరించి ఉంది కాచాపూర్ గుట్ట. శంకరపట్నం మండలం పరిధిలోకి వచ్చే ఈ గుట్ట అసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పెద్దపెద్ద రాళ్లు, చెట్ల పొదలతో ఉండే గుట్ట రెండు మండలాల అక్రమార్కులకు కలిసివస్తోంది. గతంలో ఇక్కడ అనేక సంఘటనలు జరిగారుు. ఇటీవల చల్లూరు యువతిపై గ్యాంగ్రేప్ జరిగింది కూడ ఇక్కడే. ‘సాక్షి’ గురువారం ఈ గుట్టవద్దకు వెళ్లి చుట్టపక్కల రైతులు, సమీపంలోనివారితో మాట్లాడింది. ఈ సందర్భంగా ఎన్నో భయంకరమైన విషయూలు వెల్లడయ్యూయి. వీణవంకకు ఆరు కిలోమీటర్లు, శంకరపట్నానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుట్ట ఉంది. ఇక్కడ ఆరేళ్ల క్రితం గ్రానైట్ క్వారీలు నడిచాయి. రెండేళ్ల క్రితం మూతబడ్డాయి. గుట్ట చుట్టూ ముళ్ల పొదలు, బండరాళ్లు ఉండటంతో కొందరు గుడుంబా తయూరీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. నిర్మానుశ ప్రాంతం కావడంతో ఇక్కడ పేకాటరాయుళ్లు ఆడిందే ఆట. ఇతర జిల్లాల వారుసైతం వచ్చి ఇక్కడ పేకాడతారు. మద్యం బాబులు విందులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఏం జరిగినా, ఎంత అరిచినా ఎవ్వరికి కనబడదు.. వినపడదు. ఒకప్పుడు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన ఈ గుట్ట ప్రస్తుతం ఆసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఆరో నంబర్ మైలురారుుకి కుడివైపు వంద మీటర్ల దూరంలో ఒకప్పుడు క్వారీ నిర్వాహకులు రేకుల షెడ్డు నిర్మించారు. దీని సమీంపలోనే మరో రేకుల షెడ్డు కట్టించారు. నిర్వాహకులు వెళ్లిపోవడంతో రేకుల షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని కామాంధులు తమకు అడ్డాగా మార్చుకున్నారు. చల్లూరుకు చెందిన యువతిని నోట్పుస్తాకాలు ఇస్తానని చెప్పి బలవంతంగా ఈ గుట్ట వద్దకు తీసుకెళ్లి రేకుల షెడ్డులో గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్య, ముద్దం రాకేశ్ సామూహికంగా లైంగికదాడి చేశారు. గతంలో ఎన్నో సంఘటనలు.. ఏడాది క్రితం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రేమజంట ఈ రేకుల షెడ్డులో మాట్లాడుకుంటుండగా ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆ జంటపై దాడి చేసి బంగారు ఆభరణాలు, డబ్బు ఎత్తికెళ్లారు. హుజూరాబాద్కు చెందిన ఓ యువకుడు మానకొండూరుకు చెందిన యువతిని ఇక్కడకు తీసుకువచ్చి లైంగిక దాడికి యత్నిస్తుండగా చుట్టు పక్కల ఉండే రైతులు గమనించి యువకుడిని చితకబాదారు. గతంలో వీణవంకలో పనిచేసిన ఓ ఎస్సై ఈ గుట్ట సమీపంలోని పేకాటస్థావరంపై దాడిచేసి పెద్దు ఎత్తున నగదు పట్టుకున్నారు. అరుుతే ఈ గుట్ట శంకరపట్నం మండల పరిధిలోకి రావడంతో నిందితులు తప్పించుకున్నారు. ఈ గుట్ట చుట్టూ ఎన్నో గుడుంబా తయూరీ కేంద్రాలు ఉన్నారుు. కొందరు యువకులు ఇటీవల మద్యం మత్తులో రోడ్డు వెంట వెళ్లేవారిపై దాడి చేశారు. ఇలాంటి సంఘటనలోన్నో ఇక్కడ జరుగుతున్నాయి. పట్టించుకోని పోలీసులు.. గుట్ట రెండు మండలాల సరిహద్దులో ఉండటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ గుట్ట పరిసరాలలో ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొందరు రైతులు ఇరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు మాత్రం తమకేం సంబం ధం అన్నట్లు వ్యవహరించడంతో చల్లూరు యు వతిపై కామాంధులు అఘారుుత్యం చేశారు. ఇప్పటికైన ఆసాంఘిక కార్యకలాపాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఏడాదిలో ఐదు లైంగిక దాడులు ఇందులో రెండు గ్యాంగ్రేప్లు వీణవంక : లైంగిక దాడి ఘటనలు వీణవంక మండలంలో పెరుగుతున్నారుు. పోలీసుల నిర్లక్ష్యంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. మానవ మృగాలకు కఠిన శిక్షలు పడకపోవడంతో మండలంలో ఏడాది కాలంలో ఐదు అత్యాచార ఘటనలు జరిగాయి. చల్లూరు ఘటనలో సస్పెండ్ అయిన ఎస్సై విదుల్లో చేరినప్పటి నుంచే ఈ ఐదు సంఘటనలు జరిగారుు. 2015, ఏప్రిల్ 6న నర్సింగాపూర్ గ్రామంలో ఓ విద్యార్థిని(16)పై అదే గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాస్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. 2015, మేలో చల్లూరు శివారు గొల్లపల్లి గ్రామంలో ఓ మహిళ(38)పై రాజు అనే వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. చల్లూరు గ్రామంలో 2015, అగస్టు 16న ఓ విద్యార్థిని(15)పై ఇంట్లోనే నీలం రమేశ్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. ఇది అప్పట్లో సంచలనమైంది. మల్లారెడ్డిపల్లి గ్రామంలో 2015, సెప్టెంబర్ 21న మతిస్థిమితంలేని యువతి(20)పై నిమ్మల కుమారస్వామి, పూదరి మొండయ్య, నిమ్మల కళ్యాణ్, దూలం శ్రీనివాస్, నిమ్మల వినోద్ అనే యువకులు నాలుగు నెలలు సామూహిక లైంగికదాడి చేశారు. ఈ నెల 10న చల్లూరుకు చెందిన యువతి(22)పై సామూహిక లైంగికదాడి జరిగింది. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశారు. -
సెక్స్ రాకెట్ నుంచి ముగ్గురు బాలికలకు విముక్తి
పనాజీ: బాలికలకు మాయమాటలు చెప్పి వ్యభిచారకూపం లోకి దింపుతున్న ఇద్దరు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు బాలికలను వీరి చెర నుంచి విడిపించారు. శుక్రవారం రాత్రి నుంచి కొనసాగిన ఆపరేషన్ వివరాలను పోర్వోరిమ్ పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర నీటిశాఖ విభాగంలో పంప్ ఆపరేటర్ గా ప్రవీణ్ పరాబ్ పనిచేస్తున్నాడు. సాజియా ఖాన్ అనే మహిళ ముంబైలో ఉంటోంది. వీరిద్దరు కలిసి గత కొంత కాలం నుంచి యువతుల్ని ఏదో విధంగా ప్రలోభపెట్టి వ్యభిచారకూపంలోకి లాగేవారు. ముంబై ఇన్-స్పెక్టర్ జివ్బా దాల్వీ ఈ రెస్క్యూ ఆపరనేషన్ టీమ్ కు నేతృత్వం వహించారు. నిందితుల వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో కొంత కాలం నుంచి వీరిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. కస్టమర్ రూపంలో వెళ్లిన ఓ పోలీస్ ప్రవీణ్ పరాబ్ చేసే వ్యవహరాలపై సాక్ష్యాధారాలను సంపాదించాడు. అమ్మాయిలను రప్పిస్తామని నిందితుడు చెప్పిన ప్రాంతానికి పోలీసులు వెళ్లి సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ మహిళ సహా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురు బాలికలను ఈ కూపం నుంచి రక్షించారు. వీరిలో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారు, మరో బాలిక స్వస్థలం ముంబై అని పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వివరించారు. -
వ్యభిచారం గుట్టు రట్టు
టీడీపీ కౌన్సిలర్కు చెందిన లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది నిందితుల గుర్తింపు పోలీసుల అదుపులో ఏడుగురు యుువకులు, ఇద్దరు వుహిళలు పిడుగురాళ్ళ: పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం పోలీసుల తనిఖీలతో బట్టబయలైంది. ఇద్దరు మహిళ లను, ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్త అయిన భవనాశి ఎల్లారావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కల్యాణ మండపం, దానిపై బాలాజీ రెసిడెన్సీ పేరుతో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. వీటిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో పట్టణ సీఐ సుబ్బారావు సిబ్బందితో వెళ్లి లాడ్జి, కల్యాణ మండపాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఏడుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకాలం రాజకీయ అండదండలతో గుట్టుగా సాగుతున్న వ్యవహారం బహిర్గతమైంది. సోమవారం పట్టణంలో ఏ నలుగురు కలిసినా ఈ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయూన్నే చర్చించుకోవడం విశేషం. పోలీసులపై ఒత్తిళ్లు.. ధైర్యంగా దాడులు చేసిన పోలీసులు తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓ వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో తనిఖీల్లో పట్టుబడిన వారిని మీడియూ ఎదుట ఉంచడానికి పోలీసులు వివుుఖత చూపిస్తున్నారు. వారం రోజుల కిందట సున్నం బట్టీల వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వుుగ్గురు వుహిళలు, ఆరుగురు యుువకులను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు, వారిని వెంటనే మీడియూ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు పట్టుబడినవారు పలుకుబడి ఉన్న వ్యక్తుల కువూరులు కావడంతో వీరందరినీ పట్టణ పోలీస్స్టేషన్లో ఓ గదిలో రహస్యంగా ఉంచారు. మీడియూను కూడా అనుమతించకపోవడంతో పలు అనువూనాలకు తావిస్తోంది. దీనిపై సీఐ సుబ్బారావు మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న నిందితులందరినీ కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ఎల్లారావు అరెస్టుకు డిమాండ్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఎల్లారావును వెంటనే అరెస్టు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణవుూర్తి డివూండ్ చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ సుబ్బారావును కలసి మాట్లాడుతూ అధికార, ధన బలం ఉందన్న ధీవూతో కల్యాణ మండపంపైనే లాడ్జిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పార్టీ కార్యాలయంలో వ్యభిచారం
14 మంది అరెస్ట్ టీనగర్: తిరుపూరులోని ఓ పార్టీ కార్యాలయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు మహిళలు సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను రక్షించి పోలీసు సంరక్షణాలయంలో చేర్చారు. తిరుపూరు మంగళం రోడ్డులో ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ఉంది. ఈ పార్టీ అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం నిర్వాహకునిగా సెంథిల్కుమార్ (30) పనిచేస్తున్నారు. ఈ పార్టీ కార్యాలయంలో వ్యభిచారం జరుగుతున్నట్లు తిరుపూరు వెస్ట్ మహిళా పోలీసులకు సమాచారం అందింది. బద్రున్నిసా నేతృత్వంలో పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. కార్యాలయం ముందు భాగంలో పార్టీ సైన్బోర్డు ఏర్పాటుచేసి లోపలి గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. మొదటి అంతస్తులో మహిళలు ఉన్నట్లు కనుగొని అక్కడికి ఆకస్మికంగా ప్రవేశించిన పోలీసులు అక్కడున్నవారిని చుట్టుముట్టారు. దేవి, జ్యోతిమణి, మీరా, మణిమారన్, మరో ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా 15 ఏళ్ల వయసు బాలికను వ్యభిచారంలోకి దించినట్లు గుర్తించారు. ఈ బాలిక వద్ద విచారణ జరపగా తన సొంతవూరు మంగళం అని తల్లి మృతిచెందినట్లు తెలిపింది. తండ్రి ఇక్కడున్న దేవి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. తాను ఇంటి పనులు చేస్తూ వచ్చానని, తక్కువ వేతనం లభిస్తుండడంతో వ్యభిచారం ద్వారా ఎక్కువ సంపాదించవచ్చని పినతల్లి చెప్పడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు వ్యభిచార ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు సహా 14 మందిని అరెస్టు చేశారు. బాలికను రక్షించి పోలీసు సంరక్షణాలయంలో ఉంచారు. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్
మేడిపల్లి: వ్యభిచార గృహంపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా గుట్టు రట్టయిన ఈ ఘటన బోడుప్పల్లోని సాయి భవానీ నగర్లో చోటుచేసుకుంది. చిలకలగూడకు చెందిన విజయకుమార్ భార్య వల్లపు దాస్నేరి(34), నారాయణగూడకు చెందిన రాపోలు రాధిక(32)లు స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడిచేసి నిర్వాహకులతోపాటు మరో ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్టు ఎస్వోటీ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
ఇంటి నుంచి పారిపోయి వ్యభిచార కూపంలోకి..
బాగేపల్లి : తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలిక వ్యభిచార కూపంలో చిక్కి నరకయాతన అనుభవించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడినుంచి తప్పించుకొని బస్సు కండక్టర్ ద్వారా తల్లి ఒడికి చేరిన ఆ బాలిక విషాద గాథ ఇది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటకలోని బాగేపల్లి పోలీసులు చిన్నారితో వ్యభిచారం చేయిస్తున్న మహిళలతో పాటు అమ్మాయిలను రవాణా చేస్తున్న తిరుపతికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులోహాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే... 15 రోజుల క్రితం తెలంగాణలోని మహాబూబ్ నగర్ జిల్లా, యనగొండ గ్రామానికి చెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయి రైలులో చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చెందిన సునీల్ అనే వ్యక్తి పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను బాగేపల్లికి తీసుకువచ్చాడు. అక్కడ ఒకటో వార్డులో ఉంటున్న లత అనే మహిళ వద్దకు విడిచి వెళ్లిపోయాడు. ఆమె బాలికతో వ్యభిచారం చేయిస్తూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని చింతామణి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. కండెక్టర్ టికెట్ కోసం డబ్బు అడగ్గా తన వద్ద లేవని అసలు విషయం వెల్లడించింది. దీంతో కండెక్టర్ బాలికను తన ఇంటికి తీసుకుపోయాడు. అనంతరం బాలిక తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆమె బాగేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లత ఇంటిపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సునీల్ అనే వ్యక్తి బాలికను ఇక్కడకు పంపినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తిరుపతికి వెళ్లి సునీల్ను అరెస్ట్ చేసి నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరిచారు. -
వ్యభిచార కూపంలో బాలిక
ఎట్టకేలకు విముక్తి పొంది తల్లి ఒడికి చేరిన వైనం బాగేపల్లి: ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలిక వ్యభిచార కూపంలో ఇరుక్కొని ఆపై అక్కడి నుంచి తప్పించుకుని తల్లి ఒడికి చేరిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటకలోని బాగేపల్లి పోలీసులు చిన్నారితో వ్యభిచారం చేయిస్తున్న మహిళతోపాటు అమ్మాయిలను రవాణా చేస్తున్న తిరుపతికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. 15 రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా, యనగొండకుచెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయి రైల్లో ఏపీలోని తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చెందిన సునీల్ పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను బాగేపల్లిలోని లత అనే మహిళ వద్ద విడిచిపెట్టాడు. ఆమె బాలికతో వ్యభిచారం చేయిస్తూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని చింతామణి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ కోసం డబ్బు అడగ్గా తన వద్ద లేవంటూ అసలు విషయం వెల్లడించింది. దీంతో కండక్టర్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, అనంతరం బాలిక తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆమె బాగేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లత ఇంటిపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, సునీల్ ఆ బాలికను తెచ్చినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తిరుపతికి వెళ్లి సునీల్ను అరెస్ట్ చేశారు. -
మితిమీరిన సెక్స్వర్కర్ల ఆగడాలు
-
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్: వ్యభిచార గృహాలపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు విటులతో పాటు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్పురి కార్తికేయనగర్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ గృహంలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచార ‘బ్రోకర్ల’ కోసం వేట
విజయవాడ సిటీ : సినీ అవకాశాల కోసం వచ్చిన యువతిని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించిన కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితునిగా భావిస్తున్న ప్రముఖ సినీ నిర్మాత కారు డ్రైవర్ మహేంద్ర చౌదరి ప్రధాన అనుచరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఇతని ద్వారా మహేంద్రను అదుపులోకి తీసుకోవడంతో పాటు భీమవరానికి చెందిన విజయ్ ఏలూరులో ఉన్నట్టు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు. ఏలూరుకు చెందిన యువతి సినీ అవకాశాల కోసం వెళ్లి హైదరాబాద్ కృష్ణనగర్లోని దళారుల చేతికి చిక్కి వ్యభిచారం చేస్తూ నగరానికి వచ్చి టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ వైనంపై ‘చెదిరిన కల’ శీర్శికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ క్రమంలో శిశు సంక్షేమ వసతి గృహంలో ఉన్న యువతిని శుక్రవారం తల్లికి అప్పగించారు. దర్యాప్తు ముమ్మరం సినీ అవకాశాల పేరిట యువతిని మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించిన వైనంపై నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ స్పందించి పలుకుబడితో నిమిత్తం లేకుండా నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ క్రమంలోనే మహేంద్ర స్వస్థలమైన గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లిన టాస్క్ఫోర్స్ ప్రత్యేక బృందం పలు చోట్ల ఆరా తీసినట్టు తెలిసింది. ఇతని ప్రధాన అనుచరునిగా భావిస్తున్న ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. ఇతని కోసం ఖచ్చితంగా మహేంద్ర వస్తాడనే అభిప్రాయంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఉన్నారు. భీమవరానికి చెందిన విజయ్ ఏలూరులో ఉన్నట్టుగా సెల్టవర్ను బట్టి పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పట్టివేత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు పెద్దల ద్వారా లొంగిపోయేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
గెస్ట్ హౌస్ లో వ్యభిచారం
ఐదుజంటలు పట్టివేత కీసర: రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హరిత గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. వేర్వేరు గదుల్లో ఐదుగురు మహిళలతో గడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కీసర పోలీస్స్టేషన్కు తరలించారు. దాడుల్లో ఎస్ఓటీ డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐలు స్వామి, రంగాస్వామి, ఎస్ఐ రాములు ఉన్నారు. -
కన్నతల్లే కూతురిని వ్యభిచారానికి ప్రోత్సహించింది
-
తల్లిదండ్రులే కానిపని చేయమన్నారని..
తణుకు(పశ్చిమగోదావరి) : కన్న తల్లిదండ్రులే కానిపని చేయమన్నారని ఓ వనిత ఆత్మహత్య చేసుకుంది. నా చావుతోనైనా వారికి శిక్ష పడాలి. నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచారం చేయమంటున్నారు. ఒప్పుకోకపోవడంతో నా భర్తపై అన్యాయంగా అదనపు కట్నం కేసు బనాయించారు. ఈ పరిస్థితుల్లో నేను బతికి ఉండలేను. చావే నాకు శరణ్యం. నా చావుకు నా తల్లిదండ్రులు, తమ్ముడితోపాటు గుడాల సాయిశ్రీనివాస్ అనే వ్యక్తి కారణం. నా చావుతోనైనా వారికి శిక్ష పడాలి’ అంటూ ఒక యువతి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సెల్ఫోన్లో 2 నిమిషాల 30 సెకన్ల వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెల్దుర్తి కృపామణి (25), అదే గ్రామానికి చెందిన పవన్కుమార్ ఐదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందు నుంచీ ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులతోపాటు తమ్ముడు ఆమెను వ్యభిచార రొంపిలోకి దించే ప్రయత్నం చేశారు. అయితే కృపామణి పెళ్లి తర్వాత భర్తతో వేరు కాపురం పెట్టుకుని జీవిస్తోంది. ఈ క్రమంలోనూ కృపామణితో వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఒకానొక సమయంలో భర్తతో ఘర్షణపడి కొన్ని రోజుల పాటు తల్లి దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో కృపామణిని ఒక గదిలో బంధించి గుడాల శ్రీనివాస్ అనే వ్యక్తితో బలవంతంగా వ్యభిచారం చేయించాడు. ఈ సమయంలో శ్రీనివాస్ ఆమెను కొట్టి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లొంగదీసుకున్నాడు. నెల తర్వాత మరోసారి తనతో రావాలని లేకపోతే ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన కృపామణి మంగళవారం వేకువజామున కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి కృపామణి ఆచూకీ కోసం వెదుకుతున్న కుటుంబ సభ్యులకు పాలకోడేరు సమీపంలో కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె రాసిన సూసైడ్ నోట్తోపాటు తన చావుకు గల కారణాలను వివరిస్తూ తీసిన సెల్ ఫోన్ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై జి.కాళీచరణ్ మాట్లాడుతూ కృపామణి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆమె మృతదేహం పాలకోడేరు సమీపంలో బుధవారం లభ్యమైనందున అక్కడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ముంబై మోడల్స్తో వ్యభిచారం
విజయవాడ సిటీ : ముంబై మోడళ్లతో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నట్టు చెపుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ హాస్యనటుని బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు చెపుతున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తాను విటుణ్ణి మాత్రమేనంటూ పోలీసుల ఎదుట వాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నున్న రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి మోడళ్లను రప్పించి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్టు కొందరు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యభిచార గృహాన్ని ఓ హాస్య నటుని సమీప బంధువుగా చెప్పుకుంటున్న వ్యక్తి నిర్వహిస్తున్నట్టు కొందరు వ్యక్తులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైకి చెందిన ఓ మోడల్ను కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చినట్టు తెలిసింది. పక్కా సమాచారంపై టాస్క్ఫోర్స్ ఎసీపీ పి.వి.ఆర్.పి.బి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ జి.శ్రీనివాస్, సిబ్బంది గురువారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు యువతులతో పాటు రాజమండ్రికి చెందిన రాజేష్, నగరంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్న మొయినుద్దీన్ మహ్మద్ను అదుపులోకి తీసుకొని నున్న రూరల్ పోలీసులకు అప్పగించారు. వీరిలో మహ్మద్ నిర్వాహకునిగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం ఉంది. అయితే తాను కేవలం విటుణ్ణి మాత్రమేనంటూ ఆయన చెపుతున్నాడని టాస్క్ఫోర్స్ పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్ మాత్రమే నిర్వహకుడని చెప్పడంతో పూర్తి వివరాలు సేకరించేందుకు నున్న పోలీసులకు అప్పగించారు. నున్న పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న యువతుల్లో ఓ యువతి తాను బాంబేలో మోడలింగ్ చేస్తుంటానని తెలిపింది. రోజుకు రూ.10వేల చొప్పున కాంట్రాక్టుతో పాటు విమానం చార్జీలు, బస ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు ఆమె పేర్కొంది. హాస్యనటుని బంధువేనా? పట్టుబడిన వారిలో ఒకరు హాస్యనటుని బంధువుగా చెపుతున్నారు. నిజంగా బంధువా? లేక వీరు ఆ పేరు ఉపయోగించుకుంటున్నారా? అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
భాగ్యన గర్ కాలనీ: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను కూకట్పల్లి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యనగర్కాలనీలోని హోటల్ వన్ప్లస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్పై దాడి చేశారు. విటులు బి. ఓంప్రకాష్ (30), ప్రశాంత్రెడ్డి (24), కె.ప్రీతం (24), జి.విశ్వనాథ్ (24), మురళి (28)లతో పాటు ఇద్దరు వ్యభిచారిణులను అరెస్టు చేశారు. -
వెబ్చారం
ఎవరైనా చూస్తారేమోనని సందుగొందుల్లో చీకటి మాటున భయం భయంగా ఆడామగా చెవులు కొరుక్కునే రోజులు పోయాయి. ఆన్లైన్లో సంప్రదింపులు జరిపి కోరిన యువతులతో ఇంద్రభవనాల్లో విలాసంగా గడిపే సంస్కృతి వచ్చేసింది. నగరం ఇంకా పూర్తిస్థాయిలో టూరిజం కేంద్రంగా మారకముందే హైటెక్ వ్యభిచారం విచ్చలవిడిగా విజృంభిస్తోంది. కాల్గర్ల్స్ ఎట్ ఆన్లైన్ - ఈ-మెయిల్స్లో మంతనాలు - వాట్సప్లో యువతుల షేరింగ్ - ఎస్ఎంఎస్ ద్వారా వ్యభిచార గృహాలకు... విజయవాడ సిటీ : వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విటులను రప్పించేందుకు నిర్వాహకులు వాడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విలాస పురుషుల కోసం మెట్రో నగరాలకు దీటుగా ఈ-మెయిల్, వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా యువతులను సమకూర్చుతున్నారు. ఇందుకోసం విలాసవంతమైన భవనాలు, డూప్లెక్స్ హౌస్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొందరు నిర్వాహకులు రోజుల ప్రాతిపదికన అద్దెకిచ్చే అతిథి గృహాలను ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్ సహా అన్ని ప్రముఖ పట్టణాల్లో ఈ నెట్వర్క్ ఉంటుంది. ఫోర్త్ లయన్ యాప్కు వచ్చిన సమాచారంపై దృష్టిపెట్టిన టాస్క్ఫోర్స్ అధికారులకు వ్యభిచార నిర్వాహకుల నెట్వర్క్ చూసి దిమ్మతిరిగింది. పావుగంటకు అక్షరాలా రూ.20 వేలు నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆధునిక పద్ధతుల్లో ఆన్లైన్ ద్వారా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నవారిని పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఈ-మెయిల్స్లో సంప్రదింపులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ-మెయిల్స్ ద్వారా విటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉచిత ప్రచారం కోసం నిర్దేశించిన కొన్ని సైట్లలో నిర్వాహకులు కాల్గర్ల్స్ లభ్యతపై ప్రత్యేకంగా అప్లోడ్ చేసి పెడుతున్నారు. వీటికి ఆకర్షితులైన వారు ఈ-మెయిల్ ద్వారా తమ అభిరుచులను తెలియజేయాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ వద్దనున్న వారి వివరాలు చెబుతారు. దానికయ్యే ఖర్చు, కల్పించే సౌకర్యాలు వివరిస్తారు. ఈ-మెయిల్స్ పంపడం రానివారి కోసం కొన్ని మొబైల్ నంబర్లు కూడా ఆ సైట్లో పెడతారు. వాటికి ఫోన్చేసి వెళ్లవచ్చు. కాకుంటే నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల్లో తిప్పుతారు. ముందుగా కలిసిన వ్యక్తి ఓ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరొకరికి అప్పగిస్తారు. ఆ తర్వాత మరొకరు.. ఇలా పలువురిని దాటుకుని కోరుకున్న యువతి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. వాట్సప్లో ఫొటోలు విటుల అభిరుచులకు అనుగుణంగా వాట్సప్లో యువతుల ఫొటోలు షేర్ చేస్తారు. వీటిలో నచ్చినవారిని ఎంపిక చేసుకుని వారికి తెలియజేయాలి. ఈ మేరకు రేటు సహా అన్ని వివరాలూ తెలుసుకునేందుకు ఒక మొబైల్ నంబరు ఇస్తారు. సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులు జరుగుతాయి. ఆపై అనుకున్న డబ్బును ముందుగా ఆన్లైన్లో బ్యాంకు అకౌంటుకు జమచేయాలి. నగదు జమ చేసినట్టు నిర్ధారించుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ చకాచకా జరిగిపోతాయి. ఎస్ఎంఎస్ ద్వారా చిరునామా నిర్వాహకులు అడిగిన అన్ని లాంఛనాలు పూర్తిచేసిన తర్వాత విటులు ఎక్కడకు రావాలి, ఎవరిని కలవాలనే విషయాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లి.. చెప్పిన వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాహనాలు, మొబైల్ సహా అన్ని వస్తువులు సంబంధిత వ్యక్తికి అందజేయాల్సి ఉంటుంది. ఆపై మరో వ్యక్తి వాహనంలో వచ్చి యువతి ఉన్న ఇంటికి తీసుకెళతాడు. -
విదేశీ ఉద్యోగమంటూ వ్యభిచార కూపంలోకి..
బెంగళూరులోని వ్యభిచార గృహం నుంచి బయటపడ్డ యువతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు నాంపల్లి: విదేశం పంపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ మహిళ యువతిని బెంగళూరు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించింది. అక్కడ వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నించగా బాధితురాలు తప్పించుకొని హైదరాబాద్ చేరుకుంది. నిందితులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మంగళవారం మానవహక్కుల కమిషనర్ ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం... నగరంలోని టోలీచౌకి అరవింద్నగర్కు చెందిన యువతి (28)కు 2003లో పెళ్లైంది. భర్తతో అభిప్రాయభేదాలు ఏర్పడి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మెహిందీ డిజైనఖ చేస్తూ వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తోంది. ఇదే సమయంలో షాజహాన్ అనే మహిళ ఈమెకు పరిచయం అయింది. గల్ఫ్ దేశాల్లో మెహిందీ డిజైనఖకు మంచి గిరాకీ ఉంటుందని, అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆమె నమ్మబలికింది. దీంతో ఆ మహిళ తన దగ్గర ఉన్న రూ.60 వేలు షాజహాన్ చేతిలో పెట్టగా.. దుబాయి తీసుకెళ్తానని బెంగళూరుకు తీసుకెళ్లింది. బెంగళూరు నుంచి విమానంలో దుబాయి వెళ్లే విమానం ఎక్కిస్తానని చెప్పి అక్కడ ఉన్న ఓ లాడ్జిలో ఉంచింది. లాడ్జిలో భాస్కర్, ఖాదర్, అష్రఫ్ అనే ముగ్గురిని పరిచయం చేసింది. ఈ ముగ్గురూ అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్లు. వారు బాధిత యువతిని వేరే వారికి విక్రయించేందుకు యత్నించారు. వారు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించగా బాధితురాలు తప్పించుకొని నగరానికి చేరుకొని హక్కుల కమిషనర్ ను ఆశ్రయించింది. కాగా, బెంగళూర్లోని ఆ లాడ్జిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు అమ్మాయిలు నిర్బంధించబడి ఉన్నారని, సదరు లాడ్జి నిర్వాహకుడికి దుబాయిలోనూ హోటల్స్ ఉన్నట్టు తెలిసిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన వ్యక్తులతో పాటు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరింది. -
ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి...
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా సాగుతున్న మహిళల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూరు వ్యభిచారం గృహం నుంచి తప్పించుకుని వచ్చిన ఓ మహిళ... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాపై గోల్కొండ ప్రాంతానికి చెందిన అజురా బేగం మంగళవారం ఫిర్యాదు చేసింది. దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆమెను వారం క్రితం బెంగళూరులోని వ్యభిచార గృహానికి తరలించారు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. తనతో పాటు వ్యభిచారం కూపంలో మగ్గుతున్న మరో 20 మందిని రక్షించాలని హెచ్చార్సీని ఆమె కోరింది. -
వ్యభిచార కేంద్రంపై దాడులు.. నలుగురి అరెస్ట్
బోడుప్పల్: హైదరాబాద్ నగరం బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతున్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. మేడిపల్లి ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్కు చెందిన కె.శంకర్(49) అనే వ్యక్తి కేశవనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఓ యువతి (20)ని తీసుకొచ్చి ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు స్థానికులు ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్టీవో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ యువతిని రిస్క్యూ హోంకు తరలించారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు