sampath kumar
-
నైపుణ్యాభివృద్ధి ఫలించేందుకు సవాళ్లెన్నో...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన యోజనను ప్రకటించింది. రాష్ట్రంలోని ఐటీఐల (పారిశ్రామిక శిక్షణ సంస్థలు)ను క్రమేణా అధునాతన సాంకేతిక కేంద్రాలు (అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ – ఏటీసీలు)గా రూపాంతరం చేస్తూ మార్కెట్ అవసరాలకి మానవవనరులని తయారుచేస్తామని వెల్లడించింది.ఈ రంగంలో పనిచేసేవారికి ఇదొక తియ్యని వార్త. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. పారిశ్రామిక రంగానికి ఉన్నత స్థాయి ప్రమాణాలతో మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్న ఆశ ముఖ్యమంత్రి ప్రసంగం విన్నవారికి కలుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఆవిష్కృతమౌతుంది!సాంకేతిక రంగంలో నైపుణ్యాభివృద్ధి అనేది కొత్త అంశమేమీ కాదు. మన దేశంలో ఐటీఐలు, పాలిటెక్నిక్లూ దశాబ్దాల నుండి పనిచేశాయి, చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు, 255 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణనిస్తున్నాయి. ప్రకటించిన యోజన ప్రకారంగా 65 ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలు మార్చుతూ వచ్చే పదేళ్ళలో వివిధ విషయాల్లో సాంకేతిక నైపుణ్యతను సాధించిన నాలుగు లక్షల నిపుణలను తయారు చేయాలన్నది లక్ష్యం.ఈ లక్ష్యాల్ని నెరవేర్చడానికి రాష్ట ప్రభుత్వం ‘టాటా టెక్నాలజీస్ లిమిటెడ్’ సంస్థతో పదేళ్ల ఒప్పందం చేసుకొంది. వీరు స్వల్ప, దీర్ఘ కాలిక శిక్షణా కార్యక్రమాలతో ప్రతి ఏటా 30 వేలకు పైగా యువతను నిపుణులుగా తయారుచేసి పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందేలా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్లి బతకడానికి సంసిద్ధుల్ని చేస్తారు.శిక్షణను కేవలం పుస్తక, అనుభవ సిలబస్సులకే పరిమితం చేయకుండా దాని చుట్టూతా ఆవరించి ఉన్న జీవకళలను కూడా జోడించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. జిల్లాలవారీగా ఈ అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ యా ప్రాంతాల్లో ఉన్న ఏటీసీలు కోర్సుల్ని రూపొందించాలి. ఉదాహరణకు తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలస వెళతారు.ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గల్ఫ్ దేశాల అవసరాలకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి జోడైతే వలసదారులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారే కాకుండా, తిరిగివచ్చిన వారికి సైతం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు తక్షణమే అందుబాటులో ఉండాలి. వీరు మాతృదేశానికి వచ్చి స్థిరపడి పోవాలనుకొంటారు. గల్ఫ్ దేశాల్లో చేసిన పని, అనుభవం తిరిగివచ్చినవారి ఊళ్లలో పనికిరాకపోతే వారిలో నిరుత్సాహం మొదలై మళ్ళీ వలసపోవాలనే ఆలోచనలతో సతమతమౌతారు.జెండర్ వివక్ష ఎక్కువ ఉన్న మన సమాజంలో సమతుల్యం తేవడానికి అమ్మాయిలు సంప్రదాయేతర కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలి. జనవరి 2001లో భుజ్ (గుజరాత్) లో భయంకర భూకంపం వచ్చాక పునరావాసానికి వేల సంఖ్యలో ఇళ్లను కట్టడానికి తీవ్రమైన మేస్త్రీల కొరత ఏర్పడింది. అహమ్మదాబాద్కు చెందిన సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ వారు గ్రామీణ మహిళలకు నిర్మాణరంగంలో శిక్షణనిచ్చి పునరావాస కార్యక్రమాలను వేగంగా అమలుపరచడంలో చేయూతనిచ్చారు. నిర్మాణ రంగంలో ఎప్పుడూ మానవవనరుల కొరత ఉంటుంది. మహిళలు కేవలం అల్పస్థాయి పనులకే పరిమితమౌతున్నారు. ఇప్పుడు ఐటీఐల ప్రక్షాళన మొదలవుతుంది కాబట్టి పెద్దయెత్తున ప్రయత్నాలు చేపట్టి మహిళలకు సాంకేతిక రంగంలో సముచిత స్థానం కల్పించాలి.1980వ దశాబ్దంలో భారత ప్రభుత్వం ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీస్’(ïసీఏఆర్టీ– కార్ట్) అనే సంస్థని ఢిల్లీలో స్థాపించింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థను 25 ఏళ్లుగా పనిచేస్తున్న మరో సంస్థ, ‘పీపుల్స్ ఆక్షన్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా’ (పీఏడీఐ)తో విలీనం చేసింది. రెండు పేర్లలో ఉన్న మూలసూత్రాలను కలుపుకొని ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ ఆక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీస్’– కపార్ట్ పేరుతో దేశమంతా ఎన్జీవోలకి ఆర్థిక సహాయన్నందిస్తూ చాలా సంవత్సరాలు పనిచేసింది (వ్యాస రచయిత ఈ సంస్థలో ఆరు సంవత్సరాలు పనిచేశారు).ఈ రెండు సంస్థలూ గ్రామీణాభివృద్ధి విభాగం (వ్యవసాయ మంత్రిత్వ శాఖ) కింద పనిచేసేవి. అప్పుడు కపార్ట్ ఒక వినూత్న ప్రయోగాన్ని– ‘రీజినల్ రిసోర్స్ సెంటర్స్ ఫర్ రూరల్ టెక్నాలజీస్’ (ఆర్ఆర్సీఆర్టీ) ఆరంభించింది. కపార్ట్ స్వచ్ఛందసేవా సంస్థలకు ఆర్థిక సహాయంచేసే సంస్థ కాబట్టి ఉన్నతశ్రేణి ఎన్జీవోలకు ఇది గొప్ప అవకాశంగా అందుబాటులోకి వచ్చింది. ఎన్నో పేరున్న సంస్థలు ఏళ్లనుండి గ్రామీణాభివృద్ధికి అంకితమై యువతకి ఉపాధికోసం శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని జరుపుకున్నాయి.ఈ యోజన ద్వారా పలు సంస్థలకి పెద్ద మొత్తాల్లో 3–5 సంవత్సరాల ప్రాజెక్టులను ఇచ్చారు. లబ్ధి పొందిన ఈ సంస్థలు తమ తమ ప్రాంతీయ అవసరాలను తెలుసుకొని మంచి శిక్షణా కార్యక్రమాలను రూపొందించి గ్రామ యువతకు శిక్షణ ఇచ్చాయి. మరింత బలపర్చడానికి గాను ఈ యోజన ఎంతో తోడ్పడి యువత భవిష్యత్తు నిర్మాణంలో గణనీయమైన పాత్ర వహించాయి. అయితే కాలక్రమేణా కపార్ట్ మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం పైవిషయాలనూ దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సాగించాలి.– డా. టి. సంపత్ కుమార్, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు. ఢిల్లీలోని కెనడియన్ హై కమిషన్ మాజీ సీనియర్ సలహాదారు -
మాదిగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్ అన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధ లేదు నాగర్కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్ చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీయే గాడ్ఫా దర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు. -
నాగర్ కర్నూల్ టికెట్ ఫైట్
-
సీఎం జగన్ ఆపన్న హస్తం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్ జగన్.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్ కలెక్టర్ సంపత్కుమార్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్ తల్లి టి.ఉష, బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు. -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్ను పసునూరి దయాకర్, గ్లింప్స్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్స్టోరీగా మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
ఏపీలో విద్యా సంస్కరణలు అద్భుతం
రామచంద్రపురం రూరల్: ఏపీలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, ఇప్పటికే ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని మేఘాలయ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.సంపత్కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తన తల్లి ఈశ్వరమ్మతో కలసి బుధవారం ఆయన సందర్శించారు. సంపత్కుమార్ ఇదే పాఠశాలలో 4వ తరగతి విద్యనభ్యసించగా, తల్లి ఈశ్వరమ్మ ఇక్కడ ఉపాధ్యాయినిగా పనిచేశారు. తాను పనిచేసిన పాఠశాలలను ఒక్కసారి చూడాలన్న తల్లి కోరికతో పాటు ఏపీలో జరుగుతోన్న విద్యా సంస్కరణలను పరిశీలించడానికి వచ్చినట్లు సంపత్కుమార్ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన పట్టుదలతో శ్రమించాలని సూచించారు. మంచి చదువును అందిస్తే భవిష్యత్ తరాలు అద్భుతంగా మారతాయని ఆ దిశగా పనిచేస్తోన్న సీఎం జగన్ అభినందనీయుడన్నారు. సంపత్కుమార్ తల్లి ఈశ్వరమ్మను ఆర్జేడీ నాగమణి ఆధ్వర్యంలో సత్కరించారు. -
అలాంటి తేడాలు ఇండస్ట్రీలో ఉండవు: హీరోయిన్
Surapanam Movie Trailer Released: సంపత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ను సోమవారం రిలీజ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ –‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రేమకథ ‘సురాపానం’ లో ఉంటుంది. సంపత్కుమార్ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. ‘సురాపానం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథను ‘సురాపానం’ చిత్రంలో చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్..ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ప్రగ్యా నయన్. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీగా ‘సురాపానం’
ప్రగ్యా నయన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సురాపానం’ (కిక్–ఫన్). సంపత్ కుమార్ దర్శకత్వం వహించి, లీడ్ రోల్ చేశారు. మట్ట మధు యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశాన్ని థ్రిల్లింగ్గా చూపిస్తూ హాస్యాన్ని జోడించి ఈ చిత్రం తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో, కెమెరా: విజయ్ ఠాగూర్. -
హీరోగా మారిన డైరెక్టర్, సురాపానం సినిమా టీజర్ చూశారా?
సంపత్ కుమార్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’ (కిక్ అండ్ ఫన్). ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా టీజర్ని ‘భీమ్లా నాయక్’ ఫేమ్ దర్శకుడు సాగర్ కె. చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సురాపానం’ టైటిల్కి తగ్గట్టుగా టీజర్ కూడా చాలా బాగుంది. థ్రిల్, వినోదం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్, కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సరికొత్త కథాంశంతో వస్తున్న ‘సురాపానం’ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం మా సినిమా సెన్సార్లో ఉంది.. మే చివరి వారంలో చిత్రం విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, సురభి ప్రభావతి, త్రిపుర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చదవండి: సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్ యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్లోని తాజ్దక్కన్లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్, మాజీ మంత్రి షబ్బీర్అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్కుమార్యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
జానా గులాబీ కండువా కప్పుకుంటానన్లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవమున్న జానారెడ్డి గురించి కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తగదని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తే సంతోషమని జానా అన్నారే తప్ప.. గులాబీ కండువా కప్పుకుంటానని ఆయన అనలేదని, అలా అన్నట్టు శాసనసభ రికార్డుల్లో ఎక్కడా లేదని చెప్పారు. శనివారం టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు కోటి ఎకరాలకు నీరిస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి చెప్పారని, కేసీఆర్ మాట్లాడింది తప్పని తాము నిరూపించినందుకు ఇప్పుడు ఆయన ఏం శిక్ష వేసుకుంటారో చెప్పాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జానారెడ్డికి సీఎం క్షమాపణలు చెప్పాలని సంపత్ డిమాండ్చేశారు. -
కాంగ్రెస్ ‘పవర్’పంచ్: గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ‘పవర్’పంచ్ విసిరింది. 10 మంది మంత్రులపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. దొంగలముఠాలా ఏర్పడి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తింది. పేదల భూములపై రాబందుల్లా వాలిపోయి కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించింది. మంత్రుల అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ సక్రమంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదని, అందుకే సిటింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ డిమాండ్ చేశారు. ‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’పేరిట శుక్రవారం ఆయన గాంధీభవన్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలు తారస్థాయికి చేరాయని, కొందరు మంత్రులైతే దళితుల భూములు, దేవుడి మాన్యాలను కూడా వదలడంలేదని ఆరోపించారు. భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూమ్యాప్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు అనిల్యాదవ్, రోహిత్లు పాల్గొన్నారు. ఆయా మంత్రులపై సంపత్ కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్లో చేసిన ఆరోపణలు ఈవిధంగా ఉన్నాయి... మంత్రి కేటీఆర్ ఫాంహౌస్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ ఎంపీ రేవంత్ ఆధారాలతోసహా బయటపెడితే ఆయన్ను జైలుకు పంపారు. దేవరయాంజాల్ దేవాలయ భూములను కేటీఆర్ ఆక్రమించారు. దేవరయాంజాల్ భూముల్లోనే మంత్రి మల్లారెడ్డి ఫామ్హౌస్ కట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి బ్యాంక్ లాంటివాడు కాబట్టే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మంత్రి గంగుల కమలాకర్ భూముల విషయమై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే కోర్టులో కేసు వేశారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలూ లేవు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూములను మంత్రి పువ్వాడ అజయ్ అప్పనంగా అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ మారినందుకు రూ.50 కోట్ల విలువైన భూమి, మంత్రి పదవిని ఇచ్చారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించారు. 200 ఎకరాల్లో ఫామ్హౌస్ కట్టుకుని విలాసవంతంగా జీవిస్తున్నారు. మరోమంత్రి శ్రీనివాస్గౌడ్ కూడా భూకబ్జాల్లో ఆరితేరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కుష్టు ఆసుపత్రి భూముల్ని కూడా వదల్లేదు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై ఎన్నిసార్లు భూకబ్జా ఆరోపణలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోరు. మంత్రులు ఎర్రబెల్లి, మహమూద్ అలీలపై వచ్చి న ఆరోపణలను కూడా సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారు. రాబందుల్లా పడ్డారు: ఉత్తమ్ కాంగ్రెస్ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేస్తే టీఆర్ఎస్ నేతలు వాటిని కబ్జా చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఒకవైపు సీఎం కేసీఆర్ చెబుతుండగా, మరోవైపు తన కేబినెట్ సహచరులు రాబందుల్లా వారి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. వీరంతా దొంగల ముఠాలాగా ఏర్పడి అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. భూదందాలకు పాల్పడిన మంత్రులను శిక్షించాలని రాష్ట్ర గవర్నర్కు లేఖ రాయనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. చదవండి: Etela Rajender: రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు -
సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి
సాక్షి, మానకొండూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్కుమార్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కేసీఆర్, సంపత్కుమార్ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని, ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని నెలల క్రితం కరీంనగర్కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్లో ఉన్న కేసీఆర్ను కలిసేందుకు సంపత్కుమార్ వెళ్లారు. సంపత్కుమార్ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్ను పరిచయం చేశారు. హైదరాబాద్లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్కుమార్ ఆ రోజు సంతోషపడ్డారు. కాగా, సంపత్కుమార్ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీలక ఆదేశాలు -
ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది..?
సాక్షి, హైదరాబాద్: దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షతన.. మహిళా కాంగ్రెస్ చైర్మన్ నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మహాధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మహిళా, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (టీఆర్ఎస్ నేతల ఇళ్లకే రూ.10 వేలు) ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 'దళితులకు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా దళితులు, మహిళల హక్కుల కోసం ధర్నా చేయాల్సి రావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ కోసం మహిళలు, దళితులు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజూ అత్యాచారాలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతిరోజు దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలన పోవడానికి ప్రతి దళితుడు పోరాటం చేయాలి. ప్రతి మహిళా టీఆర్ఎస్ను బొంద పెట్టడానికి నడుం బిగించాలి' అని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. (హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు..?) -
ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. రాష్ట్రం ఉత్తరప్రదేశ్లా మారుతోందని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్లో మాదిరిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, దోషులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నివాసాన్ని సంపత్తోపాటు కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అందరిని అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం హోంమంత్రి సంపత్కు ఫోన్ చేసి మాట్లాడారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: టీఆర్ఎస్ నేతల బాహాబాహి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. ‘నిన్న(బుధవారం) కేసీఆర్ శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఆదర్శంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్కు సిగ్గు ఉందా. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టీఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు ఇది ఆదర్శంగా ఉందా. ఖమ్మంలో బాలికపై అత్యాచారయత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు. ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరామర్శించారా. ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. హోంమంత్రి రాజీనామా చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా.. -
ఒత్తిడితో సచ్చిపోతున్నా..
మిర్యాలగూడ అర్బన్: ‘చదివి.. చదివి ఒత్తిడితో సచ్చిపోతున్నాం కేసీఆర్ సార్.. పుస్తకం తీయాలంటే వణుకు వస్తుంది. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వండి’అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు విషం తాగాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మిర్యాలగూడ శాంతినగర్కు చెందిన సంపత్కుమార్ చాలా రోజులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబానికి భారం అవుతున్నానని భావించి ఓ పురుగుల మందు డబ్బాను తెచ్చుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తను పడిన మానసిక వేదనను వివరించి ఆ పురుగుల మందు తాగేశాడు. తన తండ్రి సత్యనారాయణ టైలర్గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివించినా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక, చేసేదిలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. విషం తాగి అపస్మారక స్థితిలోకి పోయిన సంపత్కుమార్ను గుర్తించిన తల్లితండ్రులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అపాయింట్మెంట్ లేదని అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి వెళ్లిక టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరి కొంతమంది నేతలు శనివారం నగంరలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారికి డీజీపీ అపాయింట్మెంట్ మంజూరు చేయకపోవడంతో లోపలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేసి నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా అంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రీశైలం పర్యటన ఉద్రిక్తతంగా మారింది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శ్రీశైలం పవర్ప్లాంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే... విషం చిమ్ముతారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన విషం చిమ్ముతోందని మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ సొంత బిడ్డలయిన కాంగ్రెస్ పార్టీ నేతలపై విషం చిమ్ముతున్నారని బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం సచివాలయాన్ని కట్టడం అవసరమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి వాస్తు సరిగా లేదని ప్రజలకు చెందిన వేల కోట్ల ఆస్తులతో భవనాలు నిర్మించడం, దాన్ని మంత్రులు సిగ్గులేకుండా సమర్థించడం దౌర్భాగ్యమని అన్నారు. విభజన చట్టాన్ని తామే తయారు చేశామని కేసీఆర్ చెప్పుకున్నారని, మరి ఆ చట్టంలో సెక్షన్ 8 ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు చట్టం, రాజ్యాంగం తెలియడం లేదని, చట్టంలో ఉన్నది కాబట్టే తాము అడుగుతున్నామని, అది ఆమలు చేయమని అడగడం బానిసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రులకు కనీసం సోయి లేకుండా పోయిందని, చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఉంది కాబట్టే తాము సెక్షన్ 8 గురించి అడుగుతున్నామని, అవేమీ మంత్రులకు లేవు కాబట్టి తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏందని మంత్రులు అంటున్నారని, కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల బాగోగులు తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని, ఆ సమయంలో కేసీఆర్ కనిపించకుండా పోతే ఎలా అని అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కరోనా అంటున్నారని, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తాము చేతల్లో చూపించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కరోనా కాదని, టీఆర్ ఎస్ పార్టీ ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదని సంపత్ వ్యాఖ్యానించారు. -
‘కేటీఆర్కు వాళ్ల సమస్య కనిపించడం లేదా’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. కంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంది రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సూచించారు. టమాటా పండించిన రైతు పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో కంది కొనుగోలుకు పరిమితులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలని, టమాటాకు మద్దతు ధర కల్పించాలని కోరారు. (ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారిణి) అదే విధంగా గిట్టుబాటు ధరను కల్పించడంలో, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే వ్యవసాయ పనిముట్ల సబ్సిడీని సైతం కేసీఆర్ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ అంటే కేసీఆర్ సర్కార్ కు గుర్తుకొచ్చేది కేవలం ట్రాక్టర్లు మాత్రమేనని, ట్రాక్టర్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే వాటిపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై ట్విట్టర్ లోనైనా స్పందిస్తాడో ఏమోనని ట్విట్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఈటెల రాజేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్కు రైతు సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. (జనరల్ మేనేజర్పై పగబట్టిన మేనేజర్ ) -
80 సార్లు రక్తదానం.. 127 సార్లు ప్లేట్లెట్స్
ఇప్పుడు చాలా మంది చాలా రకాల రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సాటిమనిషికి సేవచేయడంలో రికార్డు సృష్టించేవారు అరుదే. అలాంటి అరుదైన వ్యక్తి నగరవాసి సంపత్ కుమార్.వందలసార్లు రక్తదానం చేయడం ద్వారా రికార్డు సృష్టించిన ఆయన అంతకు మించిన స్ఫూర్తినింపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఒక మనిషికి అత్యంత అవసరమై, ఒక మనిషి కృత్రిమంగా తయారు చేసుకోలేని జీవ పదార్థం ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రతీ సెకనుకు ఇద్దరు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ సేవకు సమాజంలో మార్పునకునిర్విరామ రక్తదాతగా మారి మరెంతో మందిని రక్తదాతలుగా మారుస్తున్నారు నగరవాసి సంపత్ కుమార్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చలింపజేసినమృత్యువు.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన వ్యాపార కుటుంబంలో పుట్టి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా కొద్ది రోజులు చేసి ఇప్పుడు సిటీలో స్వంత బ్యూటీ పార్లర్ నిర్విహిస్తున్నా. ఇరవైఏళ్ల క్రితం గాంధీ హస్పిటల్లో సమయానికి రక్తం అందక ఓ రోగి చనిపోవడం చూసి చలించిపోయాను. ఆ మరునాడే రక్తదానం చేశా. కనీసం 18 నుండి 65 సంవత్సరాల వయస్సు కలిగి, ఆరోగ్యంగా ఉన్నప్రతీ వ్యక్తి 3 నెలలకు ఒకనారి రక్తం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చు.. ఈ విధంగా సంవత్సరానికి 24 సార్లు ప్లేట్లెట్స్, 4 సార్లు రక్తం దానం చేయొచ్చునని తెలిశాక ఇప్పటికి 80 సార్లు రక్తదానం, 127 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశా. 188 సార్లు రక్తదానం చేయొచ్చు దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు ప్రతీ సంవత్సరం 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 40 లక్షలు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. రక్తదానం పై అపోహలు తొలగించడానికి సదస్సులు, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నా రక్తదానం వలన గుండెపోటు, కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయనే విషయం సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దాతల రక్తాన్ని ప్రాజోన్ ప్లాస్మా, ర్యాండమ్ ప్లేట్లెట్స్, పాకెట్ సెల్స్ అనే 3 విభాగాలుగా విభజిస్తారు. ♦ ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదు. ఒక వ్యక్తి 47 సంవత్సరాల వ్యవధిలో (18–65 సంవత్సరాల మధ్య) 188 సార్లు రక్తదానం చేసి 564ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. తలసేమియా, కేన్సర్ కీమోథెరపీ, గుండె సర్జరీ, డెలివరీ సమయాల్లో... ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో రక్తం అవసరమవుతుంటుంది. గత 2008 నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ప్రయాణం చేస్తూ అక్కడే 148 సార్లు రక్తదానం చేశా. రక్తదానం, నేత్రదానంకృషి చేస్తూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసే బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవి తనను ‘‘నీ సేవలు వెల కట్టలేనివని’’ ప్రశంసించి తన కోసం ప్రత్యేకంగా బొకే పంనించడం ఎప్పటికీ మర్చిపోలేను. రక్తదాతగా పలు రికార్డులు ♦ విశ్వగురు ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఫీచర్ అబ్దుల్ కలాం ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఇండియన్ ప్రైడ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ♦ రక్త దానానికి సంబంధించి దేశంలోనే మొదటి డాక్టరేట్–తమిళ యూనివర్సిటీ. -
‘ఆ కుట్ర వెనుక మోహన్ భగవత్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్ : జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యర్శి సంపత్ విమర్శించారు. జార్ఖండ్ ఫలితాల సందర్భంగా గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, దేశంలో బీజేపీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని, వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అధికారపార్టీకి దూరం అయ్యారన్నారు. అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వానిదేనని, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. (జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం) సంబంధిత వార్తలు : సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం! జార్ఖండ్లో నూతన శకం: సోరేన్ -
నాపై ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై తాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ ఆరోపించారు. తాను ప్రభుత్వ విధానాలను విమర్శించానని గన్మెన్లను తీసేశారని, ఏడాది కాలంగా తనకు రావాల్సిన మాజీ ఎమ్మెల్యే పింఛన్ ఇవ్వడం లేదని మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తన సోదరుడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తొలగించారని, తన మరో సోదరుడు న్యాయపరంగా దక్కించుకున్న కాంట్రాక్టులను కూడా తొలగించారని ఆరోపించారు. ఐకియాకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్ప్రోకో జరిగిందని, హెరిటేజ్ భవనాన్ని తొలగించి కేటీఆర్ వందల కోట్లు సంపాదించడాన్ని తాను పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఏడుసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని అన్నారు. -
నాపై కక్ష సాధిస్తున్నారు: సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: హత్యలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఓ వైపు దేశం ఆగమవుతుంటే బీజేపీ నేత అమిత్ షా అయోధ్య గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ యాదాద్రిలో పాపాలను కడిగేసుకోవడానికే దేవుడి దగ్గరకు పోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐకియా సంస్థకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. హెరిటేజ్ భవనాన్ని తొలగించి కేటీఆర్ అక్కడ వందల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు. ఇక టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లను వారితో ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే చింటూ పింటూ అని పిలిచానని సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి బూతులు మాట్లాడకుండా కేవలం ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే విమర్శించానన్నారు. కానీ వాళ్లు దీనికి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెలిపారు. ‘నాకు గన్మెన్లను తీసేశారు. మా అన్నను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తొలగించారు. నా తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్లను తొలగించారు. నాతోపాటు మాజీ ఎమ్మెల్యేలందరికీ ఏడాదికి పైగా రావాల్సిన పెన్షన్లను ఆపేశారు. తనపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నాపై కక్ష సాధిస్తే నేను ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది మూర్ఖత్వం. ఎన్ని చేసినా నీపై పోరాటాలు ఆపే ప్రసక్తి లేదు. ఖబడ్దార్, నీపొగరు దిగే వరకు మా పోరాటాలు ఉంటాయి’ అని సంపత్ కుమార్ తెలిపారు -
కాంగ్రెస్ అగ్నికి ఆజ్యం పోస్తోంది
డుమ్కా (జార్ఖండ్): కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పౌరసత్వ(సవరణ) చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం జార్ఖండ్లోని డుమ్కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగ్నికి ఆజ్యం పోస్తున్న వారిని వారి దుస్తుల ఆధారంగానే గుర్తించవచ్చునని పార్టీ, సామాజిక వర్గాల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఆస్తులకు నిప్పు పెడుతున్న వారిని టీవీల్లో చూడవచ్చు. ధరించిన దుస్తుల ఆధారంగానే వారిని గుర్తు పట్టవచ్చు’అని ఆయన అన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలన్నింటికీ ప్రతిపక్షాలు వ్యూహాత్మక సహకారం అందిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కుట్రలకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రభావితం కాలేదని అన్నారు. లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు కొందరు ప్రదర్శన నిర్వహించడంపై ఆయన.. ‘దేశం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ఏళ్లుగా చేస్తున్న పనిని ఇప్పుడు కాంగ్రెస్ మొదటిసారిగా చేపట్టింది’ అని ఆరోపించారు. పార్లమెంట్లో ఎంపీలు సంతాలీ తదితర ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో సంతాలీ భాష తర్జుమాకు కూడా వీలు కల్పించారన్నారు. -
చింటూ, పింటూలు ఇప్పుడు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : గతంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే చింటూ (కేటీఆర్), పింటూ (హరీష్రావు)లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్లు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వారి మాటల్లోనే.. ‘ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు లేదు. వర్షాలు పడినా ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియాపైన విపరీతమైన ఒత్తిడి వల్ల నిజాలు బయటకు రావడం లేద’ని విమర్శించారు. మంత్రులకు పదవీ భయం? ఇంకా ‘దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గ పాలన లేదు. అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్నారు. ప్రతీ విషయంలో మేమే పోటుగాళ్లమంటూ ముందుకు వచ్చే కేటీఆర్, హరీష్లు ఎక్కడ పోయారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్లు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదెందుకు? ఒకాయన జాయ్ 2019 అంటూ విలాసాలు చేస్తున్నారు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ఆ శాఖ మంత్రి ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. డెంగీతో అనేక మంది చనిపోతుంటే ఆరోగ్య మంత్రి పదవి భయంతో గొంతు మీద వేలాడుతున్న కత్తిని చూసి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ప్రజలు తిరగబడకపోతే న్యాయం జరగదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంద’ని వారు వివరించారు. -
ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం
-
ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం
సాక్షి, చౌటుప్పల్: న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా తాము సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం సోనియా గాంధీని సైతం ఎదిరించామని పేర్కొన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదని, ఆయన దొంగ దీక్షలతో ఎన్నో ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోల స్థలాలపై కన్నేసిన కేసీఆర్, కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దోపిడీలో భాగంగానే మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రికల్ బస్సులు, వరంగల్లో ఎంపీ దయాకర్కు ఆర్టీసీ స్థలాల కేటాయింపు బాగోతమన్నారు. కార్మికులు ఆత్మస్థైర్యంతో ఉండాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పాల్గొన్నారు. -
‘రేవంత్... నా ముద్దుల అన్నయ్య’
సాక్షి, హైదరాబాద్ : తనకు యురేనియం విషయంలో ఏబీసీడీలు కూడా తెలియవని, పవన్ కల్యాణ్తో సెల్ఫీ అవకాశం ఇవ్వనందుకే తాను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడానంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్ పేర్కొన్నారు. రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన మాట్లాడిన మాటలకు తాను స్పందించాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. -
రేవంత్కు నో ఎంట్రీ.. సంపత్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: యురేనియం విషయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు ఏబీసీడీలు రావని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను చదువులో పీహెచ్డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని సంపత్ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. తాను గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, అందుకే మీడియాకు అందుబాటులో లేకపోయానని వివరించారు. రేవంత్ రెడ్డి నాకు అత్యంత ముద్దుల అన్నయ్య అని, కానీ తనపైన ఎందుకు అలా మాట్లాడారో అర్థంకావట్లేదని అన్నారు. యురేనియం విషయంలో రేవంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు.. పూర్తి సమాచారం తెలుసుకున్న అనంతరం మాట్లాడుతానని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, వంశీచందర్, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్కు మాత్రం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశంలో సంపత్ మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ నాకు సెల్ఫీ ఇవ్వలేదని నేను రేవంత్పైన పడ్డట్టు ఆయన మాట్లాడుతున్నారు. నాతో సెల్ఫీ దిగడానికి చాలా మంది వస్తారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. కేవలం జనసేన బ్యానర్ పైన అఖిలపక్షం భేటీ జరగడం సరికాదు. కనీసం సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీ జనసేన. యురేనియం ఉద్యమ క్రెడిట్ వేరే పార్టీకి ఇవ్వొద్దు. రేపు పవన్ కల్యాణ్ యురేనియం పైన మళ్ళీ మీటింగ్ పెడితే వెళ్తా.. కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటీ అనేది ముందే పార్టీలో చర్చ జరగాలి. యురేనియం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అంతా జనసేన పార్టీకి క్రెడిట్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా ప్రశ్నిస్తా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెజాన్ అడవులలో మాట్లాడినా నేను సంతోషిస్తా. నేను పీసీసీ పదవికోసం ఎవరినీ అడగలేదు. ఎస్సీ సామాజికవర్గానికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తే నేను రెడీ. దామోదర రాజనర్సింహ పేరు ను పీసీసీ చీఫ్ పదవికి పరిశీలించాలని కోరతాను’ అని సంపత్ వ్యాఖ్యానించారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యలపై దుమారం -
పవన్కల్యాణ్ మీటింగ్కు మనమెందుకు?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు. -
హైకోర్టులో కార్యదర్శులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలి పేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అసెంబ్లీ రద్దు కావడంతో ధర్మాసనం ఆ అప్పీళ్లతో పాటు సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను కూడా మూసేసిందని, అయినా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుకెళ్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరు తూ నిరంజన్రావు, నరసింహాచార్యులు వేర్వే రుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సింగిల్ జడ్జి తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను మూసేసినా కూడా సింగిల్ జడ్జి మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ కార్యదర్శులకు బెయిలబుల్ వారంట్లు జారీ చేయడమే కాక, కోర్టు ముందు హాజరైన తర్వాత వారిని తిరిగి హైకోర్టు రిజిస్ట్రార్ కస్టడీకి అప్పగించారన్నారు. ఈ సమయంలో ధర్మాస నం.. కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయ వాది కోసం ఆరా తీసింది. అయితే ఏ ఒక్కరూ కోర్టులో లేకపోవడంతో, దీన్ని బట్టి ఈ కేసు పట్లవారు అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెషల్ జీపీ శరత్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లు గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
కోమటిరెడ్డి, సంపత్ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్.. సామాజిక సమీకరణాలపై తర్జనభర్జన పడుతోంది. కూటమిపక్షాలు సూచిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటూనే సామాజిక వర్గాల వారీగా సీట్లను ఎవరికి కేటాయించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తం 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 స్థానాలు మాదిగలకు, 7 స్థానాలు మాలలకు కేటాయించాలని యోచిస్తున్న కాంగ్రెస్, జిల్లాల సమీకరణలు, ఆయా కులాల జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ అభ్యర్థిని బరిలో నిలపాలన్న దానిపై విస్తృతంగా చర్చిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధర్మపురి, బెల్లంపల్లి, మానకొండూరు, చెన్నూర్, చొప్పదండి, జూకల్, అంధోల్, జహీరాబాద్, చేవెళ్ల, వికారాబాద్, కంటోన్మెంట్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, తుంగతుర్తి, నకిరేకల్, ఆలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 5 నుంచి 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉండగా, 13 లేక 14 స్థానాలు కాంగ్రెస్కు దక్కనున్నాయి. ఇందులో ఆంధోల్లో దామోదర రాజనర్సింహ, మధిరలో భట్టి విక్రమార్క, ఆలంపూర్లో సంపత్కుమార్, మానుకొండూర్లో ఆరేపల్లి మోహన్, జహీరాబాద్లో గీతారెడ్డి, వికారాబాద్లో గడ్డం ప్రసాద్కుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున అక్కడ కూటమి పక్షాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. మిగతా వాటిలో సత్తుపల్లిలో టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉంది. ఇవి పోనూ మిగతా స్థానాల్లో ఏ పార్టీకి ఏయే సీట్లు ఇవ్వాలి.. ఇక్కడ మాల, మాదిగ వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వర్ధన్నపేట, జూకల్లో మాదిగ, తుంగతుర్తి, అచ్చంపేట, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో నిలపాలని ఇప్పటికే కూటమి పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. స్టేషన్ ఘన్పూర్, చొప్పదండి, కంటోన్మెంట్ విషయంలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరి బలమెంత.. ఏ మేరకు విజయవకాశాలు ఉంటాయన్న దానిపైనా బుధవారం సైతం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ చర్చించారు. -
కల్వకుంట్ల కుటుంబ పతనానికి ఏమైనా చేస్తా
సాక్షి, హైదరాబాద్: దేవుడినైనా ఎదిరిస్తామని అంటున్న టీఆర్ఎస్ నేతలను, ఆ పార్టీని ఆ దేవుడు కూడా క్షమించడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో తనతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్రెడ్డిలు ఉండొద్దన్నదే కేసీఆర్ భావన అని, ఈ విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైందని చెప్పారు. ఈ కుట్ర వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశానని, దీని పరిణామమే రేవంత్రెడ్డి ఇంటిపై ఐటీ దాడులని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇంటి మీద కక్షపూరితంగా జరిగిన ప్రభుత్వ ప్రేరేపిత దాడిని ఖండిస్తున్నానని, రేవంత్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవారిని వేధించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు పోలీసు అధికారులు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఉంటున్న ప్రగతిభవన్లోకి వెళ్లి ఆయనతో ఏకాంతంగా మాట్లాడి వచ్చిన తర్వాతే ఈ దాడులు జరిగాయని చెప్పారు. ఇన్ని రోజులు గన్మన్లను తొలగించి తనను మానసిక క్షోభకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు గన్మన్లను ఇస్తామని అంటోందని, దీని వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గన్మెన్ల సాయంతో తన సమాచారం తెలుసుకోవచ్చనే ఆలోచనతో మళ్లీ గన్మన్లను ఇస్తామని అంటున్నారనే అనుమానం తనకుందని, అందుకే గన్మన్లను తిరస్కరిస్తున్నానని చెప్పారు. ‘అమ్మతోడు చెప్తున్నా.. కల్వకుంట్ల కుటుంబం పతనం అయ్యేంత వరకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఖడ్గంతో ఏమైనా చేస్తా’అని సంపత్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఊరట
-
61 రోజుల జాప్యాన్ని మన్నించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల అసెంబ్లీ బహిష్కరణ వ్యవహారంలో మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకుంది. కోమటిరెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానాన్ని, వీరిద్దరి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన తీర్పు అమలును 2 నెలల పాటు ధర్మాసనం నిలిపేసింది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ కార్యదర్శి వి.నిరంజన్రావుకు కోర్టు ధిక్కారం కింద ఫామ్–1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలును సైతం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లలో జరిగిన 61 రోజుల ఆలస్యాన్ని కూడా మన్నించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్ను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు ఈ ఏడాది ఏప్రిల్ 17న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్కు విచారణార్హత లేదంటూ ధర్మాసనం దానిని కొట్టేసింది. అయితే కోర్టు తీర్పు మేరకు తమ పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో చేర్చలేదని, దీనికి గాను కోర్టు ధిక్కారం అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులను శిక్షించాలంటూ కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనేందుకు ప్రాథ మిక ఆధారాలున్నాయంటూ వారిద్దరికీ ఫామ్–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించనందుకు డీజీపీతో పాటు నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్పీకర్ మధుసూదనాచారికి సైతం షోకాజ్ నోటీసులిచ్చారు. జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఇరువురు కార్యదర్శులు కూడా ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు. ఇయర్ ఫోన్లు విసరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం లేదు.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియో ఫుటేజీ కోర్టు ముందు సమర్పించకపోవడాన్నే సింగిల్ జడ్జి ప్రధాన అంశంగా పరిగణించారని, ఇది సరికాదన్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఇయర్ఫోన్ విసిరి మండలి చైర్మన్ను గాయపరిచారని, దీంతో వారిద్దరినీ బహిష్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని, ఆ తరువాత వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఘటన జరిగిన మార్చి 12న గానీ, బహిష్కరణ జరిగిన 13న గానీ ఇరువురు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఆ తరువాత వినతిపత్రం సమర్పించారన్నారు. మండలి చైర్మన్పై ఇయర్ ఫోన్లు విసరలేదని ఇరువురు ఎమ్మెల్యేలు చెప్పడం లేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందన్న సింగిల్ జడ్జి తీర్పు సరికాదన్నారు. బహిష్కరణ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. అందుకే 61 రోజుల జాప్యం జరిగిందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం సంగతి తరువాత తేలుస్తామని, ఈ అప్పీళ్లపై విచారణ జరిపే పరిధి ఉందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. తమ అప్పీళ్లకు విచారణార్హత ఉందని రోహత్గీ తెలిపారు. సభ తీర్మానంపై న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు.. న్యాయశాఖ కార్యదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది హరేన్ రావెల్ వాదనలు వినిపిస్తూ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలోని వ్యవహారమన్నారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయం స్పీకర్ది కాదని, మొత్తం సభే తీర్మానం చేసిందని ఆయన వివరించారు. సభ తీర్మానం విషయంలో న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి... కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బహిష్కరణ తరువాత పిటిషనర్లకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అప్పీళ్ల దాఖలులో జరిగిన జాప్యంపై వాదనలు వినిపించకుండా సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పునిచ్చినప్పుడు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరించిన కార్యదర్శులు, కోర్టు ధిక్కార నోటీసుల జారీతో ఈ అప్పీళ్లు జారీ చేశారన్నారు. అంతేకాక సింగిల్ జడ్జి ముందు ఇరు కార్యదర్శులు కూడా కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ పని చేయకుండా ఈ అప్పీళ్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. లోతుగా విచారణ అవసరం ధర్మాసనం జోక్యం చేసుకుని, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్ను విచారణార్హ త లేదంటూ కొట్టేసిందే తప్ప, కేసు పూర్వాపరాల ఆధారంగా కాదని తెలిపింది. ఇప్పుడు ఇరువురు కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లకు విచారణార్హత లేదనడం సరికాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అప్పీళ్ల దాఖలులో జరిగిన 61 రోజుల ఆలస్యానికి కారణం ఉందని అభిప్రాయపడింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుతో సహా తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
-
మీ అప్పీళ్లపై 21న విచారణ జరుపుతాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ నెల 21న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావు విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. దీంతో జస్టిస్ శివశంకర్రావు ఈ ఏడాది ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. గతవారం అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కోర్టు ధిక్కార కేసులో ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద జస్టిస్ శివశంకరరావు.. ఫాం–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే స్పీకర్, డీజీపీ, నల్లగొండ, జోగుళాంబ గద్వాల్ ఎస్పీలకు నోటీçసులిచ్చి ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఇరువురు కార్యదర్శుల అప్పీళ్లు కేసుల విచారణ జాబితాలో ఉన్నా అవి విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో వారి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్కు, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు జారీ చేసిన నోటీసులు, ఇరువురు కార్యదర్శులకు ఇచ్చిన ఫాం–1 నోటీసుల గురించి ధర్మాసనానికి వివరించారు. -
స్పీకర్కు నోటీసులపై కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది. -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
-
కోమటిరెడ్డి–సంపత్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచీ అనేక మలు పులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో మంగళవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించింది. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది! అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆక్షేపించింది. ‘‘ఇందుకు కోర్టు ధిక్కార పిటిషన్లో స్పీకర్ను నేరుగా ప్రతివాదిగా చేర్చే అవకాశమున్నా అలా చేయకుండా నిగ్రహం పాటిస్తున్నాం. అలా ఎందుకు చేర్చకూడదో చెప్పాల్సిందిగా స్పీకర్ను కోరుతున్నాం’అని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ స్పీకర్కు నోటీసులు జారీ చేయడం, అది కూడా కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని కోరడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కోమటిరెడ్డి, సంపత్ భద్రతను పునరుద్ధరించకపోవడంపైనా న్యాయమూర్తి స్పందించారు. డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలను సుమోటోగా ధిక్కార పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఫాం 1 నోటీసు జారీ చేసి ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులంతా మోసగించే ఆలోచలు చేశారని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ఏ ఒక్కరూ తప్పించుకోజాలరన్నారన్నారు. తీర్పును అమలు చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిందన్నారు. ‘‘బహిష్కరణ తీర్మానం రద్దుతో వారి శాసనసభ్యత్వాలు వాటంతటవే పునరుద్ధరణ అవుతాయి. ఇందుకు ప్రత్యేక ఆదేశాలేవీ అవసరం లేదు. మా తీర్పుతో ఎమ్మెల్యేలిద్దరూ చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలకూ అర్హులు. అందులో భాగంగా వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఎస్పీలు తమకు ఆదేశాలు రాలేదంటూ మౌనం వహించారు. కోర్టు తీర్పు ఉన్నాక వారికింకా ఏ ఆదేశాలు అవసరమో అర్థం కాకుండా ఉంది. బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని, కాబట్టి ఎమ్మెల్యేలకు భద్రతను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని డీజీపీ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇదెంతమాత్రమూ సరికాదు’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018 జనవరి నుంచి ఈ రోజు దాకా కోమటిరెడ్డి, సంపత్కుమార్ తీసుకున్న అలవెన్సులు, సమర్పించిన బిల్లుల వివరాలను ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కార్యదర్శులకు ఫాం 1 నోటీసులు మరోవైపు తమ బహిష్కరణను రద్దు తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసులను జస్టిస్ శివశంకరరావు జారీ చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. వీరిద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్కుమార్లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రటరీ నిరంజన్ రావ్లు ఇద్దరూ నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని గత వారం చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎలాంటి ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు ను అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావులకు సోమవారం ఫారం–1 నోటీసులు జారీ చేస్తాం’’అని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తేల్చిచెప్పారు. నోటీసులు జారీ చేయడానికి ముందు కావాలంటే వాదనలు వినిపించుకోవచ్చని వారి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫారం–1 నోటీసులు జారీ చేసేటప్పుడు వాదనలు వినాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అమలుకు ప్రయత్నాలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. ఈలోపు జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. వాటితో సంబంధం లేదు కోర్టు ధిక్కార పిటిషన్పై జస్టిస్ శివశంకరరావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదుల వెంకటరమణ తాము దాఖలు చేసిన అప్పీళ్ల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, స్టే ఏమైనా వచ్చిందా? అని ఆరా తీశారు. స్టే రాలేదని చెప్పడంతో, అయితే ఆ అప్పీళ్లతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘గత వారం ఈ కేసు విచారణ సందర్భంగా నేను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇప్పుడు ఆ విషయం గురించి కనీసం ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు అమలు గురించి చెప్పకుండా, అప్పీళ్ల గురించి చెబుతారేంటి’’ అని నిలదీశారు. విచారణను వాయిదా వేయాలని వెంకటరమణ కోర గా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ‘మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి.. వింటాను. నిబంధనల ప్రకారం మీ వాదనలు వినాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వింటా’అని అన్నారు. దీంతో అటు వేదుల వెంకటరమణ, ఇటు న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావుకు ఏం చేయాలో పాలు పోక అలా ఉండిపోయారు. ఈ సమయంలో వేదుల వెంకటరమణ.. కనీసం సోమవారానికన్నా వాయిదా వేయాలని అభ్యర్థించడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున కార్యదర్శులిద్దరికీ ఫారం–1 కింద నోటీసులు జారీ చేస్తానని, దానికి ముందు వాదనలు వినిపించాలనుకుంటే వినిపించుకోవచ్చని చెప్పారు. ఫారం–1 నోటీసులు జారీ చేసేందుకు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లు తమకు ఎంత మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. -
‘బహిష్కరణ’ కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి, సంపత్లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తాము తీర్పునిచ్చినా వారిని శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సింగిల్ జడ్జి ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏప్రిల్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు అప్పీళ్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పునివ్వగా, 61 రోజుల తర్వాత వారు ఈ అప్పీళ్లు దాఖలు చేయడం గమనార్హం. కోర్టు తీర్పును పట్టించుకోవద్దన్న వైఖరితో.. కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు.. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఆశ్చర్యకరంగా ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత వారం జరిగిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఇద్దరు కార్యదర్శులు కూడా నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కోరగా.. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు బుధవారం ఉదయం ఈ అప్పీళ్ల గురించి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ముందు ఈనెల 10న కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తుందని, ఈ కేసులో స్పీకర్ను ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చేందుకు సింగిల్ జడ్జి సిద్ధమవుతున్నారని, అందువల్ల ఈ అప్పీళ్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం కేసు పూర్వాపరాల గురించి తెలుసుకుంది. అప్పీళ్ల దాఖలులో ఎన్ని రోజుల ఆలస్యం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. 61 రోజుల ఆలస్యం జరిగిందని అదనపు ఏజీ బదులివ్వగా, మరి ఇన్ని రోజుల ఆలస్యంతో అప్పీళ్లు దాఖలు చేసినప్పుడు, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. కనీసం గురువారమైనా విచారించాలని అదనపు ఏజీ అభ్యర్థించగా ససేమిరా అన్న ధర్మాసనం, ‘గతంలో అసలు కోర్టుకు విచారణ పరిధి లేదని చెప్పినట్లున్నారు..? ముందు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోండి. సింగిల్ జడ్జి ఫారం–1 నోటీసు జారీ చేస్తే అప్పుడు దానిపై ధిక్కార అప్పీల్ దాఖలు చేసుకోండి. పరిస్థితిని బట్టి అప్పుడు విచారణ జరుపుతాం’అని తేల్చి చెప్పింది. కోర్టులిచ్చే తీర్పు విషయంలో ఉదాసీనంగా ఉండరాదంటూ పరోక్షంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 61 రోజుల ఆలస్యంగా అప్పీళ్లు దాఖలు చేయడంపై తాము తమ అభ్యంతరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోమటిరెడ్డి న్యాయవాది తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
మెట్టు దిగిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల శాసనసభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చినా, దాన్ని అమలు చేయకుండా బెట్టు చేసిన శాసనసభ కార్యదర్శి మెట్టు దిగారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రెండు వారాల గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. హైకోర్టు, వారంలోపు తీర్పును అమలు చేస్తున్నారా? లేదా? స్పష్టంగా చెప్పమంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, అలాగే తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా దానిని అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి, సంపత్కుమార్ ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. నరసింహాచార్యులు తరఫున సీని యర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ధిక్కారానికి పాల్పడ్డారని ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు కోర్టు ఫాం–1 నోటీసు జారీ చేయాలనుకుంటే తాము మొదట వాదనలు వినిపిస్తామన్నారు. ఫాం–1 కింద నోటీసు జారీ చేసేటప్పుడు నోటీసులు అందుకునే వ్యక్తుల వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పును అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వేదుల బదులిచ్చారు. రెండు వారాలు గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనికి న్యాయమూర్తి వారమే గడువిస్తానన్నారు. -
స్పీకర్నూ ప్రతివాదిగా చేరుస్తాం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ. సంపత్కుమార్ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పు అమలు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్రావు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. అలాగే ఆ ఎమ్మెల్యేలకు గన్మన్లను పునరుద్ధరించకుండా నల్లగొండ, గద్వాల్ ఎస్పీలు ఎ.వి.రంగనాథ్, రెమా రాజేశ్వరి సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ కేసులో అవసరమైతే స్పీకర్ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, పరిస్థితిని బట్టి నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పింది. గతంలో ఎస్.ఆర్. బొమ్మై, మేఘాలయా కేసుల్లో స్పీకర్లను ప్రతివాదులుగా చేర్చగా సుప్రీంకోర్టు సమర్థించడాన్ని గుర్తు చేసింది. రాజ్యాంగమే అందరికీ సుప్రీం అని, దానికన్నా ఎవరూ అధికులు కాదని, మూడు వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేశారు. అసెంబ్లీ కార్యదర్శికి అన్నీ తెలుసు... ధిక్కార పిటిషన్పై శుక్రవారం విచారణ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసునన్నారు. ప్రతి నెలా అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి శాసనసభ్యుల జాబితా పంపుతారని, తాజా జాబితాలో కోమటిరెడ్డి, సంపత్ల పేర్లు లేవన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో ఈ కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతోపాటు అప్పీల్నూ కొట్టేసినా పిటిషనర్ల పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ ఎస్పీలకు ఎంత ధైర్యం..? కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లకు అందాల్సిన జీతభత్యాలు, గన్మెన్ల సౌకర్యం గురించి న్యాయమూర్తి అడగ్గా శాసనసభ్యత్వాల రద్దు తరువాత గన్మెన్లను ప్రభుత్వం ఉపసంహరించిందని వారి తరఫు న్యాయవాది బదులిచ్చారు. దీంతో ప్రభుత్వం అంటే ఎవరు అంటూ న్యాయమూర్తి గట్టిగా ప్రశ్నించారు. నల్లగొండ, గద్వాల్ జిల్లాల ఎస్పీలు న్యాయవాది బదులివ్వగా కోర్టు తీర్పు ఉన్నా గన్మెన్లను తిరిగి కేటాయించకపోవడానికి వారికి ఎంత ధైర్యం అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. వారిది కూడా ధిక్కారమేనని, వారిని ఎందుకు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేయలేదని ప్రశ్నించారు. వారిని ఈ కేసులో సుమోటోగా ప్రతివాదులుగా చేర్చే విషయాన్ని పరిశీలిస్తానన్నారు. కోర్టు తీర్పు అమలు అసెంబ్లీ కార్యదర్శి బాధ్యత... ఈ దశలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో వాదనలు వినాల్సిన అవసరం లేదని, ఫారం–1 నోటీసులు అందుకున్నాక వాదనలు వినిపించేందుకు సమయం ఇస్తానని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ సమయంలో వెంకటరమణ కొన్ని సాంకేతిక అంశాలను లేవనెత్తగా కాజ్ టైటిల్ లోపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవద్దని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును అమలు చేసి తీరాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దులో న్యాయశాఖ కార్యదర్శికి ఎటువంటి పాత్ర లేదన్నారు. పిటిషనర్లు సైతం నిరంజన్రావుపై ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని తెలిపారు. ఈ కేసులో నామమాత్రపు ప్రతివాదిగానే ఉన్నారని, అందువల్ల ఆయన చర్యలను ధిక్కారం కింద పరిగణించరాదన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. శాసనవ్యవస్థతో ఘర్షణ పడటం లేదు... న్యాయశాఖ కార్యదర్శి ఓ న్యాయాధికారి కూడానని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలెత్తే పరిణామాలేమిటో ఆయనకు స్పష్టంగా తెలుసునని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే వచ్చే పరిణామాల గురించి వివరించాల్సిన బాధ్యత న్యాయాశాఖ కార్యదర్శిపై ఉందని, ఆ బాధ్యత నిర్వర్తించకపోవడం దారుణమన్నారు. తాము ఆదేశాలు జారీ చేశాక కోమటిరెడ్డి, సంపత్ల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం తమ తీర్పును అమలు చేసినప్పుడు అసెంబ్లీ, న్యాయశాఖల కార్యదర్శులు మాత్రం ఎందుకు అమలు చేయరని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన రోజున ఆయన చర్యలు ఎలా ధిక్కారం కిందకు వస్తాయో అప్పుడు చెబుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో అవసరమైతే స్పీకర్ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, లేకపోతే ప్రతివాదిగా చేయాలని ఆదేశాలిస్తామన్నారు. అంతేకాక స్పీకర్కు నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇలా చేయడం ద్వారా శాసనవ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నట్లు భావించాల్సిన అవసరం లేదన్నారు. ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు ఫారం–1 నోటీసులిచ్చే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం గడువునిస్తున్నామని, ఈ కేసులో కోర్టుకు సహకరించాలని ఇరుపక్షాలకు స్పష్టం చేశారు. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసనసభలోకి అనుమతించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లు దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ను కోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న అడిషనల్ ఏజీ రామచంద్రరావును మీరు ప్రభుత్వ న్యాయవాదా? లేక రాజకీయ పార్టీకి న్యాయవాదా? అని ప్రశ్నించింది. వారంలోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లేజిస్లేటివ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సివుంటుందని హెచ్చరించింది. వచ్చే నెల 3వ తేదీన ఈ కేసును కోర్టు మళ్లీ విచారించనుంది. -
కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభే
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ బహిష్కరణ తీర్మానాన్ని రద్దు చేస్తూ, వారి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభేనని శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు తీర్పు మేరకు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల పునరుద్ధరణ అనేది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారమని ఆయన తెలిపారు. అందువల్ల కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల విషయంలో తాను కోర్టు ఆదేశాలను ఏ రకంగానూ ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తమ బహిష్కరణను, నియోజకవర్గాల ఖాళీ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసినా కూడా తమ శాసనసభ్యత్వాలను మాత్రం పునరుద్ధరించలేదని, ఇది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారమే అవుతుందని, అందువల్ల అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు తమ వాదనలను వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశారు. ఆ అధికారం సభకే ఉంది శానససభ చేసే తీర్మానాల విషయంలో శాసనసభ కార్యదర్శికి రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పాత్ర లేదని నరసింహాచార్యులు తన కౌంటర్లో పేర్కొన్నారు. ఏదైనా విషయంపై చర్చ జరిపి, నిర్ణయం తీసుకునే అధికారం సభకు మాత్రమే ఉందన్నారు. శాసనసభ సభ్యుల హక్కులు, వారికున్న రాజ్యాంగపరమైన రక్షణ విషయాలన్నీ కూడా సభ పరిధిలోనివేనన్నారు. సభ్యుల వ్యవహారశైలిపై నిర్ణయం సభదే అవుతుందని తెలిపారు. సభ తీర్మానం మేరకు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేసి వారి పేర్లను జాబితా నుంచి తొలగించామన్నారు. హైకోర్టు ఆదేశాలతో తమ పేర్లను జాబితాలో చేర్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారని, దీనిపై సభే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తాను ఎక్కడా కూడా ఉల్లంఘించలేదన్నారు. అనవసరంగా వివాదంలోకి లాగారు ఈ మొత్తం వ్యవహారంలో తనపై ఎటువంటి ఆరోపణలు లేవని న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు తన కౌంటర్లో వివరించారు. కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల రద్దుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సభలో తీసుకున్న నిర్ణయాలకూ తనకూ సంబంధం లేదని వివరించారు. ఈ మొత్తం వివాదంలో అనవసరంగా తనను లాగారని తెలిపారు. కేవలం తాను న్యాయశాఖ కార్యదర్శినే కాక బాధ్యతాయుతమైన న్యాయాధికారిని కూడానని వివరించారు. కాబట్టి కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం అన్నదే ఉండదన్నారు. అందువల్ల తనపై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ను మూసేయాలని కోరారు. కాగా కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది. -
ఆ ఎమ్మెల్యేలపై విద్వేషం లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లకు భద్రతను ఉపసంహరించామని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. వారి సభ్యత్వాన్ని స్పీకర్ కార్యాలయం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణమే నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తామని వివరించారు. భద్రత ఉపసంహరణ విషయంలో తమకు కోమటిరెడ్డి, సంపత్లపై ఎటువంటి దురభిప్రాయం, విద్వేషభావం లేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు భద్రత విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల మేరకే వారికి భద్రతను ఉపసంహరించినట్లు వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తమపై కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోర్టును కోరారు. తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసినా తమ భద్రతను పునరుద్ధరించలేదని, గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్కుమార్లు గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ను జిల్లాస్థాయి సెక్యూరిటీ సమీక్ష కమిటీ పరిశీలించాకే పిటిషనర్ల భద్రతను ఉపసంహరించామన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తామని, ఆ హోదా లేనప్పుడు భద్రత కూడా ఉండదన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావుండదని వివరించారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
దిగొచ్చిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానంపై న్యాయస్థానాల్లో దాఖలైన వ్యాజ్యాలకు ఏ మాత్రం స్పందించని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పుడు దిగొచ్చారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో స్పందించక తప్పలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. మరో ప్రతివాదిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు కూడా కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27వ తేదీనే పూర్తిస్థాయి వాదనలు వింటానని ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. ఫుటేజీ సమర్పిస్తానని అప్పటి ఏజీ హామీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్పై ఇయర్ ఫోన్ విసిరి గాయపరిచారన్న ఆరోపణలపై తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ, ఎన్నికల కమిషన్ కార్యదర్శులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి.. ఇయర్ ఫోన్ విసిరిన నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటి అడ్వొకేట్ జనరల్ డి.ప్రకాశ్రెడ్డి.. ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో న్యాయశాఖ, ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులిచ్చారు. అయితే ప్రకాశ్రెడ్డి ఇచ్చిన హామీ ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఆ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆయన రాజీనామాకు దారి తీసింది. ధిక్కార పిటిషన్తో కదలిన కార్యదర్శి ఫుటేజీ ఇస్తానని ఏజీ హామీ ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి మాత్రం ఏ రకంగానూ స్పందించలేదు. ఫుటేజీ ఇస్తానని కాని, ఇవ్వనని కాని కోర్టుకు చెప్పలేదు. కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి స్పందిం చకపోవడంతో వీడియో ఫుటేజీలోని అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా ప్రధాన పిటిషన్లో ప్రతివాదులు కాని ఆ 12 మందికి అప్పీల్ దాఖలు చేసే అర్హత లేదంటూ ప్రాథమిక దశలోనే కోర్టు దాన్ని కొట్టేసింది. మరోవైపు బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చినా అసెంబ్లీ దాన్ని అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బి.శివశంకరరావు ప్రతివాదులుగా ఉన్న నర్సింహాచార్యులు, నిరంజన్రావులకు గత నెల 15వ తేదీన నోటీసులు జారీ చేశారు. విచారణను శుక్రవారానికి (జూలై 13వతేదీకి) వాయిదా వేశారు. కోమటిరెడ్డి, సంపత్లను సభకు అనుమతించడం లేదు విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, వకాలత్ కూడా దాఖలు చేశామని, గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కార్యదర్శి తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు తరఫున అదనపు ఏజీ హోదాలో తాను హాజరవుతున్నట్లు జె.రామచంద్రరావు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను తొలుత ఆగస్టు 3కు వాయిదా వేశారు. ఈ సమయంలో కోమటిరెడ్డి, సంపత్ల న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదన్నారు. వారి పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో అప్లోడ్ చేయలేదన్నారు. వారిని సభలోకీ అనుమతించడం లేదన్నారు. దీంతో విచారణను 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజే పూర్తిస్థాయి విచారణ జరుపుతానన్నారు. -
కోర్టు ధిక్కరణపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పెట్టిన కోర్టు ధిక్కరణ కేసుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని, లా సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. లా సెక్రటరీ తరుఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్, అసెంబ్లీ సెక్రటరీ తరుఫున సాయికృష్ణ కౌంటర్ దాఖలు చేయనున్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభా సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని పిటిషనర్ తరుపున న్యాయవాది వాదించారు. తీర్పు స్పష్టంగా ఉందని, ప్రభుత్వ సమాధానం చూసిన తర్వాత స్పందిస్తామని న్యాయమూర్తి జస్టిస్ బీ. శివశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన తమపై విధించిన బహిష్కరణ చట్ట విరుద్ధమంటూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సపత్ కుమార్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బహిష్కరణ చెల్లదని, వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోవడంతో మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్ను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ను కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
కోర్టు తీర్పును కావాలనే ఉల్లంఘించారు
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసినా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి ఆ తీర్పును పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వక ధిక్కారమే. కనుక వారిపై చర్యలు తీసుకోండి’’అని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యు లు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. తమ శాసనసభ్యత్వాలపై హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి తమ సభ్యత్వాలను పునరుద్ధరించడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనన్నారు. ‘‘మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని, మా అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. దానిపై 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా చేయలేదు. దాంతో సింగిల్ జడ్జి తీర్పే అంతిమం. కేసుతో సంబంధం లేని 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం అనుమతినివ్వలేదు. అప్పీల్ వేయాల్సింది అసెంబ్లీ కార్యదర్శేనని స్పష్టం చేసింది. ఆయన రాజకీయ కారణాలతో కావాలనే ఇప్పటిదాకా వేయలేదు. పైగా కోర్టు తీర్పునూ అమలు చేయలేదు. ఈ వ్యవ హారంలో అన్ని విషయాలూ న్యాయ శాఖ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలివ్వండి’’అని కోర్టును వారు కోరారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం విచారించే అవకాశముంది. -
స్పీకర్, రేవంత్ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం కాంగ్రెస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్కు, రేవంత్కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్ను సముదాయించారు. -
‘రద్దు’పై మళ్లీ రగడ
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై మలిదశ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం అసెంబ్లీ స్పీకర్ను కలవనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రతినిధుల బృందం ఉదయం 11 గంటలకు స్పీకర్ను కలసి వినతిపత్రం ఇవ్వనుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు రాష్ట్రపతిని కలవాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్రలోనూ ఈ అంశాన్ని ఫోకస్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సభ్యత్వాల రద్దుపై తొలిదశలో 48 గంటల దీక్షలతో పాటు గవర్నర్ను కలసి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైకోర్టునూ ఆశ్రయించారు. సభ్యత్వాల రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. రెండు సార్లు తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ పరంగా సరిగా స్పందించలేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడిన నేపథ్యంలో మరో పోరాటానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. ఈ వారంలోనే ‘సుప్రీం’లో పిటిషన్.. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి కార్యాచరణను నేతలు అమలు చేయనున్నారు. స్పీకర్ను కలవడంతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా రాష్ట్రపతిని కలసి విన్నవించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే కబురు పంపారు. త్వరలోనే అపాయింట్మెంట్ లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతిని కలవడంతో పాటు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫు న్యాయవాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. మూకుమ్మడి రాజీనామాలు..? న్యాయ, రాజ్యాంగపర ప్రయత్నాలతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించడం, బస్సుయాత్రలో నిర్వహించే సభల్లోనూ నొక్కి వక్కాణించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఖమ్మం, అలంపూర్లలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతారా.. వేచిచూడాల్సిందే! -
ధిక్కరణపై కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంక ట్రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయ పోరాటం చేస్తూనే ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని, అనంతరం దశలవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్రపతిని సైతం కలవాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొనగా డీకే అరుణ, వంశీచంద్రెడ్డి హాజరుకాలేదు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి పార్టీ మార్పు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక తదితర పరిణామాలపై చర్చించారు. కోమటిరెడ్డిపై జానా సీరియస్ ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న కోమటిరెడ్డి డిమాండ్పై సీఎల్పీలో ప్రస్తావన వచ్చింది. బహిరంగ వేదికలపై తనపై ఎలా నిందలు వేస్తారని, ఇలా వ్యవహరించి పార్టీని పలుచన చేయరాదని కోమటిరెడ్డిపై జానా మందలింపు ధోరణితో అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి పార్టీ మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపైనా వాడివేడిగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించారు. సమ్మెకు దిగితే ఉద్యోగాలు ఊడుతాయంటూ సీఎం వ్యాఖ్యానించటం దురదృష్ణకరమని, ఈ విషయంలో కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మూకుమ్మడి రాజీనామాలపై చర్చే జరగలేదని సమావేశం అనంతరం మీడియాతో జానారెడ్డి స్పష్టం చేశారు. కోర్టులంటే సీఎంకు గౌరవం లేదు: ఉత్తమ్ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కోర్టుల పట్ల ప్రభుత్వానికి, స్పీకర్కు కనీస గౌరవంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్ను కలుస్తామని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. త్వరలోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖమ్మం, అలంపూర్లో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టి, తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భట్టి నివాసంలో మరో భేటీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. పార్టీ జిల్లాల అధ్యక్షులను పాత పది జిల్లాలకే ఉంచాలా లేదా 31 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలా అన్న అంశంపై చర్చ జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని, పార్టీ ఎజెండాను 8 నెలల ముందే జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొన్న కార్మికులనే బెదిరిస్తారా: జీవన్రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైతే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడం దురదృష్టకరమని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.జీవన్రెడ్డి అన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వ రాయితీలు ఇవ్వకుండా డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
టీ సర్కార్కు కోమటిరెడ్డి డెడ్లైన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద కేసీఆర్కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన పేర్కొన్నారు. మా నాయకత్వం స్పందించలేదు మా సభ్యత్వాల రద్దు విషయంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి లకు చెప్పాను. మేము మా కోసం సభలో ఆందోళన చేయలేదు. అందరం రాజీనామా చేయాలి అనుకున్నాం. ఇప్పుడైనా.. రాజీనామాల మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. సీఎల్పీ నేతగా మమ్మల్ని కాపాడుకోవాలి. పార్టీ నాయకులతో చర్చించి అందరం రాజీనామా చేద్దాం. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండి. -
టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో అధికార పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి, సంపత్ల శాసన సభ్యత్వాలను యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సభ్యుల బహిష్కరణ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన శాసనసభకు సంబంధించినదని.. అది సభ మొత్తం కలసి తీసుకునే నిర్ణయమే తప్ప, ఏ సభ్యుడికీ వ్యక్తిగత హోదాలో అధికారంగానీ, హక్కుగానీ ఉండవని స్పష్టం చేసింది. అందువల్ల అప్పీలు దాఖలు చేయాల్సింది అసెంబ్లీ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం 58 పేజీల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లు హెడ్ఫోన్ విసిరి మండలి చైర్మన్ స్వామిగౌడ్ను గాయపరిచారం టూ.. అసెంబ్లీ తీర్మానం ద్వారా వారిని బహిష్కరించారు. అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీనిపై వెంకటరెడ్డి, సంపత్లు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు.. బహిష్కరణ ప్రొసీడింగ్స్ను, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జి విచారణ జరిపిన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలెవరూ ప్రతివాదులు కానందున.. నిబంధనల మేరకు అప్పీల్ దాఖలు కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో వారి అప్పీలు దాఖలుకు అనుమతించాలా, వద్దా అన్న అంశంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించగా.. కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. గత నెల 2న వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. 58 పేజీల ఈ తీర్పులో శాసనసభ అధికారాలు, హక్కులు, అసాధారణ అధికారాల గురించి సవివరంగా చర్చించింది. అసెంబ్లీకి మాత్రమే అధికారం ఉంటుంది.. సభ్యుడి బహిష్కరణ నిర్ణయం శాసనసభ ఉమ్మడి నిర్ణయమని, దానిని న్యాయస్థానాన్ని రద్దు చేస్తే అసెంబ్లీ మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. బహిష్కరణకు అనుకూలంగా తాము ఓటు వేశాం కాబట్టి.. సింగిల్ జడ్జి తీర్పు వల్ల తాము ప్రభావితమవుతున్నామని, అందువల్ల తమకు అప్పీల్ దాఖలు చేసే హక్కు ఉందన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదన సరికాదని పేర్కొంది. ‘‘ఓ సభ్యుడిని బహిష్కరించాలా? వద్దా? అన్నది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. శాసనసభకు ఉండే హక్కులు, అధికారాలకు, సభ్యులకు ఉండే హక్కులు, అధికారాలకు మధ్య తేడా ఉంది. ఓ సభ్యుడిని బహిష్కరించే విషయంలో ప్రత్యేకాధికారాలు, హక్కులు శాసనసభకు మాత్రమే ఉన్నాయా? లేక దాని సభ్యులకు కూడా ఉన్నాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అయితే ఏ రకంగా చూసినా.. ఓ సభ్యుడి బహిష్కరణ అన్నది సభ ఉమ్మడి నిర్ణయమే అవుతుందే తప్ప.. సభ్యుల వ్యక్తిగత హక్కుకు సంబంధించింది కాదు..’’.. అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 194 (4) ప్రకారం సభలో మాట్లాడే, సభ ప్రొసీడింగ్స్లో పాల్గొనే హక్కు ఉన్న వారందరూ శాసనసభ సభ్యులే అవుతారన్న వాదనను ప్రస్తావించింది. ఆ లెక్కన అధికరణ 177 ప్రకారం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు సైతం (ఓటు హక్కు తప్ప) సభలో మాట్లాడే, ప్రొసీడింగ్స్లో పాల్గొనే హక్కు ఉంటుందని.. కాబట్టి స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయనప్పుడు ఏజీకి అప్పీల్ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. వాస్తవానికైతే ఏజీ ఇలా అప్పీల్ దాఖలు చేయడానికి కూడా వీల్లేదని పేర్కొంది. స్పీకర్గానీ, కార్యదర్శిగానీ అప్పీల్ చేయాలి ప్రస్తుత వ్యవహారంలో 12 మంది ఎమ్మెల్యేలు సభ ఉమ్మడి నిర్ణయానికి మద్దతు తెలిపారని.. అయితే ఇలా మద్దతు తెలిపినవారి అప్పీల్ను అనుమతిస్తే, సభ నిర్ణయానికి మద్దతు తెలపని వారి అప్పీల్ను సైతం అనుమతించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘బహిష్కరణ తీర్మానాన్ని సభ్యులందరూ కలిసి చేసినప్పుడు, దానిని కోర్టు రద్దు చేస్తే.. సభే ప్రభావిత వ్యక్తి అవుతుంది. అంతేతప్ప కొందరు సభ్యులో, సభ్యుల బృందమో ప్రభావిత వ్యక్తి కిందకు రాదు. ఇలా సభ మొత్తంగా పరిగణనలోకి వచ్చినప్పుడు స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది..’’అని పేర్కొంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్పై 4న తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా?వద్దా? అన్న అంశంపై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సోమవారం ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్పై హెడ్ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్లను సభ నుంచి బహిష్కరిస్తూ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ప్రొసీడింగ్స్ను, నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ వెంకటరెడ్డి, సంపత్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ప్రొసీడింగ్స్ను, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఎదుట దాఖలైన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు.. అందువల్ల సంబంధం లేని వ్యక్తులు అప్పీల్ దాఖలు చేయాలంటే కోర్టు అనుమతినివ్వాలి. ఈ నేపథ్యంలో వారు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలా? లేదా? అన్న దానిపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేయాలనడం సరికాదని, నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ కూడా అప్పీల్ దాఖలు చేయవచ్చని వైద్యనాథన్ వివరించారు. కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరిస్తూ చేసిన తీర్మానంలో ఈ ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకున్నారని, సభా గౌరవాన్ని కాపాడేందుకు ఎవరైనా కోర్టుకు రావొచ్చన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సింఘ్వీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్కు విచారణార్హతే లేదన్నారు. సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీకి ఉండాలి కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉందని అప్పీల్ దాఖలు చేశారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం మే 2న తీర్పును వాయిదా వేసింది. -
శాసన సభ్యత్వాలు పునరుద్ధరించండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్కుమార్ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్సైట్లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. -
న్యాయం దక్కకపోతే ఆమరణ దీక్ష
సాక్షి, హైదరాబాద్ : తమపై అధికార పార్టీ, సీఎం కేసీఆర్ కక్షకట్టి హక్కులను హరిస్తున్నారని ఎమ్మెల్యే లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ ఆరోపించారు. తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా గన్మెన్ను కేటాయించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై డీజీపీ మహేందర్రెడ్డిని కలసి వినతి పత్రం అందించామన్నారు. గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పుపై సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. తీర్పు వచ్చి 20 రోజులైనా తమకు గన్మెన్ను కేటాయించకపోవడం దారుణమన్నారు. పదవుల్లేని టీఆర్ఎస్ నేతలకు గన్మెన్ను ఇస్తున్నారని.. ఎమ్మెల్యేలమైన మాకు గన్మెన్ను అడిగితే సెక్యూరిటీ రివ్యూ కమిటీకి సూచి స్తామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకేసుల్లో నిందితులని, వారిపై పోరాటం చేస్తున్న తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. న్యాయం దక్కకపోతే డీజీపీ, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. అక్రమ కేసులు ఆపకపోతే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని డీజీపీని కోరామన్నారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తమ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
తొలగించిన గన్మెన్లను పునరుద్ధరించండి
-
మాకు ప్రాణ హాని ఉంది : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్లు రాష్ట్ర డీజీపీను కోరారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆయన్ను కలుసుకున్నారు. హైకోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పునిచ్చిందని, ఉపసంహరించిన గన్మెన్లను తిరిగి ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పు తర్వాత సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని, మహబూబ్నగర్, నల్గొండ జిల్లా పోలీసులు కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు ఆపకపోతే జంతర్మంతర్ వద్ద రెండు, మూడు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఓ ఎమ్మెల్యేకు కల్పించే సదుపాయాలను ప్రభుత్వం తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించడంపై సెక్యూరిటీ కమిటీకి నివేదిస్తానని డీజీపీ చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్లు వెల్లడించారు. -
న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల విషయంలో న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్భవన్లో గవర్నర్ను కలసి వినతిపత్రం అందజేసింది. తమ ఎమ్మెల్యేలను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తీర్పు వచ్చి 20 రోజులవుతున్నా ప్రొటోకాల్, ఇతర హక్కుల విషయంలో శాసనసభ్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని గవర్నర్కు చెప్పారు. వెంటనే శాసనసభ్యుల హక్కులు కాపాడేలా ప్రభుత్వాధినేతగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ను కలసిన వారిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ సంతోష్కుమార్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, ముఖ్య నేతలు నాగం జనార్దనరెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు. సానుకూల స్పందన: ఉత్తమ్ గవర్నర్ను కలసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తాము అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సీఎస్ను కలసి వినతిపత్రం ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.జోషిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్కుమార్, పద్మావతి, వంశీచంద్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ను కోరారు. ఏమో.. నాకా చరిత్ర తెలియదు: కాంగ్రెస్ నేతలతో గవర్నర్ కాంగ్రెస్ నేతలు తనను కలసిన సందర్భంగా వారు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ సావధానంగా విన్నారు. ‘తప్పకుండా పరిశీలిస్తాను’ అని పలుమార్లు కాంగ్రెస్ నేతలకు ఆయన చెప్పారు. అయితే, భేటీ చివర్లో గవర్నర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భేటీ ముగిసే సమయంలో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి గవర్నర్ దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 1952 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలా ఎమ్మెల్యేలను బహిష్కరించలేదని గవర్నర్కు జనార్దనరెడ్డి చెప్పారు. దీనికి స్పందించిన గవర్నర్ ‘ఏమో నాకు తెలియదు. నేను 1952లో ఏడో తరగతి చదువుతున్నా. ఆ చరిత్ర నాకెలా తెలుస్తుంది’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
హైకోర్టు తీర్పు అమలుకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్కుమార్ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ గవర్నర్ను కోరనుంది. వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ కోర్టు తీర్పునిచ్చి 20 రోజులవుతున్నా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కార్యనిర్వహక అధికారులను ఉపయోగించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంతోపాటు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు అసెంబ్లీ పక్షాన కానీ మళ్లీ కోర్టులో అప్పీల్ చేయలేదని, అలాంటప్పుడు తీర్పును ఆమోదించినట్టే అవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. అలాగే తమ పార్టీ ఇద్దరు శాసనసభ్యుల పేర్లను అసెంబ్లీ వెబ్సైట్లో ఎమ్మెల్యేలుగా చూపించడం లేదని, సీఎస్, డీజీపీ అధిపతులుగా ఉన్న శాఖల్లో ఆ ఇద్దరికీ కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారాలను ఉపయోగించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరనున్నట్టు చెప్పారు. -
నిలదీశారు... నిప్పులు చెరిగారు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం(సీఎల్పీ) గరంగరంగా సాగింది. రాష్ట్రంలో పార్టీ అధినేతల తీరుపై ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. పలు అంశాలపై వారి వ్యవహారశైలిని నిలదీశారు. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనే విషయం, పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన ఘటనలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో గంటన్నరపాటు సీఎల్పీ భేటీ జరిగింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం... ‘ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడలేకపోయారు. రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. కార్యకర్తల్లో ధైర్యం ఎలా నింపుతారు’ అని సంపత్ నిలదీశారు. ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ లాంటి పెద్ద తలకాయలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేకపోయారని, పార్టీ నాయకత్వం తీరు మార్చుకోకపోతే కార్య కర్తల్లో నమ్మకం కోల్పోతామన్నారు. ‘మమ్మల్ని కాపాడలేకపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. ఇక, కార్యకర్తలను ఏం కాపాడతారు’ అని కూడా ఆయన అనడంతో సీఎల్పీ సమావేశం వేడెక్కింది. అయితే, ఉత్తమ్, జానా సర్దిచెప్పేందుకు యత్నించినా సంపత్ వ్యాఖ్య లకు మద్దతిస్తూ కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడటం గమనార్హం. నిలువరించలేక పోతున్నాం... సీఎం కేసీఆర్ అండ్ టీం యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా వారిని నిలు వరించడంలో విఫలమవుతున్నామని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగాల్లేవు, డబుల్బెడ్రూం ఇళ్లు లేవు. ఇసుక మాఫి యా చెలరేగిపోతోంది. ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్న దానిపై పునరాలోచన చేయాలి. యుద్ధం పకడ్బందీగా చేయకపోతే కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎదుర్కోగలమా? ప్రెస్మీట్లు పెట్టి తూతూ మంత్రపు హెచ్చరికలు చేస్తే సరిపోతుందా? ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాల్సింది. తూతూమంత్రం కార్యక్రమాలతో ఏం సాధిస్తాం.?’అని పలువురు వ్యాఖ్యానిస్తూ నిలదీశారు. నన్నూ అవమానపర్చారు ప్రోటోకాల్ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయనే చర్చ సీఎల్పీ సమావేశంలో జరిగింది. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ తనను అవమానపర్చారని, సమాచారం సరిగా ఇవ్వకుండా నలు గురు మంత్రులు వచ్చి మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వెళ్లారని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని, కేసు అడ్మిట్ అయి ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిగినా పార్టీ పక్షాన ఎందుకు పట్టించుకోవడం లేదని పొంగులేటి ప్రశ్నించినట్టు సమాచారం. కొంతమందికి అసెంబ్లీకి వచ్చే వీలు లేకపోతే గాంధీభవన్లో సీఎల్పీ సమా వేశం పెట్టాల్సిందని, జానా నివాసంలో పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారని కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రైతాంగాన్ని కార్యకర్తలు ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావాలని సీఎల్పీ సమావేశం కోరింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రోటోకాల్ అమలు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో తాము వేరే మార్గం వెతుక్కోవాలని సీఎల్పీ నిర్ణయించింది. జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కతోపాటు జీవన్రెడ్డి, డి.కె.అరుణ, వంశీచందర్రెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ ఆకుల లలితలు పాల్గొన్నారు. అసంతృప్తితో అమెరికాకు కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో శాసనసభలో మైక్ విసిరేసిన ఘటనకు సంబంధించి తనతోపాటు మరో ఎమ్మెల్యే సంపత్ను బహిష్కరిస్తే టీపీసీసీ, సీఎల్పీ నామమాత్రంగానైనా పట్టించు కోకపోవడంపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకత్వాల తీరుకు నిరసనగానే ఆయన అమెరికా వెళ్లినట్లు సన్నిహితులు చెప్పారు. తమ గన్మెన్లను తొలగించినా ఉత్తమ్, జానారెడ్డి కనీసం పట్టించుకో లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ను హతమార్చడం, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రౌడీలతో నల్లగొండలో రాజకీయం చేయాలని చూడటం వంటి పరిణామాల నేపథ్యంలో తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని కోమటిరెడ్డి ఆరోపించారు. -
అది కోమటిరెడ్డి, సంపత్ల ప్రచారం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. తన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షాలు, పంట నష్టం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యం. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశాం. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళాం. ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పండి. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే. ఆయనతో మాట్లాడింది కూడా నేనే. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నాం. అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించా. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారు. పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమే. వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటాం.. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తాం. కాంగ్రెస్కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసు. గెలుస్తామని పోటీ పెట్టలేదు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుంది. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నా. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉంది. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేది. అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు. పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరు. కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుంది. మా స్పిరిట్ కూడా అంతే. ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారు. నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు సీరియస్గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుంద’ని జానారెడ్డి పేర్కొన్నారు. -
ప్రజల్లో తిరుగలేకపోతున్నా: సంపత్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్కుమార్, జీవన్రెడ్డి, పద్మావతి, వంశీచంద్రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంపత్ అసహనం ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్ ఆవేదన చెందారని సమాచారం. సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యుల వద్ద ఆయన వాపోయారని చెబుతున్నారు. కనీసం గన్మెన్ల పునరుద్ధరణపై డీజీపీని కూడా కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని త్వరలో అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ సమావేశం ఇంతవరకూ ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటరని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. -
కోమటిరెడ్డి కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల అసెంబ్లీ బహిష్కరణ రద్దు తీర్పుపై అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతివ్వాలా, వద్దా అన్న అంశంపై వాదనలు ముగిశాయి. దీనిపై నిర్ణయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు. దాన్ని సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన వ్యాజ్యంలో వారు ప్రతివాదులు కాదు గనుక నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్కు అనుమతిపై ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున, అభిషేక్ మను సింఘ్వీ కోమటిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయాలడం సరికాదని బుధవారం వైద్యనాథన్ వాదించారు. -
ముగిసిన వాదనలు.. రిజర్వ్లో తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. వేసవి సెలవుల అనంతరం తీర్పును వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. కోమటిరెడ్డి, సంపత్ల అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్పై కోమటిరెడ్డి, సంపత్ల దాడి ఆరోపణలకు సంబంధించి వీడియోలు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదనలు ముగించగా, బుధవారం తదుపరి విచారణ కొనసాగించిన హైకోర్టు హైకోర్టు తీర్పు వెల్లడిని వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం? -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ‘‘సంబంధం లేదని వ్యక్తుల అప్పీల్ను విచారించడం మొదలుపెడితే సంబంధం లేని ప్రతి ఒక్కరూ అసెంబ్లీ నిర్ణయానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఇలాంటి అప్పీల్లే దాఖలు చేస్తారు. బహిష్కరణ తీర్మా నం సభ నిర్ణయమంటున్నప్పుడు ఇలా అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరు అధికారమిచ్చారు? సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరముంటే అసెంబ్లీకి ఉండాలి. అప్పీల్ చేయాలంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి చేయాలి. ఎమ్మెల్యేలకు ఏం సంబంధముందని అప్పీల్ చేశారు?’’అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్కు అనుమతినివ్వాలా, వద్దా అన్న అంశంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరో సారి విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గానీ, ప్రజాప్రయోజనాలకు గానీ ఎలాంటి నష్టమూ కలగలేదని కోమటిరెడ్డి తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘ఈ వ్యవహారంలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నోటీసివ్వకుండా, ఎమ్మెల్యేల వాదన వినకుండా బహిష్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా, గవర్నర్ ప్రసంగం సభా కార్యక్రమాల కిందకు వస్తుందా వంటివి తేల్చాల్సి ఉంది. సింగిల్ జడ్జికి వీడియో పుటేజీ లివ్వలేదు. కానీ ఈ అప్పీల్కు మాత్రం ఫుటేజీని జత చేశారు. ఇవెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ఈ ఫుటేజీలు అసెంబ్లీ కార్యదర్శి సర్టిఫై చేసినవి కావు’’అన్నారు. ఫుటేజీలను స్పీకర్ ద్వారా తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. చానళ్లలో వచ్చిన ఫుటేజీని జత చేశామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బదులిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద దాఖ లైన వ్యాజ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదని సింఘ్వీ గుర్తు చేశారు. ‘‘ప్రతివాదులైన ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయకుండా మౌనం వహించారు. వీడియో ఫుటేజీ సమర్పిస్తానని సింగిల్ జడ్జి వద్ద వాదనల సందర్భంగా ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. బహిష్కరణవల్ల పిటిషనర్లు నష్టపోయారు. కాబట్టి అప్పీల్ దాఖలుకు అనుమతివ్వకుండా పిటిషన్ను కొట్టేయండి’’అని కోర్టును కోరారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
వాళ్లిద్దరికీ మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉంది
హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిలకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పష్టంగా పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పీకర్పై దాడికి సంబంధించి వీడియోలు సమర్పించడంతో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదనలు ముగించారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. -
వివరణకు అవకాశం ఇవ్వాల్సింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లకు బహిష్కరణ వంటి తీవ్ర శిక్షను విధించేటప్పుడు వివరణకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. వివరణ ఉంటే శిక్ష తీవ్రత తగ్గి ఉండేదేమోనని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కార కేసుల్లో కూడా నిందితుడికి నోటీసులిచ్చి వివరణ కోరతాం. ఆ సమయంలో తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేసే అవకాశముంటుంది. కానీ కోమటిరెడ్డి, సంపత్లకు ఆ అవకాశమే ఇవ్వలేదు’’అని పేర్కొంది. గత వాదనల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ప్రస్తావించిన తీర్పును ఉటంకిస్తూ, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆ తీర్పులోనే స్పష్టంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో వివరణ ఇవ్వలేదన్న విషయమే తమకు ప్రధానమని పేర్కొంది. బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసిన 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున వాదనలు ముగిసిన నేపథ్యంలో కోమటిరెడ్డి తదితరుల తరఫున వాదనల నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడినప్పుడు సభ్యుల హక్కులకు విలువ ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. విపక్ష సభ్యులను బహిష్కరిస్తుంటే వారికున్న రక్షణలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా, స్పీకర్ అనర్హత వేటు వేస్తే దానిపై సభ్యులు న్యాయసమీక్ష కోరవచ్చన్నారు. సభా మర్యాదలకు భంగం కలిగించినప్పుడు సభ్యులను బహిష్కరించవచ్చని రాజారాంపాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సంపత్ను ఎందుకు బహిష్కరించారన్న ధర్మాసనం ప్రశ్నకు సూటిగా బదులివ్వలేదు. ఇయర్ ఫోన్ విసిరినట్లు వీడియో క్లిప్పింగుల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఆ విషయాన్ని బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాజ్యానికి విచారణార్హత లేదని కోమటిరెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో పలువురు ఫిరాయింపుదారులని, వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం రావాల్సి ఉందని అన్నారు. దానితో తమకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందా, లేదా అన్నదే కావాలని, ఆ దిశగా వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై విచారణ వాయిదా
-
వారికి ఏం రక్షణ ఉన్నట్లు?
సాక్షి, హైదరాబాద్ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసరడం కారణమైనప్పుడు, సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్ తమ పిటిషన్లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్ఫోన్ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్ఫోన్ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్ఫోన్ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్ల తరఫున ఒక్కరే అఫిడవిట్లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. -
కాంగ్రెస్ నేతల సభ్యత్వ రద్దుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్పై విచారణ రేపటికి( శుక్రవారం) వాయిదా పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్ను రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ను విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఇచ్చిన తీర్పును కోట్టేయాలని పిటిషనర్స్ తరపు న్యాయవాది వైద్యనాథన్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ల తరపు అడ్వొకేట్ జంధ్యాల రవిశంకర్ కూడా తమ వాదనలు వినిపించారు. అప్పీళ్లకు వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలకు అర్హత ఉందా లేదా అన్నదానిపై వాదనలు వినిపిస్తారా అని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఏ సభ్యుడినైనా కారణం లేకుండానే రద్దు చేసే అధికారం ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ అధికారం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. వీరు వీడియో కావాలని అడుగుతున్నారంటే... స్పీకర్పైకి హెడ్ఫోన్స్ విసిరినట్టు ఒప్పుకున్నట్లేనని వైద్యనాథన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సభ్యులకు రక్షణ పరంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలపాలని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
మా అప్పీల్పై వాదనలు వినండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్పై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఈ అప్పీల్పై వాదనలు వినడంతో పాటు విచారణార్హత తేల్చాలని కోర్టును కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం లేదని, అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. బహిష్కరణ తీర్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఇక్కడ ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని అడిగింది. ఈ విషయం పైనా వాదనలు వినిపిస్తామని, అందువల్లే వాదనలు వినాలని కోరుతున్నట్లు వైద్యనాథన్ చెప్పారు. అప్పీల్ దాఖలుకు అనుమతివ్వడంపై ఈ నెల 26న విచారణ చేపడతామని దర్మాసనం తెలిపింది. -
టీఆర్ఎస్పై పోరు ఉధృతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించారు. శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో హైకోర్టులో ఊరట పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్తోపాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, దాసోజు శ్రవణ్, న్యాయవాది జంధ్యాల రవిశంకర్లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో రాహుల్ను కలిశారు. తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టులో విజయం సాధించిన పరిణామాలపై రాహుల్కు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కోమటిరెడ్డి, సంపత్ కృషి చేశారంటూ రాహుల్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డిని ఆలింగనం చేసుకుని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఈ బృందానికి సూచించారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘కోర్టు తీర్పును రాహుల్గాంధీకి వివరించాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన కృషిని ఆయన అభినందించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఏ స్థాయిలోనైనా పోరాటం ఉధృతంగా ఉండాలన్నారు. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కూడా రెండు రోజులు పాల్గొంటారు’’అని ఉత్తమ్ వివరించారు. హైకోర్టు తీర్పు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని కుంతియా పేర్కొన్నారు. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని ఆయన సూచించారు. గ్రూపులకు అతీతంగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి అన్నారు. ‘‘శాసనసభను అవమానించిందే టీఆర్ఎస్ పార్టీ’’అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు స్ఫూర్తితో అన్ని విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని రాహుల్ సూచించినట్టు సంపత్ కుమార్ తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, కటకం మృత్యుంజయం, తదితరులు రాహుల్తో విడివిడిగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఈసీ హామీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ ఉప ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై తదుపరి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్, మర్రి శశిధర్రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్లు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ను కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను హైకోర్టు కోట్టేసిందని, అందువల్ల రద్దు చేసిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ప్రభుత్వం పంపిన నోటిఫికేషన్పై తదుపరి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, ఉప ఎన్నికల కోసం అందిన నోటిఫికేషన్పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చినట్టు నేతలు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న 15 లక్షల ఓటర్లను తొలగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనిపైనా రావత్కు వివరించామన్నారు. -
ఆ తీర్పు అమలును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ రద్దు తీర్పుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం అప్పీల్ దాఖలైంది. తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జి.సాయన్న, మర్రి జనార్దన్రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, మాగంటి గోపీనాథ్, మల్లిపెద్ది సుధీర్రెడ్డి, కె.పి.వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలె యాదయ్య, రమావత్ రవీంద్రకుమార్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పీల్ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కటిక రవీందర్రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్దం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్పై హెడ్ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణను, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఈ నెల 17న తీర్పునిచ్చారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం ఎమ్మెల్యేలను రంగంలోకి దించి దానిపై అప్పీల్ దాఖలు చేయించింది. సింగిల్ జడ్జి తీర్పు ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమేనని అప్పీల్లో వారు వాదించారు. ‘‘కోమటిరెడ్డి, సంపత్ సభ్యులుగా కొనసాగేందుకు అర్హులే కాదు. సభా మర్యాదలను వారు మంటగలిపిన తీరును మాతో పాటు సభ్యులంతా చూశారు. వారు పిటిషన్లో కోరిన వాటికి మించి జడ్జి అనుకూల ఉత్తర్వులిచ్చారు. అసలు వారి వ్యాజ్యాన్ని విచారణార్హంగా పరిగణించి ఉండకూడదు. వారి చర్యలు సభా ధిక్కారమే. వారి బహిష్కరణకు శాసన వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. వీడియో ఫుటేజీ ఇవ్వకపోవడం, సభ్యులకు బహిష్కరణ తీర్మానం, నోటీసు, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ జడ్జి తప్పుబట్టారు. కానీ సహజ న్యాయ సూత్రాల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సభ్యుల చర్యలు దుష్ప్రవర్తనే గాక సభా ధిక్కారం కూడా. ఇలాంటి వారిని అసెంబ్లీ ప్రొసీడింగ్స్కు అనుమతించడం అసాధ్యం. వారేం చేశారో సభంతా చూశాక వారి వాదన వినాల్సిన అవసరమే లేదు. తప్పు చేశారని స్పష్టమవుతుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించాలనడంలో అర్థమే లేదు. పైగా సభ్యుల చర్యలు సభా ధిక్కారమైనప్పుడు, వారి వాదనలు వినే విషయంలో ఎలాంటి ప్రొసీజర్ లేనప్పుడు తగిన తీర్మానం జారీ చేసే అధికారం సభకుందని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది’’అని పేర్కొన్నారు. ఆ అధికరణను సుప్రీంకోర్టే ఉపయోగించగలదు ‘‘అసెంబ్లీకి కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయి. వాటి ప్రకారం సభ్యులను శిక్షించవచ్చు. సభా మర్యాదలకు భంగం కలిగించినా, సభను ధిక్కరించినా, ప్రతిష్టను దిగజార్చినా బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం ఉంది. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను శిక్షించరని జడ్జి పేర్కొన్నారు. దానికి, శాసనసభ్యుల శిక్షకు ఉన్న తేడాను విస్మరించారు. తప్పు చేసిన సభ్యులను మన్నించి వదిలేస్తే సభ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకమవుతుంది. సభలో జరిగిన విషయాలపై న్యాయ సమీక్షకు వీల్లేదు. సభకు ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని జడ్జి విస్మరించారు. ఆధారాలు సమర్పించకుంటే అవి విరుద్ధంగా ఉన్నాయని భావిం చే పరిస్థితి ఈ కేసుకు వర్తించదు. జడ్జి 142వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి తీర్పునిచ్చారు. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టే ఉపయోగించగలదు. ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరం లేదని పార్లమెంటరీ సభా విధానాల ను పరిశీలించకుండానే తీర్పునిచ్చారు. న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా సభ నుంచి డాక్యుమెంట్ను కోరితే సభ ప్రత్యే క, అసాధారణ అధికారాలకు విలువ లేనట్లే! సభ జరుగుతుండగా జరిగిన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సభ తీర్మానం తప్పనిసరి. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేదా తేల్చేందుకు పార్లమెంటు, శాసనసభలే సరైన అధికార వ్యవస్థలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జడ్జి తన తీర్పుతో సభ తీర్మానంలో జోక్యం చేసుకున్నారు’’ అని అప్పీల్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
ఈసీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ్యత్వాల రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను అందచేశారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తన సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని ఈసీకి వివరించారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్తో పాటు మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. -
నేడు ఈసీని కలవనున్న కోమటిరెడ్డి, సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: శాసన సభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టులో ఊరట పొందిన తెలం గాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ను శుక్రవారం ఢిల్లీలో కలవనున్నారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడం లాంటి పరిణామాలను ఆయనకు వివరించనున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కోమటిరెడ్డి, సంపత్లు రాహుల్గాంధీతోను భేటీ కానున్నారు. -
అనర్హత తీర్పుపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ శాసన సభ్యత్వ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంపై టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. కోర్టు తీర్పు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నత చట్టసభగా శాసనసభ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు, న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో సీఎం సమావేశమయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందా, అసెంబ్లీని ఆదేశించిందా అన్న దానిపై స్పష్టత తీసుకుంటున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా అన్న అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభ అయితే, హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అనర్హత వేటు వేసిన శాసనసభ మాత్రమే దీనిపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రభుత్వానికి సంబంధమే లేదని టీఆర్ఎస్ ముఖ్యులు అంటున్నారు. ఇద్దరు సభ్యులపై వేటు వేయడంలోనూ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనూ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. న్యాయ నిపుణులేమంటున్నారు? ప్రభుత్వానికి సంబంధం లేని నిర్ణయాన్ని అమలుచేసే అధికారం ఎలా ఉంటుందని న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ నిర్ణయమైనా అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శాసనసభా, ప్రభుత్వమా అన్న సాంకేతిక అంశాలను పక్కనబెడితే రాజకీయ వర్గాల్లో చోటుచేసుకోనున్న పరిణామాలనూ అధికార పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. స్పీకర్, చైర్మన్, కార్యదర్శి అత్యవసర భేటీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. స్పీకర్ కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చట్టసభలు గతంలో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సందర్భాలు, ఆ సమయంలో ఆయా సభలు వ్యవహరించిన తీరుపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఈ అంశంపై గతంలోని ఉదాహరణలను అధ్యయనం చేసి, నివేదికను అందజేయాలని కార్యదర్శికి స్పీకర్ సూచించారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం: స్పీకర్ హైకోర్టు తీర్పులో ఏముందో అధ్యయనం చేసిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వెల్లడించారు. న్యాయ నిపుణులతో సమగ్రంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మాట్లాడతామని, అప్పటిదాకా మాట్లాడేదేమీ లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు వి.నర్సింహాచార్యులు కూడా నిరాకరించారు. -
అనర్హత చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: న్యాయ పోరాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్లు విజయం సాధించారు. వీరిద్దరిని బహిష్కరిస్తూ ఈ ఏడాది మార్చి 13న అసెంబ్లీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను, వారి స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. వారి బహిష్కరణ పూర్తిగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టంచేసింది. బహిష్కృతులకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణ ప్రొసీడింగ్స్ను అందజేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలకు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని, అయితే వారిపై ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుని ఉన్నా, తీసుకోవాలని భావిస్తున్నా అందుకు ఏదీ అడ్డంకి కాదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం తీర్పునిచ్చారు. వీరిద్దరి విషయంలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుతోపాటు వారి ప్రాథమిక హక్కులను సైతం హరించారని న్యాయమూర్తి తన 172 పేజీల తీర్పులో వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ఫోన్ వల్ల మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందని అధికార పార్టీ ఆరోపించింది. కోమటిరెడ్డితో పాటు సంపత్కుమార్ను సభ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. అంతేగాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెడ్ఫోన్ విసరడం వల్లే స్వామిగౌడ్ కంటికి గాయమైనట్లు ఆరోపణలు వచ్చినందున అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని వారు తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు విచారణ జరిపి ఇటీవల తీర్పును వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెలువరించారు. వాస్తవానికి మంగళవారం విచారణ కేసుల జాబితాలో ఈ కేసు ప్రస్తావన లేదు. అయితే అకస్మాత్తుగా 1.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారని, పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు హాజరు కావాలన్న సమాచారంతో కోర్టు డిస్ప్లే బోర్డుల్లో స్క్రోలింగ్ వచ్చింది. దీంతో కోర్టు న్యాయవాదులతో కిటకిటలాడింది. తీర్పు పూర్తి పాఠం ఇదీ.. అసలు సభ తీర్మానమే అవసరం లేదు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శుల తరపున తాను హాజరవుతున్నట్లు అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అంతేకాక వీడియో ఫుటేజీలను సమర్పించాలంటూ ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని, వీడియో ఫుటేజీ ఒరిజినల్ రికార్డులను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు కూడా దాఖలు చేస్తామన్నారు. ఏజీ హామీని, కౌంటర్ల దాఖలు చేస్తామన్న విషయాన్ని కూడా మా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నాం. కౌంటర్ల దాఖలుకు రెండుసార్లు గడువు కూడా తీసుకున్నారు. దీన్ని ఈ కేసు ప్రొసీడింగ్స్లో అసెంబ్లీ కార్యదర్శి పాలుపంచుకున్నట్లు మా డాకెట్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా.. ఈ కేసులో వాదనలు వినిపించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలు ఉండి కూడా వాటిని సమర్పించకుంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ఫుటేజీలోని అంశాలకు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని కూడా చెప్పాం. అయినా వీడియో ఫుటేజీని సమర్పించ లేదు. వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని వాదనల సమయంలో అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. వాస్తవానికి ఏదైనా డాక్యుమెంట్ సమర్పణకు సభ తీర్మానం ఎంత మాత్రం అవసరం లేదు. సభ నిర్వహణ రూల్స్లోని 351 రూల్ ప్రకారం.. సభకు సంబంధించిన అన్ని రికార్డులు, డాక్యుమెంట్లు, ఇతర పేపర్లన్నీ కూడా అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉంటాయి. స్పీకర్ అనుమతి లేకుండా వీటిలో దేన్ని కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అంటే అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉన్న దేనినైనా ఆయన బయటపెట్టాలంటే స్పీకర్ అనుమతిస్తే చాలు. స్పీకర్ రాతపూర్వక అనుమతి కూడా అవసరం లేదు. కేవలం మౌఖిక అనుమతి సరిపోతుంది. అయితే వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని అదనపు ఏజీ ఎలా చెప్పారో మాకు అర్థం కాకుండా ఉంది. అలా చేయడం హక్కుల ఉల్లంఘనే హెడ్ఫోన్ విసిరిన ఘటన గవర్నర్ ప్రసంగం రోజున జరిగింది. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ హుందాతనానికి భంగం కలిగేలా వ్యవహరించడం, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించడం వంటి కారణాలను తెలియచేస్తూ నోటీసులు ఇవ్వడం కూడా చేయలేదు. బహిష్కరణకు ముందు వివరణ కోరలేదు. వాదన వినలేదు. బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా కారణాలు చెప్పలేదు. ఎటువంటి వివరాలు లేకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 11 రోజుల తర్వాత తీర్మానాన్ని అప్లోడ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఇది జరిగింది. సభలో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదు. బహిష్కరణ తర్వాత అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందచేయలేదు. కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఇదంతా కేవలం వి«ధానపరమైన లోపమని చెప్పడం సరికాదు. హైకోర్టుకు వీడియో ఫుటేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ మొత్తం వ్యవహారంలో కోమటిరెడ్డి, సంపత్లను బలి పశువులను చేశారు. బహిష్కరణ అన్నది సభ్యుడికి కఠినమైన శిక్ష. ఈ శిక్ష వల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకుండా పోతాడు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఒక్క కలం పోటుతో వీరిద్దరినీ అనర్హులుగా చేసేశారు. దీన్ని కేవలం విధానపరమైనలోపంగా కాక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నాం. పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారు. కాబట్టి అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట ప్రకారం చెల్లవు. సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పిన సుప్రీంకోర్టు, సభ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని చెప్పింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్న ఏజీ వాదన సరికాదు. ఈ వ్యాజ్యంలో న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. వివాద నేపథ్యాన్ని చూస్తే సరైన వారినే ప్రతివాదులుగా చేర్చారు. రాజీనామా చేయించిన ఆ హామీ కోమటిరెడ్డి, సంపత్కుమార్పై బహిష్కరణ మొదలు.. తీర్పు వరకు ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్కుమార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వీడియో ఫుటేజీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసేందుకు జడ్జి సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి స్పందిస్తూ.. ఆదేశాలు అవసరం లేదని, సీల్డ్ కవర్లో వీడియో ఫుటేజీలు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ప్రకాశ్రెడ్డి ఇచ్చిన ఈ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం చెప్పింది. ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో ప్రకాశ్రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఏజీ రాజీనామా అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఆ తర్వాత ఈ కేసులో హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఏజీ హామీతో తమకు సంబంధం లేదన్నారు. వీడియో ఫుటేజీ ఇవ్వాలంటే సభ తీర్మానం అవసరమని, తీర్మానం లేదు కాబట్టి ఫుటేజీ ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ తర్వాత తాను, ఏజీ కలిసే హామీ ఇచ్చామని ఓసారి, తన సూచనతోనే వీడియో ఫుటేజీ సమర్పిస్తానని ఏజీ హామీ ఇచ్చారని మరోసారి చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలపై న్యాయమూర్తి సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఏఏజీ ప్రకటనలు న్యాయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. చివరకు అసెంబ్లీతో తనకు సంబంధం లేదని, కేవలం ప్రభుత్వం తరఫునే వాదనలు వినిపిస్తున్నామంటూ.. మూడు పేజీలతో కౌంటర్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణతో తమకు సంబంధం లేదని మూడు పేరాల్లో తేల్చి చెప్పేశారు. తీర్పును అమలు చేస్తారా? హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ వర్గాలు అమలు చేస్తాయా? లేదా? అన్న విషయంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు న్యాయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ అనుసరించిన తీరును చూస్తుంటే తీర్పును అమలు చేసేలా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవర్గాలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే నిజమైతే దాని పర్యవసానాలు రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ పూరిత వాతావరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చించారు. బహిష్కరణకు భయపడ లేదు: సంపత్ ‘‘అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించి నన్ను బహిష్కరణతో భయపెట్టాలని చూసింది. అయినా నేను భయపడలేదు.. వెనక్కి తగ్గలేదు. ఈ రోజు హైకోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడానికి ప్రజల ఆశీర్వాదంతో పాటు భగవంతుని అనుగ్రహమే కారణం. ఈ తీర్పు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక నుంచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతా ప్రభుత్వ పతనానికి నాంది: కోమటిరెడ్డి ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ, దేవుడున్నంత కాలం వంద మంది కేసీఆర్లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ ఇచ్చిన అండదండలు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యంతో ప్రభుత్వ ఆగడాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ న్యాయ పోరాటానికి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీ అందించిన సహకారం, తోడ్పాటు మరువలేనిది. ఆయన బలంతో నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు పోరాటం చేస్తా. మా సభ్యత్వాలను రద్దు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకున్నట్లయింది. ప్రభుత్వ పతనానికి ఈ తీర్పు నాంది కాబోతోంది. -
కేసీఆర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లపై వేసిన అనర్హత వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ పార్టీ స్వాగతించింది. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని వ్యాఖ్యానించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్యాయంగా తమ సభ్యులపై వేటు వేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని, కేసీఆర్కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డీకే అరుణ మంగళవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. వందమంది కేసీఆర్లు వచ్చినా నన్నేమీ చేయలేరు! కేసీఆర్ నెలరోజులుగా మానసికంగా నన్ను ఇబ్బందులు పెట్టారు. నా అనుచరుడిని కూడా హత్య చేశారు. న్యాయస్థానాలు నాకు రక్షణగా నిలిచాయి. కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. కేసీఆర్ డ్రామా ఆడి పైశాచిక ఆనందం పొందాడు. చేయని తప్పుకు నాతో పాటు దళిత శాసన సభ్యుడు సంపత్పై అనర్హత వేటు వేశారు. నా అనుచరుడిని హత్య చేసిన విషయం కాల్ డేటాలో పట్టుపడిన విషయం నిజం కాదా? పైన దేవుడు ఉన్నంతవరకు 100 మంది కేసీఆర్లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కేసీఆర్కు నైతికత ఉంటే రాజీనామా చేయాలి. - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్లపై విధించిన బహిష్కరణ వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఇది ఈ నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజలను, ప్రశ్నించే గొంతులను నులిమివేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుంది. ప్రజల మద్దతుతో ముందుకు పోతుంది. ఎప్పటికైనా గెలుపు మాదే. అధికార దూరహంకారంతో, విచ్చలవిడి చేష్టలతో విర్రవీగిపోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. - ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ చీఫ్ కేసీఆర్కు ఈ తీర్పు చెంపపెట్టు హైకోర్టు తీర్పుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలి. ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది టీఆర్ఎస్ దిగజారుడు నిర్ణయం. కేసీఆర్కు ఒక్కరోజు కూడా సీఎంగా కొనసాగేహక్కు లేదు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గు రావటం లేదు. దేశం సిగ్గుపడేలా ప్రభుత్వం వ్యవహరించింది. సీఎం కేసీఆర్కు ఈ తీర్పు చెంపపెట్టు. సీఎం ఎన్నికలకు సిద్ధం అంటున్నారు. పార్టీ మారి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామా చేయించాలి. ప్రభుత్వానికి దమ్ము ఉంటే శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్దాం. కోర్టు తీర్పును కూడా స్పీకర్ అమలు చేయకుంటే ప్రజలు అసలు తీర్పు ఇస్తారు. సీఎం కుర్చీకి నామినేషన్ ప్రక్రియ లేదు.. ఉంటే కనుక 20 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండేలా నామినేట్ చేసుకునే వాడు. -డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదు
-
ఎమ్మెల్యేల బహిష్కరణ; హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చూస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి.. ‘కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్లు యధావిధిగా తమ పదవుల్లో కొనసాగొచ్చ’ని పేర్కొన్నారు. అదేసమయంలో నల్లగొండ, ఆలంపూర్ శాసన సభ స్థానాల్లో ఖాళీ ఏర్పడిందంటూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ కూడా చెల్లుబాటు కాదని అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ తీర్పును వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకం వ్యక్తం చేశాయి. అది అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు: సాధారణంగా అసెంబ్లీ వ్యవహారాలకు సబందించిన కేసుల్లో జోక్యానికి నిరాకరించే హైకోర్టు.. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల పిటిషన్పై మాత్రం భిన్నంగా తీర్పు చెప్పింది. ‘మార్చి 12 నాటి సంఘటన అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు. అసెంబ్లీ బయటి వ్యవహారం. కాబట్టే మేము స్పష్టమైన స్పష్టమైన తీర్పు ఇస్తున్నాం’ అన్న న్యాయమూర్తి.. ఇది దేశానికి దిశానిర్దేశం చేసే తీర్పుల్లో ఒకటని వ్యాఖ్యానించడం గమనార్హం. అసలేం జరిగింది?: మార్చి 12న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెంకట్రెడ్డి.. హెడ్సెట్ను పోడియం వైపు విసరడం, దీనికి మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకరించడం తదితర దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేల తీరును గర్హించిన ప్రభుత్వం.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుచేయాలని, మిగతా వారిని సస్పెండ్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో ఈ మేరకు అసెంబ్లీ ఒక గెజిట్ నోట్ను విడుదలచేసింది. అయితే, గవర్నర్ ప్రసంగం సందర్భానికి సభా నియమాలు వర్తించవని, ఆ సమయంలో జరిగిన ఘటనలపై నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేగానీ, స్పీకర్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు. ఆ మేరకు నోటిఫికేషన్ రద్దును కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. మార్చి 12 నాటి అసెంబ్లీ వీడియోలన్నీ కోర్టుకు సమర్పించాలని కోరగా, అందుకు ప్రభుత్వం వెనుకడుగువేసింది. చివరికి కాంగ్రెస్ సభ్యులకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. -
కోమటిరెడ్డి, సంపత్ల కేసులో తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్యత్వం రద్దుకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ప్రసంగంనాటి ఘటనకు సం బంధించి తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నల్ల గొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫై చేయడంపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసిరి, గాయపర్చామంటూ బహిష్కరించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశిం చాలని వారు కోర్టును కోరారు. దీనిపై ఇంతకుముందు జరిగిన విచారణల సందర్భంగా.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఇరువర్గాలు కౌంటర్లు దాఖలు చేయగా.. పిటిషనర్లు రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. తమకు సంబంధం లేదన్న ఏఏజీ.. న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు సోమ వారం మరోసారి విచారణ జరిపారు. అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) లేచి.. పిటిషనర్ల బహిష్కరణకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకుందాం.. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చారని.. రాష్ట్రం అంటే ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా అని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏజీ హామీ విషయంలో వాదనలు అవసరం లేదని, వీడి యో ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో నమోదు చేశామన్నారు. ఈ కేసులో వాదనలు వినిపించాలా? లేదా? అన్నది అసెంబ్లీ ఇష్టమని, ఈ విషయంలో కోర్టు వారిని బలవంతం చేయడం లేదని చెప్పారు. తాను మాత్రం చట్ట ప్రకారం నడచుకుంటానని, చట్టం చెబుతున్నదే చేస్తానని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు.. తరువాత పిటిషనర్ల తరఫు న్యాయవాది పలు కేసుల్లో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన తీర్పులను న్యాయమూర్తికి వివరించారు. సభ నిర్ణయాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని... సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని తెలిపారు. అసలు బహిష్కరణ అన్నది నిబంధనల్లో ఎక్కడా లేదని.. లోక్సభ, రాజ్యసభలతోపాటు ఏ రాష్ట్ర శాసనసభ నిబంధనల్లోనూ ఆ ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించినా వారిని కనీసం సస్పెండ్ కూడా చేయలేదని కోర్టుకు వివరించారు. అసలు ఓ సభ్యుడిని బహిష్కరించే అధికారం శాసనసభకు లేదని.. కేవలం సస్పెన్షన్ అధికారం మాత్రమే ఉందని, ఆ సస్పెన్షన్ కూడా ఆ సెషన్కు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. కాబట్టి కోమటిరెడ్డి, సంపత్ల బహిష్కరణను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, బహిష్కరణను రద్దు చేయాలని అభ్యర్థించారు. అసలు కారణమేదీ? గవర్నర్ ప్రసంగం సభా కార్యకలాపాల కిందకు రాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాస్తవానికి పిటిషనర్లను ఎందుకు బహిష్కరించారో కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, వాదనలు మొదలైన తరువాతే బహిష్కరణ తీర్మానాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారని గుర్తుచేశారు. బహిష్కరణ ప్రొసీడింగ్స్ గానీ, బహిష్కరణకు కారణంగా చెబుతున్న వీడియో ఫుటేజీని గానీ కోర్టుకు సమర్పించలేదని వివరించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘బహిష్కరణ ఉత్తర్వుల్లో పూర్తిస్థాయి వివరాలు లేవు కాబట్టి, అది పూర్తిస్థాయి కమ్యూనికేషన్ కిందకు రాదంటారు.. అంతేనా.? స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ అమర్సింగ్ హారికా కేసులో చెప్పింది ఇదే కదా?’’అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాది ఔనని సమాధానం ఇచ్చారు. అనంతరం వాదనలు ముగిసినట్టుగా ప్రకటించిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
దురుద్దేశంతోనే బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఎలాంటి చర్చ, సంప్రదింపులు లేకుండానే, మా వివరణ తీసుకోకుండానే మమ్మల్ని సభ నుంచి బహిష్కరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. శాసనసభా నిబంధనల్లో ఎక్కడా బహిష్కరణ అనేది లేదు. బహిష్కరణ చాలా కఠినమైన శిక్ష. బహిష్కరణకు గురైన సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభా నిబంధనల్లో బహిష్కరణను చేర్చలేదు. ఏ ఆరోపణ ఆధారంగా మమ్మల్ని బహిష్కరించారో, ఆ ఆరోపణ గురించి బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదు. మా బహిష్కరణ విషయంలో సభ లోపల చెప్పిన కారణాలు, సభ వెలుపల చెప్పిన కారణాలు, కోర్టుకు చెప్పిన కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మా బహిష్కరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ హైకోర్టుకు నివేదించారు. ‘‘అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఓ రాష్ట్రం తరఫున న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తారు. రాష్ట్రం అంటే ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సమర్పిస్తానని కోర్టుకు ఏజీ స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి.. ఈ హామీకి ప్రభుత్వంతోపాటు శాసనసభ కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఏజీ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు కాబట్టి ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే. ఆయన ఇచ్చిన హామీ కూడా ఇంకా అమల్లో ఉన్నట్లే’’ అని వివరించారు. ఈ హామీకి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. రిప్లై అఫిడవిట్ దాఖలు సభ నుంచి తమను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్కుమార్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్ను కూడా వారు సవాలు చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో చోటుచేసుకున్న పరిణామాల తాలూకు వీడియో ఫుటేజీలను సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు సమాధానంగా కోమటిరెడ్డి, సంపత్కుమార్ రిప్లై అఫిడవిట్ (తిరుగు సమాధానం) దాఖలు చేశారు. ఏజీ ఇంకా కొనసాగుతున్నట్లే! ‘‘అడ్వొకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారు. ఏజీకి రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరయ్యే అధికారం ఉంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తరఫున, అసెంబ్లీ తరఫున ఆయన హామీ ఇవ్వొచ్చు. ఈ కేసులో మార్చి 19న కోర్టుకు హాజరైన ఏజీ.. గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. తర్వాత అదనపు అడ్వొకేట్ జనరల్ మార్చి 27న హాజరై ఏజీ రాజీనామా చేశారని తెలిపారు. అయితే ఏజీ సిఫారసుల మేరకు హైకోర్టులో పలువురు ప్రభుత్వ సహాయ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 31న జీవోలు జారీ చేసింది. అంటే అడ్వొకేట్ జనరల్ రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. కాబట్టి ఆయన ఇంకా ఏజీగా కొనసాగుతున్నట్లే లెక్క’’అని తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది ‘‘సభా నిర్ణయాల్లో దురుద్దేశాలు ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నప్పుడు, ఆ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సహజ న్యాయ సూత్రాలను పాటించనప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి మా వ్యాజ్యానికి విచారణార్హత ఉంది. అందువల్ల మా నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇచ్చిన గెజిట్ను రద్దు చేయండి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ప్రసంగం సభా కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాతే సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అసాధారణ కేసుల్లో ప్రధాన అభ్యర్థనను మధ్యంతర ఉత్తర్వుల జారీ సమయంలోనే ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో పిటిషనర్లకు తీరని నష్టం కలుగుతుందని కోర్టు భావిస్తే ఆ మేరకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు. మాకు అన్యాయం జరిగిందనేందుకు గట్టి ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ విషయంలో సత్వరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుంటే జరిగే నష్టం కూడా అపారమనేందుకు ఆధారాలున్నాయి. కాబట్టి మా బహిష్కరణను రాజ్యాంగ విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించండి’’అని కోమటిరెడ్డి, సంపత్కుమార్ కోరారు. -
మా పాత్రేమీ లేదు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎ.సంపత్కుమార్ల శాసనసభ్యత్వ రద్దు, వారు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ వ్యవహారంలో తమ పాత్రేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ‘వారు దురభిప్రాయంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు. పైగా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని కోరారు తప్ప మాకు నిర్దిష్ట ఆదేశాలివ్వాలని కోర్టును కోరలేదు. కాబట్టి మాపై వ్యాజ్యాన్ని పిటిషనర్లకు జరిమానా విధించి మరీ కొట్టేయండి’ అని కోర్టును అభ్యర్థించింది! తమ శాసనసభ్యత్వాల రద్దును, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. హెడ్ ఫోన్ విసిరి మండలి చైర్మన్ను గాయపరిచామన్నందున సంబంధిత వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కూడా వారు కోర్టును కోరారు. కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశాయి. 3 పేజీల ప్రభుత్వ కౌంటర్లో ఈ వ్యవహారంలో భవిష్యత్తులోనూ తమ ప్రమేయం ఉండబోదని తెలిపింది. ఇక, పిటిషనర్లు తమపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు గనుక సభలో జరిగిన ఉదంతంపై బదులివ్వాల్సిన అవసరం లేదని ఈసీ తన 4 పేజీల కౌంటర్లో తెలిపింది. ‘మీ ఆదేశాల మేరకు నల్లగొండ, అలంపూర్ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహణపై మేం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాబట్టి మాపై వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి సోమవారం నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. -
కోమటిరెడ్డి, సంపత్ కేసులో ఈసీ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ శాసనసభ్యత్వం రద్దు కేసుకు సంబంధించి హైకోర్టులో ఎన్నికల సంఘం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి అని.. ఆరు వారాల వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ఈసీ తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంది. తమపై వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఎన్నికల సంఘం హైకోర్టును కోరింది. కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం మరోవైపు ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున న్యాయ విభాగ కార్యదర్శి వి.నిరంజన్ రావు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖకు ఎలాంటి సంబంధం లేదని కౌంటర్ లో పేర్కొన్నారు. పిటిషనర్లు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని కోరుకోవడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్లు అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనవ్యవహారాల శాఖను చేర్చారని.. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో నిరంజన్ రావు పేర్కొన్నారు. ఈ పిటిషన్ హైకోర్టు సోమవారం విచారించనుంది. -
టీ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ శాసనసభ్యత్వం రద్దుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్ ఫైల్ చేయాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయక పోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 6 వ తేదీ లోపల కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన అనంతరం.. సోమవారం( 9 వ తేదీ) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కౌంటర్ ఫైల్ చేయకపోతే.. ఈ కేసులో ఇక కౌంటర్ ఉండదని భావించాల్సి ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది. -
నా హత్యకు ప్రభుత్వం కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: తమ శాసనసభ సభ్యత్వాలను అప్రజాస్వామిక రీతిలో రద్దు చేశారని, రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాము ఓటు వేసేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ను కలసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రాజ్య సభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహ రిస్తున్న అసెంబ్లీ సెక్రెటరీ రాష్ట్ర ప్రభుత్వ తొత్తులా వ్యవహరిస్తున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకో కుండానే రాజ్యసభ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారన్నారు. అంతేగాకుం డా తమ అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆరు వారాల వరకు ఎలాం టి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి, సంపత్ల వెంట కాంగ్రెస్ సీని యర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఉన్నారు. అనం తరం వారు మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిపై ఓపీ రావత్ సానుకూలంగా స్పందిం చారని.. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుం టామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే.. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి, సంపత్లు ప్రతిపాదించారని, కాబట్టి వారు ఓటు వేసేందుకు అర్హులని మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణం గా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమటిరెడ్డి, సంపత్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. ప్రజాప్రతి నిధుల చట్టంలోని సెక్షన్ 152 కింద ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని.. ఓటర్ల జాబితా నుంచి సభ్యులను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఆ నిబంధనను పాటించలేదన్నారు. అందువల్ల రిటర్నింగ్ అధికారిని మార్చాలని, కోమటిరెడ్డి, సంపత్లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశమివ్వాలని ఎన్ని కల ప్రధానాధికారిని కోరామన్నారు. నా హత్యకు ప్రభుత్వం కుట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే తన గన్మన్లను ఉప సంహరించుకుందని, పాత కేసులన్నింటినీ తిరగదోడుతోందని పేర్కొన్నారు. ఒక్క కోమటిరెడ్డి పోతే వందల కోమటిరెడ్డిలు నల్లగొండ జిల్లాలో పుట్టుకొస్తారని.. వారందరినీ చంపుతారా అని ప్రశ్నించారు. -
సీఈసీకి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లను ఎమ్మెల్యే పదవుల నుంచి అనైతికంగా తొలగించారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్లీ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తొలగించారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో కోమటిరెడ్డి, సంపత్ల పేర్లు చేర్చాలని, అసెంబ్లీ సెక్రటరీని ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. -
కోమటిరెడ్డి, సంపత్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీని 22న సీల్డ్ కవర్లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు స్పష్టం చేస్తూ... విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. స్వామిగౌడ్ను గాయపర్చినందుకు కాదు.. కోమటిరెడ్డి, సంపత్లు తమను శాసనసభ నుంచి బహిష్కరించడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పిటిషనర్ల వాదనలు పూర్తవగా.. సోమవారం ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శుల తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్ను గాయపరిచారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లను బహిష్కరించలేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా.. సభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందునే తీర్మానం ప్రవేశపెట్టి వారిని బహిష్కరించారు. ఇది సభ నిర్ణయమే తప్ప.. స్పీకర్ది కాదు. సభ నిర్ణయం మేరకు స్పీకర్ వ్యవహరించారు. సభ లోపల, వెలుపల ఎక్కడ సభ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినా సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉంది. ఆ అధికారం మేరకే స్పీకర్ చర్యలు తీసుకున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం సరికాదు. పిటిషనర్లు ఎక్కడా సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించలేదని చెప్పలేదు. ఇయర్ ఫోన్ విసిరిన దానికి ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు..’’అని కోర్టుకు విన్నవించారు. సభలో సభ్యుల ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని వివరించారు. ఇక బహిష్కరణ తీర్మానాన్ని పిటిషనర్లు సవాలు చేయలేదని, అందువల్ల తీర్మానం అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు విన్నవించారు. ఆరు వారాల పాటు చర్యలు వద్దు.. ఇక వీడియో ఫుటేజీ అంశంపై అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిర్దిష్టంగా గవర్నర్ ప్రసంగం సందర్భానికి సంబంధించిన ఫుటేజీని అడుగుతున్నారని, తమ వద్ద ఏ ఫుటేజీ ఉంటే అదే ఇస్తామని కోర్టుకు చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఆరు కెమెరాలు పనిచేస్తాయని, అందులో రెండు పూర్తిస్థాయిలో గవర్నర్ ప్రసంగించే వేదికను ఫోకస్ చేసి ఉంటే, మిగతావి సభ్యులను ఫోకస్ చేసి ఉంటాయని వివరించారు. ఇయర్ఫోన్ విసిరి మండలి చైర్మన్ను గాయపర్చడమే పిటిషనర్లను బహిష్కరించడానికి కారణంగా పేర్కొంటున్న నేపథ్యంలోనే.. తాము నిర్దిష్టంగా గవర్నర్ వేదికను ఫోకస్ చేసిన కెమెరాల ఫుటేజీని కోరుతున్నామన్నారు. దీంతో అందుబాటులో ఉన్న మొత్తం వీడియో ఫుటేజీని సమర్పించేందుకు ఏజీ అంగీకరించారు. ఇక నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేసిన అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ భజరంగ్ బహదూర్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు ఉత్తర్వులపై కాంగ్రెస్ నేతల హర్షం సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక రీతిలో నిబంధనలకు విరుద్ధంగా తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీచేసిన నోటిఫికేషన్పై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని కాంగ్రెస్ నేతలు అన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై ఎమ్మెల్యే సంపత్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుల హక్కులను కాలరాస్తున్న సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లురవిలతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినా న్యాయ స్థానాలపై తమకు విశ్వాసం ఉందని సంపత్ పేర్కొన్నారు. -
‘ఆ వీడియో ఫుటేజీని సీల్డ్కవర్లో ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ శాసనసభ్యత్వం రద్దుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆరోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 22కు హైకోర్టు వాయిదా వేసింది. మరో వైపు ఈ కేసు పూర్తి అయ్యేవరకు గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతో పాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటీషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై హైకోర్టు విచారించనుంది. దీంతో ఆ విచారణ తర్వాతే నోటిఫికేషన్పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. -
ఆ రెండు ఓట్లపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి కోమటిరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా ఓటరు జాబితాలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారు. దీంతో వీరి విష యంలో ఏం చేయాలని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహచార్యులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్కు లేఖ రాశారు. ఆయన దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరారు. సభ్యత్వ రద్దు వ్యవహారంపై కేసు కోర్టు విచారణలో ఉంది. కోర్టు నిర్ణయం తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
టీఆర్ఎస్ పాలనలో రైతులు ఆగం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు రైతులను ఆగం చేశాయని, రైతులు, దళితులంటే ఈ పాలకులకు గిట్టదని టీ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ల పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన 84వ ఏఐసీసీ ప్లీనరీ సభ జరిగింది. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాక జరుగుతున్న తొలి ప్లీనరీలో తెలంగాణ నుంచి 400 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అతిరథ మహారథులు వేదికపై ఆశీనులవగా వేలాది మంది నాయకులను ఉద్దేశించి సంపత్ ప్రసంగించారు. వ్యవసాయం, దళితులపై మాట్లాడే అరుదైన అవకాశం ఆయనకు లభించింది. తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు అధికం దేశంలో ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అత్యధికంగా తెలంగాణలో దాదాపు 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్... అధికారంలోకి వచ్చాక మాట మార్చి రుణమాఫీని నాలుగు విడతలుగా చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కావాలని తెలంగాణలో ఉద్యమం చేసిన రైతులను పోలీసుల చేత కొట్టించారని, కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఉత్తమ్ ఆరోపించారు. గిరిజన రైతులను దొంగలుగా చిత్రీకరించి బేడీలు వేసి వీధుల్లో తిప్పారని, భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రవర్తించిందని దుయ్యబట్టారు. రెండు పంటలు పండే బంగారం లాంటి భూములను సాధ్యంకాని ప్రాజెక్టల కింద ముంచేందుకు సిద్ధమైందన్నారు. సాగును పండుగలా చేసింది కాంగ్రెస్సే... దేశంలో వ్యవసాయాన్ని పండుగలా కాంగ్రెస్ ప్రభుత్వాలు మార్చాయని, అనేక వ్యవసాయ సంస్కరణలు చేపట్టిన ఘతన కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కిందని ఉత్తమ్ పేర్కొన్నారు. దేశమంతటా ఏకకాలంలో రూ. 75 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసిన ఘన చరిత్ర గత యూపీఏ ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి రైతులను సంక్షోభం నుంచి బయటపడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని ఆయన వివరించారు. ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, మర్రి శశిదర్రెడ్డి, మధు యాష్కీగౌడ్, రేవంత్రెడ్డి, బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళితులపై సర్కారు అణచివేత తెలంగాణలో ప్రభుత్వ పెద్దల ఇసుక మాఫీ యాకు దళితులు బలవుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఇసుక లారీలు వద్దని ఉద్యమించిన దళి త, గిరిజన, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధితులను పరామ ర్శించేందుకు వచ్చిన లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. తెలంగాణ రాజ్యహింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. వీటిపై ప్రశ్నిస్తే తమను శాసనసభలో లేకుండా చేసేందుకు కుట్ర చేశారని ఉత్తమ్ విమర్శించారు. అసెంబ్లీలో తనతోపాటు కొమటిరెడ్డి వెంకట్రెడ్డి పదవులను రద్దు చేసే సాహసం చేశారని ధ్వజమెత్తారు. -
బహిష్కరణ వెనుక రాజకీయ దురుద్దేశాలు
సాక్షి, హైదరాబాద్: బహిష్కరణ వేటు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ఇందులో అసెంబ్లీ స్పీకర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్ హైకోర్టుకు నివేదించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభలో చర్చించకుండా ప్రభుత్వం అనుకున్నదే తడువుగా తమ బహిష్కరణ పూర్తి కావడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్కు వర్తమానం పంపడం వేగంగా, ఏకపక్షంగా సాగిందని తెలిపారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. నిబంధనల ప్రకారం ఇటువంటి వ్యవహారాల్లో ప్రివిలేజ్ కమిటీలో, సభలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ వ్యవహారాల కిందకు రాదని, ఆయన ప్రసంగ సమ యంలో ఎవరైనా సభ్యుడు హుందాగా వ్యవహరించకపోతే అతనిపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్కు మాత్రమే ఉందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ తమపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారని, ఇలా చేయడం స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ప్రభుత్వ వాదనల నిమిత్తం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతో పాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్ల గొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటి షన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. ఇందులో స్పీకర్ జోక్యం తగదు.. కోమటిరెడ్డి, సంపత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సభా వ్యవహారాల కిందకు రాని వాటి విషయంలో జోక్యం చేసుకునే అధికారం స్పీకర్కు లేదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన దానికి స్పీకర్ చర్యలు తీసుకోవడానికి సభావ్యవహారాల నిబంధనలు అంగీకరించవన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఇలాగే జరిగినప్పుడు అందుకు బాధ్యులైన సభ్యులను గవర్నరే బహిష్కరించారని తెలిపారు. నిబంధనల ప్రకారం బహిష్కరణ ఆ సెషన్కు మాత్రమే పరిమితం అవుతుందని, అయితే స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులను ఉదహరించారు. ఇటువంటి వ్యవహారాల్లో న్యాయసమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తర్వాత కూడా ఉల్లాసంగానే గడిపారు మండలి చైర్మన్ పిటిషనర్లు విసిరిన ఇయర్ ఫోన్ వల్ల గాయపడ్డారన్నది ప్రధాన ఆరోపణ అని, ఇయర్ ఫోన్ విసిరిన చాలాసేపటి వరకు మండలి చైర్మన్ ఉల్లాసంగా గడిపారని, గవర్నర్, స్పీకర్తో సరదాగా మాట్లాడారని, గవర్నర్ వెళ్లేటప్పుడు కారు వరకు వెళ్లి సాగనంపారని వెంకటరెడ్డి, సంపత్ తెలిపారు. తర్వాత 20 నిమిషాలకు కన్నుకు దెబ్బతగినట్లు బ్యాండేజీ వేసుకున్నారని, మొదట కుడికన్నుకు గాయమైనట్లు చెప్పారని, ఆ తర్వాత ఎడమ కన్నుకు గాయమైందన్నారని తెలిపారు. దీని సంబంధించిన వీడియో ఫుటేజీని బహిర్గతం చేయలేదన్నారు. -
చైర్మన్ బాగానే ఉన్నా.. ఆస్పత్రిలో ప్రత్యక్షం!
సాక్షి, హైదరాబాద్: అనర్హత వేటుపడ్డ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ల ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తన వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన చాలాసేపు వరకు మండలి చైర్మన్ బాగానే ఉన్నా.. అనంతరం ఆస్పత్రిలో ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల12న కేవలం గవర్నర్ నరసింహన్ ప్రసంగం మాత్రమే జరిగిందని, 13న శాసనసభ ప్రారంభమైందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజు సభలో ఎలాంటి దాడి జరగలేదని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం చట్ట విరుద్దమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నేతల సభ్యత్వం రద్దు చేశారని న్యాయవాది వివరించారు. తమకు ఎన్నో అనుమానాలున్నాయని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మండలి చైర్మన్ స్వామి గౌడ్ బాగానే ఉన్నారని, అనంతరం చాలా సేపటికి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆ వీడియోలోనే లేరని, అయినా అతనిపైనా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి సోమవారం వరకు గడువు కోరారు. దీంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. తమ సభ్యత్వాల రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్లు గురువారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి నేతలు విన్నవించారు. -
నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారు?
-
న్యాయ పోరాటం
సాక్షి, హైదరాబాద్: తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతోపాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎ.సంపత్కుమార్ న్యాయ పోరాటం ప్రారంభించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతోపాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్పై హెడ్ సెట్ విసిరేసి ఆయనను గాయపరిచామని చెప్పి తమ శాసన సభ్యత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తమ బహిష్కరణ, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోర్టును కోరారు. గురువారం ఈ వ్యాజ్యం గురించి కోమటిరెడ్డి, సంపత్ తరఫు న్యాయ వాది.. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ముందు ప్రస్తావించారు. దీనిపై విచారణ జరపాలని అభ్యర్థించారు. స్పందించిన జడ్జీ శుక్రవారం విచారణ జరుపుతామన్నారు. వ్యక్తిగత పగకు బాధితులయ్యాం ‘అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మేం సీఎం, ఆయన సహచరుల వ్యక్తిగత పగకు బాధితులుగా మారాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పదే పదే ప్రశ్నిస్తున్న మమ్మల్ని భవిష్యత్తులో శాసనసభలో అడుగుపెట్టనివ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ నెల 12న గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ 13న శాసన సభా వ్యవహారాల మంత్రి మా ఇద్దరినీ సభ నుంచి బహిష్కరిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగా మా నియోజకవర్గాలైన నల్లగొండ, అలంపూర్లు ఖాళీ అయినట్లు పేర్కొంటూ ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణలు 175, 176 ప్రకారం సభా సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగానికి ముందూ, తర్వాతా ప్రతీ సభ్యుడు సభ హుందాతనాన్ని కాపాడాల్సి ఉంటుంది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఏ రకంగానూ అంతరాయం కలిగించడానికి వీల్లేదు. అయితే రాజ్యాంగ నిబంధనలు, శాసనసభ నిర్వహణ నిబంధనల్లో గవర్నర్ ప్రసంగానికి అంత రాయం కలిగించిన సభ్యుడిని సస్పెండ్ చేయవచ్చని ఎక్కడా లేదు. సభాపతి స్థానాన్నిగానీ, సభనుగానీ కించపరిచినప్పడు, సభా వ్యవహారాలను నిరాటంకంగా అడ్డుకున్నప్పుడు స్పీకర్ సంబంధిత సభ్యుడిని సస్పెండ్ చేయవచ్చు. అది కూడా ఓ సెషన్కు మాత్రమే పరిమితం. కానీ తమను గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగించామంటూ బహిష్కరించారు’అని పిటిషన్లో పేర్కొన్నారు. సభా వ్యవహారాల కిందికి రాదు.. ‘గవర్నర్ ప్రసంగానికీ, సభా వ్యవహారాలకు సంబంధమే లేదు. సభా వ్యవహారాలపై పలువురు నిపుణులు రాసిన పుస్తకాలను బట్టి ముఖ్యంగా సుభాష్ సి.కశ్యప్ రాసిన పార్లమెంటరీ ప్రొసీజర్, థర్డ్ ఎడిషన్ను పరిశీలిస్తే, రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాలు సభా వ్యవహారాల పరిధిలోకి రావు. గవర్నర్ ప్రసంగం సమయంలో సభకు గవర్నరే నేతృత్వం వహిస్తారు. అప్పుడు జరిగేవి సభా వ్యవహారాలు కాదు. వాటి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోజాలరు. గవర్నర్ ప్రసంగ సమయంలో మిగిలిన పార్టీలు కూడా వాకౌట్ చేశాయి. ఇది కూడా సభ హుందాతనానికి విరుద్ధంగా వ్యవహరించడమే. వారు చేసింది తప్పు కానప్పుడు మేం చేసింది ఎలా తప్పు అవుతుంది? చట్టాలు చేసే సభలోనే సమానత్వం లేదన్న విషయం రుజువైంది. అందువల్ల మమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులు చట్ట ప్రకారం చెల్లుబాటు కావు. కాబట్టి ఆ ఉత్తర్వులను రద్దు చేయండి’అని కోర్టును కోరారు. -
బొందబెట్టే దాకా పోరు ఆగదు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ను గద్దె దింపి బొందబెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.సంపత్ కుమార్ ప్రకటించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించినందుకు నిరసనగా గాంధీభవన్లో చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్ భావోద్వేగంతో మాట్లాడారు. ‘గతంలో ఇదే గవర్నర్ను చేయిపట్టి గుంజి, ఆయన టేబుల్ ఎత్తుకెళ్లి, బెంచీలు ఎక్కి, మైకు విరిచిన వ్యక్తి హరీశ్రావు. కానీ మేం ఏమీ చేయకున్నా మమ్మల్ని సభ నుంచి బహిష్కరించే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేసిన మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారి బహిష్కరించింది. అందుకే ఆ పార్టీని అంతమొందించేంత వరకు పోరాడతాం’అని శపథం చేశారు. నా కుటుంబంపై పగబట్టారు: సంపత్ మరో ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ, కేసీఆర్కు దళితులు, బీసీలు, రెడ్లు అంటే భయం పట్టుకుందని, అందుకే వారి పట్ల విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘టీఆర్ఎస్లో చేరాలని, డబ్బులు ఇస్తామని నాపై చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు. నా భార్య ఉద్యోగంపై విచారణ జరిపారు. నా తమ్ముడి కాంట్రాక్టులను రద్దు చేశారు. అయినా వినకపోవడంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనంత దుర్మార్గ రాజకీయాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్లోనే ఉంటానని, తాను మరణిస్తే కాంగ్రెస్ జెండా కప్పాలని కోరుకుంటున్నట్లు ఆవేశంగా మాట్లాడారు. సమావేశంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, పద్మావతి, దొంతి మాధవరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పార్టీ నేతలు బలరాంనాయక్, మల్లు రవి తదతరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దీక్షకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ సంఘీభావం ప్రకటించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారు?: కోమటిరెడ్డి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, ‘కేసీఆర్కు తెలంగాణ సమాజం అంటే గిట్టదు. కేవలం ఒక సామాజిక వర్గం మనుషులు, తన కుటుంబం, కొంతమంది తప్ప రాష్ట్రంలోని 4 కోట్ల మంది అంటే ఆయనకు పడదు. గజ్వేల్ నియోజకవర్గంలో జనం చచ్చిపోతున్నా ఏనాడు వారి వంక చూడని కేసీఆర్.. నల్లగొండకు వచ్చి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ కేసీఆర్ మొహానికి ఎవరూ ఓట్లేయరు. ఇటీవల నేను గజ్వేల్కు వెళ్లాను. అప్పటి నుంచి నాపై సీఎం కక్ష కట్టారు’అని ఆరోపించారు. ఓ సర్పంచ్ను సస్పెండ్ చేయాలంటేనే మూడుసార్లు నోటీసులిస్తారని, అలాంటిది ఓ ఎమ్మెల్యేలను ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని నిలదీశారు. తామంటే కేసీఆర్కు భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు దమ్ముంటే నల్లగొండకు వచ్చి తనపై పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ అయినా ఆయన కుటుంబ సభ్యులైనా తనపై పోటీకి దిగితే ఓడిపోవడం ఖాయమన్నారు. మంత్రులంతా కలసి నల్లగొండలో తిష్ట వేసినా తనను అడ్డుకోలేరని, తాను ఓడిపోతే గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన దీక్షకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన కోమటిరెడ్డి, సంపత్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తమ శాసనసభ సభ్యత్వాల రద్దుపై కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ గురువారం హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. తమపై అనర్హత వేటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను హైకోర్టు రేపు విచారించనుంది. ఈసీకి ఫిర్యాదు కోమటి రెడ్డి, సంపత్కుమార్ శాసనసభ్యత్వాలను రద్దు రాజ్యాంగ విరుద్దమని ఢిల్లీలో జాతీయ ఎన్నికల సంఘానికి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మర్రి శశిధర్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఈసీకి విన్నవించినట్టు ఆయన తెలిపారు. కర్ణాటకతో పాటు ఉప ఎన్నిలొస్తాయని మంత్రి హరీశ్రావు చెబుతున్న విషయాన్ని ఈసీకి తెలిపామని వెల్లడించారు. -
బహిష్కరణ అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్ : తమ సభ్యుల అనర్హత వేటుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్ (సీఈసీ)ను ఆశ్రయించింది. సహజ న్యాయసూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా తమ సభ్యులను స్పీకర్ బహిష్కరించారని.. సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బుధవారం ఫిర్యాదు చేసింది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఎలాంటి న్యాయ సూత్రాలను పాటించకుండా తమను సభ నుంచి పంపించేశారని.. తమకు అన్యాయం జరగకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లు సీఈసీకి ఆన్లైన్లో సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రతినిధి బృందంతో సీఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ ఎలక్షన్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో సీఈసీని కలవనున్నారు. ఇక తమ సభ్యత్వం రద్దు విషయంలో కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని వెంకట్రెడ్డి, సంపత్లు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర.. ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ అంశంపై మర్రి శశిధర్రెడ్డి కూడా బుధవారం సీఈసీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాటికి ఉప ఎన్నికలు జరుగుతాయని మంత్రి హరీశ్రావు చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆ లేఖలో వివరించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకూడదన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే తమ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారని పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు హైకోర్టు, సుప్రీంకోర్టులను న్యాయం కోసం ఆశ్రయిస్తారని.. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఈసీని కోరారు. రెండు అసెంబ్లీ స్థానాల ఖాళీని నోటిఫై చేయాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ పంపిన లేఖను నిలిపివేయాలని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
అసెంబ్లీ స్పీకర్కు కాంగ్రెస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తమను ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని శాససభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ ఆరోపించారు. వీరిద్దరూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. స్పీకర్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం చూపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, 12 గంటల్లోనే గెజిట్ ప్రచురించారని వెల్లడించారు. తమపై చేసిన ఆరోపణలకు సంబంధించిన విజువల్స్ ఇవ్వడం లేదని, కొన్ని విజువల్స్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని ఆరోపించారు. శాసనసభలో గందరగోళ ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు స్వామిగౌడ్ గవర్నర్తో పాటే ఉన్నారని గుర్తుచేశారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు: షబ్బీర్ శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ తెలిపారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చేసేందుకు కేసీఆర్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ‘ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు కాబట్టి చర్య తీసుకునే హక్కు గవర్నర్కే ఉంటుంది. ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయకుండా, అప్రజాస్వామికంగా వేటు వేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మమ్మల్ని సభ నుంచి పంపించార’ని షబ్బీర్ అలీ విమర్శించారు. -
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
-
రాజీనామాల యోచనలో కాంగ్రెస్?
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లకు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ అంశంపై మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు సభ్యులకు మద్దతుగా రాజీనామాలు సమర్పిస్తే ఎలా ఉంటుంది? ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? అన్న కోణంలో చర్చ జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ముందు ఆ ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో స్పష్టమయ్యాక అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు వెళ్దామన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. మొత్తమ్మీద తమ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసే దిశలో కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. దీనిపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయాలని, పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ.. ప్లీనరీ సమావేశాలకు వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించింది. కుంతియాతో మంతనాలు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఇతర సభ్యులను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ లాబీల్లోని సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తర్వాత సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి మాట్లాడారు. సభ్యుల సలహాలను తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు అంశాన్ని.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. అధికార పక్షం అనుకున్నదే తడువుగా ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి గెంటేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ విషయాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏఐసీసీ ప్లీనరీలో దీనిపై చర్చించి.. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తీర్మానాన్ని ఆమోదింపజేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి ఆందోళనలు పార్టీ కేడర్ను ఇదే అదనుగా సమాయత్తం చేసే కార్యాచరణను సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కేడర్ ఆందోళనకు దిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం రసాభాసగా మారింది. -
కోమటిరెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్ఏ సంపత్కుమార్ (అలంపూర్)లపై వేటు పడింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్కు చెందిన మిగతా 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దురదృష్టకరమైన ఘటన.. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ఫోన్స్ సెట్ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారు. దీనిని సీరియస్గా తీసుకున్న అధికారపక్షం.. నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. స్పీకర్ మధుసూదనచారి వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న అనంతరం దీనిపై మాట్లాడారు. ‘‘గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో దుర్మార్గమైన, దురదృష్టకమైన, అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. సభకు నా తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నా.. నాలుగేళ్లుగా దేశంలోనే గొప్పగా, గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం. నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. దాడితో దెబ్బతిన్న స్వామిగౌడ్ను చూసి షాక్కు గురయ్యాను..’’అని పేర్కొన్నారు. సభా నిబంధనల మేరకు.. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్రావు మాట్లాడారు. ‘‘నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను మిగిల్చింది. మీ (స్పీకర్) తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు అనుగుణంగా అసెంబ్లీ నిబంధనల (240 పేజీలోని సబ్ రూల్ 2) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, టి.జీవన్రెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, టి.రామ్మోహన్రెడ్డి, వంశీచంద్రెడ్డి, ఎన్.పద్మావతి, దొంతి మాధవరెడ్డిలను బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నిన్న జరిగిన దాడి చాలా చాలా తీవ్రమైనది. చట్టసభలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగింది. ఈ విషయంలో శాసనసభ తీవ్ర వేదనకు గురైంది. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కలిగించడానికి కారణమైన వారిపై పార్లమెంటరీ నిబంధనల (120 పేజీలోని 7.1 పేరా, రాజ్యాంగంలోని 194లో మూడో సెక్షన్) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల సభ్యత్వాలను ప్రస్తుత శాసనసభ కాలం ముగిసేవరకు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను..’’అని తెలిపారు. ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సభ ఆమోదం కోరారు. అనంతరం తీర్మానాలను ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డి, టి.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటికే మార్షల్స్ సభలోకి ప్రవేశించారు. అందులో మహిళా మార్షల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొలుత వారు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి వద్దకు వచ్చి బయటికి తీసుకెళ్లబోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం గమనార్హం. మండలిలో గందరగోళం.. శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గందరగోళానికి బాధ్యులను చేస్తూ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రారంభమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు విపక్ష నేత షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి, సంతోష్, దామోదర్రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఉండదని, బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి మార్షల్స్ను రప్పించి.. కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘రాజ్యసభ’ బరిలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 12వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంపై చర్చించారు. అయితే పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టుగా ఉంటుందని, టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని పోటీలోకి దించాలని నిర్ణయించింది. వ్యతిరేకతను తప్పుదారి పట్టించేందుకే.. సీఎం కేసీఆర్ వైఫల్యాలను, టీఆర్ఎస్ అసమర్థతను, ప్రజల్లో వ్యతిరేకతను తప్పుదారి పట్టించడానికే మూడో కూటమి పేరుతో నాటకం ఆడుతున్నారని సంపత్ విమర్శించారు. దళితులపై జరిగే దాడులు, రైతు సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ హత్యలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా వెల్లడించారు. మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడం లేదని, దీనిపై పోరాడతామన్నారు. రవీంద్రనాయక్ లేదా అజహరుద్దీన్ రాజ్యసభకు అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఉత్తమ్, జానారెడ్డి, కుంతియాకు సీఎల్పీ అప్పగించింది. అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత, నామినేషన్ తేదీని ప్రకటిస్తారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగిలిన పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అభ్యర్థిగా ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ, క్రికెటర్ అజహరుద్దీన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. 25 అంశాలపై పోరాటం.. సీఎల్పీ సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ ఎస్ఏ సంపత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది టీఆర్ఎస్కు ఆఖరి బడ్జెట్ అని, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్కు అనుంబంధ సంస్థగా మారిందన్నారు. అధికార పార్టీ హత్యా రాజకీయాలపై చర్చించామన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, హామీల అమలులో వైఫల్యంపై శాసనసభలో నిలదీస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు అమలుపై పోరాడతామన్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మాదిగ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సంపత్ వెల్లడించారు. -
‘తుంటరి ఎంపీ, చిలిపి ఎమ్మెల్సీలు’
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై టీఆర్ఎస్ నాయకులతో బహిరంగంగా చర్చించేందుకు శుక్రవారం రేవంత్రెడ్డితో కలిసి ఆయన గన్పార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సవాల్ విసిరి చర్చకు రాకుండా తుంటరి ఎంపీ, ఇద్దరు చిలిపి ఎమ్మెల్సీలు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. వీరిని ప్రగతి భవన్కు పిలిచి ముఖ్యమంత్రి మొట్టికాయలు వేశారని వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్కు దొరల వెంట తిరిగి కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. ఆయన స్థాయికి ఉత్తమ్కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ రావాలా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ అంశంపై కాంగ్రెస్ పార్టీతో బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, భానుప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ టైపు కాదు తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారడానికి తాను సీఎం కేసీఆర్ టైపు కాదన్నారు. ముక్కిపోయిన టీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేరతారని సంపత్కుమార్ అన్నారు. -
హరీశ్వి దిగజారుడు రాజకీయాలు: సంపత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మంత్రి హరీశ్రావు దిగజారి వ్యవహరిస్తు న్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ మంగళవారం విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు హరీశ్రావు లీకులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై మంత్రి నిజాల ను దాచి పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని వీడేది లేదని, టీఆర్ఎస్లో చేరేది లేదన్న విషయం అందరికీ తెలుసునన్నారు. మాజీమంత్రి డి.కె.అరుణ తనకు తల్లితో సమానమని, ఆమెతో ఎలాంటి విభేదాల్లేవని సంపత్ చెప్పారు. -
‘ఆమె వల్లే ఎమ్మెల్యే అయ్యాను’
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై టీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ‘నేను పార్టీ వీడనని మా అధ్యక్షుడు ఉత్తమ్కుమార్కు తెలుసు. టీఆర్ఎస్లోకి రానని హరీశ్రావు, కేటీఆర్లకు తెలుసు. డీకే అరుణ నాకు మాతృ సమానురాలు. ఆమె వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను. డీకే అరుణతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య విభేదాలున్నాయంటూ కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నార’ని సంపత్కుమార్ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలు మరిచి కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ శాశ్వత పరిష్కారానికి అప్పట్లో తమ పార్టీ తుమ్మిళ్ల రిజర్వాయర్ను ఎంచుకుందని తెలిపారు. ఆర్డీఎస్ కోసం ఆమరణ దీక్ష చేసి తాను జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులను చవటలు, దద్దమ్మలు అంటున్న హరీశ్.. ఇప్పుడు వారినే తన పక్కన కూర్చోపెట్టుకున్న సంగతి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, చెప్పుడు మాటల విని అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. -
మాదిగల వ్యతిరేకి సీఎం కేసీఆర్: సంపత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వ్యతిరేకి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీనిచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడకుండా సీఎం కేసీఆర్ మాదిగల గొంతునొక్కుతున్నారని విమర్శించారు. వర్గీకరణ డిమాండ్ చేస్తున్న మంద కృష్ణను జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను గద్దె దించేది మాదిగ జాతేనని అన్నారు. మాదిగ ప్రజాప్రతినిధులంతా శుక్రవారం సమావేశం అవుతున్నట్టుగా చెప్పారు. సీఎం కేసీఆర్ రాజకీయ అంతమో, వర్గీకరణ పంతమో తేల్చుకుంటామని సంపత్ హెచ్చరించారు. -
జనవరి 1న జన్మించే వారికి బంపర్ ఆఫర్
బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు పాలికె బంపర్ ఆఫర్ అందించనుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురియనుంది. 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత కళ్లుతెరిచే ఆడకూతురికి రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని మేయర్ సంపత్రాజ్ గురువారం ప్రకటించారు. ఆ చిన్నారి పేరుతో బీబీఎంపీ కమిషనర్ ఉమ్మడి ఖాతా తెరిచి ఆ నగదును డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం ఈ నగదును వినియోగించవచ్చునని మేయర్ చెప్పారు. సిజేరియన్ కాకుండా, సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన ఆడపిల్లకు మాత్రమే ఈ అదృష్టం వరించనుంది. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ ఆడపిల్లలు అందరితో సరిసమానంగా నిలబడి పనిచేస్తారని అన్నారు. అలాంటి ఆడపిల్లలు ఎంతో ముఖ్యమని భావించి వారిని ప్రోత్సహించడానికి నజరానా ప్రకటించామని తెలిపారు. -
వర్గీకరణపై టీఆర్ఎస్, బీజేపీ మోసం: సంపత్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను పూర్తి చేస్తా మని టీఆర్ఎస్, బీజేపీలు హామీ ఇచ్చి మోసం చేశాయని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం చేసి సీఎం చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలోనూ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంలోనూ సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
సాక్షి, అలంపూర్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. స్థానిక పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, డ్యూయల్ డెస్క్, వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రంతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, కలెక్టర్ రజత్ కుమార్ సైని, తదితర సభ్యులతో కలిసి గురువారం ప్రారంభించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులు, డాక్టర్ జ్యోతి నందన్ రెడ్డి(హైదరాబాద్), రాజేశ్ నందన్ రెడ్డి కరకాల (అమెరికా), నరేందర్ రెడ్డి నూకల (అమెరికా), సుహీల్ చందా (అమెరికా), కిశోర్ రెడ్డి జి (అమెరికా)లు విరాళం ఇవ్వడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రాలకు రూ.3 లక్షలు, ప్రాథమిక తరగతి గదులలో 25 డ్యూయల్ బెంచిలకు రూ.లక్ష, డిజిటల్ తరగతి గదులకు రూ.లక్ష, ఆరోగ్య ఉపకేంద్రానికి లక్ష రూపాయల చొప్పున ఆ దాతలు విరాళం అందించి తమ వంతు సేవ చేశారు. చిన్నఆముదాలపాడు గ్రామసర్పంచ్ కవిత, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, నేతలు పాఠశాలను సందర్శించారు. లక్షల్లో నిధులు అందించి పలు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఆటాకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నేతలతో పాటు ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, ఉపాధ్యక్షుడు పరమేశ్ భీమ్రెడ్డి, బోర్డు ట్రస్ట్ సభ్యులు అనిల్ బొడిరెడ్డి, పి.వేణు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీదర్ రెడ్డి, అంతర్జాతీయ సమన్వయకర్త కాశీ, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి, తదితరులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. -
సీఎంగా ఉత్తమ్.. హోంమంత్రిగా హరీశ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉత్తమ్, అదే కేబినెట్లో హోంమంత్రిగా హరీశ్రావు ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, సభలో తనను హరీశ్రావు కలిస్తే ఇదే విషయం చెప్పానని సంపత్ వెల్లడించారు. ‘ఈ రోజు కూడా హరీశ్రావు నా దగ్గరకు వచ్చిండు. దొరా నిన్న నాతో మాట్లాడితే, ఈ రోజు పేపర్లలో వచ్చింది. ఈ రోజు కూడా మాట్లాడితే రేపు మళ్లీ వస్తదని హరీశ్తో చెప్పిన’అని వివరించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఉత్తమ్ సీఎం అవుతారని, అదే కేబినెట్లో హోంమంత్రిగా ఉంటావని హరీశ్తోనే చెప్పినట్టుగా సంపత్ తెలిపారు. -
'నారాయణ' లో లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు. ఆయనిక్కడ మంగళవారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ.. నారాయణ కాలేజీల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. యాజమాన్యంపై ఉద్యోగిని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నారాయణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య గాడిన పడిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థల్లో ప్రవేశాలు పొంది ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని చెప్పారు. వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ అవకాశాలు రాని విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని తెలిపారు. కొన్ని ప్రత్యేక విద్యాసంస్థల్లో నేరుగా వెళ్లి ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో చదువుతున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు వస్తున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
ఆ ఎమ్మెల్యేతో హరీశ్ మంతనాలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్తో మంత్రి హరీశ్రావు దాదాపు 20 నిమిషాలకుపైగా మంతనాలు జరిపారు. శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే సంపత్కుమార్ను సభలో సోమవారం పక్కకు తీసుకెళ్లి తమ పార్టీలో చేరాలని హరీశ్ ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీలోనూ, ప్రజల్లోనూ పార్టీ పనితీరుపై అసంతృప్తి ఉన్నట్టుగా బహిరంగంగానే మాట్లాడిన సంపత్కుమార్తో మంత్రి హరీష్రావు చర్చించడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. అయితే గత కొంతకాలంగా మంత్రి హరీష్రావుతో ఎమ్మెల్యే సంపత్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతోంది. ఈ సమయంలోనే ఏకంగా శాసనసభలోనే సంపత్ కుమార్తో హరీష్రావు ప్రత్యేక భేటీ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీకి చెందిన ముఖ్యనేత రేవంత్రెడ్డి కాంగ్రెస్పార్టీలో చేరడంతో, దీనికి అడ్డుకట్ట వేసేవిధంగా కాంగ్రెస్పార్టీకి చెందిన సంపత్కుమార్ను టీఆర్ఎస్లోకి తీసుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే హరీష్రావు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. -
చాలా అసంతృప్తిగా ఉన్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ పనితీరుపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అసెంబ్లీ లాబీలో గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘అసెంబ్లీలో సీఎల్పీ పనితీరు, బయట పార్టీ వ్యవహార శైలిపై నాకు చాలా అసంతృప్తిగా ఉంది. పార్టీ బాగుంటేనే నేను బాగుంటా. కార్యకర్తగా ప్రస్తుత పరిస్థితిపై మధనపడుతున్నా’ అని సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి కూడా మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 2024 వరకు నియోజకవర్గాల పెంపు సాధ్యంకాదన్నారు. ఒకవేళ పెంచాలనుకుంటే చట్టసవరణ చేయాలని పేర్కొన్నారు. -
‘చలో అసెంబ్లీ’లో హింసకు కేసీఆర్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని హింసాయుతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, మంత్రి హరీశ్రావు కుట్ర చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ సంపత్కుమార్, కార్యదర్శి టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నిరసనలో ఏదైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదదంటున్నారంటే.. టీఆర్ఎస్ కుట్రకు పాల్పడబోతోందని అర్థమవుతోందన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో వారు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన చేస్తామంటే మంత్రి హరీశ్ బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని, గూండాలను పెట్టి అల్లర్లు సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. చలో అసెంబ్లీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఎంతమందిని అరెస్టు చేసినా కార్యక్రమం ఆగదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ విప్ సంపత్కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్లో సరుకు లేదంటున్న హరీశ్కు కాంగ్రెస్సే రాజకీయ భిక్ష పెట్టిందని, ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ను మంత్రి చేసిందన్నారు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని మంత్రి హరీశ్ను సంపత్కుమార్ హెచ్చరించారు. -
లక్షమంది కేసీఆర్లు కలిసినా ఏమీ చేయలేరు
సాక్షి, హైదరాబాద్: లక్షమంది కేసీఆర్లు కలిసినా ఉత్తముడైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని ఏమీ చేయలేరని ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై గొంతెత్తిన పీసీసీ అధ్యక్షుడిపై అనాలోచితంగా మాట్లాడటం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడ పోతోందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించలేకపోతోందని, వారిపై కక్షసాధిస్తోందని అన్నారు. అమరులకోసం జేఏసీ చైర్మన్ కోదండరాం యాత్ర చేపడితే ఆయనను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల కల్పనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పిస్తోందని మండిపడ్డారు. ఒక్క దళిత ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని సంపత్కుమార్ హెచ్చరించారు. -
దళితులపై చర్చంటే భయమెందుకు: సంపత్
సాక్షి, హైదరాబాద్: దళిత సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఎందుకు భయపడు తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈటల విసిరిన సవాల్కు తాము స్పందించినా ఎందుకు వెనుకంజ వేస్తు న్నారో చెప్పాలన్నారు. దళిత సీఎం పేరుతో మొదలైన కేసీఆర్ మోసం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. టీఆర్ఎస్ది దళిత వ్యతిరేక ప్రభుత్వమన్నారు. దీనిని లెక్కలు, ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. ఆత్మాభి మానం ఉన్న దళిత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలన్నారు. -
'ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలి'
సాక్షి, హైదరాబాద్: దళితుల సంక్షేమంపై మంత్రి ఈటెల రాజేందర్ విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ సర్కార్ దళిత వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. దళితుల సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆత్మాభిమానం ఉన్న దళిత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. దళిత సీఎం పేరుతో మొదలైన కేసీఆర్ మోసం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్మెంట్పై దళితులకు మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు. -
దొర గడీలో దళితుల సంక్షేమం బందీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధి ఈ మూడేళ్లలో దొర గడీలో బందీ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. గురువారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి నిధులెన్ని కేటాయించారు, ఎంత ఖర్చుచేశారో ప్రజల్లోనే తేల్చడానికి సిద్ధమన్నారు. ఈటల రాజేందర్ వచ్చినా, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా చర్చకు సిద్ధమేనని సంపత్కుమార్ సవాల్ చేశారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం, స్థలం కూడా టీఆర్ఎస్ వాళ్లే నిర్ణయించాలన్నారు. మంత్రి ఈటల రాజేందర్కు దమ్ము, ధైర్యం ఉంటే మూడు రోజుల్లో తేదీ, స్థలం, సమయం ప్రకటించాలని సంపత్కుమార్ సవాల్ చేశారు. -
ఈటెలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల సవాల్ను స్వీకరిస్తున్నానని తెలిపారు. దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. నిధులెన్ని కేటాయించారు.. ఎంత ఖర్చు చేశారన్న దాని పై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈటెల వచ్చినా సరే.. సీఎం వచ్చినా సరే.. సమయం, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి.. ప్రగతి భవన్ అయినా, ఫామ్ హౌస్ అయినా.. లేదంటే గన్ పార్క్ అయినా ఓకే.. నేను రెడీగా ఉన్నానని బాలకృష్ణ సినిమా తరహాలో డైలాగ్ విసిరారు. దళిత సంక్షేమం టీఆర్ఎస్ పాలనలో దొర గడీలో బందీ అయిందన్నారు. అంకెలతో సహా నిరూపిస్తా.. దమ్ము , దైర్యం ఉంటే.. మూడు రోజుల్లో ఈటెల టైమ్, ప్లేస్ ప్రకటించాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని.. టీఆర్ఎస్లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కేసీఆర్ మాటలు విని జాతికి ద్రోహం చేయవద్దని కోరారు. దళిత పౌరుషాన్ని చంపవద్దని విజ్ఞప్తి చేశారు. -
మీరాకుమార్కు టీఆర్ఎస్ ఓట్లు: సంపత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మీరాకుమార్కు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేయనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే 38 మంది ప్రజాప్రతినిధులు మీరాకుమార్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, వీరిలో టీఆర్ఎస్ వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ మీరాకుమార్ లోక్సభ స్పీకరుగా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో చేసిన కృషిని మరిచిపోలేమన్నారు. ఇప్పటికైనా యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను చేతులెత్తి కోరుతున్నట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాళ్ల వద్ద తాకట్టుపెడుతున్న కేసీఆర్ తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటçపడడానికే కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మీరాకుమార్కు మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణలో 90 శాతం మంది ఆత్మప్రభోదానుసారం మీరాకుమార్కు ఓటు వేస్తారని చెప్పారు. మూడేళ్లుగా కేసీఆర్ కుటుంబసభ్యులైన నలుగురి కబంధహస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛగా ఓటువేయడానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారని సంపత్కుమార్ పేర్కొన్నారు. -
స్వైపింగ్’లో అదనపు రుసుం వసూలు చేయొద్దు
► రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి సంపత్కుమార్ నస్పూర్: దుకాణదారులు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన మొత్తానికే స్వైపింగ్ ద్వారా డబ్బు తీసుకోవాలని అదనంగా వసూలు చేయొద్దని రాష్ట్ర వినియోగదారుల సంఘాల రీజినల్ కార్యదర్శి, సంఘమిత్ర వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి పి.సంపత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్లో విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలో కొందరు వ్యాపారులు డిజిటల్ బ్యాంక్ కార్డు ఉపయోగించుకొని వినియోగదారుడు కొనుగోలు చేసినప్పుడు బిల్లుపై అదనంగా కొంత రుసుము వసూళ్లు చేస్తున్నారన్నారు. వినియోగదారుడి నుంచి అదనపు రుసుం వసూళు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. బిల్లుపై అదనంగా వసూళు చేయడాన్ని నిలిపేయాలని లేని పక్షంలో వినియోగదారుల చట్టాన్ని ఆశ్రయిస్తామన్నారు. దీనిపై కలెక్టర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి గోసిక మల్లేశ్, మంచిర్యాల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కమల్, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. -
కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019లో కాంగ్రెస్ అనే సబ్బుతో కడుగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసి, ఎన్ని డబ్బులు గుంజారనేదానిపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమన్న కేటీఆర్ మాటలు అహంకారపూరితమని, అధికారం శాశ్వతం అనుకుని కళ్లు నెత్తికెక్కించుకుని ఆయన మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారం, కేసీఆర్ కు సీఎం, కేటీఆర్కు మంత్రి పదవి కాంగ్రెస్ భిక్ష అనే విషయం మరిచిపోవద్దన్నారు. అమెరికాలో రూ.4లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదు లుకుని ఇప్పుడు రూ.4వేల కోట్లు సంపాదించిన చరిత్ర కేటీఆర్దన్నారు. అదుర్స్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించి, పెద్దమొత్తంలో సొమ్ము ముట్టాక ఊరుకున్నారని ఆరోపించారు. -
‘జానా’ తీరుపై సంపత్ నిరసన
నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరు ♦ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి ♦ తాను మాట్లాడతానన్నా జానారెడ్డి పట్టించుకోలేదని కినుక ♦ వంశీకే మైక్ ఇప్పించడానికి ప్రయత్నించారని ఆరోపణ ♦ ప్రభుత్వం కూడా అవకాశం రాకుండా కుట్ర పన్నిందని ధ్వజం ♦ కాంగ్రెస్ శాసనసభాపక్షం అండగా నిలవకపోవడంపై ఆవేదన సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్కుమార్ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత జానారెడ్డి తనకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, దానిలోని లోతుపాతులపై అధ్యయనం చేశానని, తనకు అవగాహన ఉందని, అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యా య మని అన్నారు. కాంగ్రెస్కే చెందిన వంశీచంద్ రెడ్డికి మైక్ ఇప్పించడానికి జానారెడ్డి పదేపదే ప్రయత్నం చేశారని సంపత్కుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తి చూపానని, దాంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం రాకూడదని ప్రభుత్వం కుట్ర చేసిందని, ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారని ఆరోపించారు. అభివృద్ధి నిధిపై సబ్కమిటీలో సభ్యునిగా ఉన్న తనకు అవకాశం రాకపోతే కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సంపత్ అన్నారు. అన్ని పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయన్నారు. కాంగ్రెస్పార్టీ హయాం లోనే దళితులకు మేలు జరిగిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలును శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చిన తమ పార్టీ సభ్యులు కూడా సరిగా చెప్పలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రచేస్తే, దళిత బిడ్డగా తనకు కాంగ్రెస్ సభ్యులు అండగా ఉండకపోవడంతో రాత్రంతా తీవ్ర ఆవేదన చెందినట్టుగా సంపత్కుమార్ వెల్లడించారు. సీనియర్ల బుజ్జగింపులు నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చిన సంపత్ కుమార్ను కాంగ్రెస్పార్టీ సీనియర్ ఎమ్మె ల్యేలు పలువురు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరులు ఆయనకు నచ్చ జెప్పారు. సంపత్కుమార్తో మాట్లాడటానికి జానారెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చారు. సంపత్ కోసం సీఎల్పీ కార్యాలయం ఎదుట జానారెడ్డి కొంతసేపు వేచిచూశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పినా సంపత్ పట్టించుకోలేదు. ఇప్పుడు జానారెడ్డితో మాట్లాడేదీ ఏమీ లేదని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడతానని బెట్టు చేశారు. దీంతో జానారెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంపత్ శాసనసభలో జరిగిన అంశాలపై తనకు ఆవేదన ఉందని. అన్ని విషయాలను అంత ర్గతంగానే చెప్పుకునేందుకు సీఎల్పీ సమా వేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరుతారా? టీఆర్ఎస్లోని ఓ ప్రముఖ నేతతో సంపత్ టచ్లో ఉన్నారని, ఆ పార్టీలో చేరడానికి వ్యూహంలో భాగంగానే నల్లకండువాతో సభకు వచ్చి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సంపత్కుమార్ టీఆర్ఎస్లో చేరడానికి సదరు ప్రముఖ నేతతో ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. కాంగ్రెస్ దళి తులకు వ్యతిరేకం అన్న అపవాదు కలిగించే ప్రయత్నంలోనే సంపత్ కుమార్ ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడబోనని సంపత్కుమార్ చెప్పారు. తన కుటుంబం యావత్తు మొదటి నుంచి కాంగ్రెస్తోనే ఉన్నదని, భవిష్యత్లో కూడా తాను కాంగ్రెస్తోనే ఉంటానని ఆయన విస్పష్టంగా చెప్పారు. -
గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?
కేసీఆర్ ఇంటి ఇల్లాలితో సహా అధికారం కావాలి ⇒ మాయ మాటలతో మభ్యపెడుతున్నారు: సంపత్కుమార్ ⇒ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారపక్షం ⇒ వృత్తిని నమ్ముకున్న వాళ్లకే నిధులన్న మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘గొల్లోడు గొర్రెలు కాయా లి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. మా (కేసీఆర్) ఇంటి ఇల్లాలి తో సహా అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు’’అని కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దీంతో శుక్ర వారం శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. సంక్షే మ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడారు. కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు. ‘తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. మా ఆక్రందన, ఆర్తనాదాలు, కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. దళితుడిని సీఎం చేస్తానన్న గొప్ప మ నిషిని చూడలేదని సంబర పడ్డాం. కానీ మోసగిం చడంతో ఓర్చుకోవడం అలవాటైంది. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు. ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. మాయమాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?’ అని నిలదీశారు. టీఎస్ఐపాస్, టీప్రై డ్ అంటూ కేటీఆర్ పదేపదే చెప్పే మాటలతో చెవులు గిల్లుమంటున్నాయని వ్యాఖ్యానించా రు. గిరిజన, ఆదివాసీ, అంబేడ్కర్, పూలే భవ నాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రుణమాఫీకి ఎస్సీ,ఎస్టీ నిధుల మళ్లింపు ‘రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచే మళ్లించారు. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 26 శాతం ఉన్నా.. వారందరికీ భూములు లేవు. అందరూ రుణాలు తీసుకోలేదు..’’అని సంపత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. సంపత్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల బదులిచ్చారు. దేశమంతటా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు ఇలానే ఉందని, సబ్ప్లాన్ నిధులను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఖర్చు చేయడం సాంప్రదాయమని చెప్పారు. 30 లక్షల మంది ఎస్సీలకు ఒకేసారి భూములిస్తామని తాము ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని పేర్కొన్నారు. కుల వృత్తులకు నిధుల కేటాయింపుపై వివరణ ఇస్తూ.. గొప్పగా చదువుకున్నవాళ్లకు, వ్యాపారాలున్న వాళ్లకు నిధులివ్వబోమని.. వృత్తిని నమ్ముకుని బతికేవాళ్లకే ఇస్తామని ఈటల చెప్పారు. కుల వృత్తుల వారిని తక్కువ చేసి చూడవద్దని, మాట్లాడవద్దని సూచించారు. కొత్త సభ్యుడైన సంపత్కు అనుభవం, సంయమనం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా సంపత్ మాటల నుంచి సారాన్ని తీసుకుని సమాధానం ఇవ్వాలని విపక్షనేత కె.జానారెడ్డి సర్దిచెప్పారు. గృహ నిర్మాణం అస్తవ్యస్తం రాష్ట్రంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని, పూర్తిగా ఎత్తేసినట్లు కనిపిస్తోందని సంపత్కుమార్ వ్యాఖ్యానించారు. విచారణ పేరిట 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, ఐడీహెచ్ కాలనీల్లో కట్టిన 1,400 డబుల్ ఇళ్లను ప్రభుత్వం గొప్పగా చూపించుకుంటోందని.. డబుల్ ఇళ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రమే చేపట్టారని విమర్శించారు. -
‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ మరోసారి దీక్షకు దిగాడు. అతడు శుక్రవారం ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తమకు నష్టం వచ్చిందని, దీనిపై నిర్మాత శరత్ మరార్... కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కాటమరాయుడు చిత్ర హక్కులను తక్కువ ధరకు ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చారని సంపత్ అన్నారు. అయితే వేరే డిస్ట్రిబ్యూటర్కు అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్ ఆరోపించారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకూ తన దీక్ష విరమించేది లేదని సంపత్ కుమార్ స్పష్టం చేశాడు. కాగా ఈ నెల 24 న కాటమరాయుడు విడుదల కానున్న నేపథ్యంలో సంపత్ కుమార్ నిరాహార దీక్ష టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను సంపత్ కుమార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, పవన్ కల్యాణ్ శ్రీనివాస్ తనను కలవనివ్వడం లేదని గతంలో సంపత్ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఐటీఐ చదివి.. డాక్టర్ అయ్యాడు
గోదావరిఖని: ఐటీఐ చదువుకొని ఆ పై బంగారు నగల దుకాణంలో పనిచేసి అటునుంచి డాక్టర్ అవతారమెత్తాడో ప్రబుద్ధుడు. నేచురోపతి పేరుతో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని అమాయకుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఓ నకిలీ డాక్టర్ ఆట కట్టించారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న సంపత్కుమార్ ఐటీఐ చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం కాగజ్నగర్లోని ఓ గోల్డ్ షాపులో కూలీగా పని చేశాడు. అక్కడి నుంచి మెరుగైన జీవనం కోసం హైదరాబాద్ చేరుకొని ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాధించాలనే కాంక్షతో.. నేచురోపతి నకిలీ సర్టిఫికెట్ సంపాదించి మార్కండేయ కాలనీలో ఆయుర్వేదిక్ క్లినిక్ తెరిచాడు. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇతని వ్యవహారం పై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్తో క్లినిక్ పై దాడులు నిర్వహించిన పోలీసులు సంపత్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
కాలిబాటలతో బహుళ ప్రయోజనాలు
అనంతపురం అగ్రికల్చర్ : వరినారు నాటే సమయంలో పొలంలో కాలిబాటలు తీయడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్ తెలిపారు. లేత పైరు, కాలిబాటలు వంటి వాటితో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అనుకున్న పంట దిగుబడులు సాధించవచ్చన్నారు. ముందస్తు చర్యలు : నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదును చేసుకోవాలి. పశువుల ఎరులు, ఇతరత్రా ఆకులు లాంటివి మురగబెట్టినా, లేదంటే జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ల పైర్లు వేసి పూతకు రాకమునుపే పొలంలో కలియదున్నడం వల్ల భూసారం బాగా పెరుగుతుంది. నాట్లు : నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి. చదరానికి 33 మూనలు ఉండేలా నాటుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. కాలిబాటలు తీసుకోవడం ప్రతి రైతూ చేసుకోవాలి. భూసారం అధికంగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి. ఎరువులు : ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి. కలుపు నివారణ : నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్ బుటాక్లోర్ లేదా అర లీటర్ ప్రెటిటాక్లోర్ లేదా అర లీటర్ అలిలోఫాస్ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్సల్యురాన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్సల్ఫేట్ లీటరు నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయం
-
‘సుప్రీం’ ఆదేశించినా స్పందించలేదు: సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందిచకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈనెల 8లోపు చెప్పాలని సుప్రీంకోర్టు.. శాసనసభ స్పీకర్ను ఆదేశించినట్లు తెలిపారు. అరుుతే ప్రభుత్వం మాత్రం సుప్రీం ఆదేశాలపై ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు. రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఇది తెలియజేస్తోందని ఆరోపించారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
ఎమ్మెల్యేల పై అనర్హతా వేటు వేయాలి
-
ఫిరాయింపుల కోసం ప్రజల సొమ్ము
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును ప్రభుత్వం పంచిపెడుతోందని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. జీఓ 59 కింద రూ. 45 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారని ఆరోపించారు. ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలకు అధికారులు సహకరించవద్దని సంపత్ కోరారు. ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు సర్వేలను ప్రచారంలో పెడుతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, భ్రమల్లో పెట్టడానికి తెచ్చిన సర్వేలను ప్రజలు నమ్మరని సంపత్ చెప్పారు. -
జాతీయ సమైక్యతకు ఆర్ఎస్ఎస్ పునాది
- బీడీఎల్ సీనియర్ సైంటిస్ట్ సంపత్ కుమార్ హైదరాబాద్: దేశవ్యాప్తంగా హిందువులందరినీ ప్రాంతాలకతీతంగా సంఘటిత పరిచి, జాతీయ సమైక్యతకు ఆర్ఎస్ఎస్ పునాదిగా నిలిచిందని బీడీఎల్ సీనియర్ సైంటిస్ట్ ఎన్.సంపత్ కుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ నెహ్రూనగర్ ప్లే గ్రౌండ్సలో విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంపత్కుమార్ మాట్లాడుతూ భారతదేశాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ లక్ష ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ దేశంలో మార్పు కోసమేనని అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించడంలో ఆర్ఎస్ఎస్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. భారత్ను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. భారత సైన్యానికి యావత్ యువత అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా కాచిగూడ, బర్కత్పుర, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి, బర్కత్పుర భాగ్ సంఘచాలక్ రావి రామలింగారెడ్డి, సురేశ్ మంజునాథ్, డీఆర్ఎస్ నరేంద్ర, కన్నె రమేశ్ యాదవ్, ఎ.సూర్యప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు. -
ఇప్పుడే అనుకూలం
→ సమగ్ర యాజమాన్య పద్ధతులపై దష్టి సారించాలి → డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్ అనంతపురం అగ్రికల్చర్ : రబీలో ప్రధాన lపంటగా పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెలంతా అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లు, నల్లరేగడి భూములున్న ఇతర ప్రాంతాల్లో కూడా పంట వేసుకోవచ్చన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. పప్పుశనగ సాగు గురించి : జిల్లాలో ఉన్న నల్లరేగడి నేలలు తక్కువ లోతు, నీటిని నిలుపుకునే శక్తి తక్కువగా ఉన్నాయి. మంచి పదునులో విత్తుకోవాలి. ఒక వేళ బెట్ట పరిస్థితులు ఏర్పడితే 30 నుంచి 35 రోజుల సమయంలోనూ, 55 నుంచి 60 రోజుల సమయంలో అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకుంటే పంట దిగుబడులకు ఢోకా ఉండదు. స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకోవాలి. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవాలి. ఆలస్యంగా వేస్తే చివరి దశలో బెట్ట ఏర్పడటం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. జేజీ–11, నంద్యాల శనగ–1, ఎన్బీఈజీ–47, 49 విత్తన రకాలు అనువైనవి. చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. యాజమాన్యం : ఎకరాకు గింజలు మధ్యస్థంగా ఉంటే 30 నుంచి 35 కిలోలు, లావుగా ఉంటే 45 నుంచి 50 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 1.5 గ్రాములు టిబుకొనజోల్తో తప్పనిసరిగా విత్తనశుద్ధి పాటించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 18 కిలోలు యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్పాస్ఫేట్ వేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. -
ప్రత్యామ్నాయమే మార్గం
చినుకు పడితే జొన్న, సజ్జ, అలసంద, పెసర, కొర్ర సాగుకు అనుకూలం ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డి.సంపత్కుమార్ సూచన అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటల సాగుకు గడువు ముగియడంతో ఇక ప్రత్యామ్నాయ పంటలే మార్గమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షం వస్తే పొలాలు బీళ్లుగా ఉంచకుండా జొన్న, కొర్ర, సజ్జ, అలసంద, పెసర లాంటి పంటల సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. జొన్న : ఎస్వీ–1, పాలెం–2, సీఎస్వీ–10, సీఎస్వీ–11, సీఎస్వీ–15, ఎన్టీజే–1, 2, 3, ఎన్–13, 14, ఎస్వీ–56 సూటి రకాలు అనువైనవి. అలాగే హైబ్రీడ్ రకాలైన సీఎస్హెచ్–10, సీఎస్హెచ్–11, సీయస్హెచ్–16, సీఎస్హెచ్–18, సీఎస్హెచ్–21 అనువుగా ఉంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు. విత్తే ముందు 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ) అంటే ఒకటిన్నర అడుగు, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. సజ్జ : సజ్జలో అధిక దిగుబడి ఇచ్చే సూటి లేదా కాంపోజిట్ రకాలైన ఐసీటీపీ–8203, ఐసీఎంవీ–221, రాజ్–171 అనువుగా ఉంటాయి. హైబ్రీడ్ రకాలైన హెచ్హెచ్బీ–67, ఐసీఎంహెచ్–356, ఆర్హెచ్బీ–121, జీహెచ్బీ–538, పీహెచ్బీ–3 అనువుగా ఉంటాయి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు 2 శాతం (20 గ్రాములు ఒక లీటర్ నీటికి) ఉప్పు ద్రావణంలో ముంచాలి. ఇలా చేయడం వల్ల ‘ఎర్గాట్’ అనే శిలీంద్ర అవశేషాలను వేరుచేయవచ్చు. అరిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. కొర్ర : కోతకు 80 నుంచి 85 రోజుల్లో వచ్చే కొర్ర రకాలైన కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, ఎస్ఐఏ–3085 రకాలు అనువుగా ఉంటాయి. అలాగే 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వచ్చే ప్రసాద్, సూర్యనంది (ఎస్ఐఏ–3088). సూర్యనంది రకం తక్కువ సమయంలో కోతకు రావడమే కాకుండా అధిక దిగుబడులు (ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు) సామర్థ్యం కలిగిన రకం. సాళ్లలో విత్తితే ఎకరాకు 2 కిలోలు, వెదజల్లే పద్ధతికి అయితే 4 కిలోలు అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాములు కార్బండిజమ్తో విత్తనశుద్ధి చేయాలి. సాళ్ల మధ్య 25 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి. అలసంద : తక్కువ పంటకాలం కలిగిన పశుగ్రాసం, పచ్చికాయ, గింజలకు ఉపయోగపడే వర్షాధారపు పప్పుజాతి పంట. కో–702, జీసీ–3, కో–4 రకాలు అనువైనవి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య 30 నుంచి 45 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి. పెసర : పెసర పంట వేసే రైతులు పల్లాకుతెగులు (ఎల్లోమొజాయిక్ వైరస్) సోకకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. విత్తేముందు కాన్ఫిడార్తో విత్తనశుద్ధి చేయడం వల్ల రసంపీల్చు పురుగులు ముఖ్యంగా తెల్లదోమను అరికట్టవచ్చు. పొలం చుట్టూ జొన్న, సజ్జ పంటలను నాలుగైదు వరుసలు మేరసాళ్లుగానూ లేదా అంతర పంటలుగా వేసుకున్నా ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు. మొలకెత్తిన 10 రోజుల తర్వాత రెండు మూడు సార్లు వేపనూనే పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బేస్తవారిపేట మండలకేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తూ సిమెంటు లారీ వెనక టైరు కిందపడ్డారు. ఈ ఘటనలో మోక్షగుండం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులు తెస్తూ...కమీషన్లు దండుకుంటున్నారు
హైదరాబాద్: వేల కోట్ల రూపాయలను అప్పులుగా తెస్తూ...వందల కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లగా దండుకుంటున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డికె అరుణ, ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రెండేళ్ళలో రాష్ర్టం అభివృద్ది కోసం కానీ, ప్రజల కోసం గానీ చేసిందేమి లేదని ఉత్తమ్ అన్నారు. మహారాష్ర్టతో ఒప్పందం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఘనకార్యం సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం అన్యాయమని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడీకి తాము పూర్తి వ్యతిరేకమని .. ఆర్డీఎస్ ప్రాజెక్టును సీఎం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు జరిగినపుడు హరీష్ రావు ఎక్కడున్నారని ప్రశ్నించారు. మేము ఆర్డీఎస్ తూముల ధ్వంసంపై ఉద్యమాలు చేసిన సమయంలో ఇదే కేసీఆర్ వచ్చి మద్దతు ఇచ్చారని ఆ విషయాలను కేసీఆర్ను అడిగి హరీష్ తెలుసుకోవాలని సూచించారు. రాయలసీమ రైతులు అపోహలు పడుతున్నారని ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు అదనంగా నీరు రావని కేవలం కట్ట మాత్రమే బలోపేతం అవుతుందన్నారు. ఆర్డీఎస్ కోసం తాము చేసిన ఉద్యమాలను అవమానపరిచే విధంగా కొంగ జపం, దొంగ జపం అనడం పద్ధతి కాదని ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఉద్యమాలను అవమానపరిస్తే ప్రజల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నేతలు తెలుసుకోవాలని సూచించారు. ఆర్డీఎస్ పనుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చొరవ ఫలితంగానే కర్ణాటక ప్రభుత్వం స్పందించిందన్నారు. పాలమూరు జిల్లాకు ఒక్క టీఎంసీ నీరు విడుదల చేసినందుకు సీఎం సిద్ధరామయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో
- పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేపిన యువ దంపతుల ఆత్మహత్య కలిసి బతకలేమనుకున్నారో, చనిపోయి కలిసుందామనుకున్నారో.. పుణ్యక్షేత్రానికి వచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసున్నారు. చనిపోయే ముందు సెల్ఫీలు దిగి, 'మేం చనిపోతున్నాం..' అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తిరుమలలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సంపత్ కుమార్, సత్యవాణి దంపతులు తిరుమలకు వచ్చి రాంభగీచా అతిథి గృహంలో 384వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం గదిని శుభ్రం చేసేందుకు సిబ్బంది వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. సంపత్ కుమార్ దంపతులు శవాలుగా కనిపించారు. ఒకే ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ తమిళనాడు దంపతులు చనిపోవడానికి ముందు సెల్ఫీలు దిగారు. 'మేం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం' అని చెబుతూ సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు.. గదిలో దొరికిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, బంధువులకు సమాచారం అందించారు. తిరుమలలో ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఆత్మహత్యా ఘటన ఇదే కావడం గమనార్హం. -
అరే ఇదేందన్నా.. ఆపి మరీ తిట్టించుకున్నా..
హైదరాబాద్: అసెంబ్లీలో రూల్సా.. రూల్స్ ప్రకారం సభ నడుస్తోందా అని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డిని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరూ పరస్పరం ఎదురుపడ్డారు. సంపత్ ను చూసిన జీవన్ రెడ్డి ఆపారు. ' ఇంత పెద్ద మనిషిని, పైగా రూల్స్ కమిటీ సభ్యుడిని ఎదురుపడ్డా పట్టించుకోకుండా పోతావా' అని సంపత్ ను ప్రశ్నించారు. ' మీ ప్రభుత్వంలో రూల్స్, చట్టాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా? మెజారిటీ ఏమనుకుంటే అవే రూల్స్. మైనారిటీలో ఉన్నవాళ్లు మౌనంగా ఉండాల్సిందే . అందుకే చప్పుడు చేయకుండా పోతన్నాం' అంటూ సంపత్ సరదాగా విమర్శించారు. అరే.. ఇదేందన్నా ఆపి మరీ తిట్టించుకున్నట్లయింది అని జీవన్ నవ్వూతూ వ్యాఖ్యానించారు. -
' వీడియో ఫుటేజ్ బయటపెట్టే దమ్ముందా'
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం అసెంబ్లీలో క్షమాపణ చెప్పారు. సభలో గందరగోళ పరిస్థితుల్లో జాతీయ గీతం వినిపించలేదని ఆయన అన్నారు. సభలో ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని అవమానించలేదని సంపత్ కుమార్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజున సభ కార్యక్రమాలు సజావుగా లేవన్నారు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు ముందుగా ప్రకటన చేయాలని.. చేశారా అని సంపత్ ప్రశ్నించారు. జాతీయ గీతం ఒక్క టీఆర్ఎస్ పార్టీది కాదని, 121 కోట్ల మంది భారతీయులదన్నారు. జాతీయ గీతాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవద్దని సంపత్ కుమార్ సూచించారు. అధికార పక్షం వివరణ ఇస్తే సరిపోతుందని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నామన్నారు. అధికార పక్షానికి దమ్ముంటే వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని సంపత్ కుమార్ సవాల్ చేశారు. సభ హుందాతనాన్ని కాపాడేందుకే తాను క్షమాపణ చెప్పానన్నారు. పొరపాటున జరిగిన తప్పుకు చింతిస్తున్నానని సంపత్ కుమార్ తెలిపారు. ఎవరు గొడవపడ్డారో పూర్తి ఫుటేజ్ చూపించి వాస్తవాలు బయటపెట్టాలన్నారు.