Siddaramaiah
-
వక్ఫ్ భూముల వివాదం.. రైతులకు జారీ చేసిన నోటీసులు వెనక్కి: సీఎం ఆదేశం
బెంగళూరు: వక్ఫ్ భూముల వివాదంలో రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక మఖ్యమత్రి సిద్దరామయ్య శనివారం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.‘వక్ఫ్ ఆస్తులతో ముడిపడిన భూ రికార్డులకు సంబంధించి రైతులకు అందించిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని డిప్యూటీ కమిషనర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన పేర్కొన్నారు’ అని సీఎంఓ కార్యాలయం తెలిపింది.కాగా విజయపుర జిల్లాకు చెందిన పలువురు రైతులకు తమ భూములు వక్ఫ్ ఆధీనంలోకి వస్తాయని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2022 మధ్య విజయపుర జిల్లాలోని రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఇటీవల సిద్ధరామయ్య స్పందించి.. రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు.50 ఏళ్ల క్రితమే తమ పేరిట కొన్ని భూములు రిజిస్టర్ అయినట్లు వక్ఫ్ బోర్డు పేర్కొందని, అయితే, ఏదైనా క్లెయిమ్లు చెల్లుబాటు కావాలంటే వక్ఫ్, రెవెన్యూ రికార్డులు తప్పనిసరిగా సమలేఖనం చేయాలని ర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. లేకుంటే రెవెన్యూ రికార్డులకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. -
సీఎం సిద్దరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు.
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మైసూర్లోని ముడా కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేసింది. దీంతోపాటు మైసూరులోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ముడా చీఫ్గా కే మరి గౌడ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు చేపట్టింది. అయితే ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అధికారులందరినీ ఏజెన్సీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా సీనియర్ అధికారులు, ప్రత్యేక భూసేకరణ కార్యాలయానికి చెందిన సిబ్బందితో ఈడీ అధికారులు సమావేశం అయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.కాగా సీఎం భార్య బీఎం పార్వతికి విజయనగర్లోని అప్మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు. -
Muda Scam: సీఎం సిద్ధరామయ్యపై విచారణ.. ముడా ఛైర్మన్ రాజీనామా
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా విజయనగర్లోని అప్మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని తన భార్యకు అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.ఇదిలా ఉండగాా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. -
సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది.ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. తద్వారా.. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం దక్కినట్లయ్యింది.ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, కర్ణాటక గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. అయితే కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. -
సీబీఐ విచారణ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. -
విచారణకు భయపడను: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా స్కామ్పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
కోర్టులపై నమ్మకం ఉంది, త్వరలోనే నిజాలు బయటకు: సిద్దరామయ్య
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ విషయంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్ను తాజాగా కోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్ నాకు అండగా నిలిచింది. నా పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించాయి. నేను పేదల పక్షాన ఉన్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు బీజేపీ, జేడీఎస్లు నాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుతున్నాయి’ అని మండిపడ్డారు.అయితే తనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంపై చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ నిపుణలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 17A కింద విచారణ రద్దు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.‘ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు. వారి ఆశీస్సులే నాకు రక్షణ. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతాను. ఈ పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుంది. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం. బీజేపీ, జేడీఎస్ల ఈ ప్రతీకార రాజకీయాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.మరోవైపు సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేతలు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు. తమ బాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన 100శాత స్వచ్చమైన సీఎం అని ప్రకటించారు. శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము సీఎంకు అండగా ఉంటాం. ఆయనకు మద్దతు ఇస్తాం. ఆయన ఎల్లప్పుడు రాష్ట్రం, పార్టీ కోసం మంచి పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇక కోర్టు తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తం అవ్వనుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయిందని.. ఇక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ’ అని కన్నడలో బీజేపీ పోస్టు చేసింది. -
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
కర్ణాటక పాలిటిక్స్లో ట్విస్ట్.. ఇప్పుడు కుమారస్వామి వంతు!
బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్భవన్కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్ఎస్వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్భవన్కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్భవన్కు నివేదిక వెళ్లింది. అయితే.. గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్నిరాని, జీ జనార్ధన్రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే.. కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కామ్లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
సీఎం సిద్దరామయ్య అమాయకుడు: డీకే
బెంగళూరు: మైసూరు నగర అభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు.కాగా ముడా భూముల కేటాయింపులో అవకతవకలపై సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. దీనిపై తాజాగా శివకుమార్ మాట్లాడుతూ.. సిద్దరామయ్య అమాయకుడని, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టమే ముఖ్యమంత్రిని కాపాడుతుందని, ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇది పూర్తిగా బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అది హైకమాండ్ నిర్ణయమని తెలిపారు.ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు డీకే వెల్లడించారు.. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోని, ఆ ఆర్డర్ను వెనక్కి తీసుకునేలా గవర్నర్తో మాట్లాడాలని రాష్ట్రపతి ముర్మును కోరినట్లు తెలిపారు.కాగా గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. -
MUDA Scam: హైకోర్టులో సిద్దరామయ్యకు ఊరట..
బెంగళూరు: తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్దమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టుకు తెలిపారు.వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్ను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిరోధించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు.సీఎంకు ఊరటముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిస్తూ, ఆరోపించిన ముడా కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు, హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు జరగదు.అంతకముందు సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులోనూ చేయనని అన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్లు కుట్ర పన్నాయని మండిపడ్డారు. -
కేంద్రం కుట్రపై న్యాయపోరాటం చేస్తాం: సిద్ధరామయ్య
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రజాస్వామమ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది. అందుకు గవర్నర్ థావర్ను పావుగా వాడుకుంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.Bengaluru | On Karnataka Governor granting permission to prosecute him in the alleged MUDA scam, CM Siddaramaiah says, "We have called an urgent cabinet meeting today. I thank DK Shivakumar and all my ministers. Congress party also stands with me. Congress workers are also… pic.twitter.com/z4GIw7ZWSa— ANI (@ANI) August 17, 2024చదవండి: MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కుట్రే ఇది’ -
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్ చేసిన సీఎం
ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మెనేజ్మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్దాస్ పాయ్ ఎక్స్లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్ఎ్ససీ సర్టిఫికెట్ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. -
ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
బీజేపీ మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసింది: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయలు చెప్పటం వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు బదలు.. ఎన్నికల తర్వాత సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
సీఎం సిద్ధరామయ్య ర్యాలీలో తుపాకీతో హల్చల్
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలో పాల్గొన్న లోక్సభ ఎన్నికల ర్యాలీ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకొని సీఎం ప్రచార ర్యాలీ వాహనంపైకి ఎక్కి హల్చల్ చేశాడు. బెంగళూరులో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రచార ర్యాలీలో ఒక చోట ప్రచారం వాహనంపైకి ఎక్కి ఆ వ్యక్తి మంత్రి రామలింగారెడ్డి, లోక్సభ అభర్థి సౌమ్యరెడ్డికి పూలమాలలు వేశాడు. ఆ పక్కనే సీఎం సిద్ధరామయ్య కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి పూలమాల వేస్తున్న సమయంలో అతని నడుముకు తుపాకీ ఉండటం అందరినీ భయాందోళనకు గురిచేసింది. Major security breach. The man with the katta onboard the same vehicle as Karnataka CM Siddaramiah is a congress worker. The gun wielding man garlanded the Transport Minister Ramalinga Reddy standing next to him. pic.twitter.com/OnyK4gWH7R — Sneha Mordani (@snehamordani) April 9, 2024 అయితే గన్ ధరించిన వ్యక్తిని రియాజ్గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుంటున్నాడని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్సెడ్ గన్లను సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సైతం గన్ పోలీసులకు అప్పగించకుండా మినహాయింపు పొందాడట. ‘బెంగళూరులోని విల్సన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంతో రియాజ్పై పలు దాడులు జరిగాయి. ఈ నేపథ్యలోనే ఆత్మ రక్షణ కోసం అతను గన్ వెంటపెట్టుకుంటున్నాడు. ఆ తుపాకీ సంబంధించిన లైసెన్స్ కూడా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ.. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని బీజేపీ దుయ్యబట్టింది. -
సిద్దరామయ్య కొడుకుపై బీజేపీ నేతలు ఫైర్: ఎందుకంటే?
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు 'యతీంద్ర సిద్ధరామయ్య' ప్రధానమంత్రి మోదీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీని, ఆయన ఇంటిని కించపరిచే పదజాలంతో దూషించారని పార్టీ నేతలు మండిపడ్డారు. చామరాజనగర జిల్లా హనూర్ పట్టణంలో జరిగిన పార్టీ సమావేశంలో యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపించింది. రాజకీయ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. హోం మంత్రి అమిత్ షాను 'గూండా' అని, ఆయన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. అంతే కాకుండా నేర చరిత్ర ఉన్న వారితో మోదీ సహవాసం చేస్తున్నారని ఆరోపించారు. యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సబబు కాదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. శాసనసభ్యుడిగా పనిచేసి.. ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయిన వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యతీంద్ర సిద్ధరామయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు. -
మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిద్దరామయ్య
ప్రధానమంత్రి కర్ణాటకలోని కలబురగి నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమైన ఎలక్టోరల్ బాండ్ స్కామ్ గురించి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని సీఎం సిద్దరామయ్య.. నరేంద్ర మోదీని ప్రశ్నించారు. సిద్ద రామయ్య తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఇలా పేర్కొన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని నిర్మూలిస్తానని వాగ్దానం చేసి దశాబ్దకాలం అవుతోంది. అయితే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కామ్ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఎందుకు వెనుకాడుతుందని సిద్ధరామయ్య ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పూర్తి సమాచారాన్ని అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎందుకు వెనుకాడుతోంది? ఎలక్టోరల్ బాండ్ల విక్రయం, కొనుగోలు చట్టబద్ధంగా జరిగి ఉంటే.. ఎస్బీఐ సమాచారాన్ని ఎందుకు దాచిపెడుతోంది? ఎస్బీఐపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? దీనిపైన నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు. వ్యాపారుల నుంచి విరాళాలు రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ వ్యాపారులపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, వారు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన తేదీలను పరిశీలిస్తే, ఇది స్పష్టమైన బ్లాక్మెయిల్ కేసుగా అనిపిస్తోందని సిద్ధరామయ్య అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన కంపెనీలు అందించే మౌలిక సదుపాయాలు, ఔషధాల నాణ్యతపై కూడా కర్ణాటక సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. Welcome to Karnataka, Prime Minister @narendramodi. Please answer why is @BJP4India silent about the electoral bond scam - the biggest corruption scandal in the world? For a decade, you held power, promising to bring back black money from Swiss Bank, eliminate black money via… — Siddaramaiah (@siddaramaiah) March 16, 2024 -
సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. ‘సినిమా ట్రైలర్పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్లో పేర్కొన్నారు. -
కర్నాటక సీఎంకు ‘సుప్రీం’లో ఊరట!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 2022లో జరిగిన నిరసనల్లో రోడ్డును బ్లాక్ చేశారంటూ సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఫిర్యాదుదారునికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాలకు ఈ నెల మొదట్లో కర్ణాటక హైకోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే వారంతా ప్రజాప్రతినిధి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళతే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి నివాసి. ఆయన ఉడిపిలోని ఓ హోటల్లో శవమై కనిపించాడు. తన కాంట్రాక్టు పనులలో నాటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత మంత్రి ఈశ్వరప్ప తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా సంతోష్ పాటిల్పై పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత పాటిల్ వాట్సాప్ మెసేజ్లో తన మరణానికి మంత్రి మంత్రి ఈశ్వరప్ప బాధ్యుడని పేర్కొన్న విషయం వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో 2022 ఏప్రిల్లో ఇదే కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటిని చుట్టుముట్టడంతోపాటు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. -
అయ్యో సిద్ధా.. మీడియా ముందు భంగపాటు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మీడియా ముందు భంగపాటు ఎదురైంది. బుధవారం ఓ నీటి ప్రాజెక్టు పనుల ప్రారంభం కోసం వెళ్లిన ఆయనకు అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పించింది. అయితే అక్కడ సంయమనం పాటించి మౌనంగా ఆయన.. తర్వాత చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బుధవారం పెరియాపట్నలో ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ముందు.. మోటర్ స్విచ్ ఆన్ చేయగా అది పని చేయలేదు. దీంతో ఆయన పక్క ముఖాలు చూశారు. అయినా పక్కనున్నవాళ్లు అదేం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టారు. అయితే.. అది పని చేయడం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఎంత ప్రయత్నించినా.. అది ఆన్ కాలేదు. చివరకు బటన్ ఫెయిల్ అయ్యిందని.. సాంకేతిక సమస్య తలెత్తిందని.. అందుకే అది పని చేయలేదని గుర్తించారు. అయితే ఆ కార్యక్రమం తర్వాత ఆయన సంబంధిత అధికారుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఉదయం చాముండేశ్వరీ ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్(సీఈఎస్సీ) ఎండీ సీఎన్శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ పీఎస్(ప్రిన్సిపల్ సెక్రెటరీ) ఉమాదేవి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. సౌకర్యాల రూపకల్పనలో విఫలం కావడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. Embarrassment For #Siddaramaiah Motor fails during project launch, #Karnataka CM seen pressing button repeatedly #Mysuru electricity board MD suspended After Humiliation for negligence@aayeshavarma | @KeypadGuerilla reports pic.twitter.com/vvecs6cWH7 — Mirror Now (@MirrorNow) January 25, 2024 Video Credits: Mirror Now -
కర్ణాటకలో మహారాష్ట్ర జోక్యం ఏంటి?
రాయచూరు రూరల్: కర్ణాటక సరిహద్దుల్లో మహారాష్ట్ర జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహారాష్ట్ర సర్కార్కు సూచించారు. బుధవారం బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా సైనిక పాఠశాలలో సంగొళ్లి రాయణ్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక సరిహద్దులోని 865 గ్రామాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయంపై ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. సైనిక పాఠశాలలో కన్నడిగులకు 65 శాతం, ఇతరులకు 35 శాతం సీట్లు కేటాయించామన్నారు. గుణాత్మక విద్యతో పాటు దేశభక్తిని పిల్లల్లో పెంచుతామన్నారు. సంగొళ్లి రాయణ్ణ జ్ఞాపకార్థం 110 ఎకరాల్లో ప్రభుత్వం నుంచి రాక్ పార్క్, వస్తు సంగ్రహాలయ నిర్మాణం చేపడుతామన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలుపొందితే ఐదేళ్లు సీఎంగా ఎవరు కొనసాగుతారో పార్టీ తీర్మానం చేస్తుందన్నారు. బ్రిటిష్లపై పోరాడిన నేత సంగొళ్లి రాయణ్ణ కాగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్దన్నారు. బీజేపీ చేసిందేం లేదు దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదని సీఎం ఆరోపించారు. రాయణ్ణను మోసంతో మన వాళ్లే బ్రిటిష్లకు అప్పగించారన్నారు. దేశ భక్తులంటే ప్రజలను ప్రేమించే వారన్నారు. నేడు బీజేపీ కులాలు, మతాల మధ్య ఘర్షణలు రాజేసిందని విమర్శించారు. బసవణ్ణ, అంబేడ్కర్లు కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరూ సమానమనే భావనలు కలిగిన వారన్నారు. మనిషి ద్వేషం వీడాలన్నారు. నేడు మసీదులు ధ్వంసం చేయమని సలహాలు ఇచ్చేవారున్నారన్నారు. సమాజంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో నైపుణ్యతను సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పంచ గ్యారెంటీలతో అందరికీ మేలు జరిగిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు సహజమన్నారు. వాటిని లెక్కచేయకుండా ఉచిత పథకాలను ప్రజలకు అందించడం తమ కర్తవ్యమన్నారు. ఉత్సవాల్లో స్వామీజీలు గురులింగ శివాచార్య, మడివాళ రాజయోగీంద్ర, నిరంజనానందపురి, మంత్రులు సతీష్ జార్కిహోళి, శివరాజ్ తంగడిగి, బైరతి సురేష్, శాసన సభ్యులు మేటి, అశోక్ పట్టణశెట్టి, మాజీ ఎమ్మెల్యేలు రేవణ్ణ, అంజలి నింబాళ్కర్, ప్రకాష్ హుక్కేరిలున్నారు. సీఎం సిద్దరామయ్య -
కంచ ఐలయ్య ‘మా జాతి సూర్యుడు’
సాక్షి, హైదరాబాద్: కంచ ఐలయ్య షెఫర్డ్ తమ జాతి సూర్యుడని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ కనకపీఠంలో శనివారం సీఎం సిద్ధరామయ్య ‘మా జాతి సూర్యుడు’అవార్డును ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్కు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, కులాధిపత్య అసమాన సమాజంలో ఆయన తరహా వ్యక్తుల అవసరం ఎంతో ఉందన్నారు. ఆయన బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ‘వై ఐయామ్ నాట్ ఏ హిందు’, ‘బఫెల్లో నేషనలిజం’.. తదితర రచనలు చేశారన్నారు. కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఆధునిక శూద్ర సమాజ పురోగతికి, సమసమాజ స్థాపనకు ఆయన రచనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లె పాపయ్యపేటలో, కురుమ కులంలో జన్మించిన ఐలయ్య షెపర్డ్ యావత్ భారతదేశం గరి్వంచే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమని ప్రశంసించారు. అందుకే ఆయనకు యావత్ కురుమ సమాజం తరపున ’మా జాతి సూర్యుడు’ అవార్డును అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐలయ్యకు కనక పీఠం పీఠాధిపతి శ్రీ సిద్ధ రామానంద మహాస్వామి తలపాగా తొడిగి రూ. 50 వేల నగదును బహూకరించారు. అనంతరం కంచ ఐలయ్య షెపర్డ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత బహుజనుల పిల్లలందరికీ ఆంగ్ల మీడియం పాఠశాలలు ప్రారంభించాలని, అగ్రకులాల పిల్లల చదువులకు బహుజనుల పిల్లలు ఏ మాత్రం తీసిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. జాతి సూర్యుడిగా అవార్డు అందజేసిన కనకపీఠానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుభా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేష్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు విప్లవ్, దాసరి శ్రీనివాస్, ఉస్మానియా విద్యార్థులు కొంగల పాండు, గురునాథ్, సురేందర్, దయ్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ ధర్మం వేరువేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హిందుత్వ సిద్ధాంతంపై (ఐడియాలజీ) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండా.. మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏం ఉండవని తెలిపారు. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువునే. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని పూజిస్తున్నారా? మన గ్రామాల్లో రామ మందిరాలు నిర్మించలేదా? మనం రాముడి భజనలు చేయలేదా? ' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయని, తమ గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరిగేవని సిద్ధరామయ్య తెలిపారు. ఆ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. కేవలం బీజేపీ వాళ్లే హిందువులా?.. మనం కాదా? అని మండిపడ్డారు. సిద్ధరామయ్య గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందువునని, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకినని చెప్పారు. హత్యలను ఏ మతం సమర్ధించదని, కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారని ఆరోపణలు చేశారు. తాను రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు, వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో హిందుత్వపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేత అశ్వత్ నారాయణ్ కైంటర్ ఇచ్చారు. సిద్దరామయ్య, కాంగ్రెస్కు భారత్/ హిందుత్వానికి సంబంధించిన అంశాలపై అసలు స్పష్టతే లేదని విమర్శించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. హిందూత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు Karnataka CM @siddaramaiah accuses BJP of "Fake Hindutva." Says, "Some people talk about soft Hindutva. Hindutva is Hindutva. Hindu and Hindutva are different. Haven’t we built Ram temples in our villages? Don’t we worship Rama? Aren’t we Hindus?” Siddaramaiah also pitches for… pic.twitter.com/RrkhHjVIF4 — Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 28, 2023 -
Hijab: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు :కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ నిషేదంపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడూతు సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో హిజాబ్పై మళ్లీ చర్చ స్టార్టైంది. తమ ప్రభుత్వం హిజాబ్పై నిషేదాన్ని ఇంత వరకు ఎత్తివేయలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. అసలు రాష్ట్రంలో హిజాబ్పై నిషేదమే లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్ను అనుమతించడం లేదని మిగిలిన చోట్ల అంతా మామూలేనని బొమ్మై అన్నారు. మరోపక్క హిజాబ్ నిషేదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్పై నిషేదం ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు. ఇంకా దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. ఇదీచదవండి..చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
కర్ణాటక: హిజాబ్ నిషేధం ఎత్తివేత
మైసూర్: హిజాబ్ ధరించిండంపై కర్ణాటక ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. హిజాబ్పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా శుక్రవారం ప్రకటించారు. మహిళలు వారికి ఏది నచ్చితే వాటిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్పై బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. ‘నేను ఎందుకు అడ్డుకోవాలి? మీ ఇష్టం మేరకు నచ్చినట్లు హిజాబ్ ధరించవచ్చు’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని పేర్కొంది. విద్యా సంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. చదవండి: ఆరు నెలల పాపకు కరోనా! అప్రమత్తమైన అధికారులు -
నకిలీ హామీలు.. నకిలీ నేతలు
సాక్షి, హైదరాబాద్: నకిలీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నకిలీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. డిసెంబర్ 9లోగా నెరవేరుస్తామన్న ఆరు గ్యారెంటీ ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని కల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినట్లుగా వైరల్ అవుతున్న వీడియోపై కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో స్పందించారు. తాజాగా తెలంగాణలో నూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా సిద్ధరామయ్య తరహాలోనే చెబుతుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ పోస్టుపై సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘బీజేపీ నకిలీ వీడియోలు సృష్టిస్తుంది. దానిని మీరు ప్రాచుర్యంలో పెడతారు. అందుకే బీజేపీకి బీఆర్ ఎస్ పార్టీ బీ టీమ్ అనేది..’అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కనీస అధ్యయనం చేసినట్టు లేదు: కేటీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీస అధ్యయనం కూడా చేసినట్టు లేదని కేటీఆర్ తొలుత ‘ఎక్స్’లో విమర్శించారు. ప్రజలను మోసగించేలా కాంగ్రెస్ అబద్ధపు హామీలి వ్వడం వల్లే తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నా రు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన రైతు భరోసా హామీ ఏమైందని నిలదీశారు. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ.4 వేల ఆసరా పింఛను, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు రూ.2,500 మాటేమిటని ప్రశ్నించా రు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నుంచి..వాటిపై ఎలాంటి ప్రకటన ఎందుకు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు నకిలీనా? లేక వారి మాటలు నకిలీనా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోను గుర్తించలేని స్థితిలో బీఆర్ఎస్: సిద్ధరామయ్య సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? కనీసం ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయరు కాబట్టి..’అంటూ విమర్శించారు. వైరల్ అయిన వీడియో నిజమైనది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా సృష్టించారని స్పష్టం చేశారు. ఫేక్, ఎడిటెడ్ వీడియోలను కూడా గుర్తించలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యే ప్రకటన అబద్ధమా?: కేటీఆర్ సిద్ధరామయ్య కౌంటర్పై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తిరిగి పోస్టు చేశారు. ‘కర్ణాటకలో మీరు ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని మీ సొంత పార్టీ ఎమ్మెల్యే సదాక్చరి చేసిన ప్రకటన అబద్ధమా? బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని మీ నాయకుడు రాహుల్ ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ఆ పార్టీ ముఖ్య నేతలను మేం ఓడించాం..’అని గుర్తుచేశారు. -
కేటీఆర్, సిద్ధరామయ్యల ట్వీట్ వార్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్య మంగళవారం ఎక్స్(ట్విటర్)లో మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం. అంత మాత్రానా అన్నీ ఫ్రీగా ఇస్తామా. అయినా మాకూ ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’ అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధారమయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. అయినా ఎన్నికల హామీలిచ్చేటపుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా..కనీసం మీకు నిజమేంటో..నకిలీ, ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు.ఇలాంటి ఫేక్, ఎడిటెడ్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంది. బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది’అని కేటీఆర్కు సిద్ధరామయ్య చురకంటించారు. No money to deliver poll promises/guarantees says Karnataka CM ! Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ? Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq — KTR (@KTRBRS) December 19, 2023 Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections? Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP. If you are… https://t.co/Ey5y9K3fLd — Siddaramaiah (@siddaramaiah) December 19, 2023 ఇదీచదవండి..బస్ భవన్ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం -
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్కుమార్యాదవ్కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు ‘బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు. మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్లోని తాజ్కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు. ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. -
డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్, మంత్రులకు గవర్నర్ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్ అనుమతి కావాలి. స్పీకర్ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది. పబ్లిక్ సర్వెంట్లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారని, స్పీకర్ కన్సెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. ఇదీచదవండి..చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. వీడియోలో.. ఓ మీటింగ్లో జనం మధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ట్విటర్లో షేర్ చేశారు. క్యాష్ఫర్ పోస్టింగ్ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని, ఎలాంటి భయం లేకుండా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు కలెక్షన్ కేంద్రంగా మారిందని, సిద్దరామయ్య కుమారుడు కలెక్షన్లకు రాకుమారుడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ట్రాన్స్ఫర్ మాఫియా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ గురించి అని తెలిపారు. క్యాష్ ఫర్ ఫోస్టింగ్ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో సుధీర్ఘ పోస్టు చేశారు. Unfortunately, former Chief Minister H.D. Kumaraswamy, who was involved in rampant corruption during his tenure, thinks all are like him. His pessimistic attitude does not allow him to think beyond corruption. His insecurity in politics often forces him to fabricate fake stories… — Siddaramaiah (@siddaramaiah) November 16, 2023 అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ Yathindra Siddaramaiah : ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹವಾ ಪ್ರತಿಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲಿಂಕ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ Click Here to Watch NewsFirst Kannada Live Updates LIVE Link : https://t.co/GFweTyzikB@siddaramaiah#CMSiddaramaiah #YathindraSiddaramaiah pic.twitter.com/Py38uVLcVv — NewsFirst Kannada (@NewsFirstKan) November 16, 2023 -
రేవంత్రెడ్డి కేసీఆర్ను ఓడించడం ఖాయం: సిద్ధరామయ్య
-
అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో ప్రజలను కొనేందుకు చూస్తున్నారు. కేసీఆర్ను రేవంత్రెడ్డి ఓడించడం ఖాయం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను సాగనంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ కామారెడ్డి సభలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తామని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం. స్థానిక సంస్థల్లో 23 శాతం, రిజర్వేషన్ను 42 శాతం పెంచుతాం. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్ అందిస్తాం’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. చదవండి: బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత కేసీఆర్కు రేవంత్ సవాల్ ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ రేవంత్రెడ్డి..కేసీఆర్కు సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధం అయ్యారు. సచివాలయం ముందు లింబయ్య అనే కామారెడ్డి రైతు ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకొని చనిపోయారు. కేసీఆర్ కొనాపూర్ బిడ్డ అంటున్నారు.. మరి ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఆదుకొలేదు. కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
సబ్ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్ప్లాన్ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్లో సబ్ప్లాన్ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
సీఎం కావాలనే తొందరేమీ లేదు..!
నేనే ఇంకో పదేళ్లు కర్ణాటక సీఎం- సిద్ధరామయ్య -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
ఆరోపణలు రుజువైతే సీఎం సిద్ధారామయ్యపై ఆరేళ్ల నిషేధం..!
కర్ణాటక: కుమారుడు, వరుణ మాజీ ఎమ్మెల్యే యతీంద్ర వ్యాఖ్యలతో తండ్రి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తిప్పలు వచ్చి పడ్డాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధరామయ్య గెలిచేందుకు వేలాది మందికి కుక్కర్లు, ఇసీ్త్ర పెట్టెలను పంపిణీ చేసినట్లు యతీంద్ర ప్రకటించడమే ఇందుకు కారణం. గత శుక్రవారం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో మడివాళ సముదాయ భవనం ప్రారంభోత్సవంలో యతీంద్ర పాల్గొని ప్రసంగించారు. కుక్కర్లు, ఐరన్ బాక్సులను పంచి మడివాళ సముదాయ ఓట్లను పొందేందుకు తండ్రి సిద్ధరామయ్య కృషిచేశారని అర్థం వచ్చేలా మాట్లాడారు. వాటి పంపిణీ రెండు, మూడుసార్లు వాయిదా పడినప్పటికీ తన తండ్రి పట్టు విడవకుండా ఓటర్లకు అందజేశారని ఆయన చెప్పారు. వరుణ నియోజకవర్గంలో మడివాళ సముదాయ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంజప్ప సమక్షంలో వేలాదిమందికి తన తండ్రి పంపిణీ చేశారని చెప్పారు. తండ్రిని గెలిపించినందుకు మీ రుణం తీర్చుకుంటామని అన్నారు. యతీంద్ర మాట్లాడిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఓటర్లకు డబ్బు, ఇతర తాయిలాలు పంచడం అక్రమమన్నది తెలిసిందే. వివరణతో సర్దుబాటుకు యత్నం యతీంద్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. బీజేపీ, జేడీఎస్లు ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సిద్ధరామయ్యపై న్యాయ పోరాటం చేయవచ్చని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం నేరం, అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ ఉల్లంఘన ఆరోపణలు నిరూపితం అయితే ఆరేళ్ల పాటు ఎన్నికల సంఘం నిషేధం విధిస్తుంది. యతీంద్ర వ్యాఖ్యలు ఇబ్బందిగా మారడంతో వెంటనే ఆయన వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. మడివాళ సమావేశంలో బహుమతులు పార్టీ నుంచి కానీ, లేదా తమ వైపు నుంచి కానీ ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ మండిపాటు కుక్కర్ల గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిద్దరామయ్య ప్రజలకు తప్పుడు హామీలనిచ్చి కుక్కర్, ఐరన్ బాక్స్ల ఆశలు చూపి ఓట్లు పొందారు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించి గెలిచారు, అందుచేత ముఖ్యమంత్రి పదవికి అనర్హత ఒక్కటే ఆయన ముందున్న దారి అని ఆరోపించారు. -
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్లో ఉత్వర్వులు జారీ చేసింది. -
అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..
బెంగళూరు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిని రాజకీయంగా విమర్శలకు గురిచేస్తున్న క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. చొక్కా తీసేయాలని అడిగినందుకు కేరళలోని దేవాలయానికి తాను వెళ్లలేదని చెప్పారు. ' ఒకానొకసారి కేరళలో ఓ దేవాలయానికి వెళ్లాను. ఆలయంలోకి ప్రవేశించాలంటే తాను చొక్కా తీసేయాలని కోరారు. నేను దేవాలయంలోకి వెళ్లడమే మానేశాను. గుడి బయట నుంచే ప్రార్థించాలని వారు నాకు చెప్పారు. నన్ను ఒక్కడినే చొక్కా తీసేయాలని కోరారు తప్పా అక్కడ ఉన్న ఎవ్వరినీ అడగలేదు. దేవుడి ముందు ఇది చాలా అమానవీయమైన పద్ధతి. భగవంతునికి అందరూ సమానమే.' అని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న నారాయణ గురు 169వ జన్మదిన ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 'Didn't enter temple when...': #Siddaramaiah sparks controversy amid #Sanatana row | @sagayrajp https://t.co/UuDEVMPAsd — IndiaToday (@IndiaToday) September 7, 2023 దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసివేయడం ఆనవాయితీగా వస్తోంది. శరీరంపై చొక్కాకు బదులు భుజాల మీదుగా అంగవస్త్రాన్ని ధరిస్తారు. సాంప్రదాయంగా ఈ విధానం అమలులో ఉంది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్.... మోదీతో సహా బీజేపీ నేతలకు కౌంటర్ -
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్.. మాజీమంత్రి షాకింగ్ కామెంట్స్
బెంగళూరు: ఇటీవల కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో ప్లాన్స్ చేస్తూ ముందుకుసాగింది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక, తాజాగా కర్ణాటక రాజకీయాలపై బీజేపీ మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు. అయితే, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ సిద్ధమైనట్టు తెలిపారు. కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కానీ.. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్కు సవాల్ చేశారు. తమ సొంత ఎమ్మెల్యేలకే మీపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చురకలంటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఈశ్వరప్పకు టికెట్ ఇవ్వలేదు. అనంతరం, ప్రధాని మోదీ.. ఈశ్వర్పకు కాల్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. Shivamogga, Karnataka | On the question of whether BJP can do 'Operation Lotus' at present, BJP leader KS Eshwarappa says, "Wait and watch, your (Congress) own MLAs don't have hope on you, Congress has no future in this country. Congress party is making big news in the state.… pic.twitter.com/WIa59VKRG7 — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు. తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. The Prime Minister is scheduled to directly land in Bengaluru tomorrow at 6 am after his latest foreign jaunt to congratulate ISRO. He is apparently so irritated with the CM and Deputy CM of Karnataka for felicitating the scientists of ISRO before him, that he has purportedly… pic.twitter.com/6EvN68A4oT — Jairam Ramesh (@Jairam_Ramesh) August 25, 2023 దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ను నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు. #WATCH | Bengaluru: On PM Modi's visit, Karnataka Deputy CM DK Shivakumar says, "I fully agree with whatever the Prime Minister has said. We were supposed to go and receive him but since we had the information from the Prime Minister's Office officially, we wanted to respect… pic.twitter.com/jWYq5Ne6c0 — ANI (@ANI) August 26, 2023 ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. -
Karnataka: కేసులు మాఫీ.. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఊరట
కర్ణాటక: మేకెదాటు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్, డీకే.సురేశ్లకు ఊరట కల్పిస్తూ, వారిపై నమోదైన కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన కేసులు ఎత్తివేయాలని కేబినెట్లో తీర్మానించారు. గతేడాది జనవరిలో మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ డీకే ఆధ్వర్యంలో మేకెదాటు నుంచి బెంగళూరుకు పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి హెచ్కే పాటిల్ వివరాలను వెల్లడించారు. రామనగరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాదయాత్రలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో ర్యాలీలు చేయడంతో బొమ్మై సర్కారు కేసులు నమోదుచేసింది. పలు ముఖ్యమైన తీర్మానాలు.. ► వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎంహెచ్.నాగేశ్, గత జాయింట్ డైరెక్టర్లకు నిధుల దుర్వినియోగం కేసులో సెషన్స్కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష విధించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని తీర్మానం. ► బెంగళూరులో ఏరోస్పేస్ రక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.391 కోట్లకు పాలనాత్మక ఆమోదం. ఇందిరానగర సీవీ.రామన్ ఆసుపత్రి వైద్యురాలు ఎస్డీ.నాగమణి లోకాయుక్తకు పట్టుబడగా తప్పనిసరి రిటైర్మెంటుకు తీర్మానం. రామనగర మహిళా వైద్యురాలు డాక్టర్ ఉషా కదరమండలగికి ఇదే నిర్ణయం. ► హువినహడగలి నియోజకవర్గం విద్యాశాఖాదికారి ఎన్ఎస్. హళ్లిగుడిపై ఆరోపణలు ఉన్నందున సేవల నుంచి సస్పెండ్. ఆస్పత్రులకు నిధులు.. ►బెళగావి మెడికల్ కాలేజీలో 325 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి రూ.187 కోట్ల మంజూరు ► కరావళి అభివృద్ధి ప్రాధికార పేరును కరావళి ప్రాదేశికాభివృద్ధి మండలి అని పేరు మార్పు ► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో 20 సంచార ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు. రూ. 47 కోట్లతో ఐదు జిల్లా ఆసుపత్రులైన మైసూరు, చిత్రదుర్గ, సీవీ రామన్నగర, వెన్లాక్ ఆసుపత్రి, కేసీ.జనరల్ ఆసుపత్రుల్లో 15 ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు. కొత్తగా సైబర్ భద్రతా చట్టం ► కర్ణాటక సైబర్ భద్రతా చట్టం 2023 –24 కు అనుమతి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి నేపథ్యంలో సైబర్ భద్రతకు చట్టం ఆమోదం● సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పామాయిల్కు బదులుగా సన్ ఫ్లవర్ నూనె పంపిణీ. ► బీబీఎంపీ చట్టాన్ని ఇతర మహానగర పాలికె, నగర సభ, పురసభల్లో అమలుకు పరిశీలన, అలాగే అక్రమ కట్టడాలు, బయలు భూమిపై పన్ను విధింపు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసమితి ఏర్పాటు. -
నాకంటే వెనకొచ్చి సీఎం అయ్యారు
కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసంతృప్తుల బెడద పెరిగిందని యలబుర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి వాపోయారు. ఆయన బుధవారం కొప్పళ జిల్లా కుకనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకంటే తర్వాత ఎమ్మెల్యే అయినవారు ముఖ్యమంత్రులయ్యారన్నారు. అందుకు నియోజకవర్గం ప్రజలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను చూడండి, కాంగ్రెస్లోకి వచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కాంగ్రెస్లో తన వెనుక నడిచిన వాళ్లంతా మంత్రులయ్యారని అసంతృప్తి వెలిబుచ్చారు. సిద్దరామయ్య సంక్షేమ బడ్జెట్ను ప్రకటించారన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన రాయరెడ్డికి ఈ దఫా మంత్రి పదవి దక్కకపోవడంతో అసహనానికి లోనయ్యారు. -
ఉడిపి వాష్రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, తన కుటుంబంపై అనుచిత ట్వీట్ చేసినందుకు బీజేపీ మహిళా కార్యకర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఉడిపి కాలేజీలోని వాష్రూమ్లో విద్యార్థినులను రహస్యంగా వీడియో తీసిన కేసులో సీఎం కుటుంబ సభ్యులను తీసుకొస్తూ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో శంకుతల అనే కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉడిపిలోని ఓ ప్రైవేట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కళాశాలలో మైనార్టీ వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళల టాయ్లెట్లో మొబైల్తో వీడియోలు చిత్రీకరించినట్టు గతవారం వెలుగు చూడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. టాయ్లెట్లో మొబైల్ ఫోన్ ఉండటాన్ని ఓ విద్యార్థిని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్లో అభ్యంతరకర వీడియోలు ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇక ఈ కేసులో మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్ ಮುಸ್ಲಿಂ ಯುವತಿಯರು ಟಾಯ್ಲೆಟ್ ನಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟು ಹಿಂದೂ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ನವರ ಪ್ರಕಾರ ಮಕ್ಕಳಾಟವಂತೆ..@siddaramaiah ನವರ ಸೊಸೆ or ಹೆಂಡ್ತಿ ಅವ್ರ ವಿಡಿಯೋವನ್ನು ಇದೆ ತರ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನು ಮಕ್ಕಳಾಟ ಅಂತ ಒಪ್ಕೋತೀರಾ? pic.twitter.com/jP0QTKvL5R — ಶಕುಂತಲ🪷Shakunthala (@ShakunthalaHS) July 25, 2023 ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఉడిపి టాయ్లెట్ వీడియో స్కాండల్కు సంబంధించి సీఎం సిద్ధరామయ్యపై సోషల్ మీడియాలో శంకుతల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఉడిపి కేసు స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయమని, దీనిని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్ చేసిన ట్వీట్ను ఆమె షేర్ చేశారు. ‘సిద్ధరామయ్య కోడలికో లేదా భార్యకో ఇలానే జరిగితే మీరు ఇలానే స్పందిస్తారా?’ అంటూ ఆ పోస్ట్పై కామెంట్ చేశారు. దీనిని ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. చదవండి: వైరల్గా సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఫోటోలు ಉಡುಪಿಯ ಕಾಲೇಜಿನಲ್ಲಿ “ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಣ“ ಎಂದು ನಕಲಿ ಸುದ್ದಿ ಸೃಷ್ಟಿಸಿ ಕೋಮು ಪ್ರಚೋದನೆಗೆ ಮುಂದಾಗಿರುವ ಬಿಜೆಪಿ ತೀರ್ಥಹಳ್ಳಿಯಲ್ಲಿ ಹಿಂದೂ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ಅಶ್ಲೀಲ ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಿಸಿದ ABVP ಅಧ್ಯಕ್ಷನ ಅಸಲಿ ಸುದ್ದಿಯ ಬಗ್ಗೆ ಮೌನ ಮುರಿಯುವುದು ಯಾವಾಗ? ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ಮಕ್ಕಳಾಟವನ್ನು ರಾಜಕೀಯದ ಕಳ್ಳಾಟಕ್ಕೆ… — Karnataka Congress (@INCKarnataka) July 25, 2023 -
పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. -
సొంతబలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం...
-
కర్ణాటక అసెంబ్లీలో రగడ
బెంగళూరు: బీజేపీ ఆందోళనలతో మంగళవారం కర్ణాటక విధానసభ వర్షాకాల సమావేశాలు హీటెక్కాయి. ఐదు ఎన్నికల హామీల అమలును అధికార కాంగ్రెస్ పూర్తిగా పక్కనపెట్టేసిందని విమర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్వెల్లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో గందరగోళం ఏర్పడి సభ కార్యకలాపాలకు అవాంతరం ఏర్పడింది. బీజేపీ సీనియర్, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విధాన సౌధలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో చేస్తామని చెప్పి.. ఏం చేయకుండా ఉండిపోయిందని మండిపడ్డారాయన. నెల దాటినా ఎన్నికల హామీల అమలులో జాప్యం దేనికని సూటిగా ప్రశ్నించారు. తామేమీ కొత్తగా ఏదైనా చేయాలని అడగడం లేదని.. కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారాయన. వారం వేచిచూస్తామని.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ తరుణంలో సీఎం సిద్ధరామయ్య జోక్యంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘మోసం.. మోసం.. కాంగ్రెస్ మోసం’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ మాత్రం వాళ్ల నిరసనను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీజేపీ నిరసనలపై కర్ణాటక మంత్రి పరమేశ్వర స్పందించారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మూడు అమలు చేస్తున్న విషయం గుర్తించాలని బీజేపీకి ఆయన హితవు పలికారు. ఐదు హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నామని, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే క్రమంలో ఆలస్యం కావడం సహజమని వ్యాఖ్యానించారాయన. #WATCH | Bengaluru | Heated scenes at the Karnataka Assembly as BJP MLAs storm the well of the House on the issues of the implementation of the five guarantees of the Congress Government in the State. (Source: Vidhana Soudha) pic.twitter.com/CrYgd5i33j — ANI (@ANI) July 4, 2023 ఇదీ చదవండి: ఆ డిప్యూటీ సీఎం అవినీతిపరుడు.. తొలగించండి -
గెలుపు తర్వాత సిద్ధరామయ్య ఎమోషనల్ స్పీచ్
-
సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముసలం.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారు.. కానీ తానైతే ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకాలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెంపెగడౌ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు. 2017లో కర్ణాటకాలో సీఎం సిద్ధరామయ్య కాలంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 'సీఎం భయపడ్డారు కానీ నీనైతే ప్రాజెక్టుని పూర్తి చేసేవాడిని' అని అన్నారు. అయితే.. డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకాలో కాంగ్రెస్కు అపూర్వ విజయం వరించింది. ఆ తర్వాత సీఎం పీఠం విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెద్ద కథే నడిచింది. చివరికి కేంద్రం బుజ్జగింపుతో డీకే వెనక్కి తగ్గగా సిద్ధరామయ్య సీఎం పదవిని స్వీకరించారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేప్టటారు. అయితే.. తాజాగా డీకే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయంలో మరోసారి ఇరువురి నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ కొనసాగుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదీ చదవండి: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ వెనుకంజ! -
సిద్దు బడ్జెట్ రూ.3.5 లక్షల కోట్లు?
కర్ణాటక: శాసనసభా బడ్జెట్ సమావేశాలు జూలై 3 నుంచి ఆరంభమవుతుండగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ మొత్తం రూ.3.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వివిధ శాఖల మంత్రులు, సీనియర్ అధికారులతో వరుసగా సమావేశాలను నిర్వహించి ఏ శాఖకు ఎంత కేటాయింపులు అనేది చర్చించారు. జూలై 7న కొత్త సర్కారు తొలి బడ్జెట్ను సమర్పిస్తారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదు గ్యారెంటీ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుంటే బడ్జెట్కి నిధులు సమకూర్చుకోవడం కష్టతరంగానే ఉంటుంది. ఆదాయాన్ని ఇచ్చే ఎకై ్సజ్, వ్యాపార, రిజిస్ట్రేషన్, ముద్రణా శాఖలు చురుగ్గా పనిచేయాలని సీఎం సూచించారు. ఇంతకు ముందు ఫిబ్రవరిలో బీజేపీ సర్కారులో సీఎం బొమ్మయ్ రూ.3 లక్షల 9 వేల కోట్ల బడ్జెట్ను సమర్పించారు. ఆ బడ్జెట్లో రూ.402 కోట్లు మిగులు చూపించారు. ఈసారి మిగులు ఉంటుందా అనేది అనుమానమే. బొమ్మయ్ బడ్జెట్ కంటే పెద్ద పద్దు ప్రకటించాలని సిద్దరామయ్య భావిస్తున్నారు. -
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
వాస్తుదోషంతో సీఎం దర్వాజ.. 15 ఏళ్ల తర్వాత తెరిచిన సిద్ధరామయ్య..
కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. విధాన సభలోని సీఎం ఛాంబర్లో దురదృష్టంగా భావించే దక్షిణ ద్వారాన్ని మళ్లీ ఓపెన్ చేపించారు. గత 15 ఏళ్లుగా ఆరుగురు ముఖ్యమంత్రుల కాలంలో మూసి ఉన్న ఈ దర్వాజాను మరోసారి తెరిపించారు. ఆయన అధికారంలోకి వచ్చాక వాస్తు దోషాలకు, మూఢ నమ్మకాలకు తెరదించుతూ ఈ ద్వారాన్ని తెరిచారు. 1998లో ఎన్నికల్లో ఓటమి తర్వాత జే హెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన సభలోని దక్షిణ ద్వారం మూతపడింది. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన 2013లో ఆ ద్వారాన్ని తెరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆరుగురు సీఎంలు పదవి చేపట్టారు. కానీ ఎవరూ కూడా ఆ ద్వారాన్ని తెరిచే సాహసం చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి రాగా... సీఎం సిద్ధరామయ్య మళ్లీ ఆ దర్వాజాను ఓపెన్ చేపించారు. #WATCH | Karnataka CM Siddaramaiah today entered his chamber in Vidhana Soudha using the 'West Door' which was earlier closed reportedly due to 'Vastu defects'#Bengaluru pic.twitter.com/tH01p2APlj — ANI (@ANI) June 24, 2023 2018 తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముగ్గురు సీఎంలు పదవి మారారు. బీ ఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, హెచ్ డీ కుమార స్వామిలు పదవి చేపట్టారు. వీరెవరూ విధాన సభలోని వాస్తు దోషంగా భావించే దక్షిణ ద్వారాన్ని ఓపెన్ చేసే సాహసం చేయలేదు. విధాన సౌధలోని మూడో ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ఉంటుంది. దానికి దక్షిణంలో ఓ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వాస్తు దోషంతో ఉందని అసెంబ్లీ సభ్యులందరూ భావిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అది మూతపడి ఉంది. ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్ ఫొటో సెషన్ తర్వాత ఇదే..' ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి ఫైర్.. -
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు అస్వస్థత..
కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి న్యుమోనియాతో బాధపడినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన ఆమెను బెంగళూరులోని మనిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆక్సిజన్ సహాయంతో ఐసీయూలో ఉన్నట్లు పేర్కొన్నారు. 'పార్వతి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతోంది. త్వరలోనే వార్డుకు తరలిస్తాం.'అని ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. సీఎం సిద్దరామయ్య ఈ రోజు పార్వతిని కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ముంబయి కొవిడ్ స్కాం: ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహచరుల ఇళ్లలో ఈడీ సోదాలు -
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేతలకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ కీలక నేతలకు మరో షాక్ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ పేపర్ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్ అయిన పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ యాడ్ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు సైతం సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా. ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం! -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నాగేంద్ర
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న రాష్ట్ర యువజన, క్రీడా, ఎస్టీ వర్గాల సంక్షేమ శాఖా మంత్రి బీ.నాగేంద్రకు బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పదవిని కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆయా జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రి పదవులు కేటాయించగా, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శ్రీరాములుపై భారీ మెజార్టీతో గెలుపొందిన నాగేంద్రకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పదవి కూడా దక్కడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఇక అభివృద్ధిని పరుగు పెట్టిస్తా: మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంత్రి పదవితోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాధ్యతలు కూడా సీఎం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టిస్తానన్నారు. జిల్లాకు డీఎంఎఫ్ తదితర నిధులతో అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతర్జాయ స్టేడియం నిర్మాణం చేపట్టడంతో పాటు జిల్లాను రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతానన్నారు. మంత్రి అభిమానుల సంబరాలు బళ్లారిఅర్బన్: బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను శుక్రవారం జిల్లా ఇన్చార్జ్జ్ మంత్రుల నియామకంలో బళ్లారి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా నియమించడంతో అభిమానులు రాయల్ సర్కిల్లో బాణసంచాను పేల్చి స్వీట్లను పంచి పెట్టి కాంగ్రెస్ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అభిమానుల సంఘం అధ్యక్షులు ఎంజీ కనక, పార్టీ నాయకులు చాగనూరు శ్రీనివాస్, బీ.మారుతీ, వై.అరుణ్కుమార్, అల్లీపుర్ ఆనంద్, తిప్పేరుద్ర, ఆంజనేయ, అరుణ్, నాగరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక కేబినెట్ భేటీ.. 5 గ్యారంటీ హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 5 గ్యారంటీ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగిన కర్ణాటక కేబినెట్ భేటీలో వీటికి ఆమోదం లభించింది. అధికారులు అందించిన ప్రజెంటేషన్ల ఆధారంగా మంత్రి మండలితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 5 గ్యారంటీ స్కీమ్ను అమలు చేయనునట్లు ప్రకటించారు కుల, మత వివక్ష లేకుండా ఐదు హామీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజలకిచ్చిన ఇతర హామీలను కూడా కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. వీటి అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదికి 50 వేల కోట్ల భారం పడనుంది. ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಗೂ ಮುನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ಅವರು ವಿಧಾನಸೌಧದ ತಮ್ಮ ಕಚೇರಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಸಭೆ ನಡೆಸಿ, ಗ್ಯಾರೆಂಟಿ ಯೋಜನೆಗಳ ಜಾರಿ ಕುರಿತಾಗಿ ಚರ್ಚಿಸಿದರು. pic.twitter.com/NyO1jgLhl4 — CM of Karnataka (@CMofKarnataka) June 2, 2023 కాగా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అయిదు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 5 వాగ్దానాలను ఒకేసారి నెరవేర్చుతామని చేసింది. అనుకున్నట్టేగానే 224 స్థానాలున్న అసెంబ్లీలో 135 చోట్ల కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఏ పార్టీతో పొత్తులేకుండా సింగిల్గానే మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం నేటి కేబినెట్ భేటీలో ఆ 5 గ్యారంటీ వాగ్దానాలకు ఆమోదముద్ర వేసింది. చదవండి: బ్రిజ్ భూషణ్పై సంచలన నిందారోపణలు కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు ఇవే.. 1. గృహ జ్యోతి(ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్), 2. గృహ లక్ష్మి(ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు నెలకు రూ.2000) 3. అన్న భాగ్య( బిపిఎల్ న కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం, 4. యువ నిధి (నిరుద్యోగ గ్రాడ్యుయేట్కు నెలకు రూ. 3,000, నిరుద్యోగ డిప్లొమా చేసిన వారికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రెండేళ్లపాటు అందించనున్నారు. 5. శక్తి (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం). -
చేతులు కలిపారా ?
కర్ణాటక ఫార్ములాను రాజస్తాన్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయోగించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ను ఒక్కటి చేసింది. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి ఒప్పించింది. మరి గెహ్లాట్, పైలెట్ చేతులు కలిపినట్టేనా ? ఎన్నికల్లో కలసికట్టుగా పని చేస్తారా ? ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య విభేదాలను పరిష్కరించి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను రాజస్తాన్లోనూ ప్రయోగించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య రాజీ కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గెహ్లాట్, పైలెట్లు రాహుల్తో చర్చించాక ఇరువురు నేతలు కలిపి పని చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన ప్రకటనపై రాష్ట్ర నేతల్లో విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం సచిన్ పైలెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన గడువు బుధవారంతో ముగుస్తుంది. ఈ లోగా అధ్యక్షుడు ఖర్గే లేదంటే సీఎం నుంచి ఏదో ఒక ప్రకటన రాకపోతే సచిన్ పైలెట్ వ్యూహం ఎలా మార్చుకుంటారోనన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. రాహుల్తో భేటీలో ఈ సమస్యలకైతే సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు. ఖర్గే వ్యూహం ఏంటి? ఈ ఏడాది నవంబర్లోనే ఎన్నికలు ఉండడంతో ఇరువురు నేతల మధ్య పూర్తి స్థాయి అవగాహన కుదర్చడానికి సమయం అంతగా లేదు. చాలా తక్కువ సమయంలో ఇద్దరికీ సంతృప్తికరమైన చర్యలు ఎలా చేపడతారన్నది మరో పెద్ద సవాల్గా ఉంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ప్రతిష్ట గత కొన్ని నెలలుగా మసకబారుతోంది. ఈ విషయంలో సీఎంకు అధ్యక్షుడు ఖర్గే ఘాటైన హెచ్చరికలు పంపినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫలితాలు రావాలంటే జూలై నాటికే 60% అభ్యర్థుల్ని ప్రకటించాలని అధ్యక్షుడు ఖర్గే గట్టిగా కసరత్తు చేస్తున్నారు. అది జరగాలంటే పైలెట్కు పీసీసీ అధ్యక్ష పదవి లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి పైలెట్ అనుచరులకే అధికంగా సీట్లు ఇస్తే అధికార వ్యతిరేకత నుంచి కూడా బయటపడవచ్చునని ఖర్గే భావిస్తున్నారు. దీనిపై ఖర్గే, హైకమాండ్ ఒక మాట మీదకొస్తే పైలెట్ను పీసీసీ చీఫ్గా అంగీకరించడమో లేదంటే తానే సీఎం పదవికి రాజీనామా చేయడమో గెçహ్లాట్కు అనివార్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం గెహ్లాట్ తన అనుచరులతో మాట్లాడుతూ అందరూ సహనంగా ఉండాలని పిలుపునిచ్చారు. పైలెట్కు పార్టీలో ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ఎన్నికల్లో గెలుపు కోసం హైకమాండ్ ఏం చెబితే అదే చేస్తానని వ్యాఖ్యానించడం కొసమెరుపు మొత్తమ్మీద సచిన్ పైలెట్ తండ్రి, దివంగత రాజేశ్ పైలెట్ వర్ధంతి జూన్ 11 లోపు పైలెట్కు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నాయి. చిక్కుముళ్లు ఎలా విప్పుతారో..! అశోక్, పైలెట్ మధ్య విడదీయలేని చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. వసుంధరా రాజె ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం గెహ్లాట్పై ఆయన వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో గెహ్లాట్ దీనిపై రాజీకి వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు చేపట్టాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావించారు. కానీ పైలెట్ను విశ్వాసంలోకి తీసుకోకుండా ఇవి చెయ్యడం అంత సులభం కాదు. సోమవారం ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ఇరువురు నాయకుల మధ్య ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాహుల్, ఖర్గేలు తొలుత గెహ్లాట్తో చర్చించారు. అనంతరం సచిన్ పైలెట్తో చర్చలు జరిపారు. గంటల కొద్దీ సమావేశం జరిగినప్పటికీ గెహ్లాట్, పైలెట్ కలిసికట్టుగా పని చేస్తామని బహిరంగంగా చెప్పకపోవడం గమనార్హం. డిమాండ్లపై పట్టు వీడని పైలెట్ సచిన్ పైలెట్ గత కొద్ది నెలలుగా చేస్తున్న డిమాండ్లపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. వసుంధరా రాజె ప్రభుత్వ అవినీతిపై విచారణ, రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఆర్పీఎస్సి) తిరిగి ఏర్పాటు చేసి కొత్త నియామకాలు చేపట్టడం పేపర్ల లీకేజీ వల్ల పరీక్షలు రద్దు ప్రభావం పడిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించడమనే మూడు డిమాండ్లపై సచిన్ పట్టు వీడడం లేదు. రాహుల్తో సమావేశానంతరం అశోక్ గెహ్లాట్ పార్టీ హైకమాండ్ కీలకమని, పార్టీ పెద్దలు ఎవరికి ఏ పదవి ఇస్తారో ముందుగానే స్పష్టమైన హామీలు ఇవ్వరంటూ చేసిన వ్యాఖ్యలు కూడా భవిష్యత్లో జరిగే సమావేశాల్లో ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నాయి. - సాక్షి నేషనల్ డెస్క్ -
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్కే పాటిల్కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
దేశానికి అవసరమైన విజయం!
కీలకమైన ఎన్నికల్లో విజయం సాధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం శుభవార్త అనే చెప్పాలి. ప్రజా సంక్షేమ రాజకీయాలకూ, మత రాజకీయాలకూ మధ్య జరిగిన ఎన్నిక ఇది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, స్థిరమైన లౌకిక ప్రజాస్వామ్య వ్యూహాలు సిద్ధ రామయ్యను నిజమైన మాస్ లీడర్గా మార్చాయి. దేశం మతతత్వం నుండి ప్రజాస్వామ్య సంక్షేమం వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నందున, కర్ణాటక ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవి. మహాత్మా ఫూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య మతపరమైన భావజాలానికి చోటివ్వకుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్న కథనం ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. ఇది ఒక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన మాస్ లీడర్ లేకుండా ఏ జాతీయ పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల్లో గెలవలేదు. శూద్ర ఓబీసీల కోసం నిబద్ధత కలిగి, మంచి పరిపాలనాదక్షుడిగా, చిల్లర అవినీతి రాజకీయాలకు అతీతంగా తనను తాను నిరూపించుకున్న సిద్ధరామయ్య లాంటి బలమైన లీడర్ లేకుండా కాంగ్రెస్ గెలవలేక పోయేది. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పటికీ, ఆయన పార్టీకి చెందిన కర్ణాటక నేతలు మాత్రం ఆయన మాట తప్పని నిరూపించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కాంగ్రెస్ గెలుపులో మంచి పాత్ర పోషించినప్పటికీ, సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాపునాది, క్లీన్ ఇమేజ్ ఆయనకు లేదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం యావత్ భారతదేశానికి శుభవార్త అనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయన రెండవ టర్మ్... మోసపూరిత బీజేపీని అదుపులో ఉంచడం, శివ కుమార్ తక్కువ స్థాయి ఆకాంక్షలను నియంత్రించడంతోపాటు మోదీని ఓడించిన ప్రజలను మాత్రమే కాకుండా స్థానిక నాయకులను సంతృప్తిపరిచేలా పరిపాలనను నడపడం వంటి సవాళ్లను కలిగి ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ తదుపరి సర్సంచాలక్ దత్తాత్రేయ హొసబలే సొంత రాష్ట్రం. బహుశా ఈయన కూడా ఢిల్లీలోని మొత్తం బలాన్ని ఉప యోగించి, అన్ని విధాలుగా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలను కున్నారు. హొసబలే బ్రాహ్మణ నాయకుడు. అంతేకాకుండా మోదీకి బలమైన మద్దతుదారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకు రావడానికి హొసబలే కారణమని చెబుతున్నారు. అందుకే మోదీ ఓబీసీ కార్డ్ని, మతతత్వాన్ని ఉపయోగించి కర్ణాటకను గెలవడానికి తన ప్రభుత్వ బలాన్ని, తన సమయాన్ని, తన శక్తిని ఉపయోగించి నట్లనిపించింది. ప్రతి గ్రామ వ్యవసాయ సమాజాన్నీ, చేతివృత్తుల సంçఘాన్నీ కలిసిన సిద్ధరామయ్య... మోదీ కంటే భిన్నమైన ఓబీసీ నాయకుడని తెలియజేస్తోంది. సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవానికి 16 లక్షల మంది హాజరైనట్లు ‘వికీపీడియా’ రాసింది. ‘‘సిద్ధరామయ్య తన 75వ పుట్టినరోజును 2022 ఆగస్టు 3న దావణగెరెలో జరుపుకొన్నారు. జనం దాన్ని సిద్ధరామోత్సవ అని పిలిచారు, సిద్ధరామయ్య అను యాయులైన 16 లక్షల మంది ఆనాటి కార్యక్రమానికి హాజర య్యారు’’. రాహుల్ గాంధీ కూడా హాజరైన ఈ జన్మదిన వేడుకల్లో, పైన చెప్పిన సంఖ్యలో సగం మంది హాజరైనా కూడా, లక్షలాది మంది జనం ఒక నాయకుడి చుట్టూ గుమికూడటం భారతీయ చరిత్ర లోనే అపూర్వం. ఆయన పెద్ద లేదా చిన్న పట్టణ వ్యాపార నేపథ్యం నుండి కానీ, కొత్తగా చేర్చబడిన ఓబీసీ నేపథ్యం నుండి కానీ రాజకీయ అధికారానికి రాలేదు. ఆయన ఋగ్వేదం రాసిన రోజుల నుండి విద్య, ప్రభుత్వో ద్యోగం, మానవ గౌరవ హక్కుల నిరాకరణకు గురైన చారిత్రక శూద్ర గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన ఓబీసీ. ఢిల్లీలో అధికారాన్ని ఓబీసీ ఓటు నిర్ణయిస్తుందని గ్రహించిన ఆరెస్సెస్–బీజేపీ శక్తులు, చాలా మంది శూద్రేతర నాయకులను ఓబీసీలుగా ప్రచారం చేస్తున్నాయి. మండల్ రిజర్వేషన్ ను వ్యతిరేకించిన తర్వాత ఓబీసీ ఓట్లు లేకుండా ఢిల్లీని చేజిక్కించుకోలేమని వారు గ్రహించడమే దీనికి కారణం. మోదీ, సుశీల్ మోదీ తరహాలో ఇప్పుడు ఓబీసీ కార్డు వాడు తున్న బీజేపీ నాయకులు ఆనాడు మండల్ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ మిలి టెంట్ కమండల్ ఉద్యమ నాయకులుగా పనిచేశారు. సిద్ధరామయ్య బలమైన మండల్ ఉద్యమ నాయకుడు. గొర్రెల కాపరి కుటుంబం నుండి వచ్చి, బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీలు పొందారు. ఆ రోజుల్లో ఇది ఒక కురుబ బాలుడు ఊహించనిది. ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత మైసూర్ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నప్పుడు లా ప్రాక్టీస్లోకి ప్రవేశించారు. ఈ అసాధారణ యువ కురుబ న్యాయవాది 1980వ దశకం ప్రారంభంలో రైతు ఉద్యమంలో సుప్రసిద్ధ నాయకుడైన ఎం.డీ. నంజుండస్వామి దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధరామయ్యను రాజ్య రైతు సంఘం ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. అలా 1983లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. తరువాత జనతా పార్టీలో చేరారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ మంత్రి కాగలిగారు. దేవెగౌడ పదవీ విరమణ చేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో, పేదల అనుకూలత, నిబద్ధత కలిగిన ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ ప్రతినిధిగా జేడీ (యూ)లో చేరారు. ఆయన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ సిద్ధరామయ్యను పట్టించు కోకుండా దేవెగౌడ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేశారు. దేవెగౌడ సంప్రదాయవాద అర్ధ–హిందుత్వ నాయకుడు. కాగా, సిద్ధరామయ్య శూద్ర ఆధ్యాత్మిక భావజాలం కలిగిన హేతువాది. ఆ తర్వాత జేడీ (యూ)ను విడిచిపెట్టి ‘అహిందా’ పార్టీని స్థాపించారు. అంటే ‘అల్పసంఖ్యాక, హిందూళిద, దళిత’ అని! హిందూళిద అంటే కన్నడంలో వెనుకబడినది అని అర్థం. వాస్తవానికి ప్రధాన స్రవంతి మీడియా సిద్ధరామయ్య నాటి దశను ఆయన రాజకీయ జీవితానికి ముగింపుగా చూసింది. మాస్ లీడర్ లేని సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. ఓబీసీ ఎజెండా, లౌకిక వాదం, హేతువాదంపై తనకున్న బలమైన నిబద్ధతను వదలకుండా కాంగ్రెస్లోకి ప్రవేశించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని ప్రకటనల్లో కుల వ్యతిరేకత, సెక్యుల రిజం, హేతువాదం పట్ల ఆయన నిబద్ధతను చూడవచ్చు. ఎల్లప్పుడూ తన మణికట్టుకు కాషాయ దారాలను ధరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ శైలితో దీన్ని పోల్చి చూడవచ్చు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచిత్రంగా దేవాలయాలకు వెళ్తూ శివుడు (రాహుల్), హనుమంతుడి (ప్రియాంక) పూజలు చేస్తున్నారు. కానీ సిద్ధరామయ్య అలా చేయ లేదు. తన ఆధ్యాత్మిక నాయకుల సంప్రదాయంగా బసవ, అక్క మహా దేవిలను ఉదాహరిస్తారు. దేవాలయాల చుట్టూ తిరగరు. సిద్ధరామయ్య, పినరయి విజయన్, ఎం.కె.స్టాలిన్, కె.చంద్ర శేఖరరావు, జగన్మోహన్ రెడ్డి– దక్షిణాదిలోని ముఖ్యమంత్రులందరూ శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల నేపథ్యం ఉన్నవారే. ఉత్తరాదిలో అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లోత్ కూడా శూద్ర వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చినవారే. వీరందరూ 2024లో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిస్తే బీజేపీ ఓడిపోతుంది. జాతీయ శూద్ర–ఓబీసీ నాయకులు ఏకమై సానుకూల ప్రజా స్వామ్య సంక్షేమం దిశగా దేశాన్ని నడిపించాల్సిన సమయం ఇది. ఓబీసీ రాజకీయాల పేరుతో జరుగుతున్న మతతత్వాన్ని అంత మొందించాలి. వ్యవసాయాధారిత జాతీయవాదాన్ని అగ్జ్రపీఠిన ఉంచడం; ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు కానివారు భారీ మొత్తంలో కూడగట్టిన క్రోనీ క్యాపిటల్ సమీకరణను తనిఖీ చేయడం ప్రస్తుతం చాలా ముఖ్యం. తమకు భాగస్వామ్యం లేని క్రోనీ క్యాపిట లిజానికి ఓబీసీలు మద్దతు ప్రకటిస్తే, అది భారతదేశ ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ మార్గాన్ని నాశనం చేస్తుంది. మహాత్మా ఫూలే, అంబే డ్కర్, పెరియార్లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య తన జీవితంలో ఏ సమయంలోనైనా మతపరమైన భావజాలానికి చోటివ్వ కుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
‘టిప్పూలాగే చేయాలి’.. సిద్ధూకు ప్రాణహానీ? పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ పై మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉరి గౌడ, నంజేగౌడలు టిప్పు సుల్తాన్ను అంతం చేసినట్లే.. సిద్ధరామయ్యను సైతం చంపేయాలని పబ్లిక్ మీటింగ్లో అశ్వత్ నారాయణ్ మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అశ్వత్ నారాయణ్ను అరెస్టు చేయాలని పోలీసులను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ఎమ్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 18 వ శతాబ్దానికి చెందిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్. బ్రిటీషర్ల పోరాటంలోనూ టిప్పు సుల్తాన్ మరణించలేదు. కానీ ఒక్కలిగ జాతికి చెందిన ఉరి గౌడ, నంజె గౌడల చేతిలో చనిపోయాడు. 'టిప్పు మద్దతుదారుడు సిద్ధరామయ్య ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. మీకు టిప్పు కావాలా? లేక హిందుత్వాన్ని కాపాడిన సావర్కర్ కావాలా?. నంజెగౌడ ఎం చేశారు?. అదే విధంగా సిద్ధరామయ్యను కూడా చేయాలి' అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే క్రమంలో సిద్ధరామయ్యను టిప్పుతో పోల్చుతూ మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు. (అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!) నేనొస్తే టిప్పు సుల్తాన్ వచ్చినట్టే అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. తనపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 'నన్ను అంతం చేయనిస్తారా?. నేను అధికారంలోకి వచ్చానంటే టిప్పు అధికారంలోకి వచ్చినట్టే. టిప్పు సుల్తాన్, కిట్టుర్ రాణి చెన్నమ్మ, సంగోళి రాయన్న అంటే నాకు ఎంతో గౌరవం' అని పబ్లిక్ ర్యాలీలో అన్నారు. అయితే ఫిబ్రవరిలోనే మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. కానీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పోలీసులకు కాంగ్రెస్ మరోసారి ఫిర్యాదు చేసింది. నేనలా అనలేదు ఈక్రమంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. 'నేను సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్తో పోల్చాను. సిద్ధరామయ్యకు టిప్పు సుల్తాన్పై ఉన్న ప్రేమ గురించి మాట్లాడాను. సిద్ధరామయ్యపై నేనేమీ అవమానకరంగా మాట్లాడలేదు. రాజకీయ, భావజాల వైరుధ్యాలే తప్ప సీఎంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్షక్షపూరిత ఆలోచనలు లేవు. నా వ్యాఖ్యలు ఏవైనా ఆయన మనోభావాలను దెబ్బతీస్తే అందుకు చింతిస్తున్నాను' అని అసెంబ్లీలో మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
ఉత్తి బొకేలు, శాలువాలు వద్దన్నారని.. గిఫ్ట్లు తెస్తున్నార్సార్!
ఉత్తి బొకేలు, శాలువాలు వద్దన్నారని.. గిఫ్ట్లు తెస్తున్నార్సార్! -
సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ పోస్టు.. నిమిషాలకే ప్రభుత్వ టీచర్కు షాక్!
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్ అయ్యారు.చిత్రదుర్గ జిల్లాలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు సీఎం సిద్ధరామయ్యను, ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే క్యాప్షన్తో పోస్టు చేసిన తన ఫేస్బుక్ పోస్ట్లో వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను శాతమూర్తి ప్రస్తావించాడు. ‘మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ హయాంలో రూ.3,590 కోట్లు.. ధరమ్సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ 13,464 కోట్లు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ. 2,42,000 కోట్లు’ అని తన పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాక ఉచితాలు అధికంగా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుందంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా హయాం నుంచి శెట్టర్ వరకు రాష్ట్రం చేసిన రుణాలు రూ.71,331 కోట్లు కాగా.. కేవలం సిద్ధరామయ్య హయాంలోనే (2013-2018) అప్పులు రూ.2,42,000 కోట్లకు చేరాయని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాధికారి ఎల్ జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్పాస్లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్పాస్ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
మెట్టు మొక్కి సభలోకి అడుగుపెట్టిన డీకే శివకుమార్..
-
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా బయటపెట్టింది. #WATCH | Opposition leaders display their show of unity at the swearing-in ceremony of the newly-elected Karnataka government, in Bengaluru. pic.twitter.com/H1pNMeoeEC — ANI (@ANI) May 20, 2023 హాజరైన ప్రముఖులు వీళ్లే.. ►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ హాజరు ►తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా ► కమల్ హాసన్, శివరాజ్ కుమార్. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే తొలి కేబినెట్ బేటీ: రాహుల్ గాంధీ మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు. #WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq — ANI (@ANI) May 20, 2023 -
Live: సిద్ధరామయ్య అనే నేను...
-
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణంస్వీకారం
-
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే
Updates: ►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత ప్రమాణ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొఫైల్ ►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం ►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, ►2013 నుంచి 18 వరకు సీఎం, ►13సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్. ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిక ►కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫైల్ ► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ ►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు ►సాతనౌర్ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ ►2008లో కనకపుర నుంచి గెలుపు ►2008, 2013, 2018లో హ్యాట్రిక్ విక్టరీ ►2014 నుంచి 18 వరకు విద్యుత్శాఖ మంత్రి ►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర ►దేశంలోనే ధనిక రాజకీయనేత ►కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్ ►కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే కేజీ జార్జ్ ప్రొఫైల్ ►సర్వగ్న నగర్ నియోజకవర్గం, క్రిస్టియన్ నేత, 5 సార్లు ఎమ్మెల్యే ►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక ►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు కేహెచ్ మునియప్ప ప్రొఫైల్ ► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ ► చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజస్ ► రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నిర్వహణ ► ఏడుసార్లు వరుసగా లోక్సభకు ఎన్నిక ► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం జీ పరమేశ్వర ప్రొఫైల్ ►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం ►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే ►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు ►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు 2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు ►వీరప్పమొయిలీ, ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్లో మంత్రిగా విధులు మాజీ డిప్యూటీ సీఎం, ఎంబీ పాటిల్ ప్రొఫైల్ ►లింగాయత్ నేత, బబలేశ్వర్ నియోజకవర్గం. ►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ► కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి. సతీశ్ జర్కిహోళి ప్రొఫైల్ ►ఎస్టీ నేత(వాల్మికీ నాయక) ► గోకక్ నియోజకవర్గం. ►నాలుగుసార్లు ఎమ్మెల్యే, ►రెండుసార్లు ఎమ్మెల్సీ, ►కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రియాంక్ ఖర్గే ప్రొఫైల్ ►దళిత నేత, ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ►చిత్తాపూర్ నియోజకవర్గం. ►మూడుసార్లు ఎమ్మెల్యే. ►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ►చామరజ్పేట్ నియోజకవర్గం ►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిక ► మాజీ హజ్, వక్ఫ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి ►ఓబీసీ నేత ►బీటీఎమ్ లేఔట్ నియోజవకర్గం ►8సార్లు ఎమ్మెల్యే, ►మూడు సార్లు మంత్రిగా సేవలు. ►కర్ణాటక మాజీ హోంమంత్రి #WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1 — ANI (@ANI) May 20, 2023 Karnataka swearing-in ceremony | Karnataka Deputy CM-designate DK Shivakumar welcomes Tamil Nadu CM MK Stalin and other DMK leaders at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/TS3uVNcydI — ANI (@ANI) May 20, 2023 ►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్హాసన్, శవరాజ్ కుమార్ హాజరయ్యారు. Actor and Makkal Needhi Maiam chief Kamal Haasan attends the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/mrTmOo7vU4 — ANI (@ANI) May 20, 2023 ►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. #WATCH | Karnataka Deputy CM-designate DK Shivakumar arrives at Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony of the newly-elected Karnataka Government will begin shortly. pic.twitter.com/sQHEch9Rd8 — ANI (@ANI) May 20, 2023 శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్పథ్– 10లో ఉంటున్న రాహుల్ గాంధీని వెళ్లి కలిశారు. కేబినెట్లోకి 20 మంది? గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్లు పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల సీఎంల రాక ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్షా, సునీల్ బన్సల్ భేటీ -
సిద్దూ, డీకేఎస్ అండ్ కో ప్రమాణం రేపే
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్ట్కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. -
సిద్ధరామయ్యను వరించిన సీఎం పీఠం
-
న్యాయవాది నుంచి ముఖ్యమంత్రి వరకు..
కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ఈరోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠం కోసం చివరి వరకు పోరాడిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంతోపాటు నూతన కేబినేట్ శనివారం కొలువుదీరింది. కాగా 75 ఏళ్ల సిద్ధరామయ్య కర్ణాటక 24వ సీఎంగా బాధ్యతలు ప్వీకరించారు. రాజకీయాల్లో 45 ఏళ్ల సుధీర్ఘ అనుభవం అన్న ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న మూడో వ్యక్తి కూడా. గతంలో దేవరాజ్ అర్స్, ఎస్. నిజలింగప్ప మాత్రమే అయిదేళ్ళు పూర్తి చేశారు. 1956 నుంచి తీసుకుంటే.. ఇప్పటి వరకు కేవలం ముగ్గురు వ్యక్తుల మాత్రమే పూర్తికాలం పదవిలో కొనసాగారు. వారంతా కాంగ్రెస్కు చెందినవారే కావడం విశేషం. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! చదువు, కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న సిద్ధరామయ్య జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన తరువాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు 1947 ఆగస్టు 3న సిద్దరామే గౌడ, బోరమ్మసిద్ధరామయ్య మైసూరు జిల్లాలోని సిద్దరమణహుండి అనే చిన్న గ్రామంలో జన్మించారు. వ్యవసాయం నేపథ్యం గల కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు సిద్దరామే గౌడ, బోరమ్మ. సిద్ధరామయ్య అయిదుగురు తోబుట్టువులలో రెండవవాడు. వీరు కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధరామయ్య పదేళ్ల వయస్సు వరకు పాఠశాలకు వెళ్లి ఎలాంటి విద్యను అభ్యసించలేదు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎల్ఎల్బీ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. సిద్ధరామయ్యకు పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. రాజకీయ వారసుడిగా భావించిన పెద్ద కుమారుడు రాకేష్(38) మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో 2016లో మరణించాడు. రెండవ కుమారుడు యతీంద్ర మైసూరులోని వరుణ జిల్లా నుండి 2018 శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పోటీ చేయలేదు. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్ రాజకీయ నేపథ్యం సిద్ధరామయ్య తన కాలేజీ రోజుల్లోనే వాక్చాతుర్యంతో మంచి వక్తగా పేరుగాంచారు.మైసూరు జిల్లా కోర్టులో చిక్కబోరయ్య అనే న్యాయవాది దగ్గర జూనియర్గా పనిచేస్తన్న సమయంలో నుంజుడ స్వామి పరిచయమయ్యారు. అతనే సిద్దారమయ్యను రాజకీయాల్లోకి రమ్మని, మైసూరు తాలుకా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన సిద్ధరామయ్య ఎన్నికల బరిలో దిగి తొలిసారి విజయం సాధించాడు. 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగు తరువాత 1983లో భారతీయ లోక్దళ్ పార్టీ టికెట్పై చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టాడు. వ్యవసాయం, నిరాడంబర నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య తన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచి, పాత మైసూరు ప్రాంతంలో సంచలనంగా మారారు. అనంతరం జనతా పార్టీలో చేరి కన్నడ అధికార భాషగా అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కన్నడ నిఘా కమిటీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. తిరిగి 1985లో మరోసారి చాముండేశ్వరీ నుంచి కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఏకంగా రామకృష్ణ హెగ్డే కేబినెట్లో పశువైద్య సేవల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఆర్థిక మంత్రిగా 1992లో జనతాదళ్ సెక్రటరీ జనరల్గా ఎంపికయ్యారు. తిరిగి 1994లో హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. పార్టీ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు. 1996లో జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయినప్పటికీ1999లో మంత్రివర్గం నుంచి తొలగించారు. మొత్తం తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: ఈ నిర్ణయం కోర్టు తీర్పులాంటిది: డీకేఎస్ Former CM and leader of Opposition @siddaramaiah dancing with his childhood friends at his native village Siddaramayyana hundi in Mysuru on Thursday night. It can be noted he has learnt Veera Makkala Kunitha, folk dance form when he was young.@santwana99 @NewIndianXpress pic.twitter.com/XtI59uapV5 — Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್🇮🇳 (@AshwiniMS_TNIE) March 25, 2022 జేడీఎస్లో సిద్ధరామయ్య 1999లో జనతాదల్ నుంచి విడిపోయి హెచ్డీ దేవెగౌడ తన వర్గం వారితో జనతాదళ్(సెక్యులర్) పార్టీని స్థాపించారు. సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. కానీ అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో సిద్ధరామయ్య ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 2005లో దేవెగౌడతో విభేదాల కారణంగా జేడీఎస్ను వీడి.. ఏడాది తర్వాత సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2006లో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరీ నుంచి కేవలం 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత నియోజకవర్గం మార్చుకుని 2008, 2013 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2018 వరకు సీఎంగా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు. 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ అంతేగాక కర్నాటక ఆర్థిక మంత్రిగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ను సమర్పించిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.ఇక తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ద్ధరామయ్య 2018 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా మైసూరులోని చాముండేశ్వరిలో జేడీ(ఎస్) అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. కానీ బాదామి నియోజవర్గంలో విజయం సాధించారు. I thank everyone present here for attending the swearing-in ceremony. We are going to implement all five of our promises in the first cabinet meeting. Jai Hind! Jai Karnataka! Jai Congress! : Karnataka CM Shri @siddaramaiah pic.twitter.com/KAC3N0pBhu — Congress (@INCIndia) May 20, 2023 -
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ!
సుధీర్ఘ మంతనాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి వ్యవహారం కొలిక్కి వచ్చింది. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఒక్కరే ఉంటారని తెలిపారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.30కు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్యనే సీఎంగా అవుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానంతోపాటు ఎమ్మెల్యేలు సైతం సినీయారిటీకే మొగ్గుచూపారు. అయితే సీఎం పదవి తప్ప మరే స్థానం అవసరం లేదంటూ డీకే బెట్టు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. చదవండి: నేను పూర్తి సంతోషంగా లేను: డీకే శివకుమార్ సుధీర మంతనాలు సీఎంపై ఏకాభిప్రాయం కోసం గత మూడు రోజులుగా సిద్ధరామయ్య, డీకేశివకుమార్తో అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ పంచాయితీ ఎటూ తేలలేదు. సీఎం పీఠం నుంచి తగ్గేదేలే అంటూ డీకే తేగేసి కూర్చున్నారు. దీంతో డీకేను సముదాయించేందుకు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత చివరకు డీకే.. అధిష్ఠానం ప్రతిపాదనలను అంగీకరించారు. డీకేను బుజ్జగించిన సోనియా అయితే డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సోనియా జోక్యంతో ఉప ముఖ్యమంత్రి పదవికి డీకే అయిష్టంగానే అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా సోనియా డీకేతో మాట్లాడి బుజ్జగించినట్లు తెలిపాయి. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సోదరుడు డీకే సురేష్ తెలిపారు. ‘మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఈ నిర్ణయంతో మేం సంతోషంగా లేము. కేవలం కర్ణాటక, పార్టీ ప్రయోజనాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని పేర్కొన్నారు. చదవండి: జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు -
Live: శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య
-
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో చర్చల అనంతరం వీరు రాహుల్గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..!