zaheerabad
-
హైవేపై కంటైనర్లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
జహీరాబాద్లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్పూర్ ఇండ్రస్టియల్ కారిడార్లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్కు 19 కిలోమీటర్లు, మెటల్కుంట రైల్వేస్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్కు కొత్త రైల్వే లైన్ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
-
తెలంగాణలో ‘డబుల్ ఆర్’ ట్యాక్స్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జహీరాబాద్,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ వ్యవస్థకు షాక్ ఇవ్వకపోతే రానున్న ఐదేళ్లలో తెలంగాణ మరింత పతనమవుతుందని హెచ్చరించారు. జహీరాబాద్లో మంగళవారం(ఏప్రిల్30) జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్హిట్ సినిమా ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోంది. డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ సొమ్ము ఢిల్లీకి చేరుతోంది. ప్రజలు భవిష్యత్ కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను విధిస్తారు. మీ సందపదలో 50 శాతం కాంగ్రెస్ కాజేస్తుంది. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ చాలా మాట్లాడింది. అధికారంలోకి వచ్చి మౌనంగా ఉంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే’అని మోదీ అన్నారు. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లు పాటిల్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్సభ టికెట్పై పాటిల్కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్నగర్- డీకే అరుణ, నాగర్కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్కు బైబై చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేపర్ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని, ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. ప్రధానికి రెండు విమానాలు ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు. రాహుల్పైనే ఒవైసీ విమర్శలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్ ఎన్.గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్ కామెంట్స్..
సాక్షి, జహీరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, మంత్రి హరీశ్ రావు జహీరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రేషన్కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. -
కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రికెట్లో వెస్టిండీస్ టీం మాదిరిగా తయారైందని.. ఒకప్పుడు వరల్డ్కప్ గెలిచిన ఆ టీం ఇప్పుడు ఇదే వరల్డ్కప్కు క్వాలిఫై కూడా కాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా క్వాలిఫై కాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని.. బీజేపీ డకౌట్ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో హరీశ్రావు పర్యటించారు. ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబి్ధదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్రావు ప్రసంగించారు. రాష్ట్రంలో 30 స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం తాగునీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం కోసం అమలుకు వీలు కాని హామీలను ఇస్తోందని హరీశ్రావు విమర్శించారు. హంగ్ కాదు.. హ్యాట్రిక్... బీజేపీ తీరును కూడా మంత్రి హరీశ్ తూర్పారబట్టారు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణలో హంగ్ రాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో గెలువలేని జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరం’ముంపునకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్రావు హామీనిచ్చారు. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ప్రాణహిత, గోదావరి వరదలతో నష్టపోకుండా సర్వే చేయిస్తామని చెప్పారు. వరద ముంపు సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్రావుకు బాల్క సుమన్ వేదికపైనే పాదాభివందనం చేశారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్రావు, ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది కాంగ్రెస్ గురించి రేవంత్రెడ్డికి ఏం తెలుసని హరీశ్రావు అన్నారు. టీడీపీలో ఉండి సోనియాగాం«దీని బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అని పొగుడుతున్నాడని విమర్శించారు. నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి చెప్పుల గుర్తుతో పార్టీ పెట్టీ బీజేపీలో చేరారని, నాటి పీసీసీ అధ్యక్షుడు బొత్స వైసీపీలో చేరారని, నువ్వు ఏబీవీపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్లో చేరావని, రేపు ఏ పార్టీలోకి వెళ్తావని రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గోదావరిపై నిర్మిస్తున్న పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం, 33/11కేవీ సబ్స్టేషన్, చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం, దోభిఘాట్కు శంకుస్థాపన, సుద్దాల వంతెనను మంత్రి ప్రారంభించారు. దోనబండ సభ, చెన్నూరు పట్టణంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్బ్లాక్ అవుతుందన్నారు. మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్రావు, బాల్క సుమన్ను భారీ మెజారీ్టతో గెలిపించాలన్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం చరిత్ర ఇదే...
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి రెండుసార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు. జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి. ఎమ్.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్ నుంచి లోక్సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్ కావడంతో హైదరాబాద్ నగరంలోని అంబర్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
50 రకాల విత్తనాలను ప్రదర్శించిన మహిళలు
-
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్లు మాయం
సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని దూరదర్శన్లో డైరెక్టర్గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్లో జరుగనున్నాయి. -
బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని పాటిల్ హైకోర్టులో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పాటిల్ పిటిషన్ను కొట్టివేసింది. మెయిన్ పిటిషన్(మదన్మోహన్ దాఖలు చేసిన)లో రోజూవారీగా వాదనలు వింటామని పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జార్ఖండ్లో పాటిల్పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని మదన్మోహన్రావు హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి 2022 జూన్లో ఆ పిటిషన్ను కొట్టివేశారు. అయితే దీన్ని మదన్మోహన్రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు జూన్ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, 3 నెలలైనా తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులు ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
‘బీబీ పాటిల్ ఎన్నిక’ పిటిషన్ పునఃవిచారించండి
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
వేరే వర్గానికి చెందిన యువకుడితో కూతురు ప్రేమ.. ప్రియుడితో కలిసి తల్లి..
సాక్షి, జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో జరిగిన ఈ సంఘటనను పోలీసులు సవాలుగా తీసుకుని రెండు రోజుల్లోనే ఛేదించారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందన్న కోపంతో కన్నతల్లే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుగ్గెల్లికి చెందిన గడ్డం బుజ్జమ్మకు కూతురు మౌనిక (16), కొడుకు సురేశ్(22) ఉన్నారు. కూతురు జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె తమ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లి, అన్నకు తెలియడంతో ఆమెను మందలించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం వల్ల పరువు పోతుందని ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆ బాలిక ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దాంతో పరువు పోతుందని భావించిన బుజ్జమ్మ కూతురిని హతమార్చాలనుకుంది. చదవండి: 10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య అంతా పథకం ప్రకారమే..: ఈ నేపథ్యంలో బుజ్జమ్మ కాశీంపూర్కు చెందిన తన ప్రియుడు నరసింహులుతో చర్చించి ఇద్దరూ కలసి కూతురిని హత్య చేయడానికి పథకం రచించారు. ప్రియుడితో పెళ్లి జరిపిస్తామని తల్లి బుజ్జమ్మ, నరసింహులు మౌనికకు చెప్పి ఆదివారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత అనుకున్న పథకం ప్రకారం.. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా నరసింహులు బాలిక మెడకు చున్నీ బిగించి ప్రాణం తీశాడు. అనంతరం గ్రామస్తులను నమ్మించేందుకు కూతురు తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. తర్వాత మౌనిక మృతి విషయం వెలుగులోకి రావడంతో తన కూతురును ప్రేమించిన యువకుడే హత్య చేశాడని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తల్లే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహులు, బుజమ్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రవిగౌడ్ను డీఎస్పీ అభినందించారు. చదవండి: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా? -
10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు తాళలేక మూడు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం డీఎస్పీ శంకర్రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కల్కోడె గ్రామానికి చెందిన మంజూల, బస్వరాజ్ దంపతుల కుమార్తె నిఖిత వివాహం పది నెలల క్రితం దామస్తపురం గ్రామానికి చెందిన సాయికుమార్తో జరిగింది. వివాహ సమయంలో రూ.2 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. వివాహమైన రెండు నెలల తర్వాత భర్త సాయికుమార్, అత్త అనుసూజ, మామ యాదప్ప అదనపు కట్నం కోసం వేధించేవారు. ఐదు నెలల క్రితం జహీరాబాద్లో కాపురం పెట్టారు. అయినా వరకట్న వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నిఖిత ఉరేసుకుంది. మృతురాలి తల్లి మంజూల ఫిర్యాదు మేరకు డీఎస్పీ, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్, తహసీల్దార్ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి పంచనామ నిర్వహించారు. నిందితులు సాయికుమార్, అను సూజ, యాదప్పను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మృతదేహాన్ని పోర్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8నెలలు)గా పోలీసులు గుర్తించారు.కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా గుర్తించారు. మృతదేహలు జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్డ్యాం
జహీరాబాద్: సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెక్డ్యాంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట తండాలో బుధవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీర్శెట్టి పెద్ద కొడుకు అరవింద్(11), విజయ్పవార్ రెండో కొడుకు శ్రీనాథ్ (9) మధ్యాహ్నం ఈత కోసం తండా శివారులోని చెక్డ్యాంలోకి దిగారు. లోతుగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా నీట మునిగారు. ఒడ్డుపై ఉన్న మరో బాలుడు ప్రేంసింగ్ విషయాన్ని గమనించి కేకలు వేయడంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు మునిగిన ఇద్దరినీ బయటకు తీశారు. వైద్యం కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలురిద్దరూ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
హౌసింగ్ పెట్టుబడులకు రన్వే.. ముంబై హైవే
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులకు భద్రతను, రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా వెంచర్లను అభివృద్ధి చేస్తుంది యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా. అందుబాటు ధరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ముంబై జాతీయ రహదారిలో పలు లే–అవుట్లను నిర్మిస్తోంది. ఆయా ప్రాజెక్ట్ వివరాలను కంపెనీ ఎండీ గణాది కమలాకర్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ► సదాశివపేటలోని ఆరూర్లో ధరణి పేరిట 32 ఎకరాల లే–అవుట్ను అభివృద్ధి చేస్తున్నాం. ముంబై హైవే ఫేసింగ్ వెంచర్లో 300 ఓపెన్ ప్లాట్లుంటాయి. ఒక్కో ప్లాట్ 165 నుంచి 500 గజాల్లో ఉంటుంది. డీటీసీపీ అనుమతి పొందిన ఈ వెంచర్ ప్రారంభమైన రెండు నెలల్లోనే 60 శాతానికి పైగా అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పటికే బ్లాక్టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, పార్క్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెమీ క్లబ్హౌస్ వంటి అన్ని రకాల వసతుల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. ► సదాశివపేటలోని ఎన్కాపల్లిలో 11 ఎకరాల్లో నీల్ గార్డెన్స్ వెంచర్ను చేస్తున్నాం. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇందులో 140 ప్లాట్లుంటాయి. ఒక్కోటి 165 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. ప్రస్తుతం భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. రెండు నెలల్లో అన్ని రకాల వసతుల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. తొలి హౌసింగ్ ప్రాజెక్ట్.. సంగారెడ్డిలోని కొత్లాపూర్లో 5 ఎకరాల్లో ఎస్ఎస్ఆర్ గ్రీన్ మెడోస్ పేరిట హెచ్ఎండీఏ వెంచర్ను అభివృద్ధి చేయనున్నాం. వచ్చే రెండేళ్లలో నగరంలో 200 ఎకరాల్లో సుమారు ఐదు వెంచర్లను ప్రారంభించనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి పశ్చిమ హైదరాబాద్లో తొలి గృహ నిర్మాణ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నాం. 2016 సెప్టెంబర్లో యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాను ప్రారంభించాం. అమరావతిలోని మోతడక, ఇబ్రహీంపట్నంలో వంద ఎకరాలలో పలు వెంచర్లను అభివృద్ధి చేశాం. ముంబై హైవేలోనే ఎందుకంటే? హైదరాబాద్ గుండా వెళ్లే ఇతర జాతీయ రహదారుల వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే రాయితీలు, ప్రోత్సాహక పథకాల వంటివి ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ముంబై హైవే అలా కాదు. సహజసిద్ధంగానే అభివృద్ధి చెందింది. ఎన్హెచ్ 65 ఎగుమతి, దిగుమతుల కేంద్రంగా, లాజిస్టిక్ హబ్గా డెవలప్మెంట్ ఉంది. జహీరాబాద్లో సుమారు 13 వేల ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) రానుంది. ఇందులో డిఫెన్స్, ఎయిరోస్పేస్, లాజిస్టిక్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్, మెటల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ వంటి రంగాల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇక్కడ చదవండి: ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా? పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు! -
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మృతి
జహీరాబాద్: జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న (82) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.నర్సింహారెడ్డిపై 35 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాజకీయ ముఖచిత్రం.. బాగన్న జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాగా, 1994 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెసేతర పార్టీ తరఫున విజయం సాధించిన మొట్ట మొదటి వ్యక్తి బాగన్నే. 1999 ఎన్నికల్లో బాగన్న తిరిగి ఎమ్మెల్యే టికెట్ను ఆశించి భంగపడ్డారు. ఆయన స్థానంలో టీడీపీ జి.గుండప్పకు టికెట్ కేటాయించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బాగన్నకు టికెట్ కేటాయించింది. అప్పుడు బాగన్న ఓటమిని చవిచూశారు. 2008లో బీజేపీలో చేరి 2009 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిచెందారు. అనంతరం అధికార టీఆర్ఎస్లో చేరారు. బాగన్న మరణంతో జహీరాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం బాగన్న అంత్యక్రియలు జహీరాబాద్లో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. బాగన్నకు ఇద్దరు కుమారులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కుమార్తెలు పద్మమ్మ, అనూశమ్మ ఉన్నారు. సీఎం సంతాపం.. మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న మృతిపై సీఎం కె.చంద్రశేఖరరావు త్రీవ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేసిన చెంగల్ బాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్హౌస్ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’
సాక్షి, సంగారెడ్డి: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మెజారిటీ రైతులు స్పష్టంచేశారు. ‘ఒక్కో కుటుంబానికి ఉన్న రెండు, మూడెకరాల సాగు భూమిని ఇవ్వడం కుదరదు. భూమి తల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి బతుకుతున్నాం.. ఉన్న భూమిని కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి. చావనైనా చస్తాం గాని.. భూములను మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదు’అని మెజారిటీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘నిమ్జ్’కోసం టీఎస్ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్ గ్రామ శివారులో బుధవారం ‘పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ’కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే నిమ్జ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్న గ్రామాల ప్రజలను, సామాజిక సేవా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వేదికవద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అనేకమందిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపించారు. చదవండి: ‘ఆటో’మేటిక్గా బతుకు‘చక్రం’ తిరిగింది సమీప గ్రామాల ప్రజలు కొందరిని మాత్రమే వేదిక వద్దకు అనుమతించారు. అక్కడకూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వెంటనే వారిని బయటకు పంపించివేశారు. కాగా, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిమ్జ్ను వ్యతిరేకిస్తున్న వందలాది మంది రైతులు పోలీసులకు చిక్కకుండా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ రైతులు, ప్రజలు నిమ్జ్కు వ్యతిరేకంగానే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు మాట్లాడారు. భూములు కోల్పోతున్న వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పారు. భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, భూములు కోల్పోతున్న వారి కుటుంబంలో ఒకరికి, అవకాశం ఉంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాలని వారు అధికారులకు సూచించారు. రైతులు, ప్రజలు అపోహ పడవద్దని, కాలుష్య రహిత ఫ్యాక్టరీలే ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం దేశానికే తలమానికం కాబోతున్నదని టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి అన్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. -
ఈ చలాన్తో దొరికిన ఆచూకీ
జహీరాబాద్ టౌన్: ఈ చలాన్ ద్వారా తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటు చేసుకుంది. డీఎస్పీ శంకర్రాజు కథనం ప్రకారం.. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన ముల్లపూడి సతీశ్ (35) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా, లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా ఏపీ10ఏయూ 9252 నంబర్ బైక్పై తిరుగుతున్న ఓ వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని వద్ద బైక్కు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో జరిమానా విధించి ఈ చలాన్లో పొందుపరిచారు. ఈ వివరాలు రిజిస్టర్ ఫోన్ నంబర్కు మెసేజ్ ద్వారా వచ్చింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు తప్పిపోయిన సతీశ్.. జహీరాబాద్లో ఉన్నట్లు తెలుసున్నారు. వెంటనే డీఎస్పీ శంకర్రాజును కలిశారు. పట్టణంలో అమర్చిన కెమెరాల ఆధారంగా జహీరాబాద్ టౌన్ ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్ హనీఫ్లు సతీశ్ ఆచూకీ కనుగొని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జహీరాబాద్లో కాల్పుల కలకలం
సాక్షి, మెదక్: జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్ మండలంలోని గోవిందపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన కమల్ కిశోర్ పల్లాడ్ గోవిందపూర్ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104 , 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్కు చెందిన అలీ అక్బర్, అస్రద్లు జీడిగడ్డతాండకు వెళ్లారు. సర్వే నంబర్ 109లో అలీ అక్బర్ భూమి ఉంది. అయితే కమల్ కిశోర్ పల్లాడ్ కడీలు వేయించే భూమిలో కూడా తమ ల్యాండ్ ఉందంటూ అలీ అక్బర్ వర్గం గొడవకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది. (చదవండి: వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!) ఈ నేపథ్యంలో అలీ అక్బర్ జహీరాబాద్కు చెందిన లాయక్ అనే రౌడీ షీటర్కు ఫోన్ చేసి పిలిపించాడు. స్కార్పియో వాహనంలో ఆయుధాలతో జీడిగడ్డతాండకు చేరుకున్న లాయక్.. కర్రలు, కత్తులతో కమల్ కిశోర్ వర్గంపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒక్కరికి గాయాలు అయ్యాయి. ఇక కమల్ కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అలీఅక్బర్, అస్రద్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక రౌడీ షీటర్ లాయక్ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. లాయక్పై జహీరాబాద్ రూరల్ పీఎస్లో రౌడీషీట్ తెరిచారు. ఇక 2018లో జరిగిన ఓ హత్యకు సంబంధించి లాయక్పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. అంతేకాక కమల్ కిషోర్, అక్బర్ అలీ మధ్య దాదాపు పదేళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నిమ్జ్ భూ సేకరణ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు (నిమ్జ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్జ్ కోసం 12,635 ఎకరాలను సేకరించేందుకు శుక్రవారం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణను ఆపాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణకు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటిఫికేషన్ను నయాల్కల్ గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో సవాల్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని పిటిషనర్ న్యాయవాది అర్జున్కుమార్ వాదించారు. రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేసే నిమ్జ్ వల్ల 10వేల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుందని తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని, కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే చేయాలని హైకోర్టు పేర్కొంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. సంగారెడ్డిలో కూడా పాజిటివ్ కేసులున్నాయని చెప్పింది. నిమ్జ్ ప్రాజెక్టు వల్ల 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్రం మార్గదర్శకాలు జారీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయవద్దంటూ రిట్పై విచారణను ముగించింది. -
ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?
జహీరాబాద్: ‘ఆలుగడ్డ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. పంట దిగుబడులు ఎలా ఉన్నాయి. గిట్టుబాటు అవుతుందా?’అని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆలుగడ్డ, అల్లం పంటల సాగు విధానం, రైతులు సాధిస్తున్న దిగుబడులు, మార్కెటింగ్ విధానం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్లో కొందరు రైతులు కేసీఆర్ను కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు వారు సీఎంతో గడిపారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతులు వెంకట్రాంరెడ్డి, నాగేశ్వర్రెడ్డి, బద్ది రామ్రెడ్డి, బద్రేశ్, కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన రైతు వై.జయసింహారెడ్డి సీఎంను కలసిన వారిలో ఉన్నారు. అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిపించుకున్నట్లు తెలిసింది. రైతులతో పాటు సంగారెడ్డి జిల్లా ఉద్యానవన అధికారి సునీత, జహీరాబాద్ అధికారి అనూషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ప్రాం తంలో సాగవుతున్న పంటల గురించి ముఖ్యమంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆలుగడ్డ సాగుపై ఆరా తీసిన కేసీఆర్.. ఈ పంట మరింత విస్తరించాల్సిన ఆవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. గత సంవత్సరం తగినంత మేర వర్షాలు లేక ఆలుగడ్డ పంట సాగు భారీగా పడిపోయిందని రైతులు సీఎంకు వివరించారు. కాగా, ఆలుగడ్డ, అల్లం పంటలను మార్కెట్కు తరలిస్తే కమీషన్ ఏజెంట్లు 10 శాతం మేర కమీషన్ వసూలు చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకే క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రైతులకు రానున్న రోజుల్లో తగిన మేలు కలుగుతుందని చెప్పినట్లు తెలిసింది. రెండేళ్లలో రైతుల కష్టాలకు చెక్ రైతులను దళారీ వ్యవస్థ నుంచి బయట పడేసేందుకు వీలుగా క్లస్టర్ వ్యవస్థ పని చేస్తుందని, రానున్న రెండేళ్లలో రైతుల కష్టాలు తీరుతాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. రైతులు పండించిన పంటను నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుందని చెప్పినట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఆలుగడ్డ పంట చేతికి అందివచ్చినప్పుడు ధరలు ఉండడం లేదని, తమ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తే పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల సౌకర్యం కల్పించాల్సి ఉందని, ఈ దిశలో తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నీటి వసతులు లేవని, దీంతో తగిన మేర పంటలను సాగుచేయలేకపోతున్నట్లు రైతులు వివరించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. సింగూరు నుంచి జహీరాబాద్తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు సాగునీటి వసతులను కల్పించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం రైతులతో చెప్పారు. చెరకు పంట సాగుపై ఆరా కాగా, చెరకు పంట సాగు ఏ మేరకు ఉంది.., ఎంత వరకు దిగుబడులు వస్తున్నాయని కేసీఆర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు సుమారుగా 40 నుంచి 50 టన్నుల మేర పంట దిగుబడి వస్తున్నట్లు వారు వివరించారు. జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నా యనే విషయమై సీఎం ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయల సాగుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము పండించిన అల్లం, పసుపు పంటను రైతులు సీఎం కేసీఆర్కు అందజేశారు. రైతులు పండించిన అల్లం పంట నాణ్యత బాగా ఉందని సీఎం మెచ్చుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ను కలసిన జహీరాబాద్ ప్రాంత రైతులు -
లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
జహీరాబాద్: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ గణపత్ జాదవ్ తెలిపారు. గురువారం కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులైన ఒంగోలు జిల్లా కొమురోలు మండలం ఎడమాకుల గ్రామానికి చెందిన బండి పవన్కుమార్ (29), కాజీపేట పట్టణం దర్గా ఫాతిమానగర్కు చెందిన బ్రహ్మచారి (38)లను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. పవన్కుమార్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఉప్పల్లో సిర్థపడిన ఖాజిపేటకు చెందిన బ్రహ్మచారిపై పలు కేసులు ఉన్నాయి. గతంలో ఓ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సోమాచారి (45) బుధవారం రాయికోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసులో ఏ–1 నిందితుడు పవన్కుమార్ను గంగ్వార్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా విషయాన్ని గమనించి తమ వెంట తెచ్చుకున్న కారులో బ్రహ్మచారి, సోమచారిలు రాయికోడ్ వైపు పరారయ్యారు. కారును వేగంగా నడపడంతో బోల్తా పడి సోమాచారి అక్కడికక్కడే మరణించగా బ్రహ్మచారి గాయపడ్డాడు. దీంతో బ్రహ్మచారికి ఆస్పత్రిలో చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమాచారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
పోలీసులమంటూ అత్యాచారం
జహీరాబాద్: మహిళతో పరిచయం పెంచుకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసునని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. కోదాడ నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన మహిళ(35) భర్త మరణించడంతో కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తన కొడుకుతో కలిసి వ్యాపారం నిమిత్తం నిషేధిత గుట్కాలు కొనేందుకు సోమవారం కర్ణాటకలోని బీదర్కు వెళ్లింది. మంగళవారం ఉదయం వాటిని కొనుగోలు చేసి కోదాడకు బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఆమె బస్సు దిగింది. అతనితోపాటు అతని స్నేహితుడు సైతం బస్సు దిగాడు. అయితే మొదటి వ్యక్తి తాము పోలీసులమని, బ్యాగ్ను తనిఖీ చేయాలని చెప్పడంతో ఆమె భయపడింది. తాము చెప్పినట్లు వినాలని, లేదంటే కేసు పెడతామని హెచ్చరించడంతో నిందితుడు చెప్పినట్లు చేస్తానని ఒప్పుకుంది. దీంతో బాధితురాలిని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద గల దుకాణాల సముదాయం వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో వచ్చిన మరో వ్యక్తిని, ఆమె కుమారుడిని పస్తాపూర్ క్రాస్రోడ్డు వద్ద గుట్కాకు కాపలా ఉంచాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం మహిళను అక్కడే వదిలిపెట్టి ఆమె తీసుకువచ్చిన గుట్కాతో వారు పరారయ్యారు. బాధితురాలు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రజాస్వామ్యం అంటే ఏంటి?
న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మరోసారి టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, డప్నూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులను పిలిచి 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్ర అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? అని హరీశ్రావు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం కళాశాల భవనాన్ని నిర్మించిందని, కాని విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, నాణ్యమైన విద్యనందించాలని అధ్యాపకులను కోరారు. ఎంత ఖర్చయినా చదివిస్తా: ఓ విద్యార్థిని చదువుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. గంగోత్రి అనే విద్యార్థిని మంత్రి వద్దకు వెళ్లి ‘మాది బీద కుటుంబం, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. నేను చదువుకుంటానో లేదో’ అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన ఆయన ‘నీవు ఎక్కడ చదువుకుంటావు.. చెప్పు! పూర్తి ఖర్చును నేనే భరిస్తాను’అని హామీ ఇచ్చారు. -
లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: మతి స్థిమితం సరిగ్గా లేక మానసికంగా బాధపడుతున్న వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జహీరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ– 2 విఠలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన మోసీన్ (34) అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సక్రమంగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి జహీరాబాద్కు చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్కు ఎదురుగా ఉన్న తిరుమల లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న అబ్దుల్ మోహిజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య బషీరాబాద్ ఉర్దూ మాధ్యమం పాఠశాలలో వలంటీర్గా పని చేస్తోంది. కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు బషీరాబాద్: జహీరాబాద్లో మోసీన్(38) ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి స్వగ్రామం క్యాద్గిరలో విషాదం అలుముకుంది. జహీరాబాద్లో పోలీసులు మృతదేహం అప్పగించడంతో గురువారం రాత్రి క్యాద్గిరకు చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యతో బషీరాబాద్ మండల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని మోసీన్కు నివాళులర్పించారు. -
జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
జహీరాబాద్ : స్థానిక రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్ఘ కాలం తర్వాత పెండింగ్ పనులు చేపట్టారు. జిల్లాలోనే ఏకైక అతిపెద్దది కావడంతో మోడల్ రైల్వే స్టేష¯Œ గా తీర్చిదిద్దేందుకు 2010 సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. అప్పట్లో స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టినా ప్రధాన పనులను మాత్రం పెండింగ్లో పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పెండింగ్ పనులకు మోక్షం కలిగింది. ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్ జహీరాబాద్ పట్టణం నడి బొడ్డున ఉండడంతో రెండు వైపుల ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగా మారింది. అండర్ బ్రిడ్జిలను నిర్మించినా అవి ఏ మాత్రం సౌకర్యంగా లేకపోవడంతో ప్రజలు స్టేషన్ కు ఇరు వైపులా వెళ్లేందుకు రైల్వే ట్రాక్ను దాటుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాంలను ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పనులు చురుకుగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో 26 రైళ్లు ఆగుతున్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి ఇప్పుడు నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాం సౌకర్యంగా మారనుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో తీరనున్న ఇబ్బందులు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో జహీరాబాద్ పట్టణ ప్రజల, ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. పట్టణంలోని రెండు వైపులా ప్రాంతాలకు రాక పోకలు సాగించే ప్రజలకు ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగపడనుంది. నిలుచున్న రైళ్ల కింద నుంచి దాటుకుని వెళ్లే ఇబ్బందులు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనుంది. రెండో ప్లాట్ఫాంతో సౌకర్యం ప్రస్తుతం స్టేషన్ లో ఒకే ప్లాట్ ఫాం ఉండడంతో రెండో ప్లాట్ఫాంపై నిలిచే రైళ్లలో నుంచి కిందిగి దిగే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీని తీసుకుని కిందికి దిగే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రెండో ప్లాట్ఫాం నిర్మాణం జరగనందునే ఈ పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం రెండో ప్లాట్ఫాం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగేందుకు సౌకర్యంగా మారనుంది. ఆకట్టుకుంటున్న బొమ్మలు జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు రంగులద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది కళాకారులు స్టేషన్ లో గోడలపై రంగులు, బొమ్మలు వేసే పనులు చేపట్టారు. పర్యావరణం, నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకం వద్దు, స్వచ్ఛ భారత్, పచ్చదనం తదితర వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే జంతువులు, పక్షుల చిత్రాలను ప్లాట్ ఫాం గోడలు, స్టేషన్ గోడలపై తీర్చిదిద్దుతున్నారు. రేల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను ఆయా చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్ఫాం నిర్మాణం పనులు త్వరలో పూర్తై వినియోగంలోకి రానున్నాయి. వీటిని పూర్తి చేయించేందుకు నేను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడా. రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి పనులను ప్రారంభించారు. పనులు త్వరలో పూర్తి చేయించి ప్రారంభింపజేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తాం. ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. –బీబీ పాటిల్,జహీరాబాద్ ఎంపీ -
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పార్టీలను పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. -
ఈ ఆటో డ్రైవర్ రూటే సెపరేటు
సాక్షి, జహీరాబాద్ : మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బరూర్బాబు తన ఆటో ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాకుండా తన ఆటోపై సమాజానికి ఉపయోగపడే సందేశాలను రాయించుకుని అందరిరికీ ఆదర్శంగా నిలిచారు. ఆటో ద్వారా పేదలకు సేవలు సైతం అందిస్తున్నారు. ఇచ్చినంతే తీసుకుని.. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలకు వెళ్లే రోగులు ఇచ్చినంతనే డబ్బు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని వారికి వత్తిడి చేయడం లేదు. గ్రామంలో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం ఆటో అవసరం అయినా వెంటనే అంగీకరించి ఆస్పత్రికి చేర్చుతున్నాడు. ఇచ్చినంతమే డబ్బు తీసుకుంటున్నాడు. పేదరికంలో ఉన్న వారు డబ్బులు ఇవ్వకున్నా సేవలు అందిస్తున్నారు. రహదారిపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చుతుంటాడు. హరితహారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సైతం తన ఆటో ద్వారా సుమారు 5 కిలో మీటర్ల వరకు నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేస్తుంటాడు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం అయినా తన వంతు సహాయ పడతాడు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు సైతం చేసి శభాష్ అనిపించుకుంటాడు. తను పేదరికంలో ఉన్నా ఇతరుడు సహాయపడడంలో ఉన్న తృప్తి మరి దేంట్లో ఉండదంటారు బాబు. డ్రైవర్ వృత్తిని నిర్వహిస్తూ తనవంతు అయిన సహాయం చేయడంలో ముందుటాడు. -
చిన్నారి మృతికి క్షుద్ర పూజలే కారణమా?
సాక్షి, జహీరాబాద్: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని సుమారు నాలుగు నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ బాలస్వామి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం పశువులు మేపేందుకు వెళ్లిన పశువుల కాపరులు గ్రామ శివారులో గుట్ట సమీపంలో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూశారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ జేశారు. గ్రామ వీఆర్ఓ సంజీవ్ హద్నూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ బాలస్వామి సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. మృతిపై పలు అనుమానాలు నాలుగు నెలల చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు నెలల చిన్నారి శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, తల కూడా తెగిపోవం వల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుప్త నిధుల కోసం గుట్ట ప్రాంతంలో కొందరు క్షుద్ర పూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృత దేహం గుర్తు పట్టని విధంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కంట తడి పెట్టారు. చిన్నారి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను లారీ కింద తోసిన భర్త
సాక్షి, ఝరాసంగం(జహీరాబాద్): భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న భర్త ఆమెను లారీ కిందకు తోసేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన శంకర్కు నాగమణి(38)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే ఇటీవలి కాలంలో గ్రామంలోనే ఇతర వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకుందామని అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్తో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం భార్యను వదిలించుకునేందుకు సోమవారం రాత్రి ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి ఆటోలో డ్రైవర్ హకీంతో కలిసి వచ్చారు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో కుప్పానగర్ గ్రామ శివారులోకి రాగానే ఆటో పంక్చర్ అయ్యిందని పక్కకు తోయాలని చెప్పడంతో నాగమణి ఆటో దిగింది. ఆటోను తోస్తున్న క్రమంలో లారీ డ్రైవర్ ఝరాసంగం నుండి జహీరాబాద్ వైపు లారీని తీసుకువస్తున్నాడు. పథకం ప్రకారం వస్తున్న లారీ కిందికి శంకర్ నాగమణిని తోసేశాడు. లారీ చక్రాలు ఆమె తలపై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. ముందు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతురాలి తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి, ఎస్ఐ ఏడుకొండలు వివరించారు. -
నవల్గాలో మద్యం నిషేధం!
సాక్షి, బషీరాబాద్(సంగారెడ్డి): యువతను పెడదారి పట్టిస్తున్న మద్యంను కట్టడి చేయడానికి బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ పంచాయతీ నడుం బిగించింది. గ్రామంలో నడుపుతున్న బెల్టు షాపుల భరతం పట్టాలని నిర్ణయించింది. దీని కోసం సర్పంచ్ డి. నర్సింహులు బుధవారం పంచాయతీ కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై ఒకటి నుంచి గ్రామంలోని మద్యపానం నిషేధిస్తూ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇకపై బెల్టు షాపులన్నీ మూసి వేయాలని నోటీసులు జారీకి రంగం సిద్ధం చేశారు. జులై ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందున ఇకపై బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులకు సర్పంచ్ లేఖ రాశారు. బషీరాబాద్ మండలం నవల్గా మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ యువత, కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే సాయంత్రం అయితే చాలు మద్యం ప్రియులు మద్యం తాగి రోడ్లమీద హల్చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో తరుచూ గొడవలు జరుగుతుండటమే కాకుండా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. అయితే గ్రామంలో జరుగుతున్న గొడవలకు ప్రధాన కారణం బెల్టు షాపులని భావించిన సర్పంచ్ డి.నర్సింహులు మద్యం బంద్ చేస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తూ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారన్నారు. అలాగే గని కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసై కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులకు కూ డా లేఖ రాసినట్లు సర్పంచ్ వెల్లడించారు. లేఖ మరోవైపు సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు స్వాగతించారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ఆయన్ని అభినందనలు తెలిపారు.. అలాగే గ్రామంలో స్వచ్ఛతపై కూడగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సర్పంచ్ చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలక్రిష్ణ, ఉప సర్పంచ్ మాల లాలప్ప, కార్యదర్శి లక్ష్మీకాంత్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్కుమార్, మహేష్, వార్డు సభ్యులు సిద్దయ్య, ఆనంద్, మొగులమ్మ, పార్వతమ్మ, మొగులమ్మ, రాములమ్మ, లక్ష్మీ, అంగన్వాడీ టీచరు పాల్గొన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
జహీరాబాద్: తన ప్రియురాలిని కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారాడని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్యచేయించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. నిందితుడు ముబీన్ మృతుడి భార్యతో కలిసి 1నుంచి 8వ తరగతి వరకు జహీరాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ముబీన్ అప్పటి నుంచి మృతుడి భార్యను ప్రేమిస్తున్నాడు. మృతుడు కరీం బతుకుదెరువు గురించి సౌది దేశం వెళ్లిన సమయంలో అతడి భార్య జహీరాబాద్లోని తల్లిగారింటికి వచ్చింది. దీంతో ముబీన్ ఆమెతో కలిసేవాడు. సుమారు 8 నెలల క్రితం మృతుడు కరీం సౌదీ దేశం నుంచి పూర్తిగా తిరిగి వచ్చాడు. ఆరు నెలల క్రితం జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా సమీపంలో హైటెక్ ఎస్.ఎస్ రేయిలింగ్ షాపును పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ముబీన్ తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కరీంను ఎలాగైనా చంపించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు పథకం వేసి తన స్నేహితుడు అయిన జహీరాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ సమద్(30)ని ఆశ్రయించాడు. సమద్ స్కూల్ బ్యాగులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అతడు వ్యాపారం సక్రమంగా చేయనందున అప్పుల పాలయ్యాడు. మద్యంకు బానిసగా మారాడు. ముబీన్ సమద్ బలహీనతలను గమనించి తన బాధలను చెప్పుకున్నాడు. కరీంను చంపినట్లయితే రూ.3లక్షలు సూపారి కింద ఇస్తానని, ఈ డబ్బుతో అప్పులు తీర్చుకోవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోమని నమ్మబలికాడు. దీంతో సమద్ తన అప్పులు తీరుతాయని భావించి ముబీన్ సూచన మేరకు కరీంను హత్యచేసేందుకు నిర్ణయించుకున్నాడు. సమద్కు రూ.10వేలు ముట్టచెప్పాడు ముబీన్. ముబీన్ను నమ్మి ఈనెల 2వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముబీన్ తన పల్సర్ మోటారు సైకిల్పై సమద్ను కూర్చోబెట్టుకుని ఆదర్శనగర్ క్రాసింగ్ వద్ద విడిచి పెట్టాడు. సమద్ తన వెంట కొబ్బరి బొండాం నరికే కత్తిని ప్యాంట్లో పెట్టుకుని కరీం దుకాణం వద్దకు వెళ్లాడు. వెళ్లి ఖాశీంపూర్ గ్రామంలో గల దర్గా వద్ద రేయిలింగ్ చేయాలని కరీంను రమ్మని కోరాడు. అతడిని బయటకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై రెండు సార్లు నరికాడు. ఇంకా కొట్టబోగా చేతులు అడ్డం పెట్టాడు. దీంతో దాడిలో కరీం రెండు చేతులు, భుజానికి గాయాలయ్యాయి. కుడికాలుపై కూడా వేటు వేశాడు. దీంతో అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరీం చనిపోయాడని నిర్దారించుకున్నాక వారు వేసుకున్న పథకం ప్రకారం.. బీదర్ క్రాస్ రోడ్డువద్ద ముబీన్, సమద్లు కలుసుకున్నారు. అనంతరం మోటారు సైకిల్పై కర్ణాటకలోని మన్నా ఎక్కెల్లికి పారిపోయారు. శుక్రవారం ఇరువురు తమ ఇళ్ల వద్దకు రాగా అరెస్టు చేసి మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. మృతుడు కరీంకు 4 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె ఉంది. ఈ సంఘటన మూడు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్సై రాజశేఖర్లు పాల్గొన్నారు. -
‘దొరతనానికి చరమగీతం పాడాలి’
సంగారెడ్డి: ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఘనత జహీరాబాద్ ప్రజలదని, నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఓట్లు ఎటూ పోవని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుతో కలిసి మునిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు కార్యకర్తలే బలమన్నారు. విద్యా, సమాచార హామీ హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. 14 మంది ఎంపీలతో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం పార్లమెంటులో ఏ ఒక్క రోజు మాట్లాడని వారు, ఇప్పుడు 16 ఎంపీ స్థానాలు గెలిపించమని అడగడానికి సిగ్గు అనిపించడం లేదా అని అన్నారు. 30 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు. నిజామాబాద్లో టీఆర్ఎస్పై నామినేషన్లతో రైతులు తిరగబడ్డారని అన్నారు. దొరతనం, దురహంకారానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్లో అభద్రత ఉంది.. అందుకే కాంగ్రెస్ నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఎన్నిక ప్రజాస్వామ్యానికి ఊపిరి అని వ్యాఖ్యానించారు. పెన్షనర్లను భయపెట్టడం, రైతుబంధు పథకం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్కు సిద్ధాంతం ఉందని, కార్యకర్తలకు ధైర్యం ఉందని చెప్పారు. సింగూరు నుంచి 16 టీఎంసీల నీటిని కూతురు కోసం తీసుకెళ్లాడని ఆరోపించారు. కారు..సారు.. పదహారు కాదు..దోచుకో..దాచుకో..దాటిపో అన్నదే కేసీఆర్ సిధ్ధాంతమన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటారా.. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..ప్రాజెక్టులు కట్టిందని వ్యాఖ్యానించారు. ఏటా రూ.72 వేల సహాయం: మదన్ కాంగ్రెస్ బడుగుల పార్టీ అని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు కొనియాడారు. కనీస ఆదాయ పథకం ద్వారా ఏటా రూ.72 వేల సహాయం అందిస్తామన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్, రైతు రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. బీబీ పాటిల్ పనికి రాని అసమర్థ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయలేని అసమర్థ ఎంపీ బీబీపాటిల్ అని విమర్శించారు. ప్రజల సమస్యలు తీర్చడం మరిచి తన సొంత వ్యాపార పనులు చక్కదిద్దుకున్నాడని ఆరోపించారు. నిరుద్యోగులు లేని జహీరాబాద్ను చూడాలనేదే తన కల అన్నారు. అద్దంలా జహీరాబాద్ను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. -
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి
జహీరాబాద్: బీజేపీ కేంద్ర అధిష్టానవర్గం విడుదల చేసిన రెండో జాబితాలో జహీరాబాద్ లోకసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. ఎల్లారెడ్డికి చెందిన బాణాల లక్ష్మారెడ్డి పేరును శనివారం సాయంత్రం అధిష్టానవర్గం అధికారికంగా ప్రకటిం చింది. బీజేపీ మొదటి జాబితాలో దేశంలోని 184 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణకు సంబంధించి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్కు చోటు లభించలేదు. శనివారం విడుదల చేసిన జాబితా లో జహీరాబాద్కు చోటు కల్పించారు. ఈమేరకు బాణాల లక్ష్మారెడ్డికి టికెట్ను ఖరారు చేశారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సోమాయప్పకు దక్కని అవకాశం జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గాను బీజేపీ టికెట్ కోసం సోమాయప్ప తీవ్రంగా కృషి చేశారు. మొదట్లో అధిష్టానవర్గం సోమాయప్పకే టికెట్ను ఖరారు చేసే విషయాన్ని పరిశీలించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పేరు ఖరారు కావడంతో బీజేపీ అధిష్టానవర్గం సోమా యప్ప అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి చూపలేదని తెలి సింది. పాటిల్, సోమాయప్పలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. దీంతో ఒకే ప్రాంతం, ఒకే సామాజిక వర్గం వారు కావ డంతో టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసినట్లు తెలిసింది. పాటిల్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే అంతగా ఫలితం ఉండదని భావించిన అధిష్టాన వర్గం చివరి నిమిషంలో బాణాల లక్ష్మారెడ్డి వైపు మొగ్గుచూపిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పేరు : బాణాల లక్ష్మారెడ్డి తండ్రిపేరు : భీంరెడ్డి తల్లి : సాయమ్మ భార్య : సావిత్రి కుమార్తెలు : రాగిణి, మోగన గ్రామం : ఎండ్రియాల్ మండలం : తాడ్వాయి నియోజకవర్గం: ఎల్లారెడ్డి జిల్లా : కామారెడ్డి విద్యార్హత : బీకాం రాజకీయ ప్రవేశం : 1993, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి బీజేపీలో చేరిక : 2010, నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి 32 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
చెరకు తోటలో పోటీ.. ఎవరి నోరు తీపి?
చెరుకు సాగుకు ప్రసిద్ధి చెందిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆ అంశమే ప్రధాన ప్రచారాస్త్రం కానుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చెరకు సాగు సమస్యలతో పాటు సింగూరు నీటి వ్యవహారం ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. ఏటా చెరుకు క్రషింగ్, మార్కెటింగ్, గిట్టుబాటు, రవాణా, బకాయిల పెండింగ్ వంటి సమస్యలతో చెరకు రైతులు సతమతం అవుతున్నారు. అలాగే, ఈ నియోజకవర్గాలన్నీ కూడా సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోనివే కావడంతో సాగునీటి అంశం కూడా ప్రధాన ప్రచారాంశం కానుంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఇదీ.. ముచ్చటగా మూడో ఎన్నిక.. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో 2009లో ఆవిర్భవించిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం 3వ లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలను పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ స్థానం పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా యి. సిట్టింగ్ ఎంపీ భీమ్రావు బస్వంత్రావు పాటిల్కు టీఆర్ఎస్ వరుసగా రెండోసారి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ సురేశ్షెట్కార్ పోటీకి దూరంగా ఉన్నారు. కాగా, 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన మదన్మోహన్రావు తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. మరో ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీ.. ఓ ఎన్ఆర్ఐ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి మినహా అన్నీ ‘గులాబీలే’.. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మిన హా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు (జాజుల) సురేందర్ టీఆర్ఎస్ కీలక నేత ఏనుగు రవీందర్రెడ్డిపై గెలుపొందారు. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగున్నర వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ విజయం సాధించారు. నారాయణఖేడ్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆ ర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఇరు పార్టీల నడుమ 1.32 లక్షల ఓట్ల తేడా ఉంది. ఏడుసెగ్మెంట్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థులకు మొత్తం 5,76,433 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 4,43,468 ఓట్లు వచ్చాయి. 2014 లోక్స భ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (టీఆర్ఎస్).. సురేశ్ షెట్కార్(కాంగ్రెస్)పై 1.44 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్మోహన్రావు 1.57 లక్షల ఓట్లు సాధించారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరింట టీఆర్ఎస్ గెలిచింది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు వచ్చిన మెజార్టీ 1.36 లక్షలు ఉండగా, ఒక్క నారాయణఖేడ్ పరిధిలోనే 56 వేల పైచిలుకు ఉంది. ఈ నేపథ్యంలో మదన్మోహన్రావు గెలుపు అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే ఫలితం సాధ్యమవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. సామాజికవర్గ సమీకరణాలే కీలకం.. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 4 జనరల్ అసెంబ్లీ సెగ్మెం ట్లు, 3 ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్లు ఉన్నాయి. లింగాయత్ సామాజిక వర్గం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని 2009 లోక్సభ ఎన్నికల నాటి నుంచే పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా, ప్రజారాజ్యం పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెంది న మల్కాపురం శివకుమార్కు టికెట్ ఇచ్చింది. చివరి నిముషంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సయ్యద్ యూసుఫ్ అలీపై సురేశ్ షెట్కార్ 17 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ లింగాయత్ సామాజిక వర్గానికే చెందిన బీబీ పాటిల్ను బరిలోకి దించింది. ప్రస్తుత ఎన్నికల్లో బీబీ పాటిల్ మరోమారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఖరారు కాగా, కాంగ్రెస్ మాత్రం అన్ని లెక్కలు వేసుకొని మదన్మోహన్రావును ఎంపిక చేసింది. ఇక, బీజేపీ పరిశీలనలో ఉన్న ఎన్ఆర్ఐ కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చెరకు, సాగునీటి సమస్యలే ఎజెండా.. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉండటంతో సాగునీరు అంశం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశాలున్నా యి. గత ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కోసం సింగూరు నుం చి 16 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో పాటు.. ప్రస్తుతం సింగూ రు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 29.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉండటంతో.. అందోలు, నారాయణ్ఖేడ్, జహీరాబాద్ పరిధిలోని పలు మండలాల్లో నీటి ఎద్దడి నెలకొంది. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం సింగూరు అడుగంటడంతో ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. దీనినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు దేశ రక్షణ, జాతీయ అంశాలు తనకు అనుకూలిస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇక, చెరకు సాగు సంబంధ అంశాలు సైతం ఎన్నికల్లో ప్రాధాన్యం వహించనున్నాయి. టీఆర్ఎస్ మాత్రం పార్టీ బలంగా ఉండటం, ప్రభుత్వ పథకాల అమలుపై ఆశలు పెట్టుకుంది. సన్నాహక సమావేశాల్లో బిజీ.. లోక్సభ ఎన్నికల దిశగా పార్టీ కేడర్ను సమాయత్తం చేసేందుకు రాజకీయ పక్షాలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల నిజామాబాద్లో జహీరాబాద్ లోక్సభ పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 13న నిజాంసాగర్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ.. లోపాలను సరిదిద్దుకుని భారీ మెజారిటీ సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ఆలోచనలో ఉంది.- కె.రాహుల్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు సంగారెడ్డి జిల్లా:జహీరాబాద్ (ఎస్సీ), అందోలు (ఎస్సీ), నారాయణఖేడ్. కామారెడ్డి జిల్లా:కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ (ఎస్సీ),బాన్స్వాడ. తొలి రెండు ఫలితాలు ఇలా.. 2009:ఎస్.సురేశ్ షెట్కార్(కాంగ్రెస్–17,407) 2014:బీబీపాటిల్(టీఆర్ఎస్–1.44,631) లోక్సభ ఓటర్లు పురుషులు 7,36,528 మహిళలు:7,58,889 ఇతరులు:62 మొత్తం:14,95,479 -
3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్
రాష్ట్రంలోని ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి లేని విధంగా విభిన్న సంçస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు, భాషల సమ్మిళితం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సరిహద్దుగా కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతం పరిధిలో మిళితమై ఉన్నాయి. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలకు కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గానికి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాల్లో కన్నడ భాష మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. దీంతో జుక్కల్లో మరాఠీ భాషను మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మరాఠీ భాష పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కరీంనగర్ యాసతో కూడిన భాషను మాట్లాడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడే కోస్తాంధ్రా వారూ ఉన్నారు. ఆచారాలు అనేకం.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగాల మండలాల్లో గిరిజనులు అధికం. ఆయా మండలాల్లో లంబాడీ భాషను అధికంగా మాట్లాడతారు. గాంధారిలో మథురాల తెగ కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి ఎక్కువ. అంతేకాక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా లింగాయత్ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో బసవేశ్వరుడి ఆచార వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ముస్లిం మైనార్టీలు సైతం జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చెరకు, వరి, అల్లం, ఆలుగడ్డ, జొన్న, కంది, మినుము, పెసర, పత్తి, గోధుమ తదితర పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. జీవన వైవిధ్యం.. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆచార వ్యవహారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కట్టూబొట్టూ దగ్గరి నుంచి సంస్కృతీ సంప్రదాయాల వరకు అన్నింటా ఇక్కడ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. జహీరాబాద్ లోక్సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్ నియోజకవర్గాలు మెదక్ లోక్సభ పరిధిలో ఉండేవి. జహీరాబాద్ లోక్సభ ఆవిర్భావంతో జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్తో పాటుగా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్ ప్రాంతంపై బీదర్ ప్రభావమూ ఎక్కువ ఉంటుంది. జహీరాబాద్, నారాయణ్ఖేడ్ ప్రాంతాల వారు ఎక్కువగా పనులపై కర్ణాటక, మహారాష్ట్రలోని పట్టణాలకే వెళ్లి వస్తుంటారు. నారాయణ్ఖేడ్లో మహారాష్ట్ర సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ గల పండరి భక్తులు వేల మంది ఏటా పండరినాథుని దర్శనానికి కాలినడకన ‘దండుయాత్ర’గా మహారాష్ట్రలో గల పండరి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక పాలు కూడా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ. నిత్యం సప్తాహాలు, భజనలు వంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు తలపై టోపీలతో మహారాష్ట్ర ఆచార వ్యవహారాలను తలపిస్తారు....::: దివాకర్ రెడ్డి కొలన్, సంగారెడ్డి -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
13న నిజాంసాగర్కు కేటీఆర్ రాక
నిజాంసాగర్: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 13న నిజాంసాగర్ మండలానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేటీఆర్ రాక, సభ నిర్వహణకు గాను సోమవారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్షిండే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుంచి 20వేల మంది ముఖ్యనేతలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మొట్టమొదటిసారిగా జహీరాబాద్ పార్ల మెంట్ నియోజకవర్గ సమావేశాన్ని నిజాంసాగర్ మండలంలో నిర్వహించడం అదృష్టమన్నారు. జహీరాబాద్ పార్లమెంట్తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, అసెంబ్లీ స్పీకర్ తనయుడు సురేందర్రెడ్డి, ఎంపీ పాటిల్, జిల్లా ప్రతినిధులు శంకర్ పటేల్, గంగాదర్, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి మండల టీఆర్ఎస్ నాయకులు గైని విఠల్, దుర్గారెడ్డి, కమ్మరికత్త అంజయ్య, రమేష్గౌడ్, పీరని సాయిలు, వాజిద్ అలీ, మహేందర్, ఇప్తాకర్, కాంత్రెడ్డి, చింతకింది రాములు తదితరులు ఉన్నారు. నేడు మంత్రి ప్రశాంత్రెడ్డి రాక.. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం నిజాంసాగర్ మండలానికి రానున్నట్లు ప్యానల్ స్పీకర్ హన్మంత్షిండే తెలిపారు. ఈ నెల 13న కేటీఆర్ రానుండటంతో మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని, ఇక్కడి ఏర్పాట్లను మంత్రి పరిశీలిస్తారన్నారు. మధ్యాహ్నం రెండున్న రకు మంత్రి రానుండటంతో మంత్రి పర్యటనకు నాయకులు తరలిరావాలని ఆయన సూచించారు. -
ఎంపీ టికెట్టు సిట్టింగ్కేనా?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీల్లో అభ్యర్థిత్వాలపై కసరత్తు సాగుతోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈనెల 13న జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్న దానిపై క్యాడర్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలోలాగే సిట్టింగ్ ఎంపీలకే తిరిగి టికెట్లు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. లోక్సభ నియోజక వర్గాల వారీగా సన్నాహక సభలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న జహీరాబాద్ నియోజక వర్గ సభను నిజాంసాగర్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఎంపీ టికెట్టు ఎవరికి అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బీబీ పాటిల్ విజయం సాధించారు. తిరిగి పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అయి తే బీబీ పాటిల్ను వ్యతిరేఖిస్తున్న కొందరు నేతలు తెరపైకి పలువురి పేర్లను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న పాటిల్కే టికెట్టు వస్తుందని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే టికెట్టు ఖరారు అయ్యిందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీం దర్రెడ్డి ఎంపీ టికెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఎంపీ పాటిల్కు ఒకరిద్దరు తప్ప మిగతా వారితో అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం ప్రచారంలో ఉంది. దీంతో అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. సన్నాహక సభతో స్పష్టత! జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఈనెల 13న నిజాంసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోని మాగి వద్ద టీఆర్ఎస్ సన్నాహక సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నా రు. పార్లమెంట్ ఎన్నికల టీం లీడర్గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయన స్పష్టత ఇస్తా రని పార్టీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ను కలిసన పాటిల్ సీఎం కేసీఆర్ను ఇటీవల ఎంపీ బీబీ పాటిల్ కలిశారని, ఈ సందర్భంగా ఎంపీ టికెట్టుపై సీఎంనుంచి భరోసా లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఎల్లారెడ్డిలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎమ్మె ల్యే ఓటమి చెందినప్పటికీ అక్కడ టీఆర్ఎస్ బలం గానే ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్, జహీరాబాద్, ఆంధోల్ నియోజక వర్గాల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు సులువవుతుందని ఎంపీ పాటి ల్ అనుచరులు చెబుతున్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు -
ఆ హక్కు కేసీఆర్, హరీష్కు ఎవరిచ్చారు
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్కు తీసుకుపోయే హక్కు కేసీఆర్కు, హరీష్కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు, రీ నోటిఫికేషన్లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. -
మున్సిపల్ కౌన్సిలర్ బూతు పురాణం
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు అభివృద్ధి పనుల్లో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కు నడుమ జరిగిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మున్సిపల్ ఇంజనీర్పై కౌన్సిలర్ బూతు పురాణానికి దిగిన ఘటన 4 రోజుల క్రితం జరగ్గా, మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. కౌన్సిలర్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సదరు కౌన్సిలర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. జహీరాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టరుతో ఒప్పందం కుదిరినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ రాములు ఈ నెల 5న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అవినాశ్రెడ్డికి ఫోన్ చేశారు. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని కౌన్సిలర్ రాములు ప్రశ్నించగా, 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కాంట్రాక్టు పొందిన వ్యక్తులు చెప్పారని ఏఈ సమాధానం ఇచ్చారు. దీంతో ఫోన్ సంభాషణ గాడి తప్పి.. కౌన్సిలర్ రాములు బూతు పురాణం ఎత్తుకున్నారు. పత్రికలో రాయలేని భాషలో ఏఈని దుర్భాషలాడారు. ‘చేతనైతే పనులు చేయండి. లేదంటే వెళ్లిపోండి. ఆర్అండ్బీకి సంబంధించిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని’గద్దించారు. పనితీరు నచ్చక పోతే కమిషనర్కు ఫిర్యాదు చేయాలని ఏఈ చెప్పినా, బూతు పురాణం ఆపలేదు. ఈ వ్యవహారంపై ఏఈ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జైత్రాంకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనివ్వగా, పనులు ప్రారంభం కాకపోవడంతో వార్డు ప్రజల నుంచి ఒత్తిడితోనే సహనం కోల్పోయానని కౌన్సిలర్ అన్నారు. -
మరుగుదొడ్డి గుంతలో పడి యువకుడి మృతి
జహీరాబాద్ టౌన్: మరగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందినట్లు జహీరాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ (24) బంధువుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. బంధువుల ఇంటిలో పెళ్లి ఉండగా మృతుడు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పనులు చేస్తున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి పరిసర ప్రాంతం చీకటిగా ఉండడంతో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతను గమనించక అందులో పడిపోయాడు. తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ విషయం తెలుసుకుని జహీరాబాద్ ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పొలం డబ్బుల వివాదంతోనే హత్య
జహీరాబాద్ : మండలంలోని దిడిగి గ్రామంలో మ్యాతరి పుణ్యమ్మ(47) హత్యకు గురైన కేసులో ఆదివారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ నాగరాజు కథనం మేరకు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని స్థితిలో హత్యకు గురైన పుణ్యమ్మ మృతదేహం ఈ నెల 9న ఆమె సొంత చెరుకు తోటలో లభ్యమైంది. దీంతో కుమార్తె జయశీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7న పుణ్యమ్మ కనిపించకుండా పోయింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం.డి.రజాక్(35)ను నిందితుడిగా గుర్తించారు. రజాక్ పుణ్యమ్మ పొలాన్ని సగం వాటా కింద సాగు చేస్తున్నాడు. పొలంలో పండించిన ఆలుగడ్డ పంట విక్రయించగా వచ్చిన రూ.50వేలలో సగం వాటా రజాక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై ఎన్ని మార్లు అడిగినా ఆమె రజాక్కు డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలో 7న మధ్యాహ్నం పుణ్యమ్మ, రజాక్లు పొలం వద్ద ఉన్నారు. ఇంతలోనే చింతకాయల వ్యాపారి జిలానీ అక్కడకు వెళ్లి చింతచెట్టు లీజు డబ్బులు రూ.5వేలు పుణ్యవతికి ఇచ్చి వెళ్లాడు. అప్పుడు ఆమె ఆ డబ్బులను దగ్గర పెట్టుకోమని రజాక్ చేతికి ఇచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని పుణ్యమ్మ రజాక్ను కోరింది. తనకు ఆలుగడ్డల డబ్బులు రావాల్సి ఉంది, అందుకే ఈ డబ్బులు ఇవ్వనని రజాక్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రజాక్ తన చేతిలో ఉన్న గొడ్డలితో పుణ్యమ్మపై దాడి చేసి నరికి హత్యకు పాల్పడినట్లు సీఐ వివరించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలితోపాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దిడిగి గ్రామ క్రాస్రోడ్డు వద్ద గల ఓ హోటల్లో ఉన్న నిందితుడు రజాక్ను పట్టణ ఎస్ఐ ప్రభాకర్రావుతో కలిసి వెళ్లి పట్టుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు. హత్య కేసును ఛేదించినందుకు పోలీసు సిబ్బంది వెంకటేశం, అమర్నాథ్రెడ్డి, సురేందర్, శ్రీనివాస్, జైపాల్రెడ్డి, సామెల్ల పేర్లను రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య
జహీరాబాద్: విదేశాల నుంచి ఫోన్లో భర్త బెదిరింపులతో పాటు ఇంట్లో అత్త, మామలు పెట్టే బాధలను భరించలేక మంజుల(36) అనే వివాహిత సోమవారం రాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ప్రభాకర్రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన కుల్కర్ణి సురేందర్ కుమార్తె మంజులకు ఇబ్రహీం పట్నానికి చెందిన శేషవర్ధన్తో 18 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భర్త ఉద్యోగం నిమిత్తం కెనడా వెళ్లాడు. దీంతో మంజుల అత్త శ్రీదేవి, మామ రాఘవరావులతో కలిసి ఉండేది. దీంతో అత్త, మామలు ప్రతినిత్యం వేధింపులకు గురి చేసేవారు. భర్త సైతం ఫోనులో దూషిస్తూ మానసికంగా వేధించేవాడు. విషయం తెలుసుకున్న తండ్రి తన కుమార్తెను పెళ్లి అయిన ఏడు నెలలకే తన దగ్గరకు తీసుకెళ్లాడు. భర్త తరచూ ఫోన్చేసి భార్యను బెదిరిస్తూ వేధించేవాడు. ఆరు నెలల క్రితం అత్త, మామలు, పెద్ద మనుషులు జహీరాబాద్ వచ్చి పంచాయతీ నిర్వహించారు. ఈ మేరకు భార్యా భర్తలు ఇరువురు విడాకులు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. జహీరాబాద్ కోర్టులో విడాకుల కోసం మంజుల పిటిషన్ వేసింది. ఈ కేసు పెండింగ్లో ఉంది. జీవితంపై విరక్తి చెందిన మంజుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. కుటుంబ సభ్యులంతా దైవ దర్శనం కోసం ఝరాసంగం ఆలయానికి వెళ్లారు. ఇంట్లో మంజుల ఒక్కతే ఉంది. రాత్రి ఇంట్లో నుంచి పొగలు రావడం చూసిన చుట్టుపక్కల వారు సురేందర్ కుల్కర్ణికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో అతడు ఇంటికి వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా కుమార్తె మంజుల ఆత్మహత్య చేసుకుని ఉంది. అనంతరం సీఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
నా భర్త సంసారానికి పనికిరాడు
-
మా ఆయన అదో టైపు
-
మా ఆయన చాలా ‘తేడా’
సాక్షి, సైదాబాద్: సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్కు చెందిన అంకుష్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి మానేశారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూయార్క్ సదస్సులో జహీరాబాద్ కుర్రోడు
జహీరాబాద్: తెలంగాణ బిడ్డ సాయిప్రణీత్రెడ్డి న్యూయార్క్ సదస్సులో ప్రసంగించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు న్యూయార్క్లో నిర్వహించిన ‘సమ్మర్ యూత్ అసెంబ్లీ– 2017’ సదస్సులో మన దేశం తరఫున పాల్గొని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ప్రస్తావించారు. యువతలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని తెలిపారు. పేదరికం ఉత్తమ విద్యార్జనకు అడ్డు కాకూడదని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చివరి రోజున జరిగిన సదస్సులో సాయిప్రణీత్రెడ్డి భారత దేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని తన ప్రసంగంలో చాటి చెప్పారు. దేశ, రాష్ట్ర సంస్కృతిని చాటే చేనేత వస్త్రాలను ధరించి హాజరయ్యాడు. సదస్సులో భాగంగా పలువురు ప్రముఖులను ఆయన కలుసుకున్నాడు. సాయిప్రణీత్రెడ్డి కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వాడు. -
జహీరాబాద్లో కార్డెన్ సెర్చ్
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్లోని భరత్నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖ్లీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలతో పాటు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. -
రిపోర్టుల్లో దాగిన మిస్టరీ
దివ్య కేసు దర్యాప్తులో తీవ్రజాప్యం 100 రోజులు దాటినా కొలిక్కి రాని వ్యవహారం ఆందోళన చెందుతున్న మృతురాలి తల్లిదండ్రులు కోహీర్: జహీరాబాద్ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని దివ్య మరణం మిస్టరీ 100 రోజులు దాటినా వీడలేదు. కేసు విచారిస్తున్న రైల్వే పోలీసులు రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. హత్యగా భావిస్తున్న తల్లిదండ్రులు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్లి మృతి కోహీర్ మండలం మద్రి గ్రామానికి చెందిన దివ్య జూన్ 30 తేదిన కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తర్వాత రోజు ఉదయం మద్రి శివారులో రైలుపట్టాలపై దివ్య శవం పడిఉంది. విషయం తెలుసుకొన్న విద్యార్థి, మహిళా సంఘాలు దివ్య మరణం ముమ్మాటికీ హత్యేనని, దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. అధికారులకు వినతిపత్రాలు సైతం అందించారు. దివ్య తల్లిదండ్రులు ఎస్పీని కలిసి.. ఆమె మరణంపై పలు అనుమాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తె చదువులో చురుకైందని, ఎస్సెస్సీలో స్కూల్ ఫస్టు వచ్చిందని, ఎంతో ధైర్యవంతురాలని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రించడానికి రైలుపట్టాలపై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసును సివిల్ పోలీసులకు అప్పగించి, దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దివ్య జూన్ 30 తేది రాత్రి 8.20 గంటల వరకు జహీరాబాద్లో ఉన్నట్లు ప్రత్యక్షసాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. రోడ్డు మరమ్మతుల కారణంగా జహీరాబాద్– కోటమర్పల్లి వయా మద్రి, గురుజువాడ బస్సు రద్దు చేశారు. దీంతో రాత్రి సమయంలో దివ్య జహీరాబాద్ నుంచి మద్రికి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు. బహుశా తెలిసిన వ్యక్తుల వెంట వచ్చి మోసపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఎవరితో వచ్చిందో తెలిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైలు పట్టాలపై శవం లభించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను, స్థానికంగా కొందరిని విచారించారు. అయితే, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలంటే పోస్టుమార్టం నివేదికలు తప్పనిసరి అవసరమని రైల్వే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
సర్పంచ్ స్థాయి నుంచి.. ఎమ్మెల్సీ స్థాయికి..
అంచెలంచెలుగా ఎదిగిన ఫరీదుద్దీన్ జహీరాబాద్: మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ గురువారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపంసహరణ గడువు ముగియడంతో ఒకే ఒక నామినేషన్ దాఖలైనందున ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు. జహీరాబాద్కు చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ పేరును ముందస్తుగానే ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ అధిష్టాన వర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్ స్థాయి నుంచి జహీరాబాద్ మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ పదవి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985 నుంచి 1990 సంవత్సరం వరకు సర్పంచ్గా, ఎంపీపీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1990 నుంచి 1999 వరకు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1990 నుంచి 1995 వరకు ఇప్పపల్లి ఏపీసీఎస్ ఛైర్మన్గా పని చేశారు. 1999 సంవత్సరంలో మొదటి సారిగా జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఫరీదుద్దీన్కే ఎమ్మెల్యే టికెట్ను కేటాయించగా గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో స్థానం పొందారు. మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ, ఫిషరీస్, సహకార శాఖల మంత్రిగా పని చేశారు. ప్రముఖుల శుభాకాంక్షలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్కు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్, మాజీ జడ్పీటీసీ ఆర్.అరవిందరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వైజ్యనాథ్, జి.విజయకుమార్, పాండురంగారెడ్డి, షేక్ ఫరీద్లతో పాటు పలువురు హైదరాబాద్లో ఫరీదుద్దీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్లో సంబరాలు ఫరీదుద్దీన్ స్వస్థలమైన జహీరాబాద్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం పార్టీ నాయకులు పట్టణంలోని భవానీ మందిర్ క్రాస్ రోడ్డు వద్ద బణ సంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సంబరాల్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ అల్లాడి నర్సింహులు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. -
బలహీన వర్గాల అణిచివేతకు ప్రభుత్వ కుట్ర
బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట కార్యదర్శి జగన్ జహీరాబాద్ టౌన్: రాష్ర్ట ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు కుట్రపన్నుతోందని బీజేపీ దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొండాపూర్ జగన్ ఆరోపించారు. బుధవారం ఆయన జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను విలీనం చేయాలని, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను ఒకే గొడుగు కిందని తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పొద్దుటూరి శ్రీనివాస్గుప్తా, మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్బండారీ, ఐటీ సెల్ కన్వీనర్ ఆశోక్బెల్కేరి తదితరులు పాల్గొన్నారు. -
గోరు చిక్కుడు.. లాభాలు బోలెడు
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి జహీరాబాద్ ప్రాంతంలో అనువైన నేలలు ఏడీఏ వినోద్కుమార్ జహీరాబాద్ టౌన్: తక్కవ పెట్టుబడితో ఆదాయనిచ్చే పంటల్లో గోరుచిక్కుడు ఒకటి. జహీరాబాద్ ప్రాంతం నేలలు అనుకూలం కావడంతో ఇక్కడి రైతులు ప్రతి సంవత్సరం గోరు చిక్కడు పండిస్తారు. ఖరీప్ సీజన్ చివరి వరకు పంట సాగుచేసుకోవచ్చు. ఖరీఫ్, వేసవి పంటలకు గోరుచిక్కుడు అనుకూలం. మురుగునీరు పోయే సౌకర్యం కలిగిన సారవంతమైన నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. గొరు చిక్కుడు సాగు యాజమాన్య పద్ధతులను జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్కుమార్ (7288894426)వివరించారు. పూసా నవబహర్, పూసా మౌసమి అనువైన రకాలు. పూసా నవబహార్ రకం ఖరీఫ్, వేసవి పంటలకు అనువైనవి. కొమ్మలు లేకుండా ఉంటాయి. విత్తనాలు ,కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. ఈ రకం విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆఖరి వరకు సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 12-18 కిలోల వరకు విత్తనం అవసరం. విత్తేముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పొలంలో మొదిటిసారి విత్తుతే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించాలి విత్తనాకి విత్తనానికి 60/15 దూరం చూసుకోవాలి. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను సగం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగం ఎరువులను 30-40 రోజులకు వేయాలి. పైసా మౌసమి రకం ఖరీఫకు అనుకూలం. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. పంటలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. పొలంలో గింజలు విత్తగానే మూడు రోజులకు నీర పారించాలి. తర్వాత వారం రోజులకు ఓ సారి నీటి తడులు ఇవ్వాలి లేత కాయలు కోసి మార్కెట్కు పంపాలి. కాయ ముదురు కాకుండా చూడాలి. ముదరవుతే పీచు శాతం అధికమై నాణ్యత తగ్గుతుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గోరు చిక్కుడు అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు పసుపు, మిరప, బెండ తదితర పంటల్లో వేయవచ్చు -
సెమీఫైనల్కు చేరిన జంటనగరాల జట్లు
జహీరాబాద్: స్థానిక బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్లో స్టుడెంట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 అంతర్ జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్లో జంటనగరాలకు చెందిన జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారం లీగ్, నాకౌట్ దశలో జరిగిన పోటీల అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో పాటు వరంగల్, మహబూబ్నగర్ జిల్లా జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. సోమవారం జరిగనున్న సెమీ ఫైనల్ పోటీల్లో రంగారెడ్డి జట్టుతో మహబూబ్నగర్ జట్టు, హైదరాబాద్ జట్టుతో వరంగల్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఫైనల్ పోటీ నిర్వహిస్తారు. లీగ్ పోటీల నుంచి ఫైనల్ పోటీల వరకు ఆయా జిల్లాల క్రీడాకారులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నారు. టోర్నమెంట్ను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫెడ్రిక్, అబ్జర్వర్ రవికుమార్లు పర్యవేక్షించారు. పీడీలుగా గోపిసింగ్, మచ్చేందర్, ధన్రాజ్, అజిమొద్దీన్లు వ్యవహరించారు. -
ఆవుపై నుంచి దూసుకెళ్లిన లారీ
కాలికి తీవ్రగాయం జహీరాబాద్ టౌన్: పట్టణంలోని రహదారిపై సేదతీరుతున్న ఆవు కాలిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కొందరు పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చికిత్స చేశారు. పట్టణంలోని మోర్ ముందు జాతీయ రహదారిపై కొన్ని ఆవులు సోమవారం సేదతీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్లుతున్న ఓ లారీ చక్రాలు ఆవు కాలిపై నుంచి వెళ్లడంతో గాయపడింది. దీంతో ఆవు కాలినుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కొందరు పశువైద్యాధికారులకు సమాచారమిచ్చారు. పశువైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పూల సంతోష్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆవుకు చికిత్స నిర్వహించారు. -
‘నారింజ’కు భారీగా వరదనీరు
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్ మండలంలో 2.6 సెం.మీ, కోహీర్ మండలంలో 3.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు షటర్ల పైనుంచి కొద్ది మేర నీరు బయటకు పోయింది.మంగళవారం రాత్రి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల మేర నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది. -
అల్లం.. సస్యరక్షణతో మేలు
- తెగులు నివారిస్తే అధిక దిగుబడి - ఎనిమిది నెలల పంట - పెట్టుబడి అధికం - ఏడీఏ వినోద్కుమార్ సలహాలు, సూచనలు జహీరాబాద్ ప్రాంతంలో రైతులు అల్లం పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సారవంతమైన ఎర్ర నేలల్లో అల్లం దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్ల రేగడిలోనూ పండుతుంది. ఎనిమిది నెలలకు చేతి కొచ్చే ఈ పంట సాగుకు ఖర్చు అధికం. దిగుబడి కూడా అంతేస్థాయిలో ఉండడంతో రైతులు అల్లం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్కుమార్ (సెల్: 72888 24499) తెలిపారు. - జహీరాబాద్ టౌన్ విత్తన రకాలు: - అల్లంలో మారన్, మెదక్, సుపభ్ర, సురచి, సురభి, వైనాడ్, నదియా వంటి రకాలున్నాయి. - జహీరాబాద్ ప్రాంత నేలలకు మారన్ రకం అనుకూలం. - ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. - విత్తనం పొడుగు 4.5 సె.మీ., 30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులండాలి. - 500 గ్రాముల ఎం 45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. - విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజులపాటు ఆరబెట్టాలి. - ఎకరానికి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. సాగు విధానం: - సారవంతమైన ఎర్ర, నల్ల రేగడి నేలలు అల్లం సాగుకు అనుకూలం. - పొలాన్ని లోతువరకు దున్ని దుక్కిచేసుకోవాలి. - ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ) ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ ఫాస్పేట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్పై వేయాలి. - బెడ్ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. - క్రమం తప్పకుండా నీటి తడులు పెడుతుండాలి. - డ్రిప్ విధానం చాలా మంచిది. యాజమాన్య పద్ధతులు: - విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమోనియా సల్ఫేట్, 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. - 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి. - 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. - 150-180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ ఒక గ్రాము వేయాలి. తెగులు నివారణ: రైజోమ్వాట్: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే: ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్డిజమ్ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అల్లం పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవచ్చు. మామిడి తోటల్లో కూడా అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. -
వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథుడికి భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. -
వేధిస్తున్నాడనే హత్య
వీడిన కేసు మిస్టరీ ఐదుగురు నిందితుల రిమాండ్ సీఐ నాగరాజు వెల్లడి జహీరాబాద్ టౌన్: వేధింపులను భరించలేకే కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని హతమార్చారు. వివాహేతర బంధాన్ని నిలిపివేయాలని చెప్పినా వినకపోవడంతో సదరు వ్యక్తులు అంతమొందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు మంగళవారం రిమాండ్కు పంపారు. జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.నాగరాజు వెల్లడించిన హత్య కేసు వివరాలు ఇలా... మండలంలోని మన్నాపూర్కు చెందిన వెంకటవిజయ్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటూ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పట్టణంలోని బాగారెడ్డి పల్లికి చెందిన బుజ్జమ్మను భర్త వదిలేయడంతో ఆమెతో వెంకట్విజయ్ వివాహేతర సంబధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బుజ్జమ్మ సోదరులు అక్కను మందలించారు. దీంతో ఆమె వెంకట్విజయ్తో కొంతకాలంగా దూరంగా ఉంటుంది. వెంకట్విజయ్ అప్పుడప్పుడు తాగి ఆమె ఇంటికి వచ్చి అల్లరిచేస్తుండగా మందలించి పంపించేవారు. ఈ క్రమంలో వెంకట్విజయ్ ఈనెల 2వ తేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. బుజ్జమ్మ ఆమె తమ్ముళ్లు శ్రీనివాస్, కుమార్, అరుణ్కుమార్తో పాటు బేగరి సురేష్, గడికి చెందిన చిలపల్లి అరుణ్కుమార్లు ఇంటి వద్ద రాత్రంతా చితకబాదారు. మరుసటి రోజు పట్టణ సమీపంలోని రాంనగర్ ప్రాంతంలో గల దాల్మిల్ వద్ద గల అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లారు. అక్కడే మద్యం తాగి కర్రలతో వెంకట్విజయ్ను చితకబాది హత్య చేశారని సీఐ తెలిపారు. శవంపై చెట్టు కొమ్మలు వేసి పరారైనట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశామన్నారు. అయితే సురేష్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. -
బ్రదర్స్ ట్రస్ట్ తో జహీరాబాద్లో నయ మోసం
-
బీజేపీ తిరంగయాత్ర
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి గ్రామంలో బీజేపీ నాయకులు తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పండరి ఆధ్వర్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బసవేశ్వరుడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలే వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్గుప్తా, జిల్లా మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్ బండారీ, నాయకులు విశ్వనాత్ యాదవ్, ప్రభాకర్రెడ్డి, అల్లాడి బక్కయ్య గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. దేవీసింగ్
డ్రాపౌట్ లేని గిరిజన బడి హరిత వనంలా పాఠశాల.. విద్యార్థుల్లో క్రమశిక్షణ హెచ్ఎం కృషి ఫలితం.. జహీరాబాద్ టౌన్:చుట్టూ పచ్చని మొక్కలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఉపాధ్యాయుల అంకిత భావం.. గిరిజన విద్యార్థుల్లో క్రమశిక్షణ.. అంతా కలగలిపి.. రాయిపల్లి(డి) తండా బడి..ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృషితో పాఠశాల ప్రగతి వైపు పయనిస్తోంది. జహీరాబాద్ మండలంలో 20కి పైగా గిరిజన తండాలున్నాయి. చాలా వరకు బడులన్నీ మొక్కుబడిగా నడుస్తున్నాయి. హెచ్ఎం. దేవిసింగ్ కృషి వల్ల రాయిపల్లి(డి) పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. వెయ్యి జనాభా ఉన్న ఈ తండాలో ఒకటి నుంచి 5 వరకు తరగతులు ఉన్నాయి. హెచ్ఎంగా దేవీసింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత రూపురేఖలు మారాయి. పాఠశాలలో 60 మంది వరకు విద్యార్థులు ఉంటే ఇంటింటికెళ్లి డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని బడిలో చేర్పించారు. ప్రస్థుతం విద్యార్థుల సంఖ్య 112కు చేరింది. ఇప్పడు తండాలో డ్రాప్అవుట్ పిల్లలు లేకపొవడం గమన్హరం. శుభ్రత కోసం వారానికి రెండు సార్లు పాఠశాల ఆవరణలో కల్లాపి చల్లుతారు. తరగతులను చక్కగా నిర్వహిస్తూ క్రమశిక్షణలో విద్యార్థులు నడుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ప్రార్థన చేయిస్తారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. బోరు చెడిపొతే వెంటనే సొంత డబ్బుతో మరమ్మతులు చేయించి నీటి సమస్య రాకుండా చూసుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో పండ్లు, కూరగాయాలు, ఇతర మొక్కలను పెంచుతూ హరిత హారంగా మార్చారు. బాల బాలికలకు వేరు వేరుగా మరుగుదొడ్ల ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణ కోసం ఆయాను నియమించారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నారు. పాఠశాల గోడలకు మహాత్ముల బొమ్మలను పెయింటింగ్ చేయించారు. రూ.60 వేల ఖర్చుతో హెచ్ఎం పాఠశాల అభివృద్ధి కోసం పలు రకాల పనులను చేయించి తండా వాసులతో శభాష్ అనిపించుకుంటున్నారు. అందిరి సహకారంతో... పాఠశాల ఉపాధ్యాయులు, తండావాసుల సహకారంతో పాఠశాలను ప్రగతి పథం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా. తాను పదవీ బాధ్యతలు తీసుకోక ముందు తరగతి గదుల్లో మందుబాటిళ్లు, చెత్త చెదారం, పశువుల నిలయంగా ఉండేది. అందరి కృషితో హరిత క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నా. పలు శాఖల అధికారులు పాఠశాలను సందర్శించి అభినందిచడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.సదుపాయలతో పాటు విద్యాప్రమాణాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తా. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందన అదనపు తరగతి అవసరం ఉంది. -
8న జాతీయ లోక్ అదాలత్
జహీరాబాద్: ఈనెల 8వ తేదిన జిల్లా జడ్జి ఎం.వి.రమణనాయుడు ఆధ్వర్యంలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించడం జరుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజి స్రే్ట్ డి.దుర్గప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ఆదాలత్ను జహీరాబాద్ కోర్టు యందు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.