Sai Pallavi
-
కజిన్ పెళ్లిలో సాయిపల్లవి.. ఎంత అందంగా ఉందో! (ఫోటోలు)
-
తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
ప్రస్తుతం సాయిపల్లవి టైమ్ నడుస్తోంది. గతేడాది 'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. రీసెంట్ గా 'తండేల్'తో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ' చేస్తోంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని సోదరుడు పెళ్లికి హాజరైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది. గతేడాది పూజకు పెళ్లి జరిగింది. ఆ వేడుకలో సాయిపల్లవి ఫుల్ సందడి చేసింది. డ్యాన్సులు, ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు కజిన్ బ్రదన్ జిత్తుకి పెళ్లి జరగ్గా సాయిపల్లవి హాజరైంది. నీలం చీరలో బుట్టబొమ్మలా ఉంది.అలానే సాయిపల్లవి తన బంధువులతో కలిస సాంప్రదాయ పాటలకు స్టెప్పులు కూడా వేసింది. దీనికి తోడు పెళ్లికి హాజరైన పలువురు.. ఈమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. పెళ్లికి వచ్చింది గానీ సాయిపల్లవి తన ఇన్ స్టాలో ఎక్కడా ఫొటోల్ని, వీడియోలని పోస్ట్ చేయలేదు. ఫ్యాన్ పేజీల్లో వాటిని అందరూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్)#Saipallavi #SaiPallavi @Sai_Pallavi92 dancing at her cousin bro wedding ! Performing baduga dance ritual. ♥️🔥💃pic.twitter.com/dbMPwO8TNR— shruthi (@shruthisundar01) March 11, 2025You are my MALAR FOREVER..🥹♥️#SaiPallavi #SaiPallaviBrotherMarriage pic.twitter.com/Hpg9U00BrN— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 11, 2025#SaiPallavi ❤️ at #SaiPallaviBrotherMarriageJITHU ♥️ROOPApic.twitter.com/aeRj7OiITe— Saran (@rskcinemabuff) March 11, 2025 -
పారితోషికం భారీగా పెంచేసిన సాయి పల్లవి, సమంత..ఎంతంటే?
ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి హీరో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటే.. హీరోయిన్లు వేలల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. చిన్న హీరో సైతం కోట్ల రూపాయాల పారితోషికం పుచ్చుకుంటున్నాడు. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ని డబుల్ చేస్తున్నారు. అయితే హీరోలో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువే. కానీ కొంతమంది నటీమణులు మాత్రం హీరోకి సమానంగా...ఇంకా చెప్పాలంటే రూపాయి ఎక్కువే కానీ తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. మార్కెట్లో వాళ్లకు ఉన్న డిమాండ్ని బట్టి నిర్మాతలే వాళ్లకు అంతలా పెంచేస్తున్నారు.మొన్నటి వరకు ఓక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునే సాయి పల్లవి(Sai Pallavi).. తండేల్కి రూ.5 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుందట. హీరో నాగచైతన్య రెమ్యునరేషన్ కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఓ సినిమా కోసం తన పారితోషికాన్ని అమాంతం నాలుగు రెట్లు పెంచేసింది. బాలీవుడ్లో ఆమె నటిస్తున్న తొలి సినిమా ‘రామాయణ’ కోసం ఆమె దాదాపు రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఆ రెండింటికి కలిపి రూ.20 కోట్లు ఆఫర్ చేశారట నిర్మాతలు.మరోవైపు సమంత(Samantha) కూడా తన రెమ్యునరేషన్ని పెంచేసింది. ఖుషీ వరకు రూ.3 కోట్లు తీసుకున్న సామ్.. సిటాడెల్ హనీ బన్నీకి ఏకంగా రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుందట. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోందన్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సూపర్హిట్ సిరీస్లతో ఆకట్టుకునే దర్శకద్వయం రాజ్, డీకే (Raj and DK) ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్, సమంతతో పాటు కీలకపాత్రలో అలీ ఫజల్ కూడా నటిస్తున్నారు. -
ఉమెన్స్ డే స్పెషల్.. తల్లి, చెల్లితో సాయిపల్లవి (ఫోటోలు)
-
అందంలో సాయిపల్లవికే పోటీ ఇస్తున్న చెల్లి! (ఫొటోలు)
-
హైలెస్సో హైలెస్సా సాంగ్.. సాయిపల్లవి నెమలి నాట్యం చూశారా?
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం (Thandel Movie) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లపైనే రాబట్టింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రమే మ్యూజికల్ బ్లాక్బస్టర్గానూ నిలిచింది. ఈ చిత్రంలోని బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా.. వంటి పాటలు జనాల్ని ఎంతగానో అలరించాయి.తాజాగా హైలెస్సో హైలెస్సా వీడియో సాంగ్ వచ్చేసింది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను అందంగా చూపించారు. అంతేకాదు, సాయిపల్లవి (Sai Pallavi) నెమలిలా డ్యాన్స్ చేసేది ఈ పాటలోనే! దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా నకశ్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. తండేల్ సినిమా..శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్గా పని చేశాడు. తండేల్ మార్చి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
నాగ చైతన్య 'తండేల్'.. 'బుజ్జి తల్లి' వచ్చేసింది
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్ చైతూ ఫ్యాన్స్ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్ హైలెట్గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.(ఇది చదవండి: నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన తండేల్ ఓటీటీలోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. -
నయనతారను బీట్ చేసిన సాయిపల్లవి
సినిమాలకు హద్దులుండవు. అదేవిధంగా తారల పారితోషికాలకు పరిదులుండకుండా పోతున్నాయనే చెప్పాలి. ఒక పక్క కొత్త వారు అవకాశాల కోసం పాకులాడుతుంటే, మరో పక్క ప్రముఖ తారలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సక్సెస్ఫుల్ కథానాయికల పారితోషికం చూస్తుంటో అబ్బో అని అనకమానరు. దక్షిణాదిలో ఒకప్పటి వరకూ నటి నయనతారనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకిగా పేరుగాంచారు. ఈమె బాలీవుడ్ చిత్రం జవాన్ కోసం రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటి సాయిపల్లవి ఇప్పుడు ఆమెను అధిగమించేశారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఈమె నటించిన చిత్రాల్లో అధిక శాతం విజయాన్ని అందుకోవడమే ఇందుకు కారణం అని భావించవచ్చు. ఇటీవల తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సాయిపల్లవి నటించిన అమరన్ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో సాయిపల్లవి నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా నాగచెతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం హిట్ అయ్యింది. దీంతో మంచి అవకాశాలు సాయిపల్లవి వైపు చూస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సహజ నటి రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. నటుడు రణ్వీర్ కపూర్ రాముడిగానూ, యాష్ రావణుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. అంతే కాదు రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి కూడా. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అయితే ఇందులో తొలిభాగంలో నటించడానికే నటి సాయిపల్లవి రూ.15 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటి నయనతార ఇప్పటి వరకూ రూ. 12 కోట్లు దాటలేదని, ఆ విధంగా చూస్తే నటి సాయిపల్లవి ఆమెను దాటేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, పారితోషికం విషయంలో సాయిపల్లవి నటి నయనతారను అధిగమించారనే ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. -
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ?
-
'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది
మహా శివరాత్రి సందర్భంగా తండేల్ నుంచి 'నమో నమః శివాయ' ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి లీడ్ రోల్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ పాటను ఫుల్ వీడియో విడుదల చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఈ సాంగ్ను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని నృత్య దర్శకుడు శేఖర్ నేతృత్వంలో కొనసాగింది. నాగచైతన్య, సాయిపల్లవితోపాటు, వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లతో ఈ సాంగ్ను తెరకెక్కించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ప్రతి ఏటా అక్కడ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో ఈ పాటను తెరకెక్కించారు. అందుకోసం భారీ సెట్స్తో వేసి ప్రేక్షకులకు చూపించారు. -
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
బాలీవుడ్ బులాయా
నార్త్ నుంచి సౌత్కి వచ్చే కథానాయికల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే సీన్ మారింది. ఇప్పుడు దక్షిణాదిన పాపులర్ అయిన కథానాయికలను బాలీవుడ్ బులాయా (బాలీవుడ్ పిలిచింది). అలా ఇక్కడ సక్సెస్ అయి, బాలీవుడ్కి పరిచయం కానున్న కథానాయికలు కొందరు ఉన్నారు. ఆ తారలు హిందీలో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. డబుల్ ధమాకా దక్షిణాదిలోని అగ్ర కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అందం, అభినయం పరంగా ఇక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె హిందీలో రెండు సినిమాలు అంగీకరించారు. ఆ చిత్రాలు ‘రామాయణ’, ‘ఏక్ దిన్’. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ మూవీ రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, లక్ష్మణుడి పాత్రలో రవి దుబే నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. యశ్తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. 2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (వర్కింగ్ టైటిల్) అనే మూవీ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అయితే ‘రామాయణ, ఏక్ దిన్’ చిత్రాల్లో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. ఆ సంగతలా ఉంచితే... ‘ఏక్ దిన్’ ముందుగా రిలీజవుతుందని, ఈ మూవీతోనే సాయిపల్లవి బాలీవుడ్ ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని టాక్. లవ్ ఫిల్మ్తో... తెలుగులో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించారు హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ నుంచి తనకు మంచి స్వాగతమే దక్కినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి రెండు ఆఫర్లు అందుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్లోని ఓ లవ్ ఫిల్మ్లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందట. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అనురాగ్ బసు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాయే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నిర్మాత దినేష్ విజన్ ఓ మూవీని ΄్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చర్చల్లో కూడా ఆమె పాల్గొన్నారు. క్వీన్ ఆఫ్ క్వీన్స్ ‘బింబిసార, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏజెంట్’ వంటి తెలుగు హిట్ మూవీస్తో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సంయుక్త. ఇప్పుడు బాలీవుడ్లోనూ తన సత్తా చాటుకోనున్నారీ బ్యూటీ. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా లీడ్ రోల్స్ చేస్తున్న హిందీ చిత్రం ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’లో సంయుక్త ఓ లీడ్ రోల్ చేస్తు న్నారు. చరణ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్, హర్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. తెలుగు హీరోయిన్ అనన్యా నాగళ్ల, కన్నడ హీరోయిన్ తన్వీ వంటి మరికొందరు తారల బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైందని సమాచారం. -
అమ్మమ్మ ఇచ్చిన చీరతో పెళ్లిపీటలు ఎక్కుదామనుకుంటే..: సాయి పల్లవి
సినిమాల్లో నటించే వారందరూ నటీనటులే. అయితే అందులో మంచి గుర్తింపు పొందే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారికి అవార్డులు అంగీకారమే కాకుండా, చాలా ప్రోత్సాహంగా ఉంటాయి. కాగా ఒక్కో సారి ప్రతిభావంతులైన నటీనటులకు కూడా ఉత్తమ అవార్డులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఆ పట్టికలో నటి సాయిపల్లవి కూడా ఉన్నారు. ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటించిన ప్రతిచిత్రంలోనూ తన ప్రత్యేకతను చాటు కుంటారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తారు. ఇటీవల ఈమె నటించిన తమిళ చిత్రం అమరన్, తెలుగు చిత్రం తండేల్ ఒక ఉదాహరణ. సినీ విజ్ఞులను సైతం తన నటనతో మెప్పిస్తున్న నటి సాయిపల్లవి. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తుంది. ఈమె ఇటీవల ఓ భేటీలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. దీని గురించి సాయిపల్లవి తెలుపుతూ తనకు 21 ఏళ్ల వయసులో తన బామ్మ ఓ చీరను ఇచ్చారన్నారు. దాన్ని తన పెళ్లి రోజున కట్టుకోవమని చెప్పారన్నారు. అప్పటికి తను సినిమాల్లోకి రాలేదట, కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందామనుకుని దానిని దాచిపెట్టినట్లు చెప్పింది. తనకు 23 ఏళ్ల వయసులో ప్రేమమ్ చిత్రంలో అవకాశం వచ్చినట్లు చెప్పింది. అయితే, ప్రేమమ్ విడుదల తర్వాత ఏదోక రోజు ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మకం కలగినట్లు చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో అంత గొప్ప అవార్డు జాతీయ అవార్డే కాబట్టి అందుకోసం కష్టపడుతానని ఆమె చెప్పింది. అందుకే దాన్ని దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సాయి పల్లవి పేర్కొంది. ఆ అవార్డును గెలుచుకునే వరకూ తనకు ఆ భారం ఉంటుందని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అలా జాతీయ అవార్డుతో అమ్మమ్మ చీరకు ఒక కనెక్షన్ ఉండిపోయిందని నవ్వుతూ చెప్పింది. -
150 కోట్ల వైపు తండేల్ పరుగులు..
-
సాయిపల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) ఎంచుకునే కథలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఏవి పడితే అవి చేసుకుంటూ పోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్ని మాత్రమే చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తండేల్ సినిమా చేసింది. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేసింది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరింది.సెల్ఫీ దిగాక..ఇకపోతే తండేల్ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్లో జరిగిన చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విడుదలకు ముందు జరిగిన తండేల్ జాతర ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవిని చేరుకుంది. తనతో సెల్ఫీ దిగిన అమ్మాయి హీరోయిన్ షేక్హ్యాండ్ ఇచ్చింది. దీంతో తెగ సంతోషపడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టింది.బుజ్జి తల్లికి బాషా రేంజ్ ఎలివేషన్ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాషా సినిమాలో రజనీకాంత్ మాణిక్ బాషాగా మారిన సమయంలో తన అనుచరులంతా కూడా ఆయన చేతిని ముద్దాడుతుంటారు. ఆ సీన్తో సాయిపల్లవి క్లిప్ను పోలుస్తూ బుజ్జితల్లికి బాషా రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ❤️🔥🧎🏻♂️😋 pic.twitter.com/1IFhJl5LH0— SHANMUKH (@Shanmukh_008) February 15, 2025 చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్చైర్లోనే.. అదే చివరిమాట.. : చిన్నా -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
ఇండస్ట్రీ ప్లే బాయ్తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'
సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం. కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్లైన్ కూడా ఆయనకు ఉంది. నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయంటూ కోలీవుడ్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. -
రెండు రోజులకు 'తండేల్' కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్లో వేగం పెరిగింది. -
రెండుసార్లు మ్యాజిక్ రిపీట్... అందుకే హిట్ పెయిర్ అంటున్న ఇండస్ట్రీ
-
'తండేల్' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
బాక్సాఫీస్ వద్ద తండేల్ మొదటిరోజే భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్స్ రాబట్టింది.తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్ను తండేల్ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుక్మై షోలో మొదటిరోజే సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్’ టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. పాక్కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్డెస్క్ -
ఆడియన్స్ ముందుకు తండేల్.. అవుతుందా బ్లాక్ బస్టర్ ?
-
Thandel Twitter Review: నాగచైతన్య 'తండేల్' ట్విటర్ రివ్యూ
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ఫిబ్రవరి 7న థియేటర్స్లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్స్టోరి' హిట్ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు.తండేల్ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్గా ఉందని, సెకండాఫ్ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.తండేల్ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్లో బీజీఎమ్తో గూస్బంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్స్టోరి' బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.Sad version em kottav ra 🫡@ThisIsDSP #Thandel ❤️🔥 pic.twitter.com/CQZzw3V3of— Nick9999 (@NickTarak9999) February 6, 2025#ThandelReview- Oka manchi love track 🧡- Beautiful Songs 👌🎶- koncham patriotic touch tho movie ni end chestaad bhayya 👌Chatinaya Comeback after 5yrs 🔥 3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ 🧡 (@Baahubali230) February 7, 2025#Thandel storms overseas premieres with BLOCKBUSTER reports. 🔥🔥🔥Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92 shine with their electrifying performances, winning hearts everywhere. 💥💥Rockstar @ThisIsDSP strikes gold again, his songs & BGM receive thunderous applause. 🤘… pic.twitter.com/lx7m5Qc2ll— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 7, 2025Show completed :- #thandel My rating 3/5Ok first half Solid blockbuster 2nd half 👌👏@chay_akkineni performance and @Sai_Pallavi92 performance Vera level 👌👌👌👌Finally movie dhulla kottesindi 👌👌 pic.twitter.com/DeUm3q1zqB— venkatesh kilaru (@kilaru_venki) February 6, 2025Just now finished watching #ThandelIt’s simply a comeback film for @chay_akkineni❤️🔥. He delivered a very good performance in his career after Majili and YMC.🙇🏻🫂It has decent first half followed by a good second half 🙌🏻.Dsp is the soul for the movie🙇🏻❤️🔥 #ThandelReview pic.twitter.com/smAwxuQcOD— Legend Prabhas (@CanadaPrabhasFN) February 7, 2025The #LOVESTORY MAGIC REPEATS AGAIN 🤩All praises & love pouring in from the USA PREMIERES for the BLOCKBUSTER JODI of @chay_akkineni & @Sai_Pallavi92 as RAJU & SATYA in #Thandel 💕 pic.twitter.com/fth6ywe972— Ramesh Bala (@rameshlaus) February 7, 20253/5 rating hit bomma @ThisIsDSP bgm #Thandel ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/2JlkMQTjKN— PAWANKALYAN ✨ (@PSPk9999999) February 7, 2025Unanimous blockbuster reports from USA premieres! 🤩🇺🇸💥💥Blockbuster #Thandel 🔥 pic.twitter.com/UE7WveG18i— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 7, 2025#Thandel - Unanimous FEEL GOOD BLOCKBUSTER- 3.25/5 🔥YUVASAMRAT @chay_akkineni is the biggest asset of the film 🎥 entertains throughout the film with his stunning chemistry and career BEST PERFORMANCE with @Sai_Pallavi92 💥💥💥💥💥💥💥🔥🔥🔥MAINLY @ThisIsDSP BGM AND SONGS… pic.twitter.com/wIjGqj1Bvm— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 6, 2025Chandu Mondeti pedda boring Ass**l asalu veedena Karthikeya tisindi anipistundi.scenes asalu engaging levvu neersam teppinchadu manchi line inka yavarikanna iste bagundedi,ee movie chusaka #Uppena tisina @BuchiBabuSana meeda respect perigindi #NagaChaitanya #SaiPallavi #Thandel— E.Mahesh babu (@babu_mahesh99) February 7, 2025 -
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్తో పాటు గీతా ఆర్ట్స్కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్ని విక్రమ్ కె. కుమార్గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
చైతు, సాయి పల్లవి స్టెప్పులకు పూనకాలు గ్యారెంటీ: బన్నీ వాసు
‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం. మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్మెంట్గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్దత్గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు. -
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా రియల్ లైఫ్ హీరోలు వీళ్లే!
‘‘ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్తో చేస్తే కెరీర్కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్లో గీతా ఆర్ట్స్ పేరు టాప్లో ఉంటుంది. ఈ బేనర్లో సినిమా చేసిన ఏ యాక్టర్ అయినా ఒక మంచి రిజల్ట్తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్ జాతర’ అంటూ యూనిట్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు... మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్ లైఫ్కి, తండేల్ రాజు క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి టైమ్ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ ట్రూ రాక్స్టార్. ‘నమో నమః శివాయ...’ పాట రిహార్శల్స్ జరుగుతున్నపుడు దేవి సెట్కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్ శ్యామ్ సార్, ఇతర యూనిట్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.వీళ్లు లేకుండా ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా... మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే... ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్ ఎమోషన్ . వీళ్లే నా రియల్ లైఫ్ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్... ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్పై రియల్ పీపుల్లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్గా నిలిచాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్తో మాట్లాడాను. ఆమె స్లీవ్లెస్ డ్రెస్లు ధరించరని చెప్పారు. భవిష్యత్లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్గారు, చందు... ఇలాంటి టీమ్ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్మీట్లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. ‘తండేల్’ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ సినిమా సక్సెస్మీట్లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్కు బన్నీ (అల్లు అర్జున్) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్ నుంచి వచ్చాడు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్. -
సందీప్ రెడ్డి వంగా చిత్రంలో సాయి పల్లవి.. కానీ..?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. -
బన్నీ ఫ్యాన్స్కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!
‘సంధ్య థియేటర్’ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్కి కానీ, ఇతర ఈవెంట్స్కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్’(Thandel) ప్రీరిలీజ్కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ వారందరికి ‘తండేల్’ టీమ్ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్కి పబ్లిక్కి ఎంట్రీ లేదని ప్రకటించింది. ‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్ తండేల్ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్లోకి పబ్లిక్కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తండేల్ కథేంటి?శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
డార్లింగ్ కు జోడీగా సాయి పల్లవి..?
-
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
సాయి పల్లవికి అనారోగ్యం.. బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రాలేదని చెప్పాడు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.బెడ్ రెస్ట్‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్తండేల్ హిందీ ట్రైలర్ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్తో పాటు తండేల్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
‘తండేల్’ సెన్సార్ టాక్.. బొమ్మ అదిరిందట!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ బస్టర్ పక్కా!సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.నిడివి ఎంతంటే.. తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.తండేల్ కథేంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే: నాగచైతన్య
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను వైజాగ్లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్లో నిర్వహించింది చిత్రం యూనిట్. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్ అల్లు అరవింద్గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్లో నిజమైన తండేల్ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’(Thandel) సినిమాకు వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చించిపడేశాడు’’ అని తెలిపారు. తండేల్ ట్రైలర్ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది. -
అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మించారు.తండేల్ కథేంటంటే..శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ. వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025 -
బాక్సాఫీస్ వద్ద తండేల్ మరో ఉప్పెన అవుతుందా?
-
హైలేస్సో హైలెస్సా.. సాయిపల్లవి డ్యాన్సే హైలెట్!
ఎవరైనా అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. అంటే నెమలిని మించిన నాట్యం ఎవరు చేయలేరని అర్థం.నెమలి నాట్యాన్ని వర్ణించడం చాల కష్టం. నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. అలాంటి అనుభూతి తండేల్(Thandel) సినిమా ద్వారా పొందుతారట. సాయి పల్లవి(Sai Pallavi ), నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే పాట ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి వేసే స్టెప్పు ఒకటి బాగా వైరల్ అయింది. పాట ఎంత వినసొంపుగా ఉందో.. ఆ డ్యాన్స్ కూడా అంతే చూడ ముచ్చటగా ఉంది. అయితే లిరికల్ వీడియోలో చూసింది తక్కువేనట. ఆ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసిందట.నెమలిని గుర్తు చేస్తుందిఇప్పుడు ఎక్కడ చూసిన హైలెస్సో హైలెస్సా..పాటే వినిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో సాయి పల్లవి వేసిన హుక్ స్టెప్ అయితే నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. మెలికలు తిరుగుతూ సాయి పల్లవి చేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్లో వచ్చే మ్యూజిక్కి తగ్గట్టుగా ఆమె తన బాడీని కదిలించింది. అయితే లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువేనట. మొత్తం పాటలు దాదాపు ఒక నిమిషం పాటు సాయి పల్లవి నాన్స్టాప్గా డ్యాన్స్ చేస్తుందట. ఆమె వేసిన స్టెప్పులు నెమలి నాట్యాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత బన్నీవాసు చెబుతున్నాడు. లవ్స్టోరీలో కూడా సాయి పల్లవి ఇలాంటి నెమలి స్టెప్పులు వేసింది. మళ్లీ తండేల్లో కూడా అలాంటి డాన్సే చేసింది. సాయి పల్లవి నెమలిలా మెలికలు తిరిగుతూ డాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది.రెండోసారి.. నాగచైతన్య, సాయి పల్లవి తొలిసారి లవ్స్టోరీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం..2021లో రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ తండేల్ సినిమా కోసం ఒకటయ్యారు.కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్గా నిలవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాగచైతన్య ‘తండేల్’ HD మూవీ స్టిల్స్
-
నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి
నటీనటులకు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. కొందరు లోప్రొఫైల్ను మెయింటెయిన్ చేస్తే, మరొకరు హై ప్రొఫైల్ను మెయిన్టెయిన్ చేస్తుంటారు. ఇకచాలా మంది హంగులు, ఆర్భాటాలు చేస్తుంటారు. మరి అలాంటి వారిలో నటి సాయిపల్లవి (Sai Pallavi) ఏ కోవకు చెందుతుందో చూద్దాం. ఈమె సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. అదే సాయిపల్లవి కెరీక్కు ప్లస్ అయ్యిందేమో. ప్రేమమ్(Premam) అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న తమిళ భామ ఈమె.ఆ చిత్రం సాయిపల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ను చేసిందనే చెప్పాలి. ఆ తరువాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు 90 శాతంకు పైగా సక్సెస్ అయ్యాయి. తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తెలుగులో నటుడు నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్(Amaran) చిత్రం సంచన విజయాన్ని సాధించడంతో పాటూ సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండటం సహజం అని చెప్పింది. కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది. తనకు ఫొటోలు తీయడం అస్సలు నచ్చదని చెప్పింది. బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్గా సెల్ఫోన్లో తనను ఫొటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని చెప్పింది. అలాంటప్పుడు తాను చెట్టునో, సుందరమైన భవనాన్నో కాదనీ, జీవం ఉన్న మనిషిని కథా అని అనిపిస్తుందన్నారు. మీమ్మల్ని ఒక్క ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే ఎంత భాగుంటుందీ అని పేర్కొంది. తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తననే చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ, కొంచెం బిడియంగానూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అంది. ఆ అలవాటును మానకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నాననీ, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్ను వేసుకుని సాంప్రదాయ బద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయిపల్లవి చెప్పుకొచ్చింది. -
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఎవరంటే?
సినిమా తారలకు డబ్బింగ్ చెబుతారని మనకు తెలిసిందే. సాధారణంగా మగవారికి మేల్ వాయిస్ ఆడవారికి ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్లు ఉంటారు. కానీ, అమ్మాయిలకు అబ్బాయి డబ్బింగ్ చెబితే..! ఆశ్చర్యమనిపించక మానదు...ఎంబీబీఎస్ చేసిన ఆద్య హనుమంత్ ఇప్పటి వరకు సమంత (Samantha), సాయిపల్లవి, అవికాగోర్.. ఇలా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటి వరకు 175 సినిమాలలకు డబ్బింగ్ చెప్పిన ఆద్య హనుమంత్ తెలంగాణలోని మహబూబ్నగర్ వాసి. కర్ణాటకలోని రాయచూరులో ఉంటున్న ఆద్య హనుమంత్కి ఇలాంటి క్రేజీ వాయిస్ ఎలా అబ్బిందో, సినిమాలకు స్పెషల్ వాయిస్ ఆర్టిస్ట్ (Voice Artist)గా ఎలా మారారో అతని మాటల్లోనే తెలుసుకుందాం..నా వయసు ఇప్పుడు 22 ఏళ్లు. పదమూడేళ్ల వయసు నుంచి డబ్బింగ్ చెబుతున్నాను. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నా వాయిస్ బాగుంటుందని సీరియల్స్లోని చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పించేవారు. తర్వాత్తర్వాత హీరోయిన్లకు నా వాయిస్ కనెక్ట్ అయ్యింది.నాలుగు భాషల్లో...సాధారణంగా ఇతర భాషల్లోని డబ్బింగ్ ఆర్టిస్టులు మన దగ్గర ఫేమస్గా ఉంటారు. నేను మాత్రం తెలంగాణ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సమంత, సాయిపల్లవి, ఐశ్వర్య, అవికా... ఇలా ప్రముఖ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పాను.ఒక పూట తిండి అయినా మానేస్తా!నా గొంతు అమ్మాయిల మాదిరి ఉంటుందని, మరింత స్పెషల్గా ఉంటుందని అంతా అంటుంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా దేవుడి దయ. ఇష్టమైన పని కావడంతో డబ్బింగ్, చదువు రెండింటినీ ప్రేమిస్తాను. కష్టంగా ఉన్నా ఒక పూట తిండి అయినా మానేస్తాను. కానీ, చదువుతోపాటు డబ్బింగ్ కూడా నాకు ప్రాణమే. ఎప్పుడు ఈ గొంతు మారబోతుందో చెప్పలేను. కానీ, ప్రేక్షకులు ఎంత కాలం కోరుకుంటే అంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతాను. ప్రత్యేకించి ప్రాక్టీస్ ఏమీ ఉండదు. డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం పలికిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుంది.వెక్కిరించారు... ‘ఆడపిల్లలా ఆ గొంతేంటి?’ అని వేళాకోలం అడినవారు ఉన్నారు. మొహమ్మీదనే చులకనగా మాట్లాడిన వారూ ఉన్నారు. కానీ, మా అమ్మ ఒకసారి చెప్పింది. ‘దేవుడు, నీకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకిచ్చాడో గమనించు. మనం చేయాలనుకున్న పని సాధారణంగా ఉండకూడదు. ఎంత రిస్క్ అయినా ఒక్క అడుగు ముందుకే వేసి చూడు’ అని చెప్పేది. ఆ మాటలు నాకు ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తున్నాయి. చాలా మంది తమ సమస్యలను నాతో చెప్పుకోవడానికి ఇష్టపడుతుండేవారు. దీంతో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు సైకియాట్రీ ఎంచుకోవాలనుకున్నాను. సైకియాట్రీలో పీజీ చేస్తున్నాను. మెడికల్, సినీ ఫీల్డ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణించాలనుకుంటున్నాను. శని, ఆదివారాలు డబ్బింగ్కి ఎంచుకుంటున్నాను. మిగతా రోజుల్లో చదువు, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తాను. యూనివర్శిటీ ప్రొఫెసర్లు నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు.వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా... సోషల్ మీడియా అనగానే అప్కమింగ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. దీంతో నేనూ ఇన్స్టాగ్రామ్లో చురుకుగా ఉంటూ వచ్చాను. ‘ఇట్లు మీ సీతా మహాలక్ష్మి’ అనే పేజీ ప్రారంభించాను. సోషల్మీడియా ద్వారా ఎంతో మంది నాకు స్నేహితులయ్యారు. తెలుగు నుంచి తమిళ్, కన్నడ నుంచి తెలుగు ప్రముఖుల కవిత్వాలను అనువాదం చేస్తుంటాను. సోషల్ మీడియా ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరంలోని ఓ కుటుంబానికి నాకు స్నేహం కుదిరింది. దీంతో సంక్రాంతి పండగకు సీతానగరం వచ్చేశాను. గోదావరి అందం, వారి పలకరింపులు, ఆప్యాయత, పిండివంటలు ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ వాయిస్ ఇలాగే ఉంటుంది అని చెప్పలేను. ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కర్నాటకలో ఉన్నా నాకు మాత్రం తెలుగు ఇండస్ట్రీనే బాగా సపోర్ట్ చేసింది. మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెబుతాడు ఈ ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్.– నిర్మలారెడ్డి View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial) View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial)చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య -
నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి
తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్పుత్ రెజిమెంట్లో కమీషన్డ్ ఆఫీసర్గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్హిట్గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.అలుపెరుగని యాత్ర...ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్యఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు. -
బలగం వేణు సినిమా లో ఎల్లమ్మ గా సాయి పల్లవి
-
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్దత్ సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
అనంతపురం: ఆ ఆలయంలో నటి 'సాయి పల్లవి' న్యూ ఇయర్ వేడుకలు
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్గా అమరన్ చిత్రంతో అభిమానులను మెప్పించారు. తన పాత్రకు బలం ఉంటే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఓకే చెబుతుందని ఆమెకు గుర్తింపు ఉంది. ఒక ప్రాజెక్ట్లో సాయిపల్లవి నటిస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉంటాయి. సాయి పల్లవి తన కెరీర్ ప్రారంభం నుంచే సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం అందుకుంది.డాక్టర్ విద్యను పూర్తి చేసిన సాయి పల్లవిలో మొదటి నుంచి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా అందరూ సెలబ్రేషన్స్లో మునిగితేలుతుంటే సాయి పల్లవి మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా మందిరాన్ని ఆమె సందర్శించారు. ఆమె ఇప్పటికే చాలాసార్లు అక్కడికి వెళ్లారు. అయితే, తాజాగా తన కుటుంబంతో కలిసి 'ప్రశాంతి నిలయం'లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మానవుడు తనలోని చెడుగుణాలను త్యజించి సత్యనిష్ఠతో జీవిస్తే దైవత్వాన్ని పొందవచ్చనే సందేశాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి నాటిక రూపంలో సాయి పల్లవి తెలియజేశారు. 'చెడు త్యజించి అందరూ సన్మార్గంలో పయనించాలని ఆమె కోరారు.అక్కడ బాబా నామస్మరణ చేస్తూ తనలోని ఆధ్యాత్మికతను ఆమె చాటుకున్నారు. పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసిన ఆమె నుదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి ఆలయంలో కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో సాయిపల్లవి మునిగిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు సాయి పల్లవిని ప్రశంసిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు పార్టీలు, పబ్ల పేరుతో ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె ఆధ్యాత్మికత వైపు వెళ్లడంతో అభినందిస్తున్నారు.అమరన్ హిట్ తర్వాత సాయి పల్లవి నటించిన తండేల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగ చైతన్య పోషిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు పాన్ ఇండియా చిత్రం 'రామాయణం'లో ఆమె సీతగా కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ఈ మూవీలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళీ కానుకగా మొదటి భాగం విడుదల కానుంది.Our Sai Pallavi today evening at Satya Sai's Mangala Aarati program 🥹✨♥️@Sai_Pallavi92 #SaiPallavi #NewYearCelebration pic.twitter.com/KZKncToDwF— Saipallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) January 1, 2025 -
బుజ్జితల్లి క్రేజ్.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?ఈ సినిమా విడుదల డేట్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨▶️ https://t.co/52ZLxEJe7IA 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024 -
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) చెల్లి పూజా కన్నన్ సెప్టెంబర్లో పెళ్లి పీటలెక్కింది. క్లోజ్ ఫ్రెండ్ వినీత్తో ఏడడుగులు వేసింది. ఈ వేడుకలో హీరోయిన్ కుటుంబం సంతోషంగా గడిపారు. అదే సమయంలో పెళ్లయ్యే క్షణాల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాజాగా మరోసారి ఆ వెడ్డింగ్ ఫోటోలను సాయిపల్లవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా చెల్లి పెళ్లి తర్వాత నా జీవితం కొత్త దశలోకి వెళ్తుందని నాకు తెలుసు. నేనే సాక్ష్యంఆ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజ వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. ఇకపై నీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను. కానీ నా మనసులో మాత్రం వినీత్ నిన్ను నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకముంది.ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలుమీ పెళ్లయి మూడు నెలలవుతోంది. నేను అనుకున్నట్లుగానే తను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) చదవండి: నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్ అవడానికేనా?: ఉర్ఫీ -
‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
కాశీ వెళ్లిన సాయిపల్లవి.. పూజల్లో మునిగి తేలుతూ (ఫొటోలు)
-
ఇకపై సహించను!
‘‘నాపై ఇప్పటివరకూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, వాటిపై నేను స్పందించ కుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వాస్తవం ఏంటనేది దేవుడికి తెలుసు. అయితే మౌనంగా ఉంటున్నానని పుకార్లు తెగ రాస్తున్నారు. నా గురించి నిరాధారమైన వార్తలు రాస్తే ఇకపై సహించను’’ అంటున్నారు సాయి పల్లవి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారానికి దూరంగా ఉండాలను కుంటున్నారని, హోటల్స్లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఉద్దేశించే సాయి పల్లవి పై విధంగా స్పందించి ఉంటారు. ‘‘నా సినిమాల రిలీజ్, నా ప్రకటనలు.. ఇలా నాకు సంబంధించిన వాటి గురించి నిరాధారమైన వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటాను. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ సహించాను. ఇకపై సిద్ధంగా లేను’’ అంటూ ΄ోస్ట్ చేశారామె. -
అలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తా..సాయి పల్లవి వార్నింగ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనం నుంచే ఆమె వెజిటేరియన్. బయట పదార్థాలు ఎక్కువగా తినదు. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె తిసుకునే ఫుడ్పై రకరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి నాన్ వెజ్ తినడం లేదని ఓ తమిళ మీడియా రాసుకొచ్చింది. ఆ సినిమా కోసమే చాలా రోజులుగా బయటి ఫుడ్ తినడం లేదని అందులో పేర్కొంది. దీనిపై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!) వాస్తవలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్లు, బేస్ లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడకతప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.తెలిసి రాస్తారో.. తెలియకుండా రాస్తారో.. వ్యూస్ కోసం రాస్తారో.. అదంతా దేవుడికే తెలియాలి.. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు.. ఇక్కడితో ఆపేయండి.. నా సినిమా రిలీజ్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు.. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్.. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొనితెచ్చుకోకండి.. ఇదే చివరి ఛాన్స్.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చింది.Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024 -
అమరన్ మూవీలో సాయిపల్లవి లుక్ను అచ్చుగుద్దినట్లు దింపేసిన కియారా వైరల్ అవుతున్న ఫొటోలు
-
ఓటీటీకి వచ్చేసిన రూ.300 కోట్ల మూవీ.. ఎక్కడ చూడాలంటే?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ను వద్ద సూపర్హిట్గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ఓటీటీలో రూ. 300 కోట్ల సినిమా .. అధికారిక ప్రకటన
సూపర్ హిట్ సినిమా అమరన్ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ నెట్ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్న్యూస్ వచ్చేసింది.భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్ మూవీ డిసెంబర్ 5న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్ప్లిక్స్లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
నాగచైతన్య తండేల్.. బుజ్జి తల్లి వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్తో కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Divided by the ocean, united by love 💕The 'Love Song of the year' is here for your to express the feelings of long distance love ✨ #Thandel First Single #BujjiThalli out now 🫶▶️ https://t.co/ZqKgx9roRiA @ThisIsDSP melody 🎼Sung by @javedali4u 🎙️Lyrics by @ShreeLyricist… pic.twitter.com/umR1JLTvHp— Geetha Arts (@GeethaArts) November 21, 2024 -
అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.అసలేం జరిగిందంటే?అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
వాళ్ల కష్టం ఎక్కువ.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు: సాయిపల్లవి
ఇటీవల ఎక్కడ చూసినా సాయిపల్లవి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం అమరన్ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనే.అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాటను మరోసారి సాయిపల్లవి నిరూపించారు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాం. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్స్కు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.సౌత్ ఇండియాలో సాయిపల్లవి పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్ చేయనని చెప్పేస్తారు. కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్ దర్శకుడు, కథానాయకుడు అయినా నో అనేస్తారు. ఇక పోతే స్కిన్ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు. అసలు మేకప్కు ప్రాముఖ్యతను ఇవ్వరు. అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక అమరన్ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో ఈమె నటుడు నాగచైతన్యతో జతకట్టిన తండేల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరో హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు. అయితే. దక్షిణాదిలో పరిస్థితి వేరు అని పేర్కొన్నారు వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి పేర్కొన్నారు. -
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
శివ కార్తికేయన్ 'అమరన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'తెలుగు ఆడియన్స్ మాత్రమే అలా చేస్తారు'.. సాయిపల్లవి కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు ఆడియన్స్పై ప్రశంసలు కురిపించారు. భాషతో సంబంధం లేకుండా ఆదరించేది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేనన్నారు. గతంలో నన్ను భానుమతి, వెన్నెల అని పిలిచేవారు.. ఇప్పుడేమో ఇందు రెబెకా వర్గీస్ అని పిలుస్తున్నారు. సినిమాను గొప్పగా ప్రేమించే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తెలుగువారు మాత్రమేనని సాయిపల్లవి కొనియాడారు. మీ ప్రేమ, ఎంకరేజ్మెంట్ చూసి నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సాయిపల్లవి మాట్లాడారు.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్లోని షోపియాన్లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. "Telugu audience andariki chala pedda thanks" ❤️ Heroine @Sai_Pallavi92 at #Amaran Success Meet ❤️🔥#AmaranMajorSuccess #MajorMukundVaradharajan #saipallavisenthamarai #SaiPallavi #YouWeMedia pic.twitter.com/YYbGoGHPNU— YouWe Media (@MediaYouwe) November 6, 2024 -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్లోని షోపియాన్లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
కమల్ హాసన్ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్’ డైరెక్టర్
‘అమరన్’ విడుదలకు ముందు కమల్ హాసన్ గారికి సినిమా మొత్తం చూపించాను. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను’అన్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ అమరన్ చిత్రానికి అన్ని చోట్ల హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. →ఈ చిత్రానికి కమల్ హాసన్ చాలా సపోర్ట్ చేశారు.నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.→ ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.→ అయితే ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయను తీసుకోవాలని మొదట్లో అనుకోలేదు. ఓసారి ఆయనకు కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.→ ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.→ యాక్షన్స్ సీక్వెన్స్లు చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.→ ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.→ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను. -
తండేల్ రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో మెరిసిన చైతూ, సాయి పల్లవి (ఫోటోలు)
-
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్ను ఆర్మీ మ్యాన్గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
ఇకపై నేచురల్ బ్యూటీ కాదు.. సాయి పల్లవికి కొత్త పేరు పెట్టిన నాగచైతన్య! (ఫొటోలు)
-
సాయిపల్లవికి కొత్త బిరుదు.. చైతూ అంత మాట అనేశాడేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగ చైతన్య హీరోయిన్పై ప్రశంసలు కురిపించారు. సాయిపల్లవి బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు. అంతేకాకుండా సినిమాలో కేవలం తన పాత్రకే పరిమితం కాదని.. ప్రతి విషయాన్ని చర్చిస్తుందని నాగచైతన్య తెలిపారు.నాగచైతన్య మాట్లాడుతూ..' మన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి. ఈ సినిమాలో కేవలం తన క్యారెక్టర్ మాత్రమే కాదు.. నా సీన్స్ గురించి కూడా చర్చిస్తుంది. అందరి గురించి మాట్లాడుతూ నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. డ్యాన్స్ విషయంలో కూడా సాయిపల్లవితో కష్టమే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశా' అని అన్నారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
అక్కినేని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. 'తండేల్' విడుదలపై ప్రకటన
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న 'తండేల్' సినిమా విడుదల డేట్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే, పలు కారణాల వల్ల ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది.'తండేల్' సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్కు నిర్మాత అల్లు అరవింద్ గుడ్న్యూస్ చెప్పారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదని ఆయన చెప్పారు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
టాలీవుడ్ లో మళ్లీ స్పీడ్ పెంచిన సాయి పల్లవి..
-
'అమరన్' కలెక్షన్స్.. శివ కార్తికేయన్ కెరీర్లో అరుదైన రికార్డ్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్లో ఒక మైల్స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు. -
దుల్కర్కు జోడీగా...
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కనుంది. దుల్కర్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో అధికారికంగా ప్రకటించారు. కానీ దుల్కర్ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.ఈ ఏడాది చివర్లో సెట్స్పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. -
శివ కార్తికేయన్ అమరన్.. తొలి రోజే రజనీకాంత్ సినిమాను దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. -
ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
-
Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే..బయోపిక్ మూవీ తీయడం దర్శకుడికి చాలా కష్టమైన పని. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి సఫలం అయ్యాడు. 2014లో కశ్మిర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముకుంద్ వరదరాజన్ గురించి తెలియని చాలా విషయాలను వెండితెరపై చూపించాడు. దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను మరోసారి అందరికి గుర్తు చేశారు. ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ వీరమరణం పొందారనే విషయం మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇందు రెబక్క వర్గీస్తో ప్రేమాయణం.. వారిద్దరి పెళ్లికి వచ్చిన సమస్యలు? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం ఆర్మీ చేస్తున్న సేవలను ప.. ప్రతీది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్ అంతా ముకుంద్-ఇందుల లవ్స్టోరీతో పాటు ఇరు కుటుంబాల నేపథ్యం..ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి ఎలా వచ్చారనేది గొప్పగా చూపించారు. ఇక సెకండాఫ్లో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ద్వితియార్థంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. 25 ఏప్రిల్ 2014న, షోపియాన్ జిల్లాలోని ఖాసిపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైష్-ఎ-మహ్మద్ కమాండర్ అల్తాఫ్ వాసీతో పాటు మరికొంతమంది టెర్రరిస్టులను హతం చేయడానికి చేపట్టిన ‘ ఖాసిపత్రి’ ఆపరేషన్ను మేజర్ ముకుంద్ ఎలా విజవంతం చేశారనేది ఆసక్తికరంగా, ఎమోషనల్గా చూపించారు. ఈ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు మన మనసుని తడి చేస్తాయి. మన రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం శివకార్తికేయన్, సాయి పల్లవిల నటనే. మేజర్ ముకుంద్గా శివకార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి వారి వారి పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చీతా టీమ్ సభ్యుడు విక్రమ్ పాత్రను పోషించిన నటుడితో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలను చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. -రేటింగ్: 3.25/5 -
'అమరన్' మూవీ ట్విటర్ రివ్యూ
వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అమరన్. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, సోని పిక్చర్స్ సంస్థలు కలసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంన్నారు.ఆర్మీ బ్యాక్డ్రాప్లో సినిమా అంటేనే అందరిచూపు అటువైపే ఉంటుంది. అందుకే సినిమా అభిమానులు అందరూ అమరన్ సినిమావైపు పడింది. శివకార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో అదరగొట్టాడని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్పాయింట్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. మొదటి భాగంలో శివకార్తికేయన్, సాయిపల్లవి మధ్య వచ్చే ప్రతి సీన్ సూపర్ అంటూ మెంచుకుంటున్నారు.ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రం అమరన్ అంటూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఓవర్సీస్, తమిళనాడులో చాలా చోట్ల 'అమరన్' సినిమాను ఒకరోజు ముందుగానే వేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు కిర్రాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 'అమరన్'లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'తుపాకీ' సినిమాలో మెప్పించిన కొన్ని యాక్షన్ సీన్స్ లాంటివి ఇందులో కూడా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నారు. వార్ సీన్స్ కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు కన్నీళ్లను పెట్టిస్తుందని చాలామంది తెలుపుతున్నారు. ఆ సీన్లో సాయిపల్లవి తన యాక్టింగ్తో ఇరగదీసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.#Sivakarthikeyan𓃵 joins the Big league of #Rajinikanth #KamalHaasan #ajith #vijay from today 🔥🔥 #Amaran career defining movie for #SK @Siva_Kartikeyan pic.twitter.com/OqFuAOeiIU— Wetalkiess (@WeTalkiess) October 31, 2024Positive Reviews all over World ✅🌟#Amaran Blockbuster 💥 pic.twitter.com/booGzL9uiJ— Troll Unwanted Haters (@wanted_Hater67) October 31, 2024Amaran - 💔😭 🔥🔥#Amaran is undoubtedly one of the finest biographical films to hit the screens recently. Sai Pallavi delivered exceptional performances, making their characters unforgettable📈Sai Pallavi❤🦋> Full movie#USA #Amaran #AmaranFDFS #Sivakarthikeyan #SaiPallavi pic.twitter.com/ihiRu7Nhd2— Hari (@hariharanr0) October 31, 2024The first half of #Amaran is packed with emotion 🤌💥💥FOLLOW ✅️SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡#Sivakarthikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥#AmaranFDFS #BloodyBeggar #LuckyBaskhar pic.twitter.com/hPz9Xs1EP5— JD X PAGE (@holic2024) October 31, 2024#Amaran | Stunning FIRST HALF 🧨💥SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡ @Siva_Kartikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥 pic.twitter.com/MU5zjup8C6— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 31, 2024#Amaran True tribute to Major Mukundan. Sai Pallavi & #Sivakarthikeyan are true emotion of the movie. Worth watching 🔥🫡. One of the best movies of SK— Cine Crick Madie (@diszzCinema) October 31, 2024 -
'ఆ సమయంలో బాధను బయట పెట్టకూడదనుకున్నా': సాయిపల్లవి కామెంట్స్
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీనే రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అమరన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.పాత వీడియో వైరల్..అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్లతో పోల్చిందంటూ నెటిజన్స్ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.కావాలనే చేస్తున్నారు..అయితే సాయిపల్లవి కామెంట్స్పై బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. -
మెహబూబ్ అవుట్.. నొప్పి భరించలేక అవినాష్ సెల్ఫ్ ఎలిమినేట్
పండగ సెలబ్రేషన్స్లో బిగ్బాస్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవలే హౌస్లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలల్లో సినీ తారలు భాగమయ్యారు. మరి హౌస్లో జరిగిన రచ్చ, హంగామా ఏ రేంజ్లో ఉందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..పండగ సర్ప్రైజ్నాగార్జున దీపావళి పాటకు స్టెప్పులేస్తూ పండగ కళను తీసుకొచ్చాడు. తర్వాత హౌస్మేట్స్ను జంటలుగా విడగొట్టిస్టెప్పులు మీవి- మార్కులు మావి అనే గేమ్ ఆడించాడు. ప్రతి రౌండ్లో గెలిచిన టీమ్కు ఒక సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. అలా మొదటి రౌండ్లో గంగవ్వ-తేజ గెలిచారు. ఈ జంటలో ఒకరికే ఇంటిసభ్యుల నుంచి మెసేజ్ వస్తుందన్నాడు. అలా తేజ త్యాగంతో గంగవ్వకు తన కూతురి వీడియో మెసేజ్ ప్లే చేశారు. అది చూసిన అవ్వ సంతోషంతో కన్నీళ్లుపెట్టుకుంది. తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశారు.ప్రైజ్మనీలో మరో రూ.1లక్షఅనసూయ డ్యాన్స్తో జోష్ నింపింది. ప్రైజ్మనీ కవర్స్ కనుక్కోవాలన్న రెండో గేమ్లో నిఖిల్, యష్మీ గెలిచారు. వీరు కనిపెట్టిన కవర్లలోని రూ.1 లక్ష ప్రైజ్మనీలో యాడ్ చేశారు. తర్వాత ఈ జంటకు సంబంధించిన ఇంటిసభ్యుల ఫోటో చూపించారు. యష్మి త్యాగం చేయడంతో నిఖిల్ పేరెంట్స్ వీడియో ప్లే చేశారు. అలాగే నాగ్ నిఖిల్ను సేవ్ చేశాడు.ప్రేరణకు సర్ప్రైజ్తర్వాత 'క' మూవీ టీమ్ స్టేజీపైకి వచ్చింది. వీరు హౌస్మేట్స్ కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించారు. ఇందులో ప్రేరణ-మెహబూబ్ గెలిచారు. మెహబూబ్ త్యాగంతో ప్రేరణకు వీడియో ప్లే చేశారు. ఆమె తన పేరెంట్స్ మాటలు విని మురిసిపోయింది. తర్వాత మెహరీన్ డ్యాన్స్తో ఆకట్టుకుంది. సింగర్ సమీరా భరద్వాజ్.. హౌస్మేట్స్ అందరిపైనా అలవోకగా పాటలు పడేసి అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరిపైనా అద్భుతంగా పాట పాడి అదరొట్టేసింది. స్టేజీపై దుల్కర్ సల్మాన్లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ స్టేజీపైకి వచ్చారు. డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీలలో ఎవరిని సెలక్ట్ చేస్తావన్న ప్రశ్నకు మీనాక్షి.. వెంకీ అని బదులిచ్చింది. లక్కీ భాస్కర్ టీమ్ ఆడించిన గేమ్లో గౌతమ్-నయని పావని జంట గెలిచింది. వీరిలో నయని పావని తన తల్లి మెసేజ్ను త్యాగం చేయడంతో గౌతమ్.. అతడి తండ్రి వీడియో సందేశాన్ని వినగలిగాడు. ఇంట్లో గొడవపడి వచ్చిన గౌతమ్.. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సారీ చెప్పాడు.హరితేజ ఎమోషనల్హీరోయిన్ శాన్వీ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్తో మైమరపించింది. తర్వాత ప్రేరణ, పృథ్వీని సేవ్ చేశారు. అనంతరం అమరన్ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవి స్టేజీపైకి వచ్చారు. వీరు ఆడించిన గేమ్లో రోహిణి, అవినాష్ గెలిచారు. వీళ్లిద్దరూ తమకు బదులుగా హరితేజకు తన కూతురి వీడియో చూపించమన్నాడు. హాయ్ అమ్మ, హ్యాపీ దివాళి అంటూ కూతురు మాట్లాడిన ముద్దుముద్దు మాటలు విని హరితేజ ఏడ్చేసింది. తర్వాత హైపర్ ఆది హౌస్లోకి వచ్చి తన పంచ్ కామెడీతో నవ్వించాడు.ఏడ్చిన యష్మిఈ ఎపిసోడ్ కంటే ముందు ఏం జరిగిందన్నది చూపించారు. ఎవరినో ఉడికించడానికి యష్మి తనను వాడుకోవడం నచ్చలేదన్నాడు గౌతమ్. ఆ మాటలు విన్న యష్మి.. తన ఉద్దేశం అది కాదంటూ ఏడ్చేసింది. నిఖిల్, నేను ఫ్రెండ్స్లా టీజ్ చేసుకున్నాం తప్ప నువ్వంటే నాకు బాగా ఇష్టం అని ఎక్కడా ఒకరికొకరం ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. నా వల్ల తప్పు జరిగుంటే సారీ అని చెప్పింది. దీంతో గౌతమ్.. ఇకపై నువ్వు నాకు కంటెస్టెంటు మాత్రమే.. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.అప్పుడలా ఇప్పుడిలా..వెళ్లిపోయేముందు మెహబూబ్ హౌస్మేట్స్ను పటాకాలతో పోల్చాడు. అవినాష్ ధౌజండ్వాలా, గంగవ్వ లక్ష్మీబాంబ్, నబీల్ రాకెట్, రోహిణి కాకరబత్తి, గౌతమ్ మ్యాచ్ స్టిక్ అన్నాడు. గతంలోనూ దీపావళికి నేను ఎలిమినేట్ అయ్యా.. ఈసారి కూడా దీపావళికే బయటకు వచ్చేశాను. ఎందుకో అర్థం కావట్లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ఇక రేపటి ప్రోమోలో అవినాష్ అనారోగ్యంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు చూపించారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మెడికల్ రూమ్కు వెళ్తే బయటకు వచ్చేయమన్నారు. వెళ్లిపోతున్నాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. హాస్పిటల్కు వెళ్లి మళ్లీ హౌస్లో అడుగుపెడతాడా? లేదా నిజంగానే వెళ్లిపోతాడా? అన్నది రేపు తేలనుంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇండియాలో ఎక్కడికి వెళ్లిన నన్ను గుర్తుపట్టేది తెలుగు సినిమా వల్లనే..
-
Shiva Karthikeyan: ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
వీడియో షేర్ చేస్తూ 'సాయి పల్లవి'ని టార్గెట్ చేస్తుందెవరు..?
శివ కార్తికేయన్- సాయిపల్లవి జోడిగా నటించిన 'అమరన్' తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుందన్ జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తి ఆర్మీ బ్యాక్డ్రాప్లో దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో కొందరు సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ నెట్టింట తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయితే, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుంచి కొంత భాగాన్ని కట్ చేసి కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఆమె ఇలా చెప్పారు. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కొందరు పనికట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మన జవాన్లను టెర్రరిస్ట్లతో పోల్చిందంటూ ఆమెను తప్పు పడుతున్నారు.బాలీవుడ్ వాళ్లే టార్గెట్ చేస్తున్నారా..?'అమరన్' మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తన ఇమేజ్ను మరింత పెంచుతామంటూ పీఆర్ ఏజెన్సీ వారు సంప్రదించారని తెలిపింది. అయితే, దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్కి ఆమె ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ.. సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ వాళ్లు సాయి పల్లవిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.The whole hatred towards #SaiPallavi is due to bad subtitle by the TV channel.She clearly says “Pakistan people will think our Soldiers as Terrorists bacause they think we are harming, Likewise for us too…May be perspective I am not sure…”pic.twitter.com/GH9V4LTxAa— Sathyamoorthy V (@sathyaonX) October 26, 2024 -
అప్పుడు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది!
నటనకు ప్రాధాన్యం ఉండే, మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు సాయిపల్లవి. దక్షిణాదిలో తనకంటూ ఎంతో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ‘రామాయణ’ సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కాగా శివ కార్తికేయన్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ‘అమరన్’ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ... బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల బాలీవుడ్కు చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తరచూ వార్తల్లో నిలవడం కోసం మీరు పీఆర్ టీమ్ను నియమించుకుంటారా? అని అడిగారు. పీఆర్ టీమ్ వల్ల తరచుగా వార్తల్లో ఉండగలను... అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు ఎలాగూ నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అప్పుడు ప్రేక్షకులు, ఫ్యాన్స్ నా గురించి మాట్లాడుకుంటారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నిత్యం నా గురించి మాట్లాడితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.. విసుగొస్తుంది.. అందుకే నేను పీఆర్ టీమ్ వద్దని చెప్పాను’’ అంటూ సాయి పల్లవి చెప్పారు. -
బాలీవుడ్ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదని చెప్పా!
సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ తన పేరు మార్మోగడానికి, జనాల నోట్లో నానడం కోసం పలువురు సెలబ్రిటీలు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారు. అయితే అవన్నీ తనకు నచ్చవంటోంది హీరోయిన్ సాయిపల్లవి. ప్రేమమ్ సినిమాతో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ అమరన్ మూవీతో అక్టోబర్ 31న ప్రేక్షకులను పలకరించనుంది.ఇమేజ్పెంచేందుకు PR?ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి నా ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీ ఉపయోగపడుతుందన్నాడు. దీనిపై ఏమైనా ఆసక్తి ఉందా? అని అడిగాడు. నాకసలు పీఆర్ అనే కాన్సెప్టే అర్థం కాలేదు. దీనివల్ల ఉపయోగమేంటని ప్రశ్నించాను.వద్దని చెప్పాపీఆర్ ఏజెన్సీ వల్ల నేను ఎప్పుడూ లైమ్లైట్లో ఉంటాను. అందరూ నా గురించి మాట్లాడుకుంటారని చెప్పాడు. నేను వద్దని చెప్పేశాను. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు నేనెలాగో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నా గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగొస్తుంది అని చెప్పుకొచ్చింది.సినిమా..కాగా సాయిపల్లవి అమరన్ సినిమా విషయానికి వస్తే.. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే సాయిపల్లవి చేతిలో తండేల్, రామాయణ్ సినిమాలున్నాయి. -
'ఆర్మీ జాబ్ కాదు.. నా లైఫ్'.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా అమరన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
శివకార్తికేయన్ ‘అమరన్’ మూవీ HD స్టిల్స్
-
నేను పాత్రలు ఎంచుకోవడానికి ఆయనే కారణం: సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ మత్స్యకారుని నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ సాయి పల్లవి ఓ చిత్రంలో కనిపించనుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీలో నటించింది.తాజాగా ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెకు నేను పెద్ద అభిమానిని.. ఏదో ఒక రోజు సాయిపల్లవితో కచ్చితంగా సినిమా తీస్తానని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలు విన్న సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది.డైరెక్టర్ మణిరత్నం మాటలపై సాయిపల్లవి స్పందించింది. సినిమాల్లోకి రాకముందు నాకు మణిరత్నం సార్ పేరు తప్ప.. ఇతర దర్శకుల పేర్లు తెలియవని చెప్పింది. అంతేకాకుండా తాను స్క్రిప్ట్లు, పాత్రలు ఎంచుకోవడానికి కూడా కారణం ఆయనేనని తెలిపింది. కాగా.. అమరన్ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో
సాయిపల్లవి.. ఓ స్టార్ హీరోని 'అన్న' అనేసింది. ఈ విషయాన్ని సదరు హీరోనే బయటపెట్టాడు. ఆమె అలా పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాడని కూడా చెప్పాడు.'అమరన్' అనే తమిళ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఇదంతా చెప్పాడు.తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో ఈ మూవీ తీశారు. అక్టోబర్ 31న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యేంతవరకు వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవితో జరిగిన ఫన్నీ సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)'గతంలో నేను టీవీ ఛానెల్లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను' అని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో 'తండేల్' సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తీస్తున్నారు. కొందరు తెలుగు జాలర్లు.. పాకిస్థాన్ అధికారులకు చిక్కి, అక్కడి జైల్లో కొన్నాళ్లు గడిపారు. ఈ సినిమాని క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు మూవీస్తో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాననే సాయిపల్లవి ధీమాతో ఉంది.(ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?)Heart of #Amaran ♥️ @Sai_Pallavi92 at #AmaranAudioLaunch#AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamyA Film By @Rajkumar_KP A @gvprakash Musical@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Sai_Pallavi92… pic.twitter.com/kRBCU7ADld— Raaj Kamal Films International (@RKFI) October 18, 2024 -
వెయ్యి మందితో పాట
నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘తండేల్’ కోసం వెయ్యిమందితో ఓ పాటని చిత్రీకరించారు మేకర్స్. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాత్రి నేపథ్యంలో వచ్చే ఓ పాటని వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్పై చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ పేర్కొని, ఆ పాటకు సంబంధించిన లుక్ని విడుదల చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు చాలా గ్రిప్పింగ్గా ఫిక్షనల్ స్టోరీ కంటే థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయి. శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల స్ఫూర్తితో ఈ పాటను చిత్రీకరించాం. దేవిశ్రీ ప్రసాద్ చక్కగా కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇందు రెబెక్కా వర్గీస్గా...
ఇందు రెబెక్కా వర్గీస్గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ‘అమరన్’ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. -
రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి.. ఇంట్రో వీడియో చూశారా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సాయిపల్లవి రెండు సినిమాలతో రాబోతుంది. అందులో ఒకటి నాగచైతన్య 'తండేల్', మరొకటి తమిళ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'అమరన్'లో అతడి భార్య ఇందుగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పాత్ర టీజర్ రిలీజ్ చేశారు. చూస్తున్నంతసేపు ఆహ్లాదంగా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈమె పాత్రని మరింత ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మించిన 'అమరన్'.. అక్టోబరు 31న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతమందించాడు. సాయిపల్లవి వీడియో చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
పురాతన సంప్రదాయంలో సాయిపల్లవి సిస్టర్ పెళ్లి.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఇటీవలే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఊటీలో జరిగిన వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్తో అలరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. పూజా కన్నన్ తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ శివకుమార్ను పెళ్లాడారు. ఈ శుభ సమయంలో సాయిపల్లవి కుటుంబసభ్యులు ఎంతో సందడిగా గడిపారు. అయితే చెల్లి పెళ్లిలో సాయి పల్లవి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దీనికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.అయితే పూజకన్నన్ వివాహం జరిగిన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆమె పెళ్లి నీలగిరి కొండల్లోని బడగ అనే పురాతన సంప్రదాయం జరగడమే. సెప్టెంబర్ 5న ఊటీలోని వరుడైన వినీత్ స్వగృహంలోనే వీరి వివాహా వేడుక జరిగింది. బడగ సంప్రదాయం ప్రకారం వరుడు పెళ్లితంతు అంతా వరుడి తరఫువారే నిర్వహించాలంటా. వివాహానికి సంబంధించిన ఖర్చులన్నీ వరుడే భరించాలంటా. నీలగిరి కొండల్లోని గ్రామాలలో జరిగే వివాహాలన్నీ దాదాపు ఇదే పద్ధతిని పాటిస్తారట.(ఇది చదవండి: సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్ వీడియో వైరల్)బడగ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే వడ్డిస్తారు. వీరి పెళ్లి చూస్తుంటే బడగ ఆచారాలు, సంప్రదాయాలు వాటి ఆచరణాత్మకతకు అద్దం పట్టినట్లుగా నిర్వహించారు. బాడగ సంప్రదాయం ప్రకారం వరుడు కట్నం తీసుకోరట. సాయిపల్లవి స్వస్థలం నీలగిరి జిల్లాలోని కోటగిరి కావడం.. అక్కడి ఆచార, వ్యవహరాలను పెళ్లిలోనూ పాటించడం విశేషం. -
పెళ్లి వీడియోతో సాయిపల్లవి చెల్లి.. గ్లామరస్ కావ్య థాపర్!
పెళ్లి ఫొటోలు, వీడియో షేర్ చేసిన సాయిపల్లవి చెల్లిచీరలో అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ మాయడ్యాన్సుతో దుమ్మురేపిన బిగ్ బాస్ శోభ, శుభశ్రీచీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న హీరోయిన్ కావ్య థాపర్బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో మలయాళ నటి నిమిషా సజయన్గేమ్ ఆడుతూ చిల్ అవుతున్న సింగర్ హారికా నారాయణన్త్రో బ్యాక్ వీడియో పోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ వితికా షేరు View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by iamkalpika (@iamkalpika27) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by SAMPAADA (@sampaada1) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) -
Sai Pallavi: పూజా కన్నన్ సంగీత్.. చెల్లితో కలిసి చిందేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
నాని - సాయిపల్లవి కాంబినేషన్ రిపీట్.. డైరెక్టర్ ఎవరు అంటే?
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్ వీడియో వైరల్
నటి సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం చాలా ఘనంగా జరిగింది. తమ ఇంట్లో శుభకార్యం కావడంతో సాయిపల్లవి కుటుంబసభ్యులు ఎంతో సందడిగా గడిపారు. పూజా కన్నన్ తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్తో ఏడడుగులు వేశారు. ఈ వేడుకల్లో తన సోదరితో కలిసి సాయిపల్లవి డ్యాన్ వేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.యిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా చిత్రపరిశ్రమలో ఉన్నారనే విషయం తెలిసిందే. 2021లో కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఆమె ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వినీత్, పూజా ఇద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ ఏడడుగుల బంధంలో అడుగుపెట్టారు. దీంతో సాయిపల్లవి అభిమానులు పూజా కన్నన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.OMG...Sai Pallavi n her Sister Danced for Marati Song Apasara Aali 😭💃❤️🔥@Sai_Pallavi92#Saipallavi #PoojaKannan#SaiPallaviSisterWedding pic.twitter.com/xCYxct9oIX— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 4, 2024SaiPallavi's Badaga traditional dance with Family in her Sister's wedding 🥹♥️@Sai_Pallavi92 #SaiPallavi #PoojaKannan #SaiPallaviSisterWedding pic.twitter.com/fYEV1Tzky2— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 5, 2024 -
పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి
చిత్రపరిశ్రమ హీరోయిన్లలో ఒక్కొక్కరిది ఒక్కో పాలసీ. కొందరు కేవలం గ్లామర్ను మాత్రమే నమ్ముకుని పైకి వచ్చినవారు ఉన్నారు. మరికొందరు నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. వీరు గ్లామర్ జోలికి అస్సలు వెళ్లరు. ఇలాంటి కేటగిరీకి చెందిన నటినే సాయిపల్లవి. ఈ అచ్చ తమిళ అమ్మాయి వైద్యవృత్తిలో పట్టభద్రురాలు. అయినా నటనపై ఆసక్తి. దీంతో డాన్స్లో శిక్షణ పొంది మొదట్లో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. అలా అనుకోకుండా మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా నటించే అవకాశం వరించింది. ఆ చిత్రంలో తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినిమానే ఆకట్టుకున్నారు. అలా కథానాయకిగా ప్రారంభమైన సాయిపల్లవి కెరియర్ ఇప్పుడు బాలీవుడ్ వరకు వెళ్లింది. ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు చేసిన ఈమె నెక్ట్స్ డోర్ అమ్మాయిగా ఇమేజ్ను తెచ్చుకున్నారు. అందాల ఆరబోతతో కాకుండా అభినయంతోనే రాణిస్తున్న అతికొద్ది మంది నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. నిజం చెప్పాలంటే పెద్దగా మేకప్ కూడా వేసుకోరు. అంత సహజత్వంతో కూడిన నటనతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తమిళంలోకి వడచెన్నై చిత్రంతో తెరంగేట్రం చేసిన సాయిపల్లవి ఆ తరువాత సూర్యకు జంటగా ఎన్జీకే చిత్రంలో నటించారు. ఈమె నటించిన గార్గి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈమె శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్ చిత్రంలో, హిందీలో రామాయణం చిత్రంలో సీతగాను నటిస్తున్నారు. ఇప్పటివరకు తన ప్రేమ గురించిగానీ పెళ్లి గురించిగానీ ఎక్కడ ప్రస్తావించని సాయి పల్లవి తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తన ప్రేమ గురించి వెల్లడించారు. అందులో మహాభారతం ఇతిహాసంపై తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. గత 17 ఏళ్లుగా అభిమన్యుని గురించి చాలా విషయాలు చదివి తెలుసుకున్నానన్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు 10 ఏళ్లుగా ఆయన్ని ప్రేమిస్తున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు. దీంతో ఈమె ప్రేమ వ్యవహారం మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
అమరన్కు సాయిపల్లవి డబ్బింగ్
వైవిధ్యభరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటి సాయిపల్లవి. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ భామ ఒక్కో చిత్రంలో ఒక్కో రకమైన పాత్రలో నటిస్తూ తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్లో ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా నటించి తన ప్రత్యేకతను చాటుకున్న సాయిపల్లవి ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇప్పుడు బాలీవుడ్లోనూ నటించే స్థాయికి ఎదిగారు. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక యథార్థ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ను అధిక భాగం కశీ్మర్లో రూపొందించారు. షూటింగ్ను పూర్తిచేసుకున్న అమరన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీంతో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న తెరపైకి రానుంది. కాగా ఈచిత్రంతో పాటు తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్, హిందీలో రామాయణం చిత్రంలో సీతగానూ సాయిపల్లవి నటిస్తున్నారు. -
Thandel Movie: మ్యూజికల్ తండేల్
‘లవ్స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. నాగచైతన్య, సాయిపల్లవిలు డీ–గ్లామరస్ రోల్స్లో కనిపిస్తారు. (చదవండి: అమ్మ గయ్యాలిది కాదు.. తన చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ ఆవిడే!)వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 2న దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ యూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘తండేల్’ సినిమా కోసం చార్ట్ బస్టర్ అల్బమ్ కం΄ోజర్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. నేపథ్య సంగీతం కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
చీరతోనే అందం అంటున్న సాయి పల్లవి!
చీరలో ఉన్న స్త్రీల అందం మరే దుస్తుల్లోనూ కనిపించదంటారు. అందుకే స్త్రీలకు చీరే అందం అనే నానుడి కూడా ఉంది. నటి సాయి పల్లవి కూడా ఈ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడలు శృతిమించుతున్న ఈ రోజుల్లో కూడా తనకు చీరలు ధరించడంలోనే సౌకర్యం అంటున్నారీ భామ. సాయి పల్లవి నటించే కథా పాత్రలు కూడా సంప్రదాయ రీతిలోనే ఉంటాయన్నది గమనార్హం. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తమిళ అమ్మాయి సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నటించి పాపులర్ అయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సాయి పల్లవి గ్లామర్కు దూరం అన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ముఖానికి మేకప్ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక చిత్రాల్లో అయినా బయట ప్రపంచంలో నైనా ఈమె కనిపించేది చీరలో లేదా చుడిదార్లోనే. ముఖ్యంగా సినీ వేడుకల్లో పాల్గొనేటప్పుడు సాయి పల్లవి సంప్రదాయబద్ధంగా చీరలే ధరిస్తారు. వేడుకల్లో కూడా చీరలే ధరించి రావడం గురించి ప్రశ్నిస్తే తనకు చీరలే సౌకర్యంగా ఉంటాయని బదులిచ్చారు. పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొన్నప్పుడు ఒక రకమైన తెలియని ఒత్తిడి కలుగుతుందన్నారు. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమి మాట్లాడాలన్న విషయంపైనే మనసు లగ్నమై ఉంటుందని, దుస్తులపై దృష్టి పెట్టడం కుదరదని అన్నారు. అలాంటప్పుడు చీర ధరించడమే సౌకర్యంగా ఉంటుందని భావిస్తానన్నారు. అలా ఒత్తిడి అనిపించే వేడుకల్లో తాను చీర ధరించి పాల్గొనడానికి ఇష్టపడతానని నటి సాయి పల్లవి పేర్కొన్నారు. కాగా మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటించిన అమరన్ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అలాగే నాగచైతన్యకు జంటగా నటిస్తున్న తెలుగు చిత్రం తండేల్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హిందీ చిత్రం రామాయణంలో నటిస్తున్నారు. ఇందులో ఈమె సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
సాయిపల్లవికి తండేల్ టీమ్ సన్మానం.. ఎందుకో తెలుసా?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తండేల్ టీమ్ ఘనంగా సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతో కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సెట్లోని వారంతా ఆరు సింబల్స్ చూపించారు. అవును.. సాయిపల్లవికి ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. అందులో భాగంగానే తన విజయాలను ఇలా సెలబ్రేట్ చేశారు. ఎన్ని అవార్డులంటే?కాగా సాయిపల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ మూవీకి గానూ బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు గెలుచుకుంది. ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలకు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి మరోసారి సత్తా చాటింది. గార్గి, విరాటపర్వం (క్రిటిక్స్ విభాగంలో) చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుంది. వీటితో కలిపి సాయిపల్లవి అందుకున్న ఫిలింఫేర్ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా ఈ బ్యూటీ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసింది.తండేల్ సంగతులు..తండేల్ విషయానికి వస్తే.. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో చై, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Team #Thandel celebrated the twin wins of @Sai_Pallavi92 at the Filmfare Awards on the sets of the film ❤️🔥'Satya' from #Thandel will be another memorable role from the talented actor ✨#Dhullakotteyala 💥💥Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/4qdrMUtaqH— Geetha Arts (@GeethaArts) July 17, 2024 చదవండి: కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో -
స్టార్ హీరోయినే కానీ మేకప్ వేయదు! ఈ బ్యూటీ గుర్తుపట్టారా?
హీరోయిన్లు ఎందుకు నచ్చుతారు అంటే సమాధానం చెప్పడం కష్టం. కొందరు అందంగా ఉన్నారని నచ్చుతారు. మరికొందరు బాగా నటించారని నచ్చుతారు. ఇంకొందరు సింప్లిసిటీ వల్ల నచ్చేస్తారు. ఇప్పుడు చెప్పిన మూడు క్వాలిటీస్ కూడా ఈ హీరోయిన్లో ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే సినిమా అనగానే మేకప్ కంపల్సరీ. కానీ ఈ బ్యూటీ మాత్రం మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న చిన్న పిల్ల పేరు సాయిపల్లవి. అవును మీరు ఊహించింది కరెక్టే. 'ప్రేమమ్' (మలయాళ), 'ఫిదా' సినిమాలతో హీరోయిన్గా తనకుంటా సెపరేట్ మార్క్ సృష్టించుకున్న బ్యూటీనే. తమిళనాడులోని ఓ గిరిజన తెగలో పుట్టి పెరిగిన సాయిపల్లవి.. చిన్నప్పటి నుంచే డ్యాన్సుల్లో ఇరగదీసేది. అలా టీనేజీలోనే పలు డ్యాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులోనూ 'ఢీ' ప్రోగ్రామ్లో పాల్గొంది. ఇక చదువు కోసం కొన్నాళ్లు డ్యాన్సులకు బ్రేక్ ఇచ్చింది. పెద్దయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' ల్యాగ్ అనిపించింది.. ప్రభాస్ని అలా చూపించాల్సింది!)మలయాళ 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. దీని తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది. గత రెండేళ్లుగా సాయిపల్లవి సినిమాలు చేయకపోయేసరికి ఇండస్ట్రీకి దూరమైపోయిందేమో అనుకున్నారు. ప్రస్తుతం 'తండేల్', 'రామాయణ్' లాంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. ఈ రెండు రిలీజైతే సాయిపల్లవి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోవడం గ్యారంటీ!తాజాగా తన తండ్రి 60వ పుట్టినరోజు సందర్భంగా క్యూట్ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తండ్రితో తన చాలా చిన్నప్పటి ఫొటోని షేర్ చేసుకుంది. ఇది చూసి సాయిపల్లవి ఎంత ముద్దుగా ఉందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసేస్తున్నారు. మరి పాప ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
సాయి పల్లవికి అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు ఎన్నో తెలుసా..?
మలయాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్గా ఎదిగింది. మర్ పాత్రల కన్నా కథలో బలం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల కెరీర్లో ఆమె 19 సినిమాల్లో నటించింది. అయితే, ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమనే చెప్పాలి. అలా మలయాళం, తెలుగు, తమిళంలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో సాయిపల్లవికి అవార్డ్ దక్కింది. అయితే, సాయి పల్లవి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 68 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కితే.. తెలుగులో విరాటపర్వం చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన హీరోయిన్గా ఆమె గుర్తింపు పొందింది.ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఫిదాలో భానుమతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్లో ఓ అరుదైన ఘనతను కూడా ఆమె అందుకుంది. సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి నిలిచింది.సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలుప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్) -
కామెడీ కథా పాత్రల్లో నటించాలని ఉంది
నటి సాయిపల్లవి ఈ పేరు నటనకు, డాన్స్కు చిరునామా అని పేర్కొనవచ్చు. మలయాళంలో ప్రేమమ్ అనే చిత్రంలో టీజర్గా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అచ్చ తమిళ నటి సాయి పల్లవి. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోకుండా, పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలింస్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న అమరన్ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అలాగే తెలుగులో నాగచైతన్య సరసన ఒక చిత్రం చేస్తున్న సాయిపల్లవి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామయణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకూ వివిధ భాషల్లో రకరకాల పాత్రలు పోషించానన్నారు. ముఖ్యంగా తెలుగులో ఫిదా, లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించానని చెప్పారు. అయితే వాటన్నింటి కంటే విభిన్నమైన కామెడీ కథా పాత్రలో నటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాంటి చిత్రంలో అవకాశం వస్తే భాషా బేధం లేకుండా నటించడానికి రెడీ అని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. -
సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్
హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే నేచురల్ బ్యూటీ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పలు భాషల్లో చాలానే సినిమాలు చేసింది గానీ గ్లామర్, రొమాన్స్ విషయంలో గీత దాటలేదు. ఇకపోతే చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని అంటుంటారు. కానీ ఈమె మాత్రం రెండింటిని భలే మేనేజ్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈమె ఎమ్బీబీఎస్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?తమిళనాడుకు చెందిన సాయిపల్లవి చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. తెలుగులో డ్యాన్స్ షోలోనూ పార్టిసిపేట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు ఎంబీబీఎస్ చేస్తూనే మరోవైపు నటిగానూ అవకాశాలు దక్కించుకుంది. 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ తదితర చిత్రాలతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)జార్జియా దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేసినప్పటి వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ట్విట్టర్(ఎక్స్)లో ఈ వీడియో వైరల్ అవుతుండేసరికి అందరూ ఇది రీసెంట్ వీడియో అనుకుంటున్నారు. కానీ చాలా ఏళ్ల క్రితం వీడియోనే ఇదని తెలుస్తోంది. ఆ మధ్య కొన్నాళ్ల సినిమాలు చేయకపోయేసరికి సొంతూళ్లో హాస్పిటల్ పెట్టనుందని అన్నారు. కానీ అవేవి నిజం కాదని తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు మూవీ 'తండేల్', పాన్ ఇండియా సినిమా 'రామాయణ్' ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత సాయిపల్లవి డాక్టర్ కెరీర్ గురించి ఏమైనా క్లారిటీ రావొచ్చు. అంతవరకు మాత్రం వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉండగా 'తండేల్'.. ఈ ఏడాది డిసెంబరులో లేదంటే నవంబరులో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్లు.. ఎక్కువగా ఆ రోజే!)Watch #SaiPallavi from her MBBS Graduation Day at Tbilisi State Medical University, Georgia.The actress will next be seen in #Thandel starring #NagaChaitanya. pic.twitter.com/rWjvSKMzvN— KLAPBOARD (@klapboardpost) July 6, 2024 -
కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీనే ‘తండేల్’
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శ్రీకాకుళంలో ప్లాన్ చేసింది. శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ ఈ రియల్ స్టోరీ రాశారట. ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిగా ఉంటూ, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకొని స్టోరీ రాసినట్లు ఓ సందర్భంలో రచయిత కార్తీక్ తీడా చెప్పారు. సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు అన్ని పరిశీలించారట. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు రూపం దాల్చుకుంది. రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథ మొదలుపెట్టి అత్యద్భుతంగా రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. -
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్గా కీర్తీ సురేష్ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను బాలీవుడ్లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. -
స్టార్ హీరోయిన్స్ జపం చేస్తున్న ‘రౌడీ’
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడం ట్రెండ్గా మారింది. గతేడాది రిలీజ్ అయిన ఖుషీ నుంచి ఇదే ట్రెండ్ రిపీట్ అవుతోంది. ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫ్యామిలీ స్టార్లో కూడా మరో స్టార్ హీరోయిన్ మృణాలు ఠాకూర్ మెరిసింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా విజయ్ స్టార్ హీరోయిన్ ట్రెండ్నే ఫాలో అవుతున్నాడు. తన తదుపరి చిత్రంలో కూడా స్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఆమె మరెవరో కాదు లేడీ పవర్స్టార్ సాయి పల్లవి. నిజానికి విజయ్, సాయిపల్లవి కాంబినేషన్లో సినిమా రావాలని టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ జోడికి దగ్గ కథ లేకపోవడం ఇన్నాళ్లు కలిసి నటించలేదు. తాజాగా యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కొల్లా ఓ అందమైన ప్రేమ కథతో వీరిద్దరిని కలిశాడు. స్టోరీ నచ్చడంతో కలిసి నటించేందుకు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రంతో అయినా విజయ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. -
విజయ్ దేవరకొండతో ప్రేమకథకు సిద్ధమవుతున్న సాయిపల్లవి..
-
గాడ్ పవర్?
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్లో సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది. -
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
-
రూ. 2 కోట్లు ఆఫర్ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి
నటిగా తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ను పెట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె చదివింది వైద్యవిద్య అయినా అయ్యింది నటి. తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న సాయిపల్లవి. దీంతో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నటిగా కొన్ని నిర్ధిష్టమైన భావాలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉంటారు. తన పాత్రకు అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్ నటుడి చిత్రం అయినా సరే. అలా జరిగింది కూడా. అలాంటి నటి ఇప్పుడు సైలెంట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదీ రామాయణ్ చిత్రంలో సీతగా నటించే అవకాశం వరించింది. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలను చూస్తే సీత పాత్రలో సాయిపల్లవి ఎంతగా ఒదిగి పోయారో అని అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న అమరన్ చిత్రాన్ని పూర్తి చేశారు.కాగా నటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది ఒక సౌందర్య సాధనకు చెందిన ప్రకటన కావడమేనట. అలాంటి సౌందర్య వస్తువులతో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు. -
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్తో ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
Tandel: ప్రేమ కబుర్లు
మొబైల్లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ ఫిల్మ్కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. సత్యభామ ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
-
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
ప్రస్తుత జనరేషన్లో మిగతా హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి కాస్త డిఫరెంట్. నటన, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తుంది. 'ప్రేమమ్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగులో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం 'తండేల్' సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి.. తమిళంలో శివకార్తికేయన్ మూవీలో చేస్తోంది. హిందీలో 'రామాయణ్' పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సరే ఇదంతా పక్కనబెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తన శారీరక సౌందర్యం గురించి మాట్లాడింది. 'ప్రేమమ్' మూవీ టైంలో ముఖంపై మొటిమలు చాలా ఉండేవి. తనకు చిత్రంలో అవకాశం రావడానికి కారణమే కూడా అవే. ప్రస్తుతం మాత్రం తన ముఖంపై ఎలాంటి మొటిమలు లేవు. అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. కానీ తాను ఎలాంటి చికిత్స గానీ థెరఫీ గానీ చేయించుకోలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమేనని చెప్పిన సాయిపల్లవి.. అవి పోవడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నారు. వాటంతటికి అవే పోతాయని చెప్పింది. తన ఒత్తయిన జుత్తు సీక్రెట్ గురించి చెప్పిన ఈ బ్యూటీ.. తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటానని, ఆలోవెరా జెల్స్ ఉపయోగిస్తానని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
తండేల్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
-
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్బీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
సాయిపల్లవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె డ్యాన్సులే. ఎందుకంటే స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ చాలా గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు సాయిపల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్) తమిళ బ్యూటీ సాయిపల్లవి ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు జార్జియాలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఈ విషయం చాలామందికి తెలిసినా సరే అక్కడ చదువుతున్నప్పటి ఫొటోలు, వీడియోల్లాంటివి ఏం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫ్రెండ్స్ తో కలిసి 'షీలా కీ జవానీ' పాటకు సాయిపల్లవి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో సాయిపల్లవి మిగతా వాళ్లని పూర్తిగా డామినేట్ చేసేసింది. బ్లర్ గా ఉండటంతో పాటు దూరం నుంచి వీడియో తీయడం వల్ల సరిగా క్లారిటీ లేదు. కానీ సాయిపల్లవి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి.. పాన్ ఇండియా 'రామాయణ'లో సీతగా కనిపించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) #SaiPallavi doing Sheela ki Jawani Song at her College Festpic.twitter.com/t4RaoecDmP — R a J i V (@RajivAluri) April 16, 2024 -
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?
ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ) 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
'రామాయణ' సినిమా కోసం నిర్మాతగా స్టార్ హీరో.. అధికారిక ప్రకటన
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అధికారికంగా వచ్చేసింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి 'రామాయణ' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. 'US, UK, ఇండియా వంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు కూడా వెళ్లాను. నా జీవితంలో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుంచి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యశ్ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యశ్ లాంటి వారితోనే సాధ్యమవుతుంది.' అని ఆయన అన్నారు. యశ్ మాట్లాడుతూ... ' నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, అందుకు రామాయణ సినిమానే కరెక్ట్ అనుకున్నాను. ఈ విషయంపై నమిత్తో నేను అనేక మార్లు చర్చించాను. కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.' అని తెలిపారు. నమిత్ మల్హోత్రా యాజమాన్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో గ్లోబల్ కంటెంట్ను సినిమా చిత్రీకరించే ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ మూడు సినిమాల నిర్మాణంలో భాగమై ఉంది. అందులో రామాయణం కూడా ఒకటి. యశ్కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్ను నిర్మించారు. త్వరలోనే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
మాస్ డిష్యుం
‘తండేల్’ సెట్స్లో డిష్యుం డిష్యుం అంటూ అదిరిపోయే మాస్ ఫైట్స్ చేస్తున్నాడు రాజు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాకు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ‘తండేల్’లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
‘రామాయణం*లోకి త్రివిక్రమ్!
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్లోకి త్రివిక్రమ్ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది. -
డైరెక్షన్ పై లేడీ సూపర్ స్టార్ ఇంటరెస్ట్..?
-
Thandel Shooting Pics: సాయి పల్లవి ఒళ్లో క్యూట్ పాప.. తండేల్ షూటింగ్ ఫోటోలు
-
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్