Kakatiya University
-
యూనివర్సిటీల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా.. విశ్వవిద్యాలయాల పరిపాలనకు తగిన విధంగా వాటిని పునర్వ్యవస్థీకరించలేదు. దీంతో ఆయా జిల్లాల విద్యార్థులు, అఫిలియేషన్ కలిగిన కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం కొత్త జిల్లాలు, మూడేళ్ల క్రితం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వర్సిటీల పరిధి విషయంలో మాత్రం అవసరమైన మార్పులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే కొత్తగా శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ఆయా ఉమ్మడి జిల్లాల పరిధికి మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో గతం నుంచే ఉన్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలపై మాత్రం భారం అలాగే ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని పలువురు కోరుతున్నారు.ప్రత్యేక కమిటీ నివేదిక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆయా కళాశాలల అఫిలియేషన్ విషయమై.. జిల్లాల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గతంలోనే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయగా.. ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే కళాశాలల అఫిలియేషన్ విషయానికి వస్తే.. తెలంగాణ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, శాతవాహన వర్సిటీ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి.అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ మాత్రం.. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను ఆనుకున్న నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీని దాటుకుని ఆయా జిల్లాల వారు సుదూరంలోని వరంగల్ కాకతీయ వర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్లోని శాతవాహన వర్సిటీని అనుకున్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు కరీంనగర్ మీదుగానే వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. అయితే గతంలోనే ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయా వర్సిటీలు, కొత్త జిల్లాల మధ్య దూరం, కళాశాలల సంఖ్యను బట్టి పరిధి మార్పుపై ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాల ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు తెలంగాణ వర్సిటీ పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు, శాతవాహన వర్సిటీ పరిధిలోకి ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాలను కేటాయించేలా నివేదికలో ప్రతిపాదించారు.చదవండి: ‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లుగతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉస్మానియా పరిధిలో ఉండగా.. కొత్త ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా మాత్రమే ఆ వర్సిటీ పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఉస్మానియా వర్సిటీ పరిధిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు ఉండేలా ప్రతిపాదించారు. ఇక కాకతీయ వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండేలా నిర్ణయించారు. ఇక మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లాలు, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని ఐదు జిల్లాలు యధావిధిగా ఉండేలా నివేదికలో ప్రతిపాదించారు. కాగా ఇందుకు సంబంధించి విధాన నిర్ణయం విషయంలో జాప్యం జరుగుతోంది.పరిధులపై ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు..ఉస్మానియా: రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, వికారాబాద్ కాకతీయ: వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ శాతవాహన: కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట మహాత్మాగాంధీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి పాలమూరు: మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట -
మాడిన అన్నం.. రుచిలేని పప్పు
కేయూ క్యాంపస్: భోజనం బాగా లేదని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద బైఠాయించారు. భోజనం బాగుండటం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నం మాడిపోతోందని, పప్పు కూడా బాగుండటం లేదని వివరించారు.వీసీ, రిజిస్టర్ రావాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ రాత్రి 11.30 గంటలకు అక్కడికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశీలించారు. ఈ సమస్యను శనివారం పరిశీలించి.. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వెంటనే డైరెక్టర్ హాస్టల్కు వెళ్లి పరిశీలించారు. -
‘సెట్’ చేసేశారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్ను సాధారణంగా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. మరికొన్ని కీలకమైన సెట్స్ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు. పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఐసెట్ నిధులు గందరగోళం కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు. దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు. పరిశీలిస్తున్నాంకాకతీయ నిర్వహించిన ఐసెట్పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై వారం రోజులపాటు సస్పెండ్ చేశారు అధికారులు. ఈ విషయంపై యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రమేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని తెలిపారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని హాస్టల్లోనూ మరోసారి ఇంట్రడక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్సన్కు గురైన వారిలో పీజీ చదువుతున్న 28, కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. వారం రోజులపాటు సస్పెన్డ్ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు. అయితే అర్ధరాత్రి హాస్టల్ రూమ్కు పిలిచి సీనియర్లు వేధించారని జూనియర్లు చెబుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను ర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. చదవండి: HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్రావు. -
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : మొక్కలలో జన్యుసవరణలతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆస్ట్రేలియా ముర్దోక్ వర్సిటీ సైంటిస్టు ఎంజీకే జోన్స్ అన్నారు. కేయూలోని సేనేట్హాల్లో నిర్వహిస్తున్న ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్‘ పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో బుధవారం ఆయన ప్రసంగించారు. ‘జీనోమ్ ఎడిటింగ్’ ద్వారా సృష్టించిన నూతన వంగడాలను, పంటలను ఏఏ దేశాలల్లో ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంతోపాటు వాటి వినియోగం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా వివరించారు. అనంతరం పూణేలోని సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీలమిత్ర .. టమాటా మొక్కల అభివృద్ధిలో వివిధ రకాల ఒత్తిళ్లు, కరువు పరిస్థితులను తట్టుకునేలా ఉండే ప్రయోగాలను వివరించారు, ఓయూ ప్రొఫెసర్ కేవీ రావు.. రసం పీల్చే పురుగులు, క్రిమి కీటకాలను తట్టుకునే పత్తి, వరి పంటల గురించి వివరించారు. భారతీయర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్.. ట్రాన్స్జీన్ టెక్నాలజీ, పరిశోధన గురించి వివరించారు. మలేషియా మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ అన్న హరికష్ణ.. జీవసాంకేతిక జన్యుసవరణల పరిశోధనల ద్వారా నిలబడే అరటి మొక్కలను గురించి వివరించారు. బెంగళూర్ టీఎఫ్ఆర్ ఎన్సీబీసీ శాస్త్రవేత్త పీవీ శివప్రసాద్.. ఆహార ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలు వివరించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పి కుమార్ మాట్లాడుతూ పంటల అభివృద్ధికి బయో టెక్నాలజీ పరిష్కారమన్నారు. కార్యక్రమంలో కేయూ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు ఎన్ రామస్వామి, ఎ సదానందం, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు రోజారాణి, ఎంవీ రాజం, ప్రశాంత మిశ్రా, కోటా శ్రీనివాస్, కేవీ సరిత, రిటైర్డ్ ప్రొఫెసర్లు చేరాలు, మాధురి, కేయూ బయోటెక్నాలజీ విభాగం అఽధిప తి వెంకటయ్య, ఏవీ రావు, శాసీ్త్ర పాల్గొన్నారు.కాగా, అతిథులు సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆకట్టుకున్న పోస్టర్ల ప్రజెంటేషన్స్.. కేయూలో బయోటెక్నాలజీ విభాగం, యూకే అబెర్విసిత్ వెల్స్ యూనివర్సిటీ కొలబరేషన్లో ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో పలువురు పరిశోధకులు పోస్టర్లను ప్రజెంటేషన్ చేశారు. జీవసాంకేతిక పరిజ్ఞానంతో నూ తన వంగడాలు తదితర అంశాలపై అక్కడికి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులకు తెలిపారు. 25 వరకు పోసర్లు ప్రజెంటేషన్ చేయగా అందులో ప్రతిభ ప్రదర్శించిన వారికి ప్రోత్సాహకంగా ఈనెల 29న ముగింపు సభలో బహుమతులు అందజేస్తారు. నేడు ముగియనున్న కాన్ఫరెన్స్ కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగి యనుంది. ఈముగింపు సదస్సుకు తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ మాజీ వీసీ విద్యావతి, కేయూ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు, రాజమండ్రి ఐసీఏఆర్, సీటీఆర్ఐ డైరెక్టర్ శేషుమాధవ్, కేయూ సైన్స్ డీన్ మల్లారెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సి పాల్ సురేశ్లాల్ తదితరులు హాజరవుతారు. -
సివిల్స్లో కేయూ ప్రొఫెసర్ మంద అశోక్ కుమార్ కూతురుకు 646 ర్యాంక్
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646 ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్లో పనిచేస్తున్నారు. మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, చిన్న అన్నయ్య అభినవ్ పూణేలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, మంద అపూర్వ సివిల్స్లో ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. -
కేయూలో ఉద్రిక్త వాతావరణం
-
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఇలా... టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. ►26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ►14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు. ►ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తారు. ►ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ►ఫలితాలు జూన్ 20న విడుదల చేస్తారు. 25 శాతం అర్హత మార్కులు టీఎస్ ఐసెట్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని, మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25%గా నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్ పేపర్, సూచనలు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల సమాచారం జ్టి్టpట//జీఛ్ఛ్టి.్టటజ్ఛి.్చఛి.జీn లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి తెలిపారు. -
విద్యలో వివక్ష ఉండొద్దు
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రత్యక్ష బోధన, హాస్టల్ వసతి కావాలి
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణకు ఒక్కరోజు ముందు పదోన్నతి
కేయూ క్యాంపస్: ఈ నెల 31న ఉద్యోగ విరమణ ఉండగా 30వ తేదీన ప్రమోషన్ ఇచ్చారు కాకతీయ వర్సిటీ అధికారులు. యూనివర్సిటీలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ విభాగాల ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని అకుట్ బాధ్యులు విన్నవించినా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్లు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు. జియాలజీ ప్రొఫెసర్ కె.డేవిడ్ కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎట్టకేలకు వర్సిటీ అధికారులు సోమవారం సబ్జెక్టు ఎక్స్పర్ట్ను పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించి సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. వీసీ తాటికొండ రమేశ్, పాలక మండలిసభ్యుల సమక్షంలో రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి సోమవారం సాయంత్రం డేవిడ్కు పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. రమేశ్ వీసీగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం గడిచినా, సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్స్లో జాప్యం చేసి ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి కల్పించడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్లోకి రాకుండా నిరంజన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్రెడ్డిని తొలగించాలని డైరెక్టర్తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్కు వచ్చి నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన
-
ఐసెట్లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, వరంగల్: తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ర్యాంకులు ఇలా.. హైదరాబాద్కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
ఇది ఆత్మహత్యకాదు.. ప్రభుత్వ హత్య!
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్నాయక్ మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావని, పోరాటం చేయాలని, తాను బతికి వస్తే మీతో కలుస్తానని సునీల్ నాయక్ పిలుపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకుందామని ఆ ప్రకటనలో ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, పట్టభద్రుడు సునీల్ నాయక్ ఆత్మహత్య కేవలం కేసీఆర్ సర్కార్ చేతగానితనంతోనే జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయిన కేసీఆర్ అండ్ కో, ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలివ్వకుండా వారి చావులకు కారణమవుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. సునీల్కు నివాళి... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నేతృత్వంలో పలువురు సునీల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్దినమని, కలెక్టర్ అవుతానన్న గిరిజన బిడ్డ కాటికి పోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ డౌన్డౌన్... మా ఉద్యోగాలు–మాక్కావాలి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి ముట్టడి సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్లో దావానలంలా వ్యాపించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశా యి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇదిలాఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు. అండగా ఉంటాం: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం రాలేదన్న బాధ, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. సునీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి సునీల్ లేని లోటు తీర్చలేనిదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. -
హాస్టళ్ల మూసివేతపై ఉద్రిక్తత
కేయూ క్యాంపస్ (వరంగల్): కరోనా కట్టడికిగాను విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి కూడా సెలవులు ప్రకటించారు. అలాగే, బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వసతిగృహాలను కూడా మూసి వేయనున్నట్లు చెప్పడం.. మరోవైపు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికారులు, విద్యార్థులకు మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తూ హాస్టళ్లను మూసివేస్తే తామెక్కడ ఉండాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆవరణ నుంచి కేయూ క్రాస్ రోడ్డు వరకు వెళ్లి రాస్తారోకో చేశారు. ఆందోళన కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అధికారులు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
కేయూలో వివాదం.. నాన్బోర్డర్స్ వీరంగం
సాక్షి, వరంగల్ : చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది. సౌత్ జోన్, ఆల్ ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది. స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్కి పిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు. దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది. -
పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్) : కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల పీజీ విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు బోధించాలని రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం సూచించారు. కేయూలోని విభాగాధిపతులతో ఆయన ఆన్లైన్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈనెల 1వ తేదీ నుంచే ఆన్లైన్ పాఠాల బోధన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఇకనైనా త్వరగా విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు సిద్ధం చేయాలని తెలిపారు. ఆ వెంటనే జూమ్ యాప్ లేదా గూగుల్ మీట్ ద్వారా తరగతులు నిర్వహించాలని, అవసరం మేరకు ఎంపిక చేసిన పార్ట్ టైం లెక్చరర్ల జాబితా అందిస్తే ఉత్తర్వులు ఇవ్వనున్నామని వెల్లడించారు. మేం సిద్ధమే కానీ... పలువురు విభాగాధిపతులు మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నా విభాగా ల్లో కొందరు అధ్యాపకులు సంతకాలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ కోవిడ్ దృష్ట్యా ఇళ్లకు వెళ్లి ఉంటే అక్కడి నుంచే పాఠాలు బోధించేలా విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో కూడా తరచుగా మాట్లాడాలని తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ల విద్యార్థులు ప్రమోట్ కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులను మూడో సెమిస్టర్కు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులను ఐదో సెమిస్టర్కు ప్రమో ట్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో యూజీసీ నిబంధనల మేరకు కేయూ డీన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
సాక్షి, వరంగల్: జై భారత్.. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో విద్యారంగ సమస్యలు, వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధరలు తదితర సామాజిక సమస్యలపై చర్చించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వరంగల్లోని కేయూ ఆడిటోరియం వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలో 2008 లో హన్మకొండలోని ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు వరంగల్ వేదికగా నిలుస్తోంది. రెండు వేలమంది ప్రతినిధులు.. కేయూలో మంగళవారం నుంచి నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన రెండు వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 8లక్షల సభ్యత్వం కలిగిన ఏబీవీపీలో రాష్ట్ర, జిల్లా, మండల, కళాళాశాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారు. వీరి కోసం కేయూలో పలుచోట్ల వసతి ఏర్పాట్లు చేశారు. చర్చించనున్న అంశాలు ఇవే.. రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగుల ఖాళీలు, వీసీల భర్తీలో ఆలస్యం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాల కల్పన, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. మొదటిరోజు కేవలం జెండా ఆవిష్కరణ.. నాలుగు రోజుల పాటు జరిగే ఏబీవీపీ మహాసభల్లో భాగంగా మంగళవారం తొలిరోజు సాయంత్రం 6గంటలకు సభాప్రాంగణం వద్ద ఏబీవీపీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మీసాల ప్రసాద్.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్తో కలిసి ఆవిష్కరిస్తారు. ఏబీవీపీ ప్రముఖ్ మాసాడి బాబురావు పాల్గొంటారు. ఇక రెండో రోజైన బుధవారం రాష్ట్ర మభసభలను ఉద్ధేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభిస్తారు. ఏబీవీపీ జాతీయ సంఘటసహాకార్యదర్శి కేఎన్ రఘునందన్ పాల్గొననుండగా.. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం 3గంటలకు కేయూ నుంచి ఏకశిలా పార్కు వరకు శోభాయాత్రగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి,న్రాష్ట్ర నూతన అధ్యక్షడు శంకర్ పాల్గొని ప్రసంగిస్తారు. మహాసభలను విజయవంతం చేయాలి.. కేయూలో మంగళవారం నుంచి జరగనున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని స్వాగత సమితి అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కేయూలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా విద్యారంగ, సామాజిక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల కన్వీనర్ ఏలేటి నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, కేయూ అధ్యక్షుడు చట్ట సతీష్, నగర కార్యదర్శి భరత్ పాల్గొన్నారు. 1970 దశకం నుంచే ఏబీవీపీ.. స్వాతంత్రనంతం 1949, జూలై 9న ఐదుగురు విద్యార్థులతో ప్రొఫెసర్ బెహల్ ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970 దశకం నుంచి ఎక్కువగా ఏబీవీపీ విస్తరణ యూనివర్సిటీల్లో జరిగింది. అప్పటి నుంచే వరంగల్ ప్రాంతంలోనూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 1982లో కేయూలో జాతీయ జెండాకు అవమాన జరిగిందంటూ సామ జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం చేస్తూ అసువులు బాశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ విద్యారంగ, సామాజిక సమస్యలపై పోరాడుతోంది. -
కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. 90 రోజుల షెడ్యూల్ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్కు దిగారు. కాగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝలిపించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
హక్కుల ఉద్యమ కరదీపిక
‘అందరికీ ఒకే విలువ ‘ అన్న అంబేడ్కర్ కాగడాను స్వతంత్ర భారత హక్కుల ఉద్యమ చరి త్రలో మూడు దశాబ్దాల పాటు కొనసాగించిన అసాధారణ వ్యక్తి బాలగోపాల్. మేధావిగా, రచయితగా, కార్యకర్తగా ఉన్నత మానవ విలువల దిశగా సమాజాన్ని మార్చడం కోసం ప్రజాతంత్ర ఉద్యమాల హక్కుల పరిరక్షణ ఉద్యమాల నిర్మాణంలో చిరస్మరణీయ పాత్రను పోషించాడు. జూన్ 10, 1952లో పార్థనాధ శర్మ, నాగమణి దంపతులకు బళ్లారిలో జన్మించిన బాలగోపాల్ నెల్లూరు, తిరుపతిలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల వరంగల్లో ఎంఎస్సీ అప్లయిడ్ మాథ్్సను, అలాగే స్వల్పకాలంలో పీహెచ్డీని పూర్తి చేసిన అసాధారణ ప్రతిభావంతుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్సిస్టిట్యూట్ ఢిల్లీ నుండి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ను సాధించాడు. తెలంగాణ రైతాంగ సాయుధపోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటలకు భూకంప కేంద్రంగా ఎరుపెక్కిన వరంగల్ బాలగోపాల్లో తీవ్రమైన మేధోమథనాన్ని కల్గించింది. శివసాగర్, కాళోజీ, కేఎస్, వరవరరావు వంటి ఉద్యమ సారథులతో పరిచయాలు, సాన్నిహిత్యం, మార్క్స్, గ్రాంసీ, రస్సెల్ తత్వశాస్రా్తల అధ్యయనంతో నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేసే అధ్యాపకునిగా మారిపోయాడు. 1981–1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాడు. దున్నేవారికే భూమి కావాలనే పోరాటకారులను బూటకపు ఎన్కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వమైనా, ఉద్యమసంస్థలైనా జీవించే హక్కును కాలరాయడం అమానవీయమైన నేరంగా ప్రకటించాడు. 1984లో పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శిగా మరింత క్రియాశీలకంగా పనిచేశాడు. ప్రజల డాక్టర్ రామనాథం హత్య తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. తన సహచరులు నర్రా ప్రభాకర్ రెడ్డి, అజం ఆలీ, లక్ష్మారెడ్డిలను కోల్పోయినా చెదరని స్థైర్యంతో హక్కుల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడే రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లను పటిష్టంగా అమలు చేయాలని కోరాడు. అనుమానం ఉంటే చాలు.. చంపేసే ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఉపసంహరించాలని కోరాడు. తన జీవిత కాలంలో సందర్శించిన ఏకైక దేశం’ జమ్మూకశ్మీర్ అని ప్రకటించాడు. కశ్మీర్ రాజా హరిసింగ్తో కుదుర్చుకున్న షరతుల ఒప్పం దాన్ని భారత పాలకులు ఉల్లంఘించడం వల్లే కలల లోయ కల్లోల లోయగా మారిందని, 1995 నుంచి 2005 వరకు ఐదుసార్లు కశ్మీర్లో పర్యటించి వాస్తవాలను ప్రపంచానికి తెలియచేశాడు. బ్రిటిష్ కాలంనుంచి ఇప్పటిదాకా దేశం సాధించిన అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాలకు అధికంగా నష్టపోతున్నది గిరిజనులేనని, ఎక్కువగా తిరుగుబాట్లు చేసిందీ వారేనని చెప్పాడు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయ సహాయాన్ని అందించాడు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని, ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అత్యంత ప్రజాస్వామికమని చెప్పాడు. సామాజిక ప్రయోజనార్థం అంబేడ్కర్ తర్వాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్ ప్రఖ్యాతి గాంచాడు. దుఃఖిత మానవాళిపై అనుకంపన, విసుగు ఎరగని, విరతి లేని జ్ఞానాన్వేషణతో సామాజిక కార్యకర్తలకు కరదీపిక అయ్యాడు. తల్లిదండ్రులకు, గురువుకు, దేశానికి ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉంది. తన తలను పొలంగా మార్చి, దున్ని ఎరువులు వేసి పంట లను ప్రజలకు పంచడం. ఇది తీర్చవలసిన బాకీ. తల బీడు పడిపోయేదాక, ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది. బాలగోపాల్ను ప్రేమిద్దాం, కొనసాగిద్దాం. (నేడు బాలగోపాల్ 10వ వర్ధంతి) వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు సెల్ : 96522 75560 -
సుమార్గ్ శిక్షణతో అద్భుత ఫలితాలు
సాక్షి, కేయూ క్యాంపస్: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యువత ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన సుమార్గ్ ఉచిత శిక్షణలో అద్భుత ఫలితాలు సాధించామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. సుమార్గ్ ఉచిత శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చిన యువతకు సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సేనెట్హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీ ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. సుమార్గ్ రెండోవిడత ఉచిత శిక్షణ తరగతులకు 300ల మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఇందులో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్లు 40మంది, కానిస్టేబుళ్లుగా 165మంది, మరో 49మం ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శిక్షణ అందించిన అభ్యర్థుల్లో 80శాతం మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. మీరు ప్రతిభతో సాధించిన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా కృషిచేయాలని ఆయన కోరారు. సుమార్గ్ శిక్షణ అందించటంలో పూర్తి సహకారం అందించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతకు పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేగాకుండా శిక్షణ ఇచ్చిన పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ గిరిరాజు, ఎసీపీలు శ్రీధర్, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఆర్ఐ సతీష్, హతీరాం, శ్రీనివాస్రావు, నగేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్, కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజు పాల్గొన్నారు. -
కేయూలో అధికారి సంతకం ఫోర్జరీ
సాక్షి, కేయూ: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న ఒకరు అధికంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో అక్రమానికి తెగపడ్డాడు. ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకం ఫోర్జరీ చేసి.. వాల్యుయేషన్ చేసినట్లుగా కొందరు అధ్యాపకుల పేర్లతో బిల్లులు తీసుకునేందుకు యత్నించాడు. అయితే, ఈ బిల్లును పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగం అధికారులు గుర్తించడంతో సదరు క్యాజువల్ లేబర్ మోసం బయటపడింది. ఈ మేరకు ఆయనను తొలగిస్తూ రిజిస్ట్రార్ కె.పురుషోత్తం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీజీ పరీక్ష జవాబుపత్రాలు దిద్దినట్లుగా... కేయూ పీజీ కోర్సుల వివిధ సెమిస్టర్ పరీక్షలు జరిగాక జవాబుపత్రాల వాల్యూయేషన్ చేయిస్తారు. ఇందులో పాల్గొ నే అధ్యాపకులు తాము ఎన్ని పేపర్లు దిద్దామో చెబుతూ బిల్లులు సమర్పించాలి. వీటిని తొలుత అదనపు పరీక్షల నియంత్రణాధికారి పరిశీలించి సంతకం చేస్తే అకౌంట్స్ విభాగం ఉద్యోగులు పాస్ చేసి అకౌంట్లలో రెమ్యూనరేషన్ జమ చేస్తారు. దీనిని పరీక్షల విభాగం పీజీ సెక్షన్లో కొన్నేళ్ల నుంచి క్యాజువల్ లేబర్గా పనిచేసే రవి అనే వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వివిధ సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలు ముగ్గురు అధ్యాపకులు వాల్యూయేషన్ చేసినట్లుగా.. ఒకరు ఓయూ అధ్యాపకుడు, మరో ఇద్దరు కేయూ అధ్యాపకుల పేరిట దొంగ బిల్లులు తయారు చేశాడు. మూడు బిల్లులు కలిపి రూ.37వేలకు పైగా సమర్పించాడు. ఆ బిల్లులపై ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సురేఖ సంతకం పోర్జరీ చేశారు. ఆ తర్వాత బిల్లులును ఇటీవల పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగంలో అందజేయగా అక్కడి ఉద్యోగులకు అనుమానం వచ్చింది. ముగ్గురు అధ్యాపకుల పేరిట సమర్పించిన బిల్లుల్లో పక్కన ఒకే బ్యాంకు అకౌంట్ నంబర్ ఉండడంతో ఆరా తీయగా అది రవి భార్య అకౌంట్గా తేలింది. దీంతో విషయాన్ని గుర్తించి బిల్లులు ఆపేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పాత బిల్లులను కూడా పరిశీలించగా గత ఏడాది కూడా దొంగబిల్లు సమర్పించి రూ.2,600 కాజేసినట్లు తేలింది. క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశాలు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న రవి వ్యవహారాన్ని అధికారులు ఇన్చార్జి వీసీ జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిని తొలగించాలని సూచించగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.మహేందర్రెడ్డిని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నాణ్యమైన విద్య అందించాలి
సాక్షి, కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పాఠశాల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, కేయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్నారు. ప్రధానంగా హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని, అధ్యాపకులు స్వీయ మూల్యం కణం బేరీజు వేసుకోవాలని సూచించారు. కేయూ ఇన్చార్జి వీసీగా నియామకమైన తర్వాత తొలిసారి సోమవారం క్యాంపస్కు వచ్చిన ఆయన అన్ని విభాగాల అధ్యాపకులతో నిర్వహంచిన సమావేశంలో మాట్లాడారు. కొందరు పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని, సబ్జెక్టుల అంశాలు చెప్పలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం 30శాతం మంది గైర్హాజరవుతున్నారని తెలిపా రు. ఇదే పరిస్థితి కళాశాల విద్యలోనూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కేయూలో హాజరుశాతం గురించి అడగ్గా సైన్స్ విభాగాల్లో 80 శాతం, ఆర్ట్స్ విభాగాల్లో 50 శాతం ఉందని ఆయా విభాగాల అధిపతులు తెలిపారు. పీజీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తీరిక సమయాలు, సెలవుల్లో వారికి విద్యాబోధన చేయాలని, ఇందుకు వర్సిటీల హెచ్వోడీలు అధ్యాపకులు సహకరించాలని అన్నా రు. వనరుల కొరత సాకుగా చూపకుండా కౌన్సిలర్ సిస్టం అమలు చేయాలని తెలిపారు. ఫార్మాసీ విభాగం ప్రొఫెసర్ ఎం.సారంగపాణి మాట్లాడుతూ కేయూలో 391 అధ్యాపక పోస్టులకు 128 మంది పనిచేస్తున్నారని పలు విభాగా ల్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారని, రిటైర్ అయిన సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంటే బాగుంటుందని అనగా.. విభాగాల వారీ గా ఎంత మంది ఉన్నారు.. జాబితా తయారు చేయాలని వీసీ సూచించారు. అందులో ఉచితంగా సేవలను అందించే, గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉండేవారి జాబితా ఇస్తే ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులకు నిధులు అవసరమని, అధ్యాపకుల కొరత ఉం దని కోఎడ్యూకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ పి.మల్లారెడ్డి తెలుపగా ప్రతిపాదనలు ఇస్తే వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులను కేటాయించేలా చూస్తానని వీసీ హామీ ఇచ్చారు. ఎమ్మెస్పీ ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు బోధన చేయడానికి అధ్యాపకుల కొరత ఉందని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్ జి.హన్మంతు అనగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం అయ్యేవరకు గెస్ట్ఫ్యాకల్టీగానే తీసుకోవాలని సూచించారు. మీవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని అడగ్గా.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీయన్ స్టడీసెంటర్ ఆధ్వర్యంలో వర్క్షాప్లు నిర్వహిస్తామని పొలిటికల్సైన్స్ విభాగం అధిపతి సంజీవరెడ్డి చెప్పగా.. సెమినార్లు, వర్క్షాప్ను నిర్వహించబోతున్నట్లు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ సుజాత మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయులకు వర్క్షాప్ నిర్వహించబోతున్నామన్నారు. కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోల శంకర్ మాట్లాడుతూ కేయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను అర్హులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ విష్ణువర్ధన్, కేయూ ఎన్జీవో జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఏఆర్ పెండ్లి అశోక్, డాక్టర్ మహేష్ తదితరులు వీసీతో మాట్లాడారు. సమావేశంలో రిజిస్ట్రార్ కె.పురుషోత్తంమాట్లాడారు. -
ఎల్ఎల్ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపస్లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్ఎల్ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ చదవుతున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండే జీవన్రెడ్డి చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కేయూలో నకిలీ కలకలం
సాక్షి, కేయూ : కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు రెండేళ్ల క్రితం సమర్పించిన టైప్రైటింగ్ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు ఇటీవల హైదరాబాద్లోని స్టేట్ టెక్నికల్ బోర్డుకు సర్టిఫికెట్లను పంపించగా అక్కడి అధికారులు తాము జారీ చేసినవి కావని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు నోటీసులు ఇవ్వగా సమాధానం వచ్చినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కారుణ్య నియామకాలు కింద... కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్ల క్రితం ఇద్దరు కారుణ్య నియామకాల కింద టైపిస్టు కమ్ క్లర్క్లుగా నియమితులయ్యారు. ఆ సమయంలో వారి వద్ద టైప్రైటింగ్ ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ ఏడాదిలోగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనతో పోస్టింగ్ ఇచ్చారు. అయితే, వారు గడువులోగా ఉత్తీర్ణత పొందకపోవడంతో ఇంక్రిమెంట్లో కోత విధించారు. ఆ తర్వాత స్టేట్ టెక్నికల్ బోర్డు ఇచ్చినట్లుగా చెబుతూ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. అయితే, వాటినిసరిగ్గా పరిశీలించకుండానే టైపిస్టు కమ్ క్లర్క్లుగా కొనసాగిస్తూ బెనిఫిట్స్ ఇచ్చారు. 2017లో పదోన్నతుల సందర్భంగా వీరిద్దరికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా ఒకరు క్యాంపస్లోని పరీక్షల విభాగంలో, మరొకరు కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ ఫిర్యాదు కాకతీయ యూనివర్సిటీలో వివిధ కేడర్లలో కారుణ్య నియామకాల సందర్భంగా, పదోన్నతుల పొందిన వారు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాలని ఉద్యోగ సంఘాల బాధ్యులు కొంతకాలం క్రితం అప్పటి వీసీ ఆచార్య సాయన్నకు ఫిర్యాదు చేశారు. తొలుత స్పందించకున్నా వీసీగా పదవీకాలం ముగియబోతున్న సమయంలో 12 మంది ఉద్యోగుల ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ కోర్సుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైదరాబాద్కు పంపించారు. అయితే, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల సర్టిఫికెట్లు నకిలీవనీ తేల్చారు. అయితే, ఇతర కేడర్లలోని మరో 12 మంది సర్టిఫికెట్లను కూడా పరిశీలనకు పంపించగా నివేదిక రావాల్సి ఉందని.. అందులోనూ ఇద్దరు, ముగ్గురు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనే ప్రచారం సాగుతోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన ఇద్దరికి కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులకు వారు సమాధానం కూడా ఇచ్చారని సమాచారం. అయితే, సర్టిఫికెట్లు నకిలీవని తేలాక కూడా తేలాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముందే పరిశీలిస్తే... యూనివర్సిటీలో వివిధ కేడర్లలో ఉద్యోగాలు పొందినప్పుడు, పదోన్నతులు ఇచ్చినప్పుడే సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో కొన్నేళ్ల తర్వాత నకిలీ బయటపడుతోంది. అప్పటికే ఆయా ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ తీసుకుని ఉంటున్నారు. ఎట్టకేలకు కొన్నినెలల క్రితం అప్పటి వీసీ సాయన్న స్పందించినా.. మిగతా వీసీల హయాంలో జరిగిన పదోన్నతులు, నియామకాలను పట్టించుకోకుండా తన హయాంలో జరిగినవే పరిశీలనకు పంపించారు. అలా కాకుండా యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు పొందిన, నియమాకమైన ఉద్యోగుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలనకు పంపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన పీహెచ్డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఫీజులు తగ్గించాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పరిపాలన భవనం అద్ధాలు ధ్వంసమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: ఒకే రాష్ట్రం.. ఒకే డిగ్రీ కోర్సు.. అయినా ఫీజులు మాత్రం ఒక్కో వర్సిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అంతేకాదు యాజమాన్యాలు కూడా ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీల బీఏ కోర్సుకు తక్కువ ఫీజు ఉంటే.. మరికొన్నింటిలో ఎక్కువ ఫీజులున్నాయి. ఈ మోతను నియంత్రించాల్సింది పోయి.. మరోభారీ ఫీజు వడ్డనకు ఉన్నతవిద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల్లో ఒకేరకమైన ఫీజు విధానం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇందులో సమస్యేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజు సమం పేరిట ఒక్కో కోర్సుపై రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని డిగ్రీలో చేరుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులపై ఫీజుల భారం తప్పేట్లు లేదు. డిగ్రీకి పేదలు దూరమే! కాకతీయ యూనివర్సిటీలో బీఏ కోర్సు వార్షిక ఫీజు ప్రస్తుతం రూ.6,170. ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నట్లు కనీసం రూ.5వేల పెంచితే అది రూ.11,170కి చేరుతుంది. అదే రూ.10వేలు పెంచితే ఫీజు కాస్తా రూ.16,170గా ఉండనుంది. అదే ఏటా రూ.13,520 ఉన్న బీఎస్సీ వంటి కోర్సుల్లో ఈ పెంపును వర్తింపజేస్తే.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ చదువులకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఉన్న తక్కువ ఫీజుతో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. పెంచిన ఫీజులు అమల్లోకి వస్తే.. పేదలకు ఉన్నత విద్య ఇక నెరవేరని కలగా మారడం ఖాయమే. యాజమాన్యాల ఒత్తిడితోనే.. డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే.. ఉన్నతాధికారులు ఈ ఫీజుల పెంపు ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పెంపు ద్వారా యాజమాన్యాలకు మేలు చేకూర్చేందుకు మండలిలోని కొంతమంది ఉన్నతాధికారులు పావులు కదిపినట్లు తెలిసింది. అందులో భాగంగానే కామన్ ఫీజు చేస్తామనే సాకుతో.. అన్ని వర్సిటీల పరిధిలోకి ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురానున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులపై ఫీజు పెంపు భారం! సాధారణంగా డిగ్రీలో చేరుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే ఇపుడు కామన్ ఫీజు అమల్లోకి తెచ్చి అదనంగా పెంచే మొత్తాన్ని విద్యార్థులనుంచే వసూలు చేసేలా నిబంధనను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా విద్యార్థు«లకు, తల్లిదండ్రులకు తాము కొంత ఫీజు చెల్లిస్తాం కనుక డిగ్రీ చదువులపై శ్రద్ధ పెరుగుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఉన్న యూనివర్సిటీ ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేల వరకు వసూలు చేసుకునేలా రెండేళ్ల కిందటే ఆదేశాలు జారీ అయ్యాయి. పెంచిన ఫీజు మొత్తం ఫీజు–రీయింబర్స్మెంట్ పరిధిలో రాదు. తల్లిదండ్రులే చెల్లిస్తున్నారు. అదే తరహాలో ఇపుడు అన్ని యూనివర్సిటీల్లో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఫీజులను పెంచి తల్లిదండ్రులపై భారం మోపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. త్వరలోనే జరిగే డిగ్రీ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా ప్రకటించనుందని తెలిసింది. రాష్ట్రంలోని 1,084 డిగ్రీ కాలేజీల్లో 4.20లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 2.20 లక్షలకు మించి భర్తీ కాలేదు. ఐదారేళ్లుగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫీజులు పెంచితే మరిన్ని ఖాళీలు తప్పవు. -
ప్రజల ఆకాంక్షల సాధనకే టీజేఎస్
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి(టీజేఎస్) లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేయూ క్యాంపస్: పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి (టీజేఎస్) లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలతో చర్చలు జరిగేవని, పోరా టాలగడ్డ వరంగల్లో కాళోజీ స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్రావు, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది వరంగల్లోనే జరిగిందని అన్నారు. కేసీఆర్ ఏం చేశాడు ? ఎంతోమంది యువత ఆత్మబలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణాలో గద్దెనెక్కిన కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి? తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉన్న ఇళ్లను కూలగొట్టగా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లో ధర్నా చౌక్ను ఎత్తివేశారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ధర్నాకు ఉపక్రమించితే వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారన్నారు. అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కుర్చీలో కూర్చుంటే అడిగే హక్కు వారికి ఉందన్నారు. తెలంగాణకు ఆదాయం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తోందని, మద్యం సీసాలు కూడా పంచుతున్నారంటా.. ఇదేం ప్రచారమని ప్రశ్నించారు. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి టీజేఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర బాధ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేశారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకుడు భద్రోద్రి మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ రూ.200కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్రెడ్డి, బొట్ల బిక్షపతి, మంద భాస్కర్, డాక్టర్ తిరుణహరిశేషు, పులిసత్యం, జి.రవీందర్, శైలేందర్రెడ్డి, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, పులి సత్యం, రాజేందర్, వినయ్కుమార్, లక్ష్మి, రమేష్, ఎ.రాజేందర్, శ్రవణ్ పాల్గొన్నారు. అలరించిన ధూంధాం.. ధూంధాం కార్యక్రమంలో కిషోర్, నాగరాజు, దేవేందర్, రవి, రమ కళాకారుల బృందం పాటలతో మాటలతో చైతన్యం కల్పించారు. కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితం అయ్యారంటూ.., జైబోలో తెలంగాణ, వందనం వీరులకు వందనం అమరులకు వందనం అంటూ పాటలు పాడి సాంస్కృతిక నృత్యాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. -
తిరోగమనంలో ‘పరిశోధనలు’
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య. దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ -
వర్సిటీల ‘పరిధి’ మార్పులపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల భౌగోళిక పరిధుల మార్పులపై ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు చేయాల్సిన మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమగ్ర అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా వర్సిటీల పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు మించి ఉండటానికి వీల్లేదని, అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న వర్సిటీలకు నిధులను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండో దశ రూసా సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యూనివర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలను ఎలా తగ్గించాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 500కు పైగా అనుబంధ కాలేజీలు ఉండగా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనూ 300కు పైగా కాలేజీలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేఎన్టీయూహెచ్ పరిధిలో 280కి పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిధిలోని కాలేజీలను కొన్నింటిని ఇతర యూనివర్సిటీల పరిధిలోకి తీసుకెళ్లేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీలైనన్నిమార్పులు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పాత వరంగల్ జిల్లాతోపాటు పాత ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నుంచి పాత ఆదిలాబాద్లోని కొన్ని కొత్త జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని మçహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్చేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓయూ పరిధిలోని జిల్లాలు కొన్నింటిని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్పు చేసేలా చర్యలు చేపడుతోంది. అయితే ఇలా మార్పులు చేసినా ఓయూ, జేఎన్టీయూహెచ్ పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు పైగానే ఉండే అవకాశం ఉంది. దీంతో వీటిపై ఏం చేయాలన్న దానిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడ ఒక్కో యూనివర్సిటీని వేర్వేరు పేర్లతో విభజించారు. అదే విధానంలో ఇక్కడ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. పరిధుల మార్పు ప్రతిపాదనలు కూడా త్వరలోనే పంపించాలని భావిస్తోంది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలోనూ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. -
66 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముంది. గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 25 వేల సీట్లలో 4 వేలే భర్తీ.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. -
కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: కాకతీయ వర్సిటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ కోసం వచ్చిన విద్యార్థి సంఘాలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. దీంతో పలువురు విద్యార్థలకు గాయాలయ్యాయి. వర్సిటీ అధికారుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో భారీగా సిబ్బంది మోహరించారు. -
బ్రాండెడ్కు బదులుగా...
కేయూ క్యాంపస్: టెండర్లలో పేర్కొన్న విధంగా బ్రాండెండ్ నిత్యావసర వస్తువులు కాకుండా వేరే కల్తీ వస్తువులను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కేయూలోని కామన్ మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి లారీలో కామన్మెస్కు వివిధ రకాల నిత్యావసరాల వస్తువులను తీసుకొచ్చారు. వాటిని కామన్ మెస్లోని స్టోర్కు తరలిస్తుండగా మెస్ కమిటీ బాధ్యులు పరిశీలించారు. టెండర్లో పేర్కొన్నట్లు కారం, పసుపు, ధాన్యాలు, గోదుమ పిండి బ్రాండెండ్వి కాకుండా ఇతర కంపెనీలకు చెందినవి తీసుకొచ్చారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు సరుకులను లోనికి తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ కాంట్రాక్టర్ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లారీని కామన్ మెస్లోనికి వెళ్లనీయకుండా గేట్కు తాళం వేయడంతో వాటర్ క్యాన్లు బయటే ఉన్నాయి. దీంతో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి వచ్చి గేట్ తాళం పగలగొట్టించి నీటి క్యాన్లను లోనికి పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డైరెక్టర్ ఇస్తారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విద్యార్థుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిత్యావసర వస్తువుల శాంపిళ్లనుతీసుకెళ్లారు. కాగా టెంటర్లలో పేర్కొన్న బ్రాండెడ్ వస్తువులను రెండు రోజుల్లో తీసుకురాకుంటే కాంట్రాక్టర్ టెండర్ను రద్దు చేస్తామని డైరెక్టర్ హామీ ఇవ్వ డంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. నాలుగు రకాల వస్తువుల్లో వ్యత్యాసం టెండర్లో పేర్కొన్న విధంగా 36 రకాల సరకులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. ఆదివారం తీసుకొచ్చిన సరకుల్లో కారం, పసుపు, గోదుమ పిండి, ధనియాలు బ్రాండెడ్వి తీసుకురాలేదు. మెస్ కమిటీ బాధ్యులు గుర్తించగా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాను. రెండురోజుల్లో మళ్లీ బ్రాండెండ్ వస్తువులు తీసుకురాకుంటే టెండర్ను రద్దుచేస్తాం. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి -
పోటాపోటీగా ప్రచారం
కేయూ క్యాంపస్: కేయూ అధ్యాపకుల సంఘం (అకుట్ ) ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియనుంది. ఇప్పటివరకు అకుట్ అధ్యక్ష పదవికి జియాలజీ విభాగాధిపతి ఆర్.మల్లికార్జున్రెడ్డి, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ దినే‹ష్కుమార్ నామినేషన్లను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా పోటా పోటీ గా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రధా న కార్యదర్శి పదవికి ముగ్గురు అధ్యాపకులు పోటీపడుతున్నారు. బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా, కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హన్మంతు, జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేందర్ తమ నామినేషన్లను సమర్పించారు. ఉపాధ్యక్ష పదవికి మ్యాథమెటిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుమలాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి వివిధ విభాగాల అధ్యాపకులు సుజాత, పద్మజ, రమణ నామినేషన్లు సమర్పించారు. 8న ఎన్నికలు.. శనివారం సాయంత్రం 4గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది, 5న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈనెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. క్యాంపస్లోని సెనేట్ హాల్,ఆర్ట్స్ కళాశాలలోని గ్రంథాలయం, కొత్తగూడెం ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 162 మంది రెగ్యులర్ అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 9న ఓట్లను లెక్కించి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఏఆర్ శ్రీధర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. -
అసలు నాయినికి టికెట్ వస్తుందా..
న్యూశాయంపేట: కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై ఫైలును తిరగతోడి కలెక్టర్, జేసీ, ఏడీ ల్యాండ్ సర్వే, ఆర్డీఓలతో ప్రత్యేక కమిటీవేసి కబ్జాకోరుల భరతం పడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.హన్మకొండ నయింనగర్లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల కళ్లు కుట్టి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటిఆర్ కార్టూన్ కాదని కడిగిన ముత్యం అని అభివర్ణించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పై నాయిని లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. 2019లో అసలు నాయిని రాజేందర్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా తెలుసుకొని వినయ్భాస్కర్ గురించి మాట్లాడాలన్నారు. కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు సాగుతున్న వినయ్భాష్కర్పై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిస్తే తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్ఖాన్, తాడు గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్,వీరగంటి రవిందర్,జోరిక రమేష్, టిఆర్ఎస్వి నేతలు కంచర్ల మనోజ్,ప్రవీణ్,చాగంటి రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు. కమిటీని స్వాగతిస్తాం : నాయిని కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కేయూ భూముల కుంభకోణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంపై ఆయన స్పందిం చారు. ఈ మేరకు ‘సాక్షి’కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పా రు. కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీకి స్వాగతిస్తున్నాం. కమిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు, ఇద్దరు అధ్యాపకులను సభ్యులుగా చేర్చాలి. విచారణ జరిగేంత వరకు కేయూ ఆర్చి గేటుదగ్గర చెప్పుల దండ ఉంచాలి..దోషులుగా తేలిన వారి మెడలో ఆ దండ వేసి ఊరేగించాలని పేర్కొన్నారు. -
కనీసం సొంత భవనం లేదు!
ఇదీ కాళోజీ ఆరోగ్య వర్సిటీ దుస్థితి - వర్సిటీ ఏర్పాటై మూడేళ్లయినా.. నిలువ నీడ లేదు - కాకతీయ వర్సిటీకి చెందిన పాత భవనంలోనే పాలన సాక్షి, హైదరాబాద్: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్సిటీ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ఓ పాత భవనంలోనే వర్సిటీ పాలన నడుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జూలై 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వరంగల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు కాళోజీ వర్సిటీలో స్థలం లేక కాకతీయ వర్సిటీలో నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే వ్యవస్థ, వసతి లేకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.45 కోట్లతో భవనం నిర్మాణానికి ప్రణాళిక ఉమ్మడి ఏపీలో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్లో కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ పరిపాలన, ఇతర అవసరాల కోసం భవనాలను నిర్మించేందుకు రూ.130 కోట్లను కేటాయించింది. అందులో రూ.45 కోట్లతో పరిపాలన భవనం నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు చెందిన స్థలంలో భవనం నిర్మించేలా ప్రభుత్వం అనుమతులూ ఇచ్చింది. పరిపాలన భవనం నిర్మాణం కోసం 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ గజ్వేల్లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పరిపాలన భవనం నిర్మాణం బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. టీఎస్ఎంస్ఐడీసీ ఆలస్యంగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.20 కోట్లతో భవనాన్ని నిర్మించేలా కొత్త ప్లాన్ రూపొందిం చింది. ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
టీఎస్ లాసెట్-2017 ఫలితాలు విడుదల
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల, పీజీ న్యాయశాస్త్ర కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2017 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న శనివారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో విడుదల చేశారు. మొత్తం 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. లాసెట్ను మూడోసారి కాకతీయ విశ్వవిద్యాలయమే నిర్వహించింది. -
లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్?
కొన్నాళ్లుగా ఆస్తమాతో ఇబ్బంది.. సాక్షి, ఖమ్మం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్రావు అలియాస్ ప్రకాశ్ అలియాస్ రాజన్న పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు తెలిసింది. కత్తి మోహన్రావుది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల మండల కేంద్రం. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. 1977లో ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదువుతూ ఆర్ఎస్యూలో పనిచేశారు. అప్పటి పీపుల్స్వార్ కార్యకలాపాలకు ఆకర్షితులై అజ్ఞాతబాట పట్టారు. 40 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఐదేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో లొంగిపోవాలని భావించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయనపై పలు కేసులు ఉన్నాయి. -
ఆదిమ మానవుని గుహ
కామారెడ్డి : ప్రాచీన శిలాయుగానికి చెందిన ఆనవా ళ్లు మాచారెడ్డి మండలం ఎల్లంపేట అటవీ ప్రాంతంలోని మఠంరాళ్లతండాలో వెలుగుచూసాయి. ఈ ప్రాంతంలో క్రీ.పూ. 10 వేల నుంచి 5 వేల సంవత్సరాల కాలం నాటి ఆదిమ మానవుడు నివసించిన గుహను కాకతీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో పరిశోధన చేస్తున్న తూ ము విజయ్కుమార్ కనుగొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ కి వివరాలు అందజేశారు. 6వ శతాబ్దంలో జనప దం ఏర్పడడానికి ఇక్కడ పూర్వం నుంచి మానవ సంచా రం ఉన్నదని శిలాయుగం నాటి కుడ్య చిత్రాల ద్వారా తెలుస్తుందన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల నాటి మానవులు అక్కడే నివసిస్తూ, ఆహార సేకరణ చేసి ప్రాచీన శిలాయుగానికి ఇక్కడ గుహాలయం ఏర్పాటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్లు కలది బాహ్య ప్రపంచంలోకి రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మానవ పరిణామ క్రమంలో చరి త్ర రచనకి ఆధారంగా మన ప్రాంతం చెప్పవచ్చన్నారు. ఈ ఆదిమ మానవుని నివాస ప్రాంతం, (గుహ) నాటి సంస్కృతికి సంబంధించినటువంటి కుడ్య చిత్రాలు ఎరుపు వర్ణం తో వేసిన చిత్రాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ జీవనం సాగించిన ఆదిమ మానవులు వారి జీవనశైలి, వారి భావాలు, వారు వాడిన వస్తువులు, జంతువుల చిత్రాలు, గణితశాస్త్ర గుర్తులు, గుహ గోడలపై కలవు. జింక, దుప్పి, కొమ్ములు, దుప్పి, కుక్క, చేప, మనిషి కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలను పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడు తాను అడవిలో జంతువులతో సంచారం చేస్తూ వాటితో సహజీవనం చేయడం, వాటిని ఎర్రని వర్ణంతో చిత్రాలుగా గీయడం చేశారు. ఈ గుహలో 4 వందలకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యంతో కుడ్య చిత్రాల్ని గీశారు. గుహ పెద్ద బండరాయి కింద ఉంది. దీనిని ఆవాస కేంద్రంగా చేసుకుని గుహకి కుడి, ఎడమ వైపుల నుంచి ప్రహరీ లాంటి రాళ్లతో గోడ నిర్మించారు. ఆదిమ మానవునికి నిర్మాణం కూడా తెలుసని అర్థమవుతోంది. -
ఇంకెప్పుడో?
పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నిరీక్షణ ఆర్జీఎన్ఎఫ్, ఎంఫిల్, ఇతర ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాకపోవడంతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. కేయూ క్యాంపస్ : పీహెచ్డీలో ప్రవేశాలకు మార్గదర్శకాల కోసం కొన్ని నెలల క్రితమే ప్రొఫెసర్లతో కూడిన ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి నివేదిక ను యూనివర్సిటీ అధికారులకు ఇచ్చింది. ఆ తర్వాత పీహెచ్డీలో ప్రవేశాల కోసం వివిధ విభాగాల నుంచి ఎన్నిసీట్లు ఉన్నాయో అన్ని విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఇక పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పలు అభ్యంతరాలతో యూనివర్సిటీ అధికారులు మళ్లీ మరో కమిటీని ఈ ఏడాది ఏప్రిల్లో నియమించారు. అందులో ప్రధానంగా ఇప్పటికే రాజీవ్గాంధీనేషనల్ ఫెల్లోషిప్ (ఆర్జీఎన్ఎఫ్) కలిగిన అభ్యర్థులకు పీహెచ్డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించాలా వద్దా అనే విషయంలో ఆ కమిటీ వేశారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఎం.సుబ్రహ్మణ్యశర్మ చైర్మన్గా, మెంబర్ కన్వీనర్గా డాక్టర్ జి.బ్రహ్మేశ్వరితోపాటు మరో నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ నియమించారు. ఆ కమిటీ యూజీసీ నియమనిబంధనలు, ఇతర యూనివర్సిటీల్లో ఆర్జీఎన్ఎఫ్ అభ్యర్థులకు అడ్మిషన్ల కల్పిస్తున్న అంశాలను పరిశీలించి నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 28న యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఆర్జీఎన్ఎఫ్తోపాటు జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, డీఎస్టీ తదితర ఫెల్లోషిప్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఎంట్రె న్సతో సంబంధం లేకుండా నేరుగా పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ నివేదించింది. ఫెల్లోషిప్ కలిగిన అభ్యర్థులకు త్రిసభ్య కమిటీతో ఇంటర్వ్యూలు నిర్వహించి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వివిధ ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థులకు పలు విభాగాల్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ప్రవేశాలు కల్పించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ విభాగంలో ఆర్జీఎన్ఎఫ్ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. ఆయా అభ్యర్థులు యూనివర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెగ్యులర్ వీసీ ఉన్నా.. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశపరీక్ష ద్వారా కూడా పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. నెలలు గడిచినా పీహెచ్డీ ప్రవేశాల పరీక్షకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇన్చార్జి వీసీల పాలనలో పీహెచ్డీల ప్రవేశాల నోటిఫికేషన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు కేయూ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న బాధ్యతలను స్వీకరించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా పలుసార్లు వీసీకి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. తగ్గనున్న సీట్లు.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి పలు విభాగాల్లో సీట్లు తగ్గే అవకాశాలున్నారుు.మరికొన్నింట్లో పెరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఆర్జీఎన్ఎఫ్ తదితర ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థుల ప్రవేశాలు పూర్తయ్యాక మళ్లీ వేకెన్సీలు సేకరిస్తారని సమాచారం. దీంతో పీహెచ్డీ నోటిఫికేషన్ ఇంకా జాప్యం కానుందని భావిస్తున్నారు. పీహెచ్డీ సీట్ల వేకెన్సీలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ సీట్ల ఖాళీల వివరాలు ఇలా ఉన్నారుు. బాటనీ 18, బయోకెమిస్ట్రీ 7, కెమిస్ట్రీ 13, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 38, కంప్యూటర్ సైన్స 4, ఎకనామిక్స్ 13, ఇంగ్లిష్ 18, ఎడ్యుకేషన్ 8, జియాలజీ 1, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 4, మ్యాథమెటిక్స్ 8, మైక్రోబయాలజీ 9 ,ఫిజిక్స్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, పొలిటికల్ సైన్స 12, ఫార్మసీ 16, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం 3, సోషియాలజీ 15, తెలుగు 11, జువాలజీ 18, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం 11, మెకానికల్ ఇంజనీరింగ్ 23, కంప్యూటర్ సైన్సలో 9, ఎలక్టిక్రల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్స 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్సలో 4 సీట్లు ఉన్నారుు. వివిధ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశాల పూర్తయ్యాక ఆయా విభాగాల్లో మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఆయా విభాగాల్లో సీట్లు తగ్గిపోనున్నాయి. కొన్నింట్లో అసలే ఖాళీలు ఉంటాయో లేదో అనేది కూడా అనుమానమే. ప్రవేశ పరీక్షలతోనే జాప్యం.. పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకప్పుడు రెండు ఆర్టికల్స్ ఉంటే పీహెచ్డీలో అడ్మిషన్లు ఇచ్చేవారు. ప్రతి ఆరునెలలకోసారి పీహెచ్డీలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవారు. ప్రవేశ పరీక్షలు వచ్చాక అనేక కారణాలతో సంవత్సరాల తరబడి జాప్యం అవుతోంది. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళనలు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా వివిధ విభాగాల్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందడం వలన కూడా పీహెచ్డి వివిధ విభాగాల్లో సీట్లు తగ్గిపోతున్నాయి.జాప్యం కావడంతో ఇంకా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. -
అక్టోబర్ 6 నుంచి కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, సెకండ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. పూర్తి టైం టేబుల్ను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!
మార్చి 1, 1980న వరంగల్లోని కాకతీయ యూనివర్శిటీ మూడవ స్నాతకోత్సవానికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసాను ఆహ్వానించారు. అయితే ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలు చేపట్టింది. అంతటి మహోన్నత వ్యక్తి వరంగల్లాంటి పట్టణానికి రావడమే మహాభాగ్యమని, ఆమెను అడ్డుకొని అవమానించవద్దని యూనివర్శిటీ జిల్లా, పోలీసు అధికారులు, ప్రముఖులు వారికి నచ్చజెప్పేందుకు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో యూనివర్శిటీలో ఆమె కారు ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఒక గీత గీసి అది దాటకుండా నిరసన వ్యక్తం చేసుకొమ్మని పోలీసులు విద్యార్థుల నాదేశించారు. వారి నిరసన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించకున్నా యూనివర్శిటీ కేంపస్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. అప్పుడు ఎం.ఎ. ఎకనమిక్స్ రెండో సంవత్సరంలో ఉన్న నాలాంటి అభిమానులకు ఒక వైపు ఆనందం, మరోవైపు మదర్ భంగపడ్తారేమోనన్న భయం! మార్చి1 న రాష్ట్ర గవర్నర్ పి.సి.అబ్రాహాముతో సహా మదర్ వచ్చారు. యాభైమందికి పైగా విద్యార్థులు ‘మదర్ థెరిస్సా గో బ్యాక్’ లాంటివి రాసిన ప్లకార్డులు, రకరకాల నినాదాలతో వారికి నిర్దేశిత స్థలంలో నిలబడ్డారు. అంతలోనే ఆమె కారు వారున్న స్థలాన్ని సమీపించింది. ఆమె వారిని చూడదులే అనుకున్న పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి. మదర్ వారిని చూడనే చూశారు. అంతే! మరుక్షణం డ్రైవర్తో కారు ఆపించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోగానే మదర్ మెరుపు వేగంతో కారు దిగడం, విద్యార్థుల ముందుకు వెళ్లిపోయి రెండు చేతులూ జోడించి నిలబడటం జరిగిపోయాయి. పోలీసులు ఆమెకు భద్రతా వలయంగా ఏర్పడబోగా ఆమె వారిని సున్నితంగా వారించి దూరంగా నిలబెట్టారు. ఇది నిరసనకారులు కూడా ఊహించని పరిణామం. అక్కడున్న వీఐపీలందరి మొహాల్లో ఆందోళన... మదర్పై దాడి జరుగుతుందేమోనన్న భయం, కాని ఆమెలోని నిశ్చలత్వాన్ని అడుక్డుకునే సాహసం చేయలేదెవరూ. ఐదడుగుల పొడవు కూడా లేని మదర్లోని ప్రశాంతత, నిర్మలత్వం, నిర్భయత్వం, విధేయత, సాత్వికత ఆందోళనకారులనే కాదు, అక్కడున్న వారెవరికీ మాట పెగలకుండా చేశాయి. ‘నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి’ అంటూ చేతులు జోడించి అంటున్న ఆమె మాటల్లోని యధార్థత అంతా తలదించుకునేలా చేసింది. నినాదాలు ఆగిపోయాయి, ప్లకార్డులు నేలకూలాయి. నిశ్శబ్దం అలుముకుంది. ‘ఇది మీ ఉత్సవం. నేను మీ అతిథిని. మీరు లేకుండా అదెలా జరుగుతుంది? మనమంతా కలిసి వెళ్దాం పదండి’ అంటూ విద్యార్థుల్లో ఇద్దరిని తన రెండుచేతులతో పట్టుకొని పోలీసులు దారి చూపగా వారితోబాటు ఉత్సవ ప్రాంగణానికి గబగబా నడవడం ఆరంభించారు మదర్. అంతే! నిరసనకారులతో సహా అంతా మదర్ను వెంబడించారు. అధికారులు అన్ని రోజులుగా సాధించలేకపోయిన శాంతిని మదర్ ఒక్క నిమిషంలో తన సాత్వికత్వంతో సాధించారు. ఎంతో గందరగోళం మధ్య జరుగుతుందనుకున్న స్నాతకోత్సవం ఆనాడు ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగింది. కేవలం పదినిమాషాలే సాగిన తన ప్రసంగంలో మదర్ దేవుని ప్రేమను అత్యద్భుతంగా ప్రకటించారు. చేతలతో దేవుని ప్రేమను అంత అద్భుతంగా చాటే వ్యక్తికి ప్రవచనాలు, ప్రసంగాల అవసరం ఏముంటుంది? సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న యేసుక్రీస్తు ప్రవచనంలోని శక్తి, వాస్తవికత ఆరోజు నాలాంటి వారెందరికో అర్థమైంది. ఆమెకు మొన్ననే సెంయిట్ హుడ్ ఇచ్చారు. సెయింట్ అంటే అక్కడెక్కడో, మరోలోకంలో ఉండి పూజలందుకుంటున్న భావన. కాని మదర్ అంటే మన పక్కనే ఉండి ప్రేమతో కన్నీళ్లు తుడుస్తున్న ఆదరణ!! అందుకే ఇప్పుడూ ఎప్పుడూ ఆమె అమ్మే!! - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అన్నీ పాత ఫీజులే
- ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా ఫీజులు ఖరారు - 2013-2015 నాటి ఫీజులే 2016 నుంచి 2018-19 వరకు అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్ మినహా మిగతా సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు గతంలో అమలు చేసిన ఫీజులనే కొనసాగిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఈడీ, లా, ఫార్మ్-డీ, ఎం-ఆర్క్, ఎం-ప్లానింగ్ కోర్సులన్నింటికి పాత ఫీజుల ఆధారంగానే ప్రవేశాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14, 2014-15, 2015-16 విద్యా సం వత్సరాల్లో ఆయా కోర్సులకు వివిధ కాలేజీల్లో ఎంత ఫీజు ఉందో, వచ్చే మూడేళ్లపాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) దానినే అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రవేశాల కమిటీ లు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఫీజు విషయంలో ఉపశమనం లభిం చింది. ప్రభుత్వంపైనా ఫీజు రీయింబర్స్మెంట్ భారం భారీగా తగ్గనుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నాలుగైదు నెలలపాటు కాలేజీల యాజమాన్యాలతో పలు దఫాలు చర్చించి, కాలేజీల ఆదాయ వ్యయాలనుబట్టి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వామోదం కోసం పంపింది. ఈ ప్రతిపాదనలను 3 నెలలుగా పెండింగ్లో ఉంచిన ప్రభుత్వం పాత ఫీజుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఫీజుల జీవోలు రాకపోవడం వల్ల ఆయా కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. కొత్త కాలేజీలకు కనీస ఫీజు... ఈసారి కొత్తగా ప్రవేశాలకు అనుమతి, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు కనీస ఫీజునే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టే అటువంటి కాలేజీల న్నింటినీ ఆయా కోర్సులకు సంబంధించిన కనీస ఫీజునే తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాత, కొత్త కాలేజీల్లో కనీస, గరిష్ట ఫీజులకు అదనంగా స్పెషల్ ఫీజులు ఉ న్నాయి (ఉదాహరణకు బీఈడీలో రూ. 3 వేల స్పెషల్ ఫీజు). కోర్సునుబట్టి స్పెషల్ ఫీజుకు గతంలో నిర్ణయించిన దానినే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్సైట్లలో పొందొచ్చు. 2016-17 నుంచి 2018-19 వరకు ఫీజులివీ... నోట్: ఎంటెక్కు సంబంధించి యూనివర్సిటీ కాలేజీల్లో ఫీజు రూ. 30 వేలుగా ఉంది. ఎంఫార్మసీ కోర్సుకు ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఫీజును నిర్ణయించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఫార్మసీ ఫీజు రూ. 30 వేలుగా ఉంది. -
నలభై ఏళ్లుగా విద్యాసుగంధాలు
నేడు 41వ ఏట అడుగిడనున్న కాకతీయ యూనివర్సిటీ 1968లో ఓయూ పరిధిలో పీజీ సెంటర్ ఏర్పాటు నాలుగు విభాగాలతో 1976లో యూనివర్సిటీ ఆవిర్భావం వైభవమంతా గతమే... రాజ్యమేలుతున్న సమస్యలు కేయూ క్యాంపస్ : లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి.. ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి నేటితో నలభై సంవత్సరాలు పూర్తికానున్నాయి. నిత్యం వందలాది మంది అధ్యాపకులు, ఉద్యోగులు... యూనివర్సిటీ పరిధిలో పలు కళాశాలలు, పీజీ సెంట ర్లు.. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు కళకళలాడే యూనివర్సిటీ శుక్రవారం 41వ సం వత్సరంలో అడుగు పెడుతోంది. అయితే, ఎం తో వైభవం, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. నూతన నిర్మాణాలు లేక... ఏటా రిటైర్ అవుతు న్న అధ్యాపకుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో కేయూ వైభవమంతా గత చరిత్రగా మిగిలిపోనుందా అని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఓయూలో అంతర్భాగంగా.. ఉస్మానియా యూనివర్సిటీ 1968నుంచి పరిధి లో వరంగల్లో కాకతీయ యూనివర్సిటీగా పీజీ సెంటర్ మాత్రమే కొనసాగేది. ఆ తర్వాత 1976 ఆగస్టు 19వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ఆవిర్బవించింది. తొలుత తెలుగు, ఇం గ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాలు ఏర్పాటుకాగా 1974లో ఎకనామిక్స్ విభాగం ఏర్పాటుచేశారు. ఫార్మసీ కోర్సు కూడా తొలుత ఓయూలో ఏర్పాటుకాగా ఆ కోర్సును 1975లో కేయూకు షిఫ్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. గతంలో కరీంనగర్ కూడా జిల్లా కూడా కేయూ పరిధిలోనే ఉన్నా అక్కడ శా>తవాహన యూనివర్సిటీ ఏర్పాటుకావడంతో మూడు జిల్లాలకే పరిమితమైంది. కేయూ పరిధిలో 305 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, మూడు అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. సాధారణ, వృత్తి విద్యాకోర్సులు కొనసాగతున్నాయి. పీజీ కళాశాలలు 76 ఉండగా అందులో 30కిపైగా పీజీ కోర్సులు ఉన్నాయి. ఫార్మసీ కళాశాలలు 25, బీఈడీ 42, ఎంఈడీ నాలుగు కళాశాల లతో పాటు ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలు, ముప్ఫై ఎంబీఏ, ఐదు ఎంసీఏ, మూడు ఎల్ఎల్ బీ, నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు ఉన్నాయి. 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకతీ య యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకా ఇక్కడ అంబేద్కర్ స్టడీసెంటర్, ఉమెన్స్ స్టడీ సెంటర్, ప్లేస్మెంట్ సెల్, స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ గైడెన్స్ సెల్ సెం టర్ ఉంది. కేయూ పరిధిలోని ఎన్ఎస్ఎస్ యూనిట్లో 350కి పైగా సబ్ యూనిట్లు, 35 వేల మంది వలంటీర్లు ఉన్నారు. ఇక్కడ 24 గం టలు తెరిచి ఉండే గ్రంథాలయం కొనసాగుతోం ది. యూనివర్సిటీలో చదువుకుని ఇక్కడే అధ్యాపకులుగా చేరిన వారు ఎందరో ఉన్నారు. పడిపోతున్న విద్యాప్రమాణాలు కాకతీయ యూనివర్సిటీలో గతంలో విద్యాబోధన, పరిశోధన నాణ్యతగా ఉండేది. తరగతులు సక్రమంగా సాగుతుండగా అధ్యాపకులు శ్రద్ధగా బోధించేవారు. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించేతత్వం కలిగిన పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఉండేవారు. ఇక్కడినుంచే వెళ్లిన వారు విప్లవ ఉద్యమంలో అగ్రనేతలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా యూనివర్సిటీలో అనేక అవకతవకలు బయటపడగా.. విద్యాప్రమాణాలు బయటపడుతున్నాయి. 2009 సంవత్సరం నుంచి యూనివర్సిటీలో విద్యాబోధనపై తీవప్రభావం చూపింది. 30కిపైగా విభాగాలు ఉండగా పలు విభాగాల్లో క్లాస్లు జరగడం లేదు. ఇక పరిశోధన రంగంలో ఎంఫిల్, పీహెచ్డీలు బాగానే అవార్డ్ అవుతున్నా పరిశోధనలు నాణ్యత ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండేళ్ల తర్వాత ఇటీవల వీసీని నియమించింది. సరిపడా లేని హాస్టళ్ల భవనాలు కాకతీయ యూనివర్సిటీలో వివిధకోర్సుల్లో ప్ర వేశాలు పొందుతున్నా విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. యూనివర్సిటీ ఆవిర్భంచిన తర్వా త నిర్మించిన హాస్టళ్ల భవనాలు ఇప్పటికీ ఉపయోగిస్తుండగా.. రెండు, మూడు తప్ప కొత్త భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే, హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రభుత్వం పెంచకపోవడంతో విద్యార్థుల మెస్ బకాయిలు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారు. అలాగే, కేయూ పరిధిలో 391 టీచింగ్ పోస్టులకు 179 మందే పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి నాన్ టీచింగ్ విభాగాల్లో కనిపిస్తోంది. 1992 తర్వాత నాన్టీచింగ్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. బ్లాక్ గ్రాంట్ ఏటా రూ.68 కో ట్లే వస్తుండడంతో పింఛనర్లకు బెనిఫిట్స్ చె ల్లించలేని దుస్థితి నెలకొంది. మిగతా అవసరాల కు అంతర్గత నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కాగా, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి విమర్శలకు తావిస్తోం ది. కాపీయింగ్ తదితర అంశాలతో దూరవిద్య ను కొందరు వ్యాపారంగా మార్చారు. ఈనెల 17నుంచి జరగాల్సిన దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేయడం తాజాగా పరిస్థితికి అద్దం పడుతోంది. భవనాలు లేని పీజీ సెంటర్లు యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల క్రితం భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్లో పీజీ సెంటర్లు ఏర్పాటుచేశారు. అయితే, వీటికి సొం త భవనాలు లేకపోగా, రెగ్యులర్ అధ్యాపకు ల ను నియమించకపోవడం గమనార్హం. దీంతో పీజీ సెంటర్లలో చేరిన విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. ఇదే పరిస్థితి క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ నెలకొంది. -
సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న కేయూ క్యాంపస్ : విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలని.. ఇక్కడ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే రాష్ట్రం, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేయూ ఏర్పాౖటెన 40 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ మేరకు పాలనలో భేష్ అనిపించుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.రవీందర్రెడ్డి, అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణా«ధికారులు ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం, ప్రొఫెసర్ జి.రామేశ్వరం, డాక్టర్ రాంచంద్రం, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రమేష్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ గాదె పాణి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గిరీశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేయూ న్యూస్ లెటర్ వివేచనను వీసీ ఆవిష్కరించారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన వీసీ.. కేయూలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటుచేసిన పెన్షన్ సెల్ను ప్రారంభించారు. అలాగే,కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ జగన్నాథస్వామి, పలువురు పరిశోధకులు కలిసి ఏర్పాటుచేసిన నిర్భయ ఫౌండేషన్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో ప్రతిభచూపిన పి.నాగరాజుకు రూ.10వేల విలువైన పుస్తకాలను వీసీ సాయన్న చేతుల మీదుగా అందజేశారు. -
16, 18 తేదీల్లో ప్రీ పీహెచ్డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ప్రీ పీహెచ్డీ పరీక్షలు ఈనెల 16, 18వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హ్యూమనిటీస్ భవనంలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు గమనించాలని వారు సూచించారు. -
కేయూ వీసీ మనోడే
ఆర్.సాయన్నది కొరట్పల్లి రెగ్యులర్ వైస్చాన్స్లర్గా నియామకం డిచ్పల్లి : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఆయన డిచ్పల్లి మండలం కొరట్పల్లికి చెందినవారు. సోమవారం వీసీగా ఉత్తర్వులు వెలువడగా.. అదే రోజు కేయూలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేయూలో మూడేళ్లపాటు వీసీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జూనియర్ లెక్చరర్ నుంచి.. కోరట్పల్లికి చెందిన ఆర్.సాయన్న 1955 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా, 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 1991 నుంచి 1999 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్గా పనిచేసి కొద్దికాలం క్రితం రిటైరయ్యారు. ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో బోధించారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనాlపత్రాలను సమర్పించారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. పరిపాలనానుభవం.. 1991లో సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్గా పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చూశారు. అకడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000 వరకు వ్యవహరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో జీవితకాల సభ్యుడి, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడు పనిచేశారు. -
కేయూ వీసీగా సాయన్న
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు రెగ్యులర్ వైస్చాన్స్లర్ నియామకం రెండు సంవత్సరాలుగా ఇన్చార్జుల పాలనలో యూనివర్సిటీ కేయూ క్యాంపస్ :కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. 2014 మే 17న కేయూ వీసీగా ప్రొఫెసర్ వెంకటరత్నం పదవీకాలం ముగిశాక ఇప్పటి వరకు నలుగురు ఇన్చార్జి వీసీలుగా పనిచేశారు. నాల్గవ ఇన్చార్జీ వీసీగా టి.చిరంజీవులు గత సంవత్సర కాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కేయూకు రెగ్యులర్ వీసీని నియమాకం చేసింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామానికి చెందిన ఆర్.సాయన్న 1955 అగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కేయూలో మూడు సంవత్సరాలపాటు వీసీగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. జూనియర్ కళాశాల లెక్చరర్ నుంచి.. సాయన్న ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. 26 సంవత్సరాల బోధన పరిశోధనానుభవం కలిగిన ప్రొఫెసర్ సాయన్న ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్గా పనిచేశారు. అనంతరం 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఆరెళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 1991నుంచి 1999వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్గా పనిచేస్తూ కొద్దికాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో భోధన చేశారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ఆయన పాల్గొన్నారు. పలు పరిశోధనాపత్రాలను సమర్పించారు. పరిపాలనా పదవులు ఇలా.. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000వరకు బాధ్యతలను నిర్వర్తించారు. సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్గా 1991లో పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. అకాడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా పనిచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో జీవితకాల సభ్యుడుగాను, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలీడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడుగాను పనిచేశారు. యూనివర్సిటీ అభివృద్దికి కృషిచేస్తా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషిచేస్తాన ని వీసీ ప్రొఫెసర్ సాయన్న అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ వీసీగా బాధ్యతలను స్వీకరించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను వీసీ స్థాయికి చేరినందుకు తన తల్లిదండ్రులకు రుణపడిఉంటానన్నారు. నిరక్ష్యరాస్యులైన తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తాను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించారని చెప్పారు. తనమీద నమ్మకంతో కేయూకు వీసీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. -
సమాజ హితమే జర్నలిస్టుల ఆకాంక్ష
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ‘కేయూ ఎక్స్ప్రెస్ ల్యాబ్ జర్నల్’ ఆవిష్కరణ కేయూ క్యాంపస్ : సమాజహితమే ఆకాంక్షగా జర్నలిస్టులు నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేస్తున్నారని.. ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో జర్నలిజం కీలక పా త్ర పోశిస్తుందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. కాకతీయ యూని వర్సిటీలోని జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో వెలువరించనున్న కేయూ ఎక్స్ప్రెస్ ల్యాబ్ జర్నల్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడు తూ సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలోను జర్నలిస్టుల పాత్ర ఎనలేదని కొనియాడారు. చాలా రంగాల్లోని వారు ఆర్థికంగా ఎదిగినా, 30ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న పలువురు తమకు ఇళ్లు మం జూరు చేయాలని కోరే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో పత్తి పండించకముందే పత్తి ఆధారిత మిల్లుగా ఆజాంజాహి మిల్లు ఎందరికో ఉపాధినిచ్చినా, గత పాలకుల నిర్లక్ష్యంగా అది మూ తపడిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లా ల్లో పత్తి విస్తారంగా సాగు చేస్తుండగా మిల్లు మూత పyìందని, ఇలాంటి విషయాలపై జర్నలిస్టులు లోతుగా అధ్యయనం చేసి పరిశోధనాత్మక కథనాలు రాయాలని సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బంగారు తె లంగాణ సాధనలో జర్నలిజం విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేయూ ఎక్స్ప్రెస్ ద్వా రా ప్రజలను ఆలోపింపచేసే కథనాలు వస్తాయని ఆకాంక్షించారు. కేయూ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడుతూ కేయూలో జర్నలిజం పూర్తిచేసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, వైస్ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.దయాకర్రావు, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్కుమార్, రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు, నగర డిప్యూటీ మేయర్ సిరాజోద్దీన్, జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, కె.నర్సింహారాములు, రామాచారి, ఎస్.నర్సయ్య, శ్రీకాంత్, పులి శరత్కుమార్, వంగాల సుధాకర్, పద్మశ్రీ, వెంకట్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ను నిర్వాహకులు సన్మానించారు. -
స్పీకర్ కాదు.. కంట్రోలర్ అనాల్సింది
శాసన సభాపతి మధుసూదనాచారి కేయూ క్యాంపస్ : శాసనసభలో ‘స్పీకర్’ మాట్లాడటమనేది అసలే ఉండదని, సభ్యులే మాట్లాడుతారని స్పీకర్ అనేవారు సభను కంట్రోల్ చేస్తుంటారని.. అలాంటప్పుడు స్పీకర్ అని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని శాసన సభాసతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం విభాగం ఆధ్వర ్యంలో ‘కేయూ ఎక్స్ప్రెస్’ అనే జర్నల్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ అనే పదం వాడడంలో ఉన్న ఆంతర్యమేంటో జర్నలిస్టులే వెలికి తీయాలని నవ్వుతూ అన్నారు. రాష్ట్ర శాసనసభలో తాను స్పీకర్గా వ్యవహరిస్తున్నాని, తానేమీ మాట్లాడేది ఉండదని సభ్యులెవరైనా అదుపుతప్పి మాట్లాడితే కంట్రోల్ చేయడమే తన డ్యూటీ అని చెప్పారు. -
నేడు ఎంసెట్-2
హాజరుకానున్న 4,698 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరుగనున్న టీఎస్ ఎంసెట్ -2కు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 4,698 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 8కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హన్మకొండలోని సుబేదారి యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల, కేయూ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ కాలేజీ కేయూ క్యాంపస్, సీకేఎం ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, లాల్బహుదూర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు 8మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 12మంది అబ్జర్వర్లను, రెండు ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించినట్టు చెప్పారు. పరీక్షాకేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలని, నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాల్లోకి అనుతించబోరన్నారు. సెల్ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్పరికరాలు తీసుకురావద్దన్నారు. -
మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం
* అడ్డుకున్న భర్త.. ప్రొఫెసర్ల వేధింపులే కారణం... * ఈనెల 11 నుంచి ఆందోళనకు సిద్ధమైన దంపతులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలోని ఇద్దరు ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుతో మనోవేదనకు గురైన ఓ మహిళా స్కాలర్ తన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి యత్నించగా, ఆమె భర్త అడ్డుకున్నారు. ప్రొఫెసర్ల వైఖరికి నిరసనగా ఈనెల 11 నుంచి ఆందోళన చేయూలని నిర్ణయించుకున్నట్లు ఆ దంపతులు వెల్లడించారు. గురువారం కేయూలో పీహెచ్డీ పరిశోధకురాలు పైండ్ల జ్యోతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. క్యాంపస్లో ఇంగ్లిష్ విభాగంలో 2015 ఆగస్టులో ఆమె పీహెచ్డీ స్కాలర్గా ప్రవేశం పొందారు. జ్యోతి భర్త కిరణ్కుమార్ కూడా ఇంగ్లిష్ విభాగంలోనే ఎంఫిల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె విభాగాధిపతి ప్రొఫెసర్ దామోదర్ వద్ద ఉన్న హాజరు పట్టికలో సంతకం చేయూల్సి ఉంటుంది. ముందు వెళ్తే తాను లేనప్పుడు ఎందుకు సంతకం చేశావని ప్రశ్నిస్తున్న ఆయన.. ఆలస్యంగా వెళ్తే ఇష్టమొచ్చినప్పుడు రావడమేమిటని అనుచితంగా వ్యవహరిస్తున్నారని జ్యోతి తెలిపారు. అంతేకాకుండా దూరవిద్యలో చదువుకున్న నీకు ఎలా పీహెచ్డీలో సీటు వచ్చింది? అంటూ కులం పేరుతో తిట్టారని పేర్కొన్నారు. ఇంకా ఇటీవల ఇంగ్లిష్ విభాగంలో జరిగిన సదస్సుకు వెళ్తే బొమ్మలా వచ్చి వెళ్లిపోయావన్నారనీ, మహిళా పీజీ కళాశాలలో తరగతులు తీసుకుంటే క్లాసులెందుకు చెప్పావని ప్రశ్నించారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంగ్లిష్ విభాగంలో జ్యోతి బ్యాచ్ పీహెచ్డీ ప్రవేశాలపై ఒకరు కోర్టుకు వెళ్లగా అధికారులు అడ్మిషన్లు రద్దు చేసి మళ్లీ పలువురికి మెరిట్ కమ్ రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం ప్రవేశాలు కల్పించారు. దీంతో జ్యోతికి సైతం బీసీ-ఏ కేటగిరీలో పీహెచ్డీ సీటు వచ్చింది. ఈనెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు గడువు ఉండగా.. అడ్మిషన్ తీసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్లోని ఇంగ్లిష్ విభాగానికి జ్యోతి వెళ్లగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడారన్నారు. స్థానికురాలివై ఉండి ఆలస్యంగా రావడమేమిటని ప్రశ్నిస్తే తమ బంధువులు ఆస్పత్రిలో ఉండడంతో ఆలస్యమైందని చెప్పినట్లు తెలిపారు. విభాగాధిపతి దామోదర్, డీన్ ప్రొఫెసర్ కె.పురుషోత్తంతోపాటు పరిశోధకుల ముందే శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడడంతో ఆవేదన చెందిన తాను.. బుధవారం రాత్రి ఇంటికి వెళ్లాక వంటింట్లో గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తన భర్త కిరణ్ కాపాడారని తెలిపారు. ఇద్దరు ప్రొఫెసర్లు తన పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని గైడ్ ప్రొఫెసర్ లత దృష్టికి తీసుకెళ్లామనీ, ఈనెల 11వ తేదీ నుంచి ఇంగ్లిష్ విభాగం ఎదుట ఆందోళన చేయనున్నట్లు జ్యోతి, కిరణ్కుమార్ తెలిపారు. -
కేయూ చరిత్రలోనే అతి తక్కువ ఉత్తీర్ణత
మూడు జిల్లాల్లో కలిపి 28.40 శాతం నమోదు డిగ్రీలో పడిపోతున్న విద్యాప్రమాణాలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనూ అదేతీరు కేయూ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరంలో కేవలం 28.40 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించడం ఆందో ళన కలిగిస్తుంది. కేయూ చరిత్రలోనే ఇంత తక్కువ ఫలితాలు రావడమనేది ఇదే తొలిసారి అని తెలుస్తోంది. చివరి సంవత్సరం పరీక్షలకు 44,506 మంది విద్యార్థులు హాజరై తే కేవలం 12,641మందే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 33.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఈ సారి 5.57శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక మొ దటి, రెండు, చివరి సంవత్సరాల్లో కలిపి 1,55,273 మంది విద్యార్థులకు 39,456 మం ది(25.41శాతం) ఉత్తీర్ణత సాధించడం గమనా ర్హం. బీఏ కోర్సులోనైతే వరంగల్ జిల్లాలో 17.19శాతం, బీఎస్సీలో 27.50 శాతం, బీకాం లో 31.87 శాతమే ఉత్తీర్ణత న మోదైంది. సాధించారు. డిగ్రీ విద్యలో ఇంత తక్కువ ఫలి తాలు రావటం అనేది కాకతీయ యూనివర్సి టీ చరిత్రలో ఇది తొలిసారిగా అని తెలుస్తోంది. అర్హులైన అధ్యాపకులు ఉన్నా... కేయూ పరిధిలో డిగ్రీ ఫలితాలను పరిశీలిస్తే డిగ్రీ విద్యలో విద్యాప్రమాణాలు పడిపోయిన ట్లుగా భావించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం ఆం దోళన కలిగిస్తుంది. యూనివర్సిటీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 305 డిగ్రీ కళాశాలలు ఉండగా.. వరంగల్ జిల్లాలో 14 ప్రభుత్వ, సు మారు 90నుంచి 100వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళా శాలల్లో ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయించడం లేదు. ఏదో విధంగా ప్రాక్టికల్స్లో ఉత్తీర్ణత సాధించినా థియరీలో ఉత్తీర్ణత ఆశించనంతగా ఉండడం లేదు. ప్రైవేట్ కళాశాలల బాధ్యులు తాయిలాలు చూపి, తరగతులకు రాకున్నా పర్వాలేదని చెబుతూ విద్యార్థులను చేర్చుకుం టున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడం తో విద్యార్థులు పలువురు కాపీయింగ్పై ఆధారపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడా ది మూడు జిల్లాల్లో కలిపి 1300 మందికి పైగా విద్యార్థులు డిబార్ కావడానికి దీనికి నిదర్శ నంగా చెప్పుకోవచ్చు. కేవలం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్సమెంట్ కోసమే అన్నట్లుగా డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయనే విమ ర్శలున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విషయానికొస్తే ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు ఉన్నా ఆశించిన ఫలితా లు రాకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉన్నత విద్య ఆర్జేడీగా ఇన్చార్జీలు ఉండడంతో కళాశాలలపై పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వె త్తున సాగిన మూడేళ్లలో తరగతులు సక్రమం గా జరగకపోయినా పర్వాలేదనే విధంగా ఫలితాలు వచ్చాయి. అలాంటిది ఈ ఏడాది ఫలి తాలు దిగజారిపోవడంపై పలువురు ఆం దోళన వ్యక్తం చేశారు. పదో తరగతిలో 95శా తం, ఇంటర్లో 49 నుంచి 75 శాతం వరకు ఫలితాలు వచ్చినా.. డిగ్రీలో 35 శాతం దాట కపోవడంపై యూ నివర్సిటీ అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచి చాయిస్ బేస్డ్ సిస్టమ్ సెమిస్టర్ విధానాన్ని అమలుచేయను న్నారు. అయితే, విద్యాప్రమాణాలు ఇప్పటిలా ఉంటే ఈ విధానం ఏ మేరకు సత్ఫలి తాలని స్తుందో వేచి చూడాల్సిందే. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవల ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియగా.. పొడిగించినట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు తమ దరఖాస్తులను జాగ్రత్తగా అప్లోడ్ చేయూలని, సందేహాలు ఉంటే హెల్ప్లైన్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఏ కాలేజీ బాధ్యులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 17,845 దరఖాస్తులే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఇప్పటి వరకు 17,845 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 21,633 మంది విద్యార్థులు రూ.100 చొప్పున ఫీజు చెల్లించినా అందరూ దరఖాస్తు చేసుకోలేదు. మూడు జిల్లాల్లోని కళాశాలల్లో ఒక లక్ష 25వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైతే దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
రేపే టీఎస్ లాసెట్-2016
కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు ప్రవేశపరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11-30గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు సూచించారు. నిర్ణీత సమయానికి ఒక నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతో పాటు ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆయన వివరించారు. -
ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్ : ఐసెట్ -2016ను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో రాష్ట్రంలోని ఐసెట్ రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న ఐసెట్ నిర్వహించనుండగా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తొలిసారి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, 72,44 8మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆయన తెలి పారు. నిర్ణీత సమయం కంటే నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్, వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.సాయిలు ఇతర రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
5నుంచి కేయూ పీజీ పరీక్షలు
హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 10, 12, 17, 19, 21 23 తేదీలలో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5, 7, 9, 11, 13, 16 తేదీలలో జరుగుతాయి. -
పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం 2016-2017లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను సోమవారం నోటిఫికేన్ విడుదలైంది. ఈ పీజీ సెట్కు అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.కష్ణారెడ్డి, జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్నాయక్ సోమవారం వెల్లడించారు. అభ్యర్థులు మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కేయూ అడ్మిషన్ల వెబ్సైట్ www.kakatiya.ac.in లేదా www.kudoa.in ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా క్రెడిట్ కార్డు, డిబెట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రిజస్ట్రేషన్ ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్లకు సంబంధించిన నియమ నిబంధనలు వెబ్సైట్లో ఉంచారు. అపరాధ రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు, రూ.600 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆన్లైన్ అప్లికేషన్ హెల్ప్లైన్ కేంద్రం నంబర్లు 90524 565721, 99856 66721కు ఫోన్ చేయవచ్చని అడ్మిషన్ల డైరెక్టర్ తెలిపారు. మే చివరి వారంలో పీజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నామని, ప్రవేశ పరీక్షల సమయంలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
మాస్ కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ సీఐ భీమ్రెడ్డి వివరాల ప్రకారం.. కాకతీయ వర్సిటీ నిర్వాహకులు సురేష్, రాజిరెడ్డితో కలిపి మరో నలుగురు డిగ్రీ దూరవిద్య పరీక్షలను నిజాం కళాశాల సెంటర్లో రాయాల్సి ఉండగా కింగ్ కోఠీలోని పద్మశాలి భవన్లో పరీక్షలు రాస్తూ మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మాస్కాపీయింగ్ పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు భీమ్రెడ్డి తెలిపారు. -
ప్రొఫెసర్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
ఓ ప్రొఫెసర్ కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పరామర్శించారు. కాకతీయ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ దినేష్ తల్లి వజ్రమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మధిర గ్రామంలోని సాయిగూడెంకు మంత్రి ఈటల మంగళవారం వెళ్లారు. ప్రొఫెసర్ దినేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వజ్రమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
వంద కోట్ల క్లబ్లో ‘రుద్రమదేవి’
షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్లో దర్శకుడు గుణశేఖర్ హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.... ఓరుగల్లు అనగానే ఓకే అన్నా.. ఇంటర్నేషన్ షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి. రికార్డు కలెక్షన్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా. ఎందరో తెలుసుకుంటున్నారు రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్డమ్, ఓరుగల్లు కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది. కేసీఆర్కు అభినందనలు ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు. పవర్ ఫుల్ మీడియా సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్ఫాం. ఎంతోమంది షార్ట్ఫిలిమ్ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్లో దర్శకులయ్యారు. ఇంకా ఎంతో ఉంది రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్కు వస్తాను. -
మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవి సస్పెన్షన్
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో నిందితురాలిగా ఉన్న రాజయ్య భార్య మాధవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న తెల్లవారుజామున సారిక సజీవ దహనం కాగా, అదే రోజు పోలీసులు మాధవిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీసుల నుంచి రిమాండ్ రిపోర్టు అందలేదు. తాజాగా ఆ రిపోర్టు కేయూ అధికారులకు రిమాండ్ రిపోర్టు అందగా, కేయూ ఇన్చార్జి వీసీ చిరంజీవులు అనుమతి మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం మాధవిని సస్పెండ్ చేశారు. అయితే ఈనెల 5 నుంచి మాధవిపై సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మాధవి సిర్పూర్ కాగజ్నగర్లోని ఓ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 2010లో కేయూ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యూరు. ఈ మేరకు క్యాంపస్లోని బయో టెక్నాలజీ విభాగంలో సుమారు రెండేళ్ల పాటు పనిచేశాక, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యూరు. కేయూ చరిత్రలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. -
అటానమస్ ఆర్ట్స్ కాలేజీ
అకడమిక్ పరంగా స్వయం ప్రతిపత్తి వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదమే తరువాయి.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి అటానమస్ హోదా లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పంపిన లేఖ సోమవారం అందింది. వచ్చే విద్యాసంవత్సరం(2016-2017) నుంచి ఈ హోదా అమలులోకి రానుంది. ఈ ఏడాది జులై 27, 28వ తేదీల్లో యూజీసీ నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆర్ట్స్ కాలేజీని సందర్శించి వసతులు, సౌకర్యాలపై ఆరా తీసింది. వారు ఇచ్చే నివేదిక ప్రకారం ప్రస్తుతం అటానమస్ హోదా లభించింది. తద్వారా ఆర్ట్స కాలేజీ కేయూ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లవచ్చు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సులలో సిలబస్ రూపకల్పనతోపాటు విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల సెట్టింగ్, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల సొంతంగా చేసుకోవచ్చు. టైంటేబుల్ కూడా యూనివర్సిటీతో సంబంధం లేకుండా సొంతంగా చేసుకునే వెసలుబాటు లభిస్తుంది. నిధులు కూడా యూజీసీ నుంచి నేరుగా అందనున్నందున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు. అయితే, కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆర్థికపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. అలాగే, ఆర్ట్స్ కాలేజీకి లభించిన అటానమస్కు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆమోదించాల్సిన అవసరముంది. మినీ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మినీయూనివర్సిటీగా పిలువబడుతుంది.40 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అనేక భవనాలతో మౌళిక వసతులు కలిగి ఉండగా 1927లో కాలేజియట్ హైస్కూల్గా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. డిగ్రీ కోర్సులతో 1959లో ఓయూ పరిధిలో ఉండి ఆ తరువాత 1976 అగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. 1995నుంచి పీజీ కోర్సులు కూడా నిర్వహిస్తుండగా.. మాజీ ప్రధాని దివంగత పీవీ.నర్సింహారావు తదితరులెందరో ఈ కళాశాలలో చదువుకున్నారు. కాలేజీలో ప్రస్తుతం 30 వరకు వివిధ కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, పది పీజీ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు నడుస్తున్నాయి. అలాగే, ఈ కళాశాలకు 2004లో తొలిసారి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించగా.. 2014-2015లో రీ అక్రిడేషన్ లభించింది. రెగ్యులర్ అధ్యాపకుల నియమాకం అవసరం యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి అన్ని హంగులున్నా ఉ ద్యోగ విరమణ చేస్తున్న ప్రొఫెసర్ల స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. దీంతో 90మంది రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు కేవలం 23మందే ప్రస్తుతం ఉ న్నారు. మిగతా వారందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లే. ప్రస్తు తం అటానమస్ హోదా లభించినందున ఆర్ట్స కళాశాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమిస్తేనే అటానమస్ హోదా లభించిన ఫలితం దక్కుతుంది. రిజిస్ట్రార్కు లేఖ ఇచ్చాం.. అటానమస్ ఆర్ట్స్ అండ్ై సెన్స్ కాలేజీకి అటానమస్ హోదా కల్పిస్తూ యూజీసీ నుంచి వచ్చిన లేఖను కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్తాఫ్ హుస్సేన్కు ఇచ్చామని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రామానుజరావు తెలిపారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోఆమోదించేలా యూనివర్సిటీ అధికారులు కృషి చేయాల్సి ఉంది. -
కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్టేకర్ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్కు అనుకూలం గా కేర్టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్టేకర్ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ‘అధిపతి’ కావలెను
బాధ్యతలు వద్దంటూ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరిరావు రిజిస్ట్రార్కు లేఖ సుజాతకుమారికి అవకాశం? కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగానికి విభాగ అధిపతిగా ఆవిభాగం ప్రొఫెసర్ యాదగిరిరావును ఈనెల 7వ తేదీన నియమాకం చే స్తూ కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈనెల 19వ తేదీ వరకు కూడా ఆయన బాధ్యతలను స్వీకరంచ లేదు. అంతేగాకుండా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించబోనని కూడా రెండు రోజుల క్రితం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్కు లేఖను అందజేశారు. విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్రెడ్డి ఈనెల 4వతేదీతో పదవీకాలం ముగిసింది. రొటేషన్ ప్రకారం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ సత్యనారాయణ నియమాకం కావాల్సి ఉండగా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను చేపట్టబోనని సత్యనారాయణ బీవోఎస్గానే కొనసాగుతానని ఇన్చార్జి రిజిస్ట్రార్కు లేఖ అందజే యటంతో కేయూ యూజీసీ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ యాదగిరిరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆయన కూడా బాధ్యతలను స్వీకరించనని నాట్ విల్లింగ్ ఇస్తూ లేఖ అందజేశారు. దీంతో15 రోజులుగా విభాగంనకు అధిపతి లేకపోవటంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవవనరుల విభాగం‘హెడ్’లేని విభాగంగా కొనసాగుతుంది. ప్రొఫెసర్ యాదగిరిరావు వెనుకంజకు కారణమేమిటీ కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగం విభాగం అధిపతిగా నియామకం అయ్యాక ఈనెల 12వతేదీన ప్రొఫెసర్ యాదగిరిరావు విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు విభాగానికి వెళ్లగగా పీహెచ్డీలో సీట్లు రాని అభ్యర్థులు వచ్చి ప్రవేశాల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యాదగిరిరావుతో వాగ్వాదాలకు దిగారు. అనంతరం వెళ్లిపోయిన ప్రొఫెసర్ యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించటం లేదు. చివరికి యాదగిరిరావు రెండు రోజుల క్రితం తాను ఆవిభాగం అధిపతిగా ఉండబోనని ఇన్చార్జి రిజిస్ట్రార్కు లేఖ అందజేశారు. గత 15రోజులుగా విభాగం అధిపతి ఎవరు లేకపోవటం వలన విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే విభాగం అధిపతిగా ఎవరిని నియమించినా వారికి చార్జీ ఇచ్చేందుకు విద్యాసాగర్రెడ్డి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం యాదగిరిరావు యూజీసీ కో ఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. ఇక సుజాతకుమారి వంతు ? కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవ వనరుల విభాగం అధిపతిగా ఇద్దరు ప్రొఫెసర్లు నాట్ విల్లింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాతకుమారిని విభాగ అధిపతిగా నియమించే అవకాశాలున్నాయి. ఈమేరకు ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలుంటాయని సర్వత్రా భావిస్తున్నారు. సమస్య కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా త్వరతగతిన సమస్యను పరిష్కరించి విభాగం అధిపతిని నియమించటంలో జాప్యం చేయటం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు
పూర్తరుున రెండో సెమిస్టర్ పరీక్షలు ఆరు నెలలు గడిచినా తప్పని నిరీక్షణ ఆందోళనలో ఎంకామ్ విద్యార్థులు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదలతో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే, వివిధ కోర్సుల పరీక్షలు సకాలంలో జరగకపోవడం ఫలితాల వెల్లడిపై ప్రభావం చూపుతోంది. అరుుతే, పరీక్షలు ముగిసి దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు వెలువడక పోవడానికి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మూడు జిల్లాలు.. నాలుగు వేల మంది విద్యార్థులు.. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పీజీ కళాశాలలు, క్యాంపస్లో ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీ క్షలు ఈఏడాది జనవరి 17నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హాజరయ్యూరు. అరుుతే, వాల్యూయేషన్లోనే అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్గా రెండు దఫాలు జవా బు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ చేపడతా రు. తొలిసారి ఇంటర్నల్గా కేయూలోని అధ్యాపకులు వాల్యూయేషన్ చేశాక ఎక్స్టర్నల్గా మరో యూనివర్సిటీ అధ్యాపకులతో వాల్యూయేషన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ వి ద్యార్థుల్లో ఎవరికైనా ఒక సబ్జెక్టు పేపర్లో మొ దటి వాల్యూయేషన్లో వచ్చిన మార్కుల కం టే రెండో వాల్యూయేషన్కు మధ్య 19 మా ర్కుల తేడా ఉంటే ఆ సబ్జెక్టు పేపర్ జవాబుపత్రాన్ని థర్డ్ వాల్యూయేషన్ చేయిస్తారు. ఇలా ఎంకామ్లో 1700 జవాబుపత్రాలు థర్డ్ వా ల్యూయేషన్కు వెళ్లాయని తెలుస్తోంది. ఆ ప్ర క్రియ కూడా పూర్తియిందని తెలుస్తోంది. అ రుుతే, ఫలితాలు ఆలస్యం కావడంతో జవాబుపత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నారుు. ఏ కోర్సు పరీక్షల ఫలితాలై నా 40రోజుల్లో విడుదల చేయూలి. కానీ, ఎం కామ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు పరీక్షలు నిర్వహించిన ఆర్నెల్లు గడించినా విడుదల కావడంలేదు. ఇక రెండో సెమిస్టర్ పరీ క్షలు కూడా ఇటీవలే పూర్తియ్యాయి. వాస్తవం గా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యూకే రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2014-2015విద్యాసంవత్సరంలో ఇప్పటికే రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఆలస్యంగా ఇటీవల ముగిశా రుు. వాటి ఫలితాలు కూడా వెల్లడించాల్సి ఉం ది. ఇక ఆయా విద్యార్థులకు రెండో సంవత్సరంలో మూడో సెమిస్టర్ తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలే విడుదల కాకపోవబం, రెండో సెమిస ్టర్ పరీక్షలు ఇటీవల ముగియడంతో ఫలితాలు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయూలని విద్యార్థులు కోరుతున్నారు. -
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?
* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు * ఇప్పటికే ప్రారంభమైన తరగతులు * ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది. ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు. -
కేయూలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూన్ 15, 16, 17వ తేదీల్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ చెప్పారు. హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిలిం పెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లో మాత్ర మే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరంగల్లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, గుర్తింపు పొందడంతోపాటు పర్యాటకపరంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో 20 దేశాల నుంచి వంద షార్ట్ఫిలిమ్స్ ఎం ట్రీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఫెస్టివల్ ఫౌండర్ జి.భద్రప్ప, ఫెస్టివల్ ైచె ర్మన్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ షార్ట్ఫిలిం ఫెస్టివల్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. -
కేయూ పీజీ సెట్ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్-2015 పరీక్షలు జూన్ 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, కేయూ అడ్మిషన్ల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి తెలిపారు. ఈ సంవత్సరం వరంగల్తోపాటు కరీంనగర్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ మొదటి వారం నుంచి అభ్యర్థులకు హాల్టికెట్లను పంపిణీ చేయనున్నామని, ఇతర వివరాలను కేయూ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 37,560 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కాగా, ఎంఏ సంస్కృతి, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ నాటో సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ స్థాయిలో మార్కుల మెరిట్ను బట్టి ప్రవేశాలు కల్పించనున్నారు.