Malayalam actor
-
సలార్ హీరోకు అరుదైన గౌరవం.. సీఎం చేతుల మీదుగా అవార్డ్
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఆడుజీవితం (ది గోట్ లైఫ్). గతేడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారి నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు బ్లెస్సీ ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించాడు.అయితే తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్ర అవార్డుల్లో సత్తాచాటింది. ఈ సినిమాలో నటనకు గానూ పృథ్వీరాజ్ సుకుమారన్కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరించింది. అంతే కాకుండా ఈ చిత్రం ఏకంగా తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఆయన అవార్డ్ అందుకున్నారు. తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది.కాగా.. పృథ్వీరాజ్ తండ్రి, లెజెండరీ సుకుమారన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కావడం మరో విశేషం. ఆ తర్వాత ఈ టైటిల్ను మోహన్లాల్ సొంతం చేసుకున్నారు. అంతకుముందే 2006లో పృథ్వీరాజ్ కేవలం 24 సంవత్సరాల వయసులో వాస్తవమ్ చిత్రంలో నటనకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు ఇరవై సంవత్సరాల మరోసారి ఆయనను అవార్డ్ వరించింది. -
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్తో పాటు అమ్మ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: దసరా విలన్కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం. -
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కుంచకో బోబన్. మాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవలే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. అయితే మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన కుంచకో బోబన్.. ఇతర భాషల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ విషయంపై ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటివరకు మలయాళం కాకుండా మరే ఇతర భాషలో ఎందుకు పని చేయలేదన్న ప్రశ్నపై స్పందించారు.కుంచకో బోబన్ మాట్లాడుతూ.. 'నేను నిరంతరం నా క్రాఫ్ట్ గురించి నేర్చుకుంటూనే ఉంటా. నన్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా. ప్రస్తుత రోజుల్లో కంటెంట్ పరంగా చూస్తే మలయాళ చిత్ర పరిశ్రమ మంచి దశలో ఉందని అనుకుంటున్నా. నిజానికి మలయాళంలో విడుదల చేస్తున్న విభిన్నమైన చిత్రాలను చూసి ఇతర పరిశ్రమలు అసూయపడుతున్నాయి. ఎందుకంటే మా చిత్రాల్లో నాణ్యత, ఇతివృత్తం, కథ కూడా కారణం కావొచ్చు. మా సినిమాలు స్థానికంగా తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా, గ్లోబల్ రేంజ్కి మారిపోతున్నాయి. ఇప్పుడు మలయాళంలో రూపొందుతున్న సినిమాలు చాలా ఎగ్జైటింగ్గా ఉంటున్నాయి. అయితే ఇతర భాషల్లోనూ నటించేందుకు అసక్తిగా ఉన్నా. కానీ ప్రత్యేకించి తమిళంలో ఏదైనా ఒక అద్భుతమైన పాత్ర వచ్చినట్లయితే కచ్చితంగా చేస్తా. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
సోషల్ మీడియాలో బాయ్కాట్ లూసిఫర్-2.. క్షమాపణలు చెప్పిన మోహన్లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. గతంలో వచ్చిన లూసిఫర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న లూసిఫర్-2 మూవీ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండడంతో పలువురు మేకర్స్పై మండిపడుతున్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ మూవీ హీరో మోహన్ లాల్ స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.మోహన్ లాల్ తన పోస్ట్లో రాస్తూ..'ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. అంతకు మించిన మోహన్లాల్ మరేది లేదని నా నమ్మకం...ఇట్లు ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ పోస్ట్ చేశారు.ఈ వివాదం తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 17 మార్పులు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సీబీఎఫ్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, జెరోమ్ ఫ్లిన్, ఎరిక్ ఎబౌనీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. 'బజూక' ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో మమ్ముట్టి యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. -
'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అనగానే కోట్ల రూపాయల రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్.. ఇవే మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ తాను కూడా కారుకి ఈఎంఐ కడుతున్నానని సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. ఎల్ 2 ఎంపూరన్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశాడు. అలానే డైరెక్షన్ అనేది తన తెలివి తక్కువ నిర్ణయమని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)'నాకు డబ్బు సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కారు ఈఎంఐ కడుతున్నాను. దర్శకత్వం చేయడం ఆర్థికంగా నేను తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం. ఎందుకంటే ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం రెండేళ్లు అయిపోయింది. ఆ టైంలో నటుడిగా ఎన్నో సినిమాలు పక్కనబెట్టేశా. అవి చేసుంటే బోలెడు డబ్బులు సంపాదించేవాడిని. అలా అని ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు. కానీ యాడ్స్ మాత్రం చేశాను. రెండు గంటల యాడ్ షూటింగ్ లో పాల్గొంటే చాలా డబ్బులిచ్చేవారు. కానీ నేను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ‘ఎల్-2: ఎంపురాన్’ సినిమా తీసిన పృథ్వీరాజ్.. గతంలో సలార్ మూవీలో చేశాడు. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరిన్ని సినిమాలు చేసేందుకు ఇతడికి ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని అనే ఖరీదైన కారు కొన్నాడు. దానికే ఈఎంఐ కడుతున్నానని ఇప్పుడు చెప్పాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) -
నటుడిపై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు.. ఇక ఆపేయాలంటూ వార్నింగ్!
మాజీ భార్య తనను వేధింపులకు గురి చేస్తోందంటూ ప్రముఖ మలయాళ నటుడు బాలా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో పాటు మరో యూట్యూబర్పై కొచ్చి పోలీసులను ఆశ్రయించారు. అయితే అతని మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ నటుడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. తనను బాలా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడంటూ ఎలిజబెత్ ఉదయన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై నటుడు బాలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. అంతకుముందే నటుడి భార్య కోకిల సైతం తన భర్తపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎలిజబెత్ను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.బాలా వీడియోలో మాట్లాడుతూ.."దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. ఈ వివాదంపై ఇది నా చివరి వీడియో కావాలని కోరుకుంటున్నా. ప్రియమైన ఎలిజబెత్.. మీ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం మీరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది సోషల్ మీడియా అటెన్షన్ కాదు.. ఈ సమయంలో మీకు వైద్యం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నట్లయితే సరైన వైద్యం తీసుకోండి. లేదంటే మీ సోదరులు, తల్లిదండ్రులతో కలిసి వైద్యుని వద్దకు కెళ్లండి. తనపై తప్పుడు ప్రచారం మానేయండి. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకాడను' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నటుడు బాలా.. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను 2021లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట విడిపోయారు. అయితే ఈ విషయంలో కొందరు ఎలిజబెత్కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మీవల్లే ఎలిజబెత్ అలా ప్రవర్తిస్తోందని నటుడు బాలాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. -
మలయాళ మెగాస్టార్పై రూమర్స్.. స్పందించిన టీమ్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై ఆయన టీమ్ స్పందించింది. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన స్టార్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో రాస్తూ.. 'ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్" అని స్పష్టం చేశారు.కాగా.. మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. -
మాజీ భార్య వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటుడు
ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య కోకిలపై యూట్యూబర్ అజు అలెక్స్తో కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్ తనను రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులకు వివరించారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై విష ప్రచారం చేస్తోందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని నటుడు బాల ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ అజు అలెక్స్ ఛానెల్లో తనపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారని బాల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 8, 2023లోనే ఎలిజబెత్తో తాను విడిపోయినట్లు బాలా పోలీసులకు వెల్లడించారు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడుతూ..' కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇదో వెబ్ సిరీస్లా సాగుతోంది. నేనేమైనా రేపిస్టునా?, ఒక మహిళపై ఏడాదిన్నర పాటు అత్యాచారం ఎలా చేయగలను? నాకు ఇప్పటికే సర్జరీ జరిగింది. నా శస్త్రచికిత్స సమయంలో ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది' అని బాల అన్నారు. ఓ వ్యక్తితో కలిసి ఆమె తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన భార్య కోకిల మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. -
నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త
మలయాళ నటుడు బాలా (Actor Bala) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నాడు. గతంలో అతడి రెండో భార్య ఆరోపణలు, ఫిర్యాదుల వల్ల పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల మూడో భార్య తనపై సంచలన ఆరోపణలు చేయగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బాలా గతేడాది తన చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం నూరేళ్లపాటు కొనసాగాలని కోరుతూ కోకిల తల్లి తిరుమలలో గుండు కొట్టించుకుంది.వచ్చే ఏడాది బిడ్డతో..'మీ జంటను చూసి చాలామంది కుళ్లుకుంటున్నారు. అందరి కళ్లు మీ పైనే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి తగలకుండా మీ దాంపత్యజీవితం సాఫీగా సాగాలని భగవంతుడిని కోరుకుంటూ తలనీలాలు సమర్పించుకున్నాను' అని కోకిల తల్లి చెప్పుకొచ్చింది. కోకిల నానమ్మ అయితే దంపతులను ఆశీర్వదిస్తూ.. వచ్చే ఏడాది బిడ్డను ఎత్తుకుని రావాలని కోరింది. వీరిద్దరూ బాలాకు ఉంగరం, కోకిలకు ముక్కుపుడకను బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బాలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.బాలాపై ట్రోలింగ్ఇది చూసిన కొందరు బాలాను విమర్శిస్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ నీకు మోక్షం లభించదు. ఈ ప్రపంచంలో సొంత బిడ్డను మోసం చేసిన ఏకైక తండ్రివి నువ్వే.. ముగ్గురు స్త్రీల కన్నీళ్లకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. దీనికి బాలా స్పందిస్తూ..నాపై నెగెటివ్ కామెంట్లు చేసే మిత్రులారా.. నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకెంత కోపం వస్తుందో నాకు తెలుసు. కాబట్టి నా అకౌంట్ను మీరు అన్ఫాలో అయితే సరిపోతుంది. అలా చేయలేకపోతున్నారంటే నా వీడియోలకు మీరు బానిసైపోయారని అర్థం. అయినా నేనెవర్నీ మోసం చేయలేదు అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్ -
కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.తనెవరో చెప్పనుఅయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.చనిపోయానని అనుకున్నారునేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. అరగంటలో అద్భుతంవీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్యకాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో -
అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో
మార్కో సినిమాతో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఈ మూవీలో యాక్షన్ హీరోగా రక్తపాతాన్ని పారించిన ఆయన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన గెట్ సెట్ బేబీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఓ మల్టీప్లెక్స్కు వెళ్లాడు హీరో. అతడిని చూసిన ఓ అభిమాని హీరోకు దగ్గరగా వెళ్లాడు. ఉన్ని ముకుందన్ నడుస్తూ ఉంటే అతడిని వెంబడిస్తూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు.ఫోన్ లాక్కున్న హీరోఅది చూసి సహనం నశించిన హీరో సదరు అభిమాని దగ్గరి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దాన్ని జేబులో పెట్టుకుని కోపంతో అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అభిమాని బతిమాలడంతో ఫోన్ వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకా నయం.. ఫోన్ తీసుకెళ్లిపోలేదులేమీరు హీరోగా ఎదిగే సమయంలో ఎవరైనా మీ అభిమాని అని మీ దగ్గరకు వస్తే సంతోషపడతారు. ఇలా స్టార్డమ్ వచ్చాక మాత్రం ఇరిటేట్ అవుతుంటారు అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరేమో.. హీరోకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో షూట్ చేయాలా? అలా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది.. ఫోన్ను అలాగే తీసుకెళ్లకుండా తిరిగిచ్చేసినందుకు సంతోషించండి. అని కామెంట్లు చేస్తున్నారు. Marco Mode of Unni Mukundan in Real Time.Fan should not take advantage of stars like this.#UnniMukundan#Marco#GetSetBaby pic.twitter.com/mq2AOxLkq2— Deepak Kaliamurthy (@Dheeptweet) February 23, 2025చదవండి: రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత -
గొడ్రాలిని చేసి పిచ్చిదానిగా చిత్రీకరించాడు: నటుడిపై మూడో మాజీ భార్య ఆరోపణలు
మలయాళ నటుడు బాలా (Actor Bala) గతేడాది కోకిలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ జంటగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్యపై అనుచిత కామెంట్లు చేశారు. బాల రెండో మాజీ భార్య, డాక్టర్ ఎలిజబెత్ నటుడిని ప్రలోభపెట్టిందని, అతడు హాస్పిటల్కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు. ఒకవేళ రోగి ప్రపోజ్ చేసినా డాక్టర్గా దాన్ని అంగీకరించకూడదు. కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది. ఇది వైద్య వృత్తికే కళంకం అని కామెంట్స్ చేశారు. దీనిపై ఎలిజబెత్ ఘాటుగా స్పందించింది.అంత డబ్బు లేదునిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. రాజకీయ నాయకుల సపోర్ట్ అసలే లేదు. అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక.. ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నైలోని ఓ పోలీసాఫీసర్ నా పేరెంట్స్కు ఫోన్ చేశాడు. చచ్చిపోదామని ప్రయత్నించాను. నేను నీ భార్య కాదని చెప్తున్నావు. అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.పిచ్చిదాన్నని ప్రచారం..నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పోస్ట్ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది.చిత్రహింసలుమరో పోస్ట్లో.. బాలాను నేను ఫేస్బుక్లో కలిశాను. అతడు నాతో రిలేషన్లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. నా కుటుంబాన్ని కూడా వేధించాడు. తన గురించి చెప్తే వదిలిపెట్టనని గూండాలతో హెచ్చరించాడు. మా బెడ్రూమ్ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. అమ్మాయిలతో ఆడుకున్నాడుడిప్రెషన్లోకి వెళ్లిపోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇదంతా టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను గొడ్రాలినని అందరి ముందు నానా మాటలన్నాడు అని ఫేస్బుక్లో రాసుకొచ్చింది. కాగా బాలా సినీ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తాతయ్యకు అరుణాచల స్టూడియో ఉండగా తండ్రి 350కు పైగా సినిమాలు డైరెక్ట్ చేశాడు. బాలా సోదరుడు శివ కంగువా సినిమాను డైరెక్ట్ చేశాడు. బాలా పర్సనల్ లైఫ్బాలా 2మచ్ అనే తెలుగు సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఇతడు చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చేసి అమృతా సురేశ్ను పెళ్లాడాడు. ఆమెతోనూ విడిపోయిన తర్వాత డాక్టర్ ఎలిజబెత్ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా వదిలేసి ఇటీవలే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో -
ఆ సినిమాలో మోహన్లాల్ నటన నాకు నచ్చలేదు.. కానీ: రాం గోపాల్ వర్మ
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్లు తీసుకున్నాడని అన్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్లో ఎక్కువ టేక్లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్లాల్.. వీర్పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. -
మరో ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంంటంటే?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025 -
మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. విడాకులపై నటి క్లారిటీ
మనవళ్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడమేంటో.. ఇంతకీ కలిసున్నారా? మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా? అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ (Kris Venugopal)పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అతడు మూడుముళ్లు వేసిన నటి దివ్య శ్రీధర్ (Divya Sreedhar)పైనా ట్రోలింగ్ జరిగింది. ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది కాబోలంటూ పలువురూ ఆమెను తిట్టిపోశారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదుగతేడాది నవంబర్లో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మొన్నటిదాకా ముసలాడికి పెళ్లేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఈ రూమర్లపై దివ్య శ్రీధర్ స్పందించింది. ఓ వీడియో రిలీజ్ చేసింది. 'మేము ఎవరి జీవితాల్లోకి తొంగిచూడట్లేదు. ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతిన రాస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం..మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి. చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి. మమ్మల్ని ప్రేమిస్తున్నవారందరికీ థాంక్యూ. ఇప్పుడీ వీడియో చేయడానికి ప్రధాన కారణం.. నా భర్త నాకోసం లిప్స్టిక్, చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు. ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులిస్తున్నాడు. అవన్నీ మీకు చూపించాలని, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు.బహుమతులు చూపించాలనుకున్నా..అది చూసి చాలా బాధేసింది. మేము కలిసే ఉన్నాం.. నా జీవితంలో ఇంత ప్రేమ నేనెప్పుడూ పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాలు కూడబెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమరిచిపోతున్నాను' అని చెప్పుకొచ్చింది. క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్ పాతరమట్టు సీరియల్లో కలిసి నటించారు. గతేడాది ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన వేణుగోపాల్ పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు. దివ్య శ్రీధర్ సీరియల్స్లో విలనిజం పండించే పాత్రలు పోషిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Divya Sreedhar (@divyasreedhar24) చదవండి: చరణ్కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
దసరా విలన్కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన
దసరా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఆయనకు ఓ కేసులో ఊరట లభించింది. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కొచ్చిలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు కొకైన్ సేవించినట్లు సరైనా ఆధారాలు లేవంటూ నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ నైజీరియన్, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. జనవరి 30, 2015న కొచ్చిలోని కడవంత్రాలోని ఒక ఫ్లాట్లో కొకైన్ సేవించారని షైన్ టామ్ చాకోతో పాటు నలుగురు మహిళా మోడల్స్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2015 మార్చిలో బెయిల్ పొందిన తర్వాత అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు.కాగా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాలో చిన్ననంబిగా విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్లో కూడా నటించారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలతో బిజీగా ఉన్నారు.రు. -
మలయాళ చిత్రాలకు కలెక్షన్స్.. అదే ప్రధాన కారణం: సలార్ నటుడు
సలార్ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే తాజాగా మలయాళ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న ఒత్తిడిపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అన్నారు. అందువల్లే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు దోహద పడుతోందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మలయాళ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'మాకు కూడా బాక్సాఫీస్ చాలా ముఖ్యం. సినిమాలు ఆర్థికంగా లాభాలు ఉండేలా చూసుకోవడానికి మాపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బాగాలేని సినిమాలకు కలెక్షన్స్ రావని వారంతా క్లారిటీగా చెప్పారు. ఇటీవల కాలంలో నటుడు ఎవరో, దర్శకత్వం ఎవరనే అనే దానితో సంబంధం లేకుండానే కొన్ని మంచి సినిమాలు వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే మనం కథ పట్ల నిజాయితీగా ఉండటం చాలా అవసరం. చిత్ర నిర్మాతలు, నటులు మనం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే కథను ఎంచుకుంటే.. ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మాకు తెలుసు' అని అన్నారు. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఎల్2: ఎంపురాన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
లక్కీ భాస్కర్ వెరీ లక్కీ.. తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్
లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. టాలీవుడ్లోనే మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి 'ఆకాశంలో ఒకతార' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్బాక్స్ మీడియా బ్యానర్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో నిర్మాత అశ్వనీ దత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్తో పాటు నటీనటుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.Finally a Little Sandhadi…❤️The Legendary Trio comes together to take our Star forward…💫#AakasamloOkaTara Journey Begins…❤️🔥#AOTMovie @dulQuer @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/3OuZlFeqG0— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
ఓటీటీకి మోహన్ లాల్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్(Mohan Lal) నటించిన చిత్రం 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈనెల 22 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు.బరోజ్ 3డీ కథేంటంటే..ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. Step into the magical world of Barroz: The Guardian of Treasures, streaming from January 22nd on Disney+ Hotstar.@mohanlal @antonypbvr @aashirvadcine @santoshsivan @aaroxstudios#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Barroz #Mohanlal #TheCompleteActor #Fantasy… pic.twitter.com/azNNowsbSw— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 20, 2025 -
ఓటీటీకి మోహన్ లాల్ ఫాంటసీ మూవీ.. పార్ట్నర్ ఫిక్స్
మలయాళీ స్టార్ మోహన్లాల్(Mohan Lal) నటించిన లేటేస్ట్ మూవీ 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ ఈ చిత్రంలో కనిపించారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)బరోజ్ 3డీ కథేంటంటే.. ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by Disney+ Hotstar Malayalam (@disneyplushotstarmalayalam) -
ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్
మలయాళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కాల్ చేయలేదని అన్నారు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్ అవసరమైనప్పుడు ఎవరూ సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ..' ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. 2017లో నా సినిమా ధృవ నచ్చితిరమ్(తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాలేదు. కానీ ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం నా సమస్య గురించి ఎవరూ కూడా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్, లింగుసామి లాంటి వ్యక్తులు నా సినిమా చూశారు. విడుదల చేసేందుకు ప్రయత్నిచారు. కానీ వారికి ఉన్న సమస్యల వల్ల వీలుకాలేదు. మరికొందరికి ఈ సినిమా చూపించాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఎవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇప్పటికీ సినిమాని చూడాలని కోరుకుంటున్నందు వల్లే ఇంకా నేను బతికి ఉన్నా.' అని అన్నారు. కాగా.. 2017లో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నచ్చతిరమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్కుమార్, సిమ్రాన్, వినాయకన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ వాసుదేవ్ మేనన్ అసహనం వ్యక్తం చేశారు. గౌతమ్ చాలా సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు.నటుడిగా రాణిస్తున్న డైరెక్టర్గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటనలో దూసుకెళ్తున్నారు. చివరిసారిగా 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్. విడుతలై పార్ట్- 2 చిత్రాలలో కనిపించాడు. అంతే కాకుండా త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నాడు. త్వరలోనే మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. అతని చివరిసారిగా దర్శకత్వం వహించిన 2024 చిత్రం జాషువా ఇమై పోల్ కాఖా ఇంకా విడుదల కాలేదు. -
గత 40 ఏళ్లలో ఎవరూ ఇలా ట్రై చేయలేదు: మోహన్లాల్ కామెంట్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'బరోజ్'(Barroz) ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాను తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్తో పాటు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాను 3డీ వర్షన్లో తెరకెక్కించడం మరో విశేషం. ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో మోహన్ లాల్ తెలుగు సినీఇండస్ట్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)మోహన్ లాల్ మాట్లాడుతూ..'తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. పుష్ప లాంటి పెద్ద సినిమాను మనం చూశాం. తెలుగు ఆడియన్స్ ప్రతి సినిమాను గౌరవిస్తారు. బరోజ్ రిలీజ్ చేస్తున్నందుకు మైత్రి మూవీ మేకర్స్కు ధన్యవాదాలు. గత 40 ఏళ్లలో ఎవరూ ప్రయత్నించని నేటివ్ 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త విధానంలో కథను పరిచయం చేస్తున్నాం. కొత్త ఆలోచనతో బరోజ్ను తీశాం. ఈ సినిమా చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది మీలోని పసితనాన్ని గుర్తు చేస్తుంది.' అని అన్నారు. 'We shot the film as Native 3D which over the 40years nobody has tried. It will enhance the child in you❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine @antonypbvr… pic.twitter.com/KxV2Mt1u1A— YouWe Media (@MediaYouwe) December 24, 2024 'Telugu industry is the biggest film industry and they respect films and deliver blockbusters like #Pushpa2TheRule ❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine… pic.twitter.com/bxplRH2nUu— YouWe Media (@MediaYouwe) December 24, 2024 -
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz— Mohanlal (@Mohanlal) December 11, 2024 -
ఓటీటీలో ఫహాద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'బౌగెన్విల్లా' ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలలో మెప్పించారు పోషిస్తున్నారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ హిట్ మూవీ ఇప్పుడు సోనీ లివ్లో స్ట్రీమింగ్కు రానుంది.'బౌగెన్విల్లా' చిత్రంలో ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, జోతిర్మయి వంటి స్టార్స్ నటించడంతో మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. సోనీలివ్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేకు తాజాగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను అమల్ నీరద్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడని ప్రశంసలు అందాయి. సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే రాబట్టింది. కేరళలో ఎవరూ ఊహించని విధంగా అక్కడి టూరిస్టులు మిసింగ్ అవుతూ ఉంటారు. ఆ కేసులో దాగి ఉన్న సీక్రెట్ను ఏసీబీ డేవిడ్ కోషిగా ఫాహద్ మెప్పించారు. -
ఎనిమిది రాష్ట్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్
మలయాళ స్టార్ మోహన్లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్కు సీక్వెల్గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.మోహన్ లాల్ తన ట్వీట్లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.కాగా.. లూసిఫర్ సీక్వెల్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.That’s a wrap for L2: Empuraan!What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న సైకాలాజికల్ థ్రిల్లర్.. రెండున్నరేళ్ల తర్వాత తెలుగులో!
2018 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు టొవినో థామస్. తాజాగా ఆయన నటించిన సైకాలాజికల్ థ్రిల్లర్ మూవీ నారదన్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి ఫర్వాలేదనిపించింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్లో కేవలం మలయాళంలోనే అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. అన్నా బెన్ హీరోయిన్గా నటించింది. ఓ జర్నలిస్ట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. Every human is a headline!📰Bulletin by Naradhan Very soon!!🤵🏻♂️ #Naradhan Premieres November 29th on aha!#NaradhanOnAha #aha pic.twitter.com/s3PZIm4Gsz— ahavideoin (@ahavideoIN) November 27, 2024 -
పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్.. అల్లు అర్జున్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహించారు. నగరంలోని లివా మాల్ గ్రాండ్ హయత్లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రష్మిక' అని అన్నారు.సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్లాల్ షెకావత్గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు. A Special surprise coming your way 💥💥💥Get ready for the Mass Blast🎧🔥Watch #PushpaRulesKeralam Event Live now... For the Blasting Surprise ❤️🔥❤️🔥- https://t.co/QdHDdVrAj9#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్నేమ్తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.దంపతులపై ట్రోలింగ్ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వేణుగోపాల్ను, నటి దివ్య శ్రీధర్ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.కుటుంబానికి కూడా దూరంక్రిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.అందుకే రెండో పెళ్లి2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్ వేణుగోపాల్ పాతరమట్టు సీరియల్లో తాతగా నటించాడు. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన ఇతడు పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి.. -
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్హిట్గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం నాడు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సినిమా..కాగా టీపీ మాధవన్ 40 ఏళ్ల వయసులో సినీ కెరీర్ ఆరంభించారు. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన మాల్గుడి డేస్ సినిమాలో చివరిసారిగా నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సీరియల్స్లో విలన్, కమెడియన్, సహాయక నటుడిగా మెప్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ'కు మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా పని చేశారు.చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో? -
'అ చిత్రాలు చూడాలంటూ.. డైరెక్టర్పై నటి సంచలన ఆరోపణలు'!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా మలయాళ డైరెక్టర్పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్బుక్ పోస్ట్లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.అయితే గతంలోనూ ఫేస్బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది. -
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్గా స్టిల్ ఇచ్చినా సూపర్గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్ను కొట్టడం వల్లే!
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు. -
తనపై లైంగిక ఆరోపణలు.. చట్టపరంగానే ఎదుర్కొంటా: నటుడు జయసూర్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్లాల్తో సహా అందరూ రాజీనామాలు చేశారు. -
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
మాలీవుడ్లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్
'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్. స్వతహాగా ఎడిటర్ అయిన ఇతడు.. మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే జూలై 27న రాత్రి ఇతడు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటిది నెలలోనే పూర్తిగా కోలుకున్న సంగీత్ ప్రతాప్.. ఇన్ స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)'గత నెలలో ఇదే రోజున కారు ప్రమాదం జరగ్గానే నా జీవితం తలక్రిందులైంది. తొలుత నాకు ఏం కాలేదని అనుకున్నా. కానీ నర్స్ వచ్చి చెప్పిన తర్వాత నేనెంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడ్డానో అర్థమైంది. ఆ రోజు నుంచి నాలో బాధ, భయం, డిప్రెషన్ ఇలా చాలా ఎమోషన్స్కి గురయ్యాను. ఈ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంతకుముందు భవిష్యత్ గురించి చాలా భయాలుండేవి. కానీ జీవితం మనం కంట్రోల్లో ఉండదని అర్థమైంది. నచ్చినట్లు బ్రతికాలని ఫిక్స్ అయ్యాను''ఇన్ని రోజులు కంటికి రెప్పలా చెప్పాలంటే ఓ పిల్లాడిలా నన్ను చూసుకుంది నా భార్య. దీనికి బదులుగా ఆమెకు ఎంత ప్రేమ తిరిగిచ్చినా తక్కువే. తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వాళ్లు చెప్పిన మాటలు, మెసేజులు వల్ల నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అలా ఈ రోజు మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. నాకెంతో ఇష్టమైన సెట్కి వెళ్లిపోయాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. కొన్నిరోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని సంగీత్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్హిట్ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
7వ తరగతి పరీక్షలు రాసిన 68 ఏళ్ల నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్.. ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అది కూడా 68 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇతడు.. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో టైలర్గా మారిపోయాడు. స్కూల్ కి వెళ్లకపోయినప్పటికీ.. చదువుకోవడం నేర్చుకున్నాడు. అలా పెద్దయిన తర్వాత నటుడిగా మారాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)1980 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో ఇంద్రన్ నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన '2018' అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.ఇక 10వ తరగతి పాస్ కావాలనే కోరిక ఇంద్రన్కి కలిగింది. ఇది జరగాలంటే తొలుత 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో చదువుకోవాలని ఇతడి ఉత్సాహాన్నfి చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..) -
ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ!
వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్కి చేరుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం..
ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖికి వారసుడొచ్చాడు. ఆయన కుమారుడు, నటుడు షాహీన్- డాక్టర్ అమృత దంపతులు జూలై 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించారు. మా ఇల్లు పెద్దదైపోయింది. మా కుటుంబంలోకి చిన్నారి దువా షాహీన్ వచ్చేసింది అని అమృత ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కాగా షాహీన్, అమృత 2022 మార్చిలో పెళ్లి చేసుకున్నారు.ఇదిలా ఉంటే సిద్ధిఖి పెద్ద కుమారుడు రషీన్ (37) శ్వాసకోస సమస్యలతో జూన్లో కన్నుమూశాడు. ఈయన బాల్యం నుంచి బుద్ధిమాంధ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లోనివారంతా ఈయన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. ముద్దుగా సప్పి అని పిలుచుకుంటారు. అమాయకంగా తిరుగుతూ కనిపించే రషీన్ జూన్ 27న కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో మరణించాడు. ఇతడి మరణంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా షాహీన్ సిద్దిఖి.. పతేమరి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. శశియుమ్ శాంకుతలయుమ్, ఒరు కడతు నాదన్ కద, శేషం మైక్ ఇల్ ఫాతిమా, కద పరంజ కద, కసాబా వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: సీరియల్స్, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 'ప్రేమలు' నటుడు
మలయాళ నటులు అర్జున్ అశోకన్, సంగీత్ ప్రతాప్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎమ్జీ రోడ్డుపై వెళ్తున్న వీరి కారు రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు, నటుడు అర్జున్కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగంలో కూర్చున్న నటుడు సంగీత్ మెడకు ఫ్రాక్చర్ అవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బైక్పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కారు యాక్సిడెంట్బ్రొమాన్స్ సినిమాలోని ఛేజింగ్ సీన్ చిత్రీకరించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్లో కారు వెనకభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో షూటింగ్ను తాత్కాలికంగా ఆపేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.సినిమా..అర్జున్ అశోకన్.. ఈ ఏడాది అబ్రహాం ఒజ్లర్, భ్రమయుగం, వన్స్ అపాన్ ఎ టైమ్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం బ్రొమాన్స్ సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. సంగీత్ ప్రతాప్.. హృదయం, ప్రేమలు సినిమాలతో అలరించాడు.చదవండి: మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్ -
ఓటీటీకి మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్గా మెప్పించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెలల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ഒരു മാസ്സ് ആക്ഷൻ മമ്മൂട്ടി ചിത്രം!ടർബോ ഓഗസ്റ്റ് 9 മുതൽ Sony LIVൽA mass action entertainer starring Mammootty opposite Raj B Shetty!Turbo, coming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth pic.twitter.com/LZ88S0wOxq— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్లో పుష్ప విలన్.. ఓకే చెప్పేస్తారా?
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫాహద్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలోనూ కనిపించనున్నారు. పుష్ప-2తో పాటు రజినీకాంత్ వెట్టాయన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఫాసిల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కూలీ మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి రజినీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టాయన్లో రజినీకాంత్, ఫాహద్ ఫాజిల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఫాహద్ ఫాజిల్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ 'వెట్టాయన్', అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్తో పాటు తమిళంలో మారీసన్, మలయాళంలో 'ఒడుమ్ కుతిర చదుమ్ కుతిరా', 'బౌగెన్విల్లా' 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాల్లో నటిస్తున్నారు. మరీ ఈ చిత్రాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కాగా.. లోకేష్ కనగరాజ్ 'కూలీ' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రారంభమైంది. -
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024 -
ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!
మలయాళీ ప్రముఖ నటుడు కూటికల్ జయచంద్రన్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. తన నాలుగేళ్ల కూతురిని ఈ నటుడు లైంగికంగా వేధించాడని ఓ మహిళ.. కోజికొడ్లోని కసాబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలానే దీని నుంచి తప్పించుకునేందుకు మరో విషయం తెరపైకి తీసుకొచ్చాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)మరోవైపు పోలీసులు.. ఇప్పటికే నాలుగేళ్ల చిన్నారి దగ్గరకెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆ చిన్నారి ఏం చెప్పింది అనే విషయాల్ని మాత్రం బయటపెట్టలేదు. అలానే నటుడు జయచంద్రన్ని అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలిసి రావట్లేదు. టీవీ ప్రోగ్రామ్స్, స్టేజీ ఫెర్ఫార్మెన్స్లతో గుర్తింపు తెచ్చుకున్న జయచంద్రన్.. రీసెంట్ టైంలో అయితే 'దృశ్యం 2' సినిమాలో నటించాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్ గోపి. అవును మరి! 1952లో లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రాణం కాపాడుఈ సక్సెస్తో సురేశ్ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గుండెలో గూడు కట్టుకున్న బాధగాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!జూన్ నెలలోనే..అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.రాజకీయ నేపథ్యం..సురేశ్ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?
నటుడు విధార్ధ్, వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం అంజామై. ఈ చిత్రం ద్వారా ఎస్వీ.సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ప్రముఖ వైద్యుడు, ర చయిత తిరునావుక్కరసు నిర్మాతగా తిరుచిత్రం పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం విడుదల హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పొందడం విశేషం. ఈ సంస్థ ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.చిత్ర దర్శకుడు సుబ్బురామన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం పరిస్థితుల ప్రభావంతోనే రూపొందిందని చెప్పాలన్నారు. ఈ చిత్ర నిర్మాత తిరునావుక్కరసు ఒక వైద్యుడు మాత్రమే కాకుండా, రచయిత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాల్సిఉందని.. అందుకు ఆయన ఒప్పుకున్నా, అనివార్య కారణాల వల్ల ఆ పాత్రలో నటుడు రఘమాన్ను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అందుకు ఈ సందర్భంగా మమ్ముటికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. అయితే ఆ పాత్రలో రఘుమాన్ చాలా బాగా నటించారని చెప్పారు. చట్టం చేసే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక సామాన్యుడు ఎలాంటి బాధలకు గురయ్యారనేదే ఈ చిత్ర కథాంశం అని చెప్పారు. విధార్ద్ మంచి నటుడన్నది తెలిందేననీ, అయితే ఆయన నుంచి మరింత నటనను వెలికి తీసినట్లు చెప్పారు. ఇక నటి వాణీభోజన్ ఈ చిత్రంలో మరో కోణంలో నటించారని చెప్పారు. నటి వాణిభోజన్ మాట్లాడుతూ అంజామై తనకు చాలా స్సెషల్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటుడు రఘుమాన్, కృతిక్ మోహన్, బాలచంద్రన్ ఐఏఎస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఛాయాగ్రహణం, కళాచరణ్ నేపథ్య సంగీతాన్ని అందించారు. -
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు. -
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్ సడన్గా షాకిచ్చాడు. ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు.తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్ఫామ్లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్లోడ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారుస్పందించిన టొవినో థామస్సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ నటుడు, పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆవేశం. గతనెల 11న మలయాళంలో రిలీజైన చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో హిట్ అయిన తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం.. త్వరలోనే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.భారీ ధరకు ఓటీటీ డీల్సూపర్ హిట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లను చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ చిత్రంగా ఆవేశం రికార్డు దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాను రూ.30 కోట్లతో తెరకెక్కించారు. college, gangsters, mayhem, and a whole lot of unexpected! 🤪#AaveshamOnPrime, watch nowhttps://t.co/6L4qK9PLeR pic.twitter.com/rAIbvGXE9S— prime video IN (@PrimeVideoIN) May 8, 2024 -
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
మలయాళ స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్స్టార్గా రాణిస్తున్న మోహన్లాల్ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లిడియన్ సంగీతం అందిస్తున్నారు.#Barroz Releasing On September 12,2024 ( Onam Release)A Film By @Mohanlal 💥 pic.twitter.com/fJsh3OwDew— Akshay 𓃵 (@Akshayk_2255) May 6, 2024 -
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్ బ్లాక్ చేశాడు: హీరోయిన్
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నటుడి సాహసం.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం 'ఆడుజీవితం: ది గోట్ లైఫ్'. బ్లెస్సీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో మరో నటుడు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో హకీమ్ అనే పాత్రలో కేఆర్ గోకుల్ కనిపించారు. అతని శరీరం పూర్తిగా బక్కచిక్కపోయినట్లుగా ఈ సినిమాలో కనిపించారు. తాజాగా తన బాడీని అలా మార్చేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లాగే గోకుల్ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆహారం తినకుండా ఉన్నట్లు వెల్లడించారు. గోకుల్ మాట్లాడుతూ..'హకీమ్ పాత్ర కోసం బరువు తగ్గడానికి ప్రయోగాలు చేశా. ఆ పాత్రను వాస్తవికంగా పోషించడంలో నాకు సహాయపడింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా దెబ్బతీసింది. కేవలం నీళ్లు తాగి బతికా. దీంతో బాడీలోని కేలరీలను క్రమంగా తగ్గించుకున్నా. 15 రోజులుగా ఏం తినకుండా కేవలం బ్లాక్ కాఫీ తాగాను. దీంతో మూడో రోజే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం, స్నేహితులు చాలా బాధపడ్డారు. ఇది నిజంగా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆడుజీవితం సెట్స్లో నేనే అందరికంటే చిన్నవాడిని' అని అన్నారు. పృథ్వీరాజ్తో అనుభవం గురించి మాట్లాడుతూ..'షూటింగ్ సమయంలో అందరూ నన్ను తమ కొడుకులా చూసుకున్నారు. ఆ విధమైన శ్రద్ధ ఎల్లప్పుడూ సెట్స్లో సౌకర్యవంతంగా ఉండేందుకు సహాయపడింది. మనం సౌకర్యవంతంగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా పని చేయగలం. పృథ్వీరాజ్ నన్ను కొత్తవాడిగా కాకుండా సహానటుడిగా చూశాడు. నువ్వు నాలాగే బాగా పని చేస్తున్నావు అని నాతో చెప్పాడు' అని పంచుకున్నారు. కాగా.. బెన్యామిన్ రచించిన 2008 నవల ఆడుజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1990ల్లో పని కోసం గల్ఫ్కు వలస వెళ్లిన కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇటీవలే ధియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్గా పనిచేస్తున్న రోహిత్ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
రెండో భర్తకు విడాకులిచ్చిన నటి
ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై విడాకులు తీసుకుంది. 24 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్కు విడాకులిచ్చింది. ఈ విషయాన్ని వాసుదేవ్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. '2020వ సంవత్సరం నుంచి మంజు, నేను విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకుల ప్రక్రియ పూర్తయింది. తను ఇప్పుడు నాకు భార్య కాదు. అయితే మా మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుంది. తనను నా స్నేహితురాలిగానే భావిస్తాను. ప్రస్తుతం మంజు కెరీర్ గొప్ప స్థాయిలో ఉంది. క్లోజ్ ఫ్రెండ్ సక్సెస్ అవుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది' అని చెప్పుకొచ్చాడు. ఇది రెండోసారి కాగా మంజు గతంలో నటుడు ముకుందన్ మీనన్ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2000వ సంవత్సరంలో మంజు.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా దయ అనే కూతురు పుట్టింది. గత కొంతకాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుండగా ఇన్నాళ్లకు అవి నిజమేనని ధ్రువీకరించాడు వాసుదేవ్. కెరీర్ సాగిందిలా 1992లో నట ప్రస్థానం ఆరభించింది మంజు పిళ్లై. గోలంతర వార్త, నీ వరువోళం, ఆయుష్మాన్ భవ, నింజగల్ సంతుస్తరను, మిస్టర్ బట్లర్, రావణప్రభు, తేజ్ భాయ్ అండ్ ఫ్యామిలీ, లవ్ 24x7, ఓ మై డార్లింగ్, ద టీచర్, జయ జయ జయ జయహే తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. వాసుదేవ్ విషయానికి వస్తే కేరళ కేఫ్ చిత్రంతో సినిమాటోగ్రాఫర్గా ప్రయాణం మొదలుపెట్టాడు. అయాల్, మెమొరీస్, దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు. తెలుగులో మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు పని చేశాడు. చదవండి: OTT: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నడవలేని స్థితిలో నటుడు..
మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) బస్సు ఆయనను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. తలకు, కాలికి బలమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా నటి బీనా ఆంటోని.. కార్తీక్ హెల్త్ అప్డేట్ వెల్లడించింది. 'కార్తీక్ పరిస్థితి ఎలా ఉందని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. నిజంగా తన పరిస్థితి ఏమీ అంత బాగోలేదు. నడవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది. అక్కడ మాంసం ముద్ద కూడా లేదట! ఇప్పటికే రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇంకా చేయాలంటున్నారు. కార్తీక్తో మాట్లాడలేదు కానీ అతడి భార్యతో మాట్లాడాను. భరించలేనంత నొప్పి ఉండటంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారట!' అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. https://t.co/zHnUR7TwM4 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024 -
నటిని పెళ్లాడిన టైగర్ నాగేశ్వరరావు విలన్.. వీడియో వైరల్!
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే మూడు నెలలు పెళ్లిళ్లు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లి కళ మొదలైంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, నటి అమర్దీప్ కౌర్ను పెళ్లాడారు. గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు.. తాజాగా కేరళ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం స్థానిక గురువాయూర్ ఆలయంలో ఈ జంట పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు చెబుతున్నారు. కాగా..సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతా దక్షిణాదిలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితన్ ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) -
డైరెక్ట్గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహన్లాల్, లిజో కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్గా నిలిచింది. మోహన్లాల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే రిలీజైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్కు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని లేటేస్ట్ టాక్. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
మెగాస్టార్ సరికొత్త హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విలన్లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్లు, హీరోలు అనే కాన్సెప్ట్ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్బ్యాక్లను బ్లాక్ అండ్ వైట్లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు. -
హీరోయిన్తో స్టార్ హీరో పెళ్లి?
మలయాళంలోని హ్యాండ్సమ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ ఒకరు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి, యశోద సినిమాలతో తెలుగువారికీ ఈయన సుపరిచితుడయ్యాడు. 36 ఏళ్ల వయసున్న ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అనుశ్రీతో కొత్త జీవితం ఆరంభించబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఓ ఈవెంట్లోనూ కలిసి కనిపించడంతో ఇది నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వార్తలపై ఉన్నిముకుందన్ స్పందించాడు. తన పెళ్లి గురించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. 'ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా ఆపడానికి నీకెంత డబ్బివ్వాలో చెప్పు..' అని మండిపడ్డాడు. దీంతో హీరోహీరోయిన్ల పెళ్లంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. చదవండి: మొదటి భార్యకు అందుకే విడాకులు.. ఆమె రెండో భర్త నా కొడుకును.. -
దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!
మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కేడీ జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 29న మరణించాడు. తనను చివరి చూపు చూసుకోవడానికి, అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు, బంధువులెవరూ ముందుకు రాలేదు. రెండు వారాలుగా మార్చురీలోనే ఆయన శవం కుళ్లిపోతోంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వ జోక్యంతో సంక్రాంతి పండగరోజే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సొంతిల్లు.. వెళ్లడానికి డబ్బు లేదు జార్జ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ నిర్మాత జి. శిబు సుశీలన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. '1993లో ఏవీఎమ్ స్టూడియోలోని ఎడిటింగ్ రూమ్లో తొలిసారి జార్జ్ను కలిశాను. సినిమాలపై ఆసక్తితో అతడు చెన్నై నుంచి కేరళ వచ్చేశాడు. గంభీరమైన కంఠంతో మాట్లాడే అతడి స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరు గడించాడు. తనకు చెన్నైలో సొంతిల్లు ఉంది. కానీ అక్కడికి వెళ్లడానికి డబ్బు లేదని ఆయన నాతో చెప్పిన మాట నాకింకా గుర్తుంది. సినిమాల ద్వారా తనకు పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. సొంతింటికి వెళ్లి బతకాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. డిసెంబర్ 27న ఆస్పత్రిలో.. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫెఫ్కా(డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్) వంటి కొన్ని సంస్థల సాయం వల్ల బతుకుబండి లాగించాడు. ఆ తర్వాత తిరిగి సినిమా ప్రాజెక్టులు చేశాడు. డిసెంబర్ 27 సాయంత్రం అతడు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందింది. వెంటనే మా యూనియన్తో మాట్లాడి తనకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించాం. వెంటనే అతడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కానీ తను పోరాటం చేసీచేసీ అలిసిపోయాడు. అనాథ శవంలా.. డిసెంబర్ 29న కన్నుమూశాడు. అతడు చనిపోయి 16 రోజులపైనే అవుతున్నా తన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అంత్యక్రియల బాధ్యతను భుజానెత్తుకుంది. కానీ అనాథ శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. బంధువులు ఎవరో ఒకరు వస్తేనే మృతదేహాన్ని అప్పజెప్తామంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జనవరి 15న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి' అని తెలిపాడు. చదవండి: చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్ రిలీజ్.. -
కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు. గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. -
సూపర్స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది: స్టార్ హీరోయిన్
కోలీవుడ్లో 'సూపర్స్టార్' అనే హోదాపై ఇటీవల పెద్ద రచ్చే జరిగింది. దాదాపు 40 ఏళ్లుగా సూపర్స్టార్ అనే పట్టం రజనీకాంత్ని అంటిపెట్టుకుని వస్తోంది. అలాంటిది ఇటీవల కాలంలో స్టార్ హీరో విజయ్కు ఆ ట్యాగ్లైన్ కరెక్ట్ అనే ప్రచారాన్ని ఒక వర్గం తెరపైకి తెచ్చింది. ఒక రకంగా రజనీకాంత్ పని అయిపోయింది. ఇప్పుడు అసలైన సూపర్స్టార్ విజయ్ అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఇటీవల అక్కడి టీవీ ఛానళ్లలో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ సూపర్స్టార్ అనేది ఒక తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ నటులకు అభిమానులు కట్టిన పట్టం. అలాంటి సూపర్స్టార్ పట్టం గురించి దూత వెబ్ సీరిస్లో మెప్పించిన నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళంలో 'పూ' చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమై.. ఆ తరువాత ధనుష్ సరసన మరియాన్, కమలహాసన్తో ఉత్తమ విలన్, అదేవిధంగా శరత్కుమార్ నటించిన చైన్నెయిల్ ఆరు నాళ్, రానా, బాబి సింహా తదితరులు నటించిన బెంగళూరు నాట్కల్, శివరంజ, నియుమ్ ఇన్ముమ్ సిల పెంగుళుమ్ వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించారు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తంగలాన్' చిత్రంలో విక్రమ్తో కలిసి నటించారు. వీటితో పాటు నాగ చైతన్యతో 'దూత' అనే వెబ్సిరీస్లో క్రాంతి షెనాయ్గా ఆమె మెప్పించారు. ఇలా సెలెక్టడ్ చిత్రాల్లోనే నటిస్తున్న పార్వతి మలయాళంలోనే సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల ఒక భేటీలో సూపర్స్టార్ పట్టం గురించి మాట్లాడుతూ సూపర్స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది అని ప్రశ్నించారు. అది జస్ట్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమేనని, దాని వల్ల ఎవరికీ ప్రయోజనం అని ప్రశ్నించారు. అసలు సూపర్స్టార్ అంటే ఏమిటో తనకు అర్థం కాలేదని, దాని వల్ల ఇమేజ్ వస్తుందా అన్నది కూడా తెలియటం లేదన్నారు. తనను సూపర్స్టార్ అనడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడమే సంతోషం అని పేర్కొన్నారు. తనకు తెలిసి మలయాళంలో ఫాహత్ ఫాజిల్, ఆసిఫ్ అలీ, నటి రామీ కళింగల్ సూపర్ యాక్టర్స్ అని నటి పార్వతి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
నటుడికి ముఖంలో పక్షవాతం.. గుండు గీయించుకున్న భార్య
బెల్స్ పాల్సీ.. దీన్నే ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. ముఖంలో పక్షవాతంలా రావడంతో ఈ వ్యాధి చాలా ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల ముఖంలో ఒకవైపు కండరాలు సరిగా పని చేయవు. దీంతో ముఖం వంకరగా కనిపిస్తుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. మలయాళ నటుడు, యాంకర్ మిథున్ రమేశ్ కొంతకాలం క్రితం ఇదే వ్యాధితో బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయనకు త్వరగా నయమైతే ఏడుకొండలు వచ్చి గుండు కొట్టించుకుంటానని మిథున్ భార్య లక్ష్మి.. తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకుంది. గుండు గీయించుకున్న భార్య ఈ వ్యాధి నుంచి మిథున్ దాదాపు బయటపడటంతో ఇటీవలే తిరుపతిలో తలనీలాలు సమర్పించుకుంది. తాను మొక్కుకున్నట్లుగానే గుండు గీయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'బెల్స్ పాల్సీ వ్యాధి వల్ల నేను ఎంత ఇబ్బందిపడ్డానో మీకు తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. నా భార్య అయితే ఆ భగవంతుడిని ప్రార్థించని రోజంటూ లేదు. ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్ ఈ వ్యాధి నుంచి బయటపడితే తలనీలాలు ఇస్తానని తిరుపతి దేవుడికి మొక్కుకుంది. ఇదిగో ఇప్పుడు ఆ మొక్కు తీర్చేసుకుంది. ఇంతకంటే ఆమెను నేను ఏమని అడిగాలి. ఇంతటి ప్రేమ, త్యాగం, నమ్మకం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ మిథున్పై అతడి భార్యకు ఎంత ప్రేముందో అని కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Mithun (@rjmithun) చదవండి: అందరూ హెచ్చరించారు.. క్షణాల్లో జరిగిపోయింది.. వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్ -
స్టార్ కమెడియన్ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..
కమెడియన్స్ అనగానే చాలామందికి మగవారి పేర్లే గుర్తొస్తాయి. కానీ ఓ నటి మాత్రం వెండితెర మీద మేల్ కమెడియన్స్కు గట్టిపోటీనిచ్చింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరే ఫిలోమినా.. మలయాళంలో ఫేమస్ నటి. సుమారు 750కు పైగా చిత్రాల్లో నటించింది. సహాయ పాత్రలు, కామెడీ రోల్స్, తల్లి, అమ్మమ్మ పాత్రలు చేసింది. గాడ్ఫాదర్ సినిమాలో అనప్పర అచ్చమ్మగా నటించి ఏడిపించింది కూడా! మాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈమె 2006లో చెన్నైలో తన కుమారుడు జోసెఫ్ ఇంట్లో కన్నుమూసింది. ఆమె మరణం తర్వాత తన కుటుంబం ఎక్కడుంది? ఏం చేస్తుందన్న వివరాలే రాలేదు. ఆస్తిలో ప్రియుడికి వాటా అయితే తాజాగా మలయాళ సినీప్రియులు బాధపడే విషయం వెలుగులోకి వచ్చింది. ఫిలోమినా పార్ట్నర్ రామ్సే ఫ్లూయెర్ అలియాస్ సన్నీ (82) అనాధాశ్రమంలో చేరాడు. నటి, ఆమె మొదటి భర్తకు పుట్టిన కొడుకు ఉన్నప్పటికీ ఒంటరివాడయ్యాడు. నిజానికి ఫిలోమినా చనిపోయేముందు తన ఆస్తిలో కొంత భాగాన్ని సన్నీకి రాసిచ్చింది. ఎందుకో కానీ ఇంతవరకు అది అతడికి దక్కనేలేదు. నటి మరణించాక అతడిని పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. దివంగత స్టార్ హీరో ప్రేమ్ నజీర్ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పని చేసిన ఇతడు సదరు హీరో పాత సినిమాలను వివిధ ఛానెల్స్కు అమ్ముకుంటూ దాని మీదే బతుకుతున్నాడు. అందరికీ భారమయ్యానని.. అతడికున్న ఏకైక ఆస్తి.. ప్రేమ్నజీర్ ఇచ్చిన ఇల్లు, ప్లాట్.. దాన్ని కూడా అతడి సోదరి లాగేసుకుంది. అప్పుడప్పుడు తన ఇంటికి తానే అతిథిగా వెళ్తుండేవాడు. కానీ, ఓ నాలుగు రోజులు ఎక్కువ ఉంటే ఈయన ఎప్పుడు వెళ్తాడా? అని ఎదురుచూసేవారట. డబ్బుల్లేని తాను కొడుక్కి, కుటుంబసభ్యులకు.. అందరికీ భారమయ్యానని గ్రహించిన సన్నీ అందరికీ దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. చెన్నైలోని గాంధీభవన్ వృద్ధాశ్రమంలో చేరిపోయాడు. ఈ ఆశ్రమంలో తన స్నేహితులు, నటులు చంద్రమోహన్, టీపీ మాధవన్ వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వారితోనే శేష జీవితం గడిపేస్తానంటున్నాడు సన్నీ. భర్త మరణంతో సన్నీకి దగ్గరైన నటి నిజానికి ఫిలోనిమా 1956లో థియేటర్ ఆర్టిస్ట్ ఆంటోనీని పెళ్లి చేసుకుంది. వీరికి జోసెఫ్ అని కుమారుడు జన్మించాడు. వివాహమైన నాలుగేళ్లకే ఆంటోని మరణించాడు. ఆ తర్వాత సన్నీతో ప్రేమలో పడిన ఫిలోనిమా అతడితో సహజీవనం చేసింది. చివరి శ్వాస వరకు అతడితోనే కలిసి ప్రయాణించింది, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. చదవండి: యానిమల్లో రణ్బీర్కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్ కంటే తక్కువేం కాదు! -
కటిక పేదరికం వల్ల ఆగిన చదువు.. 67 ఏళ్ల వయసులో బడికెళ్తున్న నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రాన్ పదో తరగతి పరీక్షకు సంసిద్ధమవుతున్నాడు. పేదరికం వల్ల బాల్యంలో చదువుకు దూరమయ్యానని అందుకే ఇప్పుడు మళ్లీ బడి బాట పట్టానంటున్నాడు. 67 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసి పాస్ అయి చూపిస్తానంటున్నాడు. చిన్నతనంలో ఆపేసిన చదువును ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నాడు. ప్రతి ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరువుతున్నానని, వచ్చే ఏడాది పరీక్షలకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నానని తెలిపాడు. ఎవరీ ఇంద్రాన్స్.. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఇంద్రాన్స్ చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అతడి ఇంట ఏడుగురు సంతానంలో ఇంద్రాన్స్ మూడోవాడు. చదువుకునే స్థోమత లేక నాలుగో తరగతికే బడికి వెళ్లడం మానేశాడు. కటిక పేదరికం వల్ల విద్యకు ఫుల్స్టాప్ పెట్టి ఏదైనా పని చేయాలనుకున్నాడు. తన అంకుల్ దగ్గర దుస్తులు కుట్టడం నేర్చుకున్నాడు. మరోపక్క నాటకాలు కూడా నేర్చుకున్నాడు. 'కలివీడు' అనే సీరియల్తో తన కెరీర్ను మొదలుపెట్టాడు. అటు తన సోదరుడు జయకుమార్తో కలిసి కేరళలోని కుమారపురంలో ఇంద్రాన్స్ బ్రదర్స్ అనే టైలర్ షాప్ ప్రారంభించాడు. కమెడియన్గా వందలాది సినిమాలు 1981లో 'చూతట్టం' అనే సినిమాతో మలయాళ వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గానూ పని చేశాడు. అలా కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తూ చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయాడు. 'సీఐడీ ఉన్నికృష్ణన్ బీఏ, బీఎడ్' సినిమాతో పాపులర్ అయ్యాడు. కమెడియన్గా వందలాది చిత్రాలు చేశాడు. హోమ్ సినిమాకుగానూ జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. చదవండి: డాక్టర్ బాబు మాస్టర్ మైండ్.. షాకైన శివాజీ, రైతుబిడ్డ.. ఇదే కంటిన్యూ అయితే టాప్ 5! -
కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు
కొచ్చి: పాపులర్ మళయాల నటుడు వినోద్ థామస్(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కేరళలోని పంపడిలోని ఓ హోటల్లో పార్క్ చేసి ఉన్న కారులో ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చాలా సేపటి నుంచి హోటల్ ఆవరణలో ఉన్న కారులో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూశామని పోలీసులు చెప్పారు. హోటల్కు చేరుకున్న వెంటనే కారులో పడి ఉన్న వినోద్ థామస్ను ఆస్పత్రికి తరలించామని, అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామన్నారు. అయ్యప్పనుమ్ కోష్యుమ్, నథోలి, ఒరు చెరియ మీనల్ల, ఒరు వంత్ పాతాయా, హ్యాప్పీ వెడ్డింగ్, జూన్ లాంటి పాపులర్ సినిమాల్లో వినోద్ థామస్ నటింంచారు. ఇందులో అయ్యప్పనుమ్ కోష్యుమ్ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఇదీచదవండి.. ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్ను గెలిపించమ్మా’ -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా వచ్చిన ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. (ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!) కథ ఏంటంటే.. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్కు సవాల్గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది. -
'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో వీళ్ల ప్రేమ పెళ్లా, పెద్దల కుదిర్చిన సంబంధమా అని తెగ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!) మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో విలన్ కొడుకుగా నటించాడు. ఇది కాకుండా బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. మరోవైపు టీవీ షోల హోస్ట్గానూ రాణిస్తున్నాడు. నటుడిగా పేరు తెచ్చుకున్న పద్మసూర్య.. సీరియల్ బ్యూటీ గోపిక అనిల్తో నిశ్తితార్థం చేసుకున్నాడు. అయితే వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమని స్వయంగా పద్మసూర్యనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇకపోతే జంట చూడచక్కగా ఉందని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే డిసెంబరులో వీళ్ల పెళ్లి ఉండొచ్చని అంటున్నారు. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) View this post on Instagram A post shared by Govind Padmasoorya (GP) (@padmasoorya) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ కన్నుమూశారు. కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. (ఇది చదవండి: విక్రమ్ కొత్త సినిమా.. చిన్నా మూవీ డైరెక్టర్తో..) కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియాలో రాస్తూ.. "కుందర జానీ నా చిరకాల మిత్రుడు. అతను మలయాళ చిత్రసీమలో 45 ఏళ్లకు పైగా చురుకుగా ఉన్నారు. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించాడు. కొల్లంలోని సాంస్కృతిక, సామాజిక వేదికల్లో నిరంతరం చురుకుగా ఉండే కుందర జానీ మృతికి నా సంతాపం తెలియజేస్తున్నా.' అని పోస్ట్ చేశారు. కాగా.. 1979లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన కుందర జానీ మలయాళ చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు పోషించినందుకు గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో విడుదలైన మెప్పడియాన్ ఆయన చివరి చిత్రం. అవన్ చండీయుడే మకన్, భార్గవచరితం మూన్నం ఖండం, బలరామ్ వర్సెస్ తారదాస్, తచ్చిలేదత్ చుండన్, సమంతారం, వర్ణప్పకిట్ట్, సాగరం సాక్షి, ఆనవల్ మోతిరమ్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. కధయిలే రాజకుమారి, నిలవుం నక్షత్రాలుమ్, సీబీఐ డైరీ అనే మలయాళ సీరియల్స్లో కూడా కనిపించారు. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) -
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న సమరా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన తాజా చిత్రం సమరా. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి చార్లెస్ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. బజరంగీ భాయిజాన్, జాలి ఎల్ఎల్బీ 2, విశ్వరూపం -2 చిత్రాలతో ఫేమస్ అయిన నటుడు మీర్ సర్వార్ ప్రతి నాయకుడిగా నటించారు. చిత్ర పురాణం దర్శకుడు మాట్లాడుతూ.. రెహ్మాన్ వైవిధ్య కథ పాత్రలను ఎంచుకొని నటిస్తున్నారని కొనియాడారు. అలా ఆయన నటించిన తాజా చిత్రమే సమరా అని పేర్కొన్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించిన ఇందులో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాలను అలరిస్తుందని అన్నారు. ఈచిత్రానికి శీను శతాబ్దం, దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని గోపిసుందర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో ఇంతకుముందు లాక్ డౌన్ నైట్స్ చిత్రాన్ని నిర్మించిన 2 ఎం సినిమా సంస్థ అధినేత వినోద్ శబరీస్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. -
జిమ్ ట్రైనర్పై లైంగిక వేధింపులు.. ఎయిర్పోర్ట్లో నటుడి అరెస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు షియాస్ కరీమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేశాడంటూ 32 ఏళ్ల మహిళ గత నెలలో కాసర్గోడ్లోని చందేరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం చెన్నైలో దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. అతనిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. (ఇది చదవండి: విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్ డేట్పై అప్డేట్!) కరీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్లోనే ఆ మహిళా జిమ్ ట్రైనర్గా పనిచేస్తోంది. తన వద్ద నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి 2021 ఏప్రిల్ నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కరీమ్ను అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు చందేరా పోలీసులకు అప్పగించనున్నారు. కాగా.. కరీం గతంలో ఆమె చేసిన ఆరోపణలను కల్పితమని కొట్టి పారేశాడు. కాగా.. కరీం మలయాళంలో పలు చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా మలయాళం బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Shiyas Kareem (@shiyaskareem) -
ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుకూ తుదిశ్వాస విడిచారు. కాగా.. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ) అయితే ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్.. ఈసారైన కలిసొచ్చేనా?) -
'పెళ్లి రోజు మందు తాగి పేకాట, మండపంలో గొడవ.. జీవితాన్ని నాశనం చేసుకున్నా'
మలయాళ హీరో ధ్యాన్ శ్రీనివాసన్ ఇటీవలే జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తమిళ మూవీ కాగా అదే టైటిల్తో మలయాళంలోనూ సినిమా వచ్చింది. అందులో జైలర్ శాంతారామ్గా నటించాడు ధ్యాన్. అయితే ఒకానొక సమయంలో తాను డ్రగ్స్కు బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నానని, దాన్నుంచి బయటపడ్డాకే తన జీవితం బాగుపడిందని చెప్తున్నాడు. నాన్న సంపాదించింది నాకోసమేగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నాన్న శ్రీనివాసన్ దర్శకనటుడు, నిర్మాత. జనాలు నన్ను నెపో కింగ్ అని పిలిచేవారు. కాలేజీ డేస్లో నేను డ్రగ్స్కు అలవాటుపడ్డాను. నిజం చెప్పాలంటే బానిసయ్యాను. డ్రగ్స్ ఒక్కటే కాదు మద్యానికి సైతం బానిసనయ్యాను. పగలూరాత్రి తేడా లేకుండా తాగేవాడిని. కొన్ని నెలలపాటు అదే పనిగా తాగుతూనే ఉన్నాను. తాగి ఇంటికి వెళ్లిన ప్రతిసారి అమ్మ తిట్టేది. అప్పుడు నేను అర్పిత అనే అమ్మాయిని ప్రేమించాను కూడా! మా నాన్న చాలా సంపాదించాడు, అలాంటప్పుడు నేను పని చేయాల్సిన అవసరమేముంది, కేవలం దాన్ని ఖర్చు పెట్టే బాధ్యత మాత్రమే నా మీద ఉంది అని చెప్పాను. మరికొద్ది గంటల్లో పెళ్లి పెట్టుకుని పేకాట ఆ మత్తులో పిచ్చివాడిలా ప్రవర్తించేవాడిని. కన్నతండ్రినే తిట్టాను. ఒకసారైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అది నాకు పెద్దగా గుర్తులేదు కానీ నాకు మత్తు వదిలిన తర్వాత డ్రైవర్ ఆ విషయం చెప్పాడు. నాకు పేకాట కూడా అలవాటుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి 9 గంటలకు నేను ఫుల్లుగా తాగి పేకాట ఆడాను. అర్పిత నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్నావా? లేదా? అని సీరియస్గా అడిగేసింది. మేము 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కాబట్టి ఇదొక ఈవెంట్ అని లైట్ తీసుకున్నాను. నేను చెడిపోయానని బాధపడ్డారు తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లాను. స్నానం చేసి రెడీ అయ్యాక మళ్లీ తాగాను. పెళ్లిమండపంలోనూ కాస్త గోల చేశాను. ఆ రోజు రాత్రి కూడా పేకాడాను. నేను పూర్తిగా నాశనమయ్యానని మా కుటుంబం బాధపడింది. నాన్న బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇలా డ్రగ్స్ వల్ల నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. తర్వాతికాలంలో కొందరు మిత్రులు దాని వల్ల అనారోగ్యానికి గురవడం చూసి డ్రగ్స్ డేంజర్ అని అర్థమైంది. నాకు పాప పుట్టాక డ్రగ్స్, పేకాట వంటి అలవాట్లు పూర్తిగా మానేశాను' అని చెప్పుకొచ్చాడు. చాలా చెడ్డ సినిమాలు చేశా సినిమాల గురించి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకోలేదు, డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అందుకే ఇప్పటికీ నన్ను నేను పార్ట్ టైం యాక్టర్గానే ఫీలవుతాను. సినిమా ఫ్లాప్ అయితే అందరూ ఫస్ట్ నటులనే తిడతారు. సినిమా అనేది కొంతమంది కలిసి చేసే పని. సినిమా సక్సెస్ కాకపోతే ముందుగా నిర్మాతను, తర్వాత డైరెక్టర్ను, ఆ తర్వాత నటీనటులను విమర్శించాలి. నేను చాలా చెడ్డ సినిమాలు చేశాను. ముందూవెనకా ఆలోచించకుండా మూవీస్ చేసేశాను, అవి వర్కవుట్ కావని కూడా ముందే చెప్పేవాడిని. నటుడిగా మీకు కనిపించను కేవలం నా ఫ్రెండ్స్ కోసమే అవన్నీ చేశాను. కెరీర్ను సరిగా ప్లాన్ చేసుకోవడం రాని నటుడిని నేను. అందుకే నేను చేసినవాటిలో చాలా సినిమాలు ఫ్లాపయ్యాయి. దయచేసి నా ఇంటర్వ్యూలు చూసి సినిమాలు చూడకండి. ఇంటర్వ్యూలు చూసి నన్ను ప్రేమిస్తున్నారు. కానీ థియేటర్ దగ్గర వస్తున్న టాక్ను బట్టే మీరు సినిమాకు వెళ్లండి. ఇంకా మీరు నన్ను రెండుమూడేళ్లు భరిస్తే చాలు. ఇప్పుడు నేను ఒప్పుకున్న సినిమాలు చేశాక మళ్లీ నటుడిగా మీకు కనిపించను. నేను సినిమాల్లో నటించడం మానేస్తాను' అని చెప్పుకొచ్చాడు ధ్యాన్ శ్రీనివాసన్. చదవండి: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా? -
'జైలర్' విలన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సూపర్స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ మూవీలో రజనీతోపాటు శివరాజ్ కుమార్, మోహన్లాల్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ.. విలన్గా చేసిన వినాయకన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం బయటపడింది. కేరళకు చెందిన వినాయకన్..1995 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు.. మెల్లమెల్లగా విలన్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అయితే 'జైలర్'లో ప్రతినాయకుడిగా చేయడం ఇతడికి దక్షిణాదిలో చాలా పేరు తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం షాకింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: హీరోయిన్తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్గా బంగారం, భవనాలు) ఏం జరిగింది? ఈ సంఘటన 2019లో జరిగినట్లు తెలుస్తోంది. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెతో పాటు తల్లిని కూడా తన రూమ్కి తీసుకురావాలని కామెంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వినాయకన్ కామెంట్స్ నిజమేనని తేలింది. తొలుత అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు 'జైలర్' హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగులో కూడా అయితే ఎక్కువగా మలయాళ సినిమాలు చేసిన వినాయకన్.. తెలుగులోనూ జగపతిబాబు 'అసాధ్యుడు'లో విలన్ గ్యాంగ్లో ఒకడిగా చేశాడు. ప్రస్తుతం విక్రమ్-గౌతమ్ మేనన్ కాంబినేషన్ లో తీస్తున్న 'ధ్రువనక్షత్రం' మూవీలో నటిస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఓ నటుడికి కాస్త పేరు వస్తే చాలు అతడు గతంలో చేసినవన్నీ తెరపైకి వస్తుంటాయి. (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!) -
వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల: పక్కా ప్లాన్తో ఇంటికి పిలిచి..
కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్తో నిత్య పరిచయం పెంచుకుని ట్రాప్ చేసి డబ్బులు గుంజే ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) కేరళకు చెందిన సీరియల్ నటి, న్యాయవాది అయిన నిత్య అద్దెకు ఉండేందుకు ఇంటిని వెతుకుతుండగా వృద్ధుడిని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో నిత్య స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని నటి నిత్య పిలిచింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. నిత్య ఇంట్లో ఏం జరిగిందో పోలీసులకు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. 'నేను.. నిత్య ఇంటికి వెళ్లగానే నన్ను మాటల్లో ఉంచి ఆమె నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతలో నిత్య స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు.. కొన్ని ఇద్దరం ఉన్న ఫోటోలను కూడా తీశాడు. ఆపై అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారికి తెలిపాను. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు' అని పోలీసులకు తెలిపాడు. (ఇదీ చదవండి: BRO Movie Twitter Review: పవన్ కల్యాణ్ ‘బ్రో’మూవీకి ఊహించని టాక్!) దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్తో పోలీసులు అక్కడే ఉండి నిత్య,బినూను అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు. నిత్య ఇప్పటికే పలు ప్రముఖ సీరియల్స్తో పాటు అక్కడి ప్రసిద్ధ షోలలో కూడా కనిపించింది. -
ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్స్ కామెంట్లకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా సినీ కారలు, వారి కుటుంబసభ్యులు తరచూగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఓ తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమార్తె ట్రోలింగ్ గురయ్యారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె భాగ్య ఇటీవలే కెనడాలోని ఓ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకున్న ఫోటోలను తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. 'కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్గా ఉంటారు.' అంటూ కామెంట్ చేశాడు. ముందు నీ పని చూసుకో అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.' ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?) View this post on Instagram A post shared by Bhagya (@bhagya_suresh) -
ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్ ప్రస్తుతం సమీపంలోని కొడుంగలూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సుధీ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) ఎలా జరిగిందంటే.. సుధి, మిగిలిన ముగ్గురు వటకరా ప్రాంతంలో ఒక ఈవెంట్ను ముగించుకుని కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటెనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ కెరీర్ కొల్లం సుధీ 2015లో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, 'ఎస్కేప్', స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాల్లో నటించాడు. సుధీ చాలా చిత్రాలలో కనిపించినప్పటికీ.. అతను బుల్లితెరపై నటనకే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాడు. కొల్లం సుధీ తన మిమిక్రీతోనే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతను స్టార్ మ్యాజిక్ షోతో మరింత ఫేమ్ సంపాదించారు. మలయాళంలో పలు కామెడీ షోలతో అలరించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) View this post on Instagram A post shared by Kollam Sudhi (@kollam_sudhi_) -
లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి. (ఇది చదవండి: 'డింపుల్తో డీసీపీ ర్యాష్గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. 2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ని ప్రొడక్షన్ బ్యానర్ నడుపుతున్నాడు. -
ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు, ఆ పాపం ఊరికే పోలేదు: దర్శకుడు
కేరళలో రిలీజైన '2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో' సినిమా అక్కడ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మలయాళీ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ జ్యూడ్ ఆంథొని జోసెఫ్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'కొన్నివిషయాలను అంత ఈజీగా మర్చిపోలేం. షేన్ నిగమ్, శ్రీనాథ్ బసి లాంటివాళ్లు గంజాయి, డ్రగ్స్కు బానిసయ్యారన్న ఆరోపణలున్నాయి. కానీ నా దృష్టిలో డ్రగ్స్ కన్నా మానవత్వం లేకపోవడమే అతి పెద్ద సమస్య. ఇండస్ట్రీలో ఆంటోని వర్గీస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా మంచి వాడని అందరూ అనుకుంటారు. నేనూ అలాగే అనుకున్నా. నిర్మాతగా అతడితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అతడు కూడా ఓకే చెప్పాడు. ఇంతలో తన చెల్లెలి పెళ్లి అని చెప్పి సహనిర్మాత, నా స్నేహితుడు అరవింద్ నుంచి రూ.10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభించడానికి ఇంకా 18 రోజులు ఉందన్న సమయంలో అతడు ముఖం చాటేశాడు. నాకు, అరవింద్కు చాలా బాధేసింది. ఇద్దరం ఎంతగానో ఏడ్చాం. మా సినిమా చేయనని చెప్పి నహస్ హిదయత్ అనే కొత్త దర్శకుడితో అరవం సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ కొంతకాలానికే ఆ సినిమా అటకెక్కింది. బహుశా అతడు చేసిన పాపం అతడికే చుట్టుకుందేమో! చాలా కాలం తర్వాత తను తీసుకున్న డబ్బును అరవింద్కు తిరిగిచ్చాడు వర్గీస్. చాలామంది అర్హత లేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో వర్గీస్ ఒకడు. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరీ అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే ఇలాంటి వాళ్లను భరించాల్సిన అవసరమే ఉండేది కాదు' అని ఎమోషనలయ్యాడు జ్యూడ్. చదవండి: నటితో సహజీవనం, వద్దనుకున్నా కొడుకు పుట్టడంతో.. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు, కమెడియన్ మముక్కోయ(77) కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి మలప్పురం జిల్లాలోని ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) మలయాళ చిత్రసీమలో అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా పేరు మాముక్కోయ సంపాదించారు. 1979లో థియేటర్లో తన నటనా వృత్తిని ప్రారంభించిన ఆయన 450కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. మాముకోయ నటనకు రెండు రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన జనతా హోటల్, మోహన్ లాల్ నటించిన కనుపాప చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. #Mamukkoya (77), one of the finest comedy actors ever in Malayalam cinema passed away. Who can forget this Kozhikode man, the epicentre of laughter in so many films?#RIP pic.twitter.com/jrHlmXpv1m — Sreedhar Pillai (@sri50) April 26, 2023 -
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో తల్లి కన్నుమూత..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. కాగా.. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్కు దగ్గరయ్యారు. గతేడాది ఆయన నటించిన చిత్రం రాస్చాక్. ఈ సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో మోహన్ లాల్ (ఫొటోలు)
-
గుండెపోటుతో దిగ్గజ నటుడి కన్నుమూత
మలయాళ దిగ్గజ నటుడు, లోక్సభ మాజీ సభ్యుడు ఇన్నోసెంట్(75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా సంబంధిత శ్వాసకోశ సమస్యలతో పాటు పలు అవయవాలు దెబ్బతినడంతో.. మార్చి 3వ తేదీన కొచ్చి వీపీఎస్ లకేషోర్ ఆస్పత్రిలో ఆయన చేరారు. అయితే ఆదివారం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్బులిటెన్ ద్వారా వెల్లడించాయి. మలయాళంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్.. ఎల్డీఎఫ్ మద్దతుతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్ చాలాకుడి లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గారు. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)కు పదిహేనేళ్లపాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన ఆయన.. దానిని జయించడమే కాదు, క్యాన్సర్ వార్డులో నవ్వులు(Laughter in the Cancer Ward) పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. 1972లో నృతశాల చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ కెరీర్ను ప్రారంభించిన ఆయన.. సపోర్టింగ్రోల్స్తో పాటు విలన్గా, కమెడియన్ పాత్రలతో ఐదు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారు. ఇన్నోసెంట్ నటించిన చిత్రాల్లో అక్కరే నిన్నోరు మారన్, గాంధీనగర్ సెండక్ స్ట్రీట్, నాడోడిక్కట్టు, రామోజీ రావు స్పీకింగ్, తూవల్స్పర్శమ్, డాక్టర్ పశుపతి, సందేశం, కేళి, దేవసూరం.. తదితర చిత్రాలు బాగా గుర్తుండిపోతాయి. కిందటి ఏడాది పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో వచ్చిన కడువా చిత్రంలోనూ నటించారాయన. ఇన్నోసెంట్ చివరిసారిగా నటించిన చిత్రం పాచువుమ్ అత్భుథవిలక్కుమ్(ఫహద్ ఫాజిల్ హీరోగా..) రిలీజ్కు సిద్ధంగా ఉంది. Legendary actor Innocent passes away. The veteran actor was aged 75. "RIP Legend" 💔 😭 #Innocent pic.twitter.com/7vNHq3BdQi — Sanju Singh (@Iamsanjusingh1) March 27, 2023 ఇన్నోసెంట్ మృతికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం తెలుపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్లతో పాటు పలువురు సినీ తారలు అందులో ఉన్నారు. మోహన్లాల్, పృథ్వీరాజ్సుకుమారన్లతో ఇన్నోసెంట్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏం చెప్పను నా ఇన్నోసెంట్.. ఆ పేరు లాగే అమాయకంగా నవ్వులూ, ప్రేమా, ఓదార్పును ప్రపంచానికి పంచుతూ, చుట్టూ ఉన్నవాళ్లని తమ్ముడిలా పట్టుకుని, దేనికైనా నాతో ఉన్న.. నీ ఎడబాటు బాధని మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం ఆ అమాయకపు చిరునవ్వుతో, ప్రేమతో, మందలింపుతో నా ఇన్నోసెంట్ ఎప్పటికీ నాతో ఉంటాడు అంటూ మోహన్లాల్ తన ఫేస్బుక్ వాల్పై భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సినిమా కోసం నన్ను బతిమిలాడారు -
భార్యకు విడాకులిచ్చిన వివాదాస్పద నటుడు
ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ వివాహబంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. భార్య బబితకు విడాకులిచ్చినట్లు తెలిపాడు. ఫేస్బుక్ లైవ్లో ఆయన మాట్లాడుతూ.. 'నేను మలయాళ నటుడు వినాయకన్ను. నాకు, నా భార్యకు ఉన్న దాంపత్య బంధం ఇంతటితో ముగిసింది' అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది మీటూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు వినాయకన్. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే.. నేను దానిని అలాగే కొనసాగిస్తాను. నిజంగా అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నాను' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో క్షమాపణలు కోరాడు నటుడు. 2019లోనూ మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇకపోతే 1995లో వచ్చిన మోహన్లాల్ 'మాంత్రికం' చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. కమ్మటిపాదం సినిమాకు గానూ 2016లో కేరళ స్టేట్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా మూవీ జైలర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆఖరిదశలో ఉంది. మలయాళంలో కరింతాండన్ చిత్రం చేస్తున్నాడు. తమిళంలో నటించిన ధృవ నక్షత్రం ఎన్నో ఏళ్ల తర్వాత రిలీజ్కు నోచుకుంటోంది. ఈ మూవీ మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు ఎన్.శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని చెంగారెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ‘జోసెఫ్, నాయట్టు, ఇరాట్ట’ వంటి మలయాళ హిట్ ఫిల్మ్స్లో నటించిన జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. Thank you ❤️🙏 https://t.co/1oHY9slrcV — joju george (@C_I_N_E_M_A_A) March 15, 2023 -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా. బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్ఎమ్ బాదుషా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. -
క్షమించండి.. ఇకపై అలా జరగదు.. స్టార్ హీరో
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సోషల్మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా 2018 పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ శాంతి ఓషాన' సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న జూడో ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీ టీజర్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఈవెంట్లో దర్శకుడి హెయిర్ స్టైల్పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ..'జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడైన దర్శకుడు' అని అన్నారు. దీంతో దర్శకుడిని బట్టతల వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించారు. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్తో సమానమంటూ పోస్టులు చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'డియర్ ఆల్.. దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన తప్పును వెంటనే అంగీకరించి వెంటనే సోషల్ మీడియా పోస్ట్తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అనారోగ్యంతో సీనియర్ నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ 68ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కెఎస్ ప్రేమ్ కుమార్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాల పాటు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎక్కువగా కామెడీ రోల్స్తో గుర్తింపు పొందారు. నాటకాల ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన పలు విజయవంతమైన సినిమాలు, సీరియల్స్లో ఆయన నటించారు. కొచ్చు ప్రేమన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అశ్లీల చిత్రంలో నటించాలంటూ బలవంతం, దర్శకురాలిపై కేసు
కేరళకు చెందిన దర్శకురాలిపై చీటింగ్ కేసు నమోదైంది. డర్టీ పిక్చర్లో నటించమని తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. లేదంటే తనకు మరణమే శరణ్యమని వాపోయాడు. 'అది నా తొలి షూట్. నేను అగ్రిమెంట్ సరిగా చదవకుండానే సంతకం పెట్టాను. వారితో కలిసి షూటింగ్కు వెళ్లాను. చివరకు వాళ్లు నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి.. ఇది అడల్ట్ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్పగా అగ్రిమెంట్ మీద సంతకం చేశావు కాబట్టి చేసి తీరాల్సిందే అన్నారు. అగ్రిమెంట్ బ్రేక్ చేయాలనుకుంటే రూ.5 లక్షలు కట్టమని బెదిరించారు. మేము వెళ్లింది ఒక మారుమూల ప్రాంతానికి, కాబట్టి అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయాను' అని బాధిత నటుడు చెప్పుకొచ్చాడు. ఆ సినిమా రిలీజైతే తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ముఖం చూపించుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: తాగి బూతులు మాట్లాడాడు, చెంప చెళ్లుమనిపించా: డైరెక్టర్ జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్ -
మహేశ్ కోసం ‘కోబ్రా’ విలన్ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్గా మారిన సూసైడ్ నోట్ 2015లో మాలీవుడ్లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. -
విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. బాబురాజ్ ఆకస్మిక మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు మాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా బాబురాజ్కు భార్య సంధ్య, కుమారుడు బిషన్లు ఉన్నారు. ఆయన సినిమాల విషయానికి వస్తే.. బాబూరాజ్ ‘త్రిస్సూర్లో డ్రామా స్కెచ్’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు. బాబూరాజ్ ఆండ్రాయిడ్ కుంజప్పన్, సీఐఏ, మాస్టర్ పీస్, గుండా జయన్, బ్రేకింగ్ న్యూస్, మనోహరన్ ,అర్చన 31 నాటౌట్ వంటి మలయాళ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్గా కూడా ఆయన పనిచేశారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శరత్ కొచ్చిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. శరత్ హఠాన్మరణంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్ ప్రముఖ మాలీవుడ్ నటుడు ఆంటోనీ వర్గీస్ పెపే సోషల్ మీడియా వేదికగా శరత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. కాగా శరత్ చంద్రన్.. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట ఐటీ సంస్థలో పనిచేసిన శరత్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో అనిస్య సినిమాతో సినీ నటుడిగా అరంగేట్రం చేశాడు. లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్లో శరత్ కీలక పాత్ర పోషించాడు. -
మోసపూరితమైన తన ఆలోచనలను అంచనా వేయలేం!: మంచు లక్ష్మి
మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ వస్తున్న ఆమె నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంతో పాటు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం చిత్రంలో నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది మంచు లక్ష్మి. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ ఈ క్రమంలో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పరిచయం చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చింది. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సముద్ర ఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలోని ఆయన పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కమిషనర్ చలపతి పాత్రలో కనిపించబోతోన్నాడు. చదవండి: అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా? View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో గురువారం పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గత సోమావారం రోజున (జూలై 4) తిస్సూర్లోని ఎస్ఎన్ పార్క్లో శ్రీజిత్ ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు సీసీటీవీమ ఆధారంగా గుర్తించారు. బాలికల వయసు 9, 14 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. కాగా శ్రీజిత్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా అతడు ఇలాంటి ఆరోపణలను ఎదర్కొని అరెస్ట్ అయ్యాడు. 2016లో ఓట్టప్పలం పోలీసుల ఇలాంటి కేసులోనే అతడిని అరెస్ట్ చేశారు. కొందరు స్కూల్ గల్స్కు చెందిన గ్రూప్తో అసభ్యకరరీతిలో అతడి ప్రైవేటు పార్ట్స్ను చూపిస్తూ అసభ్యకర రితీలో ప్రవర్తించడమే కాకుండా బాలికల ఫొటోలను తీసుకున్నాడు. దీంతో స్కూల్ ప్రిన్స్పాల్య ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు టి.జి రవి కుమారుడైన శ్రీజిత్ రవి మాలీవుడ్కు చెందిన ప్రముఖ నటులలో ఒకరు. అతడు సహా నటుడిగా, విలన్గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. చదవండి: ఖుష్బూ సుందర్కు కీలక బాధ్యతలు -
లైంగిక దాడి కేసు: బాధితురాలి పేరు వెల్లడి, విజయ్ బాబు అరెస్ట్
మలయాళ నటుడు, నిర్మాత విజయ్బాబు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్ని నెలల క్రితం విజయ్ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాడు. చదవండి: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు అయితే నిబంధనలకు విరుద్ధంగా అతడు ఇటీవల సోషల్ మీడియాలో బాధిత నటి పేరును వెల్లడించాడు. దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్పై విడుదలయ్యాడు. అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది. -
మరో నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు
Action Hero Biju Actor ND Prasad Found Dead At His Residence: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో ప్రముఖులు కన్నుమూస్తే.. ఎంతో భవిష్యత్తు ఉన్న సెలబ్రిటీలు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఒడియా చిత్ర పరిశ్రమకు సంబంధించిన 58 ఏళ్ల నటుడు రాయ్మోహన్ పరిదా, 23 సంవత్సరాల బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా బలవన్మరణంతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మలయాళ నటుడు ఎన్డి ప్రసాద్ కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రసాద్ బలవన్మరణానికి మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు చెప్తున్నారు. ఇదివరకు ప్రసాద్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో డ్రగ్స్తో పట్టుబడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఉన్నాయి. గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్ సర్కిల్ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5 గ్రాముల హాష్ ఆయిల్, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్, కొడవలితో పట్టుబడినట్లు సమాచారం. అలాగే నటుడు ప్రసాద్పై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. (చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్) కాగా 2016లో వచ్చిన నివిన్ పౌలీ చిత్రం 'యాక్షన్ హీరో బిజు'లో ఎన్డి ప్రసాద్ విలన్గా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇబా, కిర్మాణి చిత్రాల్లో నటించాడు. ప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?) (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
షూటింగ్ లొకేషన్లో కన్నుమూసిన నటుడు
సీనియర్ నటుడు వీపీ ఖలీద్ (70) షూటింగ్ లొకేషన్లోనే కన్నుమూశారు. కేరళలోని వయక్కం సమీపంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న ఖలీద్కు శుక్రవారం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. కాగా ఆయన ప్రస్తుతం దర్శకుడు జూడ్ ఆంటోనీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సెట్స్కు వెళ్లిన ఆయన ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్రూమ్కు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అనుమానం వచ్చిన చిత్రయూనిట్ సభ్యులు లోనికి వెళ్లి చూడగా ఖలీద్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వీపీ ఖలీద్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసేవారు. తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్లో నటించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుమారులు షైజు, జింసీ, ఖలీద్ రెహమాన్ ముగ్గురూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చదవండి: రణ్బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్ ఈ సినిమాలో సూర్య, షారుక్లు ఫ్రీగా నటించారు -
లైంగిక ఆరోపణలు, విజయ్ బాబు షాకింగ్ నిర్ణయం
AMMA Removes Vijay Babu From Executive Committee: మలయాళ నటుడు, నిర్మాత విజయ్బాబు వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విజయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవల ఓ యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. దీనిపై చర్చ జరుగుతుండగానే మరో మహిళ విజయ్బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. పరిచమైన అరగంటలోనే తన పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ శుక్రవారం ఆమె ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది. దీంతో పరిశ్రమలో ఆమె ఆరోపణలు మరింత హాట్టాపిక్గా నిలిచాయి. చదవండి: మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి విజయ్ బాబును తొలిగించినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. తాత్కలికంగా విజయ్ బాబు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు 5 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తాను అమ్మ నుంచి తప్పుకుంటానని నటుడు విజ్ఞప్తిని మన్నించి అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున తన కారణంగా అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినరాదనే ఉద్దేశంతో తనను అమ్మ నుంచి తాత్కాలికంగా తొలగించాలని విజయ్ బాబు అసోసియేషన్కు లేఖ రాశాడు. చదవండి: మహేశ్ ఫ్యాన్స్కు ట్రీట్, 105 షాట్స్తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ కొచ్చిలో జరిగిన సంస్ధ కార్యవర్గ సమావేశంలో విజయ్ బాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని అమ్మ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబు తెలిపారు. మరోవైపు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మళయాళ సినీ పరిశ్రమ స్పందించకపోవడాన్ని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రశ్నించింది. అసోసియేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి మాల పార్వతి అసోషియేషన్కు రాజీనామా చేసింది. విజయ్ బాబు లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్నది నిజమని, స్యయంగా బాధితురాలే ఈ విషయం వెల్లడించిందన్నారు. దీంతో అతడు తప్పుచేశాడన్నది రుజువైందన్నారు. కానీ దీనిపై అమ్మ అతడికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అతనే సభ్యత్వానికి రాజీనామ చేయమని చెప్పడం, కమిటీ అతడిని తప్పుకోమని చెప్పడంలో చాలా తేడా ఉందని ఆమె పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మందు తాగుతూ పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు
మలయాళ నటుడు, నిర్మాత విజయ్బాబు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో మహిళ విజయ్బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని శుక్రవారం ఫేస్బుక్లో రాసుకొచ్చింది. 'నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్బాబును 2021 నవంబర్లో ఒకసారి కలిశాను. అది కూడా వర్క్ గురించి మాట్లాడేందుకే! మేమిద్దరం ప్రొఫెషనల్ విషయాల గురించి చర్చించుకున్నాం, ఆ తర్వాత వ్యక్తిగత సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మాటల్లో నాకు సహాయం అవసరమని గుర్తించాడు. మందు తాగుతూ నన్నూ తాగమని కోరితే వద్దని చెప్పాను. ఇంతలో సడన్గా నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను' 'అయినా సరే అతడు ఇంకొక్క ముద్దు పెడతా? అని అడిగాడు. కుదరదని చెప్పేశాను. దీంతో అతడు నాకు సారీ చెప్పి దయచేసి ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బతిమాలాడు. నాక్కూడా భయమేసి సరేనని తలూపాను. ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేశాను. కానీ అతడు అలా చీప్గా ప్రవర్తించడంతో భయపడిపోయాను. ఈ ఒక్క సంఘటనతో నేను నా వర్క్ను మధ్యలో ఆపేశాను. మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న నా కలను అక్కడితోనే తుడిచేశాను. తొలిసారి కలిసిన 20- 30 నిమిషాల్లోనే అతడు అలా అసభ్యంగా ప్రవర్తించాడంటే విజయ్బాబు వల్ల ఎంతమంది అమ్మాయిలు ఎన్ని బాధలు అనుభవించారో అర్థం అవుతుంది..' చదవండి: నెట్ఫ్లిక్స్లో రాధేశ్యామ్ హిందీ వర్షన్, ఎప్పటినుంచంటే? 'ఇటీవలే ఓ నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన వార్తను చదివినప్పుడు నేను కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. ఆమె ఎంత నరకం అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. కొందరు ఆ మహిళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడున్న మనిషి ఎలాంటివాడో నాకు తెలుసు. సహాయం పేరుతో అమ్మాయిలను వాడుకోవాలనుకునే దుర్మార్గుడతడు. ఇలాంటివాళ్లను శిక్షించి 'ఇండస్ట్రీ అమ్మాయిలకు అంత మంచిది కాదు' అనే అపోహను తుడిచిపెట్టేలా చేయాలి' అని రాసుకొచ్చింది. చదవండి: బిగ్బాస్ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి.. -
నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్లో వార్నింగ్
Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim: మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలోని ఎర్నాకులం దక్షిణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్లో తనపై విజయ్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ పేర్కొంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక్కసారి కాదు, అనేకసార్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. ఏప్రిల్ 22న ఈ ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు పోలీసులు విజయ్ బాబును అరెస్టు చేయలేదు, ప్రశ్నించలేదని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ బాబు వెర్షన్ మరోలా ఉంది. తనపై వచ్చిన ఈ లైంగిక ఆరోపణలు ఫేస్బుక్ లైవ్ వేదికగా ఖండించాడు విజయ్ బాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. తానే అసలైన బాధితుడునని, ఆ అమ్మాయిని అంత తేలిగ్గా విడిచి పెట్టటనని వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని చూపించగలనని, కానీ ఆమె కుటుంబానికి నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నాడు. తాను కేవలం, తన తల్లి, భార్య, సోదరి, స్నేహితులకు మాత్రమే జవాబుదారీనని వెల్లడించాడు విజయ్ బాబు. ఆ అమ్మాయి ఆడిషన్కు వస్తే ఓ పాత్రకు తానే ఎంపిక చేశానని, ఇప్పుడేమో ఈ ఆరోపణలతో తానే బాధితుడిగా మారానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెనే కుంగుబాటుకు లోనయ్యానని చెబుతూ మెసేజ్లు పంపడం మొదలు పెట్టిందన్నాడు. డిసెంబర్ నుంచి మార్చి 2021 వరకు వారి మధ్య జరిగిన మెసేజ్లు అన్ని కలిపి మొత్తం 400 స్క్రీన్షాట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఆరోపణలకు ఈ స్క్రీన్షాట్లే బదులిస్తాయని వివరించాడు. సినిమా నిర్మాణ సంస్థ 'ఫ్రైడే ఫిల్మ్ హౌజ్' వ్యవస్థాపకుడు ఈ 45 ఏళ్ల విజయ్ బాబు. ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ సినిమాకు గానూ ఉత్తమ పిల్లల చిత్రం కింద (నిర్మాతగా) కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకున్నాడు. చదవండి: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు గర్ల్ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ? Malayalam actor-producer Vijay Babu denies sexual assault allegations against him "I am not afraid as I did not do anything wrong. I am the victim here. I have known the woman since 2018 who has put allegations against me" he said (Screenshot of Actor's Facebook live) pic.twitter.com/QSyZw56Zkq — ANI (@ANI) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెంటిలేటర్పై ప్రముఖ నటుడు
తిరువనంతపురం (కేరళ): ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ ఆస్పత్రిపాలయ్యారు. మార్చి 30న ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని అపోలో అడ్లక్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆయనకు బైపాస్ సర్జరీ చేసిన అనంతరం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు. కాగా శ్రీనివాసన్ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. The veteran actor, writer and director #Sreenivasan is on ventilator support after a bypass surgery following heart issues. Wishing him a speedy recovery. pic.twitter.com/cFLbukBInU — Sreedhar Pillai (@sri50) April 7, 2022 చదవండి: ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న కొత్త వాచ్ ధరెంతో తెలుసా? -
మీటూపై అనుచిత వ్యాఖ్యలు, 'టార్గెట్ చేయాలనుకోలేదు, సారీ'
తనకు పది మంది మహిళలతో శారీరక సంబంధం ఉందని, అదే మీటూ అయితే దాన్ని కొనసాగిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మలయాళ నటుడు వినాయకన్. ఒరుతె సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మీటూపై అడ్డగోలుగా మాట్లాడినందుకు జర్నలిస్టులు అతడిని ఏకిపారేశారు. ఈ పరిణామంతో వెనక్కు తగ్గిన వినాయకన్ సదర జర్నలిస్ట్కు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్బుక్లో నోట్ షేర్ చేశాడు. 'ఒరుతె ప్రమోషనల్ ఈవెంట్లో ఓ జర్నలిస్ట్ సిస్టర్ అవమానకరంగా భావించిన భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను ఏరకంగానూ టార్గెట్ చేయాలనుకోలేదు. ఆమెకు అసౌకర్యం కలిగించేలా మాట్లాడినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ వినాయకన్' అని రాసుకొచ్చాడు. చదవండి: అదే ‘మీటూ’ అయితే, నేను దానిని కొనసాగిస్తాను -
'మీటూ' తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు
Actor Vinayakan Controversial comments On MeToo: మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. వినాయకన్ తాజా చిత్రం ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో మీ టూపై వినాయకన్కు ప్రశ్న ఎదురవగా అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో వినాయకన్తో పాటు మూవీ టీం పాల్గొంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను’ అంటూ వినాయకన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ వినాయకన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు. చదవండి: జానీ మాస్టర్కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో ఇదే మీ టూ అయితే ఇకముందు కూడా తాను అలాగే చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతడి తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మీ టూపై సరైన అవగాహన లేకుండా ఉన్నాడంటూ వినాయకన్పై పలువురు విరుచుకుపడుతున్నారు. కాగా వినాయకన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి అతడు జైలుకు వెళ్లాడు. ఇప్పుడు మరోసారి మీ టూపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో నిలిచాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన ‘మీ టూ ఉద్యమం’పై ప్రముఖ నటుడైన వినాయకన్ ఈ విధంగా స్పందించడంపై సినీ సెలెబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్ అక్టోబర్ 30న బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్, షారుక్లకు మద్ధతుగా నిలిచారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత కానీ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. దీంతో ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల నటించిన మిన్నాళ్ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. చదవండి: సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి.. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్ ఆర్యన్ డ్రగ్ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్కు మూడు సార్లు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ కుమారుడికి బెయిల్ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం(61) గుండెపోటుతో కేరళలో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి మాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖు, సహా నటీనటులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఈ క్రమంలో మలయాళ నటుడు, స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ అయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు నివాళులు అర్పిస్తూ హీరో పధ్వీరాజ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రదీప్ కేఆర్ తన కెరీర్లో 70కి పైగా చ్రితాల్లో నటించారు. తెలుగులో సైతం ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఏం మాయ చేశావేలో జార్జ్ అంకుల్ ప్రదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రాజా రాణి చిత్రంలో కూడా ఓ పాత్ర పోషించారాయన. Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022 -
అక్కడ హీరోని, తెలుగులో విలన్గా చేస్తున్నా
‘‘హీరో, విలన్, కామెడీ.. ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ’’ అన్నారు గోవింద్ పద్మసూర్య. మలయాళ చిత్రం ‘అడియాలంగళ్’లో హీరోగా నటించిన గోవింద్ తెలుగులో అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’, ఇటీవల నాగార్జున ‘బంగార్రాజు’లో విలన్ పాత్రలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో గోవింద్ మాట్లాడుతూ – ‘‘మాది కేరళ. హీరోగా నా తొలి సినిమా ‘అడియాలంగళ్’కే బెస్ట్ యాక్టర్తో పాటు ఐదు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్ గోపీగార్లతో కూడా కలిసి నటించాను. తమిళంలో ‘కీ’ సినిమాలో నేను చేసిన విలన్ పాత్ర చూసి ‘అల.. వైకుంఠపురములో..’కి నన్ను త్రివిక్రమ్గారు తీసుకున్నారు. ‘బంగార్రాజు’లో ఆది పాత్ర పోషించాను. నాగార్జునగారి వంటి గొప్ప నటుడితో నటించడం అంటే ఓ పాఠం వంటిది. నాగచైతన్య నాకు మంచి మిత్రుడైపోయాడు. ఈ చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణగారి వల్లే ఆది పాత్రను బాగా చేయగలిగాను. ప్రస్తుతం హీరో నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న వెబ్ ఆంథాలజీ ‘మీట్క్యూట్’లో ఓ కీలక పాత్ర, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్గా చేస్తున్నాను’’ అన్నారు. -
ఆ నటుడితో కాంగ్రెస్కు గొడవ ఎందుకు?
మలయాళ నటుడు జోజు జార్జ్.. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీకి లక్ష్యంగా మారారు. అతడు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. తాను ఏ తప్పు చేయలేదని జార్జ్ చెబుతున్నాడు. అసలు హస్తం పార్టీ అతడిని ఎందుకు టార్గెట్ చేసింది? జార్జ్ చేసిన తప్పేంటి? అసలు కథ ఇక్కడి నుంచే.. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా నవంబర్ 1న కొచ్చిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. వైట్టిల-ఎడపల్లి జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు దాదాపు గంటల పాటు యాతన అనుభవించారు. జోజు జార్జ్.. కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కూతురిని కీమోథెరపికి తీసుకెళుతున్న ఓ మహిళ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలతో అతడు వాగ్వాదానికి దిగాడు. గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తులయిన కాంగీయులు జార్జ్ కారు అద్దాలను పగులగొట్టారు. దీంతో బాధ్యులపై పోలీసులు పలు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తలపొగరు తగ్గాలి జోజు జార్జ్.. తమ పార్టీ మహిళా కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడని కాంగ్రెస్ ఆరోపించింది. వీధి రౌడీలా ప్రవర్తించాడని, అతడి తలపొగరు తగ్గాలంటే చట్టప్రకారం శిక్షించాలని పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జోజు జార్జ్ను నిందించే ప్రయత్నంలో సినీ పరిశ్రమను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సినిమా షూటింగ్స్ వద్ద హడావుడి చేస్తూ శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో సినిమా షూటింగులను అడ్డుకుంటే సహించేది లేదని అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..) సోషల్ మీడియాకు దూరం కాంగ్రెస్ పార్టీతో కలహం నేపథ్యంలో గత రెండు వారాల నుంచి జోజు జార్జ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. త్రిసూర్ జిల్లాలోని మాలా గ్రామంలో ఉన్న తన ఇంటి ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంతో కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. (చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!) జీరో టు హీరో! త్రిస్సూర్ జిల్లాలోని కూజూర్ గ్రామంలో జన్మించిన జోజు జార్జ్.. సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నటుడిగా ఎదిగారు. 1995లో ‘మజవిల్కూడారం’ సినిమాలో చిన్న వేషంతో కెరీర్ మొదలు పెట్టిన ఆయనకు 2000లో ‘దాదా సాహెబ్’ సినిమాలో తొలిసారిగా డైలాగ్ చెప్పే అవకాశం లభించింది. అప్పటి నుంచి హాస్య పాత్రలు చేస్తూ వచ్చిన జార్జ్కు 2018లో వచ్చిన ‘జోసఫ్’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో జోజు జార్జ్కు హీరో ఇమేజ్ ఇచ్చింది. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్ను దాటేసింది) టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఎంతో కష్టపడి కిందిస్థాయి నుంచి సినిమా పరిశ్రమలో ఎదిగిన జోజు జార్జ్ను రాజకీయ నేతలు టార్గెట్ చేయడం సరికాదని అతడి సన్నిహితులు అంటున్నారు. కెరీర్లో ఎన్ని విజయాలు అందుకున్నా ఇప్పటికీ మూలాలు మరిచిపోలేదని, సాధారణ గ్రామస్తుడిలానే జీవిస్తారని వెల్లడించారు. బెదిరింపులతో జార్జ్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం ఏమీ బాలేదని చెబుతున్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత సతీషన్కు లేఖ కూడా రాశారు. (Jai Bhim: హీరో సూర్యకు బెదిరింపులు.. దాడి చేస్తే రూ. లక్ష బహుమతి!) క్షమాపణ చెప్పాల్సిందే అయితే జోజు జార్జ్ బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని ఎర్నాకులం జిల్లా కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు భీష్మించుకుని కూర్చున్నారు. అటు జార్జ్.. కూడా క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అనడంతో వివాదం సద్దుమణగలేదు. కాగా, చమురు ధరల పెరుగుదలకు నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల లక్ష్యం నెరవేరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కేంద్రం, కేరళ ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడేసే గొప్ప అవకాశాన్ని పార్టీ చేజార్చకుందన్నారు. జోజుపై దాడి, అతనిపై దురుద్దేశపూరిత ప్రచారం నిరసనల గమనాన్ని మార్చిందని విశ్లేషించారు. (చదవండి: ప్రకాశ్రాజ్ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్) -
విషాదం: ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ లెజెండరి నటుడు, జాతీయ అవార్డు గ్రహిత నెడుముడి వేణు(73) సోమవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాలేయ వ్యాధి సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చదవండి: కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా.. ఇక ఆయన మరణవార్త విన్న ఆయన సహా నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పార్వతిలతో పాటు మలయాళం, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా నెడుముడి వేణు సినిమా విషయానికి వస్తే.. ఆయన చిన్న థియేటర్ ఆర్టిస్ట్గా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) ఇక 1978లో జీ అరవిందన్ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన తెలుగులోకి డబ్ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. తన అద్భుత నటనతో ఆకట్టుకునే ఆయన మూడు నేషనల్ అవార్డ్స్తో పాటు 7 రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
అమ్మ ‘భ్రమమ్’ని ఎలా ముగిస్తావు?: కీర్తీ సురేశ్
టాలీవుడ్, కోలీవుడ్ల్లో టాప్ హీరోయిన్లలో ఒకరు కీర్తీ సురేశ్. ఈ భామ రెండు ఇండస్ట్రీల్లో టాప్ స్టార్స్తో నటిస్తూ బీజీగా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లి మేనకా సురేశ్ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కీర్తిసురేశ్ తల్లి మేనకా సైతం ఒకప్పటి హీరోయినే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ సినీయర్ నటి 2005 నుంచి వరుసగా మూవీస్లో నటిస్తోంది. కాగా ఆమె తాజాగా చేయనున్న మలయాళీ సినిమా ‘భ్రమమ్’. ఈ సినిమాకి సంబంధించిన తల్లి పోస్టర్ని ప్రైమ్ వీడియోలో చూస్తున్న తన పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దానికి.. ‘అమ్మ భ్రమమ్ని ఎలా ముగిస్తావు?’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ‘నేను చూస్తున్నది నిజమేనా..?’ అని అడుగుతూ మాలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ని ట్యాగ్ చేసింది. కాగా ‘భ్రమమ్’ బాలీవుడ్ మూవీ ‘అంధాధున్’కి రీమేక్గా వస్తోంది. ఇందులో పృథ్విరాజ్, రాశిఖన్నా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ 7న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. సోషల్ మీడియా పోస్ట్తో ఈ సినిమాలో మేనకా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కీర్తీ హింట్ ఇచ్చినట్లు ఉందని ఫీల్మీ దునియాలో చర్చించుకుంటున్నారు. కాగా ఈ బాలీవుడ్ మూవీనే ఇటీవల హీరో నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగులో రీమేక్ చేసి, ఓటీటీలో విడుదల చేశాడు. చదవండి: కమెడియన్కి జోడీగా కీర్తీ సురేష్..? -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏళ్లు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ సోమవారం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా 19వ దశాబ్దంలో మలయాళ చిత్రసీమలో ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మంచిపేరు సంపాదించారు. రిజబావా మృతిపట్ల నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, అక్షయ ప్రేమ్నాథ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. 1990లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన డాక్టర్ పశుపతి అనే చిత్రంలో రిజాబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హొనై పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ చిత్రంలో నటించారు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్తో ‘తుపాకీ’ విలన్ ఎంగేజ్మెంట్, ఫొటోలు పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! రిజబాబా కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల్లో నటించడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. -
చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడనున్న హీరో
మలయాళ నటుడు ‘అంగమాలి డైరీస్’ ఫేం అంటోని వర్గీస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఇష్టసఖి అనిషా పౌలోస్తో కలిసి ఆగష్టు 8న ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లి ఘడియలు దగ్గరపడుతుండటంతో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో ఆంటోనీ వర్గీస్ తెల్లని కుర్తా, ధోతిని ధరించగా, అనిషా హల్దీ వేడుక కోసం ఆకుపచ్చ,పసుపు ధరించింది. ఈ జంట తమ స్నేహితులతో కలిసి సూపర్హిట్ పాటలకు హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే అనిషాతో నటుడు నిశ్చితార్థం చేసుకున్నాడు. కేరలోని అంగమాలిలో జరిగిన ఈ వేడుకకు కోవిడ్ కారణంగా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కాగా ఆంటోని, అనిషా పౌలోస్ చిన్ననాటి స్నేహితులు. అనిషా అంగమాలి ప్రాంతానికి చెందిన వృత్తిరీత్యా నర్సు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్గా మారింది. ఇక ఆంటోని విషయానికొస్తే 2017లో విడుదలైన అంగమాలి డైరీస్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో వెన్సెంట్ పెపే పాత్ర పోషించిన తనకు అనంతరం అభిమానులు ముద్దుగా పెపే పేరుతోనే పిలవడం ప్రారంభించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందడంతో ఆంటోని మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత జల్లికట్టు, స్వతంత్ర్యం అర్ధరాత్రి వంటి చిత్రాల్లో నటించగా ప్రస్తుతం అజగజంతరం, జాన్ మేరీ, ఆనప్రంబిలే వరల్డ్ కప్, ఆరవం చిత్రాలు చేస్తున్నాడు. -
నటుడికి విడాకులివ్వనున్న రెండో భార్య!
Methil Devika Divorce with Mukesh: పాపులర్ మలయాళ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడాకులు తీసుకోనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డ్యాన్సర్ దేవిక మీడియాముఖంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ముఖేశ్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. అందుకే అతడితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యానని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల నేను, నా భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఈ విషయంలో ముఖేశ్ అభిప్రాయమేంటో నాకు తెలియదు. కానీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి. నేను అతడి పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించేంత అవసరం, ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విడాకులకు సంబంధించి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని ముఖేశ్ పేర్కొన్నాడు. కాగా నటుడు, నాయకుడైన ముఖేశ్కు గతంలో నటి సరితతో పెళ్లైంది. అయితే ముఖేశ్ తాగుబోతు అని, పలువురు మహిళలతో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో సరిత 2011లో భర్తకు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ జంట కూడా ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతుండటంతో అభిమానులు షాకవుతున్నారు. -
పెళ్లి చేసుకున్న పాపులర్ నటుడు
మలయాళ నటుడు అర్జున్ నందకుమార్ ఓ ఇంటివాడయ్యాడు. దివ్య పిళ్లై అనే యువతిని వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. కరోనా విజృంభణ కారణంగా సోమవారం జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాలతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తంతును పూర్తి చేశారు. కాగా అర్జున్ నటుడు మాత్రమే కాదు క్రికెటర్ కూడా! అతడు 'కేసనోవా' చిత్రంతో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్రాండ్మాస్టర్' చిత్రంలోని నెగెటివ్ రోల్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'షైలాక్', 'సుసుసుధి వాత్మికం', 'ద డాల్ఫిన్స్', '8.20', 'రేడియో జాకీ' వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. అర్జున్ ముఖ్య పాత్రలో నటించిన 'మరక్కార్: అరేబికదలంటే సింహం' సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ కమెడియన్ మొండితనం, దర్శకుడికి రూ.2 కోట్ల నష్టం! -
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..
ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. మరోవైపు వరకట్నం తేవాలని భర్త ఉన్నిరాజన్ వేదిస్తున్నాడని వట్టప్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల ప్రకారం ఉన్నిరాజన్ భార్య ప్రియాంక బుధవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవితా కనిపించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్త, నటుడు ఉన్నిరాజన్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి ఉన్నిరాజన్ కట్నం డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నిరాజన్ ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, అయితే పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అతడి నైజం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇక 2019లో ఉన్నిరాజన్-ప్రియాంకలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వివాహం అయిన కొన్నాళ్లకే వీరి మధ్య కలహాలు వచ్చాయని, తన వ్యక్తిగత అవసరాలకు ప్రియాంక నగలు కూడా నమ్మేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంత డబ్బు అడిగినా ప్రియాంక తల్లి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేదని కానీ తన భర్త అడుగుతున్నట్లు కాకుండా, తనకే అవసరం ఉందని ప్రియాంక చెప్పేదని పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి ఉన్ని రాజన్ పెట్టే టార్చర్ను భరించలేక విషయం తమకు చెప్పిందని, శారీరక హింసకు పాల్పడినట్లు వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక మృతిచెందడం అనుమానాలకు తివిస్తోందన్నారు. ఇక ఉన్నిరాజన్ మరెవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోను ప్రతినాయకుడి పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. -
కరోనా: ప్రముఖ రచయిత, నటుడు కన్నుమూత
త్రిసూర్: కరోనా మహమ్మారి సినీ రంగంలో పెనువిలయాన్ని సృష్టిస్తోంది. పలువురు సినీ రంగానికి చెందిన కరోనా బారిన పడి అసువులు బాశారు. మలయాళ సినీరంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, నటుడు మాడంపు కుంజుకుట్టన్ (81) కన్నుమూశారు. ఇటీవల కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో త్రిశూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా నిర్దారణ అయింది. చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. త్రిస్సూర్ జిల్లాలోని కిరలూర్కు చెందిన మాడంపు శంకరన్ నంబూద్రి (మాడంపు కుంజికుట్టన్) అనేక మలయాళ చిత్రాలకు స్క్రీన్ ప్లే రాశారు. పలు సినిమాల్లో కూడా నటించారు. 2000లో జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన కరుణమ్ చిత్రానికి కుంజుకుట్టన్ ఉత్తమ స్క్రిప్ట్ రైటర్గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మకాల్కు, గౌరీశంకరం, సఫలం, కరుణం, దేశదానం వంటి సినిమాలకు స్క్రిప్ట్స్ రాశారు. సాహిత్య , సినీ లోకం మడంపు అని ప్రేమగా పిలిచుకునే కుంజుకుట్టన్ 10కి పైగా నవలలు రాశారు. పైత్రికం, వడక్కున్నాథన్, కరుణమ్, దేశదానం, ఆరంతాంపురం సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం -
నిద్రమాత్రలు మింగి, చేయి కట్ చేసుకున్న నటుడు
మలయాళ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న సమయంలో తన చేతి నరాలున కట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే అతడిని త్రిచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మణికట్టును కోసుకోవడానికి ముందు అతడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కాగా బుల్లితెర నటి అంబిలి దేవి తన భర్త ఆదిత్య జయన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు తనను మోసం చేశాడంటూ ఈ మధ్యే ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆదిత్య తనకు విడాకులివ్వాలని బలవంతపెడుతున్నాడని, చంపడానికి కూడా వెనకాడనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అయితే భార్య అంబిలి దేవి చేసిన ఆరోపణలను ఆదిత్య జయన్ ఖండించాడు. వ్యక్తిగత విబేధాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చొద్దని సూచించారు. ఇలా గొడవ జరుగుతున్న సమయంలోనే ఆయన సూసైడ్కు యత్నించడం సంచలనంగా మారింది. కాగా వీళ్లిద్దరూ బుల్లితెర మీద 'సీత' అనే సీరియల్లో దంపతులుగా నటించారు. అదే సమయంలో వీరు ప్రేమలో పడగా 2019లో పెళ్లి పీటలెక్కారు. వీరికి అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కాగా ఆదిత్య ప్రస్తుతం ఎంటె మాతవు, సీతాకల్యాణం సీరియల్స్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చదవండి: మహిళతో సంబంధం, నాలుగో భార్య అంబిలి దేవికి విడాకులు! హీరోయిన్ లవ్ ఎఫైర్.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి.. -
ప్రముఖ నటుడు, రచయిత కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్గా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్గా కథ, మాటలు అందించారు. కళా రంగానికి ఆయన అందించిన సేవకుగాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ అనే నాటాకానికి అందుకున్నారు. బాలచంద్రన్ నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత థియేరిటికల్ ఆర్ట్స్, నటనలో శిక్షణ తీసుకున్నారు. చదవండి: చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా! నిజంగానే ఈ జంట విడిపోతుందా! -
ఓ ఇంటివాడు కాబోతున్న మలయాళ నటుడు
మలయాళ నటుడు విజిలేశ్ త్వరలో ఓ ఇంటివాడిని కాబోతున్నానంటూ గతేడాది ప్రకటించాడు. నవంబర్లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ మధ్యే పెళ్లి డేట్ను ప్రకటించిన ఆయన కాబోయే భార్య స్వాతి హరిదాస్తో దిగిన ప్రీవెడ్డింగ్ ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం మార్చి 29న వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించాడు. విజిలేశ్ కెరీర్ విషయానికొస్తే.. 'మహేశింటే ప్రతీకారం' సినిమా అతడికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'గా రీమేక్ అయింది. విజిలేశ్ తర్వాత గుప్పీ, అల్మారా, చిప్పీ, విమానం వంటి పలు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. వారతాన్లో తాను పోషించిన జితిన్ పాత్ర అతడి కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. చదవండి: భార్యకు ఫామ్హౌస్ రాసిచ్చిన ఎన్టీఆర్! పికాసో మూవీ రివ్యూ -
బిల్డింగ్పై నుంచి పడిపోయిన స్టార్ హీరోయిన్ భర్త
ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాసిల్ షూటింగ్లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ అదుపుతప్పి నటుడు బిల్డింగ్పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం కాగా, కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఫాహద్ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఆయన 'సూపర్ డీలక్స్' సినిమాలో కనిపించారు. 2014లో ఫాహద్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్’ కూడె’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని సరసన ‘అంటే సుందరానికీ!’ అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి : (నజ్రియా నజీమ్ ‘వాది’ కమింగ్!.. ఎందుకంటే..) (‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’) -
విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం
2020 భారతీయ సినీ పరిశ్రమలో తీరని విషాదాన్ని మిగిల్చింది. రెండురోజుల క్రితం దర్శకుడు షానవాజ్ మరణం నింపిన విషాదాన్నుంచి ఇంకా తేరుకోక ముందే మలయాళ మూవీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరుస్తోంది. ప్రముఖ నటుడు అనిల్ పీనేదుమంగాడ్ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనిల్ శుక్రవారం సాయంత్రం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుపుళం మలంకర డ్యామ్లో ప్రమాదవశాత్తు మునిగి కన్నుమూశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాయంత్రం నేడు స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ సహా, మలయాళ చిత్రపర్రిశమ ప్రముఖులు అనిల్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ) ఇలక్కీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీటిలో మునిగి అనిల్ ప్రాణాలు కోల్పోయారు. తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రమాదం సంభవించిందనీ, వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ముట్టం పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా తిరువనంతపురానికి చెందిన అనిల్ ‘కమ్మతిపాడమ్ మూవీతో ఫ్యామస్ అయ్యారు. ఆ తరువాత రాజీవ్ రవి చిత్రం కమ్మట్టిపాడోమ్లో విలన్గా, మలయాళ సూపర్హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియమ్లో పోలీసు అధికారిగా అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్నారు. ఇంకా పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్ చిత్రాల్లో కూడా ఆయన తనదైననటనతోఆకట్టుకున్నారు. మరోవైపు యాదృచ్చికంగా మరణించడానికి కొన్ని గంటల ముందు అనిల్ ఫేస్బుక్లో ఒకపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది జూన్లో మరణించిన అయ్యపనమ్ కోషియం దర్శకుడు సచి లేదా కె.ఆర్ సచిదందన్ను తలుచుకుంటూ.. నేను చనిపోయేవరకు మీరు నా ఎఫ్బి కవర్ ఫోటోలో ఉంటారంటూ ఫేస్బుక్లో రాశారు. దీంతో అనిల్ అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. అంతకుముందు ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. (ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు) Nothing. I have nothing to say. Hope you’re at peace Anil etta. 💔 pic.twitter.com/B6hOHGffkA — Prithviraj Sukumaran (@PrithviOfficial) December 25, 2020 View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
కేరళ పిటిషన్ను తొసిపుచ్చిన సుప్రీంకోర్టు
తిరువనంతపురం: మలయాళ నటుడు దిలీప్ కుమార్తో పాటు మరి కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసుల విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జస్టీస్ ఏఎం నేతృత్వంలోని ఖాన్విల్కర్ ధర్మాసనం ట్రయల్ జడ్జిపై పక్షపాత ఆరోపణలు చేయడం అనవసరమని కేరళ హైకోర్టుతో అంగీకరించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ ‘బాధితురాలిపై ప్రాసిక్యూషన్, పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు’ అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘విచారణ నేపథ్యంలో బాధితురాలిని పరీక్షించే సమయంలో ఈ కేసులో 5వ నిందితుడు తన ఫోన్లో కోర్టు హాల్ చిత్రాలను తీశాడు. అదే విధంగా బాధితురాలైన సదరు మహిళ కోర్టుకు వస్తున్న కారు ఫొటోలు కూడా తీశాడు. అయితే ప్రాసిక్యూషన్ వారు ఈ అంశాలను ట్రయల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ట్రయల్ కోర్టు ఈ విషయంలో మౌనం వహించింది. దీనిని భారత ఆధారాల చట్ట ఉల్లంఘనగా నిర్వహించబడుతోందని’ రాష్ట్ర ప్రభుత్వం తన పటిషన్లో సుప్రీంకు నొక్కి చెప్పింది. అంతేగాక ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు 40 మంది డిఫెన్స్ న్యాయదులు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. కోర్టు హాల్లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులను అనుమతించిన కారణంగా బాధితురాలిని ప్రశ్నించడంలో నైతిక స్వభాన్ని ప్రశ్నించినప్పటికి లైంగిక వేధింపుల వివరాలపై ప్రశ్నించకుండా విచారణను అడ్డుకోవడంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తి విఫలమ్యారని ప్రభుత్వం పేర్కొంది. చెప్పాలంటే ఒక దశలో ట్రయల్ జడ్జి స్పష్టమైన కారణం లేకుండానే ఆందోళన చేందారని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా అనవసర వ్యాఖ్యలు చేసినట్లు రాష్ట్ర ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మహిళ కారులో కొచ్చి వెళ్తుండగా ఆమెను బంధించి నటుడు దిలీప్తో పాటు కొంతమంది వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అంతేగాక ఈ ఘటన సమయంలో నిందితులు ఘటనకు సంబంధించి తమ ఫోన్లో వీడియోలు, ఫొటోలు కూడా తీశారని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా నటుడు దీలిప్ను బాధితురాలు ఆరోపించడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. -
‘జెండాపై కపిరాజు’ నటుడు మృతి
కొచ్చి(కేరళ): మలయాళ నటుడు అనిల్ మురళీ(56) గురువారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠన్మారణం తమిళ, తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ నటులు టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య సుమ, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. (చదవండి: సీనియర్ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత) Rest in peace Anil Etta. #AnilMurali 🙏 pic.twitter.com/nbCiPr09bD — Prithviraj Sukumaran (@PrithviOfficial) July 30, 2020 అనిల్ మొరళీ మొదట 1993లో ‘కన్యాకుమారియిల్ ఒరు కవిత’ అనే సినిమాతో తమిళ పరిశ్రమలో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాతి తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో నాని హీట్ సినిమా ‘జెండాపై కపిరాజు’, ’రంగేలీ కాశీ’లో నటించిన ఆయనకు తమిళంలో నటించిన ‘అవతారం’, ‘రాక్ అండ్ రోల్’, ‘బాడీగార్డ్’, ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘బ్రదర్స్ డే’ చిత్రాల్లోని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆయన సినమాల్లోకి రాకుముందు పలు సీరియల్లో కూడా నటించారు. ఆహా డిజటల్ ప్లాట్ఫాంలో వస్తున్న ‘ఫొరోన్సిక్’ ఆయన చివరి చిత్రం. ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. -
పెళ్లికి రెడీ అవుతోన్న 'దృశ్యం' నటుడు
తిరువనంతపురం: 'దృశ్యం' నటుడు రోషన్ బషీర్కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. కేరళలో తన ప్రేయసి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దగ్గరి బంధువైన ఫర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేరళ ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. కాగా ఎప్పటినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్దరినీ పెళ్లి బంధంతో ఒక్కటి చేసేందుకు పెద్దలు నిర్ణయించుకోవడంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను రోషన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫర్జానా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) రోషన్ బషీర్ "ప్లస్ టూ" చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'ఇన్నను ఆ కల్యాణం', 'బ్యాంకింగ్ అవర్స్', 'రెడ్ వైన్' వంటి పలు సినిమాల్లో కనిపించారు. కానీ అతనికి మంచి బ్రేక్నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రోషన్ నెగెటివ్ పాత్రలో మెరుగైన నటన కనబరిచారు. ఈ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. చైనీస్లోనూ ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ టైటిల్తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
మళయాలం హీరోయిన్ అను సితార అదిరే స్టిల్స్
-
ప్రేయసిని పెళ్లాడిన నటుడు
తిరువనంతపురం: మలయాళ నటుడు గోకులన్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు ధన్యను గురువారం వివాహమాడాడు. స్వస్థలం ఎర్నాకుళంలోని ఓ గుడిలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ జంట పెళ్లి జరిగింది. గోకులన్ తెలుపు రంగు షర్టు, దోవతి ధరించగా... ధన్య ఎరుపు రంగు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. ఇక ఇద్దరు తమ దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. (నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి) ఇక అత్యంత నిరాడంబరంగా జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను నటుడు జయసూర్య ఫేస్బుక్లో షేర్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గోకులన్- ధన్యను అభిమానులు విష్ చేస్తున్నారు. కాగా థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించిన గోకులన్ లాల్ బహదూర్ శాస్త్రి, సప్తమాశ్రీ తస్కరహ, రమంతే ఎదన్తోట్టం వంటి సినిమాల్లో నటించాడు. పున్యలన్ అగర్బత్తీస్ సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (జోయాపై ఆదిత్య ఠాక్రే ప్రశంసలు!) -
మలయాళ నటుడు కన్నుమూత
త్రిస్సూర్: మలయాళ నటుడు, ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ జయేశ్(44) కన్నుమూశారు. ఏడాది నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా ఆదివారం కేరళలోని కోడాకర శాంతి ఆసుపత్రిలో చేరారు. చివరి వరకూ మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం ప్రాణాలు విడిచాడు. ఆయన మరణంతో మలయాళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా క్రితం రోజే మలయాళ చిత్ర నిర్మాత జిబిత్ జార్జ్ భారీ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. (దర్శకుడు రాజ్ మోహన్ మృతి ) కేరళలోని త్రిస్సూర్కు చెందిన గోపీ మీనన్, ఆరికట్టు గౌరీ దంపతులకు జయేశ్ జన్మించారు. అతను సునాజా అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించారు. రెండేళ్ల క్రితం అతని కుమారుడి మరణించగా ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆయన "ముల్లా" చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. 'ప్రేతమ్ 2', 'క్రేజీ గోపాలం', 'సుసు సూది వాల్మీకం' చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు. అటు సినిమాలే కాకుండా, ఇటు పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఎప్పుడూ మిమిక్రీని వదిలిపెట్టలేదు. (పురుడు పోసిన సినీ రచయిత) -
డీ గ్లామర్ లుక్ లో...
మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ కొత్త లుక్లోకి మారిపోయారు. డ్రీమ్బాయ్ లుక్లో కనిపించే ఆయన డీ గ్లామర్ రోల్లోకి చేంజ్ అయ్యారు. ఇదంతా ఆయన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ కోసమే. మలయాళ ఇండస్ట్రీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆడు జీవితం’ ఒకటి. మలయాళంలోని ఓ ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ విభిన్న గెటప్స్లో కనిపిస్తారట. ఆ గెటప్స్లో ఇదొకటి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. 25 సంవత్సరాల తర్వాత మలయాళ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించనుండటం విశేషం. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక.