R K Roja
-
యువ గళమా.. నారా గరళమా? మంత్రి రోజా ఫైర్
సాక్షి,తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో చేపట్టబోయే యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. అది యువ గళమా లేక నారా గరళమా? అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నవారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారామె. తిరుపతి పర్యటనలో భాగంగా బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి రోజా. టీడీపీకి ప్రతిపక్ష అర్హత కూడా లేదని విమర్శించారు మంత్రి రోజా. లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యాడు. నారా ఫ్యామిలీ ఏపీని అప్పుల్లో ముంచెత్తిందని విమర్శించారు. ‘ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్.. ఇవాళ అన్స్టాపబుల్ షోకి వెళ్ళాడు. చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్ళాడు. అలగా జనం, సంకర జాతి వంటి పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న షోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారుతాడు. జనసేన కార్యకర్తలతో బీజేపీ, టీడీపీ జెండాలు మోయిస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేసే జగన్మోహన్రెడ్డి వెంట నడవండి. ప్రతిపక్షాలు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే పని చేయకండంటూ హితబోధ చేశారామె. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 62లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇస్తోంది. రెండున్నర లక్షల మందికి అదనంగా జనవరి నెలలో ఇస్తున్నారు అని మంత్రి రోజా తెలిపారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నాడు: మంత్రి అంబటి ఫైర్ -
‘కడుపుకి అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా’
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం టీడీపీ చేస్తున విమర్శలపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. విజయపురం మండలం విద్య వనరుల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 70 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, క్యాబినేట్ మంత్రులు కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగితే ఎంత వెటకారంగా, స్టుపిడ్గా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు వెనకున్న నేరస్థుడిని పట్టుకుని శిక్షించకుండా.. ఆ తప్పు ఎవరి మీద నెట్టేయాలని, ఎలా తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ ప్రెసెమీట్లను చూస్తుంటే అధికారులను ఏవిధంగా వాడుకుంటున్నాడో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు చెబుతున్న ప్రతిమాట అబద్దమని నిరూపితమవుతూనే ఉందన్నారు. కత్తి జనవరి నుంచి హోటల్లోని ఉందని, అప్పటి నుంచి హోటల్ యజమాని హర్షవర్దన్ చౌదరి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయన లోకేష్కు , చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను అంతమొందించడానికి ఇది టీడీపీ చేసిన కుట్రేనని విమర్శించారు. ఆపరేషన్ గరుడ గురించి సిగ్గులేకుండా మాట్లాడుతన్న చంద్రబాబు.. శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలన్నారు. ఆపరేషన్ గరుడ వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకి తీయాలని డిమాండ్ చేశారు. -
‘అప్పుడు దండగన్నాడు.. ఇప్పుడేమంటాడో’
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. క్యాబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేకే రక్షణ లేనిచోట ఇక ప్రజలకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేదనీ, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా, అరుకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు ఆదివారం ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో వ్యవసాయంపై మాట్లాడతాననడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. ప్రజాభిమానం జగన్కు జై అంటోంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అడుగులో అడుగేసి లక్షలాది జనం కదం తొక్కడంతో కృష్ణా బ్యారేజీ గడగడలాడిందనీ, గోదారి తీరం ఉప్పొంగిందనీ, విశాఖ తీరం పోటెత్తిందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా విజయపురం మండలంలో మంగళవారం రోజా పాదయాత్ర చేశారు. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలోని కొత్త వలసలో 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. ‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా మంచు మనోజ్ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
ఉద్యోగులేమైనా ఉగ్రవాదులా ?
విజయపురం : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి, ఓపీఎస్ను అమలు చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీని ప్రభుత్వం భగ్నం చేయడంపై బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల ద్రోహి అని.. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు. సీపీఎస్ రద్దు కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉద్యోగులను ఉగ్రవాదుల్లాగా కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్టు చేయించడం దారుణమన్నారు. ఉద్యోగులపై సర్కారు దమనకాండను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇదే చంద్రబాబు 2003లో సీపీఎస్ను తీసుకొచ్చారని, వాటిని రద్దు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగస్తులను కొట్టడం చంద్రబాబుకు కొత్తేమి కాదని.. ఇది వరకే అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే సీపీఎస్ రద్దు చేస్తామని, ఇది ఉద్యోగులు గుర్తించుకోవాలన్నారు. -
స్త్రీలోక సంచారం
►తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నాలుగేళ్లలో మహిళల సమస్యలను పరిష్కరించలేకపోయిన అధికార టి.ఆర్.ఎస్.పార్టీ వైఫల్యాలను మహిళలే ఎండగట్టాలని మంగళవారం హైదరాబాద్లో జరిగిన బి.జె.పి.మహిళా మోర్చా సమావేశంలో పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. తెలంగాణ తొలి క్యాబినెట్లోనే మహిళలకు చోటు లేకపోవడం సిగ్గు చేటు అని అంటూ, ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రక్షణశాఖ మంత్రిగా, లోక్సభ స్పీకర్గా మహిళల్నే నియమించడాన్ని గుర్తు చేశారు. బి.జె.పి త్వరలోనే హైదరాబాద్లో ‘మహిళా సమ్మేళన్’ని నిర్వహించబోతోందని, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరవుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ►కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ 2017’కు ఎంపికైన తెలంగాణ యువతి బొడ్డపాటి ఐశ్వర్యకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ నావికాదళంలో లెఫ్ట్నెంట్ కమాండర్గా ఉన్న ఐశ్వర్య.. గతంలో నారీ శక్తి అవార్డు, నావ్సేన అవార్డులను కూడా పొందారు. ► చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యాలని మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ హైకోర్టు.. 2013 నాటి లలితా కుమారి కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు విషయమై సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళిని అనుసరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకు సూచించింది. పత్రికా ప్రతినిధుల సమావేశంలో బోడె ప్రసాద్ అసభ్యకరమైన భాషలో తనను దూషించారని రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని రోజా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుకు ఆదేశించింది. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతున్న రెండవ ‘యూరేషియన్ ఉమెన్స్ ఫోరమ్’లో పాల్గొనేందుకు బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోనియా మొదట.. ‘మహిళల భద్రత, నిరంతర అభివృద్ధి’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో పాల్గొని, ఆ తర్వాత.. యువతీ యువకుల నుంచి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు స్వీకరించే చర్చావేదికలో ప్రసంగిస్తారు. ►జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లా, ఖాజీగండ్లో శనివారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో మరణించడానికి ముందు.. రెండేళ్ల క్రితమే తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరిన 16 ఏళ్ల జాహిద్ అహ్మద్ మిర్ అలియాస్ హషీమ్.. ఒక ఇంట్లో దాక్కుని ఉన్న తనను భద్రతాదళాలు చుట్టుముట్టి, ప్రాణాల మీద ఆశ ఉంటే లొంగిపొమ్మని హెచ్చరిస్తుండగా.. ఆ ఆఖరి నిమిషాల్లో అతడు తల్లికి ఫోన్ చేసి.. ‘‘అమ్మా నన్ను లొంగిపొమ్మంటున్నారు. ఏం చెయ్యమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి.. ‘‘వద్దు వద్దు.. తప్పించుకోగలిగితే తప్పించుకో. అంతే తప్ప లొంగిపోవాలన్న ఆలోచనలే రానీయకు’’ అని చెప్పిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల బక్రీద్ రోజు ఫయాజ్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ హత్యతో కూడా సంబంధం ఉన్న జాహిద్ అహ్మద్.. చనిపోయేముందు తన తల్లితో మాట్లాడిన ఫోన్ ఆడియో క్లిప్పును ఇప్పుడు కశ్మీర్లోని వేర్పాటువాదులు.. తల్లిదండ్రుల భావోద్వేగభరితమైన విజ్ఞప్తులకు తలవొగ్గి భద్రతాదళాలకు యువత లొంగిపోకుండా ఉండటం కోసం విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ►తొలిసారి ప్రసవించినవారు ఆన్లైన్లో షేర్ చేసుకుంటున్న తమ భయానకమైన అనుభవాలను చదివి గర్భిణులలో ఎక్కువ శాతం మంది సహజమైన ప్రసవాన్ని కోరుకోవడానికి జంకుతున్నారని ఇంగ్లండ్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హల్’లో సీనియర్ ఫెలో రీసెర్చ్గా పని చేస్తున్న క్యాట్రియోనా జోన్స్.. గతవారం జరిగిన ‘బ్రిటిష్ సైన్స్ ఫెస్టివల్’లో ప్రసంగిస్తున్నప్పుడు వెల్లడించారు. ఈ ‘హారర్ స్టోరీలు’ చదివి ‘టోకోఫోబియా’కు గురవుతున్న ఎందరో గర్భిణులు సిజేరియన్లకు మొగ్గుచూపుతున్నారనీ, అయితే.. ఆన్లైన్లో భయానక అనుభవాలతో పాటు.. అరకొరగా ఉండే అహ్లాదకరమైన అనుభవాలనే తమకు వర్తించుకుని గర్భిణులు భయపడ్డం మానేయాలని, బిడ్డకు జన్మనివ్వడం అనేది మరీ అంత ప్రాణాంతకం ఏమీ కాదని జోన్స్ సలహా ఇస్తున్నారు. ► హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత, రెండు ఆస్కార్ల విజేత సీన్ పెన్ (58).. ‘మీ టూ’ ఉద్యమం.. సమాజంలో స్త్రీ, పురుషులను వేరు చేస్తోందనీ, వారి మధ్య అనుమానాలను, అపార్థాలను శత్రుత్వాన్ని పెంచి పోషిస్తోందనీ విమర్శించారు. అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ‘హులు’ నిర్మించి, ఈ నెల 14న ప్రారంభించిన ఎనిమిది ఎపిసోడ్ల అమెరికన్–బ్రిటిష్ డ్రామా వెబ్ టెలి విజన్ సిరీస్ ‘ది ఫస్ట్’లో తన సహనటి నటాషా మెకెల్హోన్తో పాటు నటిస్తున్న సీన్ పెన్.. ఆ సీరియల్ కథలో అంగారక గ్రహానికి ప్రమాదకరమైన ప్రయాణం చేసే శక్తిమంతమైన మహిళల గురించి తమను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ‘మీ టూ’ ప్రస్తావన వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ►బుధవారం (నిన్న) ఇండియా–పాకిస్తాన్ మధ్య దుబాయ్లోని స్పోర్ట్స్ క్లబ్లో ఆసియా కప్ క్రికెట్ వన్డే మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు భారత టెన్నిస్ స్టార్, ఇప్పుడీ మ్యాచ్లో ఆడుతున్న పాకిస్తానీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ భార్య అయిన సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అయ్యారు! ‘‘ఇక ఈ ఆట మొదలయ్యాక ఆరోగ్యకరంగా ఉండే మనిషి కూడా సిక్ అవుతారు. అలాంటి ఉంటాయి సోషల్ మీడియాలో కామెంట్లు. పైగా ఒక గర్భిణికి అసలే అవసరం లేని కామెంట్స్ అవి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాచ్ మాత్రమే’’ అని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి అదృశ్యం అయిపోయారు సానియా. -
రోడ్డు మీద నాట్లేసిన రోజా
చిత్తూరు : రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్ బంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే
-
ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే: రోజా
సాక్షి, తిరుపతి : రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే సీఎం చంద్రబాబు అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, ఈ హామీ వట్టి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రుణాలు కూడా మాఫీ కాలేదని, ఈ బూటకపు హామీలతో అమాయక ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కార్మిక ద్రోహిఅని, ఆయన పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతబడ్డాయన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ మంచి గుర్తింపు పొందిందని, కార్మికుల పొట్టకొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. ఈ గ్యారేజ్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రోజా స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపుతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చదవండి: రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం -
వైఎస్ జగన్ పిలుపుతో కేరళకు కదిలిన కార్యకర్తలు
సాక్షి, చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వారు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10 లక్షల రూపాయలు, 14 టన్నుల బియ్యం, పప్పు ధాన్యాలు, చీరలు సేకరించారు. పుత్తూరు నుంచి 30 మందితో కూడిన పార్టీ బృందం.. సేకరించిన సరుకులు, నగదును తీసుకుని కేరళకు పయనమైందని రోజా తెలిపారు. కాగా, తన వంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని ప్రకటించి ఎమ్మెల్యే రోజా బాధితులకు బాసటగా నిలిచారు. -
బోడెపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గత వారం రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గత నెల 9న బోడె ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే రోజాను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారన్నారు. దీనిపై గత నెల 14న పెనమూరు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపగా, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. -
ఏపీని దోచుకుని సింగపూర్లో దాచుకుంటున్నారు
ప్రకాశం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్లో దాచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్లతో టీడీపీ కుమ్మక్కై విర్రవీగుతున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయని..అది తట్టుకోలేకే భారతిపై రాద్ధాంతం చేస్తున్నారని తెలియజేశారు. బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ టీడీపీ లోలోపల కుమ్మక్కు అయింది.. వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు..టీడీపీ పెడితే తీసుకున్నారు..ఇదే కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ను ఓడించండి అన్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కౌగిలించుకుంటున్నారు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం చంద్రబాబు అని తీవ్రంగా ఎద్దేవా చేశారు. పచ్చపత్రికల అండతో టీడీపీ రెచ్చిపోతుందని, భారతిపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. బాబుకు కౌంట్డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా అరెస్ట్ చేయలేదు..టీడీపీ నేత సుజానా చౌదరీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన దొంగ..అలాంటి వారు కూడా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు. -
బోడే ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా హైకోర్టును ఆశ్రయించారు. బోడే ప్రసాద్పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా గత నెల 9న బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి, తనను ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ మాట్లాడారని తెలిపారు. మహిళ అన్న కనీస మర్యాద, గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ నేపథ్యంలో తాను గత నెల 14న పెనమలూరు పోలీసులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదని ఆమె వివరించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
బెల్టు షాపుల తొలగింపునకు.. 15 రోజులు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులను తొలగించేందుకు 15 రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా ప్రభుత్వం స్పందించకపోతే మహిళలే రంగంలోకి దిగి ధ్వంసం చేస్తారని ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయవాడలోని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. బెల్టు షాపులను లేకుండా చేయడంతో పాటు, బడికి గుడికి, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని కోరుతూ అంతకుముందు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడుకు వినతిపత్రం అందజేసింది. అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ అనే తుపాన్తో రాష్ట్రంలోని అన్ని వర్గాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో గృహ హింస జరగడానికి, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు జరగడానికి మద్యం ప్రధాన కారణమన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత సీఎంకు ఉన్నా పట్టించుకోకుండా అన్ని నేరాలకు బాధ్యుడయ్యారని విమర్శించారు. ఇన్ని చేస్తూ కూడా చంద్రబాబు సిగ్గు లేకుండా మహిళా సంక్షేమం అంటూ విజయవాడ రోడ్లపై ర్యాలీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గమైన నగిరిలో చంద్రబాబు ఆయన బినామీలకు తప్పుడు దారిలో మద్యం లైసెన్స్ ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. సంతకం పెడితే నిమిషంలోనే అమలులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు చేసిన సంతకాలకు విలువ లేకుండా పోయిందన్నారు. కాల్మని, సెక్స్ రాకెట్, అత్యాచారాల నిందితులకు టీడీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల వల్ల ఎక్కడపడితే అక్కడే మద్యం విక్రయాలు చేపడుతున్నందున మహిâýళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. నేరస్థుల పట్ల సీఎం తీరుతోనే మహిళలపై అఘాయిత్యాలు నేరస్థులను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల ఫలితంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళల మద్దతు కూడగట్టేలా పార్టీ మహిళా విభాగం పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిన విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అదే విధంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రకటించిన ప«థకాలు, వారి రక్షణకు తీసుకునే చర్యలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మహిళలు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందారో తెలిజేయాలని కోరారు. మద్యం నియంత్రణ లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైందని, ఆడవాళ్లు రోడ్డుపై ఒంటరిగా నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పలు జిల్లాల నుంచి హాజరైన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త పద్మావతి, కొల్లి నిర్మిలా కుమారి, కైలా జ్ఞానమణి, కృష్ణవేణి, తాతినేని పద్మావతి, బండి నాగపుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. -
‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’
సాక్షి, విజయవాడ : 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. బెల్టు షాపులను తొలగించాలని కోరుతూ బుధవారం ఆమె ప్రసాదం పాడు ఎక్సైజ్ కార్యాలయంకు వెళ్లి కమిషనర్కు వినతిపత్రం అందిచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఆరోపించారు. మహిళల సాధికారత దిశగా చంద్రబాబు సర్కార్ ఆలోచించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ఒక్క సంతకం పెడితే ఆ నిమిషం నుంచే ఏదైనా అమల్లోకి రావాలని, అది వైఎస్సార్సీపీతోనే సాధ్యమవుతుందన్నారు. కోర్టులను కూడా ఎక్సైజ్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
పథకం ప్రకారమే పచ్చ డ్రామా
సాక్షి, హైదరాబాద్: ‘అసలు రాందాస్ అథవాలే ఎవరు? ఆయన మమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించడమేంటి? దాన్ని పచ్చ చానల్స్ హంగామా చేయడమేంటి? చూస్తుంటే.. ఇదంతా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పథకం ప్రకారం ఆడిన డ్రామాలా అన్పించడం లేదా?’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజా ఏమన్నారంటే.. ‘తండ్రీకొడుకులు కేంద్ర మంత్రి అథవాలేతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకుని, ఆయనతో ప్రెస్మీట్ పెట్టించి ప్రకటన ఇప్పించారు... ఆయన అలా ప్రకటన చేయడం ఆలస్యం నారా లోకేశ్ ఇది కుట్రంటూ ట్వీట్ చేసేశారు.. ఆ మరుక్షణమే సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టారు. నిజంగా ఇదంతా కుట్ర కాదా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఇది. బీజేపీ కాదుకదా.. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని వైఎస్ జగన్ ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నారు’ అని రోజా గుర్తు చేశారు. అధికారం కోసం వైఎస్ జగన్ ఏ పార్టీతోనూ ఇప్పటివరకూ జత కట్టలేదని, పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడలేదని తెలిపారు. దమ్ముంటే కెమెరా ముందుకు రా పప్పూ చంద్రబాబు తన 1500 రోజుల దరిద్రపు పాలనపై ప్రజలు చర్చించుకోకుండా పక్కదారి పట్టించేందుకు డ్రామాకు తెరతీశారని రోజా అన్నారు. జగన్ బీజేపీలోకొస్తే బాగుంటుందని అథవాలే చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. వెంటనే నిప్పు (చంద్రబాబు) ప్రెస్మీట్ పెట్టేశాడని, నిమిషాల్లోనే పప్పు (లోకేశ్) ఇది కుట్రంటూ ట్వీట్లు చేశాడని మండిపడ్డారు. లోకేశ్కు ధైర్యం ఉంటే తమ పార్టీ ఏం కుట్ర చేసిందో కెమెరాల ముందుకొచ్చి చెప్పాలన్నారు. జనంలోకి వెళ్లలేక.. బురదజల్లుతారా? మంచి చేసి ప్రజల మెప్పు పొందాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, ఎదుటివారిపై బురదజల్లి, తన పచ్చమీడియాలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడమే ఆయనకు తెలిసిన విద్యని రోజా ధ్వజమెత్తారు. 1999, 2004, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసే చంద్రబాబు ఎన్నికలకెళ్లారని గుర్తుచేశారు. ఒంటరిగా ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి జగన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. మేలు జరిగిందెవరికి? చంద్రబాబు పాలనలో ఆయనకు, ఆయన కుమారుడికి, ఆయన మీడియా సంస్థలకు తప్ప ఇంకెవరికీ ప్రయోజనం కలగలేదని రోజా అన్నారు. ప్రజల సంపదను దోచుకోవడమే కాకుండా, టీటీడీ ఆస్తులూ కాజేసేందుకు పథకాలు వేశారని ఆమె మండిపడ్డారు. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేసినట్టు చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే 2014 ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు. కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని, ఆయన ఎప్పుడొచ్చినా రైతుల జీవితాలు కరవుతో అల్లాడిపోతున్నాయని విమర్శించారు. గతంలో చంద్రబాబు 3,178 రోజులు పరిపాలించాడని, ఆ పాలన దరిద్రంగా ఉండబట్టే ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో రాష్ట్రాన్ని నెంబర్వన్గా చేయడమే చంద్రబాబు సాధించిన ఘనతని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరం అవినీతి, టీటీడీ అక్రమాలు, రాజధానిలో రైతుల భూములు దోచుకోవడం, ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ చేశారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయినవారికి ఇప్పటికీ న్యాయం చేయని పాలన బాబుదని ధ్వజమెత్తారు. పాఠశాలలకు సెలవైనా వనం– మనం పేరుతో పిల్లలను తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అరాచకాలపై విచారణ జరుపుతామని, నష్టపోయినవారికి న్యాయం చేస్తామని చెప్పారు. -
రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బోడె ప్రసాద్పై ఫిర్యాదు..
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కంకిపాడు పీఎస్లో బోడె ప్రసాద్పై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు, అడ్వకేట్లు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుడా.. ఇది కంకిపాడు పీఎస్కు రాదని.. పెనమలురు పీఎస్కు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో నాయకులు పెనమలూరు పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు అక్కడి వెళ్లి గంటలపాటు పడిగాపులు కాశారు. కొన్ని గంటలపాటు పీఎస్లోనే ఉన్నారు. అయినా కూడా ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. బోడె ప్రసాద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి భయంతోనే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుది సింగపూర్ పర్యటన కాదు.. దొంగపూర్ పర్యటన అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతేకాక టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాపై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘బోడె ప్రసాద్ వాజమ్మలా మాట్లాడాడు. బోడె ప్రసాద్ ఇసుక దొంగ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. బోడె మిత్రుడు శ్రీకాంత్ కాల్మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు. ఈ విషయం అప్పటి సీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చెప్పారు. బోడె నీ ఇంట్లో ఆడవాళ్ళు ఐనా నీ ప్రెస్మీట్ చూడగలరా? నోటి కొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కాదు. వీధి రౌడీలా, గూండాలా మాట్లాడుతావా? పెనమాలూరులోని ఇసుక దోపిడీని నిరూపిస్తాం. బోడె నీకు ఇంక 5,6 నెలల కాలమే ఉంది, గుర్తుంచుకో. బోడె ఇంటర్ పరీక్షల్లో వేరే వారితో దొంగ పరీక్ష రాయించిన ఘనుడువని ధ్వజమెత్తారు. సెక్స్, కాల్మనీ పనులు ఆపండి. బోడిమాటలు మాట్లాడటం ఆపు బోడె ప్రసాద్. ఓపెన్ టెన్త్ పరీక్షలో అడ్డంగా దొరికిపోయావు. శాసన సభ్యుడిగా కొనసాగే అర్హత బోడె ప్రసాద్కు లేదు. రోజాపై ఒక్క చెప్పు పడితే.. మీ నాయకుడిపై లక్షల చెప్పులు పడతాయి. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారు. 52 నెలల పాలనలో 24 సార్లు విదేశాలకు వెళ్లారు. కనీసం 24 కోట్ల రూపాయల పెట్టుబడులైనా తీసుకొచ్చారా? చంద్రబాబు నీ దొంగపూర్ పర్యటనల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావని’ వైఎస్సార్సీపీ నేత సుధాకర్ బాబు విమర్శించారు. -
వైఎస్సార్ పేరు కాదు.. బ్రాండ్: రోజా
-
వైఎస్సార్ పేరు కాదు.. బ్రాండ్: రోజా
సాక్షి, విజయవాడ : నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగిరి ఎమ్మెల్యే రోజా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రతి గుండే ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటోందని రోజా అన్నారు. వైఎస్సార్ అనేది పేరు కాదు.. బ్రాండ్ అని తెలిపారు. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు వైఎస్సార్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలనో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్లాగా సంక్షేమాన్ని అందించగలిగే, వైఎస్సార్ వారసత్వాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది దోచుకొని దాచుకునే నైజమని రోజా వ్యాఖ్యానించారు. బాబు అసమర్ధత సీఎం అని, విదేశీ పర్యటనలో పేరుతో దోచుకున్న డబ్బుని దాచి వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు నువ్వు కూడా జగన్ని విమర్శిస్తావా.? నాలుగేళ్లు బీజేపీతో ఉండి ఇప్పుడు విమర్శలా.. అని దుయ్యబట్టారు. అఫిడవిట్ విషయంలో సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నం
పుత్తూరు: నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు ఆర్కే రోజాపై అధికార టీడీపీకి చెందిన అల్లరిమూకలు దాడికి యత్నించాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాలను బుధవారం ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాయి. టీడీపీ అల్లరిమూకల చర్యలతో ఆస్పత్రి ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. మరోవైపు దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుల మధ్య ఆధిపత్య పోరుకు ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. రాష్ట్రమంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడికి ప్రయత్నించడంతో ఆ పార్టీ వర్గాలు విస్తుపోయాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిని తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనాల కోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. ఆ భవనాల ప్రారంభోత్సవాన్ని అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా అధ్యక్షత వహించగా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ వారి అనుచర వర్గాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. ఎమ్మెల్యే రోజా పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు దివంగత మద్దుకృష్ణమ పేరుతో నినాదాలు చేయగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలిచ్చారు. ఇంతలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు మద్యం మత్తులో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను చుట్టుముట్టారు. ఒక దశలో చేతులు పైకెత్తి ఎమ్మెల్యేపై దాడికి దూసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే రోజా గన్మాన్ తుపాకి గాలిలోకి ఎక్కుపెట్టి హెచ్చరించారు. మరో వైపు గాలి భానుప్రకాష్ వర్గీయులు గాలి జగదీష్పైకి దూసుకు వచ్చారు. ఎమ్మెల్యే రోజా గాలి జగదీష్ను తనవైపునకు రమ్మని రక్షణనిచ్చారు. అల్లరి మూకలు రెచ్చగొట్టినా ఎమ్మెల్యే రోజా సంయమనం పాటించి నేతలందరినీ సన్మానించి రాజనీతి ప్రదర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు డ్రామా కంపెనీ నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు దొంగదీక్షలు చేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తడ్రామాకు తెరసీందని ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని నాలుగేళ్లుగా పోరాడకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత దొంగదీక్ష చేయించారని ఆరోపించారు. ఆయన చేసిన నిరాహారదీక్షకు సంబంధించి మెడికల్ రిపోర్టులను బహిర్గతం చేయాలని రోజా డిమాండ్ చేశారు. చేతనైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్షలు చేయాలని ఆమె చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. అలాకాకుండా చీకట్లో ప్రధానిమోదీ, అమిత్షా కాళ్లు పట్టుకుంటూ రాష్ట్రంలో దీక్షలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. -
టీడీపీ దాదాగిరి: రోజాపై దాడికి యత్నం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పుత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ప్రోటోకాల్కు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెపై దాడికి యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి ఆమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడం గమనార్హం. అంతకు మందు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. మొన్న టమోటా, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డుపాలు అయ్యారన్నారు. మామాడికి గిట్టుబాటు లేక రైతులు రోడ్లెక్కారు. ఇది చంద్రబాబు సర్కారుకు సిగ్గు కాదా అన్నారు. రైతుల మీద చంద్రబాబుది దొంగ ప్రేమ అని మండిపడ్డారు. -
టీడీపీకి ఓటమి భయం
సాక్షి, హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలు వద్దని ప్రెస్మీట్లు పెట్టడంతో పాటుగా ట్వీట్లు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడమే కాక, ఆయన వెంట జనం ప్రభంజనంలాగా నడుస్తుండటంతో టీడీపీ నేతలకు కంటి మీద కునుకు కరవైందన్నారు. ఫ్లెక్స్ సంస్థపై వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ... లోకేశ్ చేసిన ట్వీట్లు చూస్తే ఆయనకున్న పప్పు అనే బిరుదును సార్థకం చేసుకున్నట్లుందన్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా రాయితీలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఏదో తమ ఘనతగా లోకేశ్ చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ చెప్పుకుంటున్నారని, రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు ప్రకటించారన్నారు. అయితే నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.16,933 కోట్లు మాత్రమేనన్నారు. లోకేశ్ను తొలుత పప్పు ఏదో అనుకున్నామని, ఇపుడాయన తెలివితేటలు చూస్తూంటే గన్నేరు పప్పు అనే విషయం చంద్రబాబుకు కూడా అర్థమై పోయిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇవ్వడానికి విజయవాడ వస్తే మంత్రి దేవినేని ఉమా ఆయనకు వంగి వంగి నమస్కారాలు పెట్టి సేవలందించారన్నారు. దేవినేని ప్రొటోకాల్ మంత్రిగా వ్యవహరించలేదని ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తమ నేత చంద్రబాబుపై కేసులు రాకుండా కాళ్లు పట్టుకున్నట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేత కళా వెంకటరావు జగన్కు లేఖ పేరుతో ఏవో పిచ్చి ప్రశ్నలు వేశారన్నారు. లక్ష కోట్లు అని పాతపాటే పాడారని, నాలుగేళ్లుగా కేంద్రంతో జత కట్టిన టీడీపీ వారు లక్ష కోట్లకు ఆధారాలు ఎందుకు తీసుకురాలేదో? చెప్పాలన్నారు. తన లక్ష కోట్ల ఆస్తిని చూపిస్తే అందులో పది శాతం ఇస్తే మిగతాది మీకే రాసిస్తానని జగన్ అసెంబ్లీలోనే సవాలు విసిరితే ముందుకు రాని టీడీపీ వారు ఇంకా అదే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కళా కనుక చర్చకు వస్తే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని, లేకుంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని రోజా ప్రశ్నించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏరువాక అంటూ బయలుదేరారని, అయితే రైతులు ఆయనపై పోరువాకకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. 2014–16లో మహిళలపై అత్యాచారాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంటే ఇపుడు అది నాలుగో స్థానానికి చేరిందని ఇదీ చంద్రబాబు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఈరోజు సెక్స్ రాకెట్ అమరావతి నుంచి చికాగో వరకూ తీసుకు వెళ్లి తెలుగు వారి గౌరవాన్ని గంగలో కలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ దీక్ష చేస్తున్నది ఏ ప్రభుత్వంపైన నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగిన టీడీపీకి ఇపుడే స్టీలు ఫాక్టరీ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని రోజా ప్రశ్నించారు. అసలు ఎంపీ సీఎం రమేష్ ఎవరి ప్రభుత్వంపై దీక్ష చేస్తున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గత తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ స్టీల్ప్లాంట్ గుర్తుకు రాలేదని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో స్టీల్ ఫ్యాక్టరీకి ఉపక్రమిస్తే నానా యాగీ చేసింది చంద్రబాబేనని ఆమె దుయ్య బట్టారు. తమ పార్టీ ఎంపీ అవినాశ్రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి 8 సార్లు పార్లమెంటులో మాట్లాడితే ఒక్క టీడీపీ ఎంపీ కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మంతెన, వీరమాచినేని డైటింగ్ గురించి చర్చ జరుగుతోందని ఇపుడు సీఎం రమేష్, బిటెక్ రవి దీక్ష చూశాక వారి డైటింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. -
ఆంధ్రజ్యోతిది నీతిమాలిన సర్వే
పుత్తూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్సైట్ల ద్వారా ప్రచారం అవుతున్న వివరాలనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆదివారం సంచికలో సర్వే పేరుతో ప్రచురించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తేల్చి చెప్పారు. సోమవారం ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని ప్రచురించిన ఆంధ్రజ్యోతి సోమవారం మాత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి బాగాలేదని ప్రచురించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తలంటడంతో నగరిలో ఒక్కరోజులో గెలుపు ఓటమిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో సర్వే చేసి టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడం హాస్యాస్పందంగా ఉందని, ఇది నీతిమాలిన సర్వే అని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు దోచిపెడుతున్నారు కాబట్టే ఆ పత్రికా యాజమాన్యం స్వామి భక్తి చూపిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్రెడ్డి, రెడ్డివారి భాస్కర్రెడ్డి, రవిశేఖర్రాజు, ప్రతాప్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాహీన్ పాల్గొన్నారు. -
బాబువి ఊసరవెల్లి రాజకీయాలు
తిరుపతి రూరల్: తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. తన అవినీతిపై విచారణ జరగకుండా ఉండటం కోసమే బీజేపీకి చెందిన వారి బంధువులను సలహాదారులుగా పెట్టుకున్నారని, టీటీడీ బోర్డులో కూడా సభ్యులుగా నియమించారని విమర్శించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి హాజరైన బొత్స సత్యసత్యనారాయణ, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎవరి స్థాయిలో వారు దోచుకుంటున్నారని, పంచభూతాలను సైతం వదలడం లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో సెస్ను విధించి ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారం భారీగా మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు సీమ ద్రోహి: ఆర్కే రోజా రాయలసీమ అభివృద్ధికి గుండెకాయ వంటి కడప ఉక్కు పరిశ్రమ, మన్నవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి సీఎం చంద్రబాబు సీమద్రోహిగా నిలిచారని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. యువతకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టి.. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
నగరి(నిండ్ర): నియెజగవర్గంలో టీడీపీ పాలనలో ఎలాంటి అబివృద్ధి జరగలేదని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ నగరి బూత్ కమిటీ సమావేశంలో ఆమె మట్లాడుతూ నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అధికార పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. నగరి పట్టణంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా అధికారులు, పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని తెలిపారు. నగరి వైద్యాశాల వద్ద బస్సు షెల్టర్ నిర్మాణం, తాగునీటి ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణానికి, మండలంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి టీడీపీ సర్పంచ్లు అనుమతి ఇవ్వలేదని, పుత్తూరు మండలంలోను ఇదే సమస్యగా ఉం దని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి పాలన చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఇక ప్రజ లు ఆయన్ను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ప్రత్యేక హోదా విషయాన్ని బంగాళాఖాతంలో కలిపిన సీఎంగా పేరుతెచ్చుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా తన వంతు ప్రజలకు సహాయం చేయడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు కేజే కుమార్, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమల రెడ్డి, హరిహరన్, సుధాకర్రెడ్డి, రమేష్రెడ్డి, పరుశురామ్, కృష్ణమూర్తి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
బూత్ కమిటీలతోనే పార్టీ పటిష్టం
నగరి (నిండ్ర) : పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజూ దిశానిర్దేశం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నగరి రూరల్ మండల బూత్ కమిటీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియెజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ పటిష్టతకు కమిటీలు సమన్వయంతో వ్యవహరించడం వల్ల పట్టు సాధించామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఆ విషయాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కొత్తగా ఓటర్లను నమోదు చేయించడానికి కూడా మరింత చురుగ్గా వ్యవహరించాలని, దీనివల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ఈ బాధ్యతలు తీసుకోవడంలో బూత్కమిటీలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అమలుకాని వాగ్దానాలతో మోసం చేసిన ప్రభుత్వ పెద్దల తీరుపై ప్రజలను మరింత చైతన్యం చేయడంతో పాటు, అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ అమలు చేయనున్న నవరత్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల అభిమానం చూరగొనాలన్నారు. ఆ ప్రచారం నమ్మవద్దు.. నగరి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా తనకు టికెట్ లేదని కొందరు సాగిస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను కోరారు. నేను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, శ్రేణులు పార్టీని మరింత పటిష్టం చేయాలనే తపనతోనే ఉన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో అధికార పార్టీని సూటిగా నిలదీసే వారిలో నేను కూడా ఒకరినని రోజా తెలిపారు. దీంతో తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. నా జీవితం పార్టీకే అంకితం. జగన్ అన్నకు తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. గెలుపే ధ్యేయం కావాలి.. నగరి నియోజగవర్గంలో పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కేజే.కుమార్ కోరారు. నగరి బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కమిటీ సభ్యులు పార్టీ విజయానికి మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలను ప్రజలకు వివరించి మరింత చైతన్యం చేయాలన్నారు. నగరిలో ఇసుక మాఫియా, ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుజ్జిరెడ్డి, చంద్రారెడ్డి, హరిహరన్, సుధాకర్రెడ్డి, తిరుమలరెడ్డి, నాగయ్యనాయుడు, కృష్ణమూర్తి, పరుశురామ్, ప్రతీప్లు పాల్గొన్నారు. -
బాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు..
సాక్షి, పుత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాలోని పుత్తూరులో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదని.. అందుకే నిన్న(మే10) ప్రెస్ మీట్లో ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు అనడాన్ని బట్టే అర్థమౌతుందన్నారు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్నామో చెప్పాలని ప్రశ్నించారు.. బాబు మతి భ్రమంచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అందుకే ఏంమాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్నీ పదవులు అనుభవించారు. నేడు తన బినామీ ఏపీ ఎన్జీఓతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయండని చెప్పించి ఆ తర్వాత లేదని అనడాన్ని బట్టే అర్థమవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని అమరావతికి పిలిపించి 36 రకాల వంటలు వడ్డించి మన్ననలు పోందటానికి చిన్న చంద్రబాబు ప్రయత్నించారని ఎమ్మెల్యే రోజా విమర్శంచారు. -
‘కాల్’ నాగులతో రోజాపై విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: మహిళల గురించి తెలుగుదేశం పార్టీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. కాల్మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయించారని ఆరోపించారు. అచ్చోసిన ఆంబోతుల్లా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన మహిళలపై ఎదురుదాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఓ దళిత మహిళను వివస్త్రను చేస్తే చర్యలు లేవన్నారు. నారాయణ కాలేజీల్లో మిస్టరీలుగా మిగిలిపోతున్న బాలికల ఆత్మహత్య కేసుల్లో మంత్రి నారాయణపై చర్యలు తీసుకోగలరా అని ఆమె ప్రశ్నించారు. -
బుద్ధిలేని బుద్ధా.. నోరు అదుపులో పెట్టుకో..!
సాక్షి, విజయవాడ : ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు తీవ్రంగా ఖండించారు. బుద్ధిలేని బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దుష్ట పరిపాలనలో మహిళలు, చిన్నారులు నలిగిపోతున్నారని అన్నారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ మహిళలతో లోకేశ్ అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇంట్లో పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేనిపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. -
సీఎం అసమర్థ నాయకుడు: రోజా
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబునాయడు అసమర్థనాయుకుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తమ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆమె పొల్గొని ప్రసంగించారు. చంద్రబాబుకు సమస్య వస్తే.. రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ఓటుకునోట్లు కేసు భయంతోనే ప్రత్యేక హోదా అంశాన్నినీరుగార్చరని మండిపడ్డారు. బీజేపీ లాలుచీలో భాగంగానే మహరాష్ట్ర ఎంపీ భార్యను టీటీడీ మెంబర్గా నియమించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు... దాచేపల్లి ఘటనపై ఈ ఉదయం మీడియాతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా? వైసీపీ పోరాటం చెయ్యటం వల్లే ఇవాళ సీఎం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే బాధితురాలిని పరామర్శించారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులను పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ, బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు కూడా తెలియదా?. పైగా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపైకి నెడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. 55 ఏళ్ల వృద్ధుడ్ని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. సుబ్బయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది. స్వయంగా మీ ఎమ్మెల్యేనే అతనికి ఇంటికి కేటాయించారు. వీటికి ఏం సమాధానం చెబుతారు’ అని రోజా ప్రశ్నించారు. ఇది కొత్తేం కాదు... ‘రిషితేశ్వరి కేసులో సెటిల్ మెంట్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారు. గుంటూరు జడ్ఫీ చైర్పర్సన్ జానీమూన్కు అన్యాయం చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేశారు. ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్ రిపోర్ట్లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని ఆమె నిలదీశారు. టీడీపీ నేతల సంస్కారం ఏది? ‘ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెట్టేశారు. వాటి మూలంగానే నేరాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్లో బికినీ షో పెడితే వైసీపీ అడ్డుకుంది. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు హోం మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే నాపై కొందరు టీడీపీ మహిళా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేనా వాళ్ల సంస్కారం?.. ముందు మహిళలను గౌరవించటం టీడీపీ నేతలు నేర్చుకోవాలి. అధికారంలోకి మద్యపాన నిషేధం అమలు చేస్తానని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది’ అని ఎమ్మెల్యే రోజా చెప్పారు. -
రోజా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన
శృంగవరపుకోట : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎస్. కోటకు చెందిన ఒక అభిమా ని మండుటెండలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. గుం టూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ ఎమ్మె ల్యే రోజా సహా పలువురు నాయకులు దాచేపల్లి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుపై బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గుంటూరు జీజీహెచ్ వద్ద పోలీసులు అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా రోజా సహా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎస్.కోటకు చెందిన వెలుచూరి కృష్ణారావు ఎస్.కోట దేవీ కూడలిలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పైశాచికంగా దాడులు జరుగుతుంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ రాజ్యంలో బతుకుతున్నామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం తీరు దుర్మార్గమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో శ్రద్ధ చూపిస్తే సమాజం బాగుపడుతుందన్నారు. -
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి
పట్నంబజారు (గుంటూరు): అన్యాయం జరిగినా ఆలకించలేదు.. బాలికపై అఘాయిత్యం జరిగినా మూడు రోజులు పాటు ప్రభుత్వ పెద్దలు బాధ్యతను విస్మరించారు.. చిన్నారికి జరిగిన అన్యాయానికి...ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గర్జించాయి. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డెక్కాయి. దాచేపల్లిలో మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురైన చిన్నారిని చూసేందుకు వైఎస్సార్ సీపీ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, లీగల్ విభాగం గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ నేతల పాదర్తి రమేష్గాంధీతో కలసి బాలికను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు, ఆర్ఎంవో యనమల రమేష్ను చిన్నారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందజేసి, త్వరితగతిన కోలుకునేలా చూడాలని జీజీహెచ్ అధికారులును కోరారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చిన్నారిని పరామర్శించిన తరువాత జీజీహెచ్ నుంచి బయటకు వచ్చి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి చినరాజప్ప జీజీహెచ్కు వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బలవంతంగా పార్టీ నేతలు, కార్యకర్తలను అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టారు. కార్యకర్తలు మంచినీరు అందజేసి పక్కకు తీసుకునివచ్చారు. పోలీసుల ఓవర్యాక్షన్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాతో పార్టీ నేతలు జీజీహెచ్కు వస్తున్నారని తెలిసిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాన్పుల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారిని చూసేందుకు వెళుతున్న నేతలను ఆ వార్డు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ.. నెట్టుకుని లోపలికి వెళ్లారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, దేవళ్ల రేవతి, అంగడి శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గనిక ఝాన్సీ రాణి, మేరువ నర్సిరెడ్డి, పరసా కృష్ణారావు, పసుపులేటి రమణ, ఆరుబండ్ల కొండారెడ్డి, సోమి కమల్, నిమ్మరాజు శారదలక్ష్మి, పానుగంటి చైతన్య, షేక్ గౌస్, షేక్ రబ్బాని, ఏటుకూరి విజయసారథి, మేరిగ విజయలక్ష్మి, జ్యోతి, స్వర్ణ, వడ్లమూడి రత్న, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆడపిల్లలను కనడమే పాపమా?
సాక్షి, గుంటూరు: ఆడపిల్లలను కనడమే పాపమా.. అన్నట్టు దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు దీనంగా చూస్తున్న చూపులు అందరి హృదయాలను కలచివేశాయని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై గుంటూరు జీజీహెచ్ గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాలికను శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాలికపై 55 ఏళ్ల మానవ మృగం చేసిన దాష్టీకం చూస్తుంటే కడుపు తరుక్కుపోయిందని అన్నారు. మనం అడవిలో ఉన్నామా.. ప్రజలు ఉండే సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. బాధితురాలు మగవాళ్లను చూస్తేనే భయంతో వణికిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తునిలో టీడీపీ ఎంపీటీసీ సంధ్య భర్త ఒక టీషాపు యజమాని కూతురిపై అత్యాచారయత్నం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి ‘‘రాష్ట్రంలో 40 రోజుల వ్యవధిలో 45 మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి. చంద్రబాబు కంటే చేతగాని దద్దమ్మ సీఎం ఏ రాష్ట్రంలో అయినా ఉంటారా? చంద్రబాబు పరిపాలన వల్లే రాష్ట్రంలో నేరస్తులకు ధైర్యం వస్తోంది. రిషితేశ్వరి మృతి చెందిన వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించి ఉంటే ఈరోజు ఇలా జరిగి ఉండేదే కాదు. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు రాజీనామా చేయాలి’’ అని రోజా డిమాండ్ చేశారు. ప్రతి ఆడపిల్లకు జగన్ భరోసా ‘‘డమ్మీ హోం మంత్రిని పెట్టుకుని చంద్రబాబు, నారా లోకేశ్ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబుపై పోలీసులంతా తిరగబడాలి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మహిళల గురించి తప్పుడు ఆలోచనలు చేస్తే ఉరికంబం ఎక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఆడపిల్లకు సొంత అన్న సీఎంగా ఉన్నాడని భరోసా కల్పించేలా జగన్ ప్రభుత్వం ఉండబోతోంది’’ అని రోజా తెలిపారు. బాధిత బాలికను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు లేళ్ల అప్పిరెడ్డి, కత్తెర హెన్రీ క్రిస్టినా తదితరులు ఉన్నారు. -
దేవినేని ఉమపై ధ్వజమెత్తిన రోజా
సాక్షి, పామర్రు : మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆదివారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పామర్రులో ఏర్పాటుచేసిన బహింరంగ సభలో ఆమె ప్రసంగించారు. హోదా కోసం రాజీనామా చేయని టీడీపీ నేతలు ప్రజాద్రోహులని ఆమె మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు తన ఇంట్లో దొంగతనం చేసి తానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు ధర్మ పోరాటమని నాటాకాలు ఆడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో.. జగన్మోహన్ రెడ్డీ పోలవరం ప్రాజెక్ట్ 2018లోపు పూర్తవుతోంది.. మీ సాక్షి పేపర్లో రాసుకో అంటాడు. మరీ ఇప్పటివరకు పూర్తైన దాఖలాలు ఉన్నాయా’ అని రోజా నిలదీశారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో అడుగుపెడితే కృష్ణమ్మ పరవళ్లు తొక్కినట్లు జనసమూహం స్వాగతం పలికిందని, దీనికి భయపడ్డ తెలుగు తమ్ముళ్లు ధర్మ దీక్ష అని దొంగ దీక్ష పెట్టారని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్ పిల్లను ఇస్తే.. ఆయనకే వెన్నుపోటు పొడిచి.. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే.. వైఎస్సార్, జగన్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ సీపీకి ఓటేయాలన్నారు. అది ఎలా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోందో అలా పామర్రు ఓటర్లు ఉండాలన్నారు. డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తులు కూడా వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారని, జగన్ బొమ్మపై గెలిచి మోసం చేసిన ఆ శాసనసభ్యురాలికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
సమాజంలో ఉపాధ్యాయులే కీలకం
వడమాలపేట : విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్నా, సమాజం బాగుండాలన్నా గురువులే కీలకమని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శనివారం పత్తిపుత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు పేదకుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని పాఠశాల పల్లంలో ఉండడం వల్ల వర్షం వస్తే నీళ్లు తరగతి గదులలోకి వస్తాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు 200 కుర్చీల పంపిణీ.. మండలం గ్రాంట్ నుంచి 43 అంగన్వాడీ కేంద్రాలకు 200 కుర్చీలను శనివారం ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు కిందకూర్చుని భోజనం చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించే వీటిని మండల గ్రాంట్ నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్ల డ్రస్కోడ్, పనితీరు బాగుందని కితాబిచ్చారు. చిన్నక్క మృతికి సంతాపం.. మండలంలోని పూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు రామయ్య కుమార్తె చిన్నక్క మృతికి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంతాపం తెలిపారు. శనివారం ఆమె పూడి గ్రామానికి చేరుకుని చిన్నక్క మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమాలలో ఎంపీపీ మురళీధర్రెడ్డి, ఎంపీడీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ పద్మావతి, సీడీపీఓ పద్మజారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జైమునీంద్రులు, సూపర్వైజర్ తులసీ, పత్తిపుత్తూరు సర్పంచ్ ఆవుల ప్రతిమ, ఎంపీటీసీ రంగనాథం, నాయకులు సదాశివయ్య, సుబ్రమణ్యంయాదవ్, మధన్మోహన్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తులసీరామిరెడ్డి, హరిరెడ్డి, లోకేష్రెడ్డి, వెంకటరెడ్డి, రాజశేఖర్, నాగరాజు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
సినీ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర
సాక్షి, తిరుపతి : తన తల్లి మీద చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె శనివారం చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలుగు సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ఇండస్ట్రీని బద్నామ్ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు హోదా రాకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు దొంగ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. బాబు దీక్ష సందర్భంగా మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
చంద్రబాబుది దగా దీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినది దగా దీక్షని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మాయ చేసేందుకు చేపట్టిన దొంగ దీక్షగా ఆమె అభివర్ణించారు. ఒక్క రోజు దీక్షకు రూ. 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి, తనకు రాజకీయ సమాధి తప్పదనే చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టారని ఆమె విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎంపీలవలే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, చంద్రబాబు కూడా ఢిల్లీలో దీక్ష చేస్తే జాతీయ స్థాయిలో చర్చ జరిగేదని, కేంద్రంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చేదని రోజా అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఆశలను సజీవంగా ఉంచింది జగన్ మాత్రమేఅని, దీని కోసం ఆయన నాలుగేళ్లుగా ఉద్యమాలు చేశారన్నారు. ఆ చానళ్లకు మనసు రాలేదు రాష్ట్రంలో కొన్ని ప్రసార మాధ్యమాలు పూర్తిగా దిగజారిపోయాయని రోజా మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్ ప్రాణాలకు తెగించి తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినపుడు, ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసి, రాష్ట్ర భవిష్యత్ కోసం ఢిల్లీలో దీక్ష చేసినపుడు వాటిని చూపించడానికి ఆ చానళ్లకు మనసురా లేదన్నారు. ఉదయం అల్పాహారం తీసుకుని, రాత్రి భోజనం వేళ వరకూ దీక్ష చేసిన చంద్రబాబుకు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తమ పార్టీ అధినేత జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే దానిని చూపేందుకు ఈ చానల్స్కు సమయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తనయుడు కొన్ని చానళ్లకు రూ.కోట్లు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజారుస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. -
ఎన్టీఆర్ డూప్ను పెట్టుకుని దీక్షలో కామెడీనా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మ దీక్ష కాదని, కేవలం ఉపవాసం మాత్రమేనని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఢిల్లీలో దీక్ష చేసి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని రోజా వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు... స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే బలవంతంగా ఈ ప్రభుత్వాలు దీక్షను భగ్నం చేశాయి. ఈ రోజు చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది. ఈ దొంగదీక్షకు రూ.30కోట్ల ప్రజాధనం వృధా. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా స్పీకర్ లేని చూసి ...స్పీకర్ ఛాంబర్లో దొంగ నాటకాలు ఆడింది టీడీపీ ఎంపీలే. ఇక చంద్రబాబు ఏడాది తిండి ఖర్చు రూ.8కోట్లు. కేవలం పుల్కాలు, కూరగాయలు తినేవాడికి ఇంత బడ్జెట్ అవసరమా?. సీరియస్గా దీక్ష చేయాల్సిందిపోయి ఎన్టీఆర్ డూప్లు పెట్టుకుని దీక్షలో కామెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి నేతను అవమానపరుస్తున్నారు. ప్రత్యేక హోదాకు సమాధి కట్టి, ప్యాకేజీ అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఎన్టీఆర్ను పార్టీ నుంచి వెళ్లగొట్టి పార్టీని, ట్రస్ట్ భవన్ను లాక్కుని, ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కుని...ఆఖరుకు ఎన్టీఆర్ మృతదేహాన్ని కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటోకు దండ వేసి దండం ఎలా పెడుతున్నారు?. వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తే చూపించడానికి ఎల్లో మీడియాకు మనసులేదు. 30కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి దీక్ష చేస్తుంటే ఎల్లో మీడియా కవరేజ్ చేస్తోంది. నిన్నటివరకూ పవన్ కల్యాణ్ను మోసిన ఎల్లో మీడియా ఇవాళ అతడిపై బురద జల్లుతోంది. చంద్రబాబు ఇచ్చే తాయిలాల కోసం ఎల్లోమీడియ రాష్ట్ర ప్రయోజనాలను మంటగలుపుతోంది. 25మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేదికాదు. చంద్రబాబు దీక్షను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నాలుగేళ్ల నుంచి హోదాను బతికించిన వైఎస్ జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. వైఎస్ జగన్...ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించగానే ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో లాబీయింగ్ కోసమే ఎంపీలు చేత రాజీనామా చేయించడం లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రధాని మోదీ దీక్ష చేస్తే ...చంద్రబాబు మాత్రం రూ.30కోట్ల ఖర్చుతో దీక్ష చేశారు. ఇక రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుని దానికి కావాల్సిన బిల్లులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తూ ప్రజా అవసరాలకు మాత్రం డబ్బు లేదంటున్నారు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.’ అని రోజా మండిపడ్డారు. -
టీడీపీ ఎంపీలకు ఓటమి భయం: రోజా
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేస్తుంటే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో వెన్నుచూపుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తమ పార్టీ ఎంపీలకు రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలియజేస్తుంటే, టీడీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజా బుధవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీల ఆమరణ దీక్షను కొవ్వు తగ్గించుకునే కార్యక్రమం అనడానికి టీడీపీ నాయకులకు సిగ్గులేదా? అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజల సొమ్మును దోచుకు తిన్న టీడీపీ ఎంపీలు, మంత్రులే కొవ్వుకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర:‘‘ప్రజల పక్షాన ఒంటరి పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నాటకాలాడడం, మాటలు మార్చడం మా పార్టీకి చేతకాదు. ప్రత్యేక హోదా కోసం రైల్రోకో చేపట్టిన మా పార్టీ నాయకులను, కార్యకర్తలను సివిల్ పోలీసులతో అరెస్టు చేయించడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం, సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలపడం ద్వారా చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలుగు ద్రోహిగా మిగిలిపోయారు. ’’ అని రోజా మండిపడ్డారు.‘‘విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ నారా లోకేశ్కు సూట్కేసు ఇస్తేగానీ ఫైల్పై సంతకం కావడం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. ఆ నిధులన్నీ ఎక్కడ దాచారో చెప్పాలి. ?’’ అని రోజా నిలదీశారు. -
ప్రత్యేక హోదా మన ఊపిరి!
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరిలాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తాము పోరాటం చేస్తుంటే.. ఆ పార్టీతో లాలూచీ పడ్డామని కుటిల విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలను తప్పుబట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలకు మద్దతు తెలిపిన ఆమె.. ఎంపీలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు. సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే విలువలేకుండా పోయిందని, ప్రధాని మోదీగారు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు నిజమైన పోరాటాన్ని చేస్తున్నారో గుర్తించాలని ప్రజలను కోరారు. హోదా కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, కలిసికట్టుగా పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు. ఇదే టీడీపీ ఎంపీలు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకొని.. ఇప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా అవిశ్వాసంపై చర్చ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం ఉందని, ఇతర రాష్ట్రాలకు వేలకోట్లు ఇస్తూ.. ఏపీకి మాత్రం నిధులు ఇవ్వడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజలకు జీవనాడి అని, వైఎస్ఆర్ బతికి ఉంటే ఆ ప్రాజెక్టు ఏనాడో పూర్తయ్యేదని పేర్కొన్నారు. రాజీనామా చేసేవరకు వారిని తరిమికొట్టాలి! ప్రత్యేక హోదా కోసం ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ఆనాడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని... హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ను చంద్రబాబు అరెస్టు చేయించారని గుర్తుచేశారు. బీజేపీతో కుమ్మక్కయి హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని మండిపడ్డారు. హోదా కోసం నాలుగేళ్లుగా పార్లమెంటులో పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు దిగారని అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఏపీని విస్మరిస్తున్న టీడీపీ-బీజేపీలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని ఆమె అన్నారు. చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏకపక్షంగా మారిందని ఎద్దేవా చేశారు. అందరు కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీని కాపాడుకునేందుకే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బాబు వస్తేనే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీ ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజీనామా చేసేవరకు టీడీపీ ఎంపీలను తరిమికొట్టాలని ఏపీ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. -
సడలని దీక్ష
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన ఆదివారమూ కొనసాగాయి. పట్టు సడలకుండా దీక్షల్లో పాల్గొని హోదా నినాదాన్ని హోరెత్తించారు. పార్టీ నాయకులకు జనం కూడా తోడు కావడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. చిత్తూరు, సాక్షి : జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటా వార్పులతో నిరసన తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్థానిక క్లాక్టవర్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేశారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని రోజా అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. దీక్ష అనంతరం జ్యోతిచౌక్లో రాస్తారోకో నిర్వహించారు. కుప్పం సర్కిల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్యవేడు, నాగలాపురంలో జరిగిన దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. చిత్తూరు గాం«ధీ సర్కిల్లో వైఎస్సార్ బీసీ, ఎస్సీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, జ్ఞానజగదీశ్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో జరిగిన దీక్షలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సంఘీభావం తెలిపారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆ పార్టీ కార్యకర్త వాసుమయ్య గుండు కొట్టుకొని టీడీపీ, బీజేపీ ఎంపీలకు పిండ ప్రదానం చేశారు. తుడా సర్కిల్లో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, వెదురుకుప్పం కార్వేటినగరం, ఎస్సార్పురం మండలాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. పెనుమూరు, వెదురుకుప్పంలో జరిగిన దీక్షలకు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, రొంపిచెర్లలో రిలే నిరాహార దీక్షలు జరి గాయి. రొంపిచెర్లలో జరిగిన దీక్షకు మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు. పుంగనూరులో రెడ్డెప్ప పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో మండల నాయకులు వంటావార్పు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీలేరులో జరిగిన వైఎస్సార్ విద్యార్థి విభాగం దీక్షకు పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి సంఘీభావం తెలిపారు. మదనపల్లె అన్నమయ్య సర్కిల్లో వైఎస్సార్సీపీ నాయకులు వంటావార్పు కార్యక్ర మం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఢిల్లీకొచ్చి చంద్రబాబు ఏపీ పరువు తీశారు
-
మునికోటి ఫ్యామిలీని ఆదుకోవడంలో విఫలమైన సర్కార్
-
ఆత్మార్పణ చేసిన మునికోటి ఫ్యామిలీకి హామీ
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి వారం రోజుల్లో న్యాయం చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. 2015 ఆగస్టు 9న, ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో తిరుపతికి చెందిన మునికోటి ఏపీ ప్రత్యేక హోదాకోసం బలిదానానికి సిద్ధపడ్డాడు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మత్యాగం చేశాడు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తరపున అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పందించారు. మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించించారు. అయితే ఈ హామీ కూడా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లాగే మరుగున పడిపోయింది. మునికోటి కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంగతే మర్చిపోయారు. అయితే ఏళ్లు గడిచినా మునికోటి కుటుంబానికి పరిహారం అందకపోవడంపై సాక్షి మీడియా వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, మునికోటి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వారం రోజుల్లో మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, శంషాబాద్: ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది... ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఎయిర్లైన్స్ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే ఆర్కే రోజా సాక్షి, తిరుపతి: ‘శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. తర్వాత పెద్ద కుదుపుతో రన్వే పై ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా. నేను, ఇతర ప్రయాణికులు వణికిపోయాం. అరగంట పాటు విమానం డోర్లు తీయలేదు. అగ్నిమాపక సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశార’ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వెల్లడించారు. బుధవారం రాత్రి పది గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానంలో ఆమె హైదరాబాద్ బయలుదేరారు. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం టైర్లు పేలిపోయినట్లు తెలిసిందని రోజా సాక్షికి వివరించారు. మంటలు చూసి ప్రయాణికులందరూ ఒక్క ఉదుటన కిందకు దిగాలని ప్రయత్నం చేసినా, ఎయిర్హోస్టెస్ నిరాకరించడంతో సాధ్యం కాలేదన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని వెల్లడించారు. -
చంద్రబాబు మహిళా ద్రోహి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి, మహిళలకు మేలు చేసేందుకు ఆయనకు చేతులు రావని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆఖరి బడ్జెట్లో కూడా మహిళలకు మొండి చెయ్యి చూపించారని దుయ్యబట్టారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీకి రూ. 14,200 కోట్లు కావాలని, కానీ ఇచ్చిన మాటను చివరి బడ్జెట్లో కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు. వడ్డీ లేని రుణాలకు రూ. 2,400 కోట్లు అవసరమైతే.. రూ. 1,400 కోట్లు కేటాయించారని, అవి ఏ మూలకు సరిపోతాయని మండిపడ్డారు. బెల్ట్షాపులను దశల వారిగా ఎత్తేస్తామన్నారని, అయితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జాతీయ రహదారుల వద్ద, అన్ని గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం దుకాణాలు పెట్టి దోచు కుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. ఆడపిల్ల పుడితే రూ. 30 వేలు వేస్తా మని బాబు గొప్పగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాడని, పండం టి పథకం కింద గర్భిణులకు రూ.10 వేలు ఇస్తామన్నారని.. ఈ నాలుగేళ్లలో ఒక్క ఆడపిల్లకైనా డబ్బులు వేశారాని ఆమె నిలదీశారు. కళాశాల విద్యార్థినులకు ఐప్యాడ్లు, మహిళలకు సెల్ఫోన్లు, విద్యార్థినులకు సైకిళ్లు కొనిస్తానన్న హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదన్నారు. బాబు ఇంట్లో ఆడవాళ్లు వ్యాపారాలు చేస్తే మహిళా సాధికారత సాధించినట్లేనా అని ప్రశ్నించారు. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆఖరి బడ్జెట్లో కూడా మహిళలకు మొండి చెయ్యే
-
'మహిళల కోటాలో లోకేష్కు మంత్రి పదవి'
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బడ్జెట్లోనూ మహిళలకు అన్యాయం చేశారన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనలో మహిళకు భద్రత కరువైందని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇప్పటి వరకు శిక్షల్లేవన్నారు. సీఎం నియోజక వర్గంలో మహిళను వివస్త్రను చేసినా పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. బెల్టు షాపులను దశలవారీగా ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందన్నారు. మరో వైపు మహిళల కోటాలో లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. లోకేష్ను మంత్రిని చేస్తే.. రాష్ట్రమంతటా ఉద్యోగాలిచ్చినట్లేనా అని ప్రశ్నించారు. -
టీడీపీకి ప్యాకేజీలే ముఖ్యం: ఎమ్మెల్యే రోజా
చిత్తూరు ఎడ్యుకేషన్: టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆమె ఆదివారం మధ్యాహ్నం చిత్తూరులోని కలెక్టర్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం అన్ని పార్టీలు పొగబెట్టిన తర్వాత బయటకొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఆయన కాని, ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతోందని నిలదీశారు. ప్యాకేజీతో ఉపయోగం లేదని నాడే జగన్మోహన్రెడ్డి చెప్పాగుర్తుచేశారు. హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పవన్ 2016లో చెప్పి, ఇప్పుడు రాజీనామాలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. -
కులం కూడు పెట్టదు.. కష్టం కూడు పెడుతుంది
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: నేటి విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని మరచిపోకుండా, పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వారి ఆశయాలను నెరవేర్చాలని సినీనటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాజంపేటలోని ఏఐటీఎస్లో గురువారం జరిగిన మహోత్సవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కన్నవారిని, చదువు చెప్పిన గురువును, చదివిన కళాశాలను మరచిపోరాదన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే నాణ్యమైన విద్యను అందించే ఏఐటీఎస్ లాంటి విద్యాసంస్థలో విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య నడయాడిన ప్రాంతంలో ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడం వల్ల ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఎందరో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ను తీసుకురావడం వల్ల ఎందరో పేదలకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఇంట ఆయనను తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంలో భాగంగా కుటుంబలో ఒకరికి ఉన్నత విద్యను అందించగలిగితే ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతమవుతుందనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్సార్ ఫీజురీయింబర్స్మెంట్ను తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ఉద్యోగం దక్కక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పుట్టిన రాయలసీమలో తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు ముందుండి ప్రత్యేక హోదాను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎవరైతే సాధించగలరనే నమ్మకం ఉందో వారికే ఓటు వేయించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. కులం కూడు పెట్టదు.. కష్టం కూడు పెడుతుంది: హాస్యనటుడు అలీ కులం కూడు పెట్టదని..కష్టపడితే భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ అన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైనదన్నారు. అలాంటి జీవితం తనకు లేకుండా పోయిందన్నారు. చిన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగు పెట్టానన్నారు. విద్యార్థి జీవితం విలువలతో ఉన్నతంగా సాగితే జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపాలన్నారు. నాకు అమ్మే సినిమా అన్నారు. చదువు ఉంటే సంస్కారం వస్తుందని, తాను జీవితంలోని అనుభవాలతో, ఎదుటివారిని చూసి ఆ సంస్కారం సంపాదించుకున్నానని చెప్పారు. అన్నమయ్య 108 అడుగుల విగ్రహానికి తన స్థలాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఏఐటీఎస్ అధినేత గంగిరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ ఆనందరెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏఐటీఎస్ ఈడీ చొప్పా అభిషేక్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నారాయణ పాల్గొన్నారు. -
టీడీపీ నాయకులే ఇసుకాసురులు
నగరి:టీడీపీ నాయకులే ఇష్టారీతిన ఇసుకను దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. బుధవారం ఆమె మండలంలోని మిట్టపాళెం వద్ద కుశస్థలి నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండడాన్ని గమనించి, నదిలోకి వెళ్లారు. అక్కడి ట్రాక్టర్ల డ్రైవర్ల నుంచి రశీదులు తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరిలో ఇసుక రీచ్లు లేకపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం తహసీల్దార్ రీచ్లను సృష్టించి, దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించా రు. ఇసుకను అధిక సంఖ్యలో తోడేసి తమిళనాడుకు, బెంగళూరుకు తరలిస్తున్నారని విమర్శించారు. నది లో ఇసుకను తోడివేతతో ఏర్పడిన గుంతల్లో పడి గ తంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారన్నారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. పేదవారికి ఎవరికీ ఇసుకను ఉచితంగా అందించడం లేదన్నారు. టీడీపీ నాయకులకు సంపాదించి పెట్టడానికి మాత్రమే ఇసుకను అందిస్తున్నారన్నారు. తహసీల్దార్ ఇకనైనా వీటిని ఆపాలని, లేకుంటే ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కె.శాంతి, మాజీ చైర్మన్ కేజేకుమార్, నాయకులు బుజ్జిరెడ్డి, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనను మంగళవారం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు కలిశారు. చెరకు ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పోయామని, 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూతపడిన ఈ ఫ్యాక్టరీలను వైఎస్ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
నవరత్నాలపై హర్షాతిరేకాలు: రోజా
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. ‘బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకు మాత్రమే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైఎస్ జగన్ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరని ప్రజలు విశ్వసిస్తున్నారు. పిల్లలను చదవించే బాధ్యత వైఎస్ జగన్ తీసుకుంటున్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి.ఇ ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.’ అని విమర్శించారు. -
జాబ్ రావాలంటే బాబు పాలన పోవాలి
పుత్తూరు: జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు పాలన అంతం కావాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అథ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రత్యేక హోదా హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పూలతో పట్టణంలోని ఆరేటమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఆమె బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అమర్నాధ్రెడ్డిలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారు యువతకు ఉద్యోగాలు కల్పించలేని అసమర్థులని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం చంద్రబాబు యువతకు అన్యాయం చేస్తున్నారని రోజా విమర్శించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా సుమారు 25 వేల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను వీధిన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదా హామీని ఓటుకు నోటు కేసుతో తాకట్టు పెట్టి యువత ఆశలకు సజీవ సమాధి కట్టిన బాబు పాలనకు చరమ గీతం పాడేందుకు యువత ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. లోకేష్కు జాబ్ వచ్చింది నిరుద్యోగులకు జాబ్ రాలేదు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్కు మాత్రం మంత్రి ఉద్యోగం వచ్చిందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అథ్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు నోటు కేసుతో ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. అంతకుమునుపు నిరుద్యోగులను వంచించిన రాష్ట్ర ప్రభుత్వంపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అథ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్యాంలాల్, ఇమామ్, యువజన విభాగం చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అథ్యక్షుడు మధు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ రాయల్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పాల్గొన్నారు. -
దేవుడే మీకు తగిన శాస్తి చేస్తాడు
సాక్షి, చిత్తూరు : వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన ఓర్వలేకే ఏపీ సీఎం చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లా(చిత్తూరు)లో వైఎస్ జగన్ అడుగులు పడుతుంటే.. అవి చంద్రబాబు గుండెల్లో దిగుతున్నాయని ఆమె అన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. వార్డు మెంబర్గా కూడా గెలవని నారా లోకేష్ కోసం చంద్రబాబు దేవాలయాలన్నింటిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వనజాక్షి, పుష్కరాల తొక్కిసలాట విచారణ మాదిరిగానే.. దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఈవోపై నెపం నెట్టేసి తప్పించుకునే యత్నాలు చేస్తున్నారని రోజా చెప్పారు. ‘‘పూజలు జరిగినట్లు సాక్షాత్తూ పాలక మండలే అంగీకరించింది. ఒక్క దుర్గ గుడిలోనే కాదు. ఇతర ఆలయాల్లో కూడా పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాలను అవమానపరుస్తున్న చంద్రబాబుకు దేవుడే తగిన శాస్తి చేస్తాడు’’ అని ఆమె తెలిపారు. ‘ఓటర్లు సిగ్గుపడాలి.. మత్స్యకారుల తాట తీస్తా’ అని చంద్రబాబు బెదిరించడం దారుణమని రోజా అన్నారు. ఇక ఓవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాసంకల్పయాత్ర ముందుకు కొనసాగిస్తుంటే... మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పోలీసుల సహకారంతో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా.. వారిని బలవంతం చేసి జన్మభూమికి తరలిస్తున్నారని రోజా చెప్పారు. -
రాక్షస పాలనకు చరమ గీతం
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు సాగిస్తున్న అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు అంతా సన్నద్ధం కావాలని వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. అహంకార పూరితంగా పాల న సాగిస్తున్న చంద్రబాబుకు యువత బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అందుకు సింహపురి నుంచే సింహనాదం మోగిద్దామంటూ సమరశంఖం పూరించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని టౌన్హాల్లో ‘జగనన్న కోసం’ పేరిట శుక్రవారం నిర్వహించిన యువజన సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి యువత పెద్దఎత్తున తరలివచ్చింది. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ సింహం లాంటి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడుగా సింహపురి గడ్డనుంచే పిడికిలి బిగించి చంద్రబాబుకు దిమ్మతిరిగేలాచేద్దామన్నారు. పార్టీ రీజినల్ ఇన్చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అహంకారపూరితంగా సాగిస్తు న్న రాక్షస పాలనకు చరమగీతం పాడదామన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ యువతకు అనేక అవకాశాలు ఇచ్చే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ యువత సత్తా ఏమిటో టీడీపీ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు. పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీకి కంచుకోటగా ఉందన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సైనికులుగా ముందుకు కదులుదామన్నారు. గూడూరు నియోజవర్గ సమన్వయకర్త మేరిగ మురళి మాట్లాడుతూ మోసాలతో ఎంతోకాలం పాలించలేరనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మహిళలే గుణపాఠం చెబుతారన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు. యువతకు పెద్దపీట : కాకాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రత్యేక స్థానం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల సంగతి ఏమోకానీ చంద్రబాబు కుమారుడు లోకేష్కు మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని తాంత్రిక పూజలు చేయించినా చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. యువత మరింత ఉత్సాహంతో ముందుకు అడుగేసి జగన్మోహన్రెడ్డికి అండగా ఉండి పార్టీని గెలిపించుకుందా మని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని తిరుగులేని శక్తిగా చేద్దామన్నారు. యువత వల్లే భవిష్యత్ : కిలివేటి యువత చేతిలోనే దేశ, రాష్ట్ర భవిష్యత్ ఉందని తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైఎస్సార్ సీపీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాలుగా మేలు కలుగుతుందన్నారు. చంద్రబాబు మాత్రం హోదాకు అడ్డు తగులుతున్నారన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం అడుగులో అడుగేద్దామన్నారు. హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ చాలన్న చంద్రబాబుకు బుద్ధి చెబుదామన్నారు. ఎన్నికలకు ఎప్పుడొచ్చినా సిద్ధం : రామిరెడ్డి ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబును ఎదుర్కొనేందుకు అం తా సిద్ధంగా ఉం డాలని కావలి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఎన్నో విధాలుగా యువతను మోసం చేస్తున్నారన్నారు. యువత భవితను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాలు సాగిస్తున్నారని చెప్పారు. అరాచక పాలన సాగుతోంది : కోటంరెడ్డి రాష్ట్రంలో దుర్మార్గపు, అరాచక పాలన సాగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే నాయకుడు కాదని, నిజాయితీ రాజకీయాలకు చిరునామాగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని తాము గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డిని చూసి గర్వపడుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా చిరగడం ఖాయమని, వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం తథ్యమని అన్నారు. జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు. విజయమో.. వీర స్వర్గమో : అనిల్కుమార్ నిజాయితీగా రాజకీయాలు చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపిద్దామని నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ పిలుపునిచ్చారు. విజయమో.. వీర స్వర్గమో అనే విధంగా ముందుకు సాగుదామని యువతకు పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డిని దెబ్బకొట్టాలని ఎంతోమంది చూస్తున్నారన్నారు. మనమంతా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకుని వద్దామన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే కొందరు సినిమా వాళ్లు జగన్మోహన్రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి తొమ్మిదేళ్లు కష్టంలో ఉంటే పట్టించుకోని ఒకాయన.. ఇప్పుడు మాత్రం అన్నకు ద్రోహం చేసిన వాళ్లను వదలనంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో టీడీపీలో వణుకు పుడుతోందన్నారు. జగన్మోహన్రెడ్డికి నెల్లూరు జిల్లా అండగా ఉందనే విషయాన్ని రానున్న ఎన్నికల్లో నిరూపిస్తామన్నారు. ఘరానా మోసగాడు చంద్రబాబు : నల్లపరెడ్డి ఘరానా మోసగాడు సీఎం చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి యువతే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో యువత ప్రధాన భూమిక పోషించి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలో జిల్లాకు రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలన్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా యువత అడుగు మందుకు వేయాలన్నారు. విజయం కానుకగా ఇద్దాం : బొమ్మిరెడ్డి జిల్లాలో వైఎస్సార్ సీపీకి తిరుగులేని మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దామని జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికలలో అందరం సమష్టిగా కష్టపడి అధికారంలోకి వద్దామన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల దీవెనతో ముందుకు వెళదామన్నారు. -
ఒక్క పరిశ్రమనూ తేలేని దద్దమ్మ బాబు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. సోది సోమిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. దొడ్డిదారిలో మంత్రులైన వీరు పార్టీకి పెట్టిన పెట్టుబడులను ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని, వీరిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు అమ్ముడుపోతున్నారని అన్నారు. క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరని చంద్రబాబును రోజా హెచ్చరించారు. -
జెండా పీకితేనే... పింఛన్లు
పుత్తూరు: అధికార పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తే చాలు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. గత నెలలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తొరూరు పంచాయతీలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆనంబట్టులో ఇంటింటికీ వైఎస్సార్ కుటుంబం నిర్వహించి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామం మొత్తం ఆమెకు బ్రహ్మరథం పట్టడాన్ని స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను పీకేయడంతో పాటు, ఇంటింటికీ అతికించిన వైఎస్సార్సీపీ స్టిక్కర్లను తొలగించాల్సిందేనని..లేదంటే అంతవరకు పింఛన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే ఆర్కే రోజా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారనే అక్కసుతో ఇద్దరు సంఘమిత్రలను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తొలగించారు. ఎంపీడీఓపె రోజా సీరియస్.. దీనిపై ఎమ్మెల్యే రోజా మంగళవారం ఎంపీడీఓ నిర్మలాదేవికి ఫోన్చేసి విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారిని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ నేరుగా వచ్చి ఎమ్మెల్యేకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాని ఫిర్యాదులు ఇప్పుడు ఎలా వచ్చాయని నిలదీశారు. విచారణకు తొరూరుకు వచ్చేందుకు సిద్ధమేనా ? అని నిలదీయగా ఎంపీడీఓ నీళ్లు నమిలారు. తొలగించిన సంఘమిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఎంపీడీఓగా మీపై వచ్చిన ఆరోపణలపై నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది: రోజా
సాక్షి, అనంతపురం: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధనియాని చెరువు వద్ద వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. కాల్మనీ, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, మహిళలపై దాడులు జరిగేవి కావని అన్నారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని రోజా ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల రద్దు చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ గతంలో చంద్రబాబు మహిళలను అవమానించారని గుర్తుచేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తానని.. భార్య, కోడలిని పారిశ్రామికవేత్తలను చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన అంతం కోసం మహిళలు పంతం పట్టాలని రోజా అన్నారు. జగనన్న వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
వైఎస్వి స్కీంలు..బాబువి స్కాంలు
ప్రొద్దుటూరు టౌన్: స్కాముల చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపిన రోజే రాష్ట్రం బాగుంటుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 36 గంటల నిరాహారదీక్ష కు రోజా మంగళవారం సాయంత్రం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్లు, మరుగుదొడ్లు, ఇసుక, మ ద్యం విషయంలో టీడీపీ నాయకులు సిగ్గులేకుండా దోచుకోవడానికి తెగబడ్డారని చెప్పడానికి నిజంగా బాధేస్తోందన్నారు. ఎందుకంటే వైఎస్సార్ ప్రభుత్వాన్ని, బాబు ప్రభుత్వాన్ని చూస్తే అక్కడ అన్నీ స్కీంలు, ఇక్కడ అన్నీ స్కాంలని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు ఇళ్లు, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇలా అన్ని కుటుంబాల్లో సంతోషం నింపడానికి ఎన్నో పథకాలను వైఎస్సార్ అమలు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని భూముల్లో స్కాం, పోలవరం అంచనాలు పెంపులో స్కాం, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణంలో స్కాం, వైజాగ్ భూముల్లో స్కాములేనన్నారు. ఈ స్కాముల ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టం అయితే, రాచమల్లు మీ ఎమ్మెల్యే కావడం మీ ఆదృష్టమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే మనసున్న నాయకుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. అన్నా అంటూ ఓట్లు వేసిన మీ అందరికీ ఎంత విధేయతగా ఉంటారో, నమ్మి నాయకత్వం ఇచ్చిన జగనన్నకు విశ్వాసపాత్రుడుగా ఉన్నారని కొనియాడారు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రాణత్యాగానికి సిద్ధమై దీక్ష చేస్తున్నారన్నారు. తన బాధ్యతను గుర్తు చేసుకుని ప్రతి సమస్యపై మీ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని చూసి సంతోషంగా ఉందన్నారు. 48 గంటలు భోజనం తినకుండా మీకోసం రాచమల్లు అన్న పోరాడుతున్నాడంటే, మనందరి కోసం జగనన్న ఎంత పోరాటం చేస్తున్నారో ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు మాయలో పడకుండా జగనన్న నిజాయితీని గుర్తించి రాజన్నరాజ్యం కోసం అందరూ కలిసిరావాలని కోరారు. దీక్ష ఇంతటితో ఆగిపోదని భవిష్యత్తులో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్బాషా, ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండ్ల గణేశ్కు ఆంధ్రా రాజకీయాలు ఎందుకు?
సాక్షి, విజయవాడ : టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విజయవాడ పోలీస్ కమీషనరేట్లో వారు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత బండి పుణ్యశీల నేతృత్వంలోని బృందం కమీషనర్ను కలిసి ఫిర్యాదును అందించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బండ్ల గణేష్ కు ఆంధ్రా రాజకీయాలతో అసలు అవసరం ఏంటని? వారు ప్రశ్నించారు. మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని.. దమ్ముంటే విజయవాడ వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. ఓ మహిళా నేతపై అసభ్యపదజాలం వ్యాఖ్యలు చేయటం దారుణమని.. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆమె కోరారు. మహిళా శాసనసభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆమె డీజీపీకి విజ్ఞప్తి చేశారు. నటి మీరా చోప్రా, నటుడు సచిన్ జోషి గతంలో బండ్ల వ్యక్తిత్వం ఎలాంటి చెప్పటం చూశామని పుణ్యశీల గుర్తు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఎమ్మెల్యే రోజాకు క్షమాపణలు చెప్పాలని మహిళా నేతలు బండ్లను డిమాండ్ చేశారు. -
దేశమంతా జీఎస్టీ... రాష్ట్రంలో ‘సీఎస్టీ’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిని అడ్డం పెట్టుకొని పేదలు, చిరు వ్యాపారుల కడుపుకొడుతూ ఆయన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్, ఇతర కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. దేశమంతా జీఎస్టీ అమలు చేస్తుంటే కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో అదనంగా సీఎస్టీ (చంద్రబాబు సర్వీస్ ట్యాక్స్)ని కూడా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల కట్టలకు, కార్పొరేట్ శక్తులకు పుట్టిన బిడ్డలా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. చౌక ధరల దుకాణాలను మాల్స్గా మార్చి హెరిటేజ్కు వాటాలున్న ఫ్యూచర్, వారికి సన్నిహితమైన రిలయన్స్ గ్రూపునకు అప్పగించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. మాల్స్ వెనుక వేల కోట్ల డీల్... రాష్ట్రంలోని 28 వేల రేషన్ షాపుల ద్వారా గతంలో 9 నుంచి 10 సరుకులు పేదలకు అతి తక్కువ ధరకే అందించేవారని రోజా గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎత్తివేస్తే.. దివంగత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సంతృప్త స్థాయిలో పేదలందరికీ సరుకులు అందించారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల్లో బియ్యం మినహా మరేమీ ఇవ్వటం లేదని, ఇప్పుడు వీటిని కార్పొరేట్ మాల్స్కు అప్పగించే కుట్రకు తెరతీశారన్నారు. చంద్రన్న మాల్స్లో తక్కువ ధరకు సరుకులు ఇస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో దొరికే నిత్యావసర సరుకులతో పోలిస్తే హెరిటేజ్, ఫ్యూచర్, రిలయన్స్ మాల్స్లలో దొరికే సరుకులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని రోజా తెలిపారు. కార్పొరేట్ మాల్స్లో 200 నుంచి 300 శాతం అధికంగా ధరలు ఉంటాయని పంచదార, గోధుమలు, తదితర సరుకుల ధరల వివరాలతో సహా వివరించారు. ఫ్యూచర్ గ్రూపు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సరుకులను ఎందుకు తగ్గించి ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 21 రకాల పథకాలకు చంద్రన్న అని పేరు పెట్టుకున్నారని రోజా పేర్కొన్నారు. ప్రతి దానికీ చంద్రన్న పేరు పెట్టుకోవడానికి ఆయన తండ్రి ఆస్తిలో నుంచి వాటా తెచ్చి ఏమైనా ప్రజలకు ఇస్తున్నారా? అని రోజా సూటిగా ప్రశ్నించారు. ఐదు నెలల్లో ఆస్తులు 20 రెట్లు ఎలా పెరిగాయ్? పాలు, కూరగాయలు అమ్ముకుంటేనే చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఐదు నెలల్లో 20 రెట్లు పెరిగితే మరి గేదెలకు తిండిపెట్టి పాలు పట్టే మహిళలు, రైతులకు ఎన్ని రెట్లు ఆస్తులు పెరగాలని రోజా ప్రశ్నించారు. లోకేష్ను దొడ్డిదారిన మంత్రిని చేసినప్పటి నుంచీ చంద్రబాబు పూర్తిగా సూట్ కేసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. వర్థంతి, జయంతికి... రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియని లోకేష్ను మంత్రిగా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబుకు ఓట్లు వేయాలని ఊరూవాడా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏ హక్కుతో ప్రశ్నిస్తున్నారని రోజా నిలదీశారు. కాపులు, రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, ప్రతి ఒక్కరికీ అన్యాయం చేసిన చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి ఆయన జగన్ను ప్రశ్నిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
చంద్రబాబుకు ఆ భయం పట్టుకుంది: రోజా
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేషన్ షాపులను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానో...లేదో అనే భయంతోనే 21 పథకాలకు చందన్న పేరు పెట్టించుకున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఆహార భద్రత కల్పించేందుకే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చౌక దుకాణాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పేదలపై ప్రేమతో నాడు ఎన్టీ రామారావు రూ.2 కిలో బియ్యం ఇచ్చారని, చంద్ర బాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు, నోట్ల కట్టలకు పుట్టిన బిడ్డగా ఈ ప్రభుత్వ పాలన ఉందని ఆమె అభివర్ణించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో పేదల పొట్టి కొట్టి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటును ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, సామాన్యులకు చౌకగా నిత్యావసర వస్తువులు అందడం లేదని రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సీఎం పదవి అడ్డుపెట్టుకొని.. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారుల పొట్టి కొట్టేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్గా మార్చారని రోజా మండిపడ్డారు. ఈ మాల్స్ స్వయంగా చంద్రబాబు కుటుంబానికి వాటాలు ఉన్న ఫ్యూచర్ గ్రూప్కు, వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్న రిలయన్స్ గ్రూప్లకు కట్టబెట్టారన్నారు. దీని అర్థం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మాల్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా అని నిలదీశారు. రేషన్షాపులో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, వాటన్నింటిని రద్దు చేసి, తీరా తన దోపిడీని విస్తరింపజేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. 5 నుంచి 35 శాతం తగ్గించి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఈ రోజు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన సంస్థకు లాభాలు లేకుండా పేదలకు ఎందుకు చౌకగా ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో రిలయన్స్, ఫ్యూచర్ సంస్థలు వంద నుంచి 200 శాతం ప్రజల నుంచి గుంజుకున్నదన్నారు. రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్షాపుల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు ఇస్తే పేదలకు లాభం ఉంటుందని, చంద్రన్న మాల్స్ పేరుతో వేల కోట్లు దండుకోవాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. మీకు పేదలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గింవచ్చు అన్నారు. పేదవాళ్లు ఏమైతే నాకేంటి అన్నట్లుగా చంద్రబాబు తాను, తన కొడుకు బాగుంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. బాబు తన సీఎం పదవిని అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారన్నారు. 21 పథకాలకు చంద్రన్న పేర్లు చంద్రబాబును భవిష్యత్తులో మరిచిపోతారన్న భయం ఉందని, అందుకే ఈ నాలుగేళ్లలో 21 ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి ఖర్జురపు నాయుడు వాటా తీసుకొని వచ్చి ఇస్తున్నారా అని నిలదీశారు. అంతగా పేర్లు పెట్టుకోవాలంటే ప్రజలకు మేలు చేసిన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెట్టుకోవాలి కానీ, ఇలా తన పేరు పెట్టుకోవడం ఎక్కడ చూడలేదన్నారు. భవిష్యత్తులో చంద్రబాబును పట్టించుకోరనే భయంతో ఇప్పుడే తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చంద్రన్న కానుకలో నెయ్యి ఇస్తామన్నారు. ఆ నెయ్యిని హెరిటేజ్ కంపెనీ నుంచి తెప్పించారన్నారు. చంద్రన్న చలివేంద్రాలకు హెరిటేజ్ నుంచి పెరుగు తెప్పించారన్నారు. భవిష్యత్తులో దోచుకోవడానికి అవకాశం ఉంటుందో? లేదో అన్న భయంతో చౌకదుకాణాలను రిలయన్స్ సంస్థకు ఇచ్చి దోచుకునే కుట్ర చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ కార్పోరేట్ దోపిడీకి పుల్ స్టాఫ్పెట్టాలని, ప్రభుత్వమే గతంలో మాదిరిగా 10 రకాల సరుకులు రేషన్షాపుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని రోజా హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు రాజకీయ అవగాహన లేని లోకేష్ను ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత మంత్రిని చేశారో అప్పటి నుంచి ప్రతిది సూట్కేసు గురించే చంద్రబాబు పని చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు చేయడం లేదని రోజా విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. పోలవరంలో అవినీతి నెలకొందని, పట్టిసీమలో రూ.350 కోట్లు దోచుకున్నారని కాగ్ రిపోర్టు ఇచ్చిందన్నారు. బొగ్గు, మట్టి, మద్యం, ఇసుక వ్యాపారాలతో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపొటు పొడిచిన నీకు ప్రజలను మోసం చేయడం ఓ లేక్కా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్న పేరు పెట్టి పేదలకు నీరు ఇవ్వలేకపోయావంటే మీ మామపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలిసి పోయిందన్నారు. నీ లొసుగులన్ని బయట పెట్టి ప్రజల చేత తరిమికొట్టిస్తామని రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే రోజా ‘పంచ్’
సాక్షి, ఏలూరు : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేతల బృందం గురువారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనుల పర్యవేక్షణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ మాటలకు, చేతలకు పొంతన లేదు. చంద్రబాబు ఎప్పుడు అవినీతిలో ఇరుక్కున్నా.. తెరమీదకు పవన్ను తెచ్చి విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. పవన్ది జనసేన కాదు...భజన సేన. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే...పవన్ది పిల్ల టీడీపీ. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదని పవన్ అంటున్నారు. మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి సీఎం కావచ్చా? ఏ అర్హత లేకపోయినా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వొచ్చా?. అలాంటి వారికి పవన్ కల్యాణ్ భజన చేస్తారా?. అప్పుడు ఏమయ్యావ్ పవన్.. ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్లు పార్టీలు పెట్టారు. పోలవరం అవినీతిలో చంద్రబాబు కూరుకుపోగానే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి నాటకాలు ఆడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో మళ్లీ వపన్ను తెచ్చి రెండ్రోజుల కార్యక్రమాలు పెట్టారు. మేం పోలవరం వస్తున్నామని తెలియగానే పచ్చ ఛానళ్లు, చంద్రబాబు కలిసి హడావుడిగా పవన్ను పోలవరానికి పంపించారు. ప్రశ్నిస్తామంటున్న వ్యక్తి పుష్కరాల్లో 29మంది చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అమాయకులు చనిపోయినప్పుడు ఏమైయ్యాడు. ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా ఎందుకు మాట్లాడరు. పవన్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకోసమే పవన్ పార్టీ పెట్టాడు.. పవన్ ఉన్నది ప్రశ్నించడానికి కాదు...ప్యాకేజీల కోసం. చిరంజీవికి 18 సీట్లు వస్తే మధ్యలో వదిలేసిన షూటింగ్కు వెళ్లిపోయారు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఎందుకు మాట్లాడలేదు. వినేవాడు వెర్రివాడు అయితే...చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లు, బాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారు. షూటింగ్ గ్యాప్ల్లో వచ్చి ఇతరులపై నిందలు వేయడం సరికాదు. ప్రజల్లో ఉండి, ప్రజల తరఫున పోరాడండి. పవన్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అధికారం లేకపోయినా ఏమైనా చేయొచ్చంటున్నారు. అలా అయితే రుణమాఫీ చేయండి. డ్వాక్రా రుణాలు రద్దు చేయండి. అధికారం ఉంటేనే కొన్ని పనులు చేయగలమనే విషయం తెలియదా?. అది కూడా మనసు ఉంటేనే ప్రజల కోసం ఏమైనా చేసేది. పోలవరంపై చంద్రబాబు చేసిందేమీ లేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తవ్విన కాల్వలపై పట్టిసీమ, పురుషోత్తపట్నం కట్టి కమీషన్లు దండుకుంటున్నారు. పోలవరం విషయంలో మేం చెప్పిందే జరిగింది. నేనే చెస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పటివరకూ ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సబ్ కాంట్రాక్టర్లకు ఎందుకు దోచిపెడుతున్నారు. కొత్తగా మళ్లీ టెండర్లను ఎందుకు పిలుస్తున్నారు. లొసుగులు సరిచేయమని కేంద్రం అడిగితే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. చిరంజీవికి అన్యాయం చేసింది పవన్ కల్యాణే పవన్ వారసత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. సినిమాలకు వారసత్వం వర్తించదా?. రాజకీయాలకు మాత్రమే వారసత్వం వర్తిస్తుందా? చిరంజీవి లేకపోతే పవన్తో ఎవరైనా సినిమాలు తీసేవారా?. అది వారసత్వం కాదా?. ఇక చిరంజీవికి అన్యాయం చేసింది పవన్ కల్యాణే. చిరంజీవి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో అని యువజన విభాగం బాధ్యతలు తీసుకున్న పవన్ ఆ పార్టీ 18 సీట్లు మాత్రమే గెలవడంతో అన్నను నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. పవన్ సపోర్ట్ చేస్తే చిరంజీవి పార్టీ నడిపేవారు. అన్నకు సపోర్ట్ చేయకుండా షూటింగ్లకు పోవడం వల్లే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు. పవన్, చిరంజీవిపై ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు అడ్డమైన రాతలు రాయించి పార్టీని విలీనం చేసే పరిస్థితి తెచ్చారు. అలాంటి వ్యక్తితో 2014లో పవన్ చేతులు కలిపారు. 2009లో అవినీతిపరుడైన చంద్రబాబు 2014లో గొప్పవ్యక్తి ఎలా అయ్యాడు. వైఎస్ఆర్, జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. డ్రామలాపి సినిమాలు తీసుకోవడం బెటర్. చంద్రబాబంటే ఎందుకంత ముద్దు గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎలాగైనా గెలవాలని పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. విజయనగరంలో ఓ వ్యక్తి చనిపోతే పవన్ వెళ్లారు. మరి నారాయణ కాలేజీల్లో వందలమంది విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు వెళ్లడం లేదు. నారాయణ, గంటా శ్రీనివాసరావు గురించి ఎందుకు మాట్లాడటం లేదు. పవన్కు చంద్రబాబు అంటే ఎందుకంత ముద్దు. చంద్రబాబు పవన్కు ఏం ప్యాకేజీలిస్తున్నారు. ముందుగా ఆ విషయాన్ని పవన్ స్పష్టం చేయాలి.’ అని అన్నారు. పవన్ కల్యాణ్ది జనసేన కాదు...భజన సేన : రోజా -
భళా..'రో జా'బ్ మేళా
పుట్టిన రోజూ పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి..అన్నాడో సినీకవి..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బర్త్డే వేడుకలు జరుపుకున్న తీరును గమనించిన వారెవరికైనా ఈ పాట ఇట్టే స్ఫురిస్తుంది. తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకోసం శుక్రవారం జన్మదినం సందర్భంగా జాబ్ మేళా నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారీమె.. జాబ్మేళాకు తరలివస్తున్న యువతను ఈ చిత్రంలో రోజా వెంట చూడవచ్చు. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు.. ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళాకు హాజరైన నిరుద్యోగులతో శుక్రవారం పుత్తూరు కిక్కిరిసిపోయింది. ఉదయం స్థానిక డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించారు. కేక్ కట్ చేసి ఆమె జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్ కుటుంబంలో పర్యటిస్తుంటే ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. జన్మదినోత్సవం రోజున ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం కంటే ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయిం చుకున్నానన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర పట్టణాల్లో కంపెనీల ప్రతినిధులను సంప్రదించి జాబ్మేళా నిర్వహణకు కసరత్తు చేసినట్లు వివరించారు. జాబ్మేళాకు హాజరై నిరుద్యోగుల నుంచి వివరాల నమోదు ప్రక్రియను ఆమె ప్రారంభిం చారు. నగరి రోడ్డులో కస్తూరి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే రోజా దంపతులను సన్మానించారు. -
వచ్చేసారి ప్రతిపక్షమని తెలిసే లోకేశ్కు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో శిక్షణ తరగతుల్లా ఉన్నాయిగానీ శాసనసభ హూందాకు తగ్గట్టు లేవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడతారని సీఎం చంద్రబాబుకు అర్థమైనందునే ప్రతిపక్షనాయకుడిగా ఎలా వ్యవహరించాలో తన కుమారుడు, మంత్రి లోకేశ్కు శిక్షణ ఇస్తున్నారని రోజా అన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పిగొట్టారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షం భయపడి పారిపోయిందని సీఎం విమర్శించడంపై ఆమె స్పందిస్తూ..‘హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకునే అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు అమరావతిలో దాక్కున్నారు. దీన్ని పారిపోవటం అంటారు. బాబు అండ్ కో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జగన్ ప్రజల మధ్యలో ఉంటూ రచ్చబండ, పల్లెనిద్ర చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తుంటే చూసి భయపడుతున్నది చంద్రబాబే. అక్రమాలను లెక్కలతో సహా చూపించి జగన్ నిలదీస్తారనే వణుకు టీడీపీని వెంటాడుతోంది. అందుకే గతేడాది, ఈ ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించలేదు’ అని విమర్శించారు. స్పీకర్ యాక్టింగ్ దురదృష్టకరం: పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ కోడెల చర్యలు తీసుకోకుండా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందంటూ యాక్టింగ్ చేయడం దురదృష్టకరమని రోజా విమర్శించారు.గతంలో తనను సస్పెండ్ చేసినపుడు సుప్రీం కోర్టు సింగిల్ జడ్జి తనకు అనుకూలంగా తీర్పునిస్తే.. సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రి యనమల కలిసి అసెంబ్లీకి స్పీకరే సుప్రీం అన్నారన్న విషయం గుర్తుచేశారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు విషయానికి వచ్చే సరికి కోర్టు పరిధిలో ఉందని ఎందుకు చెబుతున్నారో వారే వివరించాలన్నారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం టీడీపీకే సిగ్గుచేటని విమర్శించారు. ప్యారడైజ్ పేపర్లపై అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి దానిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రోజా దుయ్యబట్టారు. ఈ విషయంలో జగన్ సవాల్ను సీఎం స్వీకరించాలని డిమాండ్ చేశారు. -
అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తారా ?
వడమాలపేట : జిల్లాలో నగరి నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్ అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అభివృద్ధి పనుల్లో కాదు అక్రమాల్లో నంబర్ వన్ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. శనివారం ఆమె వడమాలపేటలో విలేకరులతో మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి నుంచి ఏడు వందల మందికి ఆర్థికసాయం ఇప్పించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అందులో సగం మంది కూడా అర్హులు లేరని విమర్శించారు. దీనిపై తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాలు విసిరారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీకి వెళదామని, 35 ఏళ్లుగా ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో... మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలే చెబుతా రని తెలిపారు. తాము ప్రతిపాదనలు పంపితే మం జూరైన రోడ్లను అధికారులను బెదిరించి రద్దు చేయిస్తున్నారని, ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. మూడేళ్లుగా ఒక్కఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భిక్షపెట్టారని ఎమ్మెల్సీ చెబుతున్నారని, అంతకు పదింతలు పార్టీ కోసం తాను కష్టపడ్డానని తెలిపారు. ఆయనకు రాజకీయ భిక్షపెట్టిన రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే కాపాడారా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి చంద్రబాబును బూతులు తిట్టారని, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదని తిరిగి చంద్రబాబు పంచన చేరి ఆయన దేవుడంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. -
‘విధ్వంసం సృష్టించడానికి బాబు ప్లాన్’
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రలో విధ్వంసం సృష్టించడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ కుట్ర పన్నిందని ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ కుట్రలను ప్రజలతో పాటు పోలీసులు తిప్పికొట్టాలని ఆమె అన్నారు. గురువారం ఎమ్మెల్యే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ వైఎస్ జగన్ పాదయాత్ర టీడీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర. పాదయాత్రకు భయపడే చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఆయన నరనరాన కుట్రలు, కుతంత్రాలే ఉన్నాయి. ఓటుకు కోట్లు కేసుతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడ్డారు. తుని విధ్వంసం టీడీపీ పనేనని నివేదిక వచ్చింది. కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసింది నిజం కాదా?. చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. పాదయాత్రలో చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలు, కుట్రలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసే హక్కు జగన్కు ఉంది. 50ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపే బాబు కుట్రను వైఎస్ఆర్ సీపీ భగ్నం చేసింది. అప్పట్లో అలాంటిదేమీలేదన్న చంద్రబాబు ...ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులను ఎందుకు సస్పెండ్ చేశారు?. తప్పులు చేయడం కేంద్రం కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజం. వైఎస్ జగన్ ప్రజా సంకల్పాన్ని ప్రజలు విజయవంతం చేస్తారు. ప్రజా సంకల్పంతో టీడీపీకి కౌంట్డౌన్ మొదలైంది.’ అని రోజా హెచ్చరించారు. వైఎస్ జగన్ పాదయాత్ర టీడీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర -
‘ప్రజా సంకల్పం’ విజయవంతమవ్వాలని..
తిరుత్తణి (తమిళనాడు): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ విజయవంతం కావాలంటూ వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తుమ్మలగుంట నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుత్తణికి చేరుకొని సుబ్రహ్మణ్యస్వామికి పూజలు నిర్వహించారు. అలాగే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామికి 1008 కొబ్బరికాయలు కొట్టారు. వివరాలు.. చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం తమిళనాడులోని తిరుత్తణి ఆలయానికి చేరుకుంది. వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి బుధవారం ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. దీంతో తిరుత్తణి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. కుమారుడు మోహిత్రెడ్డి, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి చెవిరెడ్డి దంపతులు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని.. వారి కష్టాలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారని వివరించారు. ఈ యాత్ర విజయవంతం కావాలనే ఆకాంక్షతో తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. వెంకన్న ఆశీస్సుల కోసం.. సాక్షి, తిరుమల/వడమాలపేట: ప్రజాసంకల్పం విజయవంతం కావాలని, వైఎస్ జగన్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం 1008 కొబ్బరికాయలు కొట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్కు వెంకన్న ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్ననట్లు తెలిపారు. ఎంపీపీ మురళీధర్రెడ్డి, జెడ్పీటీసీ సురేష్రాజు, పార్టీ నేతలు కేజే కుమార్, దిలీప్రెడ్డి, మాహీన్, లలిత, రంగనాథం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమామ్ ఆధ్వర్యంలో 600 మందికిపైగా యువజన, విద్యార్థి నాయకులు తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి వద్ద 3 వేల కొబ్బరికాయలు సమర్పించారు. భూమన అభినయ్, పాలగిరి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాదయాత్ర విజయవంతం కావాలని..
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా బుధవారం 1008 కొబ్బరి కాయలు కొట్టారు. ప్రజాక్షేమం కోరే జగన్కు ఆశీస్సులివ్వాలని వెంకన్నను ప్రార్ధించినట్లు చెప్పారు. -
‘చంద్రబాబుకు భయం పట్టుకుంది’
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయనున్నవిషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదిన ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే రోజా అప్పలయగుంట గుడిలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నారు.. కుమారుడికి మంత్రి పదవి, కోడలికి ఆస్తులు, భార్యకు హౌస్ కట్టించారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర అంటే బాబుకు భయం పట్టుకుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే. -
టీడీపీ దోచుకోవడానికే ఇరిగేషన్ పనులు
వడమాలపేట : అధికార పార్టీ నాయకులు డబ్బులు దోచుకోవడానికే ఇరిగేషన్ పనులు పెడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. వడమాలపేటలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటి గురించి పట్టించుకోకుండా డబ్బులు దోచుకునే పనిలో అధికారపార్టీ వారు ఉన్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు తాము ప్రతిపాదనలు పంపితే వారు అడ్డుకుం టున్నారని, వారైనా చేస్తారా ? అంటే అదీ లేదని ఆమె ఆవేదన వ్య క్తం చేశా రు. అభివృద్ధి ప్రకటనలకే పరి మితమైందని, వాస్తవ పరిస్థితులు భి న్నంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. మీ ఊరు – మీ ఎంపీ కార్యక్రమం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాత తన పార్లమెంట్ పరిధిలో మీ ఊరు – మీ ఎంపీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలిపారు. పార్టీలు ఎన్నికల సమయంలోనేనని, తరువాత అందరూ కలసి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నాయకులు, పార్టీలతో నిమిత్తం లేకుండా తనను కలవవచ్చునని, అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న 510 అంగన్వాడీ కేంద్రాలకు రూ.50 లక్షలతో ఇంటర్నెట్, టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు పంచాయతీల్లో చెత్తను ఎత్తడానికి ట్రాక్టర్లను కూడా ఎంపీ నిధులతో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. -
కడుపుకోతలు కనపడవా?
సాక్షి, హైదరాబాద్: నారాయణ, శ్రీచైతన్య, ఇతర కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణాలకు సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల ర్యాంకుల దాహానికి విద్యార్థులు నిత్యం బలవుతున్నా అధికా రాన్ని అడ్డు పెట్టుకుని విద్యార్థుల బలవన్మర ణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ తల్లిదం డ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎంకి పట్టదా అని నిలదీశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడున్నరేళ్లుగా ఆ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అది ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం కాదా? అని రోజా ప్రశ్నించారు. విద్యార్థుల మరణాలను ఆపలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మంది విద్యార్థులు మరణించాక కానీ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల కడుపుకోత చంద్రబాబుకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ మరణ మృదంగానికి మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులే కారణమన్నారు. ఇంతమంది విద్యార్థులు చనిపోయాక కూడా గంటా తన పదవికి రాజీనామా చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ‘చంద్రబాబు బినామీ కనుకనే నారాయణ కళాశాలకు గంటా వెళ్లలేదా? లేక తన కుమారుడే స్వయంగా నారాయణ అల్లుడు కనుక సగం వాటా వస్తుందని వెళ్లలేదా?’ అని ప్రశ్నించారు. మంత్రివర్గం నుంచి గంటా, నారాయణలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలి సచివాలయంలో తన ఫోటోపై చెత్త వేస్తేనే సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మితో విచారణ జరిపించిన చంద్రబాబు.. విద్యార్థుల మరణాలపై విచారణకు ఆదేశించక పోవడం శోచనీయమని రోజా విమర్శించారు. మరణించిన విద్యార్థుల కుటుం బాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎమ్మెల్యే రోజా ఏమన్నారో చూడండి -
టీడీపీ పాలనలోఅభివృద్ధి ఏదీ?
పుంగనూరు టౌన్ : తెలుగుదేశం పాలనలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్సీపీ మహిళావిభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా విమర్శించారు. శనివారం పుంగనూరులో ఆమె వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పేదవాడికి నిత్యావసరాలు అందజేసే రేషన్ వ్యవస్థ టీడీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. బియ్యం తప్ప మరే ఇతర నిత్యావసరాలు రేషన్షాపుల్లో ఇవ్వడం లేదని తెలిపారు. దోమలపై దండయాత్ర పేరుతో కోట్లాది రూపాయలు భోంచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని, రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ప్రతి సమావేశంలోనూ లక్షల కిలోమీటర్ల సీసీరోడ్లు అంటూ ప్రకటనలిస్తున్నారని, సీఎం సొంత జిల్లాలోనే ఇప్పటికీ కొన్ని గ్రామాలకు మట్టిరోడ్లు లేకపోవడం దౌర్భాగ్యమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన వియ్యంకుడనో, టీడీపీ ఫైనాన్సియర్ అనో చూడకుండా నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి సహజమని, మూడేళ్లు వర్షాలు లేక కరువుతో బాధపడితే, నేడు వరదలతో నష్టపోయే పరిస్థితి దాపురించిందని తెలిపారు. పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి ప్రజలు, రాష్ట్రం గురించి సీఎం ఆలోచించకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలం దరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
నగరి కళాశాలకు ఎమ్యెల్యే వాటర్ ప్లాంట్
నగరి: పట్ణణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లక్ష రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె ఆ ప్లాంటును ప్రారంభించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన సమయంలో తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రిన్సిపాల్ రఘుపతి, మునిసిపల్ చైర్పర్సన్ కే.శాంతి, మాజీ చైర్మన్ కేజే కుమార్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రోజాకు కువైట్లో ఘన సత్కారం
కడప కార్పొరేషన్: కువైట్లో నవరత్నాల సభ విజయవంతమైన సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజాను వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపిక అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కువైట్లోని సూక్ ముబారాకియా ప్రాంతంలోని అరబిక్ హోటల్లో నిర్వ హించిన అభినందన సభలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడారు. కువైట్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను వారు వివరించారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రెహమాన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్రెడ్డి, ఆకుల ప్రభాకర్రెడ్డి, రమణ యాదవ్, ఎన్.చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
'దిమ్మతిరిగేలా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి'
కాకినాడ ప్రచారంలో ఓటర్లు ఎమ్మెల్యే రోజా పిలుపు కాకినాడ: ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయని చంద్రబాబుకు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని కాకినాడ ఓటర్లకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 31, 32వ డివిజన్లలో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరుపై నిప్పులు చెరిగారు. బుద్ధిలేని కుమారునికి మంత్రి పదవి ఇప్పించుకున్న చంద్రబాబు.. లక్షలాది యువతలో ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని విమర్శించారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వారే కాకినాడ ఓటర్లు అనే తరహాలో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సూచించారు. -
హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం - చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు - రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారు పుత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆమె ఖండించారు. నడిరోడ్డుపై కత్తులు, తుపాకులతో టీడీపీ నాయకులు చెలరేగుతుంటే అణచివేయాల్సిన పోలీసులు వారిని బుజ్జగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అర్హత లేని వారికి గన్మెన్ సౌకర్యం కల్పించడమే కాకుండా వారిని ప్రతిపక్షాలపైకి, ప్రజలపైకి ఉసిగొల్పి సీఎం చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీడీపీ నాయకులకు తుపాకులు, బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు చనిపోయినా ఆ కేసులు ఇంతవరకూ అతీగతీ లేకుండా పోయాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. హత్య, అత్యాచారం కేసుల్లో నిందితులను కాపాడేందుకు 120 జీవోలను జారీ చేసిన చంద్రబాబుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలకు జరగడానికి చంద్రబాబు ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.