Recipe
-
బ్రెడ్ పాలక్ వడ : రుచితోపాటు ఆరోగ్యం కూడా
పేరులోనే ‘కూర’ను జత చేసుకున్నపాలకూర అన్నంలోకే కాదు, స్నాక్స్గానూ మారిపోతుంది. పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకుకూరను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేకరకాల సమస్యలనుంచి బయటపడవచ్చు. కావలసినవి: పాలకూర తరుగు – ఒకటిన్నర కప్పు, బ్రెడ్ స్లైసులు – 3, అల్లం తరుగు – టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరగాలి), పుదీనా తరుగు – టేబుల్ స్పూన్, జీలకర్ర – టీ స్పూన్, చాట్ మసాలా – టీ స్పూన్, బియ్యప్పిండి – అర కప్పు, ఉల్లిపాయ తరుగు –పావు కప్పు, జీడిపప్పుల తరుగు – టేబుల్ స్పూన్, నిమ్మరసం – టీ స్పూన్. ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేయించడానికి తగినంత.తయారీ: ∙బ్రెడ్ స్లైసులను మిక్సీలో గ్రైండ్ చేయాలి.పాలకూర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. ∙ఒక పెద్ద గిన్నెలో బ్రెడ్ మిశ్రమంతో సహా అన్ని పదార్థాలు వేసి, మెత్తని పిండిలా కలపాలి. ∙చిన్ని చిన్న ఉండలు చేసి, కొద్దిగా అరచేతితో అదిమి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. ∙వీటిని కెచప్తో సర్వ్ చేయాలి. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్! )పాలకూరతో ప్రయోజనాలుపాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Palakura Pachadi : శ్రేష్టమైన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో, పాలకూర పప్పు, పాలకూర ఆలూ, పాలక్ పనీర్ .. ఇలా రకరకాల వంటలను చేసుకుంటాం. అలాగే పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి లాగానే పాలకూరను కూడా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దామా.పాలకూరతో బీపీ, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బీపీ అదుపులో ఉంటుందని భావిస్తారు.పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కావలసిన పదార్థాలుపాలకూర ఒక కప్పు, కొంచెం శుభ్రం చేసుకున్న చింతపండు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొద్దిగా నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , చిటికెడు పసుపు, ఇంగువ, నాలుగైదు ఎండుమిచ్చి,ధనియాలు-ఒక స్పూను పోపు కోసం: పప్పులు,ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ(ఆప్షనల్) జీలకర్ర, ఆవాలు,తయారీపాలకూరను శుభ్రంగా రెండుమూడుసార్లు బాగా కడగాలి. ఇసుక, మట్టి శుభ్రంగా పోయాయని నిర్ధారించుకున్నాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూసుకోవాలి.స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ధనియాలు, మెంతులు కూడా బాగా వేగనివ్వాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే కళాయిలో పాలకూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉత్తినే మగ్గిపోతుంది. అవసరం పడితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. పాలకూర బాగా దగ్గరికి వచ్చాక, చింతపండును కూడా వేయాలి. బాగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే చిటికెపు పసుపు వేయాలి. ఆతరువాత శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిరెబ్బల్ని కూడా (ఇష్టంలేనివారు మానివేసి నువ్వులను చిటచిటపలాడేలూ వేయించి కలుపుకోవచ్చు) వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి, పచ్చి ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యాక ఉడికించిన పాలకూరను కూడా మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు,పులుపు కారం సరిపోయిందోఒకసారి చెక్ చేసుకోవాలి.ఇపుడు కాస్త మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించి చివర్లో కాస్త ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పాలకూర చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో గానీ, రోటీ, చపాతీలో టేస్టీటేస్టీగా తినవచ్చు. దోశ, ఇడ్లీల్లో కూడా చట్నీలా వాడుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది.పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. -
పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలంటే కత్తిమీద సామే. ఏదో ఒకటి వంక పెడుతూ ఇంటి ఫుడ్ను దూరం పెడుతూ ఉంటారు. చిప్స్, న్యూడిల్స్ అంటూ పరుగులు పెడతారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్తో చేసుకునే అద్భుతమైన రెసిపీలను ఇక్కడ చూద్దాం. రెస్టారెంట్ రుచి కావాలంటే.. మరిన్ని టిప్స్ మీకోసం.పాలక్ పనీర్...ఇది ఫేమస్ పంజాబీ రెసిపీ కానీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి అభిమానులున్నారు. పాలక్ పనీర్ చపాతీ, రోటీలు, పుల్కా, ఇంకా జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది. పాలక పనీర్ రెసిపీ చాలా సింపుల్ కొన్ని చిన్న టిప్స్ కొలతలు సరిగా పాటిస్తే.. అదిరిపోయేటేస్ట్ వుస్తుంది. కావాల్సిన పదార్థాలు: అర కప్పు సన్నగా తరిగిన పాలకూర, అర కప్పు పనీర్ ముక్కలు , సన్నగా తరిగిన ఉల్లిపాయ, సగం కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటిన్నర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర,1/4 స్పూన్ గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్తయారీ మీడియం వేడి మీద పాన్ వేడెక్కాక, నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలవేయించుకోవాలి. ఇవి బాగా వేగాక సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి పాన్ ని మూత పెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. అడుగు అంటుకోకుండా ఉండటానికి తిప్పుతూ ఉండాలి. పాలకూర ఉడికిన తర్వాత, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోనే క్రీమ్ లేదా చక్కెర వేసుకోవాలి. బాగా దగ్గరికి ఉడికిన తరువాత పనీర్ వేసి కలిపి మరో 4-5 నిమిషాలు ఉడికనివ్వాలి. మంటను ఆపివేసి. కసూరి మేథీ వేసి కలుపుకోవడమే. టేస్టీ టేస్టీ పాలక్ పనీర్ రెడీ.రుచిని పెంచే టిప్స్:పాల కూర ఆకులు మరిగే నీళ్ళలో వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చన్నీళ్ళ లో వేయాలి. అప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లేదంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.ఇంట్లో చేసుకున్న పనీర్ ఎప్పుడూ బెస్ట్, రెడీమేడ్ తెస్తే పనీర్ ముక్కలుగా చేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచితే పనీర్ మెత్తబడుతుంది. ఉల్లిపాయ ఎర్రగా వేగాలి.కసూరి మేథి తప్పక వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో పాల మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ వాడితే టేస్ట్ అదిరిపోతుంది.పాలకూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి, చేదును తగ్గించడానికి కొంచెం క్రీమ్ లేదా చక్కెర వాడతారు. వెల్లుల్లి ఇష్టం లేనివారు మానేయవచ్చు.కొంతమంది టమాటా గుజ్జుకూడా కలుపుకుంటారు.పనీర్ బటర్ మసాలాకావలసినవి: పనీర్ ముక్కలు– ఒకటిన్నర కప్పు; ఉల్లిపాయ ముక్కలు-ముప్పావు కప్పు; టొమాటో ముక్కలు-కప్పు; వెల్లుల్లి రేకలు-4; అల్లం తురుము-టీ స్పూన్; పచ్చిమిర్చి-2; జీడిపప్పు-పది పలుకులు; పాలు- అర కప్పు; మీగడ-పావు కప్పు; కసూరీ మేథీ లేదా తాజా మెంతి ఆకు-టీ స్పూన్; ధనియాల పొడి- టీ స్పూన్; మిరపపొడి-టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; వెన్న-2 టీ స్పూన్లు; ఉప్పు-అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు– 3 టేబుల్ స్పూన్లు.పోపు కోసం... నూనె - టేబుల్ స్పూన్; యాలకులు-2; లవంగం – 1; దాల్చిన చెక్క- అంగుళం ముక్క;తయారీ: పనీర్ ముక్కలను వేడి నీటిలో వేసి మెత్తబడే వరకు పక్కన ఉంచాలి. బాణలి లో నూనె వేడి చేసి మీగడ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఒక మోస్తరుగా వేయించాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాణలిలో మిగిలిన నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించాలి. ఆ తర్వాత మిరకపొడి, ధనియాల పొడి,పసుపు, మేథీ వేసి పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, జీడిపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. అందులో పాలు పోసి, ఉప్పు వేసి కలిపి చిక్కదనం, రుచి చూసుకోవాలి. మిశ్రమం ఉడకడం మొదలై బుడగలు రావడం మొదలైన తర్వాత పనీర్ ముక్కలను నీటిలో నుంచి తీసి బాణలిలో వేసి కలపాలి. మంట తగ్గించి, వెన్న వేసి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.ఇవీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం -
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్లో నుంచి కేక్ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. -
‘దేవర’ బ్యూటీ ఫేవరెట్ : రాగి–చిలగడ దుంప పరాఠా
రోజంతా పని చేయాలంటే శక్తి ఉండాలి. అందుకోసం కడుపు నిండా తినాలి. కంటినిండా నిద్ర΄ోవాలి. ఈ రొటీన్లో ఏం తింటున్నామో తెలియకపోతే స్లిమ్గా ఉండడం కష్టం. ఆహారం బలాన్ని పెంచాలి కానీ బరువును పెంచకూడదు. నాజూగ్గా ఉండే జాన్వి కపూర్... అంత స్లిమ్ గా, ఎనర్జిటిక్గా ఉండడానికి ఏం తింటుంది? డిన్నర్లో రాగి – చిలగడ దుంప (స్వీట్ పొటాటో) పరాఠా తింటానని చెప్పింది. ఆమె షెఫ్ ఎలా వండుతున్నారో చూద్దాం.రాగి–చిలగడ దుంప పరాఠాకావలసినవి: చిలగడ దుంప – ఒకటి (పెద్దది); రాగి పిండి – 250 గ్రాములు; నువ్వులు– టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి); జీలకర్ర పొడి– అర టీ స్పూన్; మిరప పొడి– అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మిరియాల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్;తయారీ∙ఒక పాత్రలో పావు లీటరు నీటిని పోసి వేడి చేయాలి. అందులో నెయ్యి (సగం మాత్రమే), నువ్వులు, కొద్దిగా ఉప్పు, రాగి పిండి వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేత్తో అదుముతూ పూరీల పిండిలా కలిపి పాత్ర మీద మూత పెట్టి పక్కన పెట్టాలి.ఈ లోపు ప్రెషర్ కుక్కర్లో నీటిని పోసి గెణుసుగడ్డను ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్కు వలిచి మరొక పాత్రలో వేసి చిదమాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, మిరప పొడి, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు చేయాలి.రాగి పిండి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని చపాతీల పీట మీద వేసి కొద్దిగా వత్తి అందులో గెనుసు గడ్డ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. ఆ తరవాత జాగ్రత్తగా (లోపలి మిశ్రమం బయటకు రాకుండా) పరాఠా చేసి వేడి పెనం మీద వేసి నెయ్యి రాస్తూ కాల్చాలి. -
మఖానా స్మూతీ ఎపుడైనా ఇలా ట్రై చేశారా?
కమ్మని రుచి, చక్కని పోషకాలతో ఆరోగ్యాన్ని అందించే మఖానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసినవి:వేయించిన మఖానా– కప్పుబాదం పప్పు– 3 టేబుల్ స్పూన్లుఅరటిపండు – ఒకటి; ఖర్జూరాలు– 4;పీనట్ బటర్– టేబుల్ స్పూన్;పాలు– 300 ఎం.ఎల్;గుమ్మడి గింజలు– టీ స్పూన్;తయారీ:గుమ్మడి గింజలుమినహా మిగిలిన అన్నింటినీ మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేయాలి. గ్లాసుల్లో పోసి పైన గుమ్మడి గింజలు చల్లి సర్వ్ చేయాలి. చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టాలి. ఇది మంచి ΄ోషకాహారం. పిల్లలు ఆటల్లో మునిగి తినడానికి ఇష్టపడక పరుగులు తీస్తుంటారు. పోషకాలన్నింటినీ ఒక గ్లాసులో పోసి ఇచ్చినట్లే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ఒక గ్లాసు తాగితే రోజుకు అవసరమైన పోషకాలన్నీ దాదాపుగా అందినట్లే. ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులుగా కూడా ఈ స్మూతీని ఇవ్వవచ్చు. ఫిట్నెస్ చేసేవాళ్లు వర్కవుట్ తర్వాత ఈ డ్రింక్ను తీసుకోవచ్చు.పోషకాలు:శక్తి– 764 కిలోకేలరీలు ప్రొటీన్– 26.1 గ్రాముకార్బొహైడ్రేట్లు– 87.2 గ్రాములుఫ్యాట్ – 36.3 గ్రాములుఫైబర్– 10 గ్రాములుడాక్టర్ కరుణన్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
ఆలియా భట్ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!
ఆలియా భట్ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్నెస్, పోషకాహారానికి సంబంధించిన వెల్నెస్ ఐకాన్ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్గా ఉండేలా సులభమైన, పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్రూట్ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్.. పరిచయం చేస్తోంది. బీట్రూట్ సలాడ్కావలసినవి: తురిమిన బీట్రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్రూట్ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.సొరకాయ సబ్జీకావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.తయారీ: మూకుడులో టేబుల్స్పూన్ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చియా పుడ్డింగ్ కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు, ప్రొటీన్ , పౌడర్ కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు, పాలు, ప్రొటీన్ ΄ పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్స్టంట్గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
డైట్ ప్లాన్లో ఉన్నారా : డిన్నర్ కోసం అదిరిపోయే పరాటా
పోషకాలు విరివిగా లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్ మొక్కలాగా కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం.సోయాకూరలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.సోయా, ఓట్స్ పరాటాకావాల్సినవి :దిల్ ఆకులు : ఒక కప్పు ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి : ఒక కప్పు నెయ్యి రెండు టీస్పూన్లునాలుగు పచ్చిమిర్చి జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు : అర కప్పుతయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి. తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్ వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్చేసి పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం మీద నెయ్యివేసి, సన్నని మంటమీద కాల్చుకుంటే, టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్ పరాటా రెడీ. దీన్ని ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు. -
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి. -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
Dussehra 2024 : కజ్జికాయలు.. ఈజీగా, హెల్దీగా!
దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్లాగా కూడా ఉంటుంది. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనెకజ్జికాయల తయారీమైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.ఇపుడు స్టవ్మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి! -
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
గణపయ్య బొజ్జనిండేలా పాలతాలికలు, రెసిపీ ఇదిగో
వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పాలతాలికల రెసిపీ తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి. వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు. బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు శుభ్రంగా కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని పిండి పట్టించి, జల్లించుకోవాలి. అరిసెల కోసం తయారుచేసుకునే పిండిలాగా మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి. పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. -
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది. -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది. -
రెస్టారెంట్ అంటేనే దడపుడుతోందా? ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా టొమాటో కెచప్
హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని హోటల్స్లో ఆహారభద్రతా శాఖ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, కాలం తీరిన పదార్థాలు, బొద్దింకలు, పురుగులు, లేబుల్ లేని ఆహారం, లైసెన్స్ లేని ఆహార బ్రాండ్లులాంటివి చూస్తోంటే గుబులు రేగుతోంది. రెస్టారెంట్కు వెళ్లాలంటేనే వామ్మో.. అనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే నోనూరించే టొమాటో కెచప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసినవి: టొమాటోలు – 2.5 కేజీలు; వెల్లుల్లి రేకలు-15; అల్లం– 3 అంగుళాల ముక్క; ఎండు మిర్- 6; కిస్మిస్-అర కప్పు; యాపిల్ సిడెర్ వినెగర్- అర కప్పు; ఉప్పు – టేబుల్ స్పూన్; చక్కెర- 6 టేబుల్ స్పూన్లు; సోడియం బెంజోయేట్ – పావు టీ స్పూన్ (టీ స్పూన్ నీటిలో వేసి కరిగించాలి)తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడగాలి. ఆరిన తర్వాత తొడిమలు తొలగించాలి. ఇప్పుడు టొమాటోలన్నింటినీ మీడియం సైజు ముక్కలుగా తరగాలి వెల్లుల్లి రేకల పొట్టు వలిచి సన్నగా తరుక్కోవాలి. అల్లం కడిగి చెక్కు తీసి తరగాలి కిస్మిస్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఎండు మిర్చి తొడిమలు తీసి, మధ్యకు విరిచి గింజలతను తొలగించాలి. మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, కిస్మిస్, వినెగర్, ఉప్పు, చక్కెర వేసి గరిటెతో కలిసి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ టొమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి పాత్రను దించేయాలి ∙వేడి తగ్గిన తరవాత బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద చిల్లులున్న స్ట్రెయినర్లో వడ΄ోయాలి. టొమాటో తొక్కలు, మెదగని గింజల వంటివి పైన నిలుస్తాయి. వడ΄ోసిన ద్రవాన్ని బాణలిలో ΄ోసి కొంత సేపు మీడియం మంట మీద ఉడికించి దగ్గరవుతున్నప్పువు సన్నమంట మీద ఉడికించాలి. టొమాటో ద్రవం కెచప్కు తగిన చిక్కదనం సంతరించుకోవాలంటే అరగంటకు పైగా ఉడకాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. దించడానికి ముందు టీ స్పూన్ వేడి నీటిలో పావు టీ స్పూన్ సోడియం బెంజోయేట్ కలిపి కెచప్లో పోసి కలిపి స్టవ్ ఆపేయాలి. సోడియం బెంజోయేట్ కెచప్ నిల్వ ఉండడానికి దోహదం చేసే ప్రిజర్వేటివ్. కెచప్ను ఫ్రిజ్లో పెట్టుకుని వాడుకునే వాళ్లు సోడియం బెంజోయేట్ లేకుండా కూడా సాస్ చేసుకోవచ్చు ∙కెచప్ ఉడికేలోపు సాస్ నిల్వ చేయడానికి గాజు బాటిల్ని సిద్ధం చేసుకోవాలి. బాటిల్ని శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీటిలో ముంచి తీసి ఆరబెట్టాలి ∙కెచప్ చల్లారిన తర్వాత సీసాలో వేసి గట్టిగా మూత పెట్టాలి. దీనిని స్నాక్స్లోకి తినవచ్చు లేదా భోజనానికి ముందు ఆకలి పెంచడానికి అప్పిటైజర్గా కూడా పని చేస్తుంది. నాలుక రుచి కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఒక టీ స్పూన్ కెచప్ను చప్పరిస్తే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి. -
బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
అధిక బరువు నుంచి బైటపడాలంటే చక్కని పోషకాహారంతోపాటు, రోజుకు కనీసం అరగంట వ్యామాయం చేయాల్సిందే. బరువు తగ్గాలంటే వ్యాయామం కంటే డైటింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నం మానేశాం అంటూనే ఉదయం పూట టిఫిన్లో ఇడ్లీ, పూరీ, వడ దోసలు, చపాతీలు లాగించేస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దమా..!అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. రోజుమొత్తానికి శక్తినిచ్చేలా ఉండాలి. పోషకాలతో కూడిన అల్పాహారం తింటే ఆరోగ్యకరమైన బరువుతో, మెటబాలిజం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్లూటెన్-రహిత మిలెట్ల్స్ను తీసుకోవడం ఉత్తమం. మిల్లెట్స్లో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రెడీమేడ్ మిల్లెట్ ఆధారిత పిండి, పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఫింగర్ మిల్లెట్ లేదా రాగి దోస, రాగి ఇడ్లీ, రాగి జావ : ఫైబర్, కాల్షియం ,ఐరన్ అధికం.జొన్నలతో కిచ్డీ, జొన్నరొట్టె : కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలంఫాక్స్టైల్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్స్తో చేసిన పొంగల్, లిటిల్ మిల్లెట్ దోస: కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంప్రోసో మిల్లెట్ దోస: సాధారణ దోసలాగానే బియ్యం కలపుకుండా, కొద్దిగా మినపపప్పు కలిపి చేసుకోవాలి. బార్నియార్డ్ మిల్లెట్ పొంగల్ : దీన్ని కూడా బియ్యం పొంగల్లాగా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ , ప్రోటీన్లో అధికం. -
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి. థండయ్ కుల్ఫీ కావలసినవివెన్న తీయని పాలు- 2 కప్పులు కోవా-100 గ్రాములు ; కండెన్స్డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్లో పోసి ఫ్రీజర్లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే. -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024 -
రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!
ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియే ఈ ఈదుల్ ఫిత్ర్ పండుగ. ఈ పండుగను ప్రతీ ముస్లిమ్ కుటుంబం తమకున్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. అలాగే ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. ఆ తర్వాత రకరకాల వంటకాలను చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆరగించి సంతోషంగా గడుపుతారు. ఈ రోజు స్పెషల్గా చేసేది షీర్ ఖుర్మా. ఈ రంజాన్ రోజు వివిధ రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ షీర్ ఖుర్మా రెసిపీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అసలు ఈ రోజు ఎందుకు దీన్ని చేస్తార?. రీజన్ ఏంటంటే..? పవిత్ర మాసంలో ఆనందంగా చేసుకునే డెజర్ట్, రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా ఎప్పటి నుంచి పండులో భాగమైంది?. ఇది ఎందుకు చేస్తారు అంటే. ఈ షీర్ కుర్మా ఐక్యత ఆధ్యాత్మిక సమృద్ధికి గుర్తుగా ఈ తీపి వంటకాన్ని ప్రతి ముస్లీ కుటుంబం తయారు చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందులో వివిధ మాంసాహార రెసిపీలు ఉన్నప్పటికీ.. ఈ షీర్ కుర్మాదే అగ్రస్థానాంలో ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లీం కుటుంబంలో తమకున్నంతలో ఈ షీర్ కుర్మాను తప్పనిసరిగా చేస్తారు. ఇన్నీ రెసిపీలు ఉన్నా ఈ షీర్ కుర్మాకే ఎందుకంత ప్రాధాన్యత వచ్చిదంటే.. షీర్ కుర్మా చరిత్ర.. ఈ షీర్ కుర్మా రెసిపీ వంటకం పర్షియన్ సామ్రాజ్యం నుంచి మన వంటకాల్లో భాగమయ్యింది. ఇక్కడ షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే పర్షియన్ భాషలో ఖర్జూరం. రంజాన్ మాసంలో ఖర్జూరాలు అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే..ఈదుల్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అంతేగాదు ఇది కేవలం రంజాన్ కోసం తయారు చేసే వంటకమే కాదట..ఆ రోజు తీసుకున్నా స్పైసీ ఫుడ్ల నుంచి కాస్త ఉపశమనం కోసం చివరిగా ఈ తీపి వంటకాన్ని అందించేవారు. ఆ తర్వాత క్రమేణ ఇది లేకుండా రంజాన్ మెనూ ఉండనంతగా ఈ రెసిపీకి ప్రజాధరణ వచ్చింది. బ్రిటీష్ పాలన కంటే ముందే మన దేశంలో షీర్ కుర్మా చేసేవారట. ఉత్తర భారతదేశంలో 'సెవియన్' అని పిలిచే వెర్మిసెల్లికి భిన్నమైన రెసిపీ వంటకం ఈ షీర్ కుర్మా. మరో కథనం ప్రకారం అరబ్బులు వాణిజ్యం చేసే నిమిత్తం మన దేశంలోకి రావడం వల్ల ఈ రెసిపీని ఇక్కడకు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. దీని తయారీ కూడా ప్రాంతాల వారీగా చేసే విధానం కూడా మారుతుంటదని చెబుతున్నారు. మాములుగా వెర్మిసెల్లి, పాలు, ఖర్జురాలతో తయారు చేసుకునేవారు. కాలానుగుణంగా అన్ని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రజల అభిరుచులకు అనుగుణంగా పిస్తా, బాదం, లవంగాలు, కుంకుమపువ్వు, రోజ్వాటర్ వంటి పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించారు. ఎక్కడ ఫేమస్ అంటే.. ఈ షీర్ ఖుర్మా ముఖ్యంగా హైదరాబాద్ ,లక్నో వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ నగరాల్లో క్రీమీ, రిచ్ డెజర్ట్లతో నెమ్మదిగా ఉడికించి, ఎండిన ఖర్జూరం, కొబ్బరి, బాదం, జీడిపప్పు మరియు పిస్తాతో అలంకరించి నోరూరించేలా అట్రెక్టివ్గా తయారు చేస్తారు. దీన్ని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేస్తారు. ఖర్జూరాలు ఇక్కడ చక్కెర బదులుగా తీపిని అందించి షీర్కుర్మాకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. అంతేగాదు ఈద్-ఉల్-ఫితర్లో షీర్ ఖుర్మాను సంతోషకరమైన ట్రీట్గా భావిస్తారు ముస్లీంలు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో ఉపయోగించే పాలు, నెయ్యి, ఖర్జురాల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇక పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ఈ నెల రోజుల పాటు ఉపవాసాలతో శుష్కించిన శరీరాన్ని ఉపశమనంలా ఉంటుంది ఈ రెసిపీ. ఉపవాశం కారణంలో పొట్టలో వచ్చే, ఎసిడిటీల నుంచి ఈ తీపి వంటకం కాపాడుతుంది. సమ్మర్లో శరీరానికి చలువ చేస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. మన సంప్రదాయాలకు అనుగుణంగా చేసే ఇలాంటి వంటకాలు ఆరోగ్యప్రదంగానూ సంతోషన్ని పంచేవిగానూ ఉంటాయి కదూ..! (చదవండి: Eid al Fitr 2024: ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష! కృతజ్ఞతలు తెలిపే శుభసయం..!) -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
'పఖాలా'తో వేసవి తాపం పరార్!
ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు. ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం. నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఎన్నిరకాలు తయారు చేస్తారు.. సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు. బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు. సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు. జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి. ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది. అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు. View this post on Instagram A post shared by FOOD IN ODISHA | Odisha food | Odia Cuisine (@foodinodisha) (చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
మీరెప్పుడైనా బ్రెడ్ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!
కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 15 లేదా 20 (నలువైపులా కట్ చేసి.. పాలలో ఒకసారి ముంచి.. చేతులతో గట్టిగా ఒత్తుకుని, విడిపోకుండా చపాతీకర్రతో చపాతీల్లా ఒత్తుకుని పక్కనపెట్టుకోవాలి) మటన్ కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని ఉడికించుకుని, చల్లారనివ్వాలి) బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) వాము పొడి, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, బ్రెడ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లపైనే నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికిన కీమా, జీలకర్రపొడి, గరం మసాలా, వాము పొడి, ఆమ్చూర్ పొడి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, బంగాళదుంప గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం చిన్నచిన్నబాల్స్లా చేసుకుని ఒక్కో బ్రెడ్ ముక్కలో ఒక్కో ఉండ పెట్టి.. గుండ్రంగా బాల్స్లా చేసుకోవాలి. అనంతరం ఆ ఉండలను పాలల్లో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. నచ్చిన కూరగాయల తురుముతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బాల్స్. ఇవి చదవండి: ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..! -
ఈ స్టయిల్లో మటన్ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్ కొట్టదు!
వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ వెంట ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మాంసాహార ప్రియులు. ప్రతీ వారం ఒకే లాగా కూర చేసుకుంటే తినడానికి బోర్ కొడుతుంది.చిన్న పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు కదా. అందుకే మటన్ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి: కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగిన మటన్ కీమా – పావుకిలో రెండు కట్టలు చింత మెంతి కూర(శుభ్రం చేసి కడిగినవి), ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా, బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి దాదాపు గంటలో ఈ వంటకాన్ని రడీ చేసుకోవచ్చు. తయారీ విధానం కుక్కర్లో శుభ్రం చేసిన కీమాకు కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు కారం వేసి బాగా కలిపి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇపుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడి చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బే ఆకులు , గరం మసాలా వేసి, వేయించినూనె తేలెదాకా వేయించాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న కీమావేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. ఇక చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడక నివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ ఉడుకుతుంది. ఇందులో ఇష్టమున్న వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచి మటన్ కీమా మెంతికూర రడీ. దీన్ని చక్కని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన,ఉల్లిపాయ, నిమ్మ స్లైస్లతో అందంగా గార్నిష్ చేయండి. రైస్తోగానీ, చపాతీలో గానీ చక్కగా ఆరగించే యొచ్చు. అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. -
సారా టెండూల్కర్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు ఇవే!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల తనయ సారా టెండూల్కర్ అందరికీ సుపరచితమే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. ఈసారి ఆమె తన సోదరుడు అర్జున్తో కలిసి ఇన్స్టాలో తాము తీసుకునే బ్రేక్ ఫాస్ట్ల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తాము రోజు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో, ఏవి ఇష్టంగా తింటారో సవివరంగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అంతేగాదు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉదయాన్ని ప్రారంభిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమేగాక మంచి ఎనర్జీ కూడా వస్తుందని చెబుతోంది. తమలా ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పహారాన్నే బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవాలనుకుంటే ఈ లిస్ట్ ఫాలో అవ్వండి అంటూ ఆ రెసిపీల వివరాలు వెల్లడించింది సారా. అవేంటంటే.. అవకాడో టోస్ట్లైట్తో గిలకొట్టిన గుడ్లు.. హోల్ గ్రెయిన్బ్రెడ్ టోస్ట్పై క్రీమీ అవోకాడోని జత చేసి, దానికి ప్రోటీన్ ప్యాక్డ్ గిలకొట్టిన గుడ్లను జోడించండి. కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి కాస్త పెనంపై కాల్చాలి. చివరిగా వేడి సాస్తో గార్నిష్ చేసి తింటే టేస్ట్ అదుర్స్. పోహా! అటుకులనే పోహా అంటారు. తేలకగా జీర్ణమయ్యే ఆహారం. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి, చివరగా తాజా కొత్తిమీర నిమ్మకాయ జల్లుకుని తింటే నోటిలో నీళ్లు ఊరడం ఖాయం. దోస దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందిన అల్పహారం. దక్షణ భారతదేశంలో అత్యంత ఫేమస్ వంటకం. బియ్యం మినప్పులతో చేసిన దోసపిండిని పెనం మీద చక్కగా అట్టులా పోసి మసాల బంగాళ దుంప కూరని పెట్టి దొరగా కాల్చి తీయాలి. ఆ తర్వా కొబ్బరి చట్నీ, సాంబారుతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఉప్మా మంచి పోషకాలతో కూడిన దక్షిణ భారతదేశ వంటకం. సుగంధ ద్రవ్యాలు, చక్కటి పప్పు ధాన్యాలు, కూరగాయాలతో తయారు చేసే మంచి రెసిపీ. ఇడ్లీ మృదువుగా ఉంటుంది. ఆవిరిపై ఉడికించే వంటకం ఇది. రైస్ కేక్ మాదిరిగా ఉంటుంది. దీన్ని కూడా కొబ్బరి చట్నీ, సాంబార్తో తింటే ఉంటుంది.. సామీరంగా వదిలిపెట్టరు. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన అల్పహార రెసిపీలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ డైట్లో జోడించండి, ఆరోగ్యంగా ఉండండి అంటోంది అందాల సారా. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయ్యిపోండి. (చదవండి: వరల్డ్ దోస డే! దోస రెసిపీని మొదటగా ఎవరు చూశారు? అంత క్రేజ్ ఎలా వచ్చిందంటే..?) -
'వరల్డ్ దోస డే'!: దోస రెసిపీని మొదటగా ఎవరు చేశారంటే..?
భారతదేశంలోని పలు బ్రేక్ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్గా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!. దోస చరిత్ర.. మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు. ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు. దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే.. ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు. ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
బరువు పెరగాలనుకునే వారికి ఈ పూరీలు మేలు!
కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే.. బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..? నెయ్యితో చేసే పూరీలు.. నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. ఎలా చెయ్యాలంటే.. నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. గోధుమపిండి: ఒక కప్పు పాలు: 1/2 కప్పు పటికబెల్లం పొడి: సరిపడ నెయ్యి తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు. ఎలాంటి వారు తినకూడదంటే.. ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్ని తినొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది. View this post on Instagram A post shared by Dr. Rekha Radhamony, 4th Gen Ayurveda Doctor (BAMS) (@doctorrekha) (చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!) -
"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!
ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. ఎలా చేశాడంటే..? సాధారణంగా చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్ని మేరినేషన్ చేసి పేపర్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్ బ్యాగ్ని పిన్చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్ పేపర్ బ్యాగ్ చికెన్ని అలానే తింటేనే ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Trevor James (@thefoodranger) (చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!) -
చికెన్ నూడుల్స్ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!
చికెన్ సూప్ మీద మనసుపోతే రెస్టారెంట్కి వెళ్లాల్సిందేనా? ఫైవ్స్టార్ హోటల్ రేంజ్లో చికెన్ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్కి చికెన్ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే వీటన్నింటినీ ఎలా చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా చికు బుకు చికు బుకు... చికెనే! అంటూ లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు చికెన్ నూడల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి! చికెన్ నూడుల్స్ కావలసినవి: చికెన్ – 200 గ్రాములు (బోన్లెస్); నూడుల్స్ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మారినేట్ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; సోయా సాస్ – టీ స్పూన్; గరం మసాలా పౌడర్ – టీ స్పూన్; పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు; క్యారట్ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్– టేబుల్ స్పూన్; సోయాసాస్ – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ: ∙చికెన్ను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్లో మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్లో కలపాలి. చికెన్ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి చికెన్ నూడుల్స్రడీ..! -
క్రాబ్స్తో కేక్ పాపర్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కేక్ పాపర్స్ తయారీకి కావల్సినవి: పీతల గుజ్జు – అరకేజీ; బటర్ – రెండు టేబుల్ స్పూన్లు; స్ప్రింగ్ ఆనియన్ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; సెలెరీ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కోషర్ సాల్ట్ – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్ – పావు టీస్పూను; మయనైజ్ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను; బ్రెడ్ క్రంప్స్ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు. స్పైసీడిప్: మయనైజ్ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్ – టీస్పూను. తయారీ విధానమిలా: బాణలిలో బటర్ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్ ఆనియన్ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. చల్లారాక మీడియం సైజు బాల్స్లా చుట్టుకోవాలి. బాల్స్ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్ క్రంప్స్లో ముంచి కోటింగ్లా పట్టించి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్ కేక్ పాపర్స్ రెడీ ∙స్పైసీడిప్ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్ కేక్ పాపర్స్తో సర్వ్ చేసుకోవాలి. -
ఆరోగ్యానికి హెల్తీ స్నాక్: స్వీట్ మఖానా, ఇలా సింపుల్గా..
స్వీట్ మఖానా తయారీకి కావల్సిన పదార్థాలు పూల్ మఖానా – 1 కప్పు; బెల్లం – 1/4 కప్పు; నెయ్యి – 2 టీస్పూన్లు. తయారీ విధానం: మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి మఖానాలను తక్కువ మంట మీద కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙నాన్ స్టిక్ పాన్లో ఒక స్పూన్ నెయ్యి, బెల్లం వేసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ∙బెల్లం కరిగాక వేయించి పెట్టుకున్న మఖానా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ∙నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. -
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్.. రెస్టారెంట్ స్టైల్లో చేసేయండిలా
పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ తయారీకి కావల్సినవి: బ్రూట్ షాంపైన్ – ఒకటిన్నర కప్పులు; పంచదార – కప్పు; లైట్ కార్న్ సిరప్ – టేబుల్ స్పూను; దానిమ్మ రసం – ఒకటీ ముప్పావు కప్పులు; విప్డ్ప్ క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; దానిమ్మ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: సాస్పాన్లో షాంపైన్, కార్న్ సిరప్, పంచదార వేసి మీడియం మంట మీద పంచదార కరిగేంత వరకు మరిగించి, దించిన తర్వాత దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.రెండుగంటల తరువాత మిశ్రమాన్ని ఐస్క్రీమ్ మేకర్తో బీట్ చేయాలి.క్రీమ్లా మారిన మిశ్రమాన్ని షాంపైన్ గ్లాస్లో వేయాలి. పైన విప్డ్ క్రీమ్, దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ రెడీ. -
అటుకుల పోహాతో కేక్..ఎప్పుడైనా ట్రై చేశారా?
పోహా కేక్ తయారీకి కావల్సినవి: మైదా పిండి – 3 కప్పులు అటుకులు – ఒకటిన్నర కప్పులు (నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి) అరటి పండు – 1 (ముక్కలు చేసుకోవాలి),పంచదార – 2 కప్పులు పీనట్ బటర్, బటర్ – పావు కప్పు చొప్పున బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు,పాలు – 2 కప్పులు వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో పంచదార వేసుకుని పొడి చేసుకుని, అందులో బటర్, పీనట్ బటర్, అరటిపండు ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో బేకింగ్ సోడా, పాలు, మైదాపిండి, అటుకుల పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నచ్చిన షేప్లో కేక్ మేకర్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం వేసుకుని సుమారు 45 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ కేక్ని కాస్త చల్లారనిచ్చి.. నచ్చిన విధంగా క్రీమ్, ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని, కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
టొమాటో ఉప్మా రెసిపి.. ఇలా ఈజీగా చేసుకోండి
టొమాటో ఉప్మా తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ›– ఒక కప్పు,టొమాటో ముక్కలు – పావు కప్పు, క్యారట్ తరుగు – పావు కప్పు,ఉల్లిపాయ తరుగు – అర కప్పు, బఠాణీ – అర కప్పు (నానబెట్టుకోవాలి), పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర తరుగు– కొద్దిగా, జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి), ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె –2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడా, నీళ్లు– 3 కప్పులు తయారీ విధానమిలా: ముందుగా చిన్న సెగ మీద.. రవ్వను నేతిలో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని.. తాలింపు సామాన్లు వేసుకుని ఆ వెనుకే ఉల్లిపాయ ముక్కలూ వేసి వేయించుకోవాలి. అనంతరం టొమాటో ముక్కలు, క్యారట్ తరుగు, ఆ తర్వాత బఠాణీలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని మరోసారి గరిటెతో తిప్పాలి. క్యారట్ ముక్క 80 శాతం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుని.. ఎసరు మరగనివ్వాలి. అనంతరం రవ్వ వేసుకుంటూ ఉండలు కాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గరపడే సమయంలో కొత్తిమీర తురుము, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పనీర్తో స్పెషల్గా క్రిస్పీ స్టిక్స్.. టేస్ట్ అదిరిపోద్ది
పనీర్ క్రిస్పీ స్టిక్స్ తయారీకి కావల్సినవి పనీర్ – అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి), కొబ్బరి తురుము, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు చొప్పున, గుడ్లు – 3, పాలు – 2 టేబుల్ స్పూన్లు (చిక్కటివి), పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్, అల్లం – వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, చాట్ మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒకపెద్ద బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం – వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పనీర్ ముక్కలకు పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్ల మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో పనీర్ ముక్క తీసుకుని, మొదట మొక్కజొన్న పిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుము లేదా బ్రెడ్ పౌడర్ను బాగా పట్టించి.. నూనెలో ఫ్రై చేసుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: ఇటాలియన్ పీచ్ కుకీస్, ఇంట్లోనే చేసుకోవచ్చు
ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను; కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు; పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు; వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు; ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు). పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు; పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్తో కలపాలి. తరువాత క్రీమ్ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్ను తక్కువ స్పీడ్లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్తో కలపాలి. ► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్క్రీమ్ను వేసి శాండ్విచ్లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ. -
బేకరీ స్టైల్లో కుకీస్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
స్నీకర్ డూడుల్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడు కప్పులు; టార్టారిక్ యాసిడ్ – రెండు టీస్పూన్లు; కోషర్ సాల్ట్ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను; బటర్ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; వెనీలా ఎసెన్స్– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్ స్పూను తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్ మిక్సర్తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్ ట్రేలో పెట్టాలి ∙కుకీస్ అన్నీ తయారయ్యాక.. బేకింగ్ ట్రేని 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద, ఇరవై నిమిషాలు బేక్ చేస్తే స్నీకర్ డూడుల్ కుకీస్ రెడీ. -
స్నాక్స్ కోసం.. మైసూర్ బోండాలు, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు
గోధుమ మైసూర్ బోండాలు కావలసినవి: గోధుమ పిండి – 400 గ్రాములు పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా, పంచదార – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 1 టీ స్పూన్ (సన్నని తరుగు), చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు), కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి. దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: సుగర్ కుకీస్, పిల్లలు ఇష్టంగా తింటారు
సుగర్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – పావు కప్పు; క్రీమ్ చీజ్ – పావుకప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – ఒకటిన్నర టీస్పూన్లు; బాదం ఎసెన్స్ – పావు టీస్పూను; మైదా – రెండున్నర కప్పులు; కార్న్స్టార్చ్ – టేబుల్ స్పూను; వంటసోడా – టీస్పూను; ఉప్పు – పావు టీస్పూను; ఎరుపు, పచ్చరంగు కలిపిన పంచదార –గార్నిష్కు సరిపడా. తయారీ విధానమిలా: ఒక పెద్దగిన్నెలో బటర్, క్రీమ్ చీజ్, పంచదార, గుడ్లు, వెనీలా, బాదం ఎసెన్స్ వేసి హ్యాండ్ మిక్సర్తో ఐదు నిమిషాల పాటు కలపాలి ∙తరువాత మైదా, కార్న్ స్టార్చ్, వంటసోడా, ఉప్పు వేసి పిండి ముద్దలా కలపాలి ∙ఈ పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. రెండు గంటల తరువాత తీసి చిన్నచిన్న ఉండలుగా చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి.ఫోర్క్ సాయంతో ఉండపైన ఇంటూ ఆకారంలో ముద్ర పడేటట్లు వత్తాలి ∙ఇలా అన్నిటినీ వత్తుకున్నాక ఎరుపు, పచ్చరంగు పంచదారను ఈ కుకీస్పైన చల్లాలి ∙ఇప్పుడు బేకింగ్ ట్రేని అవెన్లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే సుగర్ కుకీస్ రెడీ. -
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్, పొద్దున్నే ఇది తాగుతుందట
కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్లా తాగేస్తుంటారు. అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్లో నెయ్యి కాఫీ ముందుంటుంది. నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో తమ డే రొటీన్లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ రెసిపి నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే... ►ముందుగా గ్లాస్లో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్కి పైగా కాఫీ పౌడర్, కొలాజిన్ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే ► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by jhaji kitchen (@jhajikitchen13) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
మిగిలిపోయిన అన్నంతో చిటికెలో దోసె వేసుకోండి..
అన్నం దోసె తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున ఉప్పు – రుచికి సరిపడా వంట సోడా›– 1 టీ స్పూన్ నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. -
క్రిస్టమస్ స్పెషల్: సాఫ్ట్ కుకీస్.. బేకరీ స్టైల్లో
క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్: కావలసినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను; ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; బటర్ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – రెండు టీ స్పూన్లు. తయారీ విధానమిలా: ►మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్లో పంచదార వేసి క్రీమ్లా మారేంత వరకు బీటర్తో కలపాలి. తరువాత ఈ క్రీమ్ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్ క్రీమ్లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. కుకీస్ ఆకారాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్ ట్రేను 400 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద పదినిమిషాలు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్ రెడీ. -
ఇన్స్టంట్గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు
స్వీట్ కార్న్– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి: లేత స్వీట్ కార్న్ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి) అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత జీలకర్ర – ఒక టీ స్పూన్,సోంపు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానాతో బర్ఫీ.. సింపుల్గా, క్షణాల్లో చేసుకోవచ్చు
బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి: అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్ (అభిరుచిని బట్టి), చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్కి సరిపడా తయారీ విధానమిలా: ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్ ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ.. భలే రుచిగా ఉంటాయి
మీల్మేకర్ స్టఫ్డ్ చపాతీ తయారీకి కావలసినవి: మీల్మేకర్ – పావు కప్పు (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, వేడి నీళ్లు, నూనె – సరిపడా, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – 1 టీ స్పూన్ , అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్ , టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నవి), కరివేపాకు, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మూడు గరిటెల నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, తడి గుడ్డ పరచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించుకుని.. మీల్మేకర్ తురుమునూ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకుని, ఒక్కోదానిలో కొద్దికొద్దిగా మీల్మేకర్ మిశ్రమాన్ని పెట్టుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
అన్నంలోకి నిమిషాల్లో రుచులు
ఇంట్లో పేరెంట్స్ లేని సమయంలో సింపుల్గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది. బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో మజ్జిగ చారు కావాల్సినవి: పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్ ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా.. తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం. 5 నిమిషాల పచ్చడి కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్ (కాచాల్సిన పనిలేదు) తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని.. కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 10 నిమిషాల లోపు కర్రీ కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున, నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే.. తయారీ: ముందుగా చిన్న కుకర్లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు.. చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
గోధుమ బిస్కట్స్.. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్ సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి: చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు; పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు; ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను; తయారీ విధానమిలా: పెసరపప్పుని కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి. ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. -
అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్ ఉంటుంది
అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి: అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను; ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. తయారీ విధానమిలా: స్టవ్ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. -
క్యాబేజ్తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది
క్యాబేజ్ ఎగ్ భుర్జి తయారీకి కావల్సినవి క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు; పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి. ► అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ►ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్ లేదా ఫోర్క్తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి. ► చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్ డిష్. -
మరమరాలతో వడ.. సింపుల్గా ఇలా చేసుకోండి
మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్ల్లోకి తీసుకోవాలి) పెరుగు – 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్కి కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
పీనట్ ఐస్క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్హెల్డ్ మిక్సర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. -
కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు
కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. తినాయ్(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి: కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. తయారీ విధానమిలా: ►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించాలి. ► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి. ►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. -
కార్తీకంలో ఉపవాస విరమణను..ఈ టేస్టీ రెసిపీతో ఆస్వాదించండి!
కావలసినవి: మైదా – మూడు కప్పులు పసుపు – పావు టీస్పూను నువ్వుల నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం తరుగు – రెండు కప్పులు పచ్చికొబ్బరి తురుము – నాలుగు కప్పులు యాలకులపొడి – అరటీస్పూను నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పెద్దగిన్నెలో మైదా, పసుపు వేసి కలపాలి. దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లుపోసుకుంటూ ముద్దలా కలపాలి. చివరగా నువ్వుల నూనె వేసి కలిపి మూతపెట్టి నలభై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో బెల్లం, అరకప్పు నీళ్లుపోసి సన్నని మంట మీద కరగనివ్వాలి. ఐదు నిమిషాలకు బెల్లం కరుగుతుంది. బెల్లం నీటిని పలుచని వస్త్రం లేదా సన్నని చిల్లులున్న స్ట్రెయినర్తో వడగట్టాలి. ∙వడగట్టిన బెల్లం నీటిని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి అడుగంటకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడి ఉండలా మారుతున్నప్పుడు యాలకుల పొడి వేసి మరోమారు కలిపి దించేయాలి. అరటి ఆకు లేదా బ్లాటింగ్ పేపర్కు కొద్దిగా నెయ్యి రాయాలి. కలిపి సిద్ధంగా ఉంచిన మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు ఒక్కో ఉండను పూరీలా వత్తాలి. కొబ్బరి మిశ్రమాన్ని పూరీ మధ్యలో పెట్టి, మిశ్రమం బయటకు రాకుండా చుట్టాలి. కొబ్బరి మిశ్రమం బయటకు కనబడకుండా మైదా పిండితో కప్పేయాలి. చేతికి నెయ్యి రాసుకుని వీటిని బొబ్బట్లలా వత్తుకోవాలి. ఇలా పిండినంతటనీ బొబ్బట్లలా వత్తుకున్న తర్వాత పెనం వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి మీడియం మంటమీద రెండు వైపులా కాల్చుకుంటే కొబ్బరి పోలీ రెడీ. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఆరేంజ్ జ్యూస్తో హల్వా.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి: ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి) మొక్కజొన్న పిండి – అర కప్పు పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి) దాల్చినచెక్క పొడి – చిటికెడు ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్కి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. -
హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!
రాగి డోనట్స్కి కావలసినవి: మైదాపిండి – 1 కప్పు పంచదార పొడి – 1 కప్పు వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా – 1 టీ స్పూన్ చొప్పున ఉప్పు – అర టీ స్పూన్ మజ్జిగ – 1 కప్పు గుడ్లు – 2 రాగి పిండి– 2 కప్పులు నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, రాగిపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలిపి పెట్టుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లూ కలుపుకోవచ్చు. డోనట్స్ మేకర్కి కొద్దిగా నూనె రాసి, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్ క్రీమ్, డ్రైఫ్రూట్స్తో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
పిల్లలకు ఇష్టమైన బనానా మోదక్.. ఇలా ట్రై చేయండి
బనానా మోదక్ తయారికి కావలసినవి: గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు; బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను; అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ. -
బాల నలభీములు! తినడం చేతకాని ఏజ్లోనే వంటకాలు..!
వంట చేయడం ఓ కళ. అందరికీ తెలిసిన రెసిపే అయినా ఒకొక్కరి చేతిలో అమృతంలా మారుతుంది. దాన్నే చేతి మహిమ అంటుంటాం. అయితే ఇక్కడున్న పాకశాస్త్ర ప్రవీణులంతా తలలు పండిన పెద్దలు కాదు. బుల్లిబుజ్జాయిలు. ఎవరైనా తినిపిస్తే కానీ తినడం చేతకాని వయసులోనే గరిటె పట్టిన అభినవ నలభీములు. నిహాల్ రాజ్ ‘లిటిల్ షెఫ్ కిచ్చా’ అనే పేరుతో పాపులర్ అయిన నిహాల్ రాజ్.. దేశీవాసులకు సుపరిచితుడే. కేరళకు చెందిన పిల్లోడు. 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ విజేతగా నిలిచాడు. నిహాల్ తయారు చేసిన ‘మిక్కీ మౌస్ మ్యాంగో ఐస్ క్రీమ్’కి ప్రత్యేకమైన హక్కులను పొందేందుకు ఫేస్బుక్ ఈ అబ్బాయికి 2,000 డాలర్లు చెల్లించింది. పదమూడేళ్ల ఈ లిటిల్ షెఫ్.. తన యూట్యూబ్ చానెల్లో రకరకాల వంటలు వండుతూ, ఎవరికీ తెలియని రుచులను పరిచయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలోని భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ఒమారీ మెక్క్వీన్ లండన్ కి చెందిన ఒమారీ మెక్క్వీన్ అనే 14 ఏళ్ల కుర్రాడు వెజిటేరియన్ వంటగాడు. ఇప్పటికే ఆన్లైన్లో వేల మంది హృదయాలను కొల్లగొట్టాడు. ఎనిమిదేళ్ల వయస్సులోనే యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్, క్రోయ్డన్లోని ‘"Dipalicious (డిలీషియస్)’ అనే రెస్టారెంట్కి సీఈఓ కూడా. శాకాహారి షెఫ్గా ఈ బుల్లోడు ఎన్నో అవార్డ్లను అందుకున్నాడు. వంటలకు సంబంధించి పలు చిట్కాలను చెబుతూ పుస్తకాలూ రాశాడు. ఒమారీకి ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలోవర్స్ ఎక్కువే. ఇన్స్టాలో తన కుకింగ్ వీడియోలతో పాటు.. కుటుంబంతో గడిపే ఆత్మీయ క్షణాలను రీల్స్లా మలచి షేర్ చేస్తుంటాడు. కేంబ్రియా కాలిఫోర్నియాకు చెందిన కేంబ్రియా.. నాలుగేళ్ల వయసు నుంచే జూనియర్ షెఫ్గా తన ఫాలోవర్స్కి రకరకాల వంటకాలను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలోనే అతి పిన్న వయసు షెఫ్గా గుర్తింపు తెచ్చుకుంది. నెలల వయసు నుంచే కేంబ్రియా మంచి ఫుడీ. ప్రస్తుతం ఈ పాపకు పదేళ్లు దాటాయి. సోషల్ మీడియాలో వంటల వీడియోలు, రీల్స్తో బిజీగా ఉంటుంది. పలు రెస్టారెంట్స్కి వెళుతూ అక్కడి వంటకాలను రుచి చూసి.. రివ్యూలు ఇస్తూంటుంది. ఏ రెస్టారెంట్కి వెళ్లినా అక్కడున్న షెఫ్ దగ్గర ఒక కొత్త వెరైటీ వంటకాన్ని నేర్చుకుని.. వీలైతే అక్కడే స్వయంగా వండి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్చేసి సర్వ్ చేసుకోవాలి. -
దీపావళి పండుగకి ఈజీగా కాజు పిస్తా రోల్స్ చేసుకోండిలా!
కాజు పిస్తా చేయడానికి కావలసినవి: జీడిపప్పు – ఒకటిన్నర కప్పులు పిస్తా పప్పు – ఒకటిన్నర కప్పులు కండెన్స్డ్ మిల్క్ – ఒకటింబావు కప్పులు గ్రీన్ ఫుడ్ కలర్ – ఐదు చుక్కలు బటర్ – రెండు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – కప్పు యాలకులపొడి – పావు టీస్పూను; తయారీ విధానం: జీడిపప్పును దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తరువాత జల్లెడపట్టి పొడిని తీసుకోవాలి. బాణలిలో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన బటర్లో కండెన్స్డ్ మిల్క్ పోయాలి. నిమిషం పాటు పాలను కలుపుతూ ఉండాలి. తరువాత జీడిపప్పు పొడి వేయాలి. సన్నని మంటమీద తిప్పుతూ ఐదునిమిషాలు వేయించాలి. తరువాత దించేసి చల్లారనివ్వాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని జీడిపప్పు మిశ్రమాన్ని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ∙ఇప్పుడు పిస్తాపప్పుని దోరగా వేయించి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని జల్లెడపట్టి మెత్తటి పొడిని తీసుకోవాలి. పిస్తా పొడిలో పంచదార పొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ కొద్దిగా వేడి నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్దను రెండు ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను మందపాటి చపాతీలా వత్తుకుని, కాస్త వెడల్పుగా ఉండేలా ముక్కలు కోయాలి. పిస్తా ముద్దను చిన్న ఉండలుగా చేసి, వీటిని పొడవాటి రోల్స్లా చుట్టుకోవాలి. జీడిపప్పు ముక్కపైన పిస్తా రోల్ను పెట్టి, జీడిపప్పు ముక్కను రోల్ చేయాలి. పిండి ముద్దను మొత్తాన్ని ఇలా రోల్ చేసి, పైన కుంకుమ పువ్వు, సిల్వర్ పేపర్తో గార్నిష్ చేస్తే కాజుపిస్తా రోల్స్ రెడీ. (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
సాయంత్రం టీలోకి బెస్ట్ ఆప్షన్.. మక్ పారా ఫ్లవర్స్
మక్ పారా ఫ్లవర్స్ తయారికి కావల్సినవి: మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు, మిరియాల పొడి– అర టీస్పూన్, ఉప్పు– కొద్దిగా నూనె– 3 టేబుల్ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి) నూనె– డీప్ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్పై మరో ఫ్లవర్ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్ ఫై చేసుకుంటే సరిపోతుంది. -
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్ఫ్లోర్లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కోకోనట్ మిల్క్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్ పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి. కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్తో గార్నిష్ చేసుకుని బర్త్డే కేక్లా తయారుచేసుకోవచ్చు. -
ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!
ఈ రోజుల్లో ఇంట్లోనే పిజ్జా మేకర్ ఉండాలని కోరుకుంటున్నారు పిజ్జా లవర్స్. ఈ ప్రొఫెషనల్ ఓవెన్ వంటగదిలో ఉంటే.. ఇష్టమైన పిజ్జాలను నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మెషిన్ దిగువన ఉండే డ్యూయల్ హీటింగ్ ఎలిమెంట్స్ పైనున్న సిరామిక్ పిజ్జా ట్రేని వేడి చేస్తాయి. ఈ బేకింగ్ స్టోన్ పిజ్జాని వేగంగా గ్రిల్ చేస్తుంది. లో, హై, మీడియం అనే ఆప్షన్స్తో రూపొందిన ఈ మేకర్.. ఉపయోగించడం చాలా సులభం. పై మూడు ఆప్షన్స్తో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో సుమారుగా 11 అంగుళాల పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇదే మోడల్లో కలర్స్, ఆప్షన్స్ వేరువేరుగా ఉండే డివైస్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. (చదవండి: డబుల్ సైడ్ మల్టీమేకర్! నూనె లేకుండా..) -
వెరైటీగా బీరకాయ దోసెలు ట్రై చేయండి! టేస్ట్ అదుర్స్!
బీరకాయ దోసెలకు కావలసినవి: బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం ముక్క – చిన్నది పచ్చిమిర్చి – 3 లేదా 4 నీళ్లు – కొద్దిగా\ పెరుగు – 2 టేబుల్ స్పూన్లు నూనె – కావాల్సినంత ఉల్లిపాయ ముక్కలు – సరిపడా తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. (చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!)