rio olympics
-
పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్ ఇదే
PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్. బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్ స్టేటస్ ఏమిటని అడగగా.. సింగిల్ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్లో మరో మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది. అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్ స్టార్.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్ సర్ కేవలం తన మెంటార్, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది. చదవండి: WC T20: గాయాలతో హార్దిక్ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు.. -
సింధుకు సులువు
టోక్యో: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తాజా ఒలింపిక్స్లో సులువైన ‘డ్రా’ ఎదురైంది. ఆరో సీడ్గా ఉన్న సింధు మహిళల సింగిల్స్ గ్రూప్ ‘జె’లో తన పోరును ప్రారంభించనుంది. ఇందులో సింధుతో పాటు హాంకాంగ్కు చెందిన చెంగ్ గాన్ యి (ప్రపంచ 34వ ర్యాంకర్), ఇజ్రాయెల్కు చెందిన సెనియా పొలికర్పొవా (58) ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే. వీరిద్దరిపై సింధు రికార్డు 5–0, 2–0గా ఉంది. మొత్తం 16 గ్రూప్లు ఉండగా ఒక్కో గ్రూప్నుంచి ఒక్కో ప్లేయర్ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్ మ్యాచ్లు మొదలవుతాయి. సంచలనాలు లేకపోతే సింధు క్వార్టర్స్లో జపాన్కు చెందిన యామగూచితో తలపడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్లో భమిడిపాటి సాయిప్రణీత్ ముందంజ వేయాలంటే తన గ్రూప్లో ఉన్న మార్క్ కాల్జో (29; నెదర్లాండ్స్), జిల్బర్మన్ (47; ఇజ్రాయెల్)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్లో అతను లాంగ్ ఆంజస్ (హాంకాంగ్)ను ఓడించగలిగితే జపాన్ స్టార్, ఫేవరెట్ మొమొటాను క్వార్టర్స్లో ఎదుర్కోవాల్సి రావచ్చు. -
‘టోక్యో’లో పాల్గొంటా: స్ప్రింటర్ శ్రాబణి
న్యూఢిల్లీ: ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ 100, 200 మీటర్ల ఈవెంట్లలో పాల్గొనడమే తన లక్ష్యమంటోంది భారత స్ప్రింటర్ శ్రాబణి నందా. ఈ ఏడాది ఆరంభం నుంచే జమైకాలో తన శిక్షణను కొనసాగిస్తోన్న శ్రాబణి... రియో ఒలింపిక్స్లో 200 మీటర్ల పరుగులో హీట్స్లో ఆరో స్థానంతో నిష్క్రమించింది. 100, 200 మీటర్ల పరుగు ఈవెంట్లకు టోక్యో అర్హత ప్రమాణం వరుసగా 11.15 సెకన్లు; 22.80 సెకన్లు కాగా... శ్రాబణి అత్యుత్తమ ప్రదర్శన ఈ రెండింట్లో వరుసగా 11.45 సెకన్లు, 23.07 సెకన్లుగా ఉంది. 29 ఏళ్ల శ్రాబణి ఈ వారం మొదట్లో కింగ్స్టన్లో జరిగిన వెలాసిటీ ఫెస్ట్ ఈవెంట్లో 100 మీటర్లలో పోటీపyì మూడో స్థానం పొందింది. -
ఆ గెలుపే కీలక మలుపు
ముంబై: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించిన హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు... 2012లో సాధించిన ఓ గెలుపు తన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచిందని గుర్తు చేసుకుంది. చైనా ఓపెన్ సందర్భంగా నాటి లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ని ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని చెప్పింది. సీనియర్ విభాగంలో అప్పటివరకు తొలి రౌండ్, క్వాలిఫయర్స్లో ఎదురైన ఓటములతో ఆవరించిన నిరాశ ఆ మ్యాచ్ గెలుపుతో ఎగిరిపోయిందని తన కెరీర్ తొలినాళ్లను తలుచుకుంది. నాడు 16 ఏళ్ల సింధు 2012 చైనా మాస్టర్స్ టోర్నీ క్వార్టర్స్లో లీ జురుయ్పై అద్భుత విజయాన్ని సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో తన సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 5 ప్రపంచ చాంపియన్షిప్ పతకాలతో పాటు, ఒలింపిక్స్ రజతం ఉంది. ‘ఇన్ ద స్పోర్ట్లైట్’ షో సందర్భంగా టీటీ ప్లేయర్ ముదిత్ డానీతో సింధు పలు అంశాలపై ముచ్చటించింది. పొరపాటేంటో తెలిసేది కాదు... తొలి నాళ్లలో నా ఆట బాగానే ఉండేది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగకపోయేది. తరచుగా క్వాలిఫయింగ్ , తొలి రౌండ్లలోనే ఓడిపోయేదాన్ని. ఇంకా కష్టపడాలేమో అనుకొని తీవ్రంగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అయినా ఓటములు ఎదురయ్యేవి. చాలా నిరాశగా ఉండేది. నా పొరపాటేంటో అర్థమయ్యేది కాదు. మిగతా వారిలాగే కష్టపడ్డా గెలుపు మాత్రం అందకపోయేది. దృక్పథం మారిందలా... 2012లో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ చాంపియన్ లీ జురుయ్పై గెలవడంతో నా దృక్పథం మొత్తం మారిపోయింది. నా కెరీర్లో అదే టర్నింగ్ పాయింట్. నాటి నుంచి ప్రతీరోజు, ప్రతీ ఏడాదీ నా ఆటను మెరుగు పరుచుకుంటూనే ఉన్నా. బహుమతిగా అభిమాని నెలజీతం... రియోలో నా ప్రదర్శన మెచ్చి నేను హైదరాబాద్ రాగానే ఒకతను తన నెల జీతాన్ని బహుమతిగా ఇవ్వడం ఇంకా గుర్తుంది. అతని అభిమానానికి గుర్తుగా ఒక లేఖతో పాటు కొంత డబ్బు అతనికి పంపించా. -
ఒకే ఒక్కడు... కిప్చెగో
వియన్నా: గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇలియుడ్ కిప్చెగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్గా కిప్చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాకపోవడంతో కిప్చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్చెగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్ మారథాన్లో కిప్చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్ రేసును తిలకించేందుకు కిప్చెగో స్వదేశం కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్చెగో ఘనతను టీవీల్లో వీక్షించారు. రెండేళ్ల క్రితం ఇటలీలో కిప్చెగో 2 గంటల్లోపు మారథాన్ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం అతను సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు. -
16 ఏళ్ల రికార్డు బద్దలు
డెస్ మొయినెస్ (అమెరికా): రియో ఒలింపిక్స్ చాంపియన్ దలీలా మొహమ్మద్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల ఈ అథ్లెట్ యూఎస్ చాంపియన్షిప్లో 400 మీటర్ల మహిళల హర్డిల్స్ రేసును 52.20 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో 16 ఏళ్ల క్రితం 2003లో యులియా పెచొంకినా (రష్యా) నెలకొల్పిన 52.34 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకం చేజిక్కించుకుంది. దోహా ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే అమెరికా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్లో దలీలా ఈ ఘనత సాధించింది. అయితే ఈ కొత్త ప్రపంచ రికార్డు విషయం తనకు కోచ్ చెబితేగానీ తెలియదని ఆమె చెప్పింది. పురుషుల 200 మీటర్ల పరుగు పందెంలో అమెరికా స్టార్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు. అతను అందరికంటే ముందు పరుగును 19.78 సెకన్లలో పూర్తి చేయగా... క్రిస్టియాన్ కోల్మన్ (20.02 సెకన్లు) రజతం, అమీర్ వెబ్ (20.45 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. -
రియో పతకాలే అమూల్యం
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత 2016 రియో ఒలింపిక్స్లో 6 పతకాలు సాధించడం గొప్ప అనుభూతి అని అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం, 28 ఒలింపిక్స్ పతకాల విజేత మైకేల్ ఫెల్ప్స్ గుర్తు చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం భారత్ వచ్చిన ఈ దిగ్గజ స్విమ్మర్ తన రిటైర్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోనని స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఫెల్ప్స్ తను బరిలోకి దిగిన 8 ఈవెంట్లలోనూ స్వర్ణాలను సాధించడం విశేషం. రియోలో 5 స్వర్ణాలే గెలుచుకున్నప్పటికీ ఈ ప్రదర్శన... బీజింగ్ ప్రదర్శనకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకొచ్చాడు. ‘గణాంకాల ప్రకారం బీజింగ్ ఒలింపిక్స్ గొప్ప. కానీ 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం నా వ్యక్తిగత జీవితం బాగో లేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఓ దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించా. కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించా. అనంతరం 2014లో మళ్లీ స్విమ్మింగ్ను మొదలుపెట్టాక రియో వరకు నా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎన్నో ఆటు పోట్ల అనంతరం నాపై నేను నమ్మకాన్ని కోల్పోకుండా రియోలో పతకాలు సాధించా. అందుకే రియో ప్రదర్శనే నాకు ముఖ్యం’ అని ఫెల్ప్స్ వివరించాడు. -
తై జుకు సింధు చెక్
రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్పై సింధు విజయం సాధించింది... అంతే ఆ తర్వాత ఆమెను ఈ చైనీస్ తైపీ ప్రత్యర్థి వెంటాడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సార్లు తై జు ముందు సింధు తలవంచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు మార్చినా తెలుగమ్మాయికి విజయం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు ఆమె ప్రత్యర్థి అడ్డుగోడను ఛేదించింది. అద్భుత ప్రదర్శనతో తై జును ఓడించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. తొలి గేమ్ను కోల్పోయినా ఆ తర్వాత సింధు కోలుకున్నతీరు అసమానం. గ్వాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ప్రపంచ నంబర్వన్ తైజు యింగ్ సవాల్ను ఛేదించింది. తనకు పదేపదే పరాజయాన్ని చవిచూపిస్తున్న చైనీస్ తైపీ ప్రత్యర్థిని కసిదీరా ఓడించింది. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ ఈవెంటైన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఎ’ మహిళల సింగిల్స్ మ్యాచ్లో తెలుగుతేజం, ఒలింపిక్ రన్నరప్ సింధు 14–21, 21–16, 21–18తో తై జును కంగుతినిపించింది. తొలి గేమ్లో ప్రతికూల ఫలితం వచ్చినా... తర్వాత గేముల్లో పట్టుదలతో ఆడింది. చివరి దాకా పట్టుసడలించకుండా ఆడిన సింధు 2–1 గేమ్లతో ప్రత్యర్థిని ఓడించింది. మొదటి 16 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్లో తై జు జోరే కనబడింది. అనవసర తప్పిదాలతో పాటు విన్నర్స్ కొట్టడంలో విఫలమైన సింధు 2–6తో వెనుకబడింది. స్మాష్లు, రిటర్న్ షాట్లతో తై జు తన ఆధిక్యాన్ని 17–12కు పెంచుకుంది. కాసేపటికే మరో నాలుగు పాయింట్లు సాధించిన తైపీ నంబర్వన్ తొలి గేమ్ను 21–14తో ముగించింది. ఇక రెండో గేమ్లో మాత్రం సింధు జాగ్రత్తగా ఆడింది. గేమ్ మొదలైన కాసేపటికే 6–3తో తన ఆధిపత్యాన్ని చాటింది. సుదీర్ఘ ర్యాలిలో మరింత దూకుడు కనబర్చిన సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడింది. చూస్తుండగానే 11–6కు చేరిన ఆమె... ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్ ను చేజిక్కించుకునేదాకా చెమటోడ్చింది. 19–13 స్కోరుకు చేరాక సింధు ఈ గేమ్ను క్షణాల వ్యవధిలోనే తన వశం చేసు కుంది. చివరి గేమ్లో మొదట 0–3తో వెనుకబడిన భారత స్టార్ మ్యాచ్ సాగుతున్న కొద్ది టచ్లోకి వచ్చింది. 11–12 స్కోరుతో ప్రత్యర్థిని నిలువరించిన ఆమె క్రాస్ కోర్టు రిటర్న్ షాట్లతో తై జు యింగ్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి గేమ్ తో పాటు మ్యాచ్నూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ పోరులో సమీర్ వర్మ 21–16, 21–7తో వరుస గేముల్లో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. -
బజరంగ్పైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి జోరు మీదున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ (65 కేజీలు)... పసిడి పతకమే లక్ష్యంగా ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బరిలోకి దిగనున్నాడు. నేటి నుంచి ఈనెల 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో 30 మంది సభ్యులుగల భారత బృందం పోటీ పడనుంది. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) పతకం తెచ్చే అవకాశముంది. -
లాల్బియాకిమా సంచలనం
అస్తానా (కజకిస్తాన్): 22 ఏళ్ల భారత బాక్సర్ లాల్బియాకిమా ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో లాల్బియాకిమా 4–1తో హసన్బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేశాడు. హసన్బోయ్ రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కావడం విశేషం. ఒక డిఫెండింగ్ ఒలింపిక్ విజేతను భారత బాక్సర్ ఓడించడం ఇదే మొదటిసారి. మిజోరాంకు చెందిన లాల్బియాకిమా తాజా విజయంతో టోర్నీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
పోరాడి ఓడిన భారత్
ఇఫో(మలేసియా): స్టార్ ఆటగాళ్లు లేకున్నా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ తొలి లీగ్ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాకు భారత్ గట్టిపోటీ ఇచ్చింది. తుదికంటా పోరాడి ఓడిపోయినా ఆ ఓటమిలో గౌరవం కనిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 2–3 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గొంజాలో పిలాట్ (13వ, 24వ, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున అమిత్ రొహిదాస్ (26వ, 31వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలోనే రావడం విశేషం. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. తొలి పది నిమిషాల్లో బంతిపై ఆధిపత్యం చలాయించిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ సమయంలో అర్జెంటీనాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి షాట్ను భారత డిఫెండర్లు అడ్డుకోగా... పిలాట్ కొట్టిన రెండో షాట్కు తిరుగులేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలో అర్జెంటీనా తొలి గోల్ నమోదు చేసి 1–0తో ముందంజ వేసింది. 24వ నిమిషంలో పిలాట్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో 2–0తో అధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో భారత్కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి రెండు వృథా కాగా... మూడో ప్రయత్నంలో అమిత్ రొహిదాస్ గోల్గా మలచడంతో భారత్ 1–2తో ఆధిక్యాన్ని తగ్గించింది. 31వ నిమిషంలో అమిత్ మరో గోల్ చేయడంతో 2–2తో స్కోరు సమమైంది. అనంతరం పిలాట్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో మ్యాచ్కు వర్షం అడ్డుపడటంతో దాదాపు గంట పాటు ఆట నిలిచిపోయింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినా స్కోరును సమం చేయలేకపోయారు. -
బాహుబలులను పంపుతున్నాం: రష్యా
మాస్కో: ఒలింపిక్స్లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్లో పట్టుబడంటంతో రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటనతో ఒలింపిక్ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్లో రష్యా అథ్లెట్స్ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్కి 232 మందిని, వాంకోవర్ ఒలింపిక్స్కి 177 మందిని పంపింది. రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్ ప్యానెల్ నిర్వహించే డోపింగ్ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహించిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది. -
ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు
గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే... ఫైనల్ పరాజయంపై... చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు. ఆఖరి రెండు పాయింట్లపై... నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్ మ్యాచ్లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు. ఫిట్నెస్పరంగా సమస్యలు... ఇంత సుదీర్ఘమైన మ్యాచ్లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది. కీలక ఫైనల్ మ్యాచ్లలో ఓటములపై... నాకు కూడా ఫైనల్ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్ నంబర్వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా. ‘చాలా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్నెస్పరంగా బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. – ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
'రియోకు వెళ్లకుండా ఉండాల్సింది'
గ్లాస్కో: గతేడాది రియో ఒలింపిక్స్ కు వెళ్లి పెద్ద పొరపాటు చేశానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తాజాగా స్పష్టం చేశారు. ఆ మెగా ఈవెంట్ కు వెళ్లకుండా ఉండే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లాస్కోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ లో సెమీస్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో సైనా మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా దాదాపు ఏడాది పాటు ఎదురైన పరాజయాల్ని గుర్తు చేసుకున్నారు. ' నేను రియోకు వెళ్లకుండా ఉండాల్సింది. నాకు గాయం అంత పెద్దదనే విషయం నాకు అప్పుడు తెలియదు. రియో ఒలింపిక్స్ లో ఆదిలోనే నిష్క్రమించడం చాలా బాధించింది. నా తల్లిదండ్రులు, కోచ్ సాయంతో తిరిగి పుంజుకున్నా. ఇంకా కుడి మోకాలు ఇబ్బందిగానే ఉంది'అని సైనా తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో సెమీస్ కు చేరడం సంతోషం కల్గించిందని సైనా పేర్కొంది. ఈ చాంపియన్ షిప్ లో తనకు కష్టమైన డ్రా ఎదురుకావడంతో పతకం సాధిస్తానని అనుకోలేదన్న సైనా.. సెమీస్ కు చేరడం ఒక గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందని తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్మార్పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. -
ఒలింపిక్ హర్డిల్స్ చాంప్ రోలిన్స్పై నిషేధం
లాస్ఏంజిల్స్: గత ఏడాది రియో ఒలింపిక్స్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ బ్రియానా రోలిన్స్పై ఏడాదిపాటు నిషేధం విధించారు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించి... పోటీలు లేని సమయంలో తన ఆచూకీ వివరాలు వెల్లడించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ (యూఎస్ఏడీఏ) ప్రకటించింది. ఈ నిర్ణయంతో రోలిన్స్ గత ఏడాది సెప్టెంబరు 27 నుంచి సాధించిన ఫలితాలు చెల్లుబాటుకావు. అంతేకాకుండా వచ్చే ఆగస్టులో లండన్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే అర్హత కోల్పోయింది. -
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి. -
మెరిశారు మురిపించారు
అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్ అందరి దృష్టిని ఆకర్షించగా... విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త ప్రత్యర్థులు వచ్చినా... కొత్త తారలు తెరపైకి వచ్చినా తమ ఉనికిని చాటుకుంటూ వారందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అథ్లెటిక్స్లో ఉసేన్ బోల్ట్, స్విమ్మింగ్లో మైకేల్ ఫెల్ప్స్, టెన్నిస్లో సెరెనా విలియమ్స్... ఇలా పేరున్న వారందరూ ఈ ఏడాదిలో తమ అద్భుత ఆటతీరుతో అలరించారు. – సాక్షి క్రీడావిభాగం ఎదురులేని బోల్ట్ సమకాలీన అథ్లెటిక్స్లో తనకు ఎదురులేదని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి నిరూపించుకున్నాడు. రియో ఒలింపిక్స్ వేదికగా బోల్ట్ మూడు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మాదిరిగానే రియోలోనూ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి వరుసగా మూడోసారి ‘ట్రిపుల్’ సాధించాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో అవే విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్గా బోల్ట్ రికార్డు నెలకొల్పాడు. కొత్తగా ప్రపంచ రికార్డులు సాధించకపోయినా అతనికి తన ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడం విశేషం. వచ్చే ఏడాది లండన్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత వీడ్కోలు పలుకుతానని ఈ జమైకా స్టార్ ప్రకటించాడు. ‘బంగారు చేప’ వీడ్కోలు... ఒలింపిక్స్లో ఒక్క పతకం సాధిస్తేనే కెరీర్ ధన్యమైపోయిందని భావించే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మాత్రం ఒలింపిక్స్లో పతకాలు సాధించడం ఇంత సులువా అని తన అద్వితీయ ప్రతిభతో అబ్బురపరిచాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రియో ఒలింపిక్స్కు సిద్ధమైన ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం సాధించి తన కెరీర్కు ఘనమైన వీడ్కోలు పలికాడు. ఈ ప్రదర్శనతో 31 ఏళ్ల ఫెల్ప్స్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఐదు ఒలింపిక్స్లలో పాల్గొన్న ఫెల్ప్స్ 23 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలు గెలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ‘డ్రాగన్’ జోరుకు బ్రేక్... బ్యాడ్మింటన్లో ఈ ఏడాది చైనా జోరుకు చెక్ పడింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్... డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్ను సొంతం చేసుకున్నారు. సీజన్లోని మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నీలలో పురుషుల సింగిల్స్లో మూడు... మహిళల సింగిల్స్లో రెండు టైటిల్స్ మాత్రమే చైనా క్రీడాకారులకు దక్కాయి. చైనా దిగ్గజం లిన్ డాన్కు ఈ ఏడాది కలిసి రాలేదు. వరుసగా మూడో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఆశించిన లిన్ డాన్ రియో ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ సాధించకపోయినా రియో ఒలింపిక్స్లో పసిడి పతకం సంపాదించింది. రోస్బర్గ్... రయ్ రయ్... ఫార్ములావన్ (ఎఫ్1)లో ఈసారీ మెర్సిడెస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ను వెనక్కినెట్టి మెర్సిడెస్కే చెందిన నికో రోస్బర్గ్ విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్లోని 21 రేసుల్లో రోస్బర్గ్ తొమ్మిది రేసుల్లో గెలిచి, మరో ఏడు రేసుల్లో టాప్–3లో నిలిచి మొత్తం 385 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. 10 రేసుల్లో గెలిచినప్పటికీ హామిల్టన్ (380 పాయింట్లు) మిగతా రేసుల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 1982లో రోస్బర్గ్ తండ్రి కేకె రోస్బర్గ్ ఎఫ్1 చాంపియన్గా నిలువగా... 34 ఏళ్ల తర్వాత అతని తనయుడు నికో అదే ఫలితాన్ని సాధించడం విశేషం. యూరోలో పోర్చు‘గోల్’... ప్రొఫెషనల్ లీగ్స్లో మెరుపులు మెరిపించే క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తన జాతీయ జట్టు పోర్చుగల్ను తొలిసారి ‘యూరో’ చాంపియన్గా నిలబెట్టాడు. పారిస్లో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో పోర్చుగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై సంచలన విజయం సాధించింది. గాయం కారణంగా ఫైనల్ ఆరంభంలోనే రొనాల్డో మైదానం వీడినప్పటికీ... మిగతా పోర్చుగల్ ఆటగాళ్లందరూ పట్టుదలతో పోరాడి ఫ్రాన్స్ను నిర్ణీత సమయం వరకు నిలువరించారు. అదనపు సమయంలోని 109వ నిమిషంలో ఎడెర్ అద్భుత గోల్ చేసి పోర్చుగల్ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పోర్చుగల్ కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. ‘కోపా అమెరికా కప్’ ఫైనల్లో మెస్సీ జట్టు పెనాల్టీ షూటౌట్లో 2–4తో డిఫెండింగ్ చాంపియన్ చిలీ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మెస్సీ గురి తప్పడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఈ ఫలితం తర్వాత మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. అయితే జాతీయ జట్టు ప్రయోజనాలదృష్ట్యా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఇక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో లీస్టర్సిటీ జట్టు విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. స్పెయిన్కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ చాంపియన్స్ లీగ్ టైటిల్తోపాటు ప్రపంచకప్ క్లబ్ టైటిల్ను గెల్చుకుంది. స్టెఫీ సరసన సెరెనా ఈ ఏడాది పురుషుల, మహిళల టెన్నిస్లో సంచలన ఫలితాలు వచ్చాయి. జర్మనీకి చెందిన ఎంజెలిక్ కెర్బర్... బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వరుసగా మహిళల, పురుషుల విభాగాల్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించగా... స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచి ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) రికార్డును సమం చేసింది. పురుషుల సింగిల్స్లో ఆండీ ముర్రే రెండోసారి వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకోగా... స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా యూఎస్ ఓపెన్ చాంపియన్గా అవతరించాడు. నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. అయితే సీజన్ చివర్లో తడబడిన ఈ సెర్బియా స్టార్ తన ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను ఆండీ ముర్రేకు కోల్పోయాడు. ‘కింగ్’ కార్ల్సన్... అన్ని అవాంతరాలను అధిగమిస్తూ రియో ఒలింపిక్స్ను బ్రెజిల్ విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11 వేలకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి 67 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. చైనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మొత్తం 27 కొత్త ప్రపంచ రికార్డులు... 91 ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. -
‘రియో’ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు
గోల్ఫర్ అనిర్బన్ కోల్కతా: రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం ప్రకటించిన మొత్తాన్ని కేంద్ర క్రీడాశాఖ ఇప్పటివరకు ఇవ్వలేదని మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ధ్వజమెత్తాడు. ‘ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం అష్టకష్టాలు పడి అత్యున్నత శిక్షణ తీసుకున్న మాకు అప్పట్లో రూ. 30 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రియో గేమ్స్ ముగిసి నాలుగు నెలలైనా ఒక్క పైసా ఇవ్వలేదు’ అని అనిర్బన్ అన్నాడు. రియోలో మాకెదురైన చేదు అనుభవాలపై సహచర గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా చెప్పిందంతా నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పాడు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), క్రీడా శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చుట్టూ తిరిగిన చౌరాసియా చివరకు రూ.5.5 లక్షలైనా అందుకున్నాడని... కానీ తనకు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పాడు. ‘ఒలింపిక్స్ సన్నాహాలకు ఒక్కో గోల్ఫర్కు రూ. 30 లక్షలిస్తామన్నారు. తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించారు. ఇలా ప్రకటించినవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆటగాళ్లకు అందెదెన్నడో క్రీడాశాఖ వర్గాలే చెప్పాలి’ అని అనిర్బన్ అన్నాడు. ఒలింపిక్స్ కోసం తను సొంత డబ్బుతో సన్నద్ధమైనట్లు చెప్పాడు. భారత ఒలింపిక్ సంఘం, క్రీడాశాఖ ఇలా ఏ ఒక్కరి నుంచి ఆర్థిక సాయం అందలేదని వివరించాడు. -
ఇక ఒలింపిక్స్కు వెళ్లను గాక వెళ్లను!
రియో ఒలింపిక్స్ ముగిసి ఇన్నాళ్లయినా ఇంకా దాని చుట్టూ అలముకున్న వివాదాలు మాత్రం ఎడతెగకుండా వస్తూనే ఉన్నాయి. రియో ఒలింపిక్స్కు సంబంధించి ఇవ్వాల్సిన రూ. 30 లక్షలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో భారత ఒలింపిక్ సంఘం మీద, క్రీడా మంత్రిత్వశాఖ మీద భారత అగ్రశ్రేణి గోల్ఫర్ ఎస్ఎస్పి చౌరాసియా మండిపడ్డాడు. అసలు ఈసారి ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కూడా అనుమానమే అన్నాడు. అతడితో పాటు పాల్గొన్న మరో గోల్ఫర్ అనిర్బన్ లాహిరికి కూడా క్రీడా శాఖ నుంచి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదు. రియో ఒలింపిక్స సమయంలో భారత ఒలింపిక్ సంఘం అధికారులు తమను సర్వెంట్లలా చూశారని చౌరాసియా ఆగ్రహంవ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 16 టైటిళ్లు గెలుచుకున్న లాహిరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, తనకు మాత్రం ఎలాగోలా ఇప్పటికి రూ. 5.5 లక్షలు ఇచ్చారని చౌరాసియా చెప్పాడు. తమకు రూ. 30 లక్షలు ఇస్తామని వాళ్లు చెప్పిన లేఖ కూడా తనవద్ద ఉందని, కానీ రియో గేమ్స్ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 15 లక్షలకు తగ్గించినట్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియోలో అసలు సరైన ఏర్పాట్లన్నవే లేవని, కనీసం వాహనం కూడా లేదని అన్నాడు. తాను చలికి వణికిపోతున్నా, ఒకపక్క వర్షం పడుతున్నా కనీసం తమకు రెయిన్కోట్లు గానీ, గొడుగులు గానీ కూడా ఏర్పాటుచేయలేదన్నాడు. వాళ్లేదో యజమానులలా, తమను నౌకర్లలా చూశారని చెప్పాడు. వాహనం కోసం తమను నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉంచేశారని, లాహిరి తన సొంత వాహనంలో వచ్చాడని అన్నాడు. ఈసారి ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామన్నాడు. -
ఒకే జట్టులో సాక్షి, సత్యవర్త్
ప్రొ రెజ్లింగ్ లీగ్–2 ఆటగాళ్ల వేలం జనవరి 2 నుంచి ఆరంభం యోగేశ్వర్ దత్ దూరం బజరంగ్కు అత్యధిక మొత్తం న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మలిక్తో పాటు తన కాబోయే భర్త సత్యవర్త్ కడియన్ ఇద్దరూ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్లు్యఎల్) రెండో సీజన్ కోసం శుక్రవారం జరిగిన వేలంలో వీరిద్దరిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. సాక్షికి రూ.30 లక్షల ధర పలకగా... సత్యవర్త్ను రూ.18 లక్షలకు తీసుకుంది. తొలి సీజన్లో సాక్షి ముంబై జట్టుకు ఆడగా... సత్యవర్త్ ఉత్తర ప్రదేశ్కు ఆడాడు. అలాగే భారత్ నుంచి స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అత్యధిక ధర పలికాడు. అతడిని ఢిల్లీ జట్టు రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే సందీప్ తోమర్ (హరియాణా, రూ.31 లక్షలు), రీతూ ఫోగట్ (జైపూర్, 36 లక్షలు), గీతా ఫోగట్ (ఉత్తర ప్రదేశ్, రూ.16 లక్షలు)లకు కూడా మంచి ధర పలికింది. అయితే జనవరి 16న వివాహం చేసుకోబోతున్న భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఐదు విభిన్న వేదికల్లో జరిగే ఈ లీగ్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతుంది. రియోలో స్వర్ణం సాధించిన వ్లాదిమిర్ ఖించెగష్వి (జార్జియా) అత్యధిక ధర పలికిన రెజ్లర్గా నిలిచాడు. తనను టీమ్ పంజాబ్ జట్టు రూ.48 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఆ తర్వాత లండన్ గేమ్స్లో స్వర్ణం సాధించిన మగోమెడ్ కుర్బనలీవ్ (అజర్బైజాన్)ను కూడా పంజాబ్ రూ.47 లక్షలకు తీసుకుంది. 200కు పైగా రెజ్లర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతీ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు (ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఉండగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. -
సూపర్ సింధు
మారిన్పై విజయంతో సెమీస్లోకి దుబాయ్: రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బదులు తీర్చుకుంది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో సింధు 21–17, 21–13తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్ మారిన్ను మట్టికరిపించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్ వరుసగా మూడు పరాజయాలతో ఈ టోర్నీని ముగించి ఇంటిదారి పట్టింది. ఇదే గ్రూప్ నుంచి సున్ యు మరో సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి సుంగ్ జీ హున్ (కొరియా), తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్స్కు చేరుకున్నారు. శనివారం జరిగే సెమీఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్తో సింధు, సుంగ్ జీ హున్తో సున్ యు తలపడతారు. ప్రపంచ రెండో ర్యాంకర్ మారిన్తో జరిగిన మ్యాచ్లో సింధు ఆద్యంతం దూకుడుగా ఆడింది. తొలి గేమ్ ఆరంభంలో 3–7తో వెనుకబడిన సింధు ఆ వెంటనే కోలుకొని వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 8–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. అయితే స్కోరు 11–12 వద్ద సింధు మరోసారి ఐదు వరుస పాయింట్లు నెగ్గి 16–12తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లోనూ సింధు ప్రణాళిక ప్రకారం ఆడి మారిన్కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. -
ఈ యేటి మేటి బోల్ట్, అయానా
ఐఏఏఎఫ్ పురస్కారాల ప్రదానం మొనాకో: వరుసగా మూడో ఒలింపిక్స్లోనూ మూడేసి స్వర్ణాలు సాధించిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్... రియో ఒలింపిక్స్లో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకం నెగ్గిన అయానా అల్మాజ్ (ఇథియోపియా) ఈ ఏడాది ‘ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలు అందుకున్నారు. అథ్లెటిక్స్ అధికారులు, అథ్లెట్స్, జర్నలిస్టులతోపాటు ఆన్లైన్ పోలింగ్ ద్వారా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) ఈ ఇద్దరిని ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్లో బోల్ట్ 100, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. బీజింగ్, లండన్ ఒలింపిక్స్లోనూ బోల్ట్ ఈ మూడు విభాగాల్లో పసిడి పతకాలు గెలిచాడు. 30 ఏళ్ల బోల్ట్ ఐఏఏఎఫ్ మేటి అథ్లెట్ పురస్కారాన్ని అందుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో అతను 2008, 2009, 2011, 2012, 2013లలో ఈ గౌరవాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది లండన్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలుకనున్న బోల్ట్ 19.19 సెకన్లతో తన పేరిటే ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును సవరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. ‘రియో ఒలింపిక్స్లో 200 మీటర్లను 19 సెకన్లలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు. వచ్చే సీజన్లో ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉంటే ఏదైనా జరగొచ్చు. 2020 టోక్యో ఒలింపిక్స్లో నేను పాల్గొనే అవకాశం లేదు. ఒకసారి రిటైరయ్యాక పునరాగమనం చేయొద్దని నా కోచ్ స్పష్టం చేశారు’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. -
బెస్ట్ బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’గా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) వికాస్ను ఎంపిక చేసింది. వచ్చే నెల 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును వికాస్కు అందజేస్తారు. భారత్ నుంచి ఓ బాక్సర్కు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం. హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్లో 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ‘నాకిది గొప్ప గౌరవం. అరుుతే నేనంతగా ఆనందంగా లేను. ఎందుకంటే రియో ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆశించిన నాకు నిరాశే మిగిలింది’ అని ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో శిక్షణ తీసుకుంటున్న వికాస్ వ్యాఖ్యానించాడు. -
ఆఖరి పోరులో సాగని జోరు
ఫైనల్లో ఓడిన సింధు, సమీర్ వర్మ రజత పతకాలతో సరి హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోరుుంది. హాంకాంగ్ ఓపెన్ టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు కనబర్చిన సింధు, ఫైనల్లో పరాజయం పాలైంది. మరోవైపు సంచలన ఆటతో పురుషుల విభాగంలో ఫైనల్కు చేరిన భారత ఆటగాడు సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల ఫైనల్లో సింధు 15-21, 17-21 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) 21-14, 10-21, 21-11 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు. రన్నరప్లుగా నిలిచిన సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 7,800 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. రన్నరప్ సిక్కి రెడ్డి జంట మరోవైపు గ్లాస్గోలో ముగిసిన స్కాటిష్ ఓపెన్గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ భారత్కు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ ద్వయం సిక్కి-ప్రణవ్ 21-13, 18-21, 16-21తో ప్రపంచ 229వ ర్యాంక్ జోడీ గో సూన్ హువాట్-జేమీ లై షెవోన్ (మలేసియా) చేతిలో ఓడిపోరుుంది. నిర్ణాయక మూడో గేమ్లో సిక్కి-ప్రణవ్ 16-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా 9 పారుుంట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మెరుగ్గానే ఆడినా ప్రత్యర్థి నెట్ వద్ద చాలా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆమె ఎలాంటి తప్పులూ చేయలేదు. గతంలోనూ తై జుతో ఆడాను. ఆమె బలాల గురించి తెలిసే సన్నద్ధమయ్యా. అరుుతే ఆటలో ఓటమి సహజం. గత వారం చైనా ఓపెన్ గెలుపు కారణంగా నేను ఈ మ్యాచ్కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఈ రోజు ఆమెది. తిరిగి వెళ్లాక మరింతగా సాధన చేస్తా. వరుసగా రెండు టోర్నీల్లో నా ఆట సంతోషాన్ని కలిగించింది. - పీవీ సింధు -
స్ప్రింటర్ ధరమ్వీర్పై నిషేధం
న్యూఢిల్లీ: రియో ఒలిం పిక్స్కు ముందు డోపిం గ్లో దొరికిన స్ప్రింటర్ ధరమ్వీర్ సింగ్పై జా తీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. దీంతో ఈ హరియాణా అథ్లెట్ కెరీర్ ఇక ముగిసినట్టే. జూలై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ధరమ్వీర్ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఈ పోటీల్లోనే తను 20.45 సె. టైమింగ్తో జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అరుుతే అతడిచ్చిన శాంపిల్లో నిషేధిత ఎనబోలిక్ స్టెరారుుడ్ వాడినట్టు తేలడంతో చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్కు దూరం కావాల్సి వచ్చింది. ఈ 200మీ. రన్నర్కు ఇది రెండో డోపింగ్ అతిక్రమణ కావడంతో ‘నాడా’ కఠినంగా వ్యవహరించింది. 2012లో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్స్లోనూ తను 100మీ. రేసులో స్వర్ణం నెగ్గినా... డోపింగ్ టెస్టుకు దూరంగా ఉండడంతో అతడి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
-
కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే వారంలో పునరాగమనం చేయనుంది. అయితే భవిష్యత్లో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని సైనా తెలిపింది. ‘చాలా మంది నా కెరీర్ ముగిసిందని భావిస్తున్నారు. ఇక పునరాగమనం చేయలేనని అనుకుంటున్నారు. గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం’ అని 26 ఏళ్ల సైనా అభిప్రాయపడింది. నవంబరు 15 నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం సైనా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ‘సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నాను. నా పని అరుుపోయిందని ఇతరులు అనుకుంటే సంతోషమే. ఒకరకంగా ఇప్పటిదాకా వారు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి నా గురించి వారు ఆలోచించడం మానేస్తారేమో’ అని సైనా తెలిపింది. -
తప్పంతా జైషా కోచ్దే
విచారణలో తేల్చిన కేంద్ర క్రీడాశాఖ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత మారథాన్ రన్నర్, మహిళా అథ్లెట్ జైషా అస్వస్థతకు ఆమె కోచ్ నికొలాయ్ స్నేసరెవే కారణమని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తమ విచారణలో తేల్చింది. పోటీ జరిగే రోజు మంచినీరు, శక్తినిచ్చే పానీయాలు సరఫరా చేయకపోవడానికి ఆమె కోచ్ ఇచ్చిన తప్పుడు మార్గదర్శకత్వమే కారణమని వెల్లడించింది. పోటీకి ముందు రోజు నీరు తదితర సదుపాయాల కల్పన కోసం ఆమె కోచ్ నికొలాయ్ను సంప్రదించగా ఆయన... అవేమీ అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధులకు చెప్పారు. దీంతో మంచినీరు, శక్తి పానీయాలను వారు అందుబాటులో ఉంచలేకపోయారు. ఒలింపిక్స్లో ఆమె మారథాన్లో పరుగు పెట్టింది. అరుుతే సుదీర్ఘ పరుగు పోటీని పూర్తి చేసే క్రమంలో కనీసం మంచినీరైన తాగకపోవడంతో డీహైడ్రేషన్కు గురై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఐఓఏపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. -
సింధు శుభారంభం
ఒడెన్స: రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 21-19తో హీ బింగ్జియావో (చైనా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించారుు. మొదటి రౌండ్ మ్యాచ్ల్లో అజయ్ జయరామ్ 21-15, 21-16తో బున్సాక్ పొన్సానా (థాయ్లాండ్)పై, ప్రణయ్ 21-13, 19-21, 22-20తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా)పై గెలిచారు. సారుుప్రణీత్ 17-21, 21-19, 15-21తో తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో సుమీత్-మనూ అత్రి ద్వయం 10-21, 19-21తో కిమ్ యాస్టప్-్రఆండర్స్ రస్ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్లో సిక్కి-ప్రణవ్ జంట 15-21, 14-21తో జోచిమ్ ఫిషెర్ నీల్సన్-క్రిస్టినా పెడెర్సన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారుు. -
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
-
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
రోహ్తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గాడు. -
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !
⇒ ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది. తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది. -
సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది. కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు. -
‘సిల్వర్’ సింధుకు మరో కానుక
విజయవాడ (రామవరప్పాడు) : రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు బుధవారం ఆమెకు కారును బహూకరించారు. ఎనికేపాడులోని లక్కి నిస్సాన్ షోరూమ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సింధును సన్మానించారు. అనంతరం ఆమెకు డాట్సన్ రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ కారులో అకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి వన్నె తెచ్చిన సింధుకు కారును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ కానుక అందజేసిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడితే ఎవరికైనా విజయం సొంతమవుతుందని తెలిపారు. తాను ఎంతో కష్టపడి ఒలింపిక్స్లో పతకం సాధించానని గుర్తుచేసుకున్నారు. యువత ఏకాగ్రత, పట్టుదలను అలవరుచుకుంటే ఎదైనా సాధించవచ్చునని సూచించారు. -
కండబలంతో కాదు టెక్నిక్తో గెలిచా
న్యూఢిల్లీ: క్రీడల్లో ముఖ్యంగా కుస్తీ వంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ మాత్రం.. తాను కేవలం కండబలంతో గెలవలేదని, బుద్ధిబలం కూడా తోడైందని చెప్పింది. హరియాణాకు చెందిన సాక్షిని ఎయిరిండియా సన్మానించింది. బిజినెస్ క్లాస్లో సాక్షి ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయం కల్పించినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘నేను శక్తి వల్ల మాత్రమే గెలవలేదు. టెక్నిక్ కూడా తోడైంది. రియోలో పతకం గెలవడం ఓ మధురానుభూతి. పోటీల కోసం బరువు తగ్గా. డైట్పై కంట్రోల్ చేశాను. అన్ని టోర్నమెంట్లకు ఒకేవిధంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే ప్రత్యర్థిని బట్టి దృష్టిసారించాలి. పవర్, వెయిట్, స్పీడ్ ట్రైనింగ్స్లో ప్రాక్టీస్ చేయాలి. నా కుటుంబ సభ్యులు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. రియోలో 15 రోజులు ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. నాపై గెలిచిన రష్యా రెజ్లర్ ఫైనల్కు చేరుతుందని వందశాతం నమ్మాను. ఏదేమైనా నేను పతకం గెలుస్తానని భావించా’ అని సాక్షి చెప్పింది. -
రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపారా?
ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ జంబో జట్టు (118)ను రియోకు పంపినా ఆశించిన ఫలితాలు రాలేదు. మనోళ్లు ఈసారి డబుల్ డిజిట్ పతకాలు గెలుస్తారని అంచనా వేస్తే.. రెండింటికే పరిమితమయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజతం, రెజ్లర్ సాక్షిమాలిక్ కాంస్య పతకాలు సాధించడం మినహా చాలామంది స్టార్లు రిక్తహస్తాలతో తిరిగివచ్చారు. రియోలో మన క్రీడాకారుల వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఓ నివేదికను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు పంపింది. సాయ్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. రియోకు అన్ ఫిట్ అథ్లెట్లను పంపడం ప్రతికూల ప్రభావం చూపించింది. విదేశీ కోచ్ల పనితీరును అంచనావేయాల్సిన అవసరముందని కేంద్ర క్రీడల శాఖకు సూచించింది. జాతీయ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. రియో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై అంతర్గత విశ్లేషణ చేయాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైనట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రియోలో పాల్గొన్న క్రీడాకారులందరికి వ్యక్తిగతంగా లేఖలు రాసి, వారి నుంచి నేరుగా లేదా ఈమెయిల్ ద్వారా సూచనలు కోరినట్టు చెప్పారు. -
సాయిప్రణీత్ శుభారంభం
కశ్యప్, ప్రణయ్ కూడా ఇండోనేసియా గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ బాలిక్పాపన్ (ఇండోనేసియా): రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. పదో సీడ్ భమిడిపాటి సారుుప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సిరిల్ వర్మ, కౌశల్, హర్షిల్ డాని తొలి రౌండ్లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సారుుప్రణీత్ 21-18, 13-21, 21-13తో సుబగ్జా రియాంతో (ఇండోనేసియా)పై, కశ్యప్ 21-6, 21-8తో సులిస్తో (ఇండోనేసియా)పై, జయరామ్ 21-8, 21-9తో మైనాకి (ఇండోనేసియా)పై, ప్రణయ్ 16-21, 21-19, 21-14తో హా యంగ్ వూంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచారు. సిరిల్ వర్మ 7-21, 9-21తో వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా) చేతిలో, కౌశల్ 23-21, 14-21, 13-21తో మేగనంద (ఇండోనేసియా) చేతిలో, హర్షిల్ 18-21, 16-21తో సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, పీసీ తులసీ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. రుత్విక 14-21, 14-21తో హనా రమదిని (ఇండోనేసియా) చేతిలో, తులసీ 12-21, 5-21తో జియో లియాంగ్ (సింగపూర్) చేతిలో, తన్వీ 14-21, 19-21తో రుసెల్లి హర్తావన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా (భారత్) జంట 10-21, 14-21తో మార్కిస్ కిడో-హెంద్రా గుణవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్ల్లో అజయ్ జయరామ్తో కశ్యప్; కాంతాఫోన్ (థాయ్లాండ్)తో సారుుప్రణీత్; జూ వెన్ సుంగ్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు. దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
సచిన్ కానుక కన్నా నాకు అదే గొప్ప!
రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించి.. దేశ ప్రజల నిరీక్షణకు తెరదించింది సాక్షి మాలిక్. ఓ సాధారణ బస్సు డ్రైవర్ కూతురు అయిన సాక్షి జీవితం రియో పతకంతో పూర్తిగా మారిపోయింది. రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన ఆమెకు దేశ నీరాజనాలు పట్టింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు నజరానాను ఆమెకు ప్రకటించాయి. హర్యానాలో అయితే ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో హర్యానా ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. హర్యానా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా సాక్షితోతోపాటు షట్లర్ సింధు, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపీచంద్కు బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందాయి. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ వారికి సచిన్ చేతులమీదుగా ఈ కార్లను బహూకరించారు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారు సాక్షికి కానుకగా అందినా తాను మాత్రం ఓల్డ్ పోలో కారులోనే ప్రయాణిస్తుందట. అందుకు కారణం.. 'రెండేళ్ల కిందట మా నాన్న బ్లూకలర్ ఫోక్స్వ్యాగన్ పోలో కారును కానుకగా ఇచ్చారు. ఈ కారు ఇచ్చిన తర్వాత నేను గ్లాస్గో కామన్వెల్గ్ క్రీడల్లో రజత పతకాన్ని గెలిచారు. ఇక ముందు కూడా ఇదే కారును వాడుతాను. బీఎండబ్ల్యూను మా నాన్నకు కానుకగా ఇస్తాను. ఆయన నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు' అని సాక్షి చెప్పింది. ఎంతైనా బీఎండబ్ల్యూ కన్నా కన్నతండ్రి ఇచ్చిన కానుకే గొప్పది కదా! -
సింధును సత్కరించిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ పతక విజేతలు పి.వి.సింధు, సాక్షి మలిక్లను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రజతం నెగ్గిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్యం సాధించిన సాక్షికి రూ. కోటి నజరానాను అందజేశారు. వారిద్దరి కోచ్లు గోపీచంద్, మన్దీప్ సింగ్లకు రూ. 5 లక్షల చొప్పున, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానిక బాత్రా, అథ్లెట్ లలిత్ మాథూర్లకు రూ. 3 లక్షల చొప్పున బహూకరించారు. పతక విజేతల ఫిజియోలు సుబోధ్, కిరణ్లను కూడా సీఎం కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ‘ఇక్కడేం జరిగిందో తెలుసుకోడానికి రియోలో మా వద్ద ఫోన్లే లేవు. కానీ వచ్చాకే తెలిసింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని... ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారని. ఇంతగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు’ అని సింధు తెలిపింది. బ్యాడ్మింటన్ ఆటలోని గేమ్ ప్లాన్, వ్యూహాలపై పుస్తకం రాస్తానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. ‘ఫైనల్’ వీక్షకులు 1.72 కోట్లు ముంబై: సింధు, మారిన్ల మధ్య రియోలో జరిగిన పసిడి పతక పోరును టీవీల్లో కోటి 72 లక్షల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా నెట్వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్ ఇండియా యాప్ ‘హాట్స్టార్’లో 50 లక్షల మంది ఈ మ్యాచ్ను చూశారని ఆ సంస్థ వెల్లడించింది. భారత్లో ఆ రోజు మొత్తం టీవీ కార్యక్రమాల్లో ఇదే అత్యధిక వీక్షణ రికార్డని స్టార్ స్పోర్ట్స సీఈఓ నితిన్ కుక్రేజా పేర్కొన్నారు. ఒక క్రికెటేతర ఆటను ఈ స్థారుులో వీక్షించడం కూడా ఇదే తొలిసారని ఆయన చెప్పారు. -
విజేతలైతేనే మీవాళ్లా?!
సందర్భం దివంగత నేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి వందలాదిమంది క్రీడాకారులకు సదుపాయాలు కల్పించారు. ఇప్పుడలాంటి శ్రద్ధ తీసుకునేవారేరీ? సింధూ ఒలింపిక్స్లో రజతం గెలిచింది. యావత్ భారతదేశం పరువు నిలిపిన ఆ ఆణిముత్యాన్ని ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘనతని తమదిగా చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు పోటీపడ్డారు. ఆ క్రీడాకారిణిని తన ప్రభుత్వంలో ఉద్యో గిగా మారుద్దామనుకున్నారు. చిత్రంగా ఒలింపిక్స్ క్రీడలు ఎలా జరుగుతాయి, తరువాతి ఒలింపిక్స్కు ఎంతకాలం ముందు వేదికను నిర్ణయిస్తారో అవగాహన లేకుండా అమరావతిలో త్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు ఒక నేత. ఇదీ, ఏలికలకు క్రీడలపై ఉన్న అవగాహన! మన క్రీడారంగం ఒక్క పతకంతోనో, ఒక్క పరుగుతోనో చంకలు గుద్దుకోవడం రేపటి క్రీడాకారుల పట్ల చేస్తున్న నేరం. నేదురమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ స్కూల్ని హకీంపేట్లో నిర్మిస్తే, వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక జిల్లాకి ఒక స్పోర్ట్స్ స్కూల్ విధానంతో తొలుత వైజాగ్, కడప, కరీంనగర్, మెదక్, విజయవాడలలో స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పి ఒక్కొక్కటీ 400 నుండి 450 మంది క్రీడాకారులకు వసతి, సౌకర్యాలు, కోచ్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ, వైఎస్ ఆకస్మిక మరణంతో ఆ స్కూళ్లు నామమాత్రంగా మిగిలాయి. అవినీతి కూపాలుగా మారిపోయాయి. కొన్ని నిధులు పెంచినా, క్రీడాకా రుల భోజనానికి మాత్రం పదేళ్ల క్రితం నిర్ణయించిన భత్యం రూ. 100–150 ఇస్తున్నారు. దీనితో వాళ్లు పౌష్టికాహారానికి దూరమైనారు. నాలుగోlతరగతి మొదలు ఇంటర్ చదివే వారిని స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్చుకునే అవకాశం ఉన్నా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిఫార్సు మేరకు ప్రవేశాలు పొందాలనే నిబంధన ఉండటంతో దొడ్డిదారి ప్రవేశాలు పెరిగి, నిజమైన క్రీడాకారులు బయటే ఉండిపోతున్నారు. దివంగత రాజశేఖర రెడ్డిగారి హయాంలో కరణం మల్లీశ్వరి, మెదక్ జిల్లాకు చెందిన గీతా, శంకర్లు అత్యంత ప్రతిభ చూపారు. ఈ తారలు అధికారుల అవినీతి వ్యవహార శైలితో ఇప్పుడు కనుమరుగైపోయారు. మనకు కేవలం ఒక్కరో, ఇద్దరో స్పోర్ట్స్ తారలు దొరికినా, ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నుంచి కనబడుతున్నారు. ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్స్ నుంచి అలాంటి తారలు రాకపోవడానికి కారణం ప్రైవేట్ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లకు స్థలాలు, తాయిలాలు ఇస్తున్న ప్రభుత్వాలు తాము నడిపే స్పోర్ట్స్ స్కూల్స్ కోచ్లకు కేవలం 20 నుండి 25 వేల రూపాయలు వేతనం ఇస్తూ వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎలా తయారుచేస్తాయి? ఈ స్పోర్ట్స్ స్కూళ్లకి కొత్త నియామకాలు ఏవీ చేపట్టకుండా రిటైర్ అయిన వారినే కొన సాగిస్తూ మేమూ స్పోర్ట్స్ స్కూల్స్ నడిపిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి తప్ప, అందులో నిజాయితీ లేదు. పాఠశాలల్లో స్పోర్ట్స్ గురించి పాఠ్యాంశాలుగానీ, క్రీడా మైదానం గానీ, శిక్షితులైన పీఈటీలు కానీ లేరు. ప్రైవేట్ పాఠశాలలైతే ఎంత ఉత్సాహం ఉన్న విద్యార్థినైనా ఆటలు, కళలవైపు వెళ్లనీయకుండా మార్కులూ, ర్యాంకుల బందిఖానాలకు పరిమితం చేస్తుంటే విద్యాశాఖ అడిగిన పాపాన పోలేదు. పాఠశాలల్లో ఎక్కడా ఆటస్థలం కనిపించక పోయినా అధికారులకు కాసులు కన్పిస్తే చాలు ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇలా ఆటలను నిర్వీర్య పరుస్తున్న విద్యా వ్యవస్థ కలిగి ఉన్న ప్రభుత్వాలు స్వంతంగా కృషి చేసి పతకాలను దక్కిం చుకున్న వారికి నజరానాలు గుప్పించి వారిని తామే తయారు చేశా మన్నట్లు పోజులివ్వడం ఎంతవరకు సబబు? ఈ అధినేతలు నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనుకుంటే ఒలింపిక్స్ నిర్వహిం చడం కాదు, కనీసం ఒలింపిక్స్ దాకా వెళ్లే స్థాయిలోనైనా క్రీడాకారులని తయారుచేసుకోవాలి. కానీ, నేలవిడచి సాము చేస్తామంటే చరిత్రహీనులౌతారు. వచ్చేసారి జపాన్ ఒలింపిక్స్కైనా పదిమంది క్రీడాకారులను పంపే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కృషిచేయాలి. అంతేగానీ గెలిచినవారు మావారంటే మావారని గొప్పలు చెప్పుకోవడం మానాలి. అచ్యుతరావు వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు-93910 24242 -
సింధు మ్యాచ్.. సెన్సేషనల్ హిట్!
రియో ఒలింపిక్స్లో పీవీ సింధు అసమాన పోరాటం దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఆమె ఫైనల్ మ్యాచ్.. దేశ ప్రజలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ప్రపంచ నంబర్, స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్తో సింధు తలపడిన రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ను ఏకంగా భారత్లో 6.65 కోట్లమంది చూశారు. భారత్ పరంగా చూసుకుంటే రియో ఒలింపిక్స్లో అత్యధికులు చూసిన సింగిల్ మ్యాచ్ ఇదే. అంతేకాదు దేశంలో అత్యంత పాపులర్ అయిన 'ద కపిల్ శర్మ షో' వంటివాటిని సింధు ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. 'ద కపిల్ శర్మ షో'ను ప్రతివారం ఐదు కోట్ల మంది వీక్షిస్తుండగా సింధు ఫైనల్ మ్యాచ్ను ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారని మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ తెలిపింది. రియో ఒలింపిక్స్లో సింధు ఆడుతున్న మ్యాచ్లకు క్రమంగా వ్యూయర్షిప్ పెరిగింది. మొదట ఆమె మ్యాచ్లకు 16.4 మిలియన్ల వ్యూయర్షిప్ ఉండగా.. ఫైనల్ మ్యాచ్కు వచ్చేసరికి అది అమాంతం పెరిగిపోయింది. ఇక, ఆమె సెమీఫైనల్ మ్యాచ్ను లైవ్లో చూసిన ప్రేక్షకుల్లో 57.4శాతం మంది ఫైనల్ మ్యాచ్ను కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సింధు ప్రతిభ మీద ఉన్న అపారమైన నమ్మకమే ఆమె ఫైనల్ మ్యాచ్ను లైవ్లో చూసేందుకు చాలామందిని ప్రోత్సహించినట్టు నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్లో రికార్డు వ్యూయర్షిప్ పీవీ సింధుకు స్వస్థలం హైదరాబాద్ నుంచి భారీ మద్దతు లభించినట్టు టీవీ వ్యూయర్షిప్ స్పష్టం చేస్తున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా సింధు మ్యాచ్ను చూసింది హైదరాబాదీలే. నగరాల వ్యూయర్షిప్ విషయంలో ముంబై ప్రథమస్థానంలో ఉంటే హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం రెండువారాలపాటు జరిగిన రియో ఒలింపిక్స్ను దేశంలో తొమ్మిది చానెళ్లలో 22.8 కోట్లమంది వీక్షించారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్ప్రీత్సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్చెయిర్లో... రియో ఒలింపిక్స్లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది. -
సన్నద్ధం కాకుండానే...
* ‘రియో’లో పేస్-బోపన్న జంట * వైఫల్యంపై భూపతి అభిప్రాయం ముంబై: ఎలాంటి సన్నాహాలు లేకుండా రియో ఒలింపిక్స్లో పాల్గొన్నందుకే లియాండర్ పేస్-రోహన్ బోపన్న జంట తొలి రౌండ్లోనే నిష్కమ్రించిందని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. ‘పేస్-బోపన్న కలసి సాధన చేయలేదు. మేమిద్దరం ఏథెన్స, బీజింగ్ ఒలింపిక్స్లో ఆడిన సమయంలో పలు టోర్నమెంట్లలో కలిసి ఆడాం. కానీ పేస్-బోపన్న అలా చేయలేదు. ఫలితంగా పురుషుల డబుల్స్లో పతకంపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మిక్స్డ్ డబుల్స్లో బోపన్న-సానియా జంటకు పతకం నెగ్గే అవకాశం లభించినా వదులుకున్నారు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా భూపతి వ్యాఖ్యానించాడు. -
గౌరవం కాపాడింది... మన అమ్మాయిలే!
జాతీయ క్రీడా అవార్డు విజేతలకు ప్రధాని ఆతిథ్యం నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్లతో పాటు జాతీయ క్రీడా పురస్కారాలు పొందిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సింధు, సాక్షి తాము సాధించిన పతకాలను ఆయనకు చూపించారు. నేడు (సోమవారం) జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు, సాక్షి, దీప, జీతూ రాయ్లు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే అర్జున, ద్రోణాచార్య, మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారాలు ఆయా ఆటగాళ్లు స్వీకరించనున్నారు. ‘ప్రధానికి నా రజత పతకాన్ని చూపించాను. దేశం గర్వించదగ్గ స్థాయిలో చాలా బాగా ఆడావు అని ప్రశంసించారు. ఆయనతో సంభాషణ చాలా సంతోషాన్నిచ్చింది’ అని సింధు తెలిపింది. సాక్షి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నన్ను కొట్టవు కదా’ అని ప్రధాని సరదాగా అన్నట్టు తెలిపింది. రియో ఒలింపిక్స్లో దేశ గౌరవాన్ని కాపాడింది మన అమ్మాయిలేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన వీరిని ప్రశంసించారు. ‘మనకు వచ్చిన రెండు పతకాలు ఈ దేశ పుత్రికలు సాధించినవే. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని వారు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతానికి చెందిన ఈ ముగ్గురు మనందరినీ గర్వపడేలా చేశారు. తమ పిల్లలను ఏదో ఒక ఉద్యోగంలో చేరేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ క్రీడలతో సమయం వృథాగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనాసరళిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని ప్రధాని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఏదేని రెండు క్రీడలపై ఫోకస్ పెట్టాలని, క్రీడల అభివృద్ధికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్లో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడేందుకు ఇప్పటికే తాము టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ను గుర్తుచేసుకున్నారు. క్రీడా స్ఫూర్తి, దేశ భక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. -
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
-
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
రియో ఒలింపిక్స్లో పతకాల కోసం భారతీయులు కళ్లు కాయలు గాచేలా ఎదురుచూస్తే.. ఇద్దరు అమ్మాయిలు ఆ లోటును తీర్చారు. మొదట రెజ్లర్ సాక్షి మాలిక్ గొప్ప పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సాధిస్తే.. ఆ తర్వాత షట్లర్ పీవీ సింధు స్ఫూర్తిదాయక పోరాటంతో రజతాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై భారత్ గౌరవాన్ని నిలబెట్టిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. పీవీ సింధు, సాక్షితోపాటు ఖేల్ రత్న, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతలైన క్రీడాకారులు కూడా ప్రధాని మోదీతో సమావేశమైన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పే సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ కొంత తడబడ్డారు. రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్, పీవీ సింధు గోల్డ్ మెడలిస్టులని ఆయన మీడియాతో పేర్కొన్నారు. సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రే సింధు, సాక్షి మెడళ్ల విషయంలో తత్తరపడటం గమనార్హం. రియో ఒలింపిక్స్లోనే ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా విజయ్ గోయల్ ప్రవర్తించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. -
ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్!
రియో ఒలింపిక్స్లో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది రెజ్లర్ సాక్షి మాలిక్. ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి దేశాన్ని ఆనందంలో ముంచెత్తిన ఈ అమ్మడు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నది. అది కూడా సహచర రెజ్లింగ్ ఆటగాడినే. బెంగాలీ దినపత్రిక 'ఆనంద్బజార్ పత్రిక'కు ఇంటర్వ్యూ వచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. 'అతను చాలా సపోర్టివ్గా ఉంటాడు. నా కలలను తన కలలుగా భావిస్తాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకో మంచి స్నేహితుడు దొరికినట్టే' అని సాక్షి తెలిపింది. అయితే, తనకు కాబోయే భర్త పేరు మాత్రం 'సీక్రెట్' అని చెప్పింది. ఈ ఏడాదే తాము పెళ్లి చేసుకుంటామని వివరించింది. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు తన పెళ్లి ఏమాత్రం అడ్డు కాబోదని చెప్పింది. 'అతను నా సన్నాహాలకు సహాయంగా నిలుస్తాడు. పెళ్లి తర్వాత రెజ్లింగ్ క్రీడను కొనసాగించడం ఏమీ సమస్య కాబోదని నేను అనుకుంటున్నా' అని తెలిపింది. -
ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్
-
బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్
-
బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు హైదరాబాద్కు రానున్నారు. సచిన్ శనివారం రాత్రి నగరానికి చేరుకుని ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ సందర్భంగా నలుగురు ఒలింపియన్లకు బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు. రియో ఒలింపిక్స్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, కాంస్య పతక విజేత.. రెజ్లర్ సాక్షి మాలిక్లతో పాటు 52 ఏళ్ల తర్వాత దేశం తరఫున జిమ్నాస్టిక్స్లో పాల్గొని తృటిలో పతకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు. నగరానికి చెందిన చాముండేశ్వరినాథ్ ఫౌండేషన్ తరపున ఈ బహుమతులను సచిన్ తన చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. -
సింధు సిల్వర్ మెడల్ గెలిచినా...
రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఒలింపిక్స్లో సింధు అద్భుతమైన పోరాటపటిమను చూపినప్పటికీ.. ఆమె వరల్డ్ ర్యాంకు ఏమీ మారలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆమె పదో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఒలింపిక్స్లో అంచనాల మేరకు ఆడలేకపోయిన భారత షట్లర్ సైనా నేహ్వాల్ ర్యాంకు మరింత దిగజారింది. తాజా ప్రదర్శన కారణంగా స్థానాలు పడిపోయిన సైనా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్లో విఫలమైన భారత షట్లర్ల జోడీ గుత్తా జ్వాలా, అశ్వని పొన్నప్ప కూడా నాలుగు స్థానాలు దిగజారి 26 ర్యాంకుకు పరిమితమయ్యారు. అయితే, పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని అతను 10వర్యాంకులో నిలువగా.. మరో భారత షట్లర్ అజయ్ జయరాం కూడా ర్యాంకును మెరుగుపరుచుకొని 22వస్థానంలో నిలిచాడు. -
హామీ ఇస్తేనే... తిరిగి స్వదేశానికి వెళతా
ఇథియోపియా రజత విజేత లిలెసా అడిస్ అబబా: రియో ఒలింపిక్స్ వేదికగా తమ దేశ రాజకీయాంశాలపై నిరసన వ్యక్తం చేసిన మారథాన్ రజత పతక విజేత ఫెయిసా లిలెసా ఇథియోపియా వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. తనకెలాంటి శిక్ష విధించబోమని ప్రభుత్వం నుంచి హామీ లభిస్తేనే తిరిగి వెళతానన్నాడు. రియోలో మారథాన్ రజతం నెగ్గిన అతను పోడియం వద్ద ఇథియోపియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇదిలావుండగా... 8 పతకాలు గెలిచిన ఇథియోపియా అథ్లెట్లకు స్వదేశంలో ప్రభుత్వ, క్రీడాధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే లిలెసాకు హామీపై వ్యాఖ్యానించేందుకు అధికారులు నిరాకరించారు. -
నాకు నీళ్ల సమస్య రాలేదు: కవిత
రియో ఒలింపిక్స్ మారథాన్ సమయంలో తనకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని భారత అథ్లెట్ ఓపీ జైషా వాపోయిన సంగతి తెలిసిందే. అయితే అదే మారథాన్లో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి కవిత మాత్రం తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పింది. ‘జైషా ఏం చెప్పిందో, ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. నాకు దాహం అయిన ప్రతిసారీ అందుబాటులో మంచినీళ్లు ఉన్నాయి. ముందు రోజు కూడా మన అధికారులు వచ్చి నాకు ప్రత్యేక డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడిగారు. కానీ అవసరం లేదని చెప్పాను’ అని కవిత తెలిపింది. జైషా ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా... కవిత చెప్పిన విషయాలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. -
అభినమాన సందేహం 'సాక్షి'గా...
రెజ్లర్ సాక్షి మలిక్కు భారీ స్వాగతం ఘనంగా సత్కరించిన హరియాణా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు పురస్కారం అందజేత న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ సగర్వంగా సొంతగడ్డపై అడుగు పెట్టింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. హరియాణా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ రియో నుంచి ఆమె వెంట రాగా, ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. ముందుగా సాక్షి తల్లిదండ్రులు ఆమెను అభినందనలతో ముంచెత్తగా... ఆ తర్వాత క్రీడాభిమానులు ఎయిర్పోర్ట్ ముందు బ్యాండ్ బాజాలతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. అనంతరం ఝజ్జర్ జిల్లా బహదూర్గఢ్లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సన్మాన కార్యక్రమంలో సాక్షి పాల్గొంది. కాంస్య పతకం గెలుచుకున్న సాక్షికి ఈ సందర్భంగా రూ. 2.5 కోట్ల నగదు పురస్కారపు చెక్ను ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అందజేశారు. దీంతో పాటు హరియాణా ప్రభుత్వం క్లాస్-2 ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. సాంప్రదాయ ‘పగ్డీ’తో సాక్షిని సత్కరించిన ఖట్టర్, బేటీ పఢావో-బేటీ బచావో కార్యక్రమానికి హరియాణా ప్రచారకర్తగా సాక్షిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత అభిమానులు కరెన్సీ నోట్ల దండలను ఆమె మెడలో వేశారు. రియో ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతీ హరియాణా క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు కూడా సీఎం చెప్పారు. అనంతరం భారీ జన సందోహం తోడు రాగా సాక్షి తన స్వగ్రామం మోఖ్రాకు వెళ్లింది. మోఖ్రాలో స్పోర్ట్స్ నర్సరీ, స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి... సాక్షి ఇద్దరు కోచ్లకు చెరో రూ. 10 లక్షల పురస్కారాన్ని ప్రకటించారు. కర్ణాటక సింధు! సాక్షి సత్కార కార్యక్రమంలో మాట్లాడే సమయంలో సీఎం ఖట్టర్ తడబడ్డారు. ముందుగా సాక్షి ఘనతల గురించి గొప్పగా చెప్పిన ఆయన ఇద్దరు అమ్మాయిలు దేశ గౌరవం నిలబెట్టారని ప్రశంసించారు. అయితే సింధు పేరు గుర్తుకు రాక పక్కవారిని ‘ఆ రెండో అమ్మాయి పేరు ఏమిటి’ అని అడిగి తెలుసుకున్నారు. దానితో ఆగిపోకుండా కర్ణాటకకు చెందిన సింధు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చాలా గర్వంగా ఉంది... స్వదేశంలో తనకు లభించిన స్వాగతం పట్ల సాక్షి మలిక్ అమితానందం వ్యక్తం చేసింది. తన 12 ఏళ్ల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆమె ఉద్వేగంగా చెప్పింది. ‘ఇంత మంది నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు అండగా నిలిచిన, ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. ఒలింపిక్ పతకం గెలవాలనే నా కల నిజమైంది. ముగింపు ఉత్సవంలో పతాకధారి కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని 23 ఏళ్ల సాక్షి చెప్పింది. అమ్మాయికి కుస్తీ ఎందుకు అంటూ తమను చాలా మంది విమర్శించారని, ఇప్పుడు ఆమె ఘనత చూసి గర్విస్తున్నామని ఆమె తల్లిదండ్రులు సుఖ్బీర్, సుదేశ్ చెప్పారు. -
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
ఎన్ఏసీ జ్యూవెలరీ ఎండీ అనంత పద్మనాభన్ విజయవాడ స్పోర్ట్స్ : రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి సింధుకు సిగ్నేచర్ నెక్పీస్ను బహూకరిస్తామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లోనే ఉమెన్ ఫ్రీస్టయిల్(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్కు రూ.3లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లను అందిస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకే తాము వీరికి ఆభరణాలు బహూకరించి గౌరవిస్తున్నట్లు వివరించారు. -
ఒలింపిక్స్లో భారతే చెత్త దేశం!
120 కోట్ల జనాభా. ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీ. అయినా విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్లో భారత్కు దక్కిన పతకాలు రెండే. ఈ రెండు పతకాలైనా దక్కినందుకు దేశంలో సంబురాలు. మరీ ఒలింపిక్స్లో మన ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటోందంటే.. చాలానే నోరు పారేసుకుంటోంది. 'రియో ఒలింపిక్స్లో భారత్దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్లో దుమారం రేపాడు. '120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్ చేసిన ట్వీట్పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు. మరోవైపు 'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా గెలువకుండా ఇంటిముఖం పట్టిన మన దాయాది పాకిస్థాన్ను అసలు లెక్కలోకే రాదంటూ ఈ పత్రిక ఏకిపారేసింది. -
సాక్షి మాలిక్ కు ఘన స్వాగతం
-
రెజ్లర్ సాక్షి రాక నేడే...
రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ నేడు (బుధవారం) భారత్కు రానుంది. తెల్లవారుజాము 3.50 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అడుగుపెట్టనున్న సాక్షికి హర్యానా రాష్ట్ర ఐదుగురు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ‘నా దేశానికి, నా స్వంత ఇంటికి రాబోతున్నాను’ అని సాక్షి ట్వీట్ చేసింది. రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి ఆమెతో పాటు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వెళ్లనున్నారు. అక్కడ భారీ జనసమూహం మధ్య ఆమెకు సన్మానం చేయనున్నారు. కాంస్యం సాధించిన తనకు రూ.2.5 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరిన్ని విజయాలు సాధిస్తా: సింధు
బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం * కోచ్ పుల్లెల గోపీచంద్కు కూడా * నగదు ప్రోత్సాహకాలు అందజేత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించినప్పటికీ... ఇప్పట్లో తనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదని... భవిష్యత్లో దేశానికి మరిన్ని విజయాలు, పతకాలు అందించాలనే లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం తన కోచ్ పుల్లెల గోపీచంద్, తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో కలిసి విజయవాడకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం, ఇంత మంది నాకోసం వస్తారని ఎన్నడూ ఊహించలేదు. మా తాతగారిది ఈ ఊరే. చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారీ అప్పట్లో గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూశాను. ఆయన ఆటతో స్ఫూర్తి పొందాను. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి మీ ప్రార్థనలు, కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులే ప్రధాన కారణం’ అని సింధు వ్యాఖ్యానించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింధు కలిసి కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం సింధుతోపాటు గోపీచంద్, శ్రీకాంత్, చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి, ధ్యాన్చంద్ అవార్డుకు ఎంపికైన మాజీ అథ్లెట్ సత్తి గీతను సన్మానించారు. అనంతరం రాత్రి కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవంలో పాల్గొన్న సింధు, గోపీచంద్లతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్లకు చంద్రబాబు చెక్లు అందజేశారు. సింధుకు రూ. 3 కోట్లు... వెయ్యి గజాల స్థలం పత్రాలు... గోపీచంద్కు రూ. 50 లక్షలు... శ్రీకాంత్కు రూ. 25 లక్షలు అందజేశారు. ఏసీఏ నజరానా రూ. 25 లక్షలు... రజత పతక విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నజరానా ప్రకటించింది. సింధు కు రూ.25 లక్షలు... కోచ్ గోపీచంద్కు రూ. 10 లక్షలు నజరానా ప్రకటించింది. ఏసీఏ తరఫున వీరిద్దరికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చెక్లు అందజేశారు. అంతకుముందు సింధును, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలను ఆంధ్రప్రదేశ్ క్రీడా సంఘాలు భారీ గజమాలతో సన్మానించాయి. సింధును ఆదర్శంగా తీసుకోవాలి.... క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటార నడానికి సింధునే ఆదర్శమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్థానిక విజయవాడ క్లబ్లో క్లబ్ ఆధ్వర్యంలో సింధును మంగళవారం ఘనంగా సన్మానించారు. సింధు దేశానికే గర్వకారణమన్నారు. సింధుతోపాటు ఆమె కోచ్ గోపీచంద్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, క్లబ్ ప్రతినిధులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు తదితరులు పాల్గొన్నారు. రూ. 50 లక్షల విలువ చేసే స్థలం...: ఫ్యూచరాల్ హోమ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సింధుకు రూ. 50 లక్షలు విలువచేసే స్థలాన్ని బహూకరించింది. విజయవాడ క్లబ్లో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో సంస్థ ఎండీ చింతా రవికుమార్ స్థల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. మల్లీశ్వరి సన్మానంతో స్ఫూర్తి పొందా: కోచ్ గోపీచంద్ సిడ్నీ ఒలింపిక్స్లో (2000లో) ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించినప్పుడు ఆనాడు ప్రభుత్వం చేసిన సన్మానంతోనే తాను స్ఫూర్తి పొందినట్లు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు విజయోత్సవ సభలో గోపీచంద్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆనాడు కరణం మల్లీశ్వరికి ఎల్బీ స్టేడియంలో చేసిన సన్మాన కార్యక్రమంలో గ్యాలరీలో ఒకరిగా కూర్చొన్నానని తెలిపాడు. తాను కూడా ఎప్పటికైనా ఇలాంటి సన్మానం చేయించుకోవాలని కలలు కన్నట్లు తెలిపాడు. ఆ కలను సాకారం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్లో చాంపియన్గా నిలిచాక సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకున్నాను. అలాగే ఈ సన్మాన కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలన్నాడు. సింధు ఒలింపిక్స్లో పతకం సాధించడంతో ఆమెతోపాటు తనకు కూడా సన్మానం చేయడం గర్వంగా అనిపిస్తోందన్నాడు. -
అథ్లెట్ జైషా ఆరోపణలపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో మారథాన్ అథ్లెట్ ఓపీ జైషాకు రేసులో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని ఘటనపై కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కేడియా, డెరైక్టర్ వివేక్ నారాయణ్లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. వారం రోజుల్లో వీరు నివేదిక అందించాల్సి ఉంది. ఒలింపిక్స్లో జరిగిన మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్న ఓపీ జైషాకు కనీసం మంచినీళ్లను కూడా అందుబాటులో ఉంచలేదు. సుదీర్ఘమైన ఈ పోటీ సందర్భంగా అథ్లెట్ల కోసం ప్రతీ 2.5 కి.మీ దూరంలో ఆయా దేశాలు ఆహారం, నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్తో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటాయి. కానీ భారత్ స్టాల్స్ అన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో జైషా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఓ వైపు విపరీతమైన ఎండ కాస్తుండగా, ఆమె దాహంతో అలమటించాల్సి వచ్చింది. చివరికి రేసు పూర్తి చేసినా డీహైడ్రేషన్కు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలింది. అయితే జైషా ఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఖండించింది. రేసుకు ముందురోజే ఆమెను కలిసి నీటి ఏర్పాట్లు చేస్తామని చెప్పగా ఆమె తిరస్కరించిందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. -
సింధు విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసి..
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సగటు అభిమాని నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరూ తెలుగుతేజాన్ని అభినందించారు. కాగా మలయాళీ అవార్డు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఫేస్బుక్లో సింధు విజయాన్ని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. 'సింధు విజయాన్ని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. శశిధరన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు వివిధ రాష్ట్రాలు, క్రీడా సంఘాలు, పలువురు వ్యక్తులు భారీ పారితోషకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం సింధు, కోచ్ గోపీచంద్లను ఘనంగా సన్మానించాయి. -
వెండికొండకు స్వాగతం
-
రూ. 810 కోట్లను ఖర్చుచేస్తే వచ్చింది 2 పతకాలు
లండన్: రియో ఒలింపిక్స్లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్లో ఇప్పుడు పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన సొమ్మెంత? అది పన్ను చెల్లింపుదారులపై ఎంత భారం పడిందన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఆ చర్చలను పక్కన పెడితే 67 పతకాలను సాధించడం కోసం బ్రిటన్ ఎంత ఖర్చు పెట్టింది, కేవలం రెండు పతకాలతోనే సంతృప్తి పడాల్సి వచ్చిన భారత్ ఎంత ఖర్చు పెట్టిందో బేరీజు వేసి చూద్దాం. ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని, అంటే మొత్తం 2,747 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ చెబుతుండగా, సగటున 46 కోట్లును, అంటే 3, 082 కోట్ల రూపాయలను బ్రిటన్ ఖర్చు పెట్టిందని భారత్ మాజీ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశారు. బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగా ఈ నాలుగేళ్లలో ఒలింపిక్స్ ప్రిమరేషన్స్ కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు భారత దేశం ఒలింపిక్స్ శిక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందన్న ప్రశ్న తలెత్తక మానదు. నాలుగేళ్ల కాలంలో శిక్షణా సెంటర్లు, కోచ్లు, ఇతర మౌలిక సౌకర్యాలపై భారత్ 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే మొత్తం దాదాపు 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. బ్రిటన్ 2,380 కోట్ల రూపాయలను ఖర్చుచేసి 67 మెడళ్లను సాధించగా, అందులో మూడో వంతకుపైగా డబ్బును ఖర్చుపెట్టి రెండు పతకాలను భారత్ సాధించింది. బ్రిటన్ పెట్టిన ఖర్చునే మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే భారత్కు 23 పతకాలు రావల్సి ఉండింది. 67 పతకాలు సాధించి ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ బ్రిటన్ పౌరులు సంతృప్తి చెందడం లేదు. ఆ భారం పన్ను చెల్లింపుదారులపై ఎంత పడిందో తేల్చాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో పన్ను చెల్లింపుదారులపై ఏడాదికి 1,090 రూపాయలు పడిందని బ్రిటన్కు చెందిన స్పోర్ట్ ఇండస్ట్రీ రిసెర్చ్ సెంటర్ తేల్చింది. వచ్చిన మెడళ్లతో పోలిస్తే చేసిన ఖర్చుకు గిట్టుబాటు దక్కినట్లేనని యూకే స్పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజ్ నికోల్ వ్యాఖ్యానించారు. ఏడాదికి టాక్స్ పేయర్పై పడుతున్న పన్ను భారాన్ని ఒక్క రోజుకు లెక్కిస్తే లండన్లో ఓ ప్రయాణికుడు ఓ బస్సు టిక్కెట్కు చెల్లించే మొత్తం కాదని మాజీ వింటర్ ఒలింపిక్స్ అథ్లెట్ జేమీ ఫాక్స్ వ్యాఖ్యానించారు. -
ఏపీలో పీవీ సింధు, గోపిచంద్కు ఘనస్వాగతం
కృష్ణా: రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్కు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటిపుల్లారావు, నారాయణ, ఎంపీలు మురళీమోహన్, కేశినేని నాని, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర పొడువైన జాతీయ పతాకంతో పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు చిన్నారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింధును సన్మానించనున్నారు. అందులోనూ ఈ రోజు కృష్ణా పుష్కరాలు ముగియనుండటంతో సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమానికి పీవీ సింధు హాజరుకానుంది. -
సింధుకు శుభాకాంక్షలు తెలుపుతూ శాండ్ ఆర్ట్
-
సింధోత్సవం అదిరింది
-
నేడు విజయవాడకు సింధు
ఇందిరాగాంధీ స్టేడియంలో సన్మాన కార్యక్రమం విజయవాడ/గాంధీనగర్: రియో ఒలింపిక్స్లో రజత పతక విజేత పీవీ సింధు మంగళవారం విజయవాడకు రానున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఆమెను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పాల్గొంటారు. సింధు రాక సందర్భంగా విజయవాడలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సింధుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 1,000 గజాల స్థలం, రూ.3 కోట్ల నగదు, గ్రూపు-1 ఉద్యోగం నజరానాగా ప్రకటించిన విషయం తెలిసిందే. సన్మాన కార్యక్రమంలో సీఎం అధికారికంగా వీటిని ప్రకటించనున్నారు. రియో నుంచి సోమవారం హైదరాబాద్కు చేరుకున్న సింధును మంగళవారం విజయవాడ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించింది. మరోవైపు కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలోనూ పీవీ సింధు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిత్యహారతికి ముందు పవిత్ర సంగమం వద్ద సింధుకు చిరు సత్కారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ తెలిపారు. -
సింధోత్సవం అదిరింది
భారత బ్యాడ్మింటన్ స్టార్కు జన నీరాజనం సత్కారాలు, అభినందనల వెల్లువ రోడ్ల వెంట బారులు తీరిన వేలాది మంది జనం... పసివారి నుంచి పండు ముదుసలి వరకు అందరి నోటా ఒకటే జపం... జాతీయ పతాకం చేతబూని జయజయధ్వానాలు చేస్తున్న అభిమానం... ఇందులో బ్యాడ్మింటన్ను ఇష్టపడేవారు ఉన్నారు, ఆట గురించి తెలియని వారూ ఉన్నారు. కానీ అందరిలోనూ ఒకటే భావన... ‘మన అమ్మాయి’ దేశ గౌరవం నిలబెట్టింది. ఒలింపిక్స్లో భారత కీర్తి పతకాన్ని ఎగురవేసిన తెలుగమ్మాయికి ‘జయహో సింధు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆపై వరుస సత్కారాలు, సన్మానాలతో సోమవారం హైదరాబాద్ నగరం సింధు జపంతో ఊగిపోయింది. హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగతం పలికింది. రియో నుంచి కోచ్ గోపీచంద్తో కలిసి సింధు సోమవారం నగరానికి చేరుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో పౌర సన్మానంతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు. దారి పొడవునా హుషారు సింధు సొంతగడ్డకు రానున్న వార్త తెలియడంతో సోమవారం ఉదయం నుంచే శంషాబాద్ విమానాశ్రయం మొదలు ర్యాలీ సాగిన మార్గంలో సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకున్న సింధుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు ఇతర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర పర్యాటక శాఖనుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘బెస్ట్’ ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర ప్రారంభమైంది. సింధు వెంట కోచ్ గోపీచంద్, ఫిజియో కిరణ్ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాలు దాటి శంషాబాద్ గ్రామంలోకి ప్రవేశించే వరకు ర్యాలీ వేగంగా సాగిపోయింది. విద్యార్థుల స్వాగతం ర్యాలీ కోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి స్టేడియం వరకు భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు పెట్టారు. ర్యాలీ సాగిన మార్గంలో గగన్ పహాడ్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, అత్తాపూర్, టోలీచౌకి, దర్గా పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దారి పొడవునా నిలబడి సింధుకు ఘన స్వాగతం పలికారు. చేతుల్లో జాతీయ జెండాలతో చిన్నారులు కంగ్రాట్స్ చెప్పడం ఆకట్టుకుంది. వీరికి ప్రతిస్పందనగా థ్యాంక్స్ చెబుతూ తన రజత పతకాన్ని ప్రదర్శిస్తూ సింధు ముందుకు సాగిపోయింది. మొత్తం మార్గంలో స్వాగతం పలికేందుకు పదికి పైగా చోట్ల ప్రత్యేక వేదికలు నిర్మించారు. పీవీ ఎక్స్ప్రెస్ వే పైనుంచి కూడా కొన్ని చోట్ల బస్సుపై పూల వర్షం కురియడంతో సింధు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి రావడం, ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న సమయంకంటే ర్యాలీ ఎక్కువ సేపు సాగింది. దేశానికి సింధు గర్వకారణం: నరసింహన్ హైదరాబాద్: తల్లి, తండ్రి, గురువు, దైవ శక్తుల సమష్టి దీవెనలతో పీవీ సింధు దేశ పేరుప్రతిష్టలు పెంచిందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ఆమె విజయాలను చూసి దేశం గర్వపడుతోందన్నారు. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు తన కుటుంబసభ్యులు, కోచ్ గోపీచంద్తో కలిసి సోమవారం గవర్నర్ను కలిసింది. రాజ్భవన్ సిబ్బంది వీరికి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... సింధు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం అన్నారు. ఆమె పతకం గెలుస్తుందని గోపీచంద్ గతంలో తనతో చెప్పారని, బహుశా ఆయనకు జ్యోతిష్యం తెలిసి ఉండవచ్చని ఆయన చలోక్తులు విసిరారు. గవర్నర్కు పతకాన్ని చూపించిన సింధు, తన విజయానికి దేవుడు సహకరించాడని చెప్పింది. తన అకాడమీ నిర్వహణలో అనేక సందర్భాల్లో సహకరించిన గవర్నర్కు ఈ సందర్భంగా గోపీచంద్ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం సింధు, గోపీలకు జ్ఞాపికలు అందించిన గవర్నర్... అకాడమీ అభివృద్ధి కోసం రూ. 2 లక్షలు ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ముఖ్యకార్యదర్శి హర్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరు.. ఊరేగింది
మన సింధు సిటీకి వచ్చింది...ఉత్సాహం ఉరకలేసింది..ఊరు ఊరంతా ఊరేగింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి...ప్రశంసలందుకొన్న పీవీ సింధును భాగ్యనగరం ఘనంగా స్వాగతించింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జనం జేజేలు పలికారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో..మరికాసేపు గుర్రపు బగ్గీపై ఊరేగుతూ..పూలవర్షంలో తడుస్తూ..అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ ఆమె గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంది. -
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
-
ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం
సంతోష సమయాల్లో విషాదాన్ని ఎవ్వరూ కోరుకోరు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను జాతి ఘనంగా సన్మానించుకుంటున్న రోజే.. అదే ఒలింపిక్స్ లో పాల్గొని.. కనీసం గుక్కెడు మంచినీళ్లకు దొరక్క తీవ్ర అస్వస్థతకు గురైన అథ్లెట్ ఓ.పి. జైశా విషాదగాథ వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాలివి.. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన జైశా.. తనకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కులేకుండా పోయిందని మీడియాకు తెలిపింది. 42 కిలోమీటర్ల ర్యాలీలో ప్రతి 8 కిలోమీటర్లకు ఒకచోట నిర్వాహకులు ఏర్పాటుచేసిన వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఇవి కాకుండా అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న దేశాలు సొంతగా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒక చోట రన్నర్లకు మంచినీళ్లు అందించే వీలుంటుంది. 'గొంతు తడారిపోతున్నా పరుగు ఆపలేదు. ఎక్కడన్నా త్రివర్ణ పతాకం కనబడకపోదా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశా. మన జెండా పట్టుకుని నాకు నీళ్లిచ్చేవాళ్లు ఎక్కడా కనబడలేదు. దీంతో 8 కిలోమీటర్లకు ఒకసారి ఒలింపిక్ నిర్వహకులు ఏర్పాటుచేసిన నీళ్ల మాత్రమే తాగాల్సివచ్చింది'అని విలపించింది జైశా. 157 మంది రన్నర్లు పాల్గొన్న మారథాన్ లో 89 స్థానంలో రేసు పూర్తిచేసిన జైశా.. ఎండ్ లైన్ దాటగానే కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆమెను తాత్కాలిక క్లినిక్ కు తరలించారు. ఆమె అస్వస్థతకు గురైన సంగతి కనీసం మనవాళ్లకు తెలియదట! దాదాపు మూడు గంటల తర్వాతగానీ ఆసుపత్రికి చేరుకున్న భారత అధికారులు జైశాను స్వస్థలం (కేరళ)కు పంపించే ఏర్పాటుచేశారు. అయితే బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న జైశా మరీ నీరంగా కనిపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 'ఇది నాకు రెండో జన్మలాంటింది. నీళ్లు తాగకుండా మారథాన్ పరుగెత్తడం చావును కొనితెచ్చుకున్నట్లే. కానీ ఏం చేస్తా! నిజానికి నేను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ని. కోచ్ బలవంతం మేరకు మారథాన్ లో పరుగెత్తాల్సి వచ్చింది'అని జైశా చెప్పింది. ఆమెతో పాటు లాంగ్ డిస్టెన్స్ పోటీల్లో పాల్గొన్న మరో అథ్లెట్ సుధా సింగ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు జికా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్న డాక్టర్లు ఆమేరకు నమూనాలను పరీక్షిస్తున్నారు. ఫలితం తెలియాల్సిఉంది. వీళ్లిద్దరే కాక భారత్ తరఫున ప్రాతిథ్యం వహించిన ఎంతో మంది అథ్లెట్లు, క్రీడాకారులు గాయాలపాలయ్యారు. కాస్తోకూస్తో పేరు, డబ్బున్నవాళ్లు సర్జరీలు చేయించుకుంటున్నారు కానీ జైశా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఈ వ్యవహారంపై క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. అథ్లెట్ల అస్వస్థతకు సంబంధించిన విషయాలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) పర్యవేక్షిస్తుందని అన్నారు. జైశా విషయంలో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. -
రియోలో మనకు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు బ్యాడ్మింటన్ లో రజత పతకం, హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్కు రెజ్లింగ్లో కాంస్యం వచ్చినందుకు మనమంతా ఆనందిస్తున్నాం. హర్షిస్తున్నాం. అది సరే, రియో ఒలింపిక్స్పై మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? ఎంత మంది క్రీడాకారులను పంపించాం? ఎన్ని పతకాలను సాధించాం? ఆశించిన స్థాయిలో రాణించామా, లేదా ? లేకపోతే ఎందుకు ? అన్న అంశాలను ఇప్పడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియో ఒలింపిక్స్కు భారత్ నుంచి దాదాపు వంద మంది క్రీడాకారుల బృందాన్ని పంపించినప్పుడు మనవాళ్లు దాదాపు పది నుంచి పన్నెండు పతకాలను సాధించుకొస్తారని మీడియా ప్రచారం చేసింది. మనకు బీజింగ్ ఒలింపిక్స్లో మూడు, లండన్ ఒలింపిక్స్లో ఆరు పతకాలు రాగా ఈసారి కచ్చితంగా రెండంకెల్లో పతకాలు వస్తాయని, 12 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత మే నెలలో నాటి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఎప్పటికప్పుడు క్రీడాకారుల ప్రతిభా పాటవాలను అంచనా వేస్తూ వచ్చిన భారతీయ క్రీడల సంఘం (ఎస్ఏఐ) 12 నుంచి 19 పతకాలు వస్తాయని అంచనా వేసింది. మరి జరిగిందేమిటీ? కేవలం రెండు పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఆ....అమెరికా లాంటి దేశాలెక్కడా, మన దేశం ఎక్కడ? అక్కడ క్రీడలను ప్రోత్సహిస్తారు, క్రీడా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక్క పతకం రావడానికి సరాసరి 46 కోట్ల రూపాయల చొప్పున క్రీడాకారులపై ఖర్చు పెడతారని అభినవ్ భింద్రా లాంటి వారే కామెంట్ చేశారు. ఆ స్థాయిలో భారత్లో క్రీడా సౌకర్యాలు లేవని, నిధులు లేవని చెబుతారు. వాస్తవానికి ఇది అర్ధ సత్యమే. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఆ ఖర్చుకు వస్తున్న ఫలితాలేమిటో, అందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో అన్న అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించాల్సిందే. కానీ ఏ క్రీడల్లో మనం రాణించగలం, ఎంత వరకు ప్రపంచ స్థాయిని అందుకోగలం? ముఖ్యంగా ఒలింపిక్స్లో మనకు మెడల్స్ దక్కాలంటే మనం ఏ ఆటలపైన ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలి? అన్న అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరం. భారతీయులు ఏ ఆటల్లో రాణిస్తున్నారో, వాటి మీదనే దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్లో ఆర్చరి, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ క్రీడాకారులు రాణి స్తున్నారు. వాటిలోనే వారిని ప్రోత్సహించేందుకు నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా 2014-2015 సంవత్సరానికి భారత ప్రభుత్వం టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్ విభాగాలకన్నా క్వాష్, యాటింగ్, వాలీబాల్ క్రీడలకు ఎక్కువ నిధులను కేటాయించింది. అమెరికా జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ మీద, దక్షిణ కొరియా ఆర్చరీ మీద, బ్రిటన్ సైక్లింగ్ మీద, చైనా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మీద, బెల్జియం హాకీ మీద, జర్మనీ ఫుట్బాల్ మీద దృష్టిని కేంద్రీకరించి, ఆ క్రీడల్లో రాణించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. మనం దేశం కూడా టార్గెట్ లక్ష్యంగానే కృషి చేయాలి. అభినవ్ భింద్రా, గగన్ నారంగ్, రాజ్యవర్ధన రాథోర్, మైఖేల్ ఫెరీరా, గీత్ సేథి, పంకజ్ అద్వానీ లాంటి క్రీడాకారుల అనుభవాలను ఉపయోగించుకోవాలి. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులపై కాసుల వర్షం కురిపించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఎవరికివారు భుజాలు చరచుకుంటే సరిపోదు. ఇచ్చే కాసులకు కూడా క్రీడలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారిని బాధ్యులను చేయాలి. క్రీడాకారులకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కన్నా క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల రాణింపునకు ఎక్కువ నిధులను ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు క్రీడా విభాగాల అధికారులను బాధ్యుల్ని చేయాలి. అంతవరకు ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం రాణించలేం. -
పీవీ సింధు, సాక్షిలకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు, కాంస్యపతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ కు సముచిత గౌరవం దక్కింది. సింధు, సాక్షిలతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ లకు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం నలుగురు క్రీడాకారులకు ఈ అవార్డును ప్రకటించింది. సింధు ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకుంది. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా ఆమె రికార్డు నెలకొల్పింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె, అథ్లెట్ లలితా బాబర్, శివ థాపా, అపూర్వి చండీలా సహా మొత్తం 15 మందికి అర్జున అవార్డులను ప్రకటించారు. ఆరుగురుకి ద్రోణాచార్య అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగువ్యక్తి నాగపురి రమేష్ కు ఈ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలు: ఖేల్ రత్న: పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్ ద్రోణాచార్య: దీపా కోచ్ విశ్వేశ్వర్ నంది, నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్), సాగర్ మల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్) ధ్యాన్ చంద్ అవార్డు: రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్), సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వాన్ ధంగ్ ధంగ్ (హాకీ అర్జున అవార్డు: రహానె (క్రికెటర్), రజిత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), శివథాప (బాక్సింగ్), రాణి (హాకీ), విఘ్నేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్), సుబ్రతా పాల్ (ఫుట్ బాల్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా, సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్) -
రియోలో పరాభవ భారతం
-
రియో ముగింపు వేడుకలు
-
బ్యాడ్మింటన్ ఆరోగ్యానికి విటమిన్
శారీరక ఉల్లాసంతో పాటు మానసిక వినోదానికీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల క్రీడలున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ వయసుతో సంబంధం లేకుండా ఆడే ఆట. చిన్నతనం నుంచే ఈ ఆటను పిల్లలకు నేర్పిస్తుంటారు. దీంతో శారీరకంగానే, మానసికంగా చురుగ్గా ఉండొచ్చు. భారతీయులకు గత రెండు దశాబ్దాల కిందట బ్యాడ్మింటన్తో అంతగా పరిచయం లేదు. కానీ ఇటీవల కాలంలో యావత్ దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి చూసేటట్టు చేసింది మన తెలుగు క్రీడాకారిణీ పీవీ సింధు. రియో ఒలింపిక్స్లో వెండి పతకం సాధించి తన సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ఆటతో ప్రయోజనాలు తెలుసుకుందాం! - సాక్షి, స్కూల్ ఎడిషన్ సాధారణంగా ఆటలన్నీ మొదట్లో వినోదం కోసం ఆవిర్భవించినవే. అనంతరం శారీరక వ్యాయామంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో బ్యాడ్మింటన్ మూలాలను బ్రిటీష్ ఇండియాలో గమనించవచ్చు. బ్రిటిష్ వారు ఈ క్రీడను భారతదేశంలో ఆడినట్లు పలు ఆధారాలు ఉన్నాయి. సైనికుల శిక్షణలో భాగంగా బ్యాడ్మింటన్ను నేర్పించేవారు. దీంతో శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయం నాటి నుంచే ఉంది. తదనంతర కాలంలో బ్యాడ్మింటన్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ఆడే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఇది వినోదంతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను అందిస్తుంది. - సాక్షి, స్కూల్ ఎడిషన్ బరువు తగ్గొచ్చు బ్యాడ్మింటన్ ఆడేవారిలో గంటకు 480 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇంత ఎక్కువ మొత్తం శక్తి ఉపయోగపడేది కేవలం బ్యాడ్మింటన్లోనే. నిత్యం నిర్ధిష్ట కాలం కేటాయించి ఇంత శక్తిని ఖర్చు చేస్తే.. బ్యాడ్మింటన్ ఆటతో నెలరోజుల్లో 4 కిలోల బరువు తగ్గవచ్చు. మానవ శరీరంలో ఉన్న అన్ని కండరాలు పనిచేసేంది కూడా ఈ ఆటలోనే. పరిగెత్తేవారిలో కంటే బ్యాడ్మింటన్ ఆడే వారిలో రెట్టింపు శక్తి ఖర్చవుతుంది. కండరాల దృఢత్వం.. సాధారణంగా కండరాలు గట్టిపడాలంటే జిమ్లో డంబెల్ ఉపయోగించి వ్యాయామం చేస్తుంటాం. కాని బ్యాడ్మింటన్ క్రీడతో సులభంగా కండర సామర్థ్యం పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతి షాట్ ఒక మినీ ఫిగర్ టోనింగ్ అవుతుంది. అంటే భుజవలయం, మోచేతి వలయంలో కదలికలు పెరగడంతో కండరం గట్టిపడుతుంది. ఈ ఆటతో అలిసిపోవడంతో శరీరం కావాల్సినంత నిద్ర తీసుకుంటుంది. దీంతో నిద్ర లేమి సమస్య ఉన్నవారికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శరీరంలో అన్ని ఎముకలు బ్యాడ్మింటన్తో ధృడంగా తయారవుతాయి. శ్వాసక్రియా రేటునూ.. ఏదైన పని వేగంగా చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు సహజంగా అలసట వస్తుంది. అయితే ఈ సమయంలో శ్వాసక్రియా రేటు పెరుగుతుంది. దీంతో ఎక్కువ శక్తి వెంటనే విడుదలవుతుంది. ఈ శక్తిని తక్షణమే ఉపయోగించుకోవచ్చు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో శ్వాసక్రియా రేటు పెరిగి శక్తి వెంటనే విడుదలవుతుంది. ఇదే శక్తి వెంటనే ఉపయోగించుకోవడంతో ..ఎప్పటికప్పుడు జీవక్రియా సమస్యలు తగ్గిపోయి శరీరం చురుగ్గా పనిచేస్తుంది. గుండె పనితీరులో... స్థూలకాయుల హృదయంలోని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికి పర్యవసానంగా గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చేస్తాయి. దీనికి చికిత్స కేవలం కొవ్వు తగ్గించడమే. ప్రత్యేకంగా గుండెకు శస్త్రచికిత్స నిర్వహించి కొవ్వు తొలగించడంతో ఈ సమస్యకు పరిష్కారం. అయితే బ్యాడ్మింటన్ ఆడే వారిలో గుండె కండరాల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. నిత్యం వ్యాయామంగా ఆడేవారిలో మాత్రం పూర్తిగా కొవ్వు లేకుండా ఉండి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కండరాలు కూడా ధృడంగా ఉంటాయి. డయాబెటీస్కు ఆమడ దూరం.. ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు వ్యక్తులు ఉంటారు. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో డయాబెటీస్ వచ్చేస్తుంది. బ్యాడ్మింటన్ వ్యాయామంగా నిత్యం ఆడే వారిలో రక్తంలో షుగర్ పరిమాణం ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. దీంతో శరీరంలో సర్వరోగాలకు కారణమయ్యే డయాబెటీస్ను దూరం చేసుకోవచ్చు. రక్తంలో కేవలం షుగర్లో పరిమాణం తగ్గిస్తే ఏ ఇతర శరీరానికి నిరోధకత శక్తి పెరుగుతుంది. దీంతో కాలేయ సయస్యలను కూడా దూరం చేయవచ్చు. -
అమెరికన్లు ఇంకెంత ఎగరాలి: వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఒలింపిక్స్లో భారత ప్రదర్శన మీద సెటైర్లు వేశారు. 32 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వస్తే, 5 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయని ఆయన అన్నారు. అయితే 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశానికి మాత్రం ఒకే ఒక్క రజత పతకం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక్క రజత పతకం వచ్చినందుకే మనం 'మేరా భారత్ మహాన్' అని అరుస్తూ పైకి, కిందకు ఎగురుతుంటే.. 46 బంగారు, 37 వెండి పతకాలు వచ్చిన అమెరికన్లు ఇంకెంత ఎగరాలని ఆయన ప్రశ్నించారు. బ్రెజిల్లోని రియో డి జెనిరోలో ముగిసిన ఒలింపిక్స్లో భారత దేశం ఒక రజత పతకం, ఒక కాంస్య పతకంతో మొత్తం పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో మొత్తం 207 దేశాల తరఫున 11,544 మంది పాల్గొన్నారు. భారత దేశం నుంచి అత్యధికంగా 121 మంది పాల్గొన్నారు. A 32 crore population US wins 46 gold and a 5 crore population South Korea wins 9 gold nd a 120 crores population india wins 1 silver..Wah! — Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016 If for one silver we are jumping up and down screaming Mera Bharat Mahan. how high should be Americans jumping for 46 gold and 37 silver — Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016 -
'ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువసార్లు నిషేధిత డ్రగ్స్ టాబ్లెట్ రూపంలో నోటి ద్వారా తీసుకున్నాడని వెల్లడించింది. తనపై కుట్ర జరిగిందని ఆరోపించిన నర్సింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యాడని తెలిపింది. అతడి నుంచి సేకరించిన అన్ని నమూనాలను క్షుణ్ణంగా పరిక్షించినట్టు వెల్లడించింది. అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్టు జూన్ 25 నిర్వహించిన డోపింగ్ టెస్టులో వెల్లడైందని గుర్తు చేసింది. ఒకటి లేదా రెండు మెథాన్డీనోన్ టాబ్లెట్లు నోటి తీసుకున్నట్టు తేలిందని, దీన్ని నీటిలో కలిపి తీసుకున్నట్టు నిర్థారణ కాలేదన్నారు. అయితే తన మంచినీళ్ల సీసాలో ఎవరో నిషేధిత పదార్థాలు కలిపారని, తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని నర్సింగ్ యాదవ్ అంతకుముందుకు అన్నాడు. దీనికి ఆధారాలు సమర్పించడంలో విఫలమవడంతో అతడిపై సీఏఎస్ నాలుగేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. -
బ్రెజిల్ కు ప్రధాని మోదీ థ్యాంక్స్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ను బ్రెజిల్ చిరస్మరణీయంగా నిర్వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు బ్రెజిల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రియో ఒలింపిక్స్ ముంగిపు వేడుకలు అద్భుతంగా నిర్వహించారని మెచ్చుకున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లు అందరికీ ట్విట్టర్ ద్వారా ఆయన అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. కాగా, రియో ఒలింపిక్స్ ముగిసినట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు. Special gratitude to the host nation, Brazil for hosting people from across the world & organising a memorable #OlympicGames. — Narendra Modi (@narendramodi) 22 August 2016 -
ముగిసిన రియో ఒలింపిక్స్ .. 67 స్థానంలో భారత్
రియో డి జనీరో: పక్షం రోజుల్లో.. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, అద్భుతమైన విన్యాసాలకు వేదికగా నిలిచి.. క్రీడాభిమానులకు కన్నుల పండగ చేసిన రియో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గత 18 రోజులుగా క్రీడాభిమానులను విశేషంగా అలరించిన ఒలింపిక్స్ ఈ రోజుతో ముగిశాయి. ఈ క్రీడా పండగ ముగింపు వేడుకలను రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివిధ ఈవెంట్లలో పాల్గొన్న భారత్ రెండు పతకాలతో 67 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూనైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ నుంచి పివి సింధు బ్యాడ్మింటన్ లో రజత పతకం సాధించగా, సాక్షి మాలిక్ రెజ్లింగ్ విభాగంలో కాంస్యం సాధించింది. -
రెజ్లింగ్లో వివాదం...
రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల చివరి రోజు డ్రామా జరిగింది. ఇఖ్తియోర్ నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్), మండక్నరన్ గన్జోరిగ్ (మంగోలియా) మధ్య పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో ఈ వివాదం చోటు చేసుకుంది. నిర్ణీత సమయం పూర్తికావడానికి మూడు సెకన్లు ఉందనగా 7-6తో ఆధిక్యంలో ఉన్న గన్జోరింగ్ తన విజయం ఖాయమైందనుకొని విజయ సంబరాలు చేసుకున్నాడు. అయితే ఉజ్బెకిస్తాన్ రెజ్లింగ్ కోచ్ రివ్యూ కోరడం... వారు నవ్రుజోవ్కు రెండు పాయింట్లు ప్రదానం చేసి అతను 8-7తో గెలిచినట్లు ప్రకటించడంతో మంగోలియా రెజ్లర్ గన్జోరిగ్, అతని కోచ్లు ఆశ్చర్యపోయారు. తమకు అన్యాయం జరిగిందని మ్యాట్పైనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగోలియాకు చెందిన ఇద్దరు కోచ్లు తమ ట్రాక్ సూట్ను, బూట్లు విప్పేసి మ్యాట్పై విసిరేశారు. బౌట్ను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రిఫరీ వారిద్దరికీ రెడ్ కార్డు చూపెట్టారు. నవ్రుజోవ్ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు ఫ్రాంక్లిన్ గోమెజ్ (పోర్టోరికో), నవ్రుజోవ్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్ కూడా వివాదాస్పదమైంది. నవ్రుజోవ్కు అనుకూల ఫలితం వచ్చేలా రిఫరీలు తెమో కజారష్విలి (జార్జియా), టాంగ్ కున్ చుంగ్ (కొరియా), నొవకోస్కీ (రష్యా) వ్యవహరించారని అనుమానిస్తూ రిఫరీ కమిషన్ చైర్మన్ అంటోనియా సిల్వెస్ట్రి (జర్మనీ) ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
మో ఫరా... ‘డబుల్’ డబుల్
* 5000 మీటర్లలోనూ స్వర్ణం * ‘రియో’లో రెండో పసిడితో రికార్డు రియో డి జనీరో: సుదూరపు పరుగులో తనకు ఎదురులేదని బ్రిటన్ అథ్లెట్ మో ఫరా నిరూపించాడు. రియో ఒలింపిక్స్లో అరుదైన ‘డబుల్’ సాధించాడు. ఇప్పటికే 10 వేల మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గిన మో ఫరా... 5 వేల మీటర్లలోనూ పసిడి పతకాన్ని నెగ్గి తన సత్తా చాటుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లోనూ మో ఫరా ఈ రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. 1976లో లాసీ వీరెన్ (ఫిన్లాండ్) తర్వాత ఒలింపిక్స్లో ఈ రెండు విభాగాల్లో టైటిల్ నిలబెట్టుకున్న అథ్లెట్గా మో ఫరా గుర్తింపు పొందాడు. సోమాలియాలో పుట్టి బ్రిటన్లో స్థిరపడ్డ 33 ఏళ్ల ఫరాకు 5 వేల మీటర్ల ఫైనల్లోనూ అంతగా పోటీ ఎదురుకాలేదు. వ్యూహత్మంగా మొదట్లో నెమ్మదిగా పరిగెత్తిన ఫరా ఆ తర్వాత క్రమంగా వేగాన్ని పెంచాడు. చివరికొచ్చేసరికి తన ప్రత్యర్థులను సులభంగా వెనక్కి నెట్టి 13 నిమిషాల 03.30 సెకన్లలో గమ్యానికి చేరి విజయాన్ని దక్కించుకున్నాడు. కిప్కెమోయ్ పాల్ (అమెరికా-13ని:03.90 సెకన్లు) రజతం, హగోస్ జెబ్రివెట్ (ఇథియోపియా-13ని:04.35 సెకన్లు) కాంస్యం గెలిచారు. -
రా.. బంగారూ!
నేడే సింధు రాక అపూర్వ స్వాగతానికి ఏర్పాట్లు భరతమాత నుదుటిన పతక సింధూరం దిద్దిన తెలుగు తేజం వచ్చేస్తోంది. కోట్లాది మంది భారతీయుల కనులలో వెండి వెలుగు నింపిన మన ముద్దుబిడ్డ మరికొద్ది సేపట్లో తెలుగు గడ్డపై అడుగుపెడుతోంది. రియోలో మువ్వన్నెలు రెపరెపలాడించిన బంగారు తల్లికి ఘన స్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబయింది. ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ... అడుగడుగునా అభిమానుల జయజయధ్వానాలు... గచ్చిబౌలిలో ప్రభుత్వం చేసే ఘన సన్మానం... ఇలా సోమవారమంతా బిజీబిజీగా గడపబోతోంది. సాక్షి, హైదరాబాద్: రియో వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేసిన తెలుగు తేజం పీవీ సింధు రాక కోసం రాష్ట్రం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది! ఉభాగ్యనగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు సిటీజనులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో రజత పతకంతో సొంత గడ్డపై అడుగుపెట్టనున్న సింధు కు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్రప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు దిగనున్న సింధుకు మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి స్వాగతం పలకనున్నారు. అక్కడ్నుంచి ఆమె భారీ ర్యాలీ మధ్య గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు. ప్రధాన ఊరేగింపు జరిగే రూట్ను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ట్రాఫిక్, పోలీసు విభాగాలు పరిశీలించాయి. ఎయిర్పోర్టు సమీపంలో భారీ హోర్డింగ్లతోపాటు గగన్పహాడ్, వ్యవసాయ వర్సిటీ ప్రధాన ద్వారం, ఆరాంఘర్ చౌరస్తా, శివరాంపల్లి, ఉప్పర్పల్లి, హైదర్గూడ, అత్తాపూర్ చౌరస్తాలలో స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ఆమెపై పూల వర్షం కురిపించడంతోపాటు వేదికల పైనుంచి ప్రముఖుల ప్రసంగాలతో సింధుకు అపూర్వ స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొననున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం సింధును ఘనంగా సన్మానించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సత్కార సభ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, క్రీడలు, శాప్, సైబరాబాద్ పోలీసు అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఓపెన్టాప్ వాహనంలో ర్యాలీ సాగుతుందన్నారు. మార్గం మధ్యలో పదిహేను చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో జరిగే సింధు సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, నాయిని, తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు పాల్గొంటారు. విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు సుమారు 20 నుంచి 30 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసినట్లు కమిషనర్ వివరించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ నవీన్చంద్ తెలిపారు. -
దీపా కర్మాకర్కు తెలంగాణ సర్కారు నజరానా
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత పొందిన తొలి భారత జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్ రికార్డు సృష్టించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఒలింపిక్స్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం స్పూర్తిదాయకమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యావత్ భారతావని వారికి అండగా నిలవాలని ప్రకటనలో ఆయన సూచించారు. రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినా తృటిలో దీప కాంస్య పతకాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఆ చిన్నఆశ కూడా ఆవిరైంది
రియో ఒలింపిక్స్లో పోటీల చివరి రోజు ఆదివారం మూడో పతకం వస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ పతకం గెలుస్తాడని అంచనా వేశారు. కాగా పురుషుల రెజ్లింగ్ 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగాడు. మంగోలియా రెజ్లర్ గంజోరిగీన్ మండఖ్నారన్ చేతిలో 0-3 తేడాతో ఓడిపోయాడు. అయితే మంగోలియా రెజ్లర్ ఫైనల్కు వెళితే యోగేశ్వర్కు రెపిచేజ్ అవకాశం వస్తుందని, కనీసం కాంస్య పతకం పోరులోనైనా నిలుస్తాడన్న చిన్నఆశ కూడా ఆవిరైంది. క్వార్టర్స్లో అతను ఓడిపోవడంతో యోగేశ్వర్ పతకం ఆశలు గల్లంతయ్యాయి. గత లండన్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన ఈ హరియాణా రెజ్లర్ రెండో పతకం సాధించాలన్న కల నెరవేరలేదు. ఈ రోజు మారథాన్ పోటీలో భారత అథ్లెట్లు గోపి తనక్కల్, నితేంద్ర సింగ్, ఖేత రామ్ ఉన్నా పతకం గెలిచే అవకాశాలు చాలా తక్కువ. దీంతో అద్భుతం జరిగితే తప్ప భారత్ రియో ఒలింపిక్స్లో రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సిందే. భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం, బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. లండన్ ఒలింపిక్స్లో ఆరు పతకాలు సాధించిన భారత్.. రియోలో మరిన్ని ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంటుందని పోటీలకు ముందు అంచనా వేశారు. ఒలింపిక్స్ చరిత్రలో అతిపెద్ద భారత జట్టు ఈసారి పోటీలకు వెళ్లింది. అయితే పతకాలు గెలుస్తారనుకున్న స్టార్ క్రీడాకారులు నిరాశపరచడంతో అంచనాలు తలకిందులయ్యాయి. -
నిరాశపరిచిన యోగేశ్వర్ దత్
లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రియోలో నిరాశపరిచాడు. ఆదివారం సాయంత్రం జరిగిన 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. భారత రెజ్లర్ యోగేశ్వర్ పై 3-0 తేడాతో మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్నరన్ గంజోరిజ్ విజయాన్ని సాధించాడు. బౌట్ ప్రారంభం నుంచి పట్టుకోసం యోగేశ్వర్ ప్రయత్నించగా మంగోలియా రెజ్లర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి రౌండ్లో అతడు 1-0 తో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. రెండో రౌండ్లోనూ ఇదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి బౌట్ నెగ్గాడు. -
'భారత రెజ్లర్ స్వర్ణం నెగ్గుతాడు'
లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్దత్ పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగనున్న రెజ్లర్ యోగేశ్వర్ స్వర్ణాన్ని నెగ్గుతాడని మరో భారత రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల వీరుడు సుశీల్ కుమార్ ధీమా వ్యక్తంచేశాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ దత్ కు తన చిన్ననాటి స్నేహితుడు సుశీల్ బెస్ట్ విషెస్ చెప్పాడు. భారత్ మొత్తం అతడికి అండగా ఉంటుందన్నాడు. పతకాలను సాధించి దేశం గర్వించేలా చేసిన మహిళా అథ్లెట్లు పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, పతకం కోసం చివరివరకు పోరాడిన దీపా కర్మాకర్ రియోలో అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంతో బరిలోకి దిగక ముందురోజే వెనుదిరగాల్సి రావడంతో యోగేశ్వర్ పతకావకాశాలపై ప్రభావం చూపుతుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గోల్ఫర్ అదితికి 41వ స్థానం
రియో ఒలింపిక్స్ మహిళల గోల్ఫ్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ 41వ స్థానంలో నిలిచింది. నిర్ణీత నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత అదితి 291 పాయింట్లతో 41వ స్థానాన్ని దక్కించుకుంది. పార్క్ ఇన్బీ (దక్షిణ కొరియా-268 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... లిడియా కో (న్యూజిలాండ్-273 పాయింట్లు) రజతం, షాన్షాన్ ఫెంగ్ (చైనా-274 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
ఆఖరి ఆశ యోగేశ్వర్
రియో ఒలింపిక్స్ చివరి రోజు.. మొత్తం 12 బంగారు పతకాలకోసం పోటీలు జరగనున్నాయి. ఇందులో భారత క్రీడాకారులు రెండు ఈవెంట్లలో పాల్గొననున్నారు. లండన్ ఒలింపిక్స్లో కాంస్యపతక విజేత యోగేశ్వర్ దత్ పురుషుల రెజ్లింగ్లో 65 కిలోల ఫ్రీస్టయిల్లో ఆదివారం బరిలో దిగనున్నాడు. భారత్కు మరో పతకం వచ్చే అవకాశాలున్న ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జరుగుతుంది. మరోవైపు, ముగ్గురు భారత రన్నర్లు (నితేంద్ర సింగ్ రావత్, ఖేతా రామ్, గోపీ థోనక్ల) కూడా ఆదివారం జరిగే మారథాన్లో పాల్గొననున్నారు. -
సింధుకు జై
రియో ఒలింపిక్స్లో అసమాన ఆటతో రజత పతకాన్ని సాధించి భారతదేశ ప్రతిష్ఠతను ప్రపంచ స్థాయిలో నిలిపిన తెలుగింటి ఆడపడుచు పి.వి.సింధుకు ఇచ్ఛాపురం మండలం ధర్మపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అభినందనలు తెలిపారు. ‘సింధు జై’ అక్షరాకృతిలో శనివారం కూర్చొని సింధుపై అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్.శంకరరావు నాయుడు,పీస లోహిదాసు సింధు క్రీడా స్ఫూర్తి, ప్రతిభను కొనియాడారు. – ధర్మపురం(ఇచ్ఛాపురం రూరల్) -
పీవీ సింధు పేరు చెబితే నోరూరించే పిజ్జా ఫ్రీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ఉమెన్స్ బాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన సింధు విజయాన్ని దేశమంతా సెలెబ్రేట్ చేసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల నజరానాలు ప్రకటిస్తుండగా అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా సింధుకు, ఆమె కోచ్ గోపిచంద్కు బహుమతులు ప్రకటిస్తున్నారు. అయితే వీరందరికి భిన్నంగా పిజ్జాహట్ మాత్రం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ స్టోర్కు వచ్చి సింధు పేరు చెప్పినవారికి పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచినప్పుడు కూడా పిజ్జాహట్ ఇదే ఆఫర్ను ప్రకటించగా చాలామంది మహిళలు సాక్షి మాలిక్ పేరు చెప్పి ఫ్రీ పిజ్జాతో బయటకొచ్చారు. ఈ కొత్త ఆలోచనకు అనూహ్య స్పందన కనిపించడంతో ఇప్పుడు సింధు పేరుతో కూడా ఆఫర్ ప్రకటించింది. పిజ్జా ఫ్రీగా ఇస్తే నష్టం కదా..? అనే అనుమానం మనకు రావొచ్చు. కానీ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే కార్పొరేట్ కంపెనీలకు ఇది కూడా ఓ రకమైన ప్రచారాస్త్రమే కదా! -
సింధుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు 22వ తేదీన నగరానికి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. కాగా, సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. -
ఒలింపిక్ ప్లేయర్కు స్కూలు మెడల్..
ఒలింపిక్ గేమ్స్ అనగానే ప్రపంచమంతా వాటిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తమ దేశానికి చెందిన ఆటగాళ్లతో పాటు తమ అభిమాన ప్లేయర్స్ స్వర్ణాలు సాధిస్తారా.. లేక ఏ పతకం తీసుకోస్తారా అని ఆలోచిస్తుంటారు. ఓ ఐదేళ్ల బుడ్డోడు తన అభిమాన బాక్సర్ రియోలో జరుగుతున్న ఒలింపిక్స్లో విరోచితంగా పోరాడినా ఓటమిపాలవడాన్ని చూసి జీర్ణించులేకపోయాడు. దీంతో తన దృష్టిలో విజేత ఓడిన బాక్సర్ అని అతడికి తన తరఫున ఓ గిఫ్ట్ పంపాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల రియోలో జరిగిన 56కేజీల బాక్సింగ్ పోటీలో ఐర్లాండ్కి చెందిన మైకేల్ కొన్లన్ అనే బాక్సర్ రష్యాకు చెందిన వ్లాదిమిర్ నికిటిన్తో తలపడ్డాడు. ప్రత్యర్థిపై మైకెల్ పంచ్ల వర్షం కురిపించి రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో మైకేల్ గెలుస్తాడని అందరితో పాటు డబ్లిన్కు చెందిన ఐదేళ్ల బుడ్డోడు ఫిన్ మెక్ మనస్ అనుకున్నాడు. అయితే జడ్జీలు మాత్రం వ్లాదిమిర్ గెలిచినట్లు ప్రకటించారు. మైకెల్ తీవ్ర అసహనాన్ని వెల్లగక్కిన దృశ్యాన్ని టీవీలో చూసి బాలుడు ఫిన్ చలించిపోయాడు. బాక్సర్ మైకెల్ కు లేఖతో పాటు స్కూళ్లో తాను గెలిచిన ఓ మెడల్ పంపించాడు. 'ప్రపంచంలో నువ్వు బెస్ట్ బాక్సర్, అందుకే నువ్వే నా చాంపియన్. టీవీలో నీ మ్యాచ్ చూశాను. వాస్తవానికి నువ్వే విజేతవు అందుకే నా మెడల్ నీకు పంపుతున్నాను' అని లేఖలో చిన్నారి ఫిన్ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన బాక్సర్ మైకెల్ ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ.. 'ఐదేళ్ల బాలుడు ఫిన్ గురించి ఎవరికైనా తెలిస్తే అతడికి తాను ఓ బహుమతిని పంపిస్తానని తెలియజేయండి' అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. Very warming message from this young lad, if anyone knows who he is, could they please tell him I hve a gift for him pic.twitter.com/0SQJ63TvEr — Michael Conlan (@mickconlan11) 17 August 2016 -
'సింధు మైండ్ గేమ్ ఆడింది'
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఏకాగ్రతను దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడిందని ప్రపంచ నంబర్ వన్, స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ చెప్పింది. శుక్రవారం రాత్రి జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై 19-21, 21-12, 21-15 నెగ్గిన అనంతరం మారిన్ మీడియాతో మాట్లాడింది. ముఖ్యంగా సింధుకు తొలి గేమ్ కోల్పోయిన తర్వాత ఆటపై తన ఫోకస్ పెంచానని తెలిపింది. రియోకు ముందు 4-3 గెలుపోటములతో సింధుపై మెరుగైన రికార్డున్న మారిన్ ఫైనల్లో నెగ్గి మరోసారి ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. సింధు చాలా ఆత్మవిశ్వాసంతో గేమ్ ఆడుతూ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని దీంతో మొదట్లో కొన్ని పాయింట్లు కోల్పోయినా, రెండో, మూడో గేమ్ లలో తన మెరుగైన ఆటను ఆడినట్లు పేర్కొంది. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేలా పాయింట్ సాధించిన ప్రతిసారి గట్టిగా అరవడంపై నోరు విప్పింది. మధ్యమధ్యలో షటిల్స్ మార్చడం, గట్టిగా అరవడం తన గేమ్ ప్లాన్ లో భాగమని వెల్లడించింది. దీంతో అంపైర్లు కొన్నిసార్లు ఆమెను మందలించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అయితే సింధు మాత్రం స్థిరంగా ఒకే షటిల్ తో ఆడుతూ తన దృష్టిని ఆట నుంచి మళ్లించడానికి ప్రయత్నించి ఉండొచ్చునని మారిన్ అభిప్రాయపడింది. బెస్ట్ టీమ్ తనకు అండగా ఉందని, అందుకే తన విజయం సాధ్యమని భావించినట్లు స్వర్ణ విజేత వివరించింది. స్వర్ణం నెగ్గిన తొలి యూరోపియన్గానే కాకుండా తొలి ఆసియేతర చాంపియన్గా స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ నిలిచిన విషయం తెలిసిందే. -
సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
-
పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సింధూకు రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా సింధూకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటన చేసింది. మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికి లోనై ఓటమి చెందింది. -
సింధు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయ్!
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది పీవీ సింధు. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ గా మారిపోయింది. ఆమెకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగనున్నాయి. కానీ ఆమె అందరిలాంటి సిటీ అమ్మాయే. బాలీవుడ్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా మక్కువ. అందుకే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి. 'రుస్తుం', 'మహెంజోదారో' వంటి కొత్త హిందీ సినిమాల గురించి సింధు నన్ను చాలాసార్లు అడిగింది. తను ఇక్కడి వచ్చాక ఐస్ క్రీమ్, బిర్యానీ తినాలనుకుంటోంది' అని సింధు తండ్రి పీవీ రమణ 'ఇండియా టుడే'కు తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా తాము చర్యలు తీసుకున్నామని, ఆమె కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. -
'సైనా ఇక బ్యాగ్ సర్దుకో..!'
న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్ లో అంచనాల మేరకు ఆడలేకపోయింది. ఐదో సీడ్ క్రీడాకారిణి అయిన ఆమె లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు సింధు ఒలింపిక్స్ ఫైనల్ కు వెళ్లి రజతం సాధించుకుంది. లండన్ లో కాంస్య పతకాన్ని సాంధించిన సైనా నేహ్వాల్ పై విమర్శలు చేస్తూ, ఆమెను దెప్పిపొడుస్తూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో కామెంట్లు చేశారు. 'డియర్ సైనా.. ఇక నీ బ్యాగ్ సర్దుకో.. మేటి ఆటగాళ్లను ఎలా ఓడించాలో తెలిసిన వ్యక్తి మాకు దొరికింద'ంటూ సైనాను చిన్నబుచ్చేలా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. @NSaina dear saina...pack ur bags..we hav found someone who knows how to beat the best ones — anshul sagar (@ImAnshS6) August 18, 2016 ఈ కామెంట్ కు చాలా కూల్ గా, హుందాగా సైనా నేహ్వాల్ సమాధానమిచ్చింది. 'షూర్ థాంక్యూ. సింధు బాగా ఆడుతోంది. భారత్ బాగా ఆడుతోంది' అని బదులిచ్చింది. దీంతో సిగ్గుపడిన ఆ వ్యక్తి సైనాకు క్షమాపణలు చెప్పాడు. 'నిన్ను కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను ఇప్పటికీ నీ అభిమాని'ని అంటూ బదులిచ్చాడు. 'నో ప్రాబ్లం ఫ్రెండ్' అంటూ సైనా బదులిచ్చింది. కుడిమోకాలు గాయం సలుపుతుండటంతో దానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకోనున్నట్టు సైనా తెలిపింది. Sure thank u -
సింధుకు భారీ నజరానా
-
‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’
రియో డీ జనీరో: గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు వెండి పతకం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టులో ఆమె కదిలిన తీరు, పోరాట పటిమ నిరుపమానమని కొనియాడాడు. తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందన్నాడు. తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. సింధు మళ్లీ పుంజుకుంటుందని, ఏదోక రోజు మారిన్ ను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండో గేమ్ మొదట్లో సింధు తడబడిందని, మూడో గేమ్ కొన్ని అనవసర తప్పిదాల వల్ల సింధు మ్యాచ్ కోల్పోయిందని విశ్లేషించాడు. చిన్నవయసులోనే సింధు ఒలింపిక్ పతకం సాధించిందని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని చెప్పాడు. సింధు బాగా శ్రమిస్తుందని, భవిష్యత్ లో ఆమె అగ్రశేణి క్రీడాకారిణి అవుతుందని గోపీచంద్ అన్నాడు. -
బోల్ట్..ట్రిపుల్ ట్రిపుల్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో అభిమానులను ఉర్రూతలుగించిన బోల్ట్.. 4x 100 మీటర్ల రిలే పరుగులోనూ మరో స్వర్ణం సాధించాడు. ఇప్పటికే రియోలో 100మీ. 200 మీటర్లు వ్యక్తిగత ఈవెంట్లో బోల్ట్ పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన 4x 100 మీటర్ల రిలేను జమైకా జట్టు 37.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో దీంతో బోల్ట్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల రిలేలో పసిడి సాధించిన అథ్లెట్గా బోల్ట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో కూడా బోల్ట్ పసిడి పంట పండించిన బోల్ట్.. ఒలింపిక్స్ అపజయమే ఎరుగని ధీరుడిగా నిలిచాడు. -
‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’
-
ఓడినా...బంగారమే
-
సింధూరం.. వెండి సింగారం
-
ఓడినా...బంగారమే
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సింధుకు రజతం ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగుతేజం ఆమె ఓడితేనేమి... ఆ పోరాటానికి సలామ్.. అది స్వర్ణం కాకపోతేనేమి... ఆ అసమాన ఆటకు మేమంతా గులామ్.. ఎన్నాళ్లయింది... దేశమంతా ఒక్కటై ఒక మ్యాచ్ కోసం ఇంతగా ఎదురు చూసి.. ఎంతకాలమయింది... బ్యాడ్మింటన్ ఆటపై ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించి.. ఇదంతా సింధు మహత్యమే... ఆమె చూపించిన అద్భుతమే... రియో డి జనీరో: అత్యున్నత వేదిక... అంతిమ సమరం... బరిలో ఇద్దరు సూపర్ స్టార్స్... పాయింట్ పాయింట్ కోసం పోరాటం.. అభిమానులకు కావాల్సినంత వినోదం.. ఆఖరకు అనుభవాన్నే విజయం వరించింది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) విజేతగా అవతరించింది. భారత యువ తరంగం పూసర్ల వెంకట (పీవీ) సింధు రన్నరప్తో సంతృప్తి పడి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ పోరులో తొమ్మిదో సీడ్ సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. తడబడి...తేరుకొని... ఫైనల్ చేరే క్రమంలో ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్ల్లో వరుస గేముల్లో విజయం సాధించిన సింధుకు తుది పోరులో మాత్రం భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. మారిన్ ఎడంచేతి వాటం క్రీడాకారిణి కావడంతో సింధు వ్యూహాలు అంతగా పనిచేయలేదు. గత మూడేళ్ల కాలంలో ఎంతో పురోగతి సాధించి వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మారిన్ పూర్తి వైవిధ్యభరితంగా ఆడింది. ఒక్కోసారి సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ.... క్రాస్కోర్టు స్మాష్లు సంధిస్తూ... నెట్ వద్ద డ్రాప్ షాట్లు ఆడుతూ సింధు సత్తాకు పరీక్ష పెట్టింది. దాంతో తొలి గేమ్ ఆరంభంలో సింధు 6-11తో వెనుకబడిపోయింది. సింధు ఎంత ప్రయత్నించినా మారిన్కు ఇబ్బంది పెట్టడంలో సఫలం కాలేకపోయింది. సింధు 16-19తో వెనుకంజలో ఉన్నపుడు ఇక తొలి గేమ్ మారిన్ ఖాతాలో చేరడం ఖాయమనిపించింది. కానీ సింధు ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ను 27 నిమిషాల్లో 21-19తో కైవసం చేసుకుంది. లయ తప్పి... తొలి గేమ్ను కోల్పోయినా మారిన్లో ఏమాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదు. రెండో గేమ్ ఆరంభం నుంచే ఈ స్పెయిన్ స్టార్ దూకుడుగా ఆడింది. షటిల్ను పూర్తిగా నియంత్రిస్తూ సింధును తనకు నచ్చినట్టుగా ఆడించింది. గత మ్యాచ్ల్లో స్మాష్లతో చెలరేగిపోయిన సింధు ఈ మ్యాచ్లో మాత్రం తక్కువసార్లు ఈ అస్త్రాన్ని వాడింది. అసలు మారిన్ తన ప్రత్యర్థికి స్మాష్లు సంధించే అవకాశం ఇవ్వలేదనడం సబబుగా ఉంటుంది. మారిన్ గేర్ మార్చడంతో సింధు ఆటతీరులో లయ తప్పింది. అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లు కోల్పోయి రెండో గేమ్ను 22 నిమిషాల్లో 12-21తో చేజార్చుకుంది. హోరాహోరీ... నిర్ణాయక మూడో గేమ్లో కూడా మారినే తొలి పాయింట్ సాధించింది. అదే ఊపులో 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి స్కోరును 10-10తో సమం చేసింది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు (14-16) చేరింది. అయితే తానెందుకు నంబర్వన్గా ఉన్నానో, ప్రపంచ చాంపియన్ అయ్యానో నిరూపిస్తూ మారిన్ మళ్లీ చెలరేగింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 20-14తో విజయానికి చేరువైంది. సింధు మరో పాయింట్ సాధించినా... ఆ వెంటనే ఈ హైదరాబాద్ కొట్టిన షాట్ నెట్కు తగలడంతో మారిన్ విజయం సంబరంలో మునిగిపోయింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి యూరోపియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కోట్లాది భారతీయుల ఆశలు మోస్తూ ఒలింపిక్స్ ఫైనల్ బరిలోకి దిగిన మన మేలిమి ముత్యం సింధు మెడలో రజత మాల పడింది. స్వర్ణంపై గురి పెట్టి, సర్వం పణంగా పెట్టి సుదీర్ఘంగా పోరాడిన తెలుగు తేజం చివరకు ప్రత్యర్థికి తలవంచింది. స్టేడియం మొత్తం ‘విశ్వ సింధు పరిషత్’గా మారిపోయి మన భారత బిడ్డను అడుగడుగునా ప్రోత్సహిస్తుండగా... అలవాటైన రీతిలో అదరగొడుతూ ఆధిక్యంలో దూసుకెళ్లిన క్షణాన ‘బంగారు’ బాట కళ్ల ముందుగా కనిపించింది. అయితే అంతలోనే ఆటను మార్చేసి, అటుపై ఆఖరి వరకు అవకాశం ఇవ్వని స్పానిష్ బుల్ మన ఆశలు ఆవిరి చేసింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు రజత పతకం అందుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో వరల్డ్ నంబర్వన్ కరోలినా మారిన్ 19-21, 21-12, 21-15తో సింధును ఓడించింది. బ్యాడ్మింటన్లో గత ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా, ఇప్పుడు రజతంతో సింధు ఆ రికార్డును సవరించింది. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్లోనే వెండి వెలుగులతో సింధు చరిత్ర సృష్టించింది. 2000లో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి సింధునే కావడం విశేషం. మరో వైపు బ్యాడ్మింటన్లో ఒలింపిక్ పతకం నెగ్గిన తొలి యూరోపియన్గా మారిన్ ఘనత సాధించింది. -
మువ్వన్నెల రెపరెపలు
ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన పన్నెండు రోజులకు రియోలో భారత జెండా ఎగిరింది. కుస్తీ పోటీల్లో సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించడంతో మొదలైన మువ్వన్నెల రెపరెపలు పూసర్ల సింధు బ్యాడ్మింటన్లో ఫైనల్స్కు చేరి రజతాన్ని ఖాయం చేయడంతో నింగికి ఎగిశాయి. 1996 నుంచి ప్రతి ఒలింపిక్స్లోనూ ఒక్క పతకమైనా సాధిస్తున్న భారత్ పేరు పతకాల పట్టికలో కనిపించదేమోనని బెంగటిల్లు తున్న కోట్లాది భారతీయులలో ఇద్దరు ఆడపిల్లలు ఆనందోత్సాహాలను నింపారు. శుక్రవారం రాత్రి హోరాహోరీగా సాగిన బ్యాడ్మింటన్ ఫైనల్స్ పోటీని యావద్భా రతం ఉత్కంఠతో వీక్షించింది. ప్రపంచ నంబర్వన్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్తో జరిగిన ఫైనల్ పోటీలో అద్భుత పోరాట పటిమను కనబరచి ఓడినా, సింధు భారత దేశపు తొలి బ్యాడ్మింటన్ రజత పతాక విజేతగా నిలిచింది. క్రీడాకారులందరి కల ఒలింపిక్స్లో పాల్గొనాలనే. అర్హతను సాధించి ఆ కల నెరవేరేలా చేసుకున్న క్రీడాకారులంతా గెలుపు కోసమే సర్వశక్తులూ ఒడ్డుతారు. భారత క్రీడాకారులు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఒలింపిక్స్కు బయల్దేరే ముందు బ్యాడ్మింటన్ స్టార్ సింధుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందరి దృష్టీ సైనా నెహ్వాల్పైనే ఉంది. కష్టమైన డ్రా వల్ల సింధు నాకౌట్ దశలో ఎక్కడి వరకూ వెళుతుందోనని సందేహించారు. రెండు లీగ్ మ్యాచ్లలో తనతో పోలిస్తే బలహీన ప్రత్యర్థులతోనే ఆడినా.. ప్రి క్వార్టర్ ఫైనల్స్లో సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి, ఎనిమిదో ర్యాంకర్ తై జు యింగ్పై వరుస గేమ్లలో గెలిచింది. అయినా దాన్ని ఒక సంచలన విజయంగానే భావించారు. క్వార్టర్ ఫైనల్లో అసలు సిసలు ప్రత్యర్థి చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్పై కూడా నెగ్గడంతో అందరి దృష్టీ సిం«ధుపైనే నిలిచింది. వరుస గేమ్లలో వాంగ్పై ఆమె గెలిచిన తీరును చూస్తే సెమీస్లోనూ నెగ్గడం ఖాయమనిపించింది. ఆరో ర్యాంకర్ ఒకుహారాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో సింధు విశ్వరూపమే చూపించింది. అత్యద్భుత ప్రదర్శనతో భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. దేశానికి తొలి పతకాన్ని అందించిన సాక్షి మలిక్ భారత క్రీడారంగంలో పేరున్న క్రీడాకారిణేం కాదు. ఆమె బరిలోకి దిగేసరికి భారత్కు ఒక్క పతకమూ రాలేదు. పతకాలు సాధిస్తారనుకున్న షూటర్లు, ఆర్చర్లు, టెన్నిస్ క్రీడాకారులు విఫలమ య్యారు. ఇంత పెద్ద క్రీడా సంరంభంలో తొలిసారి పాల్గొంటున్న సాక్షి వరుసగా రెండు పోటీలలో గెలిచినా, క్వార్టర్స్లో తనకంటే చాలా బలమైన ప్రత్యర్థి, రష్యా క్రీడాకారిణి కొబ్లోవా చేతిలో ఓడింది. రెజ్లింగ్ క్వార్టర్స్లో ఓడినవారు ఎవరైనా తమపై గెలిచిన వారు కచ్చితంగా సెమీస్లో గెలవాలని కోరుకుంటారు. క్వార్టర్స్లో నెగ్గిన వారు ఫైనల్స్కు చేరితే, వారి చేతిలో ఓడినవారు రెప్చేజ్ ద్వారా కాంస్యం సాధించే అవకాశం ఉంటుంది. కొబ్లోవా ఫైనల్కు చేరడంతో ఆమె చేతిలో ఓడిన వారంతా కాంస్యం కోసం తలపడ్డారు. అలా జరిగిన రెప్చేజ్ తొలి మ్యాచ్లో అద్భుత విజయాలతో మంచి ఫామ్లో ఉన్న మంగోలియా క్రీడాకారిణి ఓర్ఖాన్పై పోటీకి దిగిన సాక్షి వెనుకబడి కూడా పుంజుకుని గెలిచింది. దీంతో సాక్షి పతకం తెస్తుందన్న ఆశలు కలిగాయి. కిర్గిజిస్తాన్ క్రీడాకారిణి తినిబెకోవాతో పోటీలో చివరి ఆరు సెకన్లలో పాయింట్ సాధిస్తేనే తప్ప గెలవలేని దశలో ఏకంగా మూడు పాయింట్లు సాధించి సాక్షి పతకంతో పాటు దేశానికి పండుగను తెచ్చింది. ఆడపిల్లలను పురిట్లోనే చంపే హరియాణాకు చెందిన ఓ అమ్మాయి కుస్తీ పోటీల్లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్రను సృష్టించింది. సాక్షి, సింధు పతకాలు సాధించడానికి ముందు రియోకు వెళ్లిన భారత క్రీడా బృందంపై చాలామంది తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా బరిలోనే ఉండి పోరాడు తున్న మన క్రీడాకారులపై ఇలా ఒత్తిడిని పెంచడం దురదృష్టకరం. ఒలింపిక్ శక్తులుగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే మన క్రీడా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితు లను వారు గుర్తించాలి. క్రీడా సంస్కృతి తక్కువగా ఉన్న మన దేశంలో ఆటలతో పిల్లల చదువులు చెడిపోతాయనే భ్రమలున్నవారే ఎక్కువ. ఆర్థిక స్తోమత ఉన్నా క్రీడలను కెరీర్గా ఎంచుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎందరున్నారు? అంతర్జాతీయ వేదికపై తలపడాల్సిన క్రీడాకారులను విశ్రాంతైనా లేకుండా ఎకానమీ క్లాస్లో కూర్చోబెట్టి, అధికారులు దర్జాగా బిజినెస్ క్లాస్లో వెళ్లే క్రీడా వ్యవస్థ మనది. సౌకర్యాల సంగతి సరే ఒలింపిక్స్ బృందంతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యుడిని సైతం పంపలేని అసమర్థతకు సిగ్గుపడాల్సింది క్రీడాకారులు కాదు, బాధ్యులైన అధికార, రాజకీయ యంత్రాంగం. ఒలింపిక్స్లో పాల్గొంటున్న మొట్టమొదటి భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వంటి క్రీడాకారులు పతకాన్ని సాధించలేకపోయినందుకు దేశానికి క్షమాపణలు చెప్పుకుంటుంటే... అతి పెద్ద క్రీడాధికార యంత్రాంగం మాత్రం ఏ బాధ్యతా వహించని దుస్థితి. నిజానికి దీప మృత్యు విన్యాసంగా పిలిచే ప్రొడునోవాను అలవోకగా చేసిన అసాధారణ క్రీడాకారిణి. భారత్లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్కు ఊపిరి పోసింది. మన క్రీడాకారులలో ఉండే తపనకు తగ్గ ప్రోత్సాహాన్ని, శిక్షణ, సదు పాయాలను కల్పించలేని అసమర్థత నిర్మూలనకు కావాల్సింది మన క్రీడాధికార వ్యవస్థ ప్రక్షాళన. అంతవరకు మనం వ్యక్తులుగా సింధు, సాక్షి వంటి క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభాపాటవాలు, పట్టుదలను చూసి గర్వించాల్సిందే తప్ప, గొప్ప క్రీడా దేశంగా తలెత్తుకు తిరగలేం. క్రికెటర్లను మాత్రమే హీరోలుగా ఆరాధించే దేశంలో మన అథ్లెట్లు 118 మంది ఒలింపిక్స్కు అర్హతను సాధించారు. అందులో కనీసం 30 మంది టాప్–10లో నిలిచారు. వారంతా స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. చిన్నతనంలోనే క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తే మరెందరో ఒలింపిక్ విజేతలు తయారవుతారు. ఏదేమైనా రియోలో భారత పతాకాన్ని ఎగరేసిన వారందరినీ అభినందిస్తూ పతక విజేతలకు జేజేలు పలు కుదాం. 2020 నాటికైనా గుర్తించదగ్గ ఒలింపిక్ శక్తిగా నిలవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేద్దాం. -
హ్యాట్సాఫ్.. సింధు
- సింధు పోరాట పటిమపై సర్వత్రా హర్షం రియో ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ప్రపంచ నంబర్ వన్ స్పెయిన్ క్రీడాకారిణి కెరొలినా మారిన్కే వణుకు పుట్టించి వెండి పతకం సాధించడం పట్ల అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. సింధు, కెరొలినా మారిన్ల మధ్య శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు ‘అనంత’లో అభిమానులు టీవీల ముందు అతక్కుపోయారు. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఏవిధంగా ఉంటుందో అదే తరహాలో అభిమానులు ఉత్కంఠకు లోనయ్యారు. ఇక జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రొజెక్టర్ ద్వారా మ్యాచ్ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. జయహో సింధు అనంతపురం స్పోర్ట్స్: రియో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీల్లో సింధు విజయం సాధించాలని పీవీకేకే ఇంజినీరింగ్ విద్యార్థులు ఆకాంక్షించారు. సింధు పేరుతో మానవహారంగా ఏర్పడి జయహో సింధు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సంతోష్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు రోల్మాడల్ యువతకు సింధు రోల్మాడల్. ఒలింపిక్స్లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫైనల్లో ఓడినా ఒలింపిక్స్లో సింధు ఆటతీరు భేష్ – డాక్టర్ జొన్నా సత్యనారాయణ, బ్యాడ్మింటన్ సంఘం సూపర్ గేమ్ ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. సింధూ మేడమ్ స్పోర్టింగ్ స్పిరిట్ సూపర్బ్. సింధు బంగారు పతకం కొడుతుందని ఆశించా. అయినా పర్వాలేదు వెండి పతకం సాధించింది. స్పెయిన్ క్రీడాకారిణి కెరొలినా బాగా ఆడింది. –జోషిత, జాతీయస్థాయి క్రీడాకారిణి స్ఫూర్తిదాయకం సింధు విజయం యువతకు స్ఫూర్తిదాయకం. యువత క్రీడల వైపు మొగ్గుచూపేలా ఆమె ఆటతీరు ఉంది. బ్యాడ్మింటన్కు మరింత ఆదరణ లభిస్తుంది. బ్యాడ్లక్ పొరపాటున బంగారు పతకం మిస్ అయ్యింది. సింధూను ఒలింపిక్ అసోసియేషన్ తరపున సన్మానిస్తాం. – మచ్చా రామలింగారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
సిల్వర్ సింధుకు జేజేలు
విజయవాడ స్పోర్ట్స్ : ‘బేటీ బచావో,...బేటీ పడావో మాత్రమే కాదు... ‘బేటీ ఖేలావో’ (ఆడపిల్లల్ని ఆడించండి) అంటూ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో తన అసమాన ప్రతిభాపాటవాలతో రజత పతక విజేతగా నిలిచిన ‘సింధు’ ఒక క్రీడా నాగరికతగా చాటిచెప్పిందని రాజధాని అమరావతి ప్రజలు కీర్తించారు. రియో ఒలింపిక్స్లో శుక్రవారం నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ను నగర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం, ట్రెండ్సెట్, పీవీఆర్ మాల్, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, పుష్కరఘాట్లు, విజయవాడ క్లబ్, టీస్టాల్స్ ఇలా దాదాపు అన్ని చోట్ల టీవీలోప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మొదటి సెట్లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. తరువాత రెండు సెట్లను సీనియర్ క్రీడాకారిణిగా, వరల్డ్ నెంబర్ వన్గా ఉన్న రెండు సార్లు ఒలింపియన్ పతక విజేతగా కరోలినా మారిన్ విజయం సాధించింది. అయినా కూడా సింధుకు అభిమానులు నీరాజనాలు పలికారు. ‘సింధు, సింధు గో గోల్డ్’ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా తెలుగుతేజానికి జేజేలు పలికారు. నగర ప్రేక్షకుల మాదిరిగానే ఎంతో ఉత్కంఠతతో ్రçపభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలోని ఎల్ఐసీ కాలనీలో సింధు మేనత్తలు శ్రీలక్ష్మి, ప్రసన్న, దుర్గాదేవితో పాటు వారి కుటుంబ సభ్యలంతా టీవీలో లైవ్ మ్యాచ్ను వీక్షించారు. సోదరుడు రమణ తండ్రికి తగ్గ తనయిగా వారు అభివర్ణించారు. స్వర్ణపతకం చేజారినా కూడా ఒకింత నిరాశ చెందినా సింధు చూపిన సత్తాకు రజత పతకం కూడా గొప్పదే అని సంతోషం వ్యక్తం చేశారు. సింధుకు చాలా భవిష్యత్తు ఉందని కనీసం మరో రెండు ఒలింపిక్స్లో సింధునే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మేనత్తలు ఆకాంక్షించారు. చిన్నారుల ర్యాలీ.. సింధు స్వర్ణపతకం సాధించాలని కోరుతూ దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ చిన్నారులు బందరు రోడ్డు నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించింది. ర్యాలీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.పట్టాభిరామ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రామ్మోహన్, డాక్టర్ ఇ.త్రిమూరి,్త క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్ను తిలకించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. క్రీడా సంఘాల అభినందల వెల్లువ రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించి కొత్త రికార్డు సృష్టించిన పీవీ సింధుకు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో శాప్ వీసీ అండ్ ఎండీ జి.రేఖారాణి, ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎంబీ సిరాజుద్దీన్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శులు చెరుకూరి సత్యనారాయణ, ఆకుల రాఘవేంద్రరావు, కేపీరావు, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రంభా ప్రసాద్, త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ఇ.సులోచన, అర్జా పాండు రంగారావు ఉన్నారు. బస్టాండ్లో ఉత్కంఠ వీక్షణం విజయవాడ(బస్స్టేçÙన్) : బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన సింధు ఆటను వీక్షించేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రెండు భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించారు. భారత్కు రెండో పతకం రావడంతో కేరింతలతో అభినందనలు తెలిపారు. -
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు
కోట్లాది భారతీయుల ఆకాంక్ష నెరవేరలేదు కానీ.. రియో ఒలింపిక్స్లో మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఫైనల్ సమరంలో భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైనా.. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది. తొలి గేమ్ ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో మారిన్ దూసుకెళ్లగా, సింధు వెనుకబడింది. ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. మారిన్ కాసేపు ఆధిక్యతను కొనసాగించినా, సింధు పోరాటపటిమతో ఆమెను నిలువరించింది. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. సింధు ప్లేస్మెంట్లు, స్మాష్లతో అదరగొట్టింది. రెండో గేమ్లో మారిన్ చెలరేగగా, సింధు జోరు తగ్గింది. ఆరంభంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యం ప్రదర్శించింది. తర్వాత సింధు, మారిన్కు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. కాగా మారిన్ వరుసగా 5 పాయింట్లు సాధించి 11-2 స్కోరుతో ముందంజ వేసింది. ఈ దశలో సింధు కాస్త జోరు పెంచడంతో స్కోరు 7-14కు చేరుకుంది. ఆనక మారిన్ను నిలువరించడంలో సింధు విఫలమైంది. స్పెయిన్ షట్లర్ అదే జోరు కొనసాగిస్తూ గేమ్ను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 1-1 గేమ్స్తో సమమైంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ మారిన్ దూకుడు ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు గెలిచి ముందంజ వేసింది. ఆ తర్వాత సింధుకు ఓ పాయింట్ రాగా, మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 6-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో సింధు పుంజుకుని వరుసగా రెండు పాయింట్లు గెలిచి మారిన్ను జోరును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. మారిన్ ఆధిక్యాన్ని 9-8కి తగ్గించిన సింధు స్కోరును 10-10తో సమం చేసింది. దీంతో ఫలితంపై ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. కాగా ఈ సమయంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ముందంజ వేసింది. తర్వాత మారిన్ను నిలువరించేందుకు సింధు శ్రమించినా ఫలితం లేకపోయింది. మారిన్ గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సింధు సాధించిన విజయం చారిత్రాత్మకమని తన ట్వీట్లో కొనియాడారు. సింధు విజయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాందీ పలికే అద్భుతమైన, స్ఫూర్తిమంతమైన విజయమని ఆయన ప్రశంసించారు. సింధు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు, కోచ్ గోపీచంద్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. Very well played @Pvsindhu1 Proud of your performance. Congrats on creating history by being the first Indian woman athlete to get a silver — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 August 2016 -
గోపిచంద్ అకాడమిలో బిగ్స్క్రీన్
మరి కొద్ద సేపట్లో జరగబోయే రియో ఒలింపిక్ బ్యాడ్మెంటన్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు యావత్ భారత దేశం ఉవ్విల్లూరుతోంది. ఈ నేపథ్యంలో పీవీ సింధూ కోచింగ్ తీసుకున్న గోపిచంద్ అకాడమిలో లైవ్ మ్యాచ్ చూడటానికి తగిన బిగ్ స్క్రీన్ను ఏర్పాట్లు చేశారు. స్వర్ణం కోసం భారీ ర్యాలీ.. విజయవాడ రియో ఒలింపిక్స్లో పీవీ సింధూ స్వర్ణం సాధించాలని కోరుతూ విజయవాడలో బ్యాడ్మెంటెన్ క్రీడాకారులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒలంపిక్స్లో సింధూ సత్తా చాలాలంటూ సింధూ ఫ్లెక్సీలతో ప్రదర్శన జరిపారు. క్రిడాభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. -
కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్
రియో ఒలింపిక్స్లో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలవడం, ఆ వెంటనే తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్కు చేరి రజతం ఖాయం చేసుకోవడంతో భారత క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పతకాలు తీసుకువస్తారని భావించిన స్టార్ క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరగడంతో నిరాశపడ్డ అభిమానులకు తాజా విజయాలు అమితానందం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల మూడ్ మారింది. దేశంలో ఎక్కడ చూసినా బ్యాడ్మింటన్ ఫీవరే. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల వరకు అందరి నోటా సింధు మాటే. శుక్రవారం సాయంత్రం జరిగే ఫైనల్లో సింధు గెలవాలన్నది అందరి ఆకాంక్ష. అభిమానులు సింధు గెలవాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్, సింధుల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఆమె విజయం కోసం దేశం యావత్తూ ప్రార్థిస్తోంది. సింధు గెలవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, ఆశీష్ చౌదరి, నందితా దాస్, మాధుర్ బండార్కర్.. సింధుకు అభినందలు తెలిపారు. కంగ్రాట్స్ సింధు.. గో ఫర్ గోల్డ్. -
సింధు తండ్రి ప్రత్యేక పూజలు
-
ఇది ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వరమే
-
'నా కలను క్రూరంగా చిదిమేశారు'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలను క్రూరంగా చిదిమేశారని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తనపై నాలుగేళ్ల నిషేధం విధించడం పట్ల అతడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. 'ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు రెండు నెలలుగా ఎంతో శ్రమించాను. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశ గౌరవాన్ని నిలబెట్టాలని నిరంతరం తపించాను. రియో ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించి పెట్టాలన్నది నా కల. బౌట్ లో దిగడానికి 12 గంటల ముందు నాపై నిషేధం విధించి నా కలను దారుణంగా చిదిమేశార'ని నర్సింగ్ వాపోయాడు. తన నిర్దోషత్వం నిరూపించుకోవడానికి చేయాల్సిదంతా చేస్తానని, పోరాటం కొనసాగిస్తానని ఒక ప్రకటనలో తెలిపాడు. నర్సింగ్ అమాయకుడని, అతడి న్యాయ పోరాటానికి అండగా ఉంటామని స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్ తెలిపింది. -
తల్లి ఒలింపిక్స్ కలను కొడుకు సాకారం చేశాడు!
రియో: రియో ఒలింపిక్స్లో దక్షిణాఫ్రికా యువ సంచలనం వాన్ నికెర్క్ స్వర్ణం సాధించాడు. ప్రతిష్టాత్మకమైన 400 మీటర్స్ రన్నింగ్లో 43.03 సెకన్ల టైంమింగ్తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పి మరీ ఈ విజయం సాధించాడు. నికెర్క్ ప్రదర్శనకు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సైతం ముగ్ధుడయ్యాడంటే నికెర్క్ ప్రదర్శన ఎంత అసాధారణమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ విజయం నికెర్క్కు అంత సులభంగా రాలేదు. దాని వెనుక అతడి తల్లి ఒడెస స్వాట్స్ బలమైన సంకల్పం ఉంది. స్వతహాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన స్వాట్స్ ఒలింపిక్స్ గురించి కలలుకన్నా.. ఆనాడు దేశంలో అధికారికంగా అమలులో ఉన్న వర్ణవివక్షత(అపార్థిడ్) మూలంగా.. కనీసం జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం కూడా దక్కలేదు. అయితే ఆమె తన కొడుకు నికెర్క్ ద్వారా ఆమె ఒలింపిక్స్ కలను సాకారం చేసుకుంది. 'నికెర్క్ నెలలు నిండకుండానే(29 వారాలకే) పుట్టడంతో డాక్టర్లు అసలు బ్రతుకుతాడో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమని తెలిపారు. బ్రతికినా అంగవైకల్యం ఏర్పడే ప్రమాదముందన్నారు' అని స్వాట్ చెప్పుకొచ్చింది. అలాంటి తన కొడుకు నేడు ప్రపంచ వేదికపై నిల్చున్నాడని సంతోషం వ్యక్తం చేసింది. విజయం సాధించిన నికెర్క్తో పాటు తల్లి స్వాట్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. -
కన్నీళ్లు పెట్టిన నర్సింగ్ కుటుంబ సభ్యులు
వారణాసి: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించడంపై అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో బరిలో దిగేముందు అతడిపై వేటు వేయడం సరికాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుట్రకు తన కుమారుడు క్రీడాజీవితం బలైందని నర్సింగ్ తల్లి బుల్నాదేవి వ్యాఖ్యానించారు. తన కొడుకును ఒలింపిక్స్ పాల్గొనకుండా చేయడంపై తనకు మాటలు రావడం లేదని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు అండగా నిలిచి, తన సోదరుడిపై నిషేధం ఎత్తివేయించాలని నర్సింగ్ సోదరి వేడుకుంది. తన సోదరుడు పోటీకి దిగితే కచ్చితంగా స్వర్ణపతకం గెలుస్తాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. డోపింగ్ వివాదంలో నర్సింగ్ యాదవ్ పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నాలుగేళ్ల నిషేధం విధించింది. కాగా, నర్సింగ్ యాదవ్ షాక్ గురయ్యాడని.. అతడు మాట్లాడే పరిస్థితిలో లేడని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు బీబీ శరణ్ తెలిపారు. సీఏఎస్ తీర్పు విన్నప్పటి నుంచి నర్సింగ్ ఏడుస్తూనే ఉన్నాడని వెల్లడించారు. -
అక్క స్వర్ణం గెలుస్తుంది
బ్యాడ్మింటన్ స్టార్ సింధు సోదరి దివ్య సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రియో ఒలింపిక్స్లో ఫైనల్స్కు చేరిన తన అక్క దేశానికి స్వర్ణపతకం సాధించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు పీవీ సింధు చెల్లెలు దివ్య తెలిపారు. ఆమె గురువారం నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంటికి వచ్చారు. సింధు మ్యాచ్ని టీవీలో ఉత్కంఠగా తిలకించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన సోదరి సింధు ఈ విజయం సాధించడానికి తమ తల్లిదండ్రులు, గోపీచంద్ ప్రోత్సాహమే కారణమని చెప్పారు. ఫైనల్లో కూడా గెలిచి దేశానికి స్వర్ణపతకం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. -
తిరుగులేని బోల్ట్
రియోడిజనీరో:జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రియోలో రెండో స్వర్ణాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు. తాజాగా జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి... మరో స్వర్ణ పతకాన్ని ఉసేన్ తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రియోలో 100 మీటర్ల పరుగులో ఉసేన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బోల్ట్.. 200 మీటర్ల రేసులో కూడా ఆద్యంత దుమ్మురేపాడు. దీంతో అతని ఖాతాలో వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్ స్వర్ణం చేరింది. తాజా ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడిని సొంతం చేసుకున్నబోల్ట్.. 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 100 మీ. ఈవెంట్ లో వరుసగా మూడో ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్లలో కూడా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రియోలో బోల్ట్ ముందు 4x 100 జట్టు రేసు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పసిడి సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయమే లేని ధీరుడిగా బోల్ట్ నిలిచిపోతాడు. -
సాక్షి మెరిసింది దేశం మురిసింది
భారత్కు తొలి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ {ఫీస్టయిల్ 58 కేజీల విభాగంలో కాంస్యం ఈ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్ ఇంత పెద్ద దేశం... ఇంత భారీ జనాభా.... అయినా ఒక్క పతకమూ లేదే...? మనసు నిండా వెలితి... 70 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని జరుపుకుంటున్నా... చిన్న దేశాల ఒడిలో వాలిన పతకాలను చూసి మనకు లేవే..? అంతులేని ఆవేదన... రోజులు గడిచిపోతున్నాయి... ఇక నాలుగు రోజులే మిగిలాయి... ఈ సారికి పతకం రాదేమో..? అని మానసికంగా సన్నద్ధమవుతున్న వేళ. అయినా సరే ఎవరో ఒకరు ఒక్క పతకమైనా తీసుకు రాకపోతారా అని ఏదో ఓ మూల చిన్న ఆశ? పతకాల పట్టికలో మన దేశం పేరును చేర్చేవాళ్లు ఎవరు..? గురువారం ఉదయం... పొద్దుటే చెల్లెలు వచ్చి రాఖీ కడుతుందని నిద్ర లేచిన భారతీయుడికి... సోదరి సాక్షి మలిక్ తెచ్చి కట్టిన పతకం చూసి ఆనంద భాష్పాలు వచ్చేసాయి... రియో నుంచి ప్రత్యేకంగా పంపిన మిఠాయి లాంటి వార్తతో నోరు తీపి అయిపోయింది.పదకొండు రోజుల ఆవేదనకు, కోట్లాది భారతీయుల ఎదురుచూపులకు, అంతు లేని నిరీక్షణకు తెరదించుతూ... మన హృదయాల్లో సంబరం నింపుతూ... మువ్వన్నెలు మురిసేలా... భారతదేశం గర్వించేలా సాక్షి దేశం మెడలో పతకహారాన్ని చేర్చింది. థ్యాంక్యూ సిస్టర్... రియో డి జనీరో: దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో రియో ఒలింపిక్స్ నుంచి తీపి కబురు వచ్చింది. 12 రోజుల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. కాంస్య పతక బౌట్లో ఒకదశలో 0-5తో వెనుకబడి ఓటమివైపు సాగుతున్న దశలో సాక్షి తన పోరాటపటిమతో అద్భుతమే చేసింది. వెంటవెంటనే 2,2,1 పాయింట్లు సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా... సాక్షిని నిలువరిస్తే బౌట్ ఆరంభంలో ఆధిపత్యం చలాయించినందుకు తనకే అనుకూల ఫలితం వస్తుందని తినిబెకోవా భావించింది. కానీ సాక్షి ఈ ఆరు సెకన్లను ఏమాత్రం వృథా చేయకుండా తినిబెకోవాను కిందకు పడేసి... 8-5తో విజయాన్ని ఖాయం చేసుకొని దేశం మొత్తం సంబరాల్లో మునిగేలా చేసింది. వెనుకబడి.. విజయాల ఒడిలోకి.. తన విభాగంలో సాక్షి గెలిచిన అన్ని బౌట్లలోనూ తొలుత వెనకబడినా గెలిచింది. జోనా మాట్సన్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో సాక్షి మొదట 0-4తో వెనుకంజ వేసి ఆ తర్వాత 5-4తో విజయాన్ని దక్కించుకుంది. మరియానా (మాల్డొవా)తో జరిగిన రెండో రౌండ్లో తొలుత 1-3తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 5-5తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్లో ఆధిపత్యం చలాయించినందుకు సాక్షిని విజేతగా ప్రకటించారు. ఒర్ఖాన్ ప్యూర్విడోర్డ్ (మంగోలియా)తో జరిగిన రెప్చేజ్ తొలి రౌండ్ బౌట్లో సాక్షి 2-3తో వెనుకబడి ఆ తర్వాత వరుసగా 11 పాయింట్లు సాధించింది. అదృష్టంతోపాటు పోరాటం సాక్షికి పతకం రావడం వెనుక కాస్త అదృష్టంతోపాటు ఆమె పోరాటం కూడా ఉంది. రెండు గ్రూప్ల నుంచి ఫైనల్కు వచ్చిన వారి చేతుల్లో ఓడిపోయిన వారందరికీ ‘రెప్చేజ్’ నిబంధన ప్రకారం మరో అవకాశం ఇస్తారు. రెప్చేజ్ రౌండ్ విజేత సెమీఫైనల్లో ఓడిన వారితో కాంస్యం కోసం ఆడతారు. క్వార్టర్ ఫైనల్లో వలేరియా (రష్యా) చేతిలో సాక్షి ఓడిపోయింది. వలేరియా ఫైనల్కు చేరడంతో సాక్షికి ‘రెప్చేజ్’ అవకాశం లభించింది. అంతకుముందు వలేరియా చేతిలో తొలి రౌండ్లో ఓడిన లుసా హెల్గా (జర్మనీ), రెండో రౌండ్లో ఓడిన ఒర్ఖాన్ రెప్చేజ్ తొలి రౌండ్లో పరస్పరం తలపడ్డారు. ఈ బౌట్లో నెగ్గిన ఒర్ఖాన్ రెండో రౌండ్లో సాక్షితో ఆడింది. ఒర్ఖాన్పై గెలిచిన సాక్షి... వలేరియా చేతిలో సెమీఫైనల్లో ఓడిన తినిబెకోవాతో కాంస్యం కోసం తలపడింది. రెప్చేజ్లో సాక్షి ప్రత్యర్థిగా ఉన్న ఒర్ఖాన్ పేరున్న రెజ్లరే. వరుసగా నాలుగు ఒలింపిక్స్లలో స్వర్ణాలు నెగ్గిన జపాన్ దిగ్గజం కవోరి ఇచో (జపాన్)పై ఇటీవల జరిగిన ఓ టోర్నీలో ఒర్ఖాన్ 10-0తో గెలిచి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు సాధించింది. ఇచో లాంటి మేటి రెజ్లర్ను ఓడించిన ఒర్ఖాన్పై సాక్షి గెలవడం నిజంగా ఆమె పోరాటపటిమకు నిదర్శనం. ఇక కాంస్య పతకపోరు ప్రత్యర్థి తినిబెకోవా ప్రస్తుత ఆసియా చాంపియన్ కావడం గమనార్హం. ప్రత్యర్థి ఎంత పేరున్న వారైనా చివరి సెకను వరకు వారిపై విజయం కోసం ప్రయత్నించి సాక్షి అనుకున్న ఫలితం సాధించింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని సాక్షి నిరూపించింది. -
మెరిసిన సింధూరం
ఒలింపిక్స్లో కొత్త చరిత్ర సృష్టించిన పీవీ విజయవాడవాసి కూతురి బిడ్డే విజయవాడ స్పోర్ట్స్: రియో ఒలింపిక్స్లో తెలుగుతేజం ‘సింధూ’రం మెరిసింది. గత లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ సెమీస్లో చైనా అమ్మాయి యిహాన్వాంగ్ చేతిలో ఓడిపోగా, ఇప్పుడు రియో ఒలింపిక్స్లో క్వార్టర్ఫైనల్లో అదే యిహాన్వాంగ్పై సింధూ విజయం సాధించి సెమీస్కు చేరింది. ఆ తరువాత జరిగిన ప్లే ఆఫ్లో సైనా చైనా అమ్మాయి జిన్వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈసారి సింధు 21–19, 21–10 తేడాతో జపాన్కు చెందిన ఒకుహారాపై విజయం సాధించి మిసై్సల్లా ఫైన ల్కు దూసుకెళ్లింది. సింధు ఆటతీరుకు నవ్యాంధ్ర క్రీడాభిమానులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా పులకించిపోయారు. రియో ఒలింపిక్స్లో పతకం కోసం ఎదురు చూసి మొహం వాచిపోయిన భారత్ క్రీడాభిమానులకు తెలుగుతేజం పీవీ సింధు స్వర్ణపతక పోరు కోసం తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఒక వేళ. స్వర్ణపతకం చేజారినా... రజత పతకమైనా ఖాయంగా దేశానికి అందించనుంది. భారతీయులు గర్వపడేలా మువ్వన్నెల జెండాను ప్రపంచ క్రీడాపటంలో రెపరెపలాడించి చెరగని ముద్ర వేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ ప్రత్యర్థి చైనా అయితే చాలు ఆమె రాకెట్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచరై అగ్ని వర్షం కురిపించినట్టుగా శివాలెత్తిపోతుందని గతేడాది జనవరి నెలాఖరులో విజయవాడలో జరిగిన 79వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఆడేందుకు విచ్చేసిన సింధు ఆట తీరు గురించి ఆనాడే ‘సాక్షి’ చెప్పింది. రియో ఒలింపిక్స్లో అదే జరిగింది. ఈ సింధూరం ఎవరో కాదు... అచ్చమైన పదహారణాల తెలుగింటి ముద్దు బిడ్డ పీవీ సింధు పిన్నవయసులోనే భారతదేశ బ్యాడ్మింటన్ స్టార్గా దూసుకొచ్చింది. ఈ సింధూరం ఎవరో కాదు...బెజవాడకు ముద్దుల మనువరాలే. ‘కలవారి సంసారం, బందిపోటు వంటి ఆనాటి హిట్ చిత్రాల నిర్మాత జైహింద్ టాకీస్ యజమాని దోనేపూడి బ్రహ్మయ్య కూతురి బిడ్డ. సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. పైగా ఇద్దరూ అర్జున అవార్డీలే. సింధు కూడా అర్జున అవార్డీనే. సింధు పూర్తిగా బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల వయసులో గోపీచంద్ అకాడమీలో చేరింది. రోజూ హైదరాబాద్ గచ్చిబౌలీలోని అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది. 2012లో సీనియర్ నేషనల్స్లో చాంపియన్ అయ్యింది. జూనియర్ ఏషియన్ చాంపియన్షిప్ ఆడింది. 2013 హైదరాబాద్లో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. 2014లో మరోసారి కాంస్య పతకం దక్కించుకుంది. 19 ఏళ్లకే అర్జున (2014లో), పద్మశ్రీ (2015లో) అందుకుంది. -
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారత షట్లర్కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ ఒకుహారపై 21-19, 21-10 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్ లను గెలుచుకుని మ్యాచ్ నెగ్గింది. సింధు అద్భుత ఆటతీరుతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తనకు అధికంగా పాయింట్లు సాధించిపెట్టే స్మాష్ షాట్లతో సింధు చెలరేగి పాయింట్లు సాధించింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు, ఒకుహార నువ్వానేనా అనేలా పోటీపడి మరీ పాయింట్లు సాధించారు. అయితే సింధు స్మాష్ లతో విరుచుకుపడి తొలి గేమ్ ను 30 నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో సింధు జోరును ఒకుహార అడ్డుకోలేకపోయింది. ఓ దశలో 10-10 స్కోరుతో ఉన్న సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ అక్కడి నుంచి ప్రత్యర్థికి మరో పాయింట్ ఇవ్వకుండా మట్టికరిపించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో స్వర్ణ పతకం పోరులో తలపడనుంది. కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించిన పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సెమీఫైనల్ పోరులో సింధు అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని వైఎస్ జగన్ తన ట్వీట్ లో కొనియాడారు. కరోలినా మారిన్తో జరిగే ఫైనల్ పోరులో సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. Congratulations @Pvsindhu1. Amazing performance. Go for gold. #Rio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016 -
నిరాశపరిచిన బబితా కుమారి
భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ పైనల్స్ లో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో గ్రీస్ రెజ్లర్ మరియా ప్రివోలరాకీ చేతిలో 5-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత మరియా 3-0తో ఆధిక్యంలో ఉండగా ఆట ముగిసేసరికి మరో రెండు పాయింట్లు సాధించింది. మరోవైపు బబితా కేవలం ఒకే పాయింట్ సాధించడంతో ఓటమి ఖరారైంది. అయితే గ్రీస్ రెజ్లర్ మరియా ఫైనల్లో ప్రవేశిస్తే బబితాకు సాక్షి మాలిక్ కు లభించినట్లుగా మరో అవకాశం దక్కుతుంది. -
భారత ఒలింపిక్ ప్లేయర్స్కు సల్మాన్ నజరానా
రియో ఒలింపిక్స్కు గుడ్ విల్ అంబాసిడర్గా ఎంపికై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు నష్టానివారణా చర్యలకు దిగాడు. పతకాలతో సంబందం లేకుండా ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన వంతుగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఒలింపిక్స్లో తొలి పతకంతో సాక్షి బోణి చేసిన కొద్ది సేపటికే సల్మాన్ ట్విట్టర్లో ఓ ప్రకటన చేశాడు. ఒలింపిక్స్లో పథకం వేటలో పాల్గొన్న ప్రతీఒక్కరికి సపోర్ట్ గా నిలవాలన్న ఆలోచనతో, తన వంతుగా లక్షా పదివేల రూపాయలను అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. సల్మాన్ స్థాయికి లక్ష రూపాయలు అన్నది చిన్న మొత్తంలా కనిపించినా.. వంద మందికి పైగా క్రీడాకారులకు ఇంత మొత్తం అందించటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ఏడాది ఒలిపింక్స్లో 118 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా.. అందరికీ కలిపి కోటి ఒక లక్షా 18 వేల రూపాయలు ఇస్తున్నాడు సల్మాన్. -
భారత్కు తొలి ఒలింపిక్ పతకం తెచ్చిందెవరో తెలుసా?
రియో ఒలింపిక్స్లో మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వతంత్ర భారతదేశంలో వ్యక్తిగత కేటగిరీలో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన కశాబా దాదాసాహెబ్ జాదవ్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు భారత హాకీజట్టుకు మాత్రమే ఒలింపిక్స్ మెడల్ రాగా, వ్యక్తిగత ఈవెంట్లో అందులోనూ రెజ్లింగ్లోనే కాంస్య పతకాన్ని సాధించిన జాదవ్ స్వతంత్ర భారతావనికే వన్నెతెచ్చారు. భారత్ లాంటి దేశంలో ఒలింపిక్స్కు ఎంపిక కావడమే కష్టం, ఈ పతకం తీసుకురావడం మరీ కష్టం. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఒలింపిక్స్ మెడల్ సాధించడమంటే మామూలు విషయం కాదు. 1948లో లండన్ ఒలింపిక్స్లో పాల్గొన్న జాదవ్, రెజ్లింగ్లో ఆరో స్థానంలో నిలిచి భారత ప్రతిష్ఠను నిలబెట్టారు. భారత్ నుంచి వ్యక్తిగత ఈవెంట్లో ఆ స్థానానికి వచ్చిన వాళ్లు అప్పటి వరకు ఎవరూ లేరు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు అకుంఠితంగా శ్రమించి 1952లో హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్లో ప్రపంచ దిగ్గజాలతో తలపడి కాంస్య పతకాన్ని సాధించారు. పేద కుటుంబానికి చెందిన జాదవ్ అనేక కష్టనష్టాలకు ఓర్చి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగారు. తండ్రి దాదాసాహెబ్ స్వయానా రెజ్లింగ్ కోచ్ కావడంతో ఐదో ఏట నుంచే జాదవ్ రెజ్లింగ్ నేర్చుకున్నారు. ఎనిమిదో ఏటనే లోకల్ ఛాంపియన్ను ఓడించడం ద్వారా గుర్తింపు పొందారు. 1952 హెల్సింకి ఒలింపిక్స్కు ఎంపికవడం కూడా ఆయనకు కష్టమైంది. అవినీతి అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు. అప్పుడు న్యాయం కోసం జాదవ్ పాటియాలా మహారాజును ఆశ్రయించారు. ఆ రాజు క్రీడాభిమాని అవడం వల్ల జాదవ్కు అండగా నిలబడి ఒలింపిక్స్ ఎంపికయ్యేలా చూశారు. జాదవ్కు హెల్సింకి ఒలింపిక్స్కు వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు. ఆయన తల్లి దండ్రులు గ్రామస్థుల నుంచి విరాళాలు వసూలు చేశారు. అయినా సరిపడ డబ్బులు రాలేదు. జాదవ్ అప్పటికి చదువుతున్న రాజారామ్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత ఇంటిని తాకట్టుపెట్టి మరీ ఆ ప్రిన్సిపాల్ డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతో ఒలింపిక్స్ వెళ్లి వచ్చిన యాదవ్, దేశంలో పలుచోట్ల రెజ్లింగ్ పోటీలను నిర్వహించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో తనకు ఆర్థిక సహాయం అందించిన ప్రిన్సిపల్ ఇంటిని తనఖా నుంచి విడిపించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా, గోలేశ్వరం గ్రామంలో , జనవరి 26, 1926లో జన్మించిన జాదవ్ స్వాతంత్య్ర సమర యోధుడు కూడా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. -
సాక్షి మాలిక్ పై కాసుల వర్షం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై కాసుల వర్షం కురుస్తోంది. మహిళల ఫ్రీస్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత విజయాలతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు ఇప్పటివరకు రూ. 3.5 కోట్ల నగదు నజరానాలు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఆమెకు రూ. 2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డు కింద రూ. 20 లక్షలు ప్రకటించింది. రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతి ఇవ్వనుంది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. 1,01,000 అందజేయనున్నారు. -
ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!
అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై సాక్షిమాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు. పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్ మెసేజ్ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేస్తున్నారు. -
'నా పన్నేండేళ్ల శ్రమ నేడు ఫలించింది'
-
క్వార్టర్లో ఓడినా.. పతకం ఎలా దక్కిందో తెలుసా?
ఒలింపిక్స్లో మరోసారి భారత రెజ్లర్కు ‘రెప్చేజ్’ వరంగా మారింది. ఇప్పటికే బీజింగ్ ఒలింపిక్స్లో సుశీల్ కుమార్, లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్ 'రెప్చేజ్' ద్వారా కాంస్య పతకాలు సాధించగా.. ముచ్చటగా మూడోసారి తాజాగా రియోలోనూ సాక్షి మాలిక్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత్కు తొలి పతకాన్ని అందించింది. ఫ్రెంచ్ పదం! 'రెప్చేజ్' అనేది ఫ్రెంచ్ పదం. దీని అర్థం 'రెండో అవకాశం' అని.. సాక్షికి ఫ్రెంచ్ తెలియదు. ఫ్రెంచ్ తెలుసుకోవాల్సిన అవసరమూ తనకు లేదు. కానీ ఉడుముపట్టు పట్టి ప్రత్యర్థులను చిత్తుచేయడమే తనకు తెలుసు. అందుకే రెజ్లింగ్లో ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి మహిళగా, రియో ఒలింపిక్స్ లో తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాక్షి మాలిక్ క్వార్టర్ ఫైనల్లో రష్యాన్ రెజ్లర్ వలెరియా కొబ్లోవా చేతిలో ఓడిపోయింది. అయినా సాక్షి పతకం మీద ఆశల వదులుకోలేదు. అదృష్టం కలిసివచ్చి ఆమె మీద గెలిచిన వాలెరీ ఫైనల్కు వెళ్లింది. దీంతో 'రెప్చేజ్' అవకాశం సాక్షికి దక్కింది. దీంతో ఆకలిగొన్న పులిలా గర్జించిన సాక్షి.. అద్భుతమైన పట్టు పట్టి భారత్ ఎదురుచూపులకు తెరదించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచి కాంస్యాన్ని సాధించింది. ఆరెంజ్ దుస్తులు ధరించి బౌట్లోకి అడుగుపెట్టిన సాక్షి.. కిర్జిస్తాన్ రెజ్లర్ ఐసులు టినీబెకోవాతో హోరాహోరీగా పోరాడింది. ఓ దశలో 0-5తో వెనుకబడినా.. పోరాటస్ఫూర్తిని విడనాడని సాక్షి.. చివరకు మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు మంగోలియా రెజ్లర్ ఒర్ఖాన్ పురెవ్డోర్జ్ను 12-3 తేడాతో చిత్తుగా ఓడించిన సాక్షి పతకంపై ఆశలు రేపింది. అర్ధరాత్రి మేల్కొని మరీ తన మ్యాచ్ను చూసిన అభిమానుల్ని ఆమె నిరాశ పరచలేదు. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత కొబ్లోవా ఫైనల్ కు వెళ్లడంతో సాక్షికి కాంస్య పతకం కోసం తలపడే అవకాశం దక్కింది. అసలు ‘రెప్చేజ్’ ఏమిటంటే... రెజ్లింగ్ ‘డ్రా’లో రెండు పార్శ్వాల నుంచి ఇద్దరు ఫైనల్స్కు చేరుకుంటారు. ఫైనల్కు చేరిన వారిద్దరి చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో వారందరికీ ‘రెప్చేజ్’ ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. గతంలో సుశీల్కుమార్, యోగేశ్వర్ దత్ విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంస్యాన్ని ఒడిసిపట్టారు. ముచ్చటగా మూడోసారి సాక్షి కూడా పతకం అందుకుంది. -
భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!
-
జయహో సాక్షి
-
థాంక్యూ సాక్షి.. శోభాడే చెంప ఛెళ్లుమనిపించావ్!
భారత్ సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రియో ఒలింపిక్స్ పతకం కోసం చకోరపక్షిలా తపిస్తున్న భారతీయుల మోముల్లో సాక్షి మాలిక్ ఆనందం నింపింది. మహిళల ఫ్రీస్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత విజయాలతో కాంస్య పతకాన్ని సాక్షి గెలుపొందింది. అర్ధరాత్రి దక్కిన ఈ కాంస్యం భారత్కు రియోలో మొట్టమొదటి పతకం. దాదాపు 12 రోజుల నిరీక్షణ తర్వాత ఇక ఆశలు అడియాసలవుతున్న తరుణంలో దక్కిన ఈ కాంస్యం భారత్కు బంగారు పతకం లభించినంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది. Hearty Congratulations to #SakshiMalik for winning a medal in women's wrestling in #Rio2016 and doing India proud #PresidentMukherjee— President of India (@RashtrapatiBhvn) 18 August 2016 భారత్కు తొలి పతకం తెచ్చిపెట్టిన సాక్షి మాలిక్కు సోషల్ మీడియా నీరాజనాలు పడుతోంది. దేశ ప్రముఖులు, సెలబ్రిటీలు మొదలు సాధారణ నెటిజన్ల వరకు సాక్షిని వేనోళ్ల కొనియాడుతూ, ఆమె ప్రతిభకు ముగ్ధులవుతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. రోహతక్కు చెందిన ఈ 23 ఏళ్ల అమ్మాయి దేశంలో మహిళా శక్తిని చాటిందని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో సాక్షి మాలిక్ యాష్ట్యాగ్ ట్రేండ్ అవుతోంది. ఇక, అసలు ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యమే శుద్ద దండగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన శోభాడేపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. శోభా డేకు ఇది చెంపదెబ్బ అని, ఆమె చెంప ఛెళ్లుమనిపించి మహిళా శక్తిని సాక్షి చాటిందని, ఆమెకు ధన్యవాదాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'దేశం కోసం పతకాలు తేలేనప్పుడు ఒలింపిక్స్కు వెళ్లడం అనవసరం. కేవలం అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్న భారత క్రీడాకారులు.. తమ తమ ప్రదర్శనలపై మాత్రం దృష్టి పెట్టడం లేద'ని రచయిత్రి శోభా డే విమర్శించిన సంగతి తెలిసిందే.Karma!!It took a woman athlete to slap Shobhaa De !!Thank you Sakshi Malik#wrestling #Rio2016— PhD in Bak*****☔ (@Atheist_Krishna) 17 August 2016 -
'నా పన్నేండేళ్ల శ్రమ నేడు ఫలించింది'
రియోడిజనిరో: తన పన్నేండళ్ల కష్టానికి ఫలితమే ఈ ఒలింపిక్స్ పతకం అని భారత్ కు రియోడిజనిరోలో జరుగుతున్న ఒలింపిక్స్లో తొలి పతకాన్ని సాధించిపెట్టిన సాక్షి మాలిక్ చెప్పింది. చివరి వరకు తాను గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని ఆమె చెప్పింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించి ఈ పతకాన్ని గెలిచి భారత్ తరుపున ఈ ఒలింపిక్స్లో తొలి పతకాన్ని సాధించింది. దీంతో రియో ఒలింపిక్స్ ఎట్టకేలకు భారత్ పతకాల ఖాతా తెరిచినట్లయింది. ఈ పతకం గెలిచిన సందర్భంగా సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా పన్నేండేళ్ల కఠోర శ్రమ నేడు ప్రతిఫలించింది. చివరి అంకం వరకు పతకం నాదే అని నా గుండె నాకు బలంగా చెప్పింది' అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడింది. భారత్కు ఒలింపిక్స్ నుంచి పతకం తీసుకొచ్చిన సాక్షి నాలుగో మహిళకాగా.. రెజ్లర్ గా తొలి మహిళ. -
రెజ్లర్ సాక్షి మాలిక్కు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో భారతకు తొలి కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్లో తొలి మహిళ రెజ్లర్ గా సాక్షి మాలిక్ భారత్కు తొలి పతకం సాధించడం భారత జాతికి ఎంతో గర్వకారణమని వైఎస్ జగన్ కొనియాడారు. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్ (మంగోలియా)పై నెగ్గిన విషయం తెలిసిందే. Hearty congrats to our first woman wrestler to win a #RioOlympics2016 medal. You've made us proud, Sakshi Malik! — YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016 -
జయహో సాక్షి
భారత్కు తొలి పతకం రియో డి జనీరో: ఎట్టకేలకు రియో ఒలింపిక్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్కు చేరుకోవడంతో భారత రెజ్లర్కు ‘రెప్చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సాక్షి.. భారత్ అభిమానుల పతక నిరీక్షణకు తెరదించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా విజయ బావుటా ఎగురేసి బ్రెజిల్ వీధుల్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది. -
భారత్ కు తొలి పతకం
రియో డి జెనీరో: ఎప్పుడెప్పుడు మన ప్లేయర్లు పతకాల ఖాతా తెరుస్తారా? అనే సగటు భారతీయుడి ఎదురుచూపుకి తెరపడింది. విమెన్స్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ పతకాల ఖాతాను తెరించింది. కిర్గిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను ఓడించి.. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు కొనసాగిన మ్యాచ్ ప్రథమార్ధమైన మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-5తో వెనుకంజలో నిలించింది. ద్వితియార్ధంలో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత చివరి 20 సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి 8-5తో విజయపతాకాన్ని ఎగురవేసింది. -
మేమిద్దరం... మాకు పది!
‘బంగారు దంపతులు’ టైటిల్ ఈ జంటకు సరిగ్గా సరిపోతుందేమో! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఒలింపిక్ స్వర్ణాలు వారి నట్టింట్లోకి వచ్చాయి మరి...‘సైకిల్’పై మొదలైన వారి ప్రేమ యాత్ర నాలుగేళ్లుగా జోరుగా సాగుతోంది. రియోలో మంగళవారం గంటన్నర వ్యవధిలో వీరిద్దరు స్వర్ణం గెలిచాక ఒలింపిక్ వెలోడ్రోమ్ మొత్తం ఈ జంటను మరిన్ని స్వర్ణాలతో వర్ధిల్లమని దీవించేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బ్రిటన్కు చెందిన లారా ట్రాట్, జేసన్ కెన్నీ ప్రణయ గాథ ఇది. సాక్షి క్రీడా విభాగం: ట్రాట్, కెన్నీ బ్రిటన్కు చెందిన అగ్రశ్రేణి సైక్లిస్ట్లు. ఆమె ఎసెక్స్నుంచి వస్తే... అతను మాంచెస్టర్ ప్రాంతానికి చెందినవాడు. 2012 లండన్ ఒలింపిక్స్ ప్రారంభమైనప్పుడు ఒకే దేశంనుంచి ఒకే క్రీడలో పాల్గొంటున్న సహచరుల్లాగే వారి పరిచయం కూడా ఉంది. అయితే ఇద్దరూ విజయాలు సాధించిన తర్వాత పరస్పర అభినందనలతో మొదలైన ప్రయాణం... గేరు మార్చుకొని వేగంగా దూసుకుపోయింది. ఇదే పోటీల్లో బీచ్వాలీబాల్ మ్యాచ్ చూస్తూ ప్రేక్షకుల మధ్య వీరిద్దరు తన్మయత్వంతో ముద్దులు పెట్టుకుంటూ తమ ప్రేమను బయటపెట్టారు. రెండేళ్ల తర్వాత క్రిస్మస్నాడు వీరు ఎంగేజ్మెంట్తో ఒకటయ్యారు. ఇద్దరి ఆట, ఆలోచన, అభిరుచులు ఒక్కటిగా సాగిన వీరు రియో ఒలింపిక్స్ సమయానికి ‘స్పెషల్ కపుల్’గా బరిలో నిలిచారు. బంగారు కాంతులు సైక్లింగ్ కీరిన్ విభాగంలో కెన్నీ, ఓమ్నియంలో ట్రాట్ స్వర్ణం గెలుచుకోవడంతో వారి సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఒకరినొకరు కౌగిలించుకొని వేదికపైనే ఆనందంతో కన్నీళ్లు పెట్టిన ఆ దృశ్యం అభిమానులందరినీ ఆనందపెట్టింది. ఆటలో లారా ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చింది. ఆరు వారాల ముందుగా, ఊపిరితిత్తుల్లో సమస్యతోనే పుట్టిన ఆమె సైక్లిస్ట్గా ఎదగడంలో చూపిన పోరాట స్ఫూర్తి అసమానం. ఒక ప్లేయర్గానే కాకుండా మేకప్, అందమైన దుస్తుల గురించే మాట్లాడే అచ్చమైన ఆడపిల్లలా ఆమె కనిపించడంతోనే తాను ప్రేమలో పడ్డట్లు కెన్నీ చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఒలింపిక్స్లో కెన్నీ ఆరు స్వర్ణాలు గెలుచుకోగా, ట్రాట్ నాలుగు స్వర్ణాలతో సత్తా చాటింది. విజయం తర్వాత ‘ఇదో అద్భుతంగా అనిపిస్తోంది. మా పిల్లలకు సైక్లింగ్ జీన్స్ వస్తాయని ఆశించడం తప్పు కాదేమో’ అని లారా ట్వీట్ చేసింది. ‘బ్రేకుల్లేని’ ఒకే సైకిల్పై దూసుకుపోతున్న ఈ ప్రేమ ప్రయాణం టోక్యో వరకు సాగించాలని వారు ఆశిస్తున్నారు. -
నిరాశ పరిచిన సాక్షి మాలిక్
భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు. మహిళల 58 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో క్వార్టర్స్ లో రష్యాకు చెందిన రెజ్లర్ వలేరియా కోబ్లోవా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పై 3-1 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. -
భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడింది. బుధవారం జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో గాయపడి మధ్యలోనే వైదొలిగింది. దీంతో చైనా రెజ్లర్ బౌట్ విజేతగా ప్రకటించారు. 1-2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న సన్ సెమీఫైనల్లో ప్రవేశించింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ లో రొమేనియాకు చెందిన ఎమిలియా అలినాపై 11-0తో ఫొగట్ విజయం సాధించి భారత శిబిరంలో ఆశలు రెకెత్తించింది. అయితే క్వార్టర్స్ లో చైనా రెజ్లర్ సన్ పట్టుకోసం యత్నించగా మోకాలి కింద ప్రాంతంలో ఫొగట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. -
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
-
శ్రీకాంత్ ఆశలు ఆవిరి..
రియోలో మరో భారత ఆశాకిరణం పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 స్కోరుతో చైనా ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశతప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తొలి గేమ్లో ఆద్యంతం లిన్ డాన్దే ఆధిక్యం. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో లిన్ డాన్ 21-6తో తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. కాగా రెండో గేమ్లో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకుని పోరాటపటిమ ప్రదర్శించాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ లిన్ డాన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. రెండో గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ దూసుకెళ్తూ ప్రత్యర్థికి ఎక్కడా దొరకలేదు. తెలుగుతేజం రెండో గేమ్ను సునాయాసంగా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ను 1-1తో సమం చేసి విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్ తొలి రెండు గేమ్లకు భిన్నంగా ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. శ్రీకాంత్, లిన్ డాన్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ఆరంభంలో లిన్ డాన్ ముందంజలో ఉన్నా, శ్రీకాంత్ వెంటనే పుంజుకుని నిలువరించాడు. కాగా ఈ గేమ్ ఓ దశలో 13-13, 14-14 స్కోర్లతో సమమైంది. ఆ తర్వాత లిన్ 16-14, 19-16తో ముందంజ వేయడంతో భారత అభిమానుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. చివర్లో శ్రీకాంత్ వెనుకబడగా, లిన్ అదే జోరు సాగిస్తూ 21-18తో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
స్వర్ణం నెగ్గిన సంబరాలలో...
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్కు షాకిచ్చిన సింగపూర్ చిన్నోడు జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని నెగ్గిన సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. రియోలో జరిగిన 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ పతకానికి గుర్తుగా ఓ టాటూ వేయించుకున్నాడు. తాను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిపేందుకు ఆ టాటూను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో ఒలింపిక్స్ లోగోలే ఉండే ఐదు వలయాలు తన కుడిచేతిపై ఉన్న టాటూలో దర్శనమిస్తాయి. స్వర్ణం నెగ్గి సింగపూర్ చేరుకున్న ఈ చిన్నోడికి దేశం ఘన స్వాగతం పలికింది. జోసెఫ్ పోటీలో ఓడించింది అలాంటి ఇలాంటి స్విమ్మర్ను కాదు.. స్విమ్మింగ్ కే మారుపేరుగా నిలిచిన ఫెల్ప్స్ను రజతానికి పరిమితం చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం చాలా గొప్ప విజయం. 'టాటూ చాలా ఏళ్లుగా ఉండిపోతుందని తెలుసు, నాకు కావాల్సింది చివరికి దక్కింది' అని జోసెఫ్ స్కూలింగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆ టాటూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ఈ భారీ అడ్డు 'గోడ'ను శ్రీకాంత్ దాటుతాడా?
కిదంబి శ్రీకాంత్ ముందు ఇప్పుడో ఓ భారీ సవాల్ ఉంది. రియో ఒలింపిక్స్లో సెమీస్లోకి ప్రవేశించాలంటే అతను.. చైనా ప్రత్యర్థి లిన్ డాన్ను ఓడించాలి. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి.. డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న లిన్ డాన్ ఓడించడమంటే మాటలు కాదు. శ్రీకాంత్ ఇప్పటివరకు మూడుసార్లు లిన్ డాన్తో తలపడ్డాడు. రెండుసార్లు ఓడిపోయాడు. కానీ, ఒక్కసారి గెలిచాడు. అది మామూలుగా కాదు లిన్ డాన్ను అతని సొంత గడ్డపై.. 2014లో చైనా ఓపెన్ సీరిస్ ఫైనల్లో చిత్తు చేశాడు. చైనా బ్యాడ్మింటన్ స్టాన్ లిన్ డాన్ అంటే ప్రత్యర్థులు హడలిపోతారు. ఒలింపిక్స్లో అతను ఎప్పుడూ ఓడిపోలేదు. సొంత గడ్డపై కూడా పరాజయం రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదని చెప్తారు. కానీ, సొంత గడ్డపైనే లిన్ డాన్కు ఓటమిని రుచి చూపించాడు శ్రీకాంత్. పక్కా ఫామ్తో ఒలింపిక్స్ బరిలోకి దిగాడు డాన్. 32 ఏళ్ల వయస్సున్న ఈ ఆటగాడికి ఇది చివరి ఒలింపిక్స్ అయ్యే అవకాశముంది. కాబట్టి రియోలో అతన్ని ఓడించడం అంటే మాటలు కాదు. కానీ, 23 ఏళ్ల మన శ్రీకాంత్ అతన్ని చూసి బెదిరిపోవడం లేదు. సొంతగడ్డపై అతన్ని ఓడించలేమన్న అభిప్రాయాన్ని తుత్తునియలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు ఒలింపిక్ వేదికపైనా అతనికి పరాజయాన్ని రుచి చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇందుకోసం నెట్లో చెమటలు కక్కేలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నానని చెప్పిన శ్రీకాంత్.. అతన్ని ఓడించడం అంత సులువు కాదు.. ఇందుకు చివరివరకు పోరాడాల్సి ఉంటుందనే విషయాన్ని పదేపదే మననం చేసుకుంటున్నానని తెలిపాడు. 'నేను అతన్ని ఓడించగలనన్న ధీమా నాకుంది. నేను అతి ఆత్మవిశ్వాసంతో ఏమీ లేను కానీ, నాకూ అవకాశాలు ఉన్నాయి' అని శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. 'ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు బాగా ఆడటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేకాకుండా అతని కోసం మేం ఓ వ్యూహాన్ని సిద్ధం చేశాం' అని శ్రీకాంత్ తెలిపాడు. -
మన పాట రియోలో దుమ్మురేపింది!
ఆరేళ్ల కింద వచ్చిన సినిమాలోని పాట అది. ఆ పాటను మన భారతీయులే మరిచిపోయి ఉంటారు. కానీ ఒలింపిక్స్లో మాత్రం ఆ పాట దుమ్మురేపింది. మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమింగ్ బృందం బాలీవుడ్ పాటకు తమ విన్యాసాలు జోడించింది. బాలీవుడ్ ఐటెం సాంగ్ 'ఐలా రే ఐలా' నేపథ్యంగా తీసుకొని ఈతకొలనులో అద్భుతమైన విన్యాసాలు చేసింది. డ్యుయెట్ టెక్నికల్ రోటిన్ ప్రిలిమినరీ రౌండ్లో మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమ్మర్లైన కరెమ్ ఆషాష్, నురియా డయోస్దాదో ఈ పాటకు తగినట్టు విన్యాసాలు చేస్తూ అలరించారు. అంతేకాకుండా ఫైనల్ ఈ అమ్మాయిల జోడీ క్వాలిఫై అయింది. Mexican #SynchronisedSwimming team dancing to 'Aila Re Aila' 😄👍🏽💃🏽👯 Too Good@akshaykumar @dalermehndi pic.twitter.com/yrGjv4XWzt — atul kasbekar (@atulkasbekar) August 15, 2016 2010లో వచ్చిన తన 'కట్టామిట్టా' సినిమాలోని పాటకు మెక్సికన్ అమ్మాయిలు విన్యాసాలు చేయడంతో మురిసిపోయిన అక్షయ్కుమార్ వారికి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. వారి విన్యాసాలు సూపర్గా ఉన్నాయని కొనియాడాడు. సినిమా సంగీత దర్శకుడు ప్రీతం కూడా ఇలా తన పాట రియోలో మోగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సింధు సంచలనం
-
సింధు సంచలనం
రియో డి జెనీరో: విమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఇహాన్ ను మట్టికరిపించి సంచల విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఇహాన్ తో తలపడిన సింధు 22-20, 21-19 లతో వరుస సెట్లలో విజయాన్ని సాధించింది. మొదటి సెట్ ప్రారంభంలో కొద్దిగా తడబాటుకు గురైన సింధు వేగంగా పుంజుకుని సెట్ ను గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న రెండో సెట్ లో సింధు ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్ ను కోల్పొయిన వాంగ్ రెండో సెట్ లో టెంపర్ మెంట్ ను కోల్పొయినట్లు అనిపించింది. వరుసగా సింధుకి అవకాశాలిచ్చిన వాంగ్ రెండో సెట్ లో సగం వరకూ రెండు పాయింట్ల వెనకంజలోనే ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింధు పత్యర్ధిని మట్టికరిపించి సెమీ ఫైనల్ లోకి ప్రవేశించింది. -
200 మీ. సెమీస్లో బోల్ట్
రియో ఒలింపిక్స్ పురుషుల 200 మీటర్ల విభాగంలో స్వర్ణంపై గురి పెట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన హీట్-9లో బోల్ట్ అందరికంటే వేగంగా 20.28 సెకన్లలో గమ్యానికి చేరి సెమీస్కు అర్హత పొందాడు. మొత్తం 10 హీట్స్ నిర్వహించగా... 24 మంది సెమీస్కు చేరుకున్నారు. ప్రతి హీట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారితోపాటు(20) ఓవరాల్గా అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో నలుగురు సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు. బోల్ట్తోపాటు సెమీస్కు చేరిన వారిలో యోహన్ బ్లేక్, నికెల్ అష్మెడ్, జస్టిన్ గాట్లిన్, లాషాన్ మెరిట్ తదితర ప్రముఖ అథ్లెట్స్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం. 6.30 నుంచి 6.45 మధ్య మూడు సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం ఎనిమిది మంది ఫైనల్కు అర్హత పొందుతారు.