State formation day
-
లండన్లో ఘనంగా "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు"
లండన్: ఎన్నారై తెరాస, టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలోని మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేసారు. అమరుల ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న సంస్కృతిక సేవా కార్య క్రమాల గురించి వివరించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గసభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహా మండలి చైర్మన్ మట్టా రెడ్డి తెరాస లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి పాల్గొన్నారు. ముఖ్య నాయకులు అబూ జాఫర్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుశుమన రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల, అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ మరియు తెరాస నాయకులు మల్లా రెడ్డి , సురేష్ బుడుగం, సత్యపాల్, శ్రావ్య , సుప్రజ , స్వాతి బుడుగం, రవి రెటినేని, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, అబూ జాఫర్,సృజన్ రెడ్డి,ప్రశాంత్,సురేష్ గోపతి, హరి నవాపేట్, మణి తేజ, నిఖిల్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హుతాత్మ చౌక్ ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు.. సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్గా నామకరణం చేశారు. అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు. పెరిగిన జిల్లాలు.. మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి... సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి : ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2014 ముందు వరకు జరిగినట్టుగానే నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. దేశం కోసం, రాష్ట్ర కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ వారి వారసులను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాలువాలు కప్పారు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురామ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం: రేవతి, పొట్టి శ్రీరాములు మనవరాలు ‘మా తాత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారు. మేము హైదరాబాద్లో స్థిరపడ్డాం. మమ్మల్ని గుర్తుంచుకుని పిలిచి మరీ సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ఈ సన్మానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం.’ అని రేవతి అన్నారు. -
కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నవరత్నాల అమలుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర అవతరణ వేడుకలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాల అవసరాలు తీర్చడంతోపాటు వారి తర్వాతి తరం వారు కూడా సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల తర్వాత నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య, గౌతు లచ్చన వంటి ఎందరో మహానుభావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు, పాత్రికేయుల భావాలు అందరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి కొనియాడారు. ‘విద్య, వైద్య, వ్యవసాయం’ రూపురేఖలు మార్పడానికే నవరత్నాలు 1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తరువాత 2014లో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా ప్రయాణిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ అంతా చెన్నై, హైదరాబాద్లో మిగిలిపోయిందని పేర్కొన్నారు. 2009 సెప్టెంబర్ 2 వరకూ.. అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ రాష్ట్రం విడిపోయే పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదన్నారు. విభజన తర్వాత ఏ రాష్ట్రం కూడా దగా పడని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదని, వెనకడుగు వేయలేదని, వెన్ను చూపలేదని అన్నారు. అభివృద్ధి తప్ప మన ముందు మరో మార్గం లేదన్నట్లుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ సౌధాన్ని పునర్నిర్మిస్తున్నామని వివరించారు. వెనుకబాటుతనం, పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే మనం ఒక జాతిగా పైకి ఎదుగుతామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్పడం కోసం ఉద్దేశించినవే నవరత్నాలని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో మనమంతా కలిసికట్టుగా కష్టపడితే మంచి రోజులు తప్పక వస్తాయన్నారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజలందరి చల్లని దీవెనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోంది గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుగు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పూర్తి నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించుకోగలరనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆంధ్రులు ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన వారని అన్నారు. అభివృద్ధి చెందాలనే తపన వారి రక్తంలోనే ఉందన్నారు. ఆయన విజయవాడలో రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ప్రసంగించారు. ‘‘సభికులందరికీ నమస్కారం.. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి, బెజవాడ శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వాలు కలిగిన రాష్ట్రానికి తాను గవర్నర్గా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. చారిత్రకంగా ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. ఆంధ్రులు భారతీయతలో తమదైన ప్రత్యేకత పొందారని ప్రశంసించారు. -
‘కలిసి ముందుకు సాగుదాం.. అభివృద్ధి సాధిద్దాం’
సాక్షి, విజయవాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి అన్నింటినీ అధిగమించి అభివృద్ధిని సాధిద్దామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అవరతణ దినోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్షకు దిగారని.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన అందరినీ స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారులు మన సమాజానికి పునాదులని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన శ్రమ, పరిశ్రమ హైదరాబాద్లోనే మిగిలిపోయిందని అన్నారు. ప్రస్తుతం దగాబడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెనకడగు వేయకుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని తెలిపారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలిపారు. పాలనలో నవరత్నాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కలిసికట్టుగా ఇప్పుడు కష్టపడితే.. భవిష్యత్కు బంగారుబాటలు వేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి గవర్నర్గా రావడం నా అదృష్టం : బిశ్వభూషణ్ ఏపీకి గవర్నర్గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం ఉన్న రాష్ట్రం. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్పనేల. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన నేతలు గొప్ప పోరాటం చేశారు. సాతంత్ర్య పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమం ఎప్పటికీ మరువలేనిది. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు ఉంది. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించి గర్వకారణంగా నిలిచార’ని తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ ఘనంగా సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతల్లో పొట్టి శ్రీరాములు మనవరాలు, పింగళి వెంకయ్య మనవరాలు, టంగుటూరి ప్రకాశం పంతులు మనువడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులు, వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబసభ్యులు, కడప కోటిరెడ్డి కుటుంబసభ్యులు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు కుటుంబసభ్యులు, పల్నాటి సింహం కన్నెగంటి హనుమంతు కుటుంబసభ్యులు, ఆచార్య ఎంజి రంగా కుటుంబసభ్యులు, ఏపీ తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులు ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
-
నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలను శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు శుక్రవారం ముఖ్య అతిథులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల విరామం తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 నాడు నవనిర్మాణ దీక్షలు పేరుతో ఆర్భాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగించాలంటే నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు. రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలతో 25 ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం.. వేడుకలను చేనేత కార్మికులు, కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దానికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల కోసం వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధించాలి సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని వారు గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందాలని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని వారు ఆకాక్షించారు. -
నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం
-
‘కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు, మందాజగన్నాదం, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి జెండా ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుందన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క మత కలహాల ఘటన జరగలేదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మతసామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టే ఇలాంటి ప్రకటనలు చేయకూడదని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పధకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రత్యేక ప్రతినిధులు సందర్శించారు. -
కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తాను : కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘అన్ని వర్గాల, పక్షాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఉద్యమంలో కలిసి పనిచేసిన స్పూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ అభివ ద్ధిలో కూడా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని నా విజ్ఞప్తి. ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఉటంకించిన సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలు ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా’అని ప్రకటనలో తెలిపారు. -
జయ.. జయహే తెలంగాణ
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల అనంతరం ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న అవతరించిన తెలంగాణ రాష్ట్రం నేడు ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో వసంతంలోకి అడుగిడుతోంది. ఆవిర్భావ సమయంలో ఉత్పన్నమైన భయాలు, ఆందోళనలు, అనుమానాలను విజయవంతంగా అధిగమించిన తెలంగాణ... నేడు పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకుపోతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమ్మేళనంతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించింది. – సాక్షి, హైదరాబాద్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కార్యాచరణ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆవిర్భావం రోజునే బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణతో కొత్త రాష్ట్రం నిర్మాణానికి పునాదులు వేశారు. కేసీఆర్ మానస పుత్రికలైన రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్తర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమయ్యాయి. గత డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభి మోగించి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడానికి దోహదపడ్డాయి. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఐక్యరాజ్యసమితి ప్రశంసలను సైతం అందుకున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి సంచలన నిర్ణయాలు యావత్ దేశం దృష్టిని రాష్ట్రంవైపు ఆకర్షింపజేశాయి. కోటి ఎకరాల సాగునీటి సరఫరా కల దిశగా... సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా కలను సాకారం చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. పాలనా సంస్కరణల కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, కొత్త పురపాలికల ఏర్పాటు చేయడంతో రాష్ట్రం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్ర శాసనసభ 2018 మార్చిలో ఆమోదించిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో రాష్ట్రంలోని 1,177 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీ హోదా వరించింది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్–ఐపాస్ పారిశ్రామిక విధానం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చి యావత్ ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. విద్య, ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించేందుకు కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఆదాయ వృద్ధిలో అగ్రగామి... ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతోంది. 2014–18 కాలంలో 17.17 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ముగిసే నాటికి 29.93 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. సంక్షేమ రాజ్యం... సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏటా రూ.40 వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు అండగా మారాయి. రాష్ట్ర ఆవిర్భావానికి తొలి ఏడాదే వృద్ధాప్య పింఛన్ను రూ. 200 నుంచి రూ. వెయ్యికి, వికలాంగులు, పేద వృద్ధ కళాకారుల పింఛన్ను రూ. 500 నుంచి రూ. 1,500కు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల తొలి ఐదేళ్లు ఏటా రూ. 5,013.91 కోట్లు ఖర్చు అయింది. సామాజిక భద్రత కోసం అందిస్తున్న పింఛన్లకు వార్షిక ఆదాయ, వయో అర్హత నిబంధనలను సర్కారు సడలించింది. 2018–19లో 39,32,726 మందిగా ఉన్న పింఛనర్ల సంఖ్య ఈ నిర్ణయంతో 47,88,070కు పెరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని రకాల పింఛన్లను జూన్ నెల రెట్టింపు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వృద్ధుల పింఛన్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల భృతి రూ. 1000 నుంచి రూ. 2016కు పెరగనుంది. అలాగే వికలాంగులు రూ. 3,016, బోదకాలు బాధితులు రూ. 2,016 పింఛను అందుకోనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ. 6,787 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 11,843 కోట్ల వ్యయం కానున్నది. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో 2019 ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పెన్షన్లర్ల సంఖ్య 21,60,275కి చేరింది. పేదల ఇంట కల్యాణలక్ష్మి... పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కల్యాణలక్ష్మి ద్వారా 3,56,997 మంది ఎస్సీ, ఎస్టీ, బిసీ, ఈబీసీ లబ్ధిదారులు, షాదీ ముబారక్ ద్వారా 1,09,732 మంది మైనారిటీ వర్గాల పేద ఆడపిల్లలకు ప్రభుత్వం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇందుకు రూ. 3,750 కోట్లు ఖర్చయింది. 2018 మార్చి నుం చి ప్రభుత్వం ఈ పథకాల కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ. 1,00,116కు పెంచింది. పేద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం... మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 7.95 లక్షల మంది విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రైవేటుకు దీటుగా గురుకుల విద్య... విద్యాభివృద్ధిలో తెలంగాణ గురుకుల పాఠశాలలు అద్భుత పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 298 (261+37 జనరల్) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉండగా, గత ఐదేళ్లలో 661 (608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 959 (906+53 డిగ్రీ కాలేజీలు)కు పెరిగింది. 2018–19 బడ్జెట్లో గురుకులాలకు రూ. 2,283 కోట్లు కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 8,434 మంది గురుకుల ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల విద్యార్థులు ఫలితాలను సాధిస్తున్నారు. రైతన్న కోసం విప్లవాత్మక పథకాలు... రైతన్న సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులపాలు కాకుండా 2018 మేలో ప్రారంభించిన రైతుబంధు పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 8 వేలు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచడంతో రైతు ఎకరాకు ఏటా రూ. 10 వేల సాయాన్ని అందుకోనున్నాడు. వానాకాలంలో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే యాసంగిలో 31.92 లక్షల ఎకరాలు. 2018–19 ఖరీఫ్లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లు, రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేశారు. అన్నదాతకు మరిన్ని మేళ్లు... - రాష్ట్రంలోని 57 లక్షల మంది రైతుల్లో అర్హులైన 50 లక్షల మందికి రూ. 5 లక్షల వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేలకుపైగా రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందాయి. - రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాలుగు విడతల్లో రూ. 16,124.37 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో 35,29,944 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఎన్నికల హామీ మేరకు 2018 నాటికి ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ కోసం 2019–20 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల సుమారు 48 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 30 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2014లో రుణమాఫీ పొందిన వారికంటే ఈసారి 12.69 లక్షల మంది అదనంగా రుణమాఫీ పొందనుండటం విశేషం. సాగునీరు... తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువు, వలసలను నివారించడానికి ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు చొప్పున రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఐదేళ్లలో 11.91 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 50 వేల కోట్లకుపైనే ఖర్చు చేసింది. గోదావరి, కృష్ణా నదుల్లో రాష్ట్ర వాటా 1,250 టీఎంసీలు. మరో 150 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైతులకు జీవధారగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రూ. 80,190 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 235 టీఎంసీల నీళ్లను మళ్లించనున్నారు. గోదావరి నుంచి 90 రోజులపాటు రోజూ మూడు టీఎంసీల చొప్పున నీటిని మళ్లించి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. ఇంటింటికీ రక్షిత మంచి నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సైతం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరిలోగా పనులు పూర్తి కానున్నాయి. పరిశ్రమలు, ఐటీ, విద్యుత్ రంగాలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని రాష్ట్రం ఆరు నెలల్లోనే అధిగమించింది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కోతలులేని నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2019 మార్చి నాటికి రూ. 1,58,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్లైన్ విధానం ద్వారా 9,395 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. 2.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2013–14లో రూ. 52.25 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2018–19 నాటికి రూ. 1,09,219 కోట్లకు చేరాయి. 2018–19 నాటికి 1,500 ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల్లో 5,43,033 మందికిపైగా ప్రత్యక్షంగా, 7 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఉద్యోగాల భర్తీ... రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 1,59,116 ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 91,790 మందికి ఉద్యోగాలిచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 17,038, సింగరేణిలో 11,106, ఆర్టీసీలో 5,157, పోలీసుశాఖలో 10,980, వైద్య ఆరోగ్యశాఖలో 1,514, పంచాయతీ కార్యదర్శులు 9,355, వర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9,614 ఉద్యోగాల భర్తీని పూర్తి చేసింది. కేసీఆర్ పాలన న భూతో న భవిష్యత్... కేసీఆర్ ఐదేళ్ల పాలన ఓ అద్భుతం. అనన్య సామాన్యం. న భూతో న భవిష్యత్. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణమైన పాలన సాగుతోంది. తెలంగాణ అవసరాలు, సమస్యలు తెలిసిన కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాగిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు బీమా, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్ల వంటి అనేక పథకాలు దేశంలోనే ప్రశంసలు అందుకున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన, చెప్పని పథకాలనూ అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ది. గత ఐదేళ్లలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ మీదే ఉంది. తండాలు గ్రామ పంచాయతీలయ్యాయి. గ్రామాల్లో మౌలికవసతులు పెరిగాయి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రగతికి బాటలు పడ్డాయి. బంగారు తెలంగాణలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తై రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. – అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి 5 ఏళ్లలోనే 70 ఏళ్ల పనులు... గత 70 ఏళ్లలో చేయని ఎన్నో గొప్ప పనులు గత ఐదేళ్లలో జరిగాయి. రైతుల సంక్షేమం, విద్యుత్ సరఫరా, సంక్షేమ వసతి గృహాలు, ఉద్యోగులకు తొలి పీఆర్సీ అమలు వంటి అద్భుత కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ కూడా రాకపోయేది. ఇప్పుడు 24 గంటల సరఫరా జరుగుతోంది. పేద విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నానికి బదులు సన్న బియ్యం భోజనం, కల్యాణలక్ష్మి కింద రూ. లక్ష ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు కేవలం రాష్ట్రంలోనే అమలవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఉమ్మడి ఏపీలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పదేళ్లు కొట్లాడితే సర్వే కోసం రూ. 7 కోట్లే కేటాయించారు. తెలంగాణ వచ్చాక రూ. 10 వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి జరగనుంది. – శ్రీనివాస్గౌడ్, ఆబ్కారీ, పర్యాటకశాఖల మంత్రి దేశానికి కేసీఆర్ పథకాలు ఆదర్శం... రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం. 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షమైంది. రైతుబంధు పథకం అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఐక్యరాజ్య సమితి సైతం దీన్ని ప్రశంసించింది. రైతులెవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందుతుంది. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసినట్లయింది. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం దృష్టిని ఆకర్షించారు. దేశం తెలంగాణవైపు చూస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడే సీఎం కావడం వల్ల ప్రజల కష్టాలన్నీ తీరుతున్నాయి. కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమనే చెప్పాలి. – తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధకశాఖ మంత్రి -
ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లుగా సాధించిన పురోగతి నివేదికను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం వివిధ రంగాల్లో మెరుగైన సేవల కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఈ నివేదికలో వివరించారు. ‘రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెండేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో 170 శాతం వృద్ధి కనిపించగా రాష్ట్రంలో 190 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య త్వరలో 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ రంగానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ–హబ్, టాస్క్, టీ–సాట్, టీ–ఫైబర్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు లక్ష్యాలకు మించి ఫలితాన్ని ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్సార్) మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి టీ–సిగ్ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్)ను ఐటీ విభాగానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాం’అని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 5.43 లక్షల ఉద్యోగాలను సృష్టించగా గతేడాది ఏకంగా 67,725 మంది వృత్తి నిపుణులకు కొత్తగా అవకాశం లభించిందన్నారు. ఐటీ పురోగతి నివేదికలో పేర్కొన్న అంశాలివీ - మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘మీ సేవ’అధునాతన వెర్షన్ను సిద్ధం చేశాం. ఆధార్ అనుసంధాన చెల్లింపుల విధానం (ఏఈపీఎస్)లో మీ సేవ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ)లో భాగంగా రూపొందించిన రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే విధానం సత్ఫలితాలిస్తోంది. - నాస్కామ్ ఫౌండేషన్ రూపొందించిన టెక్నాలజీ ఎంపవరింగ్ గర్ల్స్ (టెగ్) ద్వారా 66 మంది బాలికలకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు ఐటీ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ స్టార్టప్స్కు సంబంధించి 78 వేల చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్ (టీ–వర్క్స్)ను ఐటీ విభాగం గతేడాది ప్రారంభించింది. - రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్ నెట్వర్క్ ‘టీ–శాట్’ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేయగా 2.39 లక్షల మంది వీక్షించారు. టీ–శాట్ యూట్యూబ్ చానల్కు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. - ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘టీ–వెబ్’ద్వారా సగటున ప్రతి నెలా 3 కోట్ల మందిని చేరుతోంది. - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా టైర్–2, టైర్–3 పట్టణాల్లో ఐటీలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా ఇప్పటివరకు 12 జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. - కార్మిక, పోలీసులు, స్త్రీ నిధి, ఆర్టీసీ, డెయిరీ, పౌర సరఫరాలు, జేఎన్టీయూ తదితర విభాగాల సేవలను ఒకేచోటకు తెస్తూ గతేడాది ప్రారంభించిన ‘టీ–వ్యాలెట్‘ద్వారా 2018–19లో రూ. 1,202 కోట్ల విలువ చేసే 28.8 లక్షల లావాదేవీలు జరిగాయి. 1.72 లక్షల మంది తమ వివరాలను వ్యాలెట్లో నమోదు చేసుకున్నారు. - నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో విజయవంతమైంది. - ‘టాస్క్’ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యువత ఏడాది కాలంలో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ పొందారు. - ఆవిష్కరణ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ద్వారా శిక్షణ, అవకాశాల కల్పన తదితరాలపై మద్దతు ఇస్తుండగా 245 మంది వారి ఆలోచనలు పంపారు. వాటిలోంచి 26 వినూత్న ఆలోచనలను ఎంపిక చేశారు. మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ ఇండియా కౌన్సిల్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ సహకారంతో ‘బిజ్ అరెనా’పేరిట పోటీ నిర్వహించింది. -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో వసంతంలో అడుగిడింది. ఎన్నో పోరాటాలు, ఎందరో బలిదానాల ప్రతిఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఆదివారం ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జూన్ 3న 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4న 5 వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు.. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సైతం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే బాధ్యతను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్రెడ్డి (నిజామాబాద్), జగదీష్రెడ్డి (సూర్యాపేట), నిరంజన్రెడ్డి (వనపర్తి), దయాకర్రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి (వరంగల్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి) ఆయా జిల్లాల్లో జరిగే రాష్టర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వినూత్నంగా ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగానే సీఎం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరించడం, సీఎం ప్రసంగం, ఎట్హోం కార్యక్రమంలాంటి పలు అధికారిక కార్యక్రమాలు అందరికీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భాషా సాంస్కృతిక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ పబ్లిక్గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతిలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్ఫిల్మ్ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలతో అలంకరించిన అమరవీరుల స్తూపం 48 గంటల ‘ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్’ ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిఏటా నిర్వహించే పోటీలా కాకుండా ఈ సంవత్సరం అవతరణ ఫిల్మోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ గతనెల 24 సాయంత్రం 7 గంటలకు మొదలై 26 సాయంత్రం ఏడు గంటలకి ముగిసింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా కేరెక్టర్ని వాడి నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయడం ఇందులో ప్రత్యేకత. విజేతలకు జూన్ 3న రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. మాధ్యమాల ద్వారా చేరువవుతున్న తెలంగాణ సంస్కృతి ప్రజలకు తొందరగా చేరువయ్యే ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు యువత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్ప డానికి కృషిచేస్తున్నారు. గానం, నృత్యం, హావభావాలు, వేషధారణ వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపించేలా షార్ట్ఫిల్మ్ తీయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న నెటిజన్ల సంఖ్య, యూట్యూబ్, అంతర్జాలవాడకం వం టి పలు అంశాలను పరిగణనలోకి తీసు కుని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ‘ఫిల్మోత్సవం’పేరిట షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి భిన్నంగా వేడుకలు ‘‘రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటిరోజు అవార్డుల కార్యక్రమం, రెండోరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం, గానం, అదేవిధంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, తెలంగాణ గీతాలు, జూన్ 2న ఉదయం కవిసమ్మేళనం, సాయంత్రం చైతన్య గీతాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతియేటా నిర్వహించే అవతరణ దినోత్సవానికి కొంచెం భిన్నంగా 48 గంటల్లో ఫిల్మ్మేకింగ్ ఛాలెంజ్ని నిర్వహించాలనుకున్నాం. ఔత్సాహిక యువత తమ ప్రతిభను మెరుగుపరచడానికి సినీవారం, సండేసినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఆసక్తిగల సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.’’ –మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నారు. ‘ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలమానం. రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. -
అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండావిష్కరణ చేసే వారి పేర్లను ఆయన ఖరారు చేశారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని జెండావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి పాల్గొంటారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఐకే రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్రెడ్డి (నిజామాబాద్), జగదీష్రెడ్డి (సూర్యాపేట), నిరంజన్రెడ్డి (వనపర్తి), దయాకర్ రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి (వరంగ్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి)లు ఆయా జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
పబ్లిక్గార్డెన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమం త్రి కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ను సోమవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్ గార్డెన్లోనే ఉమ్మడి ఏపీ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల లో సమైక్య పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగని రీతిలో, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు ఎలాంటి యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ, వడగాడ్పులు ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇళ్ల్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. పరేడ్ గ్రౌండ్ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’అని అధికారులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీ హాల్కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులూ దీన్ని అంగీకరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు జరిపే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలోనూ వాటిని మినహాయించడం సముచితమని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్యఅతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు జరపాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం నాటి సమీక్షలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా జరపాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సీఎఎస్ ఎస్.కె..జోషిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంనాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, సీఎం సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎట్ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అవతరణ ఉత్సవాలకు స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కారు ప్రయాణం @ 17
-
ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఆర్కే కళాశాలలో విద్యార్థులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్మోహన్ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటి సభ్యుడు బాల్రాజ్, నాయకులు స్వామి, నరేందర్రెడ్డి, రాహుల్, నారాయణ, నరేశ్, రాజాగౌడ్, అనిల్, ప్రవీన్, భాను తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జెండా ఆవిష్కరణ దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏబీవీపీ నాయకు లు జెండాను ఎగురువేశారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు కళాశాల ఆవరణలో స్వచ్చభారత్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల ప్రతినిధులు మనిదీప్, రణదీర్, రాజు, వేణులు పాల్గొన్నారు. -
జనం సొమ్ముతో స్వీయ భజన
జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నాయ కుడని గెలిపిస్తే నాలుగేళ్ళు గడిచినా వీసమెత్తు పని చెయ్యలేదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ధ్రువీకరించదల్చుకున్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా ఒక వారం రోజుల పాటు ప్రజా ధనం వెచ్చించి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలే అందుకు నిదర్శనం. అసలు ఈ దీక్షలు ఇందుకోసం అన్న స్పష్టత బాబుకు అయినా ఉందా అన్న అనుమానం తాను ఈ సంద ర్భంగా చేసే ప్రసంగాలను వింటే అనిపిస్తుంది. తెలంగాణా ఏర్పడ్డాక ఆ రాష్ట్రం జూన్ రెండున అవ తరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది. తెలంగాణా పోగా మిగిలిన ఏపీకి కూడా ఒక అవతరణ దినోత్సవం ఉండాలి కదా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయంలో కేంద్ర హోం శాఖను స్పష్టత కోరగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 1956 నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం సూచించింది. నిజానికి అదే ఏపీకి అవతరణ దినోత్సవం జరుపుకోడానికి సరైన తేదీ ఎందుకంటే విడిపోయింది తెలంగాణా ప్రాంతం కానీ ఏపీ కాదు. పోనీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొన్న సందర్భంగా నిర్ణయమైన తేదీ కాబట్టి ఇప్పుడు నవం బర్ ఒకటిని ఎలా అవతరణ దినోత్సవంగా పరిగణి స్తామనే అభ్యంతరం ఉంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన 1953 అక్టోబర్ ఒకటి అయినా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీన తప్ప కుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగా ల్సిందే. ఏపీ ప్రజలు మాత్రం గత నాలుగేళ్ళుగా అవ తరణ దినోత్సవాలు జరుపుకునే అవకాశాన్ని కోల్పో యారు. పెద్ద రాష్ట్రాలు విడిపోవడం భారతదేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో కూడా పలు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విడిపోయాక రెండు రాష్ట్రాలూ తమతమ వీలును బట్టి అవతరణ దినో త్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ఏపీకి కూడా అవతరణ దినోత్సవం ఉండాల్సిందే. పోనీ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిన జూన్ రెండో తేదీని అవతరణ దినోత్సవంగా ఖరారు చేసు కున్నారు కాబట్టి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదిని అవతరణ దినోత్సవంగా పాటించవచ్చని ఎవరైనా సూచించ వచ్చు. రేపు ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలిచి ఇంకో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు అవతరణ దినో త్సవం ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తేదీకి మారు తుందా? తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది కదా అని అనొచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అవతరణ దినోత్సవాన్ని ఇంకో రోజుకు మార్చే వీలు లేదు. ఆ సాహసం ఏ రాజకీయ పక్షమూ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అపాయింటెడ్ డేట్న కాబట్టి. మొత్తం మీద ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది. నవ నిర్మాణం ఎక్కడ? అప్పాయింటెడ్ డేట్ అయిన జూన్ రెండున మొదలు పెట్టి వారం రోజులపాటు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ ప్రతి ఏటా చంద్ర బాబు నవ నిర్మాణ దీక్ష పేరిట చేస్తున్న జాతర ఒక రూపాయి మందమయినా ఏపీ ప్రజల అభివృద్ధికో, సంక్షేమానికో ఉపయోగపడేది కాదు, పైగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు అవుతోంది. ఏపీకి నవ నిర్మాణం అవసరమే, దానికి అందరూ దీక్ష బూనాల్సిందే. రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయ టపడేసి. మళ్ళీ ప్రగతి బాట పట్టించాల్సిందే. ప్రస్తు తం నవ నిర్మాణ దీక్ష నాలుగోది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు ముగిసి పోయి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభు త్వాలు ఏర్పడుతాయి. అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బాబుకు మళ్ళీ నవ నిర్మాణ దీక్షవారోత్సవం నిర్వహించే అవకాశం వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. నమ్మి నాలుగేళ్లు అధికారం అప్పజెపితే ప్రజలకు ఆయన ఏమీ చెయ్య లేక పోయారనడానికి దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసం గాలే నిదర్శనం. మొదటి మూడేళ్లూ బీజేపీతో స్నేహం కొనసాగింది కాబట్టి దీక్షల్లో ఎన్డీఏ ప్రభు త్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. గొప్ప అభివృద్ధిని కేంద్రం సాయంతో సాధిస్తున్నామని ఊదరగొట్టారు. నాలుగో ఏట నవ నిర్మాణ దీక్ష సమయం వచ్చేసరికి బీజేపీతో చెడింది. ఆ పార్టీని తిట్టడానికీ, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్కూ బీజేపీతో లేని సంబంధం అంటగట్టడానికీ తెగ ఆరాట పడిపోతు న్నారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యం ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి రాజధాని లేక, ఆదాయ వనరులు సరిగా లేక, రూ.16 వేల కోట్ల లోటుతో మిగిలిపోయిన మాట వాస్తవం. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ బలంగా అందరిలో ఉంది. నిన్నటిదాకా ఆ కోర్కె బలంగా లేనిది చంద్రబాబుకే. నవ నిర్మాణ దీక్షల్లో ప్రతిన బూనాల్సింది రాష్ట్రా నికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటం చేస్తా మనీ సాధించే వరకూ ఊరుకోబోమనీ, కానీ చంద్ర బాబు చేస్తున్నదేమిటి? ప్రతిపక్షాలను తిట్టిపో యడం, తనకు తాను కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చు కోవడం, కాసేపు తనకు ఏదో ముప్పు రాబోతున్న దనీ, రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలూ తన చుట్టూ వలయంలా ఏర్పడి రక్షించుకోవాలని భయం నటించడం– వీటితోనే నవ నిర్మాణ దీక్షా కాలం గడి చిపోతున్నది. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఆయన సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో తాను మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర నవ నిర్మాణం కాదు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడితే బాబు నిర్మాణా నికి జరుగుతున్న ప్రయత్నంగా అర్థం అవుతుంది. ‘సొంత’ క్యారెక్టర్ సర్టిఫికెట్! జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? రాష్ట్ర ఖజానాయే ఆయన జేబులో ఉంటే పిచ్చి పర్సుతో పనేంటి? ఇక ప్రజ లంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని కూడా ఆయన వేడుకున్నారు. ప్రజలను పాలకుడు రక్షి స్తాడా, ప్రజలే పాలకుడిని రక్షిస్తారా? ఇంతకూ ఆయనకు రాబోతున్న ముప్పు ఏమిటి? ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏమిటి? ఆయనే ప్రజలకు వివ రిస్తే బాగుంటుంది. ఇంకోమాట అదే జమ్మాదేవి పేటలో ఆయన అన్నారు, ‘బీజేతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడించండి’ అని. అవును ఇప్ప టికయితే ఆయనే కదా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. తననే ఓడించమని పిలుపు ఇస్తున్నారా ప్రజలకు?ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడటానికి ఆయన కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? నవ నిర్మాణ దీక్షల్లో చెప్పుకోడానికి గత నాలుగేళ్ళుగా తాను రాష్ట్రానికి చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో ఏదో చేసే ఆలోచన కూడా లేదనే కదా. ఐదు లోక్సభ సీట్లకు ఉప ఎన్ని కలొస్తే నంద్యాల తరహా ఆటలు సాగవు! నవ నిర్మాణ దీక్షలను ఆయన ఎన్నికల సభలు చేసేశారు. ఎన్నికలంటే జ్ఞాపకం వచ్చింది ప్రత్యేక హోదా సాధన కోసం లోక్సభ సభ్యత్వాలకు అయిదుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమో దం పొంది ఉపఎన్నికలు రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అయిదు లోక్సభ సీట్లకు మాత్రమే ఎన్నికలొస్తే నంద్యాల స్టయిల్లో నడిపిం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి వేరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి కూడా సరిపోక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ మోహరింపచేసి తొండి ఆట ఆడిస్తే తప్ప గెలవలేదు. ఈ అయిదు గురు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఒక వేళ ఆమోదం పొందితే జరిగే ఉప ఎన్నికలు నంద్యాల లాంటివి కాదు. ఒక లక్ష్యం సాధించడం కోసం పద వులను తృణప్రాయంగా త్యజించే వారిని ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకుంటారో చంద్రబాబుకు అను భవమే కదా గతంలో. కాంగ్రెస్ అవమానాలను భరించలేక బయటికొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉప ఎన్నికలకు వెళ్ళిన నాయకుల విషయంలో కానీ, తెలంగాణా సాధన కోసం అక్కడ రాజీనామాలు చేసి పోటీ చేసిన నాయకుల విష యంలో కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం కదా. ఆ రెండు సందర్భాల్లోనూ తెలుగు దేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టు కున్నట్టు గుర్తు. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
రైతుబంధు కాదు... రాబందు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులకు జోహార్లు.. వారి బలిదానాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన ఆశయాలకు భిన్నంగా పాలక పార్టీ పనిచేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకు పరిమితమవుతోందే తప్ప అభివృద్ధి సాధించడంలో వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, అప్పులు అరాచకాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత ప్రభుత్వానికే చెందుతుందంటూ ఎద్దేవా చేశారు. మా నాయకత్వం దేశానికే ఆదర్శం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రైతుబంధు కాదు... రాబందు అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. రెండు లక్షల కోట్ల అప్పు భారం ప్రజల మీద మోపారని మండిపడ్డారు. ఎదురుతిరిగిన నిరసన గొంతులను నలిపేస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చోటే లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మీద దాడులు చేస్తూ వారినే జైలుకు పంపిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడమే మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. లక్ష ఉద్యోగాలని చెప్పి కేవలం 20వేల కొలువులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రైతులకు రైతుబంధు పథకాన్ని తాయిలంగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది రైతుబంధు పథకం కాదు.. రాబందు పథకమని వ్యాఖ్యానించారు. రాజకీయ కొలువుల కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. మోదీ సర్కారు పేదల పక్షం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో దూసుకుపోతోందని లక్ష్మణ్ ప్రశంసించారు. దళారి వ్యవస్థ లేకుండా, అవినీతి లేకుండా పేదల కోసమే మోదీ సర్కారు పనిచేస్తోందని పేర్కొన్నారు. -
తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది
-
అవతరణ దినోత్సవ కానుక: టీఎస్పీఎస్సీ కొత్త నోటిపికేషన్లు
-
నేడే రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పరేడ్ గ్రౌండ్స్లో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది. శనివారం ఉదయం 10.30కు వేడుకలు ప్రారంభమవుతాయి. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం సీఎం వేడుకల్లో పాల్గొంటారు. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు జరుగుతాయి. జిల్లాలవారీగా మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు సీఎస్ వేడుకల్లో పాలుపం చుకుంటారు. రైతు బీమా పథకాన్ని ఈ వేడుకల్లో సీఎం లాంఛనంగా ప్రకటిస్తారు. రైతులందరికీ రూ.5 లక్షల చొప్పున బీమా చేసేందుకు రెండు రోజుల కిందటే ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. సాధారణ మరణమైనా, ఇతర కారణమేదైనా రైతులు చనిపోతే వారి కుటుంబీకులను ఆదుకునేందుకు వీలుగా పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు 2,786 వివిధ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అవతరణ దినోత్సవం రోజే నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఏ జిల్లాలో ఎవరెవరు : అవతరణ వేడుకల్లో పతాకావిష్కరణ బాధ్యతలను మంత్రులతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్లు, సీనియర్ ఐఏఎస్లకు ప్రభుత్వం అప్పగించింది. సీఎస్ వరంగల్ వేడుకల్లో పాల్గొననుండటంతో పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీజీపీ మహేందర్రెడ్డి సారథ్యం వహిస్తారు. ఆసిఫాబాద్–మండలి చైర్మన్ స్వామిగౌడ్, భూపాలపల్లి–స్పీకర్ మధుసూదనాచారి, మహబూబాబాద్– మంత్రి చందూలాల్, వరంగల్ అర్బన్–డిప్యూటీ సీఎం కడియం, రంగారెడ్డి– డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ, మేడ్చల్– మంత్రి నాయిని, జనగాం–విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు రాజన్న సిరిసిల్ల–కేటీఆర్, కరీంనగర్–ఈటల, జగిత్యాల–చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి–విప్ పాతూరి సుధాకర్రెడ్డి, ఆదిలాబాద్– జోగు రామన్న, నిర్మల్–ఇంద్రకరణ్రెడ్డి, మంచిర్యాల–విప్ ఓదెలు, సిద్ధిపేట–హరీశ్రావు, మెదక్–పద్మా దేవేందర్రెడ్డి, నిజామాబాద్–పోచారం, కామారెడ్డి–విప్ గోవర్ధన్, మహబూబ్నగర్–సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్–జూపల్లి, వనపర్తి–ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ నిరంజన్రెడ్డి, జోగుళాంబ గద్వాల–తలసాని, ఖమ్మం–తుమ్మల, కొత్తగూడెం–పద్మారావు, నల్లగొండ–నేతి విద్యాసాగర్, సూర్యాపేట–జగదీశ్రెడ్డి, యాదాద్రి భువనగిరి–విప్ సునీత, వికారాబాద్–పి.మహేందర్రెడ్డి, వరంగల్ రూరల్–సీఎస్ జోషి, సంగారెడ్డి– ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ. -
దేశ వ్యాప్తంగా పదిరోజుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులు భారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటలకు గిట్టుబాటు ధర, పూర్తి స్థాయి రుణమాఫీ, ఎరువులపై ధరల నియంత్రణ వంటి డిమాండ్స్తో పదిరోజుల దేశవ్యాప్త సమ్మెను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్తో సహా 130 రైతు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దీనిలో భాగంగా పాలు, కూరగాయలు, నిత్యవసర వస్తులును గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సరఫరా చేయకుండా నిలిపివేశారు. రైతాంగం ఎక్కువగా గల ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పాలను, కూరగాయలకు రోడ్ల మీద పారబోసి నిరసన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో రైతులు టమాటాలను జాతీయ రహదారిపై పారబోసి ధర్నా నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారస్సులను అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై అధిక ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర అడిగితే మధ్యప్రదేశ్లోని మాంద్సోర్లో ఆరుగురు రైతులను కాల్చివేశారని విమర్శించారు. తమ డిమాండ్స్ను పరిశీలించకపోతే జూన్ 10న భారత్ బంద్కు పిలునిస్తామని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ అధ్యక్షుడు శివకుమార్ శర్మ ప్రకటించారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపం
సాక్షి, అమరావతి : రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో దానిని జరుపుకోవడం సమంజసం కాదని ఆయన చెప్పారు. నవ నిర్మాణదీక్ష–2018పై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆయనన్నారు. ఈసారి కూడా జూన్ 2వ తేదీ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరే నవ నిర్మాణ దీక్ష నిర్వహించనున్నామని, అక్కడే తాను దీక్ష ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో తాము సాధించిన అభివృద్ధిని ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కాగా, విభజన జరిగి నాలుగేళ్లయినా ఇంకా తలసరి ఆదాయంలో తెలంగాణ కంటే రూ.32 వేలు వెనుకబడే వున్నామని, దీనిని అధిగమించాలంటే మరో ఎనిమిదేళ్ల సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉంటే.. ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 8వ తేదీ వరకు జరిగే నవ నిర్మాణ దీక్షల సందర్భంగా 12 వేల గ్రామాల్లోను ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు రెండో రోజు నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ఒక్కోరోజు ఒక్కో అంశంపై వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నవ నిర్మాణదీక్ష కార్యక్రమాల వివరాలు: 02.06.18: నవ నిర్మాణ దీక్ష (విభజన చట్టం అమలు తీరు) 03.06.18: నీటి భద్రత, కరువు రహిత రాష్ట్రం (తాగునీరు, పారిశ్రామిక నీరు, పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులు , జలవనరులు) 04.06.18: రైతు సంక్షేమం, ఆహార భద్రత (వ్యవసాయ, అనుబంధ రంగాలు, పౌర సరఫరాలు) 05.06.18: సంక్షేమం సాధికారత (వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసం) 06.06.18: ఉపాధి కల్పన జ్ఞానభూమి (పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి) 07.06.18: మౌలిక సదుపాయాలు మెరుగైన జీవనం (అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి) 08.06.18: మహా సంకల్పం (సుపరిపాలన అవినీతి రహిత సుపరిపాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో యాక్షన్ ప్లాన్, ఇ–ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌర సేవలు, సుస్థిర వృద్ధి, విజన్). -
పొలం పనికి ఎండ దెబ్బ!
ఎండలు పెరుగుతున్నా పొలం పనులు చేసుకోవడం తప్పదు. ఏటేటా ఎండలు పెరుగుతున్నాయి. అలా.. ఎండ దెబ్బ బెడద ఏటేటా పెరుగుతూనే ఉంది గానీ తగ్గడం లేదు. ఎండనకా వాననకా కాయకష్టం చేసే రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ఎర్రని ఎండల్లోనూ భద్రంగా ఉండాలంటే.. అప్రమత్తత అవసరం. ఎండ దెబ్బకు చెమట చిందుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం బరువు తగ్గుతుంది.. పనిసామర్థ్యమూ తగ్గుతుంది... ప్రాణానికే ముప్పొస్తుంది. ఈ ముప్పు మహిళా రైతులకు మరింత ఎక్కువని ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) హెచ్చరిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త! ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల సంఖ్యలో 31.8 శాతం మంది వ్యవసాయంలోనే పనిచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఎండ దెబ్బకు గురవుతున్నారు.వేసవి ఎండలో పనులు చేసే మనుషులు చెమట ద్వారా బయటకు పోతున్న నీటికి తగినంత నీటిని తాగాలి. లేకపోతే దేహంలో నీటి కొరత ఏర్పడుతుంది.. ఆ మేరకు ఆ మనిషి పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. చెమట వల్ల దేహం బరువులో 3% వరకు నీటిని కోల్పోతే ఆ ప్రభావం శ్రామికుని పని సామర్థ్యంపై అంతగా ఉండదు. 4% తగ్గితే.. ఆ వ్యక్తి శారీరక శ్రమ చేసే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది. ఎండ తీవ్రత, గాలిలో వేడి–తేమ తదితర పరిస్థితులను, శ్రమ తీవ్రతను బట్టి ఎండలో పనిచేసే ఒకరికి రోజుకు 2 నుంచి 15 లీటర్ల వరకు నీరు అవసరమవుతుందని అంచనా. ► మనిషి దేహంలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే అంతర్గతంగా దేహక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎండలో పనిచేసే వారికి ఎంత ఎక్కువ చెమట పడితే.. ఎండను తట్టుకునే శక్తి అంతగా పెరుగుతుంది. సాధారణంగా మహిళలకు పురుషులకన్నా తక్కువ చెమట పడుతుంది. వృద్ధులు, పిల్లల పరిస్థితి కూడా అంతే. కాబట్టి, వీరికి వడ దెబ్బ ప్రమాదం ఎక్కువ. ► ఎక్కువ వేడి వాతావరణంలో వరుసగా చాలా గంటల పాటు పనిచేస్తున్న మనిషి దేహంలో నీరు తగ్గిపోయి.. చెమట పట్టటం తగ్గినప్పుడు.. దేహం లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించి పెరుగుతుంది. అప్పుడే వడ/ఎండ దెబ్బ తగులుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వారిని చల్లని ప్రాంతానికి తరలించడం, తగిన వైద్య సహాయం అందించగలిగితే ప్రాణానికి ముప్పు తప్పుతుంది. ► సాధారణ వ్యక్తి ఆహారం ద్వారా రోజుకు 8–14 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉంటారు. ఎండలో పనిచేసే అలవాటు అంతగా లేని వ్యక్తి ప్రతి లీటరు చెమటతోపాటు 4 గ్రాముల ఉప్పును కోల్పోతారు. కాబట్టి, ఎండలో ఎక్కువ గంటల పాటు పొలం పనులు చేసే వారు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ► మనిషికి చెమట వల్ల దేహం బరువులో 2% మేరకు నీటిని కోల్పోతే మానసిక స్థితిలో మార్పు వస్తుంది.. పని చేయాలన్న ఆసక్తితో పాటు.. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ► చెమట ద్వారా కోల్పోయే బరువు సాధారణ (3%)స్థితిలో ఉన్నప్పటికీ.. మోస్తరు ఎండలోనూ పని సామర్థ్యం 80% తగ్గుతుంది. అయితే, చెమట ద్వారా కోల్పోయే నీటిని, లవణాలను తగినంతగా తీసుకునే మనిషి పని సామర్థ్యం తీవ్రమైన ఎండలో కూడా 55% మాత్రమే తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ► వేడి నుంచి రక్షణ కల్పించడంలో దుస్తులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎండాకాలంలో వ్యవసాయ, అటవీ పనులు చేసే మనుషులు తగినంతగా శరీరాన్ని కప్పి ఉంచే పల్చటి నూలు వస్త్రాలు వేసుకోవడం ఉత్తమం. లేత రంగు దుస్తులు ఎండను తిరగ్గొట్టడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. తల గుడ్డ చుట్టుకోవాలి లేదా అంచు పెద్దగా ఉండే టోపీ పెట్టుకోవాలి. ► విశ్రాంతిగా ఉన్న మనిషి శరీరం నుంచి రోజుకు సుమారు 400–700 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనితోపాటు 150–200 గ్రాముల నీరు శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అయితే, సమశీతల పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసే మనిషి దేహం నుంచి ప్రతి గంటకూ 600 గ్రాముల చొప్పున నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ► సాధారణంగా పురుషుల శరీర ఆకారం పెద్దగా ఉంటుంది. అంటే, దేహాన్ని కదిలించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, తద్వారా వారి దేహంలో ఎక్కువ వేడి పుడుతుంది. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల శరీరంపై స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. అయితే, పురుషుల స్వేదగ్రంధి నుంచి అధికమొత్తంలో చెమట వెలువడుతుంది. ► ఎండలో పనిచేసే గర్భవతులకు ఇబ్బందులు మరీ ఎక్కువ. నెలలు నిండని బిడ్డను ప్రసవించడం వంటి సమస్యలు రావచ్చు. ► పెద్దల కన్నా పిల్లలకు స్వేద గ్రంధుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక వేడి నుంచి పిల్లలకు ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ► వృద్ధుల దేహంపైన ఉండే స్వేద గ్రంధులు తక్కువ మొత్తంలో చెమటను స్రవిస్తాయి. అధిక వేడి వల్ల వృద్ధుల హృదయ స్పందనలు, రక్తప్రసరణ నెమ్మదించవచ్చు. అందువల్ల వారికి వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ► మధుమేహం, ఊబకాయం ఉన్న వ్యక్తులు అధిక వేడి వల్ల అనారోగ్యం పాలుకావడానికి ఆస్కారం ఉంది. ► ఎండలో పనిచేసే అలవాటు లేని వారు.. 7–9 రోజుల పాటు తక్కువ శారీరక శ్రమ ఉంటే పనులను రోజూ కొద్ది గంటల పాటు చేస్తూ.. అలవాటు చేసుకోవాలి. సాధారణంగా శారీరక శ్రమ చేయటం అలవాటున్న వారు.. అంతకుముందు శారీరక శ్రమ అంతగా అలవాటు లేనివారికన్నా ఎక్కువ చెమటను విడుదల చేయగలగడం వల్ల త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడగలుగుతారు. వేడి వాతావరణంలో పనిచేయడానికి అలవాటు పడిన వారికి గంటకు వెయ్యి గ్రాముల నీటిని వెలుపలికి పంపేంత చెమట పడుతుంది. ► అలవాటు లేకుండా కొత్తగా ఎండలో పనులు చేయడం ప్రారంభించిన వారు తమకు తెలిసినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల ఎండదెబ్బకు గురవుతూ ఉంటారని సర్వేలలో తేలింది. ► ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడంలో రైతు కూలీలకు తగిన తాగునీటి సదుపాయం కల్పించాలి. తాగునీరు ఒక మోస్తరు చల్లగా(15–20 డిగ్రీల సెంటీగ్రేడ్) ఉంటే చాలు. నీరు కొద్ది కొద్దిగా తరచూ తాగడం మంచిది. అవకాశాన్ని బట్టి అంబలి, మజ్జిగ తాగొచ్చు. టీ, కాఫీ, మద్యం తాగకూడదు. ఎండలో పనిచేసే పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. రైతులు, వ్యవసాయ క్షేత్రాల మేనేజర్లు, సూపర్వైజర్లు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే.. వ్యవసాయ కార్మికుల పని సామర్థ్యం తగ్గకుండా పని బాగా జరగడంతోపాటు.. వారూ అనారోగ్యం పాలవకుండా ఉంటారు.పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. ► పురుషుల కన్నా మహిళలకు చాలా తక్కువ చెమట పడుతుంటుందన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే మహిళలకు చెమట పడుతుంది. అందువల్ల తీవ్రమైన ఎండ వల్ల ముప్పు మహిళలకే ఎక్కువ. -
కొత్త పంచాయతీల ఏర్పాటుపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్/ఇందూరు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లో సమీక్షించారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఎం.రామ్మోహన్రావు, సత్యనారాయణ, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కొత్త పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి పంపిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని మంత్రి ఎమ్మెల్యేలు, కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించారు. -
చంద్రబాబు.. మీ తప్పులని రోజూ ప్రశ్నిస్తా !
-
ఖతర్లో ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు
దోహా : ఖతర్ రాజధాని దోహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడి విల్లాలో 8 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. పార్టీ ఖతర్ ఐటీ ఇంచార్జ్ నరీం హేమంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టు గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ దోహా కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని, రాష్ట్రం విడిపోకముందు సమైఖ్య రాష్ట్రం కోసం, విడిపోయాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల హామీల అమలు కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. వైసీపీలో సభ్యుడైనందుకు తాను గర్వపడుతున్నట్టు చెప్పారు. అదే విధంగా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన హేమంత్కు కమీటీ సభ్యుల తరుఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించిన హేమంత్ మాట్టాడుతూ.. రాష్ట్ర రాజకీయలలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు, కో కన్వీనర్లు జాఫర్ హుస్సేన్, గిరిధర్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నాగేశ్వర్ రావు, ప్రశాంత్, యూత్ ఇంచార్జ్ ఆరోన్ మనీష్, గౌరవ సలహాదారు ఎస్.ఎస్.రావు, విల్సన్ బాబు, సహాయ కోశాధికారి సభ్యులు అరుణ్, భార్గవ్, జయరాజు, పిల్లి మురళి కృష్ణా, రాజు, వసంత్, పవన్ రెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. -
దుర్భాషలాడుతూ..కాళ్లతో తన్నుతూ..
నంద్యాలవ్యవసాయం : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నంద్యాల పట్టణంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ నాయకుడి మేనల్లుడు కంకణం కట్టుకున్నాడు. మహా దీక్ష శిబిరంపై దాడి చేసి హల్చల్ సృష్టించాడు. తన వాహనానికి అడ్డయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషకు దిగాడు. శిబిరం ముందు ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుతూ న్యాయవాదులతో వాదనకు దిగాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఇద్దరు న్యాయవాదులపై చెప్పుకాళ్లతో తన్ని బీభత్సం సృష్టించాడు. అతని వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంత జరుగుతున్నా న్యాయవాదులు మాత్రం సంయమనం పాటించి అతన్ని అక్కడి నుంచి పంపించి టూటౌన్ పోలీస్స్టేషన్లో బార్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోమవారం మహాదీక్ష శిబిరం వద్దకు పలు ప్రజా సంఘాల, అఖిలపక్ష పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారు. వందలాది మంది శిబిరం వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నూనెపల్లె వైపు నుంచి శ్రీనివాససెంటర్ వైపు కారులో వెళ్తున్న స్థానిక టీడీపీ కౌన్సిలర్ వాకాశివశంకర్యాదవ్ మేనల్లుడు వేణు యాదవ్ కారు కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. సహనం కోల్పోయిన ఆయన కారుదిగి ‘‘మీ దీక్షలతో ఒరిగేముంది.. ఎవరి కోసం చేస్తున్నారు’’ అంటూ అసభ్యకరంగా తిడుతూ..శిబిరం వద్ద ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుకుంటూ న్యాయవాదులపైకి దూసుకొచ్చాడు. న్యాయవాదులు తేరుకొనేలోపే ఇద్దరిపై చెప్పుకాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించాడు. దీక్షలో కూర్చున్నవారు సైతం లేచి వచ్చే పరిస్థితి నెలకొంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక దీక్షలో కూర్చున్నవారు అయోమయానికి గురయ్యాడు. వేణుయాదవ్ వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై దుర్భాషలకు దిగారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా బూతు మాటలతో వాగ్వాదం చేశారు. చివరకు తన మనుషులను పిలిపించి దీక్షా శిబిరాన్ని తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తనతో వాగ్వాదానికి దిగినవారి అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమస్య తీవ్రతరం అవుతుండటంతో సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని వేణు యాదవ్ను బుజ్జగిస్తూ దీక్షా శిబిరం నుంచి పంపించారు. దీక్ష భగ్నానికి కుట్ర... గత 40రోజులుగా హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు శాంతియుత వాతావరణంలో చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు అనూహ్య స్పందన లభిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ప్రజల నుంచి సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీనిని ఓర్వలేని అధికార పార్టీ నాయకులు దీక్ష భగ్నానికి కుట్ర పన్నారని పలువురు న్యాయవాదులు సోముల నందీశ్వరరెడ్డి, అశోక్రెడ్డి, ప్రతాపరెడ్డిలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటైతే సీమ వాసులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాము దీక్షలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. తమపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది గిట్టని వారి పనేనని బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ అన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే దాడి చేశారని, పోలీసులు తప్పక చర్యలు తీసుకోవాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లెస్వామిరెడ్డి అన్నారు. -
మహామనీషి ఆంధ్రకేసరి
ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి బ్రిటీష్ వారిని ఎదిరించిన మహామనీషి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. జిల్లా 49వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రకాశం భవనంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రకాశం పంతులు పరిపాలనలో అపారమైన అనుభవాన్ని సాధించారన్నారు. వెనుకబడిన కర్నూలు, నెల్లూరు, గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి 1970లో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ప్రకాశం పంతులు జిల్లావాసి కావడంతో 1972లో ఆయన పేరున జిల్లాకు నామకరణం చేసినట్లు తెలిపారు. అలాంటి ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు స్థాపించి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దొనకొండలో ఇండస్ట్రీయల్ పార్కు, కనిగిరిలో పరిశ్రమల కేంద్రం, రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీ, మైనింగ్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూర్లో ఒక్క ఓడరేవు ఉంటే అది ఇతర దేశాలను శాసించే స్థాయికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరమైన సహజ వనరులు ఉన్నాయన్నారు. వీటిద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు, ఒంగోలు గిత్తలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లా కలెక్టర్ వీ వినయ్చంద్ మాట్లాడుతూ జిల్లాను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్, కొమ్మమూరు కాలువల పరిధిలో 4లక్షల 42వేల ఎకరాల భూములు ఉన్నాయన్నారు. రాళ్లపాడు, పాలేరు, కంభం చెరువుల ద్వారా 48వేల 536ఎకరాల భూమి సాగవుతోందన్నారు. జిల్లాలో 102కి.మీ. మేర సముద్రతీరం ఉందన్నారు. ఒంగోలులో 3.26కోట్ల రూపాయలతో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రత్యామ్నాయ వేదికగా బీఎల్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సీపీఎం ఆధ్వర్యంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఊపిరి పోసుకుంది. లాల్– నీల్ నినాదంతో 21 రాజకీయ పార్టీలు, సంఘాలతో కలసి బీఎల్ఎఫ్ ఏర్పాటు కాగా, ఆవిర్భావ సదస్సును గురువారం హైదరాబాద్లో నిర్వహించనున్నారు. బీఎల్ఎఫ్ చైర్మన్గా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. మరోవైపు కుల, సామాజిక సమస్యలపై పోరా డటానికి సీపీఎం ఇదివరకే తెలంగాణ సామాజిక సంఘాల ఐక్యవేదిక (టీమాస్)ను ఏర్పాటు చేసింది. టీమాస్ కేవలం సామాజిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కానుండగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షలున్న పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు బీఎల్ఎఫ్కు రూపకల్పన చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మినహా కలసి వచ్చే అన్ని పార్టీలతో ఈ వేదికను ఏర్పాటు చేయాలని భావించి 4 నెలలుగా కసరత్తు చేశారు. ప్రధాన వామపక్ష పార్టీలయిన సీపీఐ, న్యూడెమొక్రసీ తదితర పార్టీలు బీఎల్ఎఫ్కు దూరంగా ఉండగా, బీఎస్పీ, లోక్సత్తా వంటి పార్టీలు, ఇతర వామపక్ష పార్టీలు సహా మొత్తం 21 పార్టీలు ఫ్రంట్లో చేరాయి. మరో 15 పార్టీలు వేదికలో చేరనున్నాయని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బీఎల్ఎఫ్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఎల్ ఎఫ్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్పీఐ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిర్భావ సభలో పాల్గొంటారని సీపీఎం వర్గాలు తెలిపాయి. -
సో.. ’స్వీట్’
ఆదాయాన్నిస్తున్న తేనెటీగల పెంపకం ఆసక్తి చూపుతున్న రైతులు కేవీకేలో నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం తాడేపల్లిగూడెం : తేనెటీగల పెంపకం రైతులకు ఆదాయాల తీపిని పంచుతోంది. గిరిజన ఉప ప్రణాళిక కింద వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి 50 శాతం రాయితీతో పెట్టెలను అందిస్తున్నారు. శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవం నేపథ్యంలో వీటి పెంపకం, స్థితిగతులపై ఈ ప్రత్యేక కథనం. రైతుకు ఆదాయం చేకూర్చడంతో పాటు అదనపు ఉపాధి కలగడానికి తేనెటీగల పెంపకం ఉపకరిస్తుంది. మొక్కలలో పరపరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరగడం వల్ల వ్యవసాయం, ఉద్యాన పంటలలో దిగుబడులు పెరిగినట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జిల్లాలో గిరిజన ఉప ప్రణాళిక కింద ఆర్కెవీవై పథకంలో 300 మంది గిరిజనులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రాంతంలో తేనె టీగల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. గిరిధార ప్రొడ్యూసర్స్ సొసైటీ కింద వీరు ఏర్పాటై తేనెను తయారు చేస్తున్నారు. కిలో 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా వీటి పెంపకానికి ఒక్కొక్క రైతుకు ఎనిమిది బాక్సుల వంతున 50 శాతం రాయితీపై ఇస్తున్నారు. తేనెటీగలను బాధ పెట్టకుండా.. తేనెటీగలను దులపక్కర్లేదు. వాటిగుడ్లను పాడు చేయనక్కర్లేకుండానే చక్కని తేనెను తీసుకోవచ్చు. పాత తేనె సేకరణ ప్రక్రియకు మెరుగులు దిద్దుతూ ఆస్ట్రేలియా దేశంలో ఫ్లో...హనీ యంత్రాలు తయారయ్యాయి. ఈ ప్రక్రియలో కూలీ ఈగలు, రాణి ఈగలను బాధపెట్టక్కర్లేకుండానే తేనెను తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫ్లో హనీలో కింద అరలో తేనెను తయారు చేసే కూలీ ఈగలు ఉంటాయి. ఇవి ఇదే యంత్రంలో పైన అమర్చిన హనీ ఎక్స్ట్రాక్టర్లో తేనెను నింపుతాయి. తేనె ఆ అరలో నిండిన తర్వాత పైన మైనపు పూతలను కూలీ ఈగలే వేస్తాయి. పై అరలో తేనె నిండిన వెంటనే ఫ్లో హనీ యంత్రంలో ఉన్న ఇండికేటర్స్లో యంత్రంలో తేనె నిండినట్టుగా సంకేతాలు కనిపిస్తాయి. దీంతో పై అరలో ఉన్న మైనపు పూతతో కూడిన తెట్టును నెమ్మదిగా టచ్ చేస్తే ఆ యంత్రానికి అమర్చిన కుళాయి ద్వారా శుద్ధ తేనె వస్తుంది. తేనె సేకరణలో సాధారణ ప్రక్రియలో కూలీ ఈగలు పుప్పొడిని, మకరందాన్ని తీసుకొచ్చి తేనెటీగల బాక్స్లో గుడ్లను పెట్టి మైనపు తెట్టుగా తయారు చేస్తాయి. తేనె తయారైందని తెలిసిన తర్వాత పట్టుగూడుకున్న ఈగలను దులిపి మైనపు ముద్దలాంటి పట్టును ఎక్స్ట్రాక్టర్లో తిప్పితే గాని తేనె బయటకు రాదు. ఈ ప్రక్రియలో తేనె గుడ్లు పాడవ్వటంతో పాటు ఈగలు, పెద్ద సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియకు మెరుగులు దిద్ది ఫ్లో హనీని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా స్థానిక వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞానకేంద్రంలో శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరపనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చిరంజీవి చౌదరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. -
మద్యేమార్గంగా మంతనాలు
నూతన నిబంధనలతో మద్యం వ్యాపారులు సతమతం హైవేలకు దూరంగా దుకాణాల ఏర్పాటుకు యత్నాలు ప్రజల నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అమలాపురం టౌన్ : మద్యం కొత్త పాలసీలో భాగంగా నేషనల్, స్టేట్ హైవేలకు నిర్దేశిత దూరాల్లో కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు లైసెన్సులు పొందిన వ్యాపారులకు, సిండికేట్లకు ఇబ్బందిగా మారింది. ఇన్నాళ్లు ప్రధాన రహదారుల చెంత దుకాణాల్లో దర్జాగా వ్యాపారం చేసిన వారికి కొత్త నిబంధనలు రుచిండం లేదు. నగరం, పట్టణం లేదా గ్రామంలో హైవేలకు కాస్త దగ్గరగా ఉండే అంతర్గత రోడ్లు, బైపాస్ రోడ్లను ఎంచుకుంటున్నారు. ఆ రోడ్లలో నివాస గృహాలు, పాఠశాలలు, ఆలయాలు, అంబేద్కర్ తదితర జాతీయ నేతల విగ్రహాలు ఉంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, అంబాజీపేట, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఈ తరహా నిరసనలు మొదలయ్యాయి. నెల రోజుల కిందట సామర్లకోట, పిఠాపురం తదితర పట్టణాల్లో కూడా కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు సన్నాహాలకు అక్కడి ప్రజలు అడ్డంపడిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు చేపట్టేందుకు ఎక్కువగా మహిళలే ముందుకు వస్తున్నారు. దీంతో మిగిలిన మద్యం లైసెన్సుదారులు తమ దుకాణాల ఏర్పాట్లను రహస్యంగా చేసుకుంటున్నారు. దుకాణం అద్దెకు ఇచ్చే భవన యాజమానిని లేదా స్థానికులను బతిమాలుకుంటున్నారు. కొంత మంది ఇక చేసేది లేక పట్టణ లేదా గ్రామ శివార్లకు వెళ్లి ఇళ్లు లేని ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఏర్పాటుచేసుకుంటుంటుగా, మరి కొందరు శ్మశానాలు, లే అవుట్లు చేసి ఇళ్లు నిర్మించకుండా ఖాళీగా ఉన్న స్థలాల్లో మద్యం దుకాణాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరహాలో అమలాపురం పట్టణం, రూరల్ మండలంలో ఇద్దరు మద్యం లెసెన్సుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి అమలు కానున్న కొత్త నిబంధన ప్రకారం హైవేలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రానున్న పది రోజుల్లో లెసెన్సుదారుల దుకాణ ఏర్పాట్లు ఎంత గుట్టుగా చేసినా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియగానే నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనలు ఇలా.. కొత్త మద్యం పాలసీ ప్రకారం 20 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నేషనల్, స్టేట్ హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసుకోవాలి. అంటే ఈ నిబంధన దాదాపు గ్రామాలకు వర్తిస్తుంది. అదే 20 వేల జనాభా ఉన్న ప్రాంతమైతే 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేయాలి. అంటే ఈ నిబంధన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తిస్తుంది. జిల్లాలో 555 మద్యం దుకాణాలకు ఇటీవల ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేసింది. నేడు వారంతా హైవేలకు దూరంగా దుకాణాలు ఏర్పాటుచేసుకునే పనిలో పడ్డారు. అమలాపురం, రావులపాలెం, పిఠాపురం, సామర్లకోట తదితర చోట్ల ప్రజల అభ్యంతరాలతో ప్రత్యామ్నాయ ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఈ నిబంధనలు కొంచెం సడలించే అవకాశాలు ఉండడంతో జిల్లాలోని మద్యం లైసెన్సుదారులు ఆ కొత్త నిబంధనల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్లోని టాక్ కేంద్ర కార్యాలయంలో కార్యవర్గ కుటుంబసభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపకుడు, ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో బాగస్వాములైనందుకు గర్వాంగా ఉందని, అలాగే రాష్ట్ర ఏర్పాటును కూడా చూసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కెసిఆర్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ వల్లే సాధ్యమని, ఉద్యమంలో వెంట ఉన్నట్లే బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా కేసీఆర్ వెంట ఉండి తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. మొట్ట మొదటిసారి టాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు జూన్ రెండు నాడే జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తామంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు. సేవే లక్ష్యం, బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తూ.. తెలంగాణ సమాజానికి తమ వంతు బాధ్యతగా సేవ చేస్తామని, బంగారు తెలంగాణ లో భాగస్వాములమవుతామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ముఖ్య నాయకులు మట్టా రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, కార్యవర్గ సభ్యులు మత్తా రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, విజయలక్ష్మి, సుమా దేవి, మధుసూదన్ రెడ్డి, రత్నాకర్, అశోక్, నవీన్, విక్రమ్, సత్య, శైలజ, వెంకట్ రెడ్డి, రవి రైతినేని, సత్యం కంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అవతరణ దినోత్సవానికి భారీ భద్రత
జగిత్యాల క్రైం : రాష్ట్ర అవతరణ దినోత్సవం శుక్రవారం ఖిలాలో జరగనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అనంతశర్మ తెలిపారు. గురువారం పోలీసు క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 300 మందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు డీఎస్పీలతోపాటు ఆరుగురు సీఐలు, 29 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు 50 మంది, కానిస్టేబుళ్లు 135 మంది, హోంగార్డులు 50, మహిళా కానిస్టేబుళ్లు ఆరుగురు, మహిళ హోంగార్డ్స్ 20, జిల్లా గార్డ్స్ 60 మంది, ఏఆర్ 21 మంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ఖిలా పరిసర ప్రాంతాల్లో రెండు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఖిలా లోపల జగిత్యాల డీఎస్పీ కరుణాకర్, వెలుపల మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డిలకు భద్రత ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు. ఖిలా ఆవరణలోకి చీఫ్విఫ్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రముఖుల వాహనాలకే మాత్రమే అనుమతి ఇచ్చారు. వీఐపీ గ్యాలరీకి పాస్లు జారీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పాస్లు అందిస్తున్నారు. -
వీడని వివాదాల చెర
అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం తనకు తెలియకుండా ముహూర్తం నిర్ణయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం జూన్ నాలుగుకు మారిన ముహూర్తం అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానం పాలకమండలి నియామక జీఓ ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఇప్పటివరకూ పాలకమండలి ప్రమాణస్వీకార వేదిక విషయంలో వివాదం ఏర్పడగా, ఇప్పుడు తేదీ విషయంలో మరో వివాదం తలెత్తింది. దీంతో జూన్ నాలుగో తేదీకి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. పాలకమండలి ప్రమాణ స్వీకారానికి జూన్ ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి ఆతర్వాత తనను దేవస్థానం అధికారులు ఆహ్వానించడంపై ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందువల్ల జిల్లా మంత్రులు కానీ, తాను కానీ హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటో తేదీన ప్రమాణస్వీకారం జరుగుతుందని పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన 16 మందికీ దేవస్థానం అధికారులు సమాచారం పంపించారు. ఆ సభ్యులు భారీ ఊరేగింపుతో అన్నవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాణస్వీకార తేదీ మార్పుపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు జూన్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలు కొత్త ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో కళావేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వీలుగా తేదీ మార్పు దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు హాజరయ్యేందుకు వీలుగా జూన్ నాలుగో తేదీకి మార్పు చేసినట్టు ఈఓ కె. నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ‘సాక్షి’ కి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున ఆ తేదీని మార్చామన్నారు. ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. -
కౌలు రైతుకు గుర్తింపు ఏది?
దెందులూరు : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా పాలకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు ఎంతోకొంత మేలు చేకూర్చే గుర్తింపు కార్డుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదు. ఖరీఫ్కు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఊదరగొడుతున్నా గుర్తింపు కార్డుల పంపిణీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. భూములను సాగు చేసేది కౌలు రైతులే అయినా ప్రభుత్వ రాయితీ పొందాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీని సక్రమంగా చేపట్టకపోవడంతో ఏటా వేల మంది రైతులకు రాయితీలు అందక అప్పుల పాలవుతున్నారు. భూయజమానుల బినామీలకు కార్డులు ప్రభుత్వం గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకునేలా గుర్తింపుకార్డుల ద్వారా ప్రభుత్వ రాయితీలు, సహాయ, సహకారాలు, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, పంట రుణాలు ఇతర రాయితీలను ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో భూయజమానుల బినామీలకు, అనర్హులకు కార్డులు కట్టబెడుతున్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు అందటం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ప్రక్రియ, గ్రామ సభలు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. జిల్లాలో 3 లక్షల 25 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామాల్లో 2 లక్షల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరం.వీరంతా గుర్తింపుకార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కార్డులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రూ.20 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కార్డుకు రూ.120 వరకు వసూలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉచితంగా ఇవ్వాలి. రూ.20 నుంచి రూ.120 వరకూ కొన్నిచోట్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి. నేటూరి గోపాలకృష్ణ, కౌలు రైతు, కొవ్వలి అర్హులందరికీ కార్డులివ్వాలి ఉపాధి హామీ పథకం పనుల వివరాలు గ్రామ పంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఎలా చెబుతున్నారో, అదే విధంగా రైతులకు ప్రభుత్వం ద్వారా అందే పంట రుణాలు, రాయితీలు పూర్తిస్థాయి వివరాలు తెలియజేయాలి. కౌలు రైతులందరికీ కార్డులివ్వాలి ఎ.మోహనరావు, కౌలు రైతు, రాజుపేట 2 లక్షల మందికి రాలేదు 2011 భూఅధీకృత సాగుదారు చట్టం అమలు లోపభూయిష్టంగా ఉంది. ఉన్నతాధికారులు అంకితభావంతో పర్యవేక్షణ, విధులు నిర్వహణ చేయాలి. లక్ష్యానికి అనుగుణంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, 2 లక్షల మందికి ఇవ్వకపోవడం, భూయజమానుల బంధువులకు, బినామీ కార్డులు అధికమవ్వడం దురదృష్టకరం. కె.శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
- ఛైర్మన్గా వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్ - ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు - బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం - జీఓ విడుదల చేసిన ప్రభుత్వం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ విడుదల చేసింది. గతంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు ( వంశపారంపర్య ధర్మకర్త)తో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు.ఈ సంఖ్యను తెలుగుదేశం ప్రభుత్వం 16కు పెంచింది. ఇందులో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధానార్చకుడితోపాటు 13 మంది టీడీపీకి చెందినవారున్నారు. ఒకరు బీజేపీ, మరొకరు ఆలయానికి విరాళాలిచ్చిన దాత ఉన్నారు. పాలక మండలి సభ్యులు వీరే... వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా ఇనుగంటి వేంకట రోహిత్, పాలక మండలి సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ, పర్వత గుర్రాజు(రాజబాబు) యనమల రాజేశ్వరరావు, యడ్ల బేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి , కొత్త విశ్వేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, సింగిలిదేవి సత్తిరాజు, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, కొండవీటి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఈ పాలకమండలికి ఛైర్మన్గా ఐవీ రోహిత్ వ్యవహరిస్తారని, కొండవీటి సత్యనారాయణ ఎక్స్అఫీషియో సభ్యునిగా, మిగిలిన వారంతా సభ్యులుగా వ్యవహరిస్తారని ఆ జీఓలో పేర్కొన్నారు. -
ఖరీఫ్పై నీలి నీడలు
మొరపెట్టుకున్నా కరుణించేవారేరీ? ఈ ఏడాది జూ¯ŒS 15 తరువాతనే సాగునీరు సాగు సమ్మెలో డిమాండ్నూ పట్టించుకోని వైనం బ్రిటిష్ కాలంలో పద్ధతిగా నీళ్లిచ్చేవారు ఆ ప్రణాళిక అమలు చేయాలంటే పట్టించుకోని వైనం మండిపడుతున్న డెల్టా రైతులు అమలాపురం : తెల్లవారి పాలనలో... బ్రిటిష్ పాలనా కాలంలో మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇచ్చేవారు. జూ¯ŒS 15 నాటికి రైతులు నాట్లు పూర్తి చేసేవారు. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తయి అన్నదాతలంతా ఆనందంతో గడిపేవారు. ఆ తరువాత అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వచ్చిన అల్ప పీడనం, తుపాన్ల బారి నుంచి బయటపడేవారు. మనవారిపాలనలో... మే 15వ తేదీన కాకుండా ఓ నెల ఆలస్యంగా అంటే జూ¯ŒS 15 తరువాత నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తుపాన్లలో చిక్కి చేతికొచ్చే పంటా వరదపాలయ్యేది. 2011లో సాగు సమ్మె ఉధృతంగా జరిగింది. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి 2012 మే 25న సాగునీరు విడుదల చేశారు. ఆ తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో గత ఖరీఫ్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. ‘బ్రిటీష్ కాలంలో ఇచ్చినట్టుగా మే 15 నాటికి సెంట్రల్ డెల్టాకు సాగునీరు ఇవ్వాలి. అలా ఇస్తే జూ¯ŒS 15 నాటికి నాట్లు పూర్తి చేస్తాం. అక్టోబరు 15 నాటికి కోతలు పూర్తవుతాయి. అప్పుడే మా పంట మాకు దక్కుతుంది. ఆలస్యమైతే అక్టోబరు 20 నుంచి నవంబరు 20 మధ్యలో వస్తున్న అల్ప పీడనలు, తుపాన్లకు పంట నష్టపోవడం పరిపాటిగా మారింది’ అని డెల్టా రైతులు మొరపెట్టుకుంటున్నారు. 2011లో జరిగిన సాగు సమ్మె ఉద్యమ సమయంలో ఇదే ప్రధాన డిమాండ్. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లలో ఇదొకటి. సాగుసమ్మె జరిగిన తరువాత ఏడాది 2012 మే 25న సాగునీరు ఇచ్చిన ఇరిగేష¯ŒS అధికారులు తరువాత ఏడాది నుంచి యథావిధిగా జూ¯ŒS 15 తరువాతే విడుదల చేస్తున్నారు. దీంతో డెల్టా రైతులు పంటను నష్టపోతున్నారు. దీనికి నిరసనగా గత ఖరీఫ్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు విరమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా జూ¯ŒS 15 తరువాతే మధ్య డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడం ఇక్కడ గమనార్హం. ‘కనీస సదుపాయాలు కల్పించండి ... పంట పండించి దేశానికి ధాన్యరాశులు అందిస్తాం’ రైతులు చేస్తున్న డిమాండ్ ఇదీ. డెల్టాలో సాగవ్వాల్సిన 40 వేల ఎకరాలను బీడుగా పెట్టి ప్రాధేయపడుతున్న వేడుకోలు ఇది. అయినా పాలకులు పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడంతో అన్నదాతలుఅల్లాడిపోతున్నారు. మే రానే వచ్చింది. మళ్లీ రైతన్న పిడికిలి బిగుస్తోంది. అన్ని అనర్థాలకూ ఇదే కారణం... lసాగునీరు ఆలస్యంగా ఇవ్వడమే మధ్య డెల్టాలో సాగు నష్టపోవడానికి కారణమవుతోంది. జూ¯ŒS 15 నాటికి నీరు విడుదల చేయడం వల్ల అక్టోబరు 20 తరువాత తుపాన్లబారిన పడి పంట నష్టపోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు. l తుపాన్ల నుంచి పంటను రక్షించుకునే ఉద్ధేశంతో కొంతమంది రైతులు సాగు ఆలస్యం చేసి ఆగస్టు మొదటివారంలో నాట్లు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డిసెంబరు నెలాఖరు నాటికి కాని కోతలు పూర్తి కావడం లేదు. దీంతో రబీసాగు ఆలస్యమవుతోంది. రబీ నాట్లు సంక్రాంతి తరువాత కూడా పడడం వల్ల ఏప్రిల్ 10 వరకు సాగునీరు విడుదల చేయాల్సి వస్తోంది. తమకు ఈ నెల 20 వరకు సాగునీరు విడుదల చేయాలని కొంతమంది రైతులు కోరుతుండడం చూస్తుంటే సాగు ఎంత జాప్యమవుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్, రబీ ఆలస్యం కావడం వల్ల మూడో పంట అపరాలు సాగు లేకుండా పోతోంది. దీనివల్ల రైతులు అదనపు ఆదాయం కోల్పోవడమే కాకుండా భూసారాన్ని పెంచి పచ్చిరొట్ట ఎరువులకు దూరమవుతున్నారు. కాలువలను ఆలస్యంగా మూసివేయడం వల్ల అటు ఇరిగేష¯ŒS శాఖాధికారులు సైతం ఆధునికీకరణ పనులను ఆశించిన స్థాయిలో చేయడం లేదు. ఈ అనర్ధాల నుంచి గట్టెక్కాలంటే మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్లోను కష్టాలు తప్పేటట్టు లేవు. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం!
► నాయకుల ఎదుటే ఇరువర్గాల బాహాబాహీ టంగుటూరు (కొండపి) : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టంగుటూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి సాక్షిగా బుధవారం తన్నుకున్నారు. తన ఎదుటే పార్టీకి చెందిన ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఎమ్మెల్యే హతాశుడయ్యారు. ఇదీ.. జరిగింది: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక బొమ్మల సెంటర్ కూడలిలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. స్థానిక రాజీవ్ నగర్కు చెందిన టీడీపీ నేత రాచపూడి రాము లేచి రాజీవ్ నగర్ సమస్య అలాగే పెండింగ్లో ఉందని, సమస్యను పరిష్కరించకుండా ఏళ్లతరబడి మాటలతో సరిపెడుతున్నారంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి అసహనంగా అన్నాడు. అక్కడే ఉన్న సర్పంచి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రాముపైకి దూకారు. కె.శ్రీను, వెంకట్రావ్ అనే కార్యకర్తలు దాడి చేయడంతో రాము కిందపడ్డాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నా ఎవరూ వారిని వారించకపోవడం గమనార్హం. బిత్తరపోయిన ఎమ్మెల్యే స్వామి ఎందుకొచ్చిన తంటా..అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరువర్గాలనూ నిలువరించారు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసుస్టేషన్లో కేసులు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావును వివరణ కోరగా ఇరువర్గాలు ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. -
భవిష్యత్ వైఎస్ఆర్సీపీదే
– 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం – ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం – జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, 2019లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి మురళీకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంపుల్లయ్య యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజవిష్ణువర్దన్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలక పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని, సీఎం చంద్రబాబునాయుడు..వైఎస్ఆర్సీపీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. త్వరలో జరగబోయే కర్నూలు మునిసిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు దృష్టిసారించాలన్నారు. గెలుపుకోసం ప్రణాళికలు రచించి ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు యాదవ్, సురేందర్ రెడ్డి, రమణ, జహీర్ అహ్మద్ఖాన్, గోపీనాథ్యాదవ్ పర్ల శ్రీధర్, కర్నాటి పుల్లారెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, రెహ్మన్, మద్దయ్య, మంగమ్మ, సలోమి, విజయలక్ష్మీ, కటారి సురేష్ తదితరు పాల్గొన్నారు. హోలీ వేడుక వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అనంతరం నాయకులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. తమ పార్టీ భవిష్యత్ రంగ కేళిగా ఉంటుందని ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. -
ప్రజాపోరాటాలే శ్వాసగా.. తిరుగులేని ప్రత్యామ్నాయంగా..
ఏడో వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగిడుతోంది. సమాజంలోని అన్ని వర్గాలతోపాటు ఆంధ్రనాట సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘పేరు’ ప్రతిష్టలను కూడా పొదువుకున్న పార్టీ అది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు ఆయన ఆశయాలను, ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూడాలన్న ఆకాంక్షను కూడా వారసత్వంగా స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ మహోన్నత ఆశయంతో స్థాపించిన పార్టీ. పదవులు, సీట్ల ‘లెక్క’ కోసం దిగజారే రాజకీయాలకు అది దూరం. గెలుపు కోసం రకరకాల ఎత్తుగడలతో కూడిన సాంప్రదాయ రాజకీయాలు ఆ పార్టీలో కనబడవు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ... శాసనసభలోనైనా, వెలుపలైనా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పోరాడుతూ ఒక దృఢమైన రాజకీయ పార్టీగా అవతరించింది. ఆరేళ్లుగా పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకుని నిలబడింది. ఇద్దరి రాజీనామాతో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం.. మూడేళ్లలోనే 67 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో బలమైన ఏకైక అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. అధికారానికి చేరువగా వచ్చి అత్యంత ప్రజాదరణ గలిగిన పార్టీగా నిరూపించుకుంది. ఎన్నికల ముందుగానీ, ఆతర్వాతగానీ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పోరాడుతూ ఇపుడు రాష్ట్రంలో తిరుగులేని ఏకైక ప్రత్యామ్నాయంగా నిలబడింది. పార్టీ అంటే ఎత్తుగడలు కాదు.. రాజకీయ పార్టీ అంటే ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి ఎంతకైనా దిగజారడం... ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అలాంటి సాంప్రదాయ పద్ధతులన్నిటినీ వైఎస్ఎస్ఆర్సీపీ బద్దలుకొట్టింది. నైతిక విలువలకు పెద్దపీట వేసింది. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత అనే కొత్త ఒరవడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తను కాంగ్రెస్ పార్టీని వీడినపుడు రాజీనామా చేసి తిరిగి గెలిచారు. అలాగే తన వెంట నడవాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబడి ప్రజల తీర్పు కోరేలా చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరాలనే ఉన్నతమైన విధానానికి ఎప్పుడూ కట్టుబడి ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ప్రజల మనసులో స్థానం సంపాదించాలే తప్ప దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడరాదన్నది జగన్ అభిమతమని, అదే తమ పార్టీ విధానమని ఆయన వివరించారు. ఒక ప్రాంతీయ పార్టీ.. దేశంలోనే ఇలా సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రాజకీయాలు నడపగలదని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రజలతో మమేకం కావడం, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయడం తప్ప రాజకీయ పార్టీకి ఇతర షార్ట్కట్లు ఏవీ ఉండరాదన్నది వైఎస్ఆర్సీపీ విధానం. అదే దాని సిద్ధాంతం. అందుకే ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు చేరువలో ఉండేలా, ప్రజలతో మమేకమయ్యేలా ఉంటాయని, జగన్మోహన్రెడ్డి అనునిత్యం ప్రజలకు దగ్గరగా ఉండడానికి, ప్రజా సమస్యలపై పోరాడడానికే ప్రాధాన్యతనిస్తుంటారని వైఎస్సార్సీపీకి చెందిన మరో సీనియర్ నేత పేర్కొన్నారు. విలువలే ప్రాణం.. రాజకీయ విలువలకు వైఎస్ఆర్సీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకోవడానికి అనేక ఉదంతాలు చూడవచ్చని ఆ పార్టీ నాయకులంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సంఘటనను పార్టీ సీనియర్ నాయకుడొకరు వివరిస్తూ ‘‘వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు గనుక ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేస్తానని జగన్ మాట ఇచ్చారు. వీరభద్రస్వామి ఓడిపోయారు. అయితే అప్పటికి ఆయన ఎమ్మెల్సీ రాజీనామా సాంకేతిక కారణాల రీత్యా ఆమోదం పొందలేదు. ఎమ్మెల్సీగా కొనసాగుతారా అని మండలి నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. అయినా ఆ రాజీనామా ఆమోదం పొందాల్సిందేనని వైఎస్ఆర్సీపీ తేల్చిచెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్సీ పదవి అది. ఆ తర్వాత జగన్ ఇచ్చిన మాట ప్రకారం వీరభద్రస్వామిని వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీని చేశారు. ఆరోజు విలువలదేముందిలే.. అని అనుకుని ఉంటే వైఎస్సార్సీపీకి ఓ ఎమ్మెల్సీ పదవి మిగిలేది.’’ అని గుర్తు చేశారు. ‘‘ఆనాడు వైఎస్ఆర్సీపీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఆమోదించి ప్రజల తీర్పు కోరే ధైర్యం లేక అధికారపార్టీ మిన్నకుండిపోయింది. పదేపదే స్పీకర్ను కలసి మా రాజీనామాలను ఆమోదించండి అని ఆ ఎమ్మెల్యేలు కోరడం చూసి దేశమే ఆశ్చర్యపోయింది. చివరకు సభలో అవిశ్వాస తీర్మానం పెడితే నాటి ప్రతిపక్ష తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడింది. కానీ ఆ 17మంది పదవులు పోతాయని తెలిసి కూడా విప్ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం వైఎస్ఆర్సీపీ విలువలతో కూడిన రాజకీయాలకు అద్దం పడుతుంది.’’ అని ఆ నేత వివరించారు. చట్టసభల్లోనూ, వెలుపలా అదే నిబద్ధత ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి.. ఒక కమిట్మెంట్తో పనిచేయాలి తప్ప ఆషామాషీగా వ్యవహరించరాదన్నది వైఎస్సార్సీపీ విధానం. అందుకోసం అది చట్టసభలోనూ, వెలుపలా అదే నిబద్ధతతో కృషి చేస్తోంది. అధికారపక్షం మంద బలంతో ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వకపోయినా, సస్పెన్షన్లతో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నా.. ప్రజా సమస్యల పరిష్కారానికి సభావేదికను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్నది. ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ఏ అంశంపైనైనా సమగ్రమైన సమాచారంతో, పూర్తి అవగాహనతో సభకు వచ్చి అధికారపక్షాన్ని నిలదీయడం, పరిష్కార మార్గాలను సూచించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుతున్నాయి. బాధ్యత గలిగిన ప్రతిపక్షనేతగా సభలోనూ, వెలుపలా ప్రజా సమస్యలపై జగన్ స్పందిస్తున్న తీరును విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారని, పార్లమెంటులోనూ తమ పార్టీ ఇదే విధంగా ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన మరో సీనియర్ నేత తెలిపారు. పార్లమెంటు సాక్షిగా లభించిన హోదా హామీని సమాధి చేసేందుకు అధికార పార్టీ రకరకాల కుట్రలు సాగిస్తున్నా మూడేళ్లుగా పార్టీ సాగించిన పోరాటాల వల్లే అది ఇంకా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఏడో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వైఎస్సార్ స్వర్ణ యుగాన్ని సాధించాలని, సంక్షేమం కోసం పాటుపడాలన్న తమ కర్తవ్యాలకు పునరంకితమవుతున్నామని ఆ నేత వెల్లడించారు. -
మెట్ట ప్రాంతంలో ముందే పూసిన మామిడి
మంచు దెబ్బకు భయపడుతున్న రైతులు చింతలపూడి: వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మామిడి తోటలు ముందుగానే పూతకు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 30 శాతం తోటలు పూత పూసినట్లు ఉద్యానాధికారులు తెలిపారు. అయితే పూతకొచ్చిన తోటలకు మంచు దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు, మూడేళ్ళుగా ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్ధానం, జిల్లాలో ప్రధమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు మెట్ట ప్రాంతంలో గత దశాబ్దంన్నరగా గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమక్రమంగా 10 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. మామిడి తోటల అభివృధ్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. సస్యరక్షణ చేయాలి పొడి వాతావరణం కారణంగానే నెల రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నందున గత 10 రోజులుగా తోటల్లో పూత కనపడుతూందని అధికారులు చెప్పారు. రైతులు ఇప్పట్నించీ సరైన సస్య రక్షణ చేపట్టాలని సూచించారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. తేనే మంచు పురుగు నివారణ ఇలా... ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. లేత పూ మొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. కె సంతోష్, ఉద్యానాధికారి -
ప్రభుత్వంపై సమరానికి రైతులు సై
–చింతలపూడిలో నేడు జిల్లా రైతు సదస్సు చింతలపూడి: ప్రభుత్వంపై సమరానికి చింతలపూడి ఎత్తిపోతల పధకం రైతులు సమాయత్తమవుతున్నారు. గురువారం చింతలపూడిలో జరిగే జిల్లా రైతుల సదస్సు ఇందుకు వేదిక కానుంది. జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా మార్కెట్ కమిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో రాజకీయాలకు అతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడే విధంగా పోరాటానికి నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని ఈ పధకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడంతో జిల్లా రైతుల్లో ఆందోళన కలిగిస్తూంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఈ పధకం ఏడేళ్ళు పూర్తయినా ఇంతవరకు పూర్తి కాలేదు. పరిహారం విషయంలో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో భూసేకరణ అధికారులకు సమస్యగా మారింది. ఈ నేపధ్యంలోనే రైతులు గత మేనెలలో ఆందోళనకు దిగి కాల్వ త్రవ్వకం పనులను అడ్డుకోవడంతో ఏడు నెలలుగా పనులు నిలిచి పోయాయి. పెరిగిన వ్యయం ః మొదటి దశలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పభుత్వం మంజూరు చేసిన రు 17.01 కోట్లతో పాటు ప్రభుత్వం రెండో దశలో కృష్ణా జిల్లాలో మరో 2.80 లక్షల ఎకరాలను చేర్చి ప్రాజెక్టు వ్యయాన్ని రు 4,909.80 కోట్లకు పెంచారు. ఇందులో మొదటి దశ సామర్ధ్యాన్ని పెంచడం వల్ల మరో 808 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇక రెండో దశ పనులకు రు 2,400 కోట్లు అంచనా కట్టారు. దీంతో పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో మొత్తం 4.80 వేల ఎకరాలకు సాగు నీరు. త్రాగునీరు అందే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. చింతలపూడి ప్రధాన కాలువ ద్వార తొలుత 2 వేల క్యూసెక్కుల నీరు పారడానికి వీలుగా 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు ఉండేలా త్రవ్వకం పనులు చేపట్టారు. ఇప్పుడు సామర్ధ్యం పెరగడంతో మరో మూడు మీటర్ల మేర కాల్వ ఎత్తు పెంచడానికి నిర్ణయించారు. అయితే కాల్వ ఎత్తు పెంచితే కాల్వపై కట్టే వంతెనలు, తూములు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే జల్లేరు వద్ద తొలుత 8 టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ను నిర్మించాలని భావించారు. తీరా అది 20 టీఎంసీల సామర్ధ్యానికి పెంచుతూ ప్రతిపాదనలు పంపించారు. పేరుకే చింతలపూడి ఎత్తిపోతల ః పేరుకు చింతలపూడి ఎత్తిపోతల పధకం అయినా ఈ పధకం వల్ల ఎక్కువ ప్రయోజనం కృష్ణా జిల్లాకు కలుగుతూందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లాకు చెందిన ప్రతినిధి కావడంతో ఈ నీటిని తమకు కాకుండ తరలించుకు పోవడానికి కుట్రలు పన్నుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా రైతుల అవసరాలు తీరాకే కృష్ణా జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత కాని ఎంపీ మాగంటి బాబు , ఇతర ప్రజా ప్రతినిధులు కాని ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు నోరు మెదపక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో మంజూరైన పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలోని పంటలకు నీరు ఇచ్చాకే మిగులు వాటర్ కృష్ణాకు ఇవ్వాలని రైతులు yì మాండ్ చేస్తున్నారు. భూసేకరణకు ససేమీరా అంటున్న రైతులు జిల్లాలో పట్టిసీమ కాల్వకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల కాల్వ రైతులకు మరోలా నష్టపరిహారం అంద చేయడంతో రైతులు భూ సేకరణ కు అడ్డు పడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాల్వ క్రింద రైతులకు ఎకరానికి రు 30 లక్షలకు పైగా చెల్లించి , చింతలపూడి మండలంలో ఎకరానికి 12 నుండి 15 లక్షలే ఇస్తామని చెప్పడం పట్ల రైతుల్లో అభ్యతరం వ్యక్తమవుతూంది. ఒకే ప్యాకేజ్ అమలు చేయాలి జిల్లాలోని ఎత్తిపోతల పధకాల రైతులందరికీ ఒకే ప్యాకేజి అమలు చేయాలి. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రితో మాట్లాడాలి. చింతలపూడి ఎత్తిపోతల పధకం ద్వార వచ్చే గోదావరి జలాలు పూర్తిగా జిల్లా రైతులు వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. అలవాల ఖాదర్బాబురెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పధకం అఖిల పక్షం రైతు సంఘం అధ్యక్షులు -
వాయు ’గండం’ గుబులు
-4 నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ -ఆందోళన చెందుతున్న అన్నదాతలు కొవ్వూరు: ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో గుబులు మొదలైంది.రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో వరిపంట కోత దశలో ఉంది.జిల్లా వ్యాప్తంగా 2.30లక్షల హెక్టార్లులలో నాట్లు వేయగా ఇప్పటి వరకు కేవలం 30వేల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి.ఈ వారం, పదిరోజుల్లో సగం ఆయకట్టులో కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.జిల్లాలో నవంబర్ నెలాఖరు నాటికి వరికోతలు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో తుఫాన్ ప్రభావంతోఈదురు గాలులు వీస్తే పంటంతా నేలకి ఓరిగే ప్రమాదం ఉంది. వాయుగుండం తీవ్ర రూపం దాల్చితే భారీగా పంటలు నష్టపోవావాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల మూడో తేదీ నుంచే వాయుగుండం ప్రభావం కనిపించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబోలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లా పలు మండలాల్లో వర్షాలు పడడంతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైంది.అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.ఆరుగాలం శ్రమించి పండించి న పంట చేతికి అందే సమయంలో తుఫాన్ వస్తే నిండా మునిగిపోతా మని రైతులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్లోనే గండం....? జిల్లాలో 2012లో నీలం, 2013లో హెలెన్ తుపాన్లు అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలోనే వచ్చాయి. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వత బంగాళాఖాతంలో వాయుగుండం రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అప్పట్లో నీలం తుఫాన్ ప్రభావంతో 1,29,368 హెక్టార్లుల్లో రూ.128.27 కోట్లు మేరకు పంటకి నష్టం వాటిల్లింది.ఇంకా 255.21 హెక్టార్లుకు నష్ట పరిహారం నేటికీ అందలేదు. 2013 నవంబర్లో హెలెన్ తుఫాన్ జిల్లాలో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.జిల్లా వ్యాప్తంగా హెలెన్ ప్రభావంతో 78,662.86 హెక్టార్లు లలో రూ.78.66కోట్లు మేరకు పంటనష్టం వాటిల్లింది. మూడేళ్లు గడుస్తున్నా జిల్లాలో ౖరైతులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఆ గాయాల నుంచి రైతులు ఇంకా కోలేదు. ఇప్పుడు మరో విపత్తు ముంచుకోస్తుందన్న వార్త రైతుల్ని కలవరానికి గురిచేస్తుంది. జిల్లాలో 4.3 మి.మీటర్లు సరాసరి వర్షపాతం: గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో 4.3 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో పెదపాడు మండలంలో గరిష్టంగా 70.4 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది.నల్లజర్లలో 38.4, భీమడోలులో 32.2, కొయ్యలగూడెంలో 26.4, పోలవరం మండలంలో 16.6, ఏలూరులో 15.0 మి.మీటర్లు చోప్పున వర్షపాతం రికార్డయ్యింది. తాళ్లపూడి, గోపాలపురం, పెదవేగి, జీలుగుమిల్లి మండలాల్లో చెదురు మెదరుగా చినుకులు పడ్డాయి.అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి.ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇదే తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారునుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ టీ రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ స్థాపించిన ఎన్టీఆర్ కారణ జన్ముడన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎన్నో వైద్య, దంత, పారా మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్ అనురాధ, సుబ్బారావు, పరీక్షల నియంత్రణ అధికారి విజయ్కుమార్, ముఖ్య ఇంజినీర్ కేఎల్ఆర్కే ప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పడకేసిన చింతలపూడి
–నత్తనడకన భూసేకరణ ప్రక్రియ –ఎక్కడిక్కక్కడే ఆటంకాలతో నిలిచిపోయిన పనులు –దృష్టి సారించని ప్రభుత్వం –నెరవేరని మెట్టరైతుల కల కొవ్వూరు: జిల్లాలో మెట్ట రైతుల మేలు చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు పడకేశాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈపధకం పూర్తి చేయడం పట్ల శ్రద్ద చూపడం లేదు.పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటీకీ ఇరవైఐదు శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయి.టీడీపీ అధికారంలోకి వచ్చి సుమారు మూఫైనెలలు కావస్తుంది.పనుల్లో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు.రూ.1,701 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ పధకం పనులు ఇప్పటి వరకు కేవలం రూ.456 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారు.భూసేకరణ ప్రక్రియ నత్తనడక కొనసాగుతుంది.ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 1,828 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం మూఫైశాతం భూమిని మాత్రమే సేకరించారు. కష్ణ జిల్లా రైతులకు ప్రయోజనాల కోసం పట్టిసీమ పధకాన్ని ఆగమేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం చింతలపూడి పధకం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మెట్ట రైతులు ్రçపశ్నిస్తున్నారు.ఈ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది.ఈ జిల్లాకి ఎన్ని మేళ్లు చేయాలో అన్నీ చేస్తాం...జిల్లా ప్రజలు చూపిన ఆధరణకి ఎప్పుడు రుణపడి ఉంటానని పదేపదే వల్లెవేస్తున్న సీఎం చంద్రబాబు చింతలపూడి పధకం పనులు పూర్తి విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. మహానేత ఆశయానికి తూట్లు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మెట్టరైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని రూ.1,701 కోట్లు వ్యయంతో గోదావరి నీటిని తరలించే ందుకు ఈ çపధకం మంజూరు చేశారు.2008 అక్టోబర్ 30న శంకుస్ధాపన చేశారు.మెట్టప్రాంతంలో 16 మండలాల్లో 196గ్రామాల పరిధిలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేందుకు ఈ ప«దకాన్ని రుపోంది ంచారు.నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరికి పధకం పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ మరణాంతరం పనులు పడకేశాయి.మరోమూడేళ్ల సమయం అదనంగా పోడిగించి వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు.అయినా ఆగడువులోపు పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నత్తనడనక భూసేకరణ ప్రక్రియ: ఈపధకం నిర్మాణానికి 18,208 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా దీనిలో 6,683 ఎకరాల అటవీశాఖ భూమి ఉంది.మిగతా భూమి రైతులను సేకరించాల్సి ఉంది. ఈపధకం పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టారు. దీనిలో మొదటి ప్యాకేజిలో 11,749 ఎకరాలకు గాను 6,050 ఎకరాల అటవీ భూమి ఉంది.రైతుల నుంచి సేకరించాల్సిన 5,699 ఎకరాల్లో 4,430 ఎకరాలు సేకరించారు.రెండో ప్యాకేజిలో 6,801 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దీనిలో 633 ఎకరాలు అటవీభూమి ఉంది.మిగిలిన 6,168 ఎకరాల్లో కేవలం 1,600 ఎకరాలు మాత్రమే సేకరించారు.ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ నుంచి సేకరిస్తున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపించాల్సి ఉంటుంది.విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో భూములను చూపించారు.ఇటీవలే అటవీశాఖ అధికారులు ఆభూములను పరిశీలించారు.అటవీశాఖకు ఈ భూములు బదలాయిస్తే ఇక్కడ ఆశాఖకి చెందిన 6,683 ఎకరాలు భూముల్లో పనులు చేపట్టే అవకాశం ఉంది.ప్రభుత్వం ఈ భూములు బదలాయింపు ప్రక్రియ తర్వతగతిన పూర్తి చేస్తే పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. పురోగతి లేని పనులు: చింతలపూడి పధకం మొదటి ప్యాకేజీ పనులు రూ.1,202 కోట్లు వ్యయంతో చేపట్టారు.వీటిలో ఇప్పటి వరకు రూ.359 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.ఈ ప్యాకేజీలో 110 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం పదహారు మాత్రమే పూర్తయ్యాయి. ఈప్యాకేజీలో 29.81శాతం పనులు పూర్తి చేశారు.రెండో ప్యాకేజీలో ఇప్పటి వరకు 19.55 శాతం పనులు పూర్తి చేశారు.మొత్తం రూ.497 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈప్యాకేజీలో ఇప్పటి వరకు కేవలం రూ.97 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు. భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో వివక్షత: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో భూసేకరణ చేపట్టి 117 ఎకరాలు సేకరించారు.ఈ భూముల్లో భాగంగా 77.85 ఎకరాలకు గాను గత ఏడాది అక్టోబరులో రూ.25, 67,22,251 అవార్డు పరిహారాన్ని ప్రకటించారు. 50 మంది రైతుల నుంచి ఈ భూములను అధికారులు సేకరించారు.ఈపరిహారం నేటికి రైతుల బ్యాంకు ఖాతాలో జమకాలేదు.గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావస్తున్నా రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. తొలుత ఎకరాకు రూ.29.70 లక్షల చోప్పున అందిస్తామని నమ్మించి ఇప్పుడు అధికారులు రూ.21 లక్షల చొప్పున ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బుట్టాయి గూడెం మండలంలో భూసేకరణ చేసినప్పటికీ పరిహారం పూర్తిస్ధాయిలో అందకపోవడంతో నాలుగునెలలు నుంచి పనులు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే చెల్లించారు.దెందులూరు మండలంలో పట్టిసీమ పధకానికి ఇచ్చిన మాదిరిగా తరహాలో ఎకరానికి రూ.38 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొందరు రైతులు కోర్టుకు వెళ్ళి స్టేతెచ్చుకున్నారు. దీంతో యర్రగుంటపల్లితోపాటు వెంకటాపురం, కాంతంపాలెం, చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో పనులు మే నెల నుంచి ఆగిపోయాయి.గోపాలపురం మండలం భీమోలు రైతులు పరిహారం తక్కువ మొత్తంలో చెల్లించారని కోర్టు ఆశ్రయించడంతో నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి.ఇక్కడ ఎకరాకి రూ.20లక్షల చోప్పున చెల్లించారు. పక్కనే ఉన్న అన్నదేవరపేట భూములకు రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు చెల్లించారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీలుగుమిల్లి మండలంలో రైతుల భూముల్లో పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ భూములు ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం అటవీ శాఖ భూములను పనులు కొనసాగడం లేదు. టి.నరసాపురం, బుట్టాయిగూడెంలోను అటవీ శాఖ భూములు స్వాధీనం చేసుకోకపోవడం పనులు చేపట్టలేదు. నాలుగు నెలలుగా పరిహారం ఇవ్వలేదు: మా గ్రామంలో సుమారు 30 మంది రైతుల నుంచి చింతలపూడి ఎత్తిపోతల పధకం కాలువ తవ్వకాలకు భూమిని తీసుకున్నారు. 4నెలలు కావొస్తున్నా మాకు నష్ట పరిహారం ఇంత వరకూ ఇవ్వలేదు.పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. –తెల్లం సూరిబాబు,కంగాలవారిగూడెం–బుట్టాయగూడెం మండలం. భూములకు పరిహారం తగ్గించారు: చింతలపూడి ఎత్తిపోతల పధకంలో భాగంగా తమ భూములు కూడా ఉన్నాయి. ప్రకటించిన అవార్డు సొమ్ము కాకుండా ఎకరాకు రూ.29.70లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 21 లక్షల ఇస్తామని చెబుతున్నారు.ఎంతో విలువైన, సాగుకు ఉపయోగపడే భూములను పధకానికి తాము ఇచ్చాం. కానీ తమకు ఇస్తామన్న పరిహారం ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. – పల్లా గంగాధరరావు, రైతు,తాడువాయి జంగారెడ్డిగూడెం మండలం -
విత్తనాలకూ నకిలీ మకిలి
– మొలకెత్తని మినుములు – కల్తీ వరి విత్తనాలతో రైతులకు నష్టం – ఏపీ సీడ్స్ నిర్వాకం సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నకిలీ విత్తనాల మకిలి మన జిల్లానూ తాకింది. ప్రస్తుత రబీ సీజన్లో మెట్టప్రాంతంలో వేసిన మినుము విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ సీడ్స్ సరఫరా చేసిన వరి విత్తనాల్లో వేరే రకం (కేళీలు) కలిసిపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పెదవేగి మండలంతోపాటు ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలు కల్తీవి కావడంతో రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. పెదవేగి మండలం అమ్మపాలెంలో సుమారు 300 ఎకరాల్లో కల్తీ వరి విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ఏలూరు, దెందులూరు మండలాల్లో మరో మూడు వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్లో వాడే ఎంటీయూ–1001 రకం విత్తనాల్లో రబీలో వాడే ఎంటీయూ–1010 విత్తనాలు కలిసిపోవడంతో రైతులకు నష్టం కలుగుతోంది. ఏపీ సీడ్స్ నుంచి రైతులు ఎంటీయూ–1001 రకం, బీపీటీ రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. వీటిలో ఎంటీయూ–1010 రకం విత్తనాలు కలిసిపోయాయి. కల్తీ విత్తనాలు ముందుగానే పాలుపోసుకుని గింజ గట్టిపడే దశకు చేరుకున్నాయి. అసలు విత్తనం 1001 రకం ఇంకా దుబ్బు దశలోనే ఉంది. ఎకరం విస్తీర్ణంలో నకిలీ విత్తనాల పంట ఏడెనిమిది బస్తాల వరకూ ఉంది. ఈ పంట ముందుగానే చేతికి వస్తుంది. దీన్ని కోసే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలుదారులు ఈ పంటను కొనరు. కొన్నా అతి తక్కువ ధర చెల్లిస్తారు. ఇప్పటికే ఎకరానికి రూ.15 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది. పంట చేతికి వచ్చేసరికి మరో రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఏపీ సీడ్స్ నిర్వాకం వల్ల దిగుబడి రాక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టలో మినుము మెట్ట ప్రాంతాలకు వెళితే.. కొయ్యలగూడెం తదితర మండలాల్లో మినుములు మొలకెత్తని పరిస్థితి ఉంది. ప్రై వేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన మినుములు రెండు నెలలు దాటినా మొలకెత్తలేదు. అనధికారికంగా విత్తనాలు విక్రయించే వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన మినుములు మొలకెత్తకపోవడంతో రైతులు వెళ్లి నిలదీశారు. భారీ వర్షాల కారణంగా మొక్కలు మొలవలేదన్న సమాధానం వచ్చింది. దిప్పకాయలపాడు, గొల్లగూడెం, మంగతిపతిదేవీపేట గ్రామాల్లో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. మినుము మొలకెత్తకపోగా చేలల్లో కలుపు పెరిగిపోయింది. దీంతో ఆక్కడి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. కల్తీ వరి విత్తనాలు, నకిలీ మినుము విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
కొత్త జిల్లాలతో ప్రజల్లో చిగురించిన ఆశలు
కొత్త జిల్లాలతో మారుమూల ప్రాంతాల ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా కేంద్రం అందుబాటులోకి రావడంవల్ల సంతోషించనివారు లేరు. అనేక రంగాల్లో ఎదగడానికి జిల్లా యూనిట్ ఒక ప్రాతి పదిక కల్పిస్తున్నది. చిన్న జిల్లా లవల్ల ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అభి వృద్ధి అందించే అవకాశాలు మెరుగవుతాయి. జిల్లా యూనిట్గా ప్రణాళికలు రూపొందించిన ప్పుడు ఒక జిల్లాలో ఏమేమి ఉండాలో అవి అన్ని జిల్లా లకు సమానంగా వర్తిస్తాయి. చిన్న యూనిట్ల వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది. చిన్న జిల్లాల వల్ల ఉపాధి కల్పన పెరుగుతుంది. ఉద్యోగాలు పెరుగు తాయి. తద్వారా కాస్త ఆర్థిక భారం పెరిగినా, దాని ద్వారా పెరిగేది ఉపాధి కల్పనే. అందువల్ల అదికూడా ప్రజల అభివృద్ధిలో భాగమే. ప్రస్తుతం దేశంలో 683 జిల్లాలు కొనసాగుతు న్నాయి. భారతదేశంలో చారిత్రక పరిణామాల కార ణంగా ఉత్తర అమెరికాలో వలెనే, అతి చిన్న రాష్ట్రాలు, అతి పెద్ద రాష్ట్రాలు, అతి చిన్న జిల్లాలు, అతి పెద్ద జిల్లాలు సహజీవనం చేస్తున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సాగునీటి, తాగునీటి అవసరాల గురించి ఎంత నిర్దిష్టంగా మన వాటాకోసం, మన అవసరాలకోసం కృషి చేయడం జరుగుతున్నదో గమనిస్తూనే ఉన్నాము. విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం తెలంగాణ రాష్ట్రం చేయని కృషి లేదు. అలాగే జిల్లా ప్రాతిపదికన కూడా నిర్దిష్ట ప్రాంతాల, ప్రజల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఏ ఉద్యమాలూ అవసరం లేకుండా ముందు చూపుతో తెలంగాణలో ప్రజల అవసరాలను, ఆకాం క్షలను గుర్తించి నూతన జిల్లాలు, నూతన మండలాలు, నూతన గిఫ్టు గ్రామాలు, నూతన జిల్లాల ఔటర్ రింగ్ రోడ్లు, నూతన జాతీయ రహదారుల ఏర్పాటు, నూతన స్టార్టప్లు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ప్రయోగాలు, నైపు ణ్యాల పెంపుదలకు బీసీ ఎడ్యుకేషనల్ అకాడమీ, గురు కుల, కేజీ టు పీజీ, ఉచిత విద్య వంటివి వేగవంతంగా అమలులోకి తీసుకురావడం జరుగుతున్నది. అనేక చారిత్రక కారణాల వల్ల, పరిణామాల వల్ల, మన దేశంలో, మన తెలంగాణాలో ప్రతి 25-30 కిలో మీటర్లకు భాషలో మార్పులు, మాండలికాలు ప్రత్యే కంగా కొనసాగుతున్నాయని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారిం చారు. అలాగే భాషా మాండలికాలతోపాటు, సంస్కృ తిలో, పండుగల్లో, ఆచార వ్యవహారాల్లో, ఆలోచనా విధానాల్లో వైవిధ్యం, వైరుధ్యం కొనసాగుతూ వస్తు న్నది. అందువల్ల భాషా, సాంస్కృతిక పరిణామాలను అనుసరించి కూడా చిన్న జిల్లాలను స్వాగతించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి మాండలిక, వ్యవహారిక, మాతృభాషకు గౌరవం ఏర్పడుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, చిన్న జిల్లాలుగా పరిపాలనా వ్యవస్థలు ఏర్ప ర్చడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మౌలిక అభివృద్ధికి వేస్తున్న నూతన మార్గం. వ్యాసకర్త: డా॥వకుళాభరణం కృష్ణమోహన్రావు పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్ మొబైల్ : 98499 12948 -
కాంగ్రెస్ అధికారంలోకి పునః సమీక్ష
జిల్లాల పుర్విభజనపై మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మధిర : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ అధికారంలోకివస్తే పునః సమీక్షించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేయడానికి కూడా వెనుకాడబోమని మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న వారికి శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైడ్లైన్స్ లేకుండా, కొత్త చట్టాలు చేసి జిల్లాల పునర్విభజన చేయాల్సిఉందని, సమయం లేదనంటూ 1974 జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారమే విభజన చేస్తామని చెప్పి అందుకు విరుద్దంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఏర్పాటు అతిశయోక్తిగా ఉందని భట్టి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాను మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించి ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్ను ఒకే జిల్లాగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ప్రజాభిష్టం, ప్రజాస్వామ్యబద్దంగా జిల్లాల పునర్విభజన జరగలేదన్నారు. జిల్లాలను విభజించాలంటే ప్రజాస్వామ్య బద్దంగా గైడ్లెన్స్ ఏర్పాటుచేసి విభజిస్తే బాగుంటుందన్నారు. అఖిలపక్ష సమావేశంలో జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివిజన్లపై ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వాణిని వినిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, సీపీఐ నాయకులు మందడపు నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రంగా హన్మంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మిరియాల రమణగుప్త, దుంపా వెంకటేశ్వరరెడ్డి, బత్తుల శ్రీనివాసరావు, దారా బాలరాజు, తలుపుల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మాదల రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణ జిల్లాలోని రైతులకు ఆదరణ ఏదీ?
–అందని హెలెన్ నష్టపరిహారం –అడ్రస్సులేని వడ్డీ రాయితీ ఆకివీడు: వ్యవసాయం దండగ అనే రీతిలోనే ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. రైతులను ముప్పేటా ఇబ్బందులకు గురి చేసి వరి సాగు నుండి దూరం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పింస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికి అందిన తరువాత రైతుల్ని ఛీ«దరించుకుంటున్నారని పలువురు వ్యాఖాన్నిస్తున్నారు. రుణ మాఫీ రైతుకు గుది బండగా మారింది. వడ్డీలతో రైతులకు తలకు మించిన భారంగా పరిణమించింది. రుణమాఫీతో వడ్డీలు చెల్లించని రైతులకు సొసైటీలు, బ్యాంకులు రణాలు ఇవ్వకపోవడంతో సన్న చిన్నకారు రైతులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వడ్డీలు కడుతున్నారు. కొంత మంది పుస్తెలు కూడా తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అలుపెరుగని అన్నదాత పచ్చని పైరును చూడకుండా ఉండలేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారు వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటుంటే, సాక్షాత్తూ ముఖ్యమంత్రే బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దుని హుకుం జారీ చేయడం రైతుల్లో కలకలం రేగుతోంది. హెలెన్ నష్టపరిహారం ఏదీ బాబూ! హెలెన్ నష్టపరిహారం నేటికీ అందలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం రైతులకు దక్కనివ్వకుండా ఇతరత్రార ఖర్చులకు వినియోగించుకుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హెలెన్ నష్టపరిహారం రూ. 160 కోట్ల మేర సొమ్ము రైతులకు అందాల్సి ఉంది. హెలెన్ ఊసెత్తకుండానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ఇతర జిల్లాల రైతులకు నష్టపరిహారం అందజేస్తామనడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అడ్రస్సులేని వడ్డీ రాయితీ గత ఏడాది రైతులు చెల్లించిన వడ్డీ రాయితీ నేటికీ ఆయా సొసైటీలకు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సహకార రంగం ద్వారా రూ. 900 కోట్ల మేర రైతులకు రుణాలు అందజేశారు. దీని తాలూకూ వడ్డీ 7 శాతం రైతుల వద్ద నుండి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. సుమారు రూ. 95 లక్షల మేర వడ్డీ రాయితీ సొమ్ము రావలసి ఉంది. ఏడు శాతంలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మరో 3 శాతం కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. సకాలంలో చెల్లించని వడ్డీ రాయితీ సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వడ్డీ రాయితీ చెల్లించని ప్రభుత్వం రుణమాఫీ సొమ్ముకు వడ్డీలు వసూలు చేయడం సిగ్గు చేటని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మింగ మెతుకులేదు. మీసాలకి.. –మల్లారెడ్డి శేషమోహనరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి. మింగ మెతుకులేదు.. మీసాలకి సంపెంగ నూనె రాసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వ తీరు ఉంది. హెలెన్ తుఫాన్ నష్టపరిహారం ఇవ్వడానికి ఖజానా చిల్లు చూపిస్తున్నారు. మరి గుంటూరు ప్రాంత రైతులకు నష్టపరిహారం ఎక్కడ నుండి తీసుకువచ్చి ఇస్తారు. రైతుల్ని మభ్యపెట్టడం, మోసగించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. హెలెన్ నష్టపరిహారం జిల్లాకు రూ. 160 కోట్లు రావలసి ఉంది. గత ఏడాది వడ్డీ రాయితీ రూ. 90 లక్షలు రావలసి ఉండగా ఒక్క రూపాయి విడుదల చేయాలేదు. అన్నపూర్ణ జిల్లాలోని అన్నదాతను ఆదుకునే తీరు ఇదేనా?. రైతులకు వెంటనే హెలెన్ నష్టపరిహారం, వడ్డీరాయితీ ఇవ్వాలి. బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. హెలెన్ నష్టపరిహారం ఇవ్వాలి –కె.సాయిలక్ష్మీశ్వరి, వ్యవసాయ శాక సంయుక్త సంచాలకులు, ఏలూరు హెలెన్ నష్టపరిహారాన్ని రైతులకు మంజూరు చేయాల్సి ఉంది. -
రైతులకు రూ.60 కోట్ల బోనస్
పోతవరం (నల్లజర్ల) : ఈ ఏడాది కృష్ణా పాల ఉత్పత్తి దారులకు రూ.60 కోట్లు బోనస్గా అందించినట్టు ఆ సంస్థ చైర్మన్ మండవ జానకి రామయ్య చెప్పారు. ఆదివారం పోతవరం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. లీటరు ఒక్కింటికి రూ. 11 బోనస్ అందించినట్టయిందన్నారు. ప్రస్తుతం లక్షా 60 వేల లీటర్లు వస్తుండగా 2 లక్షల 50 వేల లీటర్లు అమ్మకం జరుగుతుందన్నారు. సంవత్సరానికి రూ. 569 కోట్లతో సంస్థ టర్నోవర్ జరుగుతుందన్నారు. పశువులకు అత్యవసర సమయాలలో సేవలందించడానికి 7 వాహనాలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వాటిలో డాక్టర్తో పాటు అత్యవసర మందులు ఉంటాయన్నారు. పోతవరంతో పాటు రంగాపురం, పెదతాడేపల్లి, జానంపేటలో ఏర్పాటు చేసిన బల్క్మిల్క్ కూలర్లు మాదిరిగా మరిన్ని చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 50 శాతం రాయితీపై వ్యాక్సిన్లు, గడ్డి విత్తనాలు అందిస్తున్నట్టు చెప్పారు. -
ఆదివాసీ జిల్లాలను ఏర్పాటు చేయాలి
న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ తిరుమలాయపాలెం: తెలంగాణలో అత్యధికంగా ఆదివాసీలు నివసించే ఆరు జిల్లాలను ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో గిరిజనులకు, ఆదివాసీలకు కల్పించిన హక్కులను కాపాడాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గల షెడ్యూల్ ప్రాంతాన్ని ముక్కలు చెయ్యకుండా ఇల్లెందు, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జిల్లాలను ఏర్పాటు చెయడం దారుణమన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుని కేంద్రంగా చేస్తూ మండల కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలన్నారు. నకిలీలతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి.. మూడు జిల్లాల్లో నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఎం.గిరి జిల్లా నాయకులు తిమ్మిడి హన్మంతరావు, తాత సత్యనారాయణ, లెనిన్, తిమ్మిడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చెరకు రైతుల కష్టాన్ని గుర్తించండి
ఏలూరు (మెట్రో): చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015–16లో రైతులకు చెల్లించాల్సిన రూ.28 కోట్ల బకాయిలను రెండు వారాల్లో చెల్లించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును చెరకు రైతు సంఘ సభ్యులు కోరారు. కలెక్టరేట్లో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో శ్రీనివాసరావు, జేసీ పాల్గొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా, వ్యయ ప్రయాసలు కోర్చి చెరకు పండిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఉత్తర్వులు మేరకు గతంలో కొన్ని బకాయిలను చెల్లించారని 2015–16లో బకాయిలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించేలా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని జేసీ కోటేశ్వరరావు చెప్పారు. చాగల్లు జైపూర్ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ డి.భాస్కరరావు మాట్లాడుతూ వచ్చేనెలాఖరుకు పూర్తి బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు రెండు వారాలు మాత్రమే గడువు ఇచ్చారని, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీసుకుంటారని, కమిటీ ప్రతినిధులతో సంప్రదించి రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య సమన్వయం కుదిర్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ ఏజీఎం జీవీ చౌదరి, డిస్టిలరీ ఫ్యాక్టరీ ఏజీఎం శివకుమార్, చెరకు రైతు కమిటీ సభ్యులు పోసిన రాజారావు, గారపాటి శ్రీనివాసరావు, వల్లభనేని శ్రీనివాసరావు, ఉండవల్లి బుచ్చయ్య, ముళ్ళపూడి కాశీ, యనమదుల రామారావు, వట్టికూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆవిర్భావం రోజే అన్ని ఉత్తర్వులు..
♦ తుది ముసాయిదా, ఉద్యోగులకు ఆర్డర్లు ♦ దసరా రోజు ఉదయం 10గంటలకు జారీ ♦ సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు ♦ సన్నాహక చర్యలకు నిర్ణీత గడువుతో చెక్ లిస్ట్ సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులనూ వాటి ఆవిర్భావ తేదీ అయిన దసరా నాడే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల తుది ముసాయిదాతో పాటు ఉద్యోగులకు వర్క్ ఆర్డర్లను సైతం ఆ రోజే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 11న దసరా రోజున ఉదయం 10 గంటలకు కొత్త జిల్లాలను ప్రారంభిచనుంది. కలెక్టరేట్లతో పాటు జిల్లా ఆఫీసులన్నింటికీ అదే రోజున ఉదయం బోర్డులు అమర్చి అక్కణ్నుంచే కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి అవసరమైన ముందస్తు సన్నాహాలపై కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణీత కాల ప్రణాళికను విడుదల చేసింది. ఈ చెక్ లిస్ట్కు అనుగుణంగా కార్యకలాపాలన్నీ నిర్వహించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర మెమో జారీ చేశారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల కార్యకలాపాలన్నీ ఒకే రోజున ప్రారంభం కావాల్సి ఉన్నందున ఆ సన్నాహాలన్నిటినీ నిర్ణీత తేదీలోగా చేపట్టాలని ఆదేశించారు. పనులను ఆరు విభాగాలుగా వర్గీకరించుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, కలెక్టర్, ఎస్పీల క్యాంపు ఆఫీసు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు ఇప్పటికే పూర్తయింది. వాటికి సంబంధించిన అద్దె ఒప్పందాలను ఈ నెల 30వ తేదీలోగా చేసుకోవాలి. మరమ్మతులను అక్టోబరు 1 నాటికి పూర్తి చేయాలి. ఆఫీసులో ఉద్యోగులు పని ప్రారంభించేందుకు కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆఫీస్ సీళ్లు, రబ్బర్ స్టాంపుల వంటివాటన్నింటినీ అక్టోబరు 5కల్లా సమకూర్చుకోవాలి. అక్టోబరు 11న దసరా రోజున ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తానికి ఆఫీసుల బోర్డులు అమర్చాలి. అన్ని జిల్లా విభాగాల అధికారులు అక్టోబరు 6న ప్రతిపాదిత కొత్త జిల్లాలకు వెళ్లి కొత్త కార్యాలయాలు సిద్ధంగా ఉన్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి. ఆ వెంటనే వీటిపై కలెక్టర్లు సీఎస్కు నివేదిక పంపించాలి. నెలాఖరులోగా వాహనాలు వాహనాలతో పాటు కొత్త జిల్లాలకు పంపిణీ చేసేందుకు వీలయ్యే పరికరాలను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న ఫైళ్లను ప్రతిపాదిత కొత్త జిల్లాల వారీగా విభజించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వాటిని వెంటనే వేర్వేరు చేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ చేయాలని, సాధారణ ఫైళ్ళ స్కానింగ్ 18లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అత్యంత ముఖ్యమైన ఫైళ్లు తప్ప మిగతా వాటన్నింటినీ కట్టలు కట్టి ప్యాకింగ్ చేసి ఈ నెల 25 కల్లా రవాణాకు సిద్ధంగా ఉంచాలి. దసరా రోజునే కొత్త ఖాతాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నిటినీ దసరాలోగా తెరవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త జిల్లాల్లో అవసరమైన డబ్బును అక్టోబరు ఒకటో తేదీలోగా అందుబాటులో ఉంచాలంది. 5వ తేదీలోగా స్టేషనరీ, బోర్డులు పరిపాలనకు అవసరమైనవన్నీ సిద్ధంగా ఉండాలని నిర్దేశించింది. ఉద్యోగుల డేటా నేటితో పూర్తి అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ సీజీజీ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 15వ తేదీకల్లా పూర్తి చేయాలని కోరింది. దసరా నాడు ఉద్యోగులు తమకు నిర్దేశించిన జిల్లాలో పని చేసేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఉద్యోగుల సర్వీసు రికార్డులన్నిటినీ ప్రస్తుతమున్న జిల్లాల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. -
ధారూరుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్
ధారూరు: మండల కేంద్రానికి ఫారెస్టు రేంజ్ ఆఫీస్ మంజూరైంది. మూడు సెక్షన్లను కలిపి ఇక్కడ రేంజ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ధారూరు ఫారెస్టు సెక్షన్ ఆఫీసు మాత్రమే ఉంది. అయితే వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో.. రేంజ్ ఆఫీస్ ఏర్పాటు కోసం అటవీశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ ఫారెస్ట్ అధికారి తెలిపారు. దీని పరిధిలోకి అడాల్పూర్, ధారూరు, జుంటుపల్లి సెక్షన్లు రానున్నాయి. ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మన్సాన్పల్లి, రుద్రారం, ధారూరు, రాస్నం, దోర్నాల్, జుంటుపల్లి, కొప్పన్కోట్ ఫారెస్ట్ బీట్లను చేర్చారు. ఇంతవరకు జుంటుపల్లి సెక్షన్ తాండూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో, ధారూరు సెక్షన్ వికారాబాద్ రేంజ్లో ఉన్నాయి. అడాల్పూర్ మాత్రం ఇప్పటివరకూ బీట్గానే కొనసాగింది. ప్రస్తుతం దీన్ని సెక్షన్ ఆఫీస్గా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ధారూరులో ముగ్గురు, అడాల్పూర్లో ఇద్దరు, జుంటుపల్లిలో ఇద్దరు చొప్పున బీట్ ఆఫీసర్లు ఉన్నారు. ధారూరు, రాస్నం బీట్లలో ఇద్దరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ధారూరులో కొత్తగా రేంజ్ ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు కావడంతో నాలుగు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అదనంగా కేటాయించారు. రుద్రారం, రాస్నం, దోర్నాల్, కోపన్కోట ఫారెస్టు బీట్లలో.. బీట్ ఆఫీసర్లకు తోడుగా వీరిని నియమించనున్నారు. జిల్లాలోని ధారూరు ఫారెస్టు పరిధిలోనే అధికంగా అడవులు ఉండటమే రేంజ్ ఆఫీసు ఏర్పాటుకు కారణం. -
రాజోళి మండలం ఏర్పాటుపై హర్షం
శాంతినగర్ : రాజోళి మండలం ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడం సంతోషకరమని వడ్డేపల్లి వైస్ఎంపీపీ ఎన్.శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజోళి మేజర్గ్రామ పంచాయతీని మండల కేంద్రం చేయాలని గతంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన జిల్లాలు, మండలాల పునర్విభజన సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి సమస్య వివరించామన్నారు. రాజోళికి అన్ని అర్హతలున్నాయని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మగోపాల్, ఎంపీటీసీలు సానెబసన్న, పెద్దనాగన్న, మాజీ ఎంపీటీసీ తుకారాం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, రాజోళి సర్పంచ్ మోచిఉస్సేన్, నాయకులు పైపాడు మధుసూధన్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు సోమన్న, మైనార్టీ నాయకులు ఆయుబ్ఖాన్, బషీర్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటుపై 4,421 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ న్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి మంగళవారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 4,421 అప్పీళ్లు అందాయి. జిల్లా జిల్లాపై డివిజన్పై మండలంపై మొత్తం హన్మకొండ 1700 309 339 2348 జయశంకర్ 745 15 53 813 మహబూబాబాద్ 68 565 67 700 వరంగల్ 413 48 99 560 మొత్తం 2926 937 558 4421 -
యాంటీ బయోటిక్స్ వాడితే కొనుగోలు చేయం
భీమవరం : రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ వాడినట్టు గుర్తిస్తే ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోలు నిలిపివేయనున్నట్టు ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రకటించారు. భీమవరంలో ఆదివారం యాంటీ బయోటిక్స్ వాడకంపై ఆక్వా రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు ఆక్వా ఎక్స్పోర్టర్స్ మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం నుంచి యూఎస్ఏకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయన్నారు. మనం ఉత్పత్తి చేసే రొయ్యలు గతంలో 25 శాతం యుఎస్ఏకు ఎగుమతి అయితే ప్రస్తుతం ఆశాతం 45కు పెరిగిందన్నారు. మిగిలిన సరుకు థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రొయ్యల్లో యాంటిబయోటెక్స్ కనిపిస్తున్నందున మన రొయ్యలను దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం చెబుతున్నాయని అక్కడికి వెళ్లిన రొయ్యల కంటైనర్స్ తిరిగి రావడం వల్ల తీవ్రంగా నష్టపోతామని అందువల్ల ఇక్కడే యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి రొయ్యల కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమష్టిగా నిలిపేయాలి రొయ్యల కొనుగోలుదారుల నేషనల్ కమిటీ సభ్యుడు తోట జగదీష్ మాట్లాడుతూ రొయ్యలసాగులో యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులేనని, అయితే రైతులు నష్టపోతే మొత్తం ఆక్వారంగానికే చేటు కలుగుతుందన్నారు. ఏపీ రీజియన్ ప్రెసిడెంట్ ఎ.ఇంద్రకుమార్ మాట్లాడుతూ రొయ్యలు సాగుచేసే రైతులంతా సమష్టిగా యాంటి బయోటిక్స్ వాడకాన్ని నిలిపివేస్తేనే ఆక్వారంగానికి మనుగడ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు మాట్లాడుతూ ఇటీవల రొయ్యల ధర ఆశాజనకంగా ఉండడంతో పెద్దగా ఇబ్బందులు లేవని తక్కువ కౌంట్æరొయ్యలను కూడా అధికధరకు కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టాలు లేకుండా బయటపడుతున్నారన్నారు. దిగుమతులు నిలిచిపోతే ఆక్వా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులనే బాధ్యులను చేయడం సరికాదు కొణితివాడ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణరాజు మాట్లాడుతూ యాంటిబయోటిక్స్ వాడకంపై కేవలం రైతులను నష్టపర్చే విధంగాకాకుండా హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు. టెక్నీషియన్స్ కూడా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన రైతు ఇంటి శ్రీరాముడు మాట్లాడుతూ యాంటీబయోటెక్స్ వాడకంపై కేవలం రైతులను బాధ్యులను చేయడం భావ్యం కాదని హేచరీలు, మేతలు, మందుల తయారీ కంపెనీలపై ప్రభుత్వపరంగా దాడులు చేసి యాంటీబయోటిక్స్ను అరికట్టాలన్నారు. దీనికిగాను ఆక్వా ఎక్స్పోర్టర్స్ శ్రద్ధ తీసుకుని హేచరీ యజమానులు, రైతులు, మందులు, మేతల తయారీ కంపెనీలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆక్వాకల్చర్ కమిటీ నాయకులు సి.రాజగోపాలచౌదరి, వి.సత్యనారాయణరాజు, రమేష్వర్మ, జి.పవన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
భీమార : సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భీమారంలోని 58వ సీఆర్పీఎఫ్ బెటాలియన్లో ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తొలుత సీఆర్పీఎఫ్ జెండాను కమాండెంట్ విజయ్కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ సుమ, అసిస్టెంట్ కమాండెంట్ అండ్ ఎంవో ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు చేరువలో ఎల్ఐసీ సేవలు
అగ్రగామిగా జీవితబీమా సంస్థ డివిజనల్ మేనేజర్ కిశోర్ కరీంనగర్ : బీమారంగంలో 60 సంవత్సరాలుగా సేవలందించి దేశంలోనే బీమాకంపెనీలలో ఎల్ఐసీ అగ్రగామిగా నిలిచిందని డివిజనల్ మేనేజర్ కంచర్ల కిశోర్ అన్నారు. ఎల్ఐసీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ముఖ్య అథితిగా ఆయన హజరయ్యారు. అనంతరం విలే కరుల సమావేశంలో కిశోర్ మాట్లాడుతూ విజన్ 2020లో భాగంగా ప్రతి వ్యక్తిని పాలసీదారుడుగా తయారుచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పాలసీదారుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రవేశపెడుతున్న పాలసీలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గురుతరమైన బాధ్యతను పోషిస్తున్న ఎల్ఐసీకి అండగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరంలో 232.32 లక్షల క్లేయింలను పరిష్కరించి దాదాపు రూ.90.5 కోట్లు చెల్లింపులు చేసిందన్నారు. ఎల్ఐసీ పోర్టల్ ద్వారా 35,634 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10,878 మంది ప్రతిభగల పేద విద్యార్థులకు రూ.10 వేల రూలు స్కాలర్షిప్ అందించినట్లు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఎల్ఐసీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కృష్ణదాస్, తిరుపతిరావు, ఆకుల శైలజ, విజయమోహన్రెడ్డి, ఎం.హరీశ్కుమార్, రవీందర్రెడ్డి, రఘురాం పాల్గొన్నారు. -
మమా అనిపించారు..!
మొక్కుబడిగా సాగిన ఆహార సలహా సంఘం సమావేశం ఎవరూ లేనప్పుడు సమావేశం ఎందుకన్న వైఎస్సార్సీపీ నేత బాలనాగిరెడ్డి జిల్లా స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం రెండేళ్లగా నిర్వహించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశమూ తూతూ మంత్రంగా సాగింది. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యభవన్లో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అధ్యక్షతన ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తప్ప ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి వైఎస్సార్సీపీ నుంచి ఎస్.బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, టీడీపీ ప్రతినిధి టి.మాధవనాయుడు హాజరయ్యారు. సమావేశంలో డీఆర్ఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇన్చార్జి కలెక్టర్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనందున హాజరు కాలేదన్నారు. తేదీ ముందుగా ప్రకటించిన కారణంగానే సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఐఏఎస్ అధికారుల సమావేశం ఉంది.. కాబట్టి నేను కూడా కొద్దిసేపు ఉండి వెళతాను. సభ్యులు తమ సూచనలను మెంబర్ కన్వీనర్ డీఎస్ఓ ప్రభాకర్రావుకి ఇవ్వండి. వాటిని ఆయన నోట్ చేసుకుంటారని చెప్పారు. -
చింతలపూడి పనులను అడ్డుకున్న రైతులు
చింతలపూడి : రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చే వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని రైతు నాయకులు అన్నారు. వెలగలపల్లి, శెట్టివారిగూడెం గ్రామాల్లో ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయనివ్వకుండా సర్వే సిబ్బందిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గోలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్ట పరిహారం అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ టి.మైఖేల్రాజ్కు వినతిపత్రం అందచేశారు. ఆందోళనలో రైతులు తాళం మాధవరావు, చిలకబత్తుల సత్యనారాయణ, ఎం.నర్సయ్య, చిలుకూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
-
ముగిసిన సూర పొగాకు కొనుగోళ్లు
దేవరపల్లి : దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల్లో సూర పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. ఈ నెల 14 నాటితో రెండు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగియడంతో రైతుల వద్ద గల సూర పొగాకు కొనుగోళ్లును ప్రారంభించారు. ఈ నెల 17న ప్రారంభమైన సూర పొగాకు కొనుగోళ్లు శనివారం ముగిశాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో ఈ ఏడాది 6.36 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా.. కిలో గరిష్ట ధర రూ. 185 పలికింది. సగటు ధర రూ. 136.75 లభించింది. రైతులు కిలో సటగు ధర రూ. 150 వరకు ఆశించారు. మార్కెట్ చివరి దశలో పుంజుకుంది. దీంతో రైతులు కొంత వరకు ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో వేలం కేంద్రంలో 3.50 లక్షల కిలోల సూర పొగాకు కొనుగోలు చేశారు. సూరకు కిలో గరిష్ట ధర రూ. 66, కనిష్ట ధర రూ. 10, సగటు ధర రూ. 39.36 లభించింది. శనివారం వేలం కేంద్రం పరిధిలోని గ్రామాల నుంచి రైతులు 891 సూర బేళ్లు వేలానికి తీసుకురాగా.. పూర్తిగా కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణాధికారి వై.వి.ప్రసాద్ తెలిపారు. 2015–16 సీజన్కు సంబంధించి పొగాకు వేలం ముగిసిందని ఆయన ప్రకటించారు. గోపాలపురం వేలం కేంద్రంలో 1.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేయగా కిలో గరిష్ట ధర రూ. 60, కనిష్ట ధర రూ. 11, సగటు ధర రూ. 36.12 లభించినట్లు వేలం నిర్వహణా«ధికారి టి.తల్పసాయి తెలిపారు. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను ఈ నెల 22న ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతించాయని, ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ముసాయిదాలో అవసరమైతే మార్పులు, చేర్పులు జరుగుతాయని కేసీఆర్ తెలిపారు. ఏ ప్రాంతం వారికైనా అభ్యంతరాలుంటే తెలియజేయొచ్చని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేలానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కొత్త కోర్టులు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతమున్న వ్యవస్థ కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు సీజేతో మాట్లాడాక కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సెంప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, మహారాష్ట్రతో నీటి విషయంలో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. -
జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడ(వన్టౌన్) : జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. స్థానిక మహేశ్వరి భవన్లో కార్యవర్గ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్జైన్, ఉపాధ్యక్షులుగా మోహన్లాల్కొఠారి, ధనరాజ్సోలంకి, కార్యదర్శిగా నెమిచంద్జైన్, సహాయ కార్యదర్శిగా మంగీలాల్, కోశాధికారిగా మహేంద్రకుమార్జైన్, కో కోశాధికారిగా మేఘరాజ్జైన్ సభ్యులుగా గిరీష్కుమార్ సోదాని, విజయరాజ్ సోలాంకి, వినోద్కుమార్ సోలాంకి, సురేష్కుమార్, విజయ్తతోడి, బెహర్లాల్, రతన్లాల్, పొపట్లాల్, టీ దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. -
చెరకు టన్నుకు రూ.4 వేలు ఇవ్వాలి
హనుమాన్జంక్షన్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ. 4 వేలు ప్రకటించేలా సీఎం చంద్రబాబు చొరవ చూపాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి సత్యవెంకటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రాన్ని తపాలా ద్వారా పంపినట్లు ఆయన శుక్రవారం విలేకరులకు చెప్పారు. చెరకు పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతోందని అందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా మరో రూ. 1000 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని నండూరి డిమాండ్ చేశారు. చెరకు కొనుగోలు పన్ను టన్నుకు రూ. 60ని నేరుగా రైతులకు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
చివరి ఆయకట్టుకు నీరందేనా!
మరమ్మతులు లేని కాల్వలు రైతుల్లో ఆందోళన పెగడపల్లి: మండలంలోని ఎస్సారెస్పీ కాల్వలు ఏళ్లతరబడిగా మరమ్మతులకు నోచుకోవడంలేదు. కాల్వల్లో చెట్లపొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రాపులు కూలాయి. ఎస్సారెస్సీ కాలువలకు నీటీని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఒక పక్కహర్షం వ్యక్తం అవుతుండగా, మరోపక్క కాల్వల్లో నిండిన పూడికమట్టి, పెరిగినచెట్లతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్నా డి–83ఏ కాలువ ద్వారా ఉపకాలువలకు నీరు సరఫరా కానుంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు నీరందించే ఆయకట్టు ఉంది. అయితే రెండేళ్లుగా ఎస్సారెస్సీ నీటివిడుదల కాకాపోవడంతో వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి భూములన్నీ పడావులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ నీటీవిడుదల పై రైతులు ఆశలు పెంచుకున్నారు. వర్షాలు కురువక పోతాయా? ఎస్సారెస్సీ నీరురాకపోతుందా అన్న దీమాతో మండల రైతాంగం వరి సాగుకు నార్లుపోసి సిద్ధంగా ఉంచారు. వీటిద్వారా తమ పంట పొలాలకు నీరు పారించుకుందామనుకుంటున్న సమయంలో కాలువలు సక్రమంగా లేక నీరు అందే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డి–83ఏ ప్రాధాన కాలువ కింద 74, 75, 76, 77, 78, 79, 80, 81 డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయి. డి76, 77 కాలువల కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఆర్ ఉపకాలువలున్నాయి. వీటి ద్వారా పెగడపల్లి, మద్దులపల్లి, బతికపల్లి, ఏల్లాపూర్, నంచర్ల, ల్యాగలమర్రి తదితర గ్రామాలకు ప్రదాన డిస్ట్రిబ్యూటరీ కాలువలుండగా, మిగతా గ్రామాల పంట పొలాలకు నీరు అందేవిధంగా ఉపకాల్వలు నిర్మించారు. ప్రస్తుత పరిస్థితిలో కాలువలు మరమ్మతులు లేక అధ్వానంగా తయారయ్యాయని మద్దులపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాలకు చెందిన మ్యాక తిరుపతిరెడ్డి, సాయిని రవి తెలిపారు. నీటిæవిడుదలకు ముందుగా కాలువలు మరమ్మతు చేసినట్లయితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. -
రాజధాని నిర్మాణంపై బాబు మాటలు కేఎస్ఆర్ కామెంట్
-
సింగపూర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
► హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సింగపూర్లోని డోవర్ పాలిటెక్నిక్ కన్వెన్షన్ సెంటర్లో టీసీఎస్ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రవాస తెలంగాణవాసుల సూచనలు, సలహాలు, సహకారం తీసుకుంటామన్నారు. సింగపూర్లో స్థిరపడిన తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేడుకలను నిర్వహించడంపై టీసీఎస్ఎస్ కార్యవర్గాన్ని అభినందించారు. సుమారు వేయి మందికి పైగా హాజరైన వేడుకల్లో గాయకులు వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణక్క, నటులు వేణు, ధనరాజ్ తమ ఆటపాటలతో అలరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, వేముల వీరేశం, నల్గొండ జడ్పీ ఛైర్మన్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, పెద్ది చంద్రశేఖర్రెడ్డి, నీలం మహేందర్, ముద్దం అశోక్, గౌరవ కార్యదర్శి బసిక ప్రశాంత్రెడ్డి, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు ఎల్లారెడ్డి, దుర్గా ప్రసాద్, అలసాని కృష్ణారెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
'బంగారు తెలంగాణలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి'
- మెల్బోర్న్లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రాయికల్ (కరీంనగర్ జిల్లా) : బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు, ఎన్ఆర్ఐలు సైతం ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాయికల్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి అన్నారు. ఆదివారం లండన్లోని తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరువీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకలకు కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, మేయర్ సలేర్ జఫర్, లండన్లోని ఇండియన్ హైకమిషన్ ఫస్ట్సెక్రటరి విజయ్వసంత, బ్రిటన్ ఎంపీ స్టీఫెన్ టిమ్స్, మిల్టన్ కిన్ కౌన్సిలర్ గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచంలోని వివిధదేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి మాట్లాడుతూ.. తెలంగాణ అమరుల ఆత్మబలిదానాలతోనే ఈ తెలంగాణ రాష్ట్రమేర్పడిందన్నారు. బంగారు తెలంగాణలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగతి యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు దన్నంనేని సంపత్కృష్ణ, ఉపాధ్యక్షుడు బల్మూరి సుమన్, సంతోష్, జువ్వాడి సుష్మా, ప్రావస్రెడ్డి, కిశోర్కుమార్, పావని గణేశ్, ప్రశాంత్, వంశీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖండాంతరాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాయికల్(కరీంనగర్): తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అబుదాబీ, కువైట్, బహ్రెయిన్, మస్కట్లలో లోని తెలంగాణ ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వాసులు ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ అభివృద్ధిలో తాము పాలు పంచుకుంటామని చెప్పారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. -
'వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు'
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. రెండేళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 లోపల ఎన్నికల హామీలు నెరవేర్చలేవని సీఎం కేసీఆర్ కు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 2017 లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఎత్తుగడలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే 2022 అని జపం చేస్తున్నారన్నారు. -
కేసీఆర్ మరో నీరో చక్రవర్తి: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ప్రజల ఆశలను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రెండేళ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలు వడగాడ్పులకు మరణిస్తుంటే కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తూ మరో నీరో చక్రవర్తిలా సంబురాలు చేసుకుంటున్నారు’ అని విమర్శించారు. -
పాలనలో ప్రజల భాగస్వామ్యముందా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ పాలనలో అసలు ప్రజల భాగస్వామ్యముందా.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందా.. కనీసం అటువంటి ప్రయత్నమేదైనా జరుగుతుందా..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ద్రోహులు సీఎం కేసీఆర్కు ఆప్తులయ్యారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను రాజ్యాంగవిరుద్ధంగా టీఆర్ఎస్లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపుల్లో కేసీఆర్కు వంద మార్కులు పడ్డాయని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక మౌలికమైన మార్పులు సాధించామా? అని ప్రశ్నించుకోవాలన్నారు.