test cricket
-
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.వెయ్యి పరుగులు చేసినాక్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.అలా అస్సలు చేయొద్దుఅందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్తో సిరీస్కు ముందు మరో రెండో మూడో మ్యాచ్లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయిందిఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
స్టీల్ స్మిత్...
లెగ్ స్పిన్నర్గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్లకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్పై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడా విభాగం టెక్నిక్లో విరాట్ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్ని తలపించకపోయినా... క్లాసిక్ షాట్లలో కేన్ విలియమ్సన్తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్ స్మిత్ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. ఆధునిక క్రికెట్లో ‘ఫ్యాబ్–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ సారథి రూట్ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ (10,103) ఈ క్లబ్లో చేరాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్పైనే స్మిత్ ఈ మార్క్ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 55 కంటే ఎక్కువ సగటుతో... మ్యాచ్ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. బ్రియాన్ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్ల పరంగా స్మిత్ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్లు), సచిన్ టెండూల్కర్ (195 ఇన్నింగ్స్లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్లు), రికీ పాంటింగ్ (196 ఇన్నింగ్స్లు) ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్ (58.72), టెండూల్కర్ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్స్పిన్నర్గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా 78వ టెస్టు మ్యాచ్లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేసిన తొలి ప్లేయర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. గోడకు కొట్టిన బంతిలా... అటు ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్, ఇటు భారత్తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్ల్లోనూ స్మిత్ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్న స్మిత్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. ఆసీస్ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్... దక్షిణాఫ్రికా సిరీస్లో ‘బాల్ ట్యాంపరింగ్’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ స్మిత్ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్లో ట్రవిస్ హెడ్కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్కు దిగే హెడ్.. తొలి టెస్ట్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్రౌండర్గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్తో రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్లు
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు. టాప్-8 బ్యాటర్స్లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తొలి ఇన్నింగ్స్లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
'డబుల్ సెంచరీ'పై కన్నేసిన బుమ్రా...
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.తద్వారా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్ల్లో వికెట్కీపర్గా 135 క్యాచ్లు, 15 స్టంపింగ్లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్లు, 36 స్టంపింగ్లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్లు, 38 స్టంపింగ్లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
బుమ్రా టెస్టులను వదిలేస్తే బెటర్: షోయబ్ అక్తర్
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్లోనే అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటలో ఉన్న బుమ్రా అక్కడ కూడా సత్తాచాటుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన బుమ్రా.. మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో జస్ప్రీత్ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎక్కువకాలం పాటు తన కెరీర్ను కొనసాగించాలంటే టెస్టు క్రికెట్ను వదిలేయాలని అక్తర్ సూచించాడు."బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టెస్టు క్రికెట్ కంటే వన్డేలు, టీ20లు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే అతను లెంగ్త్ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్ప్లేలో బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల్గే సత్తా అతడికి ఉంది. కానీ బుమ్రా తన కెరీర్ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే టెస్టులను వదేలియాలి. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాలి. పేస్ బౌలర్లను ఎటాక్ చేయడానికి అన్ని సార్లు ప్రయత్నించరు. కాబట్టి ఎక్కువ పేస్తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్లో పేస్ లేకపోతే బంతి సీమ్ లేదా రివర్స్ స్వింగ్ కాదు. మళ్లీ అప్పుడు బౌలింగ్ తీరుపై పలు ప్రశ్నలకు లేవనెత్తుతుంది. టెస్టు క్రికెట్లో బుమ్రా వికెట్లు తీయగలడు. అందులో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయితే అతడు టెస్టుల్లో కొనసాగాలంటే బౌలింగ్ వేగాన్ని పెంచాలి.ఇలా చేయడం వల్ల అతను గాయపడే ప్రమాదం ఉంది. అతడి స్ధానంలో నేనే ఉంటే కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యేవాడిని" అని అక్తర్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1082 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 లక్షలకు పైగా పరుగులు చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా(4,28,794 ప్లస్ రన్స్), భారత్( 2,78,700 ప్లస్ రన్స్) వరుసగా ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్లు 929 సెంచరీలు చేశారు.పట్టు బిగించిన ఇంగ్లండ్..ఇక కివీస్తో రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో జో రూట్(73 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. ఇక ఇప్పటికే తొలి టెస్టులో కివీస్ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్లో చిక్కుకున్న స్మిత్! వీడియో -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లేకర్ ఓవర్కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో 201 పరుగుల తేడాతో నెగ్గింది. -
చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్.. తొలి న్యూజిలాండ్ క్రికెటర్గా
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీలో సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ విలియమ్సన్ అద్బుత ప్రదర్శన చేశాడు.తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ టెస్టు క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కేన్ సాధించిన రికార్డులు ఇవే..👉టెస్టుల్లో 9000 పరుగుల మార్క్ను దాటిన తొలి కివీ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన విలియమ్సన్.. 54.76 సగటుతో 9035* పరుగులు చేశాడు.👉టెస్టు క్రికెట్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్గా యూనిస్ ఖాన్, కుమార్ సంగర్కర రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్(99) తొలి స్ధానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో బ్రియన్ లారా(101 మ్యాచ్లు) కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(116 మ్యాచ్లు), జోరూట్(106)లు కంటే విలియమ్సన్ ముందున్నాడు.చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు.. 120 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో తన సంచలన బౌలింగ్తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి లంకేయులు విల్లవిల్లాడారు.తొలి ఇన్నింగ్స్లో కేవలం 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జాన్సెన్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పర్యాటక లంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది.చరిత్ర సృష్టించిన జాన్సెన్...ఇక సంచలన ప్రదర్శన చేసిన జాన్సెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7 వికెట్ల ఘనత సాధించిన ఆసీస్ దిగ్గజం హ్యూ ట్రంబుల్ రికార్డును జాన్సెన్ సమం చేశాడు. మార్కో జాన్సెన్ 6.5 ఓవర్ల(41 బంతులు)లో ఈ ఫీట్ సాధించగా.. హ్యూ ట్రంబుల్ కూడా సరిగ్గా 6.5 ఓవర్ల(41 బంతులు)లోనే ఈ రికార్డును నమోదు చేశాడు.1902లో ఇంగ్లండ్పై హ్యూ ట్రంబుల్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇప్పుడు 120 ఏళ్ల తర్వాత జాన్సెన్ ఈ రేట్ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దిరి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా లెజెండ్ మాంటీ నోబెల్ ఉన్నారు. నోబెల్ ఈ రికార్డును 7.4 ఓవర్లలో క్రియేట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రోటీస్ ప్రస్తుతం 406 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్లో నాథన్ లియోన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
Ind vs NZ: ‘రిజర్వ్’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్తో సిరీస్కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు. ‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్ను స్పిన్ పిచ్లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు. -
పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడింది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్, గిల్, సర్ఫరాజ్, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఆరేసిన అజాజ్ పటేల్..మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.ఇదే తొలిసారి..భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియాను వైట్వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వరకు ఏ జట్టు చేతిలో కూడా టీమిండియా స్వదేశంలో వైట్ వాష్కు గురువ్వలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భారత జట్టును వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబర్ 1- 5)వేదిక: ముంబై, వాంఖడే స్టేడియంటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 263న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 174భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 121ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్ ఓటమి -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్లు వేసింది. పుణే వేదికగా కివీస్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్కు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. -
టీమిండియాతో రెండో టెస్టు.. పట్టు బిగించిన న్యూజిలాండ్
పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్(9), టామ్ బ్లండెల్(30) ఆజేయంగా ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 133 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి లాథమ్ ఔటయ్యాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్లో సుందర్ ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.తేలిపోయిన భారత బ్యాటర్లు..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది. మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు యశస్వీ జైశ్వాల్(30), శుబ్మన్ గిల్(30) పర్వాలేదన్పించారు.చదవండి: IND vs NZ: బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్? -
బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా కివీస్తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా అదే తీరును కనబరుస్తోంది.తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా, బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కేవలం 156 పరుగులకే భారత్ కుప్పకూలింది.బెడిసి కొట్టిన గంభీర్ వ్యూహం...కాగా తొలి టెస్టులో ఓటమి అనంతరం కివీస్పై భారత జట్టు మెనెజ్మెంట్ స్పిన్ అస్త్రాన్ని సంధించాలని భావించింది. ఈ క్రమంలో పుణే పిచ్ను డ్రై వికెట్గా స్పిన్నర్లకు అనుకూలించేలా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అండ్ కో తయారు చేయించింది.అయితే 'ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు' అన్న చందంగా టీమిండియా పరిస్థితి మారింది. ప్రత్యర్ధిని స్పిన్తో బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకుని విల్లవిల్లాడింది. కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మొత్తం 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.ఆఖరికి పార్ట్టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ను కూడా భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. అసలు మనం చూస్తుంది భారత బ్యాటర్లనేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. విరాట్ కోహ్లి వంటి స్టార్ క్రికెటర్లు సైతం చెత్త షాట్లు ఆడి తన వికెట్ను సమర్పించుకున్నారు.దీంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్లాన్ మిస్ ఫైర్ కావడంతో గౌతం గంభీర్ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "ఇది టెస్టు క్రికెట్ డ్యూడ్" ఎక్కువగా ప్లాన్స్ చేయవద్దు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. Next level hai #INDvsNZ pic.twitter.com/HZJ1T8qbgr— Hesy Rock (@Hesy_R0ck) October 25, 2024 Team India be like. #INDvsNZ pic.twitter.com/yr4E1dX9VL— Sagar (@sagarcasm) October 25, 2024 -
చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్గా
పుణే వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పర్యాటక న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ల దాటకి కివీస్ ఓ మోస్తారు స్కోర్కే పరిమితమైంది. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అశ్విన్ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పులు పెట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే తన రీ ఎంట్రీలో సత్తాచాటాడు. దాదాపు 3 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ను దెబ్బతీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం.అరుదైన ఘనత..ఇక మొదటి ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా సుందర్ నిలిచాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా సుందర్ నిలిచాడు. సుందర్ కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీఫెన్ ఒకీఫ్ పుణే మైదానంలో 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. న్యూజిలాండ్పై 7 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో భారత్ బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో సుందర్ కంటే ముందు ఎస్ వెంకటరాఘవన్, ఎరపల్లి ప్రసన్న, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! 7 వికెట్లతో
అతడిని ఎందుకు ఎంపిక చేశారు? కుల్దీప్ యాదవ్ కన్న తోపు స్పిన్నరా? అసలు రోహిత్ శర్మ, గంభీర్కు ఏమైంది? ఇవన్నీ న్యూజిలాండ్తో రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేయడంపై మాజీలు సంధించిన విమర్శల బాణాలు. అయితే మ్యాచ్ ఆరంభం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుందర్ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి.45 నెలల తర్వాత..కివీస్ తొలి టెస్టు ఓటమి అనంతరం మిగిలిన రెండు టెస్టులకు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్ను భారత జట్టులోకి బీసీసీఐ చేర్చింది. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్ అర్ధాంతరంగా పుణేలో టీమిండియాతో చేరాడు. అయితే అతడిని కేవలం బ్యాకప్గానే తీసుకున్నారని అంతా భావించారు.కానీ రెండో టెస్టుకు టీమిండియా మెనెజ్మెంట్ తుది జట్టులో వాషీకి చోటిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్ను తీసుకురావడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అందరి అంచనాలను తలకిందలు చేశాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి స్పెల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్.. రెండో స్పెల్లో రవీంద్రను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఈ ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లను క్లీన్బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో ఈ తమిళ తంబీ ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి.కివీస్@259ఇక ఈ మ్యాచ్లో పర్యాటక కివీస్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో సుందర్తో పాటు మరో తమిళనాడు స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. 🚨 WASHINGTON SUNDAR PRODUCE THE BALL OF THE SERIES 🚨 pic.twitter.com/vLvo4ipYAY— Johns. (@CricCrazyJohns) October 24, 2024 -
IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ శర్మ డకౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్లో రోహిత్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.ఏడేసిన సుందర్..ఇక ఈ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 7 వికెట్లతో సుందర్ సత్తాచాటాడు. కివీస్ నామమాత్రపు స్కోర్కే పరిమితం కావడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
సూపర్ బాల్.. రోహిత్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ పేసర్ టిమ్ సౌథీ అద్బుతమైన బంతితో హిట్మ్యాన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సౌథీ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు శర్మ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 3 ఓవర్ వేసిన సౌథీ ఆఖరి బంతిని మిడిల్ అండ్ ఆఫ్దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని హిట్మ్యాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి టర్న్ అయ్యి రోహిత్ బ్యాక్ ప్యాడ్ తాకుతూ స్టంప్స్ను గిరాటేసింది. దీంతో సౌథీ దెబ్బకు రోహిత్ తన ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రోహిత్ ఔటైన వెంటనే మైదానంలో ఉన్న ప్రేక్షకులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక8 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజులో గిల్(8), జైశ్వాల్(2) పరుగులతో ఉన్నారు.7 వికెట్లతో చెలరేగిన సుందర్..అంతకుముందు న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో అదరగొట్టాడు.అతడితో పాటు రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Dear Rohit Sharma,I respect you a lot and love you but as an honest Indian cricket fan I believe you should consider giving up your opening spot for the betterment of the team. You struggle to bat in test match and pick the length so it might be better to retire with dignity🙏. pic.twitter.com/9G8MxWKmuc— ` (@Was_divote) October 24, 2024 -
కివీస్తో రెండో టెస్ట్.. నెట్స్లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ స్కోర్ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్లలో సౌథీ 92 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
జడేజా మ్యాజిక్ డెలివరీ.. గ్లెన్ ఫిలిప్స్ మైండ్ బ్లాంక్(వీడియో)
బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దుమ్ములేపుతోంది. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగుల భారీ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్లాక్ క్యాప్స్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(134) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కాన్వే(91), టిమ్ సౌథీ(65) ఆర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.జడ్డూ మ్యాజిక్..ఇక ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా సంచలన బంతితో మెరిశాడు. కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ను జడ్డూ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్. జడేజా అద్భుతమైన బంతితో ఫిలిప్స్ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్లో మూడో బంతిని మిడిల్ స్టంప్ దిశగా లెంగ్త్ డెలివరీని జడ్డూ సంధించాడు. ఆ బంతిని ఫిలిప్స్ బ్యాక్ ఫుట్ నుండి డిఫెన్సివ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్ను మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. అది చూసిన ఫిలిప్స్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Phillips' bright start has a dim end thanks to Ravindra Jadeja 👌#IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/sjjrzLnGxX— JioCinema (@JioCinema) October 18, 2024 -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
భారత్ చెత్త రికార్డు.. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ బౌలర్ల జోరు ముందు.. భారత బ్యాటర్లు చేతులేత్తేశారు. బ్లాక్ క్యాప్స్ బౌలర్ల దాటికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్లో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరారు. ఇక ఈ మ్యాచ్లో కుప్పకూలిన టీమిండియా పలు చెత్త రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.➔92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్పై భారత్ 62 పరుగులు చేసింది.➔ఓవరాల్గా టెస్టుల్లో భారత్కు ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్లో ఇంగ్లండ్పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్. -
IND Vs NZ: కివీస్ బౌలర్ మాస్టర్ మైండ్.. బెంబేలెత్తిన విరాట్ కోహ్లి(వీడియో)
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి పరుగులేమి చేయకుండా పెవిలియన్కు చేరాడు. తొలి బంతి నుంచే కివీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన విరాట్.. 9 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.న్యూజిలాండ్ యువ పేసర్ ఓ'రూర్క్ అద్బుతమైన బంతితో కోహ్లిని బోల్తా కట్టించాడు. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రూర్క్.. ఆఖరి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి లోపలకు వచ్చింది. దీంతో బంతి తన ప్యాడ్లకు తాకకుండా ఉండడానికి కోహ్లి లెగ్ సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫిలిప్స్ జంప్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే అది క్లీన్ క్యాచ్ కాదా? అని ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్తో సప్రందించాడు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి ఔట్గా ప్రకటించాడు.దీంతో చేసేదేమి లేక కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. అయితే ఆఫ్ సైడ్ పడిన బంతి అంత షార్ప్గా టర్న్ అవుతుందని కోహ్లి అస్సలు ఊహించలేదు. అంతేకాకుండా లెగ్ సైడ్లో గల్లీ ఫీల్డర్ను పెట్టి మరి విరాట్ను ట్రాప్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఎనిమిదేళ్ల తర్వాత.. కాగా టెస్టుల్లో కోహ్లి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు రావడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే మొదటి సారి. యువ ఆటగాడు శుభ్మన్ గిల్ గైర్హాజరీతో ఈసారి కోహ్లి వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. కానీ కోహ్లికి వన్ డౌన్ కలిసిరాలేదు. గతంలో కోహ్లి వన్ డౌన్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్పై ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు విరాట్ కేవలం నాలుగు టెస్టుల్లోనే ఈ ప్లేస్లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్ల్లో 97 పరుగులు సాధించాడు.pic.twitter.com/0Z9o2PcVCb— ViratKingdom (@kingdom_virat1) October 17, 2024 -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిఇక ఈ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్ను కోల్పోలేదు.అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
పాకిస్తాన్కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
'టీమిండియాకు ఆడాలనేది నా కల.. ఎప్పుడు నెరవేరుతుందో'
గుమ్మడికాయంత టాలెంట్తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా ఈ సామెత బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్కు సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు.ఒకట్రెండు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటకి డెబ్యూ చేసే అవకాశం మాత్రం రాలేదు. అయితే 31 ఏళ్ల ఈశ్వరన్ త్వరలోనే టీమిండియా క్యాప్ను అందుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు అభిమన్యును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు బ్యాకప్గా అతడిని ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ పంపించాలని భావిస్తుందంట. హిట్మ్యాన్ వ్యక్తిగత కారాణాలతో తొలి రెండు టెస్టులో ఏదో ఒక మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ స్ధానంలో అభిమన్యు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా ఈశ్వరన్ కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తిపరిచాడు."నేను ఎప్పుడూ ప్రస్తుతం కోసమే మాత్రమే ఆలోచిస్తాను. భవిష్యత్తు కోసం పెద్దగా ఆలోచించను. కానీ కొన్నిసార్లు అది అంత సులభం కాదు. ఆ సమయంలో ఏదీ మన చేతుల్లో ఉండదని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను. మనకంటూ ఒక రోజు వస్తుందని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. దేశం తరఫున ఆడాలనేది నా కల. అందుకోసం ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నాను. భారత జట్టులో ఉండాలని, విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. కానీ మనం ఆశలు పెట్టుకున్నప్పటకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతానికి, నేను రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. బెంగాల్కు విజయాలను అందించడమే నా ముందున్న లక్ష్యమని" అభిమన్యు NDTV స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 98 మ్యాచ్లు ఆడి 53.63 సగటుతో 7506 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 26 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్తో జరిగిన మ్యాచ్లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రూట్కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
హార్దిక్ రీ ఎంట్రీ చాలా కష్టం.. ఒకవేళ అదే జరగాలంటే?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు హార్దిక్ ఫిట్గా లేడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బహుశ వైట్ బాల్ అందుబాటులో లేపోవడంతో అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించదు.ఒకవేళ హార్దిక్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలంటే అంతకంటేముందు కనీసం ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో పార్ధివ్ పేర్కొన్నాడు.హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్బాల్ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్ -
కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..!
శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. కమిందు టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ అరంగేట్రం నుంచి ఇన్ని మ్యాచ్ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. పాక్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం నుంచి వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఆతర్వాత న్యూజిలాండ్ ఆటగాడు బెర్ట్ సచ్క్లిఫ్, పాక్కు చెందిన సయీద్ అహ్మద్, భారత్కు చెందిన సునీల్ గవాస్కర్ అరంగేట్రం నుంచి వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు.శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.టెస్ట్ అరంగేట్రం నుంచి ఎనిమిది మ్యాచ్ల్లో కమిందు చేసిన స్కోర్లు.. - 61 vs AUS.- 102 & 164 vs BAN.- 92* vs BAN.- 113 vs ENG.- 74 vs ENG.- 64 vs ENG.- 114 vs NZ.- 51* vs NZ. చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్లకు నో ప్లేస్..! -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
సంచలనం.. . 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులు! ఎవరీ ద్రోణ దేశాయ్?
దివాన్ బల్లూభాయ్ కప్ అండర్-19 మల్టీ డే టోర్నమెంట్లో గుజరాత్ యువ క్రికెటర్ ద్రోణ దేశాయ్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో సెయింట్ జేవియర్స్ స్కూల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 18 ఏళ్ల ద్రోణ దేశాయ్.. జెఎల్ ఇంగ్లిష్ స్కూల్పై మారాథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో దేశాయ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగాడు. తృటిలో 500 పరుగుల మార్క్ను ఈ గుజరాతీ చేజార్చుకున్నాడు.దేశాయ్ ఊచకోత.. రిపోర్ట్స్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఆరంభంలోనే సెయింట్ జేవియర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ద్రోణ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో ద్రోణ మొదట హెట్ దేశాయ్తో కలిసి 350 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత జట్టు కెప్టెన్ విరాట్ తలతితో కలిసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 320 బంతులు ఎదుర్కొన్న దేశాయ్.. 86 ఫోర్లు, 7 సిక్స్లతో 498 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ను అందుకునే వాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జేవియర్స్ 844 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 845 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెఎల్ ఇంగ్లిష్ స్కూల్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 712 పరుగుల తేడాతో సెయింట్ జేవియర్స్ ఘన విజయాన్ని అందుకుంది.ఎవరీ ద్రోణ దేశాయ్?గుజరాత్కు చెందిన ద్రోణ దేశాయ్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ. తన 7ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ ఆడటం దేశాయ్ మొదలు పెట్టాడు. అతడు ఇప్పటికే గుజరాత్ అండర్-19 జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ఆదర్శంగా తీసుకుని క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ద్రోణ క్రికెట్ జర్నీ వెనక అతడి తండ్రిది కూడా కీలక పాత్ర అనే చెప్పాలి. చిన్నతనంలో అతడి ప్రతిభను గుర్తించి క్రికెట్ కోచింగ్ ఆకాడమీలో చేర్చాడు. అదే విధంగా కోచ్ జయప్రకాష్ పటేల్ కూడా అతడిని మెరుగైన క్రికెటర్గా తీర్చిదిద్దాడు.ఇక స్కూల్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మూడో క్రికెటర్గా దేశాయ్ నిలిచాడు. ఈ జాబితాలో ప్రణవ్ ధనవాడే (1009*), పృథ్వీ షా (546) ఉన్నారు.చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే? -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 72 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని జ్ఞాపకంగా మిగలనుంది.భారత టెస్టు క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి ఓటముల సంఖ్యను టీమిండియా అధిగమించింది. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటములు, 222 మ్యాచ్లను డ్రా, ఒకటి టైగా ముగించింది. ఈ మ్యాచ్ కంటే ముందు టెస్టుల్లో భారత్ గెలుపోటముల సంఖ్య(178) సమనంగా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లా విజయం సాధించడంతో ఓటముల కంటే అత్యధిక విజయాలను టీమిండియా నమోదు చేసింది. కాగా భారత తొలి టెస్టు విజయం కూడా చెన్నైలోని చిదబంరం స్టేడియంలోనే సాధించడం గమనార్హం.1952లో చెన్నై వేదికగా ఇంగ్లండ్పై భారత్ తొలి టెస్టు విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు యాదృచ్చికంగా 72 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ చరిత్రలో ఈ సరికొత్త ఆధ్యాయానికి చెపాక్ స్టేడియమే వేదిక కావడం విశేషం. కాగా 72 ఏళ్ల ప్రయాణంలో భారత జట్టు కెప్టెన్లుగా 36 మంది పనిచేశారు.చదవండి: IND vs BAN: అశ్విన్ స్పిన్ మాయ.. బంగ్లాపై భారత్ ఘన విజయం -
'బంగ్లాను తేలికగా తీసుకోవద్దు'.. రోహిత్ను హెచ్చరించిన సన్నీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమైంది. సెప్టెంబర్ 19ను చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ సిరీస్లో బంగ్లాను చిత్తు చేసి ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్ను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిట్మ్యాన్ను అతడు సూచించాడు. కాగా బంగ్లా జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. పాకిస్తాన్పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి భారత గడ్డపై బంగ్లా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఒక్కసారి టెస్టుల్లో టీమిండియాను బంగ్లా ఓడించనప్పటకి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఓటమి రుచిని చూపించింది. 2007 వన్డే ప్రపంచ కప్, 2012 ఆసియా కప్, 2015, 2022 ద్వైపాక్షిక సిరీస్లలో బంగ్లా జట్టు భారత్కు షాకిచ్చింది."పాకిస్తాన్ను వారి సొంత గడ్డపై ఓడించి బంగ్లాదేశ్ తమ సత్తా చాటింది. వారి టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పాక్పై తొలి సిరీస్ విజయం సాధించి ప్రపంచ క్రికెట్కు సవాలు విసిరింది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుగుపెట్టారు.టీమిండియాను ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు. రెండేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోసం బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు కూడా వారు గట్టీ పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లా జట్టులో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రత్యర్థిపై ఎలా ఆధిపత్యం ప్రదర్శించాలనేది త్వరగా నేర్చుకొంటున్నారు. పాక్పై విజయంతో బంగ్లా టీమ్ను ఏ ప్రత్యర్ధి కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. కాబట్టి బంగ్లా-భారత్ సిరీస్ కచ్చితంగా మంచి సిరీస్ అవుతోంది" అని గవాస్కర్ తెలిపాడు.మరో 10 మ్యాచ్లు..టీమిండియా వచ్చే నాలుగైదు నెలల్లో 10 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే కనీసం ఐదు మ్యాచ్లోనైనా గెలవాలి. రాబోయే టెస్టు సీజన్ మొత్తం భారత్కు సవాల్తో కూడుకున్నది అని గవాస్కర్ మిడ్-డే కాలమ్లో రాసుకొచ్చాడు.చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు' -
అరుదైన రికార్డ్కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా
టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరుగబోయే మ్యాచ్లో గెలిస్తే భారత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటుంది. టెస్ట్ల్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. బంగ్లాతో మ్యాచ్లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. బంగ్లాపై తొలి టెస్ట్లో గెలిస్తే భారత్ విజయాల సంఖ్య పరాజయాల సంఖ్య కంటే ఎక్కువుతుంది. చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్ట్లు ఆడి 414 విజయాలు, 232 పరాజయాలు ఎదుర్కొంది. ఇంగ్లండ్ ఇప్పటివరకు 1077 మ్యాచ్లు ఆడి.. 397 విజయాలు, 325 పరాజయాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 466 టెస్ట్లు ఆడి 179 విజయాలు, 161 పరాజయాలు ఎదుర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు 458 టెస్ట్లు ఆడి 148 విజయాలు, 144 పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. భారత ఆటగాళ్లంతా చెన్నైలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో -
'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలనకున్న టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్కు నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో అయ్యర్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇప్పటిలో అతడు భారత టెస్టు జట్టులోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. దేశీవాళీ క్రికెట్లో అయ్యర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో విఫలమైన శ్రేయస్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్లు ఆడిన అయ్యర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.భారత్-డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. తొలి మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చేలా కన్పించాడు. కానీ తర్వాత ఇండియా-ఎ రెండో రౌండ్ మ్యాచ్లో డకౌటయ్యాడు.దీంతో అతడిని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. తాజాగా అయ్యర్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ను అయ్యర్ సీరియస్గా తీసుకోవడం లేదని అలీ చెప్పుకొచ్చాడు"ఒక క్రికెటర్గా శ్రేయస్ అయ్యర్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యర్కు ఇప్పుడు రెడ్-బాల్ ఆడాలన్న ఆసక్తి లేదు. అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడుతున్నట్లు ఉంది. అనంతపూర్ వంటి వికెట్పై అయ్యర్ సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసి ఉండాల్సింది. కానీ అతడికి కేవలం బౌండరీలు సాధించాలన్న తపన తప్ప మరొకటి లేదు. ఏకాగ్రత లేకుండా ఆడి ఈజీగా పెవిలియన్కు చేరుతున్నాడు. శ్రేయస్కు వైట్బాల్ క్రికెట్పై మక్కువ ఎక్కువ. వన్డే ప్రపంచకప్లో రెండు సెంచరీలు సాధించిన తర్వాత అయ్యర్ను కొంతమంది విరాట్ కోహ్లితో పోల్చారు. కానీ విరాట్కు, శ్రేయస్కు చాలా తేడా ఉంది. నేను భారత సెలక్టర్ అయివుంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్ను ఆడేంచివాడిని కాదు. అతను ఆటను గౌరవించడు. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టం. లేదంటే అతడికి దులీప్ ట్రోఫీలో కూడా చోటు దక్కపోయిండేంది అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసిత్ అలీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు షాక్.. కేకేఆర్ కెప్టెన్గా సూర్యకుమార్!? -
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి?
టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలనుకున్న అఫ్గానిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నోయిడా వేదికగా న్యూజిలాండ్తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. భారీ వర్షం కారణంగా నోయిడాలోని మైదానం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.దీంతో అయిదో రోజు ఆట కూడా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో కనీసం టాస్ పడకుండానే ఈ టెస్టు మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడని అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ టెస్టు పలు అరుదైన రికార్డుల జాబితాలో చేరింది.ఆసియాలో తొలిసారి..టెస్టు క్రికెట్ హిస్టరీలో బంతి పడకుండా రద్దయిన ఎనిమిదో మ్యాచ్గా ఈ నోయిడా టెస్టు రికార్డులకెక్కింది. 1890లో మొట్టమొదటి సారి ఇలా జరిగింది. మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత 1930లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్, 1970లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, 1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, 1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, 1998లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టులు కనీసం టాస్ పడకుండానే రద్దు అయ్యాయి.ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ టెస్టు మ్యాచ్ ఈ జాబితాలోకి చేరింది. ఇక ఆసియాలో వర్షం కారణంగా రద్దు అయ్యిన తొలి టెస్టు మ్యాచ్ మాత్రం అఫ్గాన్-న్యూజిలాండ్ మ్యాచే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆసియాలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఆసియాలో 91 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు.చదవండి: Cristiano Ronaldo Followers: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా -
టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ..?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీ సీజన్తో సుదీర్ఘ ఫార్మాట్లో పాండ్యా పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. నెట్స్లో రెడ్ బాల్తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో పోస్ట్ చేశాడు.దీంతో అతడు మళ్లీ భారత టెస్టు జట్టులోకి కమ్బ్యాక్ ఇవ్వనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అక్టోబర్లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరోడాకు హార్దిక్ ప్రాతినిథ్యం వహించే అవకాశముంది.చివరి టెస్టు ఎప్పుడు ఆడడంటే?హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరుపన ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్బాల్ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. అయితే పాండ్యా ప్రస్తుతం గతంతో పోలిస్తే ఫిట్నెస్ పరంగా మెరుగయ్యాడు. దీంతో అతడు టెస్టుల్లో రీ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: పాకిస్తాన్లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆసియాలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. నామమాత్రపు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను లంక చిత్తు చేసింది. దీంతో వైట్వాష్ నుంచి లంకేయులు తప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ (39 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.లంక అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక టార్గెట్ను ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో పాక్ ఆల్టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.చదవండి: IND vs AUS: ముషీర్ ఖాన్కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..⇥టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్ది సిరీస్లగా నిలిచారు. తాజా సిరీస్లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.⇥ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం -
‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు ఎక్కువే’
టెస్టు క్రికెట్లో ఐదు శతకాలు బాదినందుకు తాను గర్వపడుతున్నానని ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. మేటి బ్యాటర్ జో రూట్ను అనుకరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. అయితే అతడిలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం తనకు సాధ్యంకాలేదని తెలిపాడు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే క్రీజులోకి వెళ్లి సెంచరీలు చేయడం తనకే ఆశ్చర్యంగా ఉండేదని పేర్కొన్నాడు.మూడు ఫార్మా ట్లలో త్తా చాటిన మొయిన్ అలీకాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడైన అలీ... తన కెరీర్లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. పదేళ్ల కెరీర్లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్లూ ఆడాడు. బంతితో, ఇటు బ్యాట్తో రాణించి.. టెస్టుల్లో 3094 పరుగులు చేయడంతోపాటు 204 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మొయిన్ అలీ తన మార్కు చూపించాడు. వన్డేల్లో 2355 పరుగులు సహా 111 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో 1229 పరుగులతో పాటు 51 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే రిటైర్మెంట్తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉందని.. అయితే, కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు 37 ఏళ్ల మొయిన్ అలీ ఆదివారం వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నా.. ఫ్రాంచైజీ క్రికెట్లో మరి కొన్నాళ్లు ఆడతానని స్పష్టం చేశాడు.ఆ విషయంలో విఫలమయ్యానుఈ నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి నెమరువేసుకున్న మొయిన్ అలీ.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుసేన్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఐదు శతకాలు బాదినందుకు గర్వపడుతున్నా. కేవలం ఐదే కదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ.. డౌన్ ఆర్డర్లో వచ్చి మరీ ఇలా ఆడటం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.అసలేం చేయగలనో తెలియని స్థితిలో క్రీజులోకి వెళ్లి.. పరుగులు రాబట్టడం నా వరకు ఊహించని విషయమే. ఉన్న కాసేపైనా బ్యాటింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిని. నిజానికి జో రూట్లా నేనూ పక్కా ప్లాన్తో ఆడాలని భావించేవాడిని. కానీ విఫలమయ్యాను. అప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లుగా మారిపోవడమే నాకు తెలుసు. అయితే, ఒక్కోసారి అనుకున్న మేర పరుగులు సాధించలేకపోయాననే భావన వెంటాడేది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ పట్ల మొయిన్ అలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానమే లక్ష్యంగా రూట్ ముందుకు సాగుతున్నాడు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు! -
విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్ టెస్టు క్రికెటర్?
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు మోత మోగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు.తద్వారా ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్(34) చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డువైపు రూట్ అడుగులు వేస్తున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకు అతడు సిద్దమవుతున్నాడు.విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్?అయితే తాజాగా ఓ పోడ్కాస్ట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లి వర్సెస్ జో రూట్.. ఇద్దరిలో ఎవరూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్? అన్న ప్రశ్నను హోస్ట్ అడిగాడు. వెంటనే వాన్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్గా జో రూట్ను ఎంచుకున్నాడు. కానీ గిల్లీ మాత్రం అందుకు అంగీకరించలేదు. విరాట్ కోహ్లినే టెస్టుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఈ ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ అదిరిపోయే సమాధానమిచ్చాడు."రూట్ ఇంగ్లండ్లో అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో రూట్ గణాంకాలు చూస్తేనే ఆర్ధమవుతోంది. అతడు సాధించిన సెంచరీలలో సగానిని పైనా ఇంగ్లండ్లో చేసినవే. కానీ విరాట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మెరుగ్గా రాణించగలడు. విరాట్ కోహ్లి పెర్త్లో ఆడిన ఇన్నింగ్స్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. పెర్త్ మైదానంలో నేను చూసిన అత్యుత్తమ సెంచరీలలో విరాట్ నాక్ ఒకటి. అది కూడా అతడు పెర్త్లో తన మొదటి మ్యాచ్లోనే కావడం విశేషం. అందుకే నా దృష్టిలో కోహ్లినే బెస్ట్ టెస్టు బ్యాటర్" అని గిల్లీ క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లోపేర్కొన్నాడు. అయితే గిల్క్రిస్ట్ దెబ్బకు వాన్ తోకముడిచాడు. ఆస్ట్రేలియాలో విరాట్ బెస్ట్ అని, కానీ వేరే చోట రూటే అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అని వాన్ చెప్పుకొచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లినే అత్యుత్తమ బ్యాటర్ అని వాన్, గిల్లీ ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.గణాంకాల్లో రూట్.. అక్కడ మాత్రం విరాట్కాగా టెస్టుల్లో రూట్ గణాంకాలతో పోలిస్తే విరాట్ కాస్త వెనకబడ్డాడనే చెప్పకోవాలి. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 113 టెస్టులు ఆడి.. 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టు సెంచరీలు చేయడం గమనార్హం. విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇక రూట్ విషయానికి వస్తే.. 145 టెస్టులు ఆడి 12377 పరగులు చేశడు. అతడి ఇన్నింగ్స్లలో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఆసీస్ గడ్డపై రూట్ ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టు సెంచరీ చేయలేదు. అతడి సాధించిన సెంచరీలలో 20కు పైగా ఇంగ్లండ్లో సాధించినవే కావడం గమనార్హం. -
బాబర్ ఆజం రిటైర్మెంట్..? క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆజం నిరాశపరిచాడు. తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన బాబర్.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్లో 31 పరుగులు చేసిన ఆజం, రెండో ఇన్నింగ్స్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. టెస్టు క్రికెట్లో అయితే బాబర్ హాఫ్ సెంచరీ సాధించి 20 నెలలపైనే అయింది. అతడు చివరగా టెస్టుల్లో డిసెంబర్ 2022లో న్యూజిలాండ్పై ఫిఫ్టీ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజంపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అయితే వరుసగా విఫలమవుతుండడంతో టెస్టు క్రికెట్కు బాబర్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఓ రిటైర్మెంట్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాబర్కు ఇదే చివరి టెస్టు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పాకిస్తాన్ హెడ్కోచ్ జాసన్ గిల్లెస్పీ ఖండించాడు. బాబర్కు సపోర్ట్గా గిల్లెస్పీ నిలిచాడు."బాబర్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్. బాబర్ తన ఫామ్ను తిరిగి అందుకుంటాడని భావిస్తున్నాను. త్వరలోనే అతడి నుంచి మనం ఓ భారీ ఇన్నింగ్స్ చూస్తాము. నాకు ఆ నమ్మకం ఉంది. అతడు తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు అని" 4వ రోజు ఆట అనంతరం గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
ధోని కంటే రోహిత్ చాలా డిఫరెంట్ కెప్టెన్: హర్భజన్
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్కప్లు అందించిన కెప్టెన్లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.కెప్టెన్సీలో ధోని, రోహిత్లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. హైదరాబాద్తో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటి నుంచి హిట్మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?
బాబర్ ఆజం.. పాకిస్తాన్కే కాదు వరల్డ్ క్రికెటలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కెప్టెన్సీతో పాటు తన క్లాసిక్ ఇన్నింగ్స్లతో పాక్కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బాబర్ క్రీజులో ఉన్నాడంటే పాక్ డగౌట్లో కొండంత బలం. టీ20ల్లో కాస్త స్లోగా ఆడుతాడని పేరు ఉన్నప్పటకి మిగితా రెండు ఫార్మాట్లలో తనకు తిరుగులేదని బాబర్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ ఇదింతా ఒకప్పుడు. గత కొంత కాలంగా బాబర్ బ్యాట్ ముగిబోయింది.ఒకనొక దశలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పోటీ పడిన ఈ పాకిస్తానీ క్రికెటర్కు ఇప్పుడు ఏమైంది. కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను కూడా అందుకోవడానికి తెగ కష్టపడతున్నాడు. ముఖ్యంగా తన ఫేవరేట్ టెస్టు క్రికెట్లో కూడా బాబర్ తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.బాబర్కు ఏమైంది?స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో బాబర్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన ఆజం.. ఇప్పుడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. స్పిన్నర్లకు అద్బుతంగా ఆడుతాడని పేరు గాంచిన బాబర్.. అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత సమయం తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ చేశాడు. ఆఖరికి షకీబ్ బౌలింగ్లో బాబర్ ఇన్నింగ్స్ ముగిసింది.చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడంటే?బాబర్ ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 15 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా బాబర్ తన మార్క్ను చూపిస్తాడో లేదో వేచి చూడాలి. -
టెస్ట్లకే నా మొదటి ప్రాధాన్యత: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్పై తన మనోగతాన్ని వెల్లడించాడు. టెస్ట్ల్లో ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. స్పోర్ట్స్టార్తోమాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యత అని అన్నాడు. టీ20ల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన స్కై.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చిన్నతనం నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూనే పెరిగానని గుర్తు చేసుకున్న స్కై.. ఆ వయసు నుంచే టెస్ట్ క్రికెట్పై మక్కువ ఎక్కువగా ఉండేదని అన్నాడు.భారత టెస్ట్ జట్టులో స్థానం కోసం చాలామంది అహర్నిశలు శ్రమించారని అన్న స్కై.. తాను కూడా టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడుతున్నానని తెలిపాడు. యువ క్రికెటర్లకు టెస్ట్ జట్టులో స్థానంపై స్కై స్పందిస్తూ.. అర్హులైన వారందరికీ సరైన అవకాశాలు లభించాయని అన్నాడు. కాగా, సూర్యకుమార్ గతేడాది టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ ఆడిన అనంతరం అతను గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అతని స్థానాన్ని ఆక్రమించాడు. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని స్కై సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్కై టెస్ట్ల్లో తన ఏకైక ఇన్నింగ్స్లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లు జరుగనున్న నేపథ్యంలో స్కై టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్నాడు. మిడిలార్డర్లో స్కై.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కై.. త్వరలో జరుగనున్న దేశవాలీ మ్యాచ్ల్లో రాణిస్తే టెస్ట్ జట్టు తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా మిడిలార్డర్లో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి స్కై అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. -
WI vs SA: చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్గా మహారాజ్ రికార్డులెక్కాడు. గయనా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన కేశవ్ ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్నర్.. 171 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హ్యూ టేఫీల్డ్ ఆల్టైమ్ రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో సఫారీ పేస్ గన్(439) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో విండీస్పై 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 0-1 తేడాతో ప్రోటీస్ జట్టు కైవసం చేసుకుంది.స్కోర్లుదక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10దక్షిణాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్: 246/10విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 222/10ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్పై ప్రోటీస్ విజయం -
'పాక్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. అందరి లక్ష్యం ఒక్కటే'
టీ20 వరల్డ్కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్కు సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇప్పటికే తమ ప్రాక్టీస్ను ఆరంభించింది.లహోర్లోని హైఫెర్మామెన్స్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తాజాగా ప్రీ-సిరీస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గోన్న పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్లో పాకిస్తాన్కు చారిత్రత్మక గోల్డ్మెడల్ అందించిన అర్షద్ జావెద్పై మీ అభిప్రాయమేంటని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించాడు.అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కదా అని సదరు జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించాడు."ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ సెటప్లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ పాకిస్తాన్కు విజయాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఏ క్రికెటర్ కూడా తమ దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేము తొలి సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్లో గెలిచేందుకు మేము శర్వశక్తులా ప్రయత్నిస్తాము. అయితే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము ఓడిన ప్రతీసారి చాలా నిరాశచెందుతాం. ఇక అర్షద్ నదీమ్ ఒక నేషనల్ హీరో. నదీమ్ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని" విలేకరుల సమావేశంలో మసూద్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్ టెస్టులకు పాకిస్థాన్ టెస్టు జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్కు లోబడి), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్కు తొలి ఇన్నింగ్స్లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 357 పరుగులకు ఆలౌటైంది.రబాడ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కల్లిస్ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు. -
SA vs WI 1st Test: చెలరేగిన కెప్టెన్.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.క్రీజులో ముల్డర్(37), రబాడ(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. ఇక విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, సీల్స్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో ఆడనున్న టీమిండియా సారథి
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్టు జట్టులోనూ పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశీ రెడ్బాల్ టోర్నమెంట్ ఆడేందుకు ఈ ముంబై బ్యాటర్ సిద్ధమయ్యాడు. రానున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భాగంగా సూర్య వైట్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ధారించింది. ఇక తన నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘నేను బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడబోతున్నాను. తద్వారా.. దేశవాళీ సీజన్(రంజీ) మొదలయ్యే ముందు నాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. ఈనెల 25 తర్వాత జట్టుతో చేరతా. నాకు వీలున్నపుడల్లా కచ్చితంగా ముంబై జట్టుకు, క్లబ్ టీమ్కు తప్పక ఆడతా’’ అని స్పష్టం చేశాడు.ఇక సూర్య ఈ టోర్నీలో ఆడటంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సూర్య ముందే చెప్పాడు. అతడు అందరిలాంటి వాడు కాదు. క్లబ్ మ్యాచ్లు ఆడతానన్నాడు. కెప్టెన్గా ఉంటారా అని మేము తనని అడిగాం. అయితే, సూర్య మాత్రం సర్ఫరాజ్నే సారథిగా కొనసాగించమని చెప్పాడు. తను ఆటగాడిగా ఉంటానని చెప్పాడు’’ అని ముంబై వర్గాలు తెలిపాయి.కాగా టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా తొలిసారి శ్రీలంకలో పర్యటించిన సూర్యకుమార్ యాదవ్.. 3-0తో క్లీన్స్వీప్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే, టెస్టుల్లో సూర్య రికార్డు అంతగొప్పగా ఏం లేదు. టీమిండియా తరఫున ఇంతవరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ముంబై జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. అజింక్య రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సర్ఫరాజ్కు ఈ సువర్ణావకాశం వచ్చింది. తొలిసారి జట్టుకు నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు. అయితే, సూర్య రాకతో సర్ఫరాజ్ పదవి చేజారుతుందని భావించగా.. సూర్య మాత్రం అతడినే కొనసాగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.కాగా మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో 1868లో జన్మించారు ఆయన. క్రికెట్ క్లబ్లో స్వదేశీయులకు అవకాశాలు కల్పించారు. ఆయన జ్ఞాపకార్థం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. దేశీ రెడ్బాల్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. ఆగష్టు 15న టోర్నీ మొదలుకానుంది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు తొలుత ముంబై ప్రకటించిన జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. ఐర్లాండ్తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్లో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్. -
శుబ్మన్ గిల్కు మళ్లీ ప్రమోషన్?.. బుమ్రాకు షాక్!
శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య బంగ్లాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శుబ్మన్ను గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్కు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే ఆల్ఫార్మాట్లలో టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్కు అప్పగించే దిశగా భారత క్రికెట్ బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత వైస్ కెప్టెన్గా ఉన్న స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తప్పించి.. గిల్ను రోహిత్ శర్మ డిప్యూటీగా నియమించాలని బోర్డు యోచిస్తుందట.ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత వైట్బాల్ వైస్ కెప్టెన్గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ గిల్కు అప్పగించింది.అదేవిధంగా కెప్టెన్గా కూడా గిల్ ఆకట్టుకున్నాడు. అతడి సారథ్యంలోనే జింబాంబ్వేతో టీ20 సిరీస్ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహిస్తున్నాడు. -
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. -
‘704’తో ముగించిన అండర్సన్
లండన్: 21 సంవత్సరాల టెస్టు కెరీర్... 188 మ్యాచ్లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కెరీర్కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో అండర్సన్ ఖాతాలో చివరిదైన 704వ వికెట్ చేరింది. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా... సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు. మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఓవర్నైట్ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్ మోతీ (31 నాటౌట్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్లో అట్కిన్సన్ (5/61) విండీస్ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్హామ్లో జరుగుతుంది. -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్షిప్లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్కు వరల్డ్క్రికెట్లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్గా 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
SL Vs BAN: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్.. టెస్ట్ క్రికెట్లో ఒకే ఒక్కడు..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు దిగి, ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ప్లేస్లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్ ఇన్నింగ్స్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. 92 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు. -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్బాల్ క్రికెట్పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్బాల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు. సోమవారం బంగ్లా సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది. అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్తో టెస్ట్ ఆడాడు . శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో భీకర ఫామ్లో ఉండిన హిట్మ్యాన్ ఈ సిరీస్లో ఆడిన 9 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 యేళ్ళ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 579 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్ల్లో గెలవగా, 178 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 222 మ్యాచ్లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. అయితే భారత జట్టు టెస్టు చరిత్రలో విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా రావడం ఇదే తొలిసారి. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ గెలుపు ఓటముల నిష్పత్తి సమానం కాలేదు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డుకు ధర్మశాల వేదికైంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైశ్వాల్ ఈ సిరీస్ ఆసాంతం అద్బుతమైన కనబరిచాడు. 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: #Shreyas Iyer: ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. 112 ఏళ్ల తర్వాత! ప్రపంచంలోనే
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్ను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. తిరిగి పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టెస్టులో 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో చెలరేగగా.. పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కుల్దీప్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఇక ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన రోహిత్ సేన.. తర్వాత నాలుగు మ్యాచ్ల్లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. కాగా సొంతగడ్డపై భారత్కు ఇది 400వ విజయం కావడం గమనార్హం. -
BCCI: ఆరేళ్ల తర్వాత మళ్లీ...
ముంబై: భారత దేశవాళీ క్యాలెండర్లో మహిళా క్రికెటర్ల కోసం ఆరేళ్ల తర్వాత రెడ్ బాల్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 11 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తం ఆరు జోనల్ జట్లు (ఈస్ట్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, నార్త్, సౌత్జోన్) ఈ టోర్నీలో పోటీపడతాయి. ప్రతి మ్యాచ్ మూడు రోజులపాటు జరుగుతుంది. నార్త్, సౌత్ జోన్ జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్లు లభించగా... ఈస్ట్–నార్త్ ఈస్ట్; వెస్ట్–సెంట్రల్ జోన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్స్లో నార్త్, సౌత్ జోన్ జట్లతో ఆడతాయి. చివరిసారి 2018లో మహిళా క్రికెటర్లకు రెడ్ బాల్ టోర్నీని ఏర్పాటు చేయగా... ఆ సమయంలో రెండు రోజుల మ్యాచ్లు నిర్వహించారు. -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. ఆరేళ్ల నిరీక్షణకు తెర
ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్బాల్ క్రికెట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ ఆరేళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం ఆరేళ్లగా ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (58) నాటౌట్గా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్(27) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్, రెహ్మన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్.. ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ ఐర్లాండ్ ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్లో 8 వికెట్లతో సత్తాచాటిన ఐరీష్ పేసర్ మార్క్ అడైర్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
భారత క్రికెటర్లకు జాక్పాట్..!
భారత్ ఆటగాళ్లలో రెడ్ బాల్ క్రికెట్పై ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఆర్దికపరమైన తాయిలాలు ప్రకటించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఓ ఆటగాడు ఏడాది మొత్తంలో జరిగే అన్ని రంజీ మ్యాచ్ల్లో పాల్గొంటే 75 లక్షల రూపాయలు.. అలాగే ఓ ఆటగాడు ఓ ఏడాదిలో జరిగే అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడితే 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై బోర్డు పెద్దలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భారత్లో టెస్ట్ క్రికెట్కు ఆదరణ పెరగడంతో పాటు ఆటగాళ్లకు ఆర్దికంగా భారీ లబ్ది చేకూరుతుంది. ఈ మొత్తం ఐపీఎల్ కాంట్రాక్ట్ వల్ల లభించే మొత్తంతో ఏమాత్రం తీసిపోదు. ఇదిలా ఉంటే, బీసీసీఐ 2024-25 వార్షిక కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. -
అరుదైన మైలురాయిని అధిగమించిన రోహిత్ శర్మ
రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4000 టెస్ట్ పరుగుల మార్కును తాకిన హిట్మ్యాన్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్మ్యాన్కు ముందు సచిన్ (15921), ద్రవిడ్ (13265), గవాస్కర్ (10122), కోహ్లి (8848), లక్ష్మణ్ (8781), సెహ్వాగ్ (8503), గంగూలీ (7212), పుజారా (7195), వెంగ్సార్కర్ (6868), అజారుద్దీన్ (6215), గుండప్ప విశ్వనాథ్ (6080), కపిల్ దేవ్ (5248), రహానే (5077), ధోని (4876), మొహిందర్ అమర్నాథ్ (4378), గంభీర్ (4154) భారత్ తరఫున టెస్ట్ల్లో 4000 పరుగుల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. ఈ మైలురాయిని వీరేంద్ర సెహ్వాగ్ అందరి కంటే వేగంగా చేరుకున్నాడు. వీరూ కేవలం 79 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును తాకగా.. హిట్మ్యాన్కు 100 ఇన్నింగ్స్లు పట్టాయి. టెస్ట్ క్రికెట్లోకి ఆలస్యంగా అడుగుపెట్టన రోహిత్.. ఈ ఫార్మాట్లో 58 మ్యాచ్లు ఆడి 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 44.99 సగటున 4004 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని (262 మ్యాచ్ల్లో 10709) దాటిన రోహిత్.. టీ20ల్లో 4000 పరుగుల మార్కుకు 26 పరుగుల దూరంలో (151 మ్యాచ్ల్లో 3974 పరుగులు) ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపు దాదాపుగా ఖరారైంది. మరో 152 పరుగులు చేస్తే భారత్ విజయఢంకా మోగిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్లో ఉన్నారు. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఫస్ట్ ఇన్నింగ్స్ల్లో ఫట్టు.. సెకెండ్ ఇన్నింగ్స్ల్లో హిట్టు
టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో దూసుకుపోతున్నప్పటికీ.. టెస్ట్ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడన్నది కాదనలేని సత్యం. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో గిల్ ఇప్పటివరకు ఆడిన 58 మ్యాచ్ల్లో 7 సెంచరీలు (ఓ వన్డే డబుల్ సెంచరీ), 14 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించగా.. 43 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో కేవలం 1292 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గిల్ గణాంకాల్లో ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అదేంటంటే.. గిల్ తన 23 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో ఫస్ట్ ఇన్నింగ్స్ల్లో ఫట్టనిపించినా.. సెకెండ్ ఇన్నింగ్స్ల్లో మాత్రం హిట్టనిపించాడు. గిల్ తానాడిన 23 తొలి ఇన్నింగ్స్ల్లో 25.91 సగటున కేవలం 596 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్ల విషయానికొస్తే గిల్ చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడు. 20 ఇన్నింగ్స్ల్లో 40.94 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 696 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూసి నెటిజన్లు గిల్ను సెకెండ్ ఇన్నింగ్స్ హీరో అంటున్నారు. టెస్ట్ల్లో సెకెండ్ ఇన్నింగ్స్ల్లో లాగే గిల్కు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఛేజింగ్లో మాంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లలో గిల్ ఇప్పటివరకు చేసిన సెంచరీల్లో సగం ఛేదనల్లో చేసినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో గిల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో (23, 0) విఫలమైనా.. రెండు (34, 104), మూడు టెస్ట్ల్లో (0, 91) కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ గిల్ తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మూడో టెస్ట్లో గిల్తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ చెలరేగడంతో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు మ్యాచ్లో విజయాలు సాధించి మరో సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్స్టో- 97 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. -
రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
మౌంట్ మాంగనుయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్తో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేన్ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. What an incredible moment! After over 8 hours at the wicket, Rachin Ravindra has passed 200 runs - a historic double hundred 🔥👏@BLACKCAPS v South Africa: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/00Xlbjoirl — TVNZ+ (@TVNZ) February 5, 2024 -
Shubman Gill: నీవు మరి మారవా గిల్..? ఇంకా ఎన్ని ఛాన్స్లు! అతడిని తీసుకోండి?
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా గత 9 ఇన్నింగ్స్లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. క చివరి 9 ఇన్నింగ్స్లలో గిల్ స్కోర్లు (6), (10), (29*), (2), (26) (36),(10), (23),(0) ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో గిల్పై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీవు మరి మారవా గిల్ అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే గిల్ స్ధానంలో రజిత్ పాటిదార్కు ఛాన్స్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. చదవండి: IND vs ENG: బెన్ స్టోక్స్ బుల్లెట్ త్రో.. పాపం జడేజా! ఇదే తొలిసారి? వీడియో వైరల్ Common Knowledge (Compulsory Tweet) :- Ruturaj Gaikwad >>> Shubman Gill pic.twitter.com/285jAooVA5 — Aufridi Chumtya (@ShuhidAufridi) January 28, 2024 Shubman Gill's downfall era 💉 pic.twitter.com/8VetokZhtD — DEVARATHA DONWAY🐐 (@divonconvey) January 28, 2024 -
ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి?
వైట్ బాల్ ఫార్మాట్లలో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. టెస్టుల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో సైతం గిల్ అదే ఆట తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 66 బంతులు ఎదుర్కొన్న గిల్ కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన శుబ్మన్.. ఆఖరికి టామ్ హార్ట్లీ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనలో గిల్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. గత 8 ఇన్నింగ్స్లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. చివరి 8 ఇన్నింగ్స్లలో గిల్ స్కోర్లు (6), (10), (29*), (2), (26) (36),(10), (23) ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గిల్ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అతడి స్ధానంలో మరో ఆటగాడికి ఛాన్స్ ఇవ్వాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది గిల్ను పక్కన పెట్టి రజిత్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవాలని ఇక ఓవరాల్గా తన కెరీర్లో ఇప్పటివరకు 21 టెస్టులు ఆడిన గిల్.. 1063 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. Shubman Gill in his Last 8 Test Innings: 6(11) 10(12) 29*(37) 2(12) 26(37) 36(55) 10(11) 23(66) - Today Gill is not a test material and with these stats he don't deserves to play test cricket anymore, Rajat Patidar should replace him in next gamepic.twitter.com/sEEsegG0HS — Gaurav (@viratian_83) January 26, 2024 -
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు వికెట్కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. టెస్ట్ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని, తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్లకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ ఓ ప్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు. 32 ఏళ్ల క్లాసెన్ సౌతాఫ్రికా తరఫున కేవలం నాలుగు టెస్ట్లు మాత్రమే ఆడాడు. 2019లో టెస్ట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టినప్పటికీ.. డికాక్ అప్పటికే జట్టులో స్థిరపడిపోయినందున క్లాసెన్కు సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు కూడా సౌతాఫ్రికా సెలెక్టర్లు టెస్ట్ జట్టులోకి క్లాసెన్ను తీసుకోవట్లేదు. విధ్వంసకర ఆటగాడు కావడంతో క్లాసెన్పై లిమిటెడ్ ఓవర్స్ ప్లేయర్గా ముద్ర పడింది. అందుకే అతనికి సరైన అవకాశాలు రాలేదు. పైగా అతనికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 4 టెస్ట్ల్లో క్లాసెన్ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్లు, 2 స్టంపౌట్లు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో క్లాసెన్కు మంచి రికార్డే ఉంది. అతను 85 మ్యాచ్ల్లో 46.09 సగటున పరుగులు చేశాడు. వన్డే, టీ20ల్లో క్లాసెన్కు ఘనమైన రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 40.1 సగటున 1723 పరుగులు చేసిన క్లాసెన్.. 43 టీ20ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 147.6 స్ట్రయిక్రేట్తో 722 పరుగులు చేశాడు. -
వార్నర్ గుడ్ బై
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ పరాజయం పరిపూర్ణమైంది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన పాక్ మూడో టెస్టులోనూ ఓటమిపాలైంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆ్రస్టేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్నుంచి తప్పుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు. ఓవర్నైట్ స్కోరు 68/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్లో 115 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ (28) కొద్ది సేపు పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్వుడ్ 4, లయన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 25.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. 2 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 130 పరుగులు చేసింది. లబుషేన్ (62 నాటౌట్), డేవిడ్ వార్నర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 119 పరుగులు జత చేశారు. పాక్ పేసర్ ఆమిర్ జమాల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా...ఆసీస్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఆ్రస్టేలియాపై పాక్ జట్టుకు టెస్టుల్లో ఇది వరుసగా 17వ ఓటమి కావడం విశేషం! 1999నుంచి ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఆ జట్టు ఓడింది. తాజా గెలుపుతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా (56.25 పాయింట్ల శాతం)తో మళ్లీ అగ్రస్థానానికి చేరుకోగా, భారత్ (54.16 పాయింట్ల శాతం) రెండో స్థానానికి పడిపోయింది. టెస్టు నంబర్ 2020... వార్నర్ తొలి మ్యాచ్ ఇది. టి20 స్పెషలిస్ట్గా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో ఒకడిగా కెరీర్ను ముగించిన ఘనత వార్నర్ సొంతం. దేశవాళీలో దూకుడైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడకుండానే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్గా వార్నర్ పరిచయమయ్యాడు. టి20 శైలితో టెస్టులు ఆడి వార్నర్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 8 వేలకు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లను చూస్తే స్ట్రయిక్రేట్లో సెహా్వగ్ తర్వాత వార్నర్దే రెండో స్థానం. ఆ్రస్టేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసినవారిలో వార్నర్ ఐదో స్థానంలో నిలవగా, ఓపెనర్ల జాబితాలో అతనిదే అగ్రస్థానం కావడం విశేషం. 13 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఓపెనింగ్ చేసిన వార్నర్ తమ జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన తొలి టెస్టునుంచి వరుసగా ఏడేళ్ల పాటు వార్నర్ బెస్ట్ ఓపెనర్గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2018లో వచ్చిన బాల్ టాంపరింగ్ వివాదం అతని కెరీర్లో పెద్ద మరక. అయితే ఏడాది నిషేధం తర్వాత పునరాగమనంలోనూ సత్తా చాటి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్పై చేసిన 335 పరుగులు ఆసీస్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో టీమ్లో చోటు దక్కించుకుంటాడో లేదో అనిపించినా...అతని సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఆసీస్ బోర్డు వార్నర్ కోరిక ప్రకారం సొంత మైదానంలో రిటైర్మెంట్కు అవకాశం కల్పించింది. ఇప్పుడు విజయంతో ఘనంగా అతను టెస్టులకు వీడ్కోలు పలికాడు. టెస్టు కెరీర్: 112 మ్యాచ్లలో 44.59 సగటుతో 8786 పరుగులు – 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు. -
కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్నాడు. తన ఫేర్వెల్ సిరీస్ తొలి మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన వార్నర్.. తన కెరీర్ చివరి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ విజయానికి చేరువైన సమయంలో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు వార్నర్ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. "విజయంతో నా కెరీర్ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని"వార్నర్ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ranji Trophy: చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా David Warner got emotional and crying when he was giving his interview. An emotional moment for him🫶 pic.twitter.com/BhXAsl2PQj — CricGuru (@Cse1Das) January 6, 2024 -
ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు విడ్కోలు పలికాడు. పాకిస్తాన్తో మూడో టెస్టు అనంతరం రెడ్బాల్ క్రికెట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల సైతం వార్నర్కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇక మూడో టెస్టులో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్కు ఆసీస్ ఘనమైన విడ్కోలు పలికింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కివీస్తో మొదలెట్టి పాక్తో ముగింపు.. 2011లో న్యూజిలాండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు తన సేవలను ఆస్ట్రేలియా క్రికెట్కు అందించాడు. తన ఈ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. మాయని మచ్చలా.. అయితే వార్నర్కు తన అద్భుత కెరీర్లో బాల్టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్క్రాఫ్ట్ సాండ్పేపర్తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. కాగా వార్నర్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్ ఆడనున్నాడు. చదవండి: AUS vs PAK 3rd Test: పాకిస్తాన్ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్స్వీప్ One final time.#AUSvPAK pic.twitter.com/gbD9Fv28h8 — cricket.com.au (@cricketcomau) January 6, 2024 -
55 పరుగులకే ఆలౌట్.. టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!
స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. ఆ జట్టు స్వదేశంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్ త్రయం ధాటికి సఫారీలు లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు. అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. And this was the Test they actually cared about 😳 Karma strikes as days after disrespecting cricket, South Africa is bowled out before lunch for a 135-year worst >> https://t.co/WRU2aJihX8 pic.twitter.com/zYnjeVrh9W — Fox Cricket (@FoxCricket) January 3, 2024 కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం CSA ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్ క్రికెట్ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్లో ఉన్నారు. -
టెస్ట్ క్రికెట్ను చంపే కుట్ర జరుగుతుంది..!
ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాసులు కురిపించే లీగ్ (SA20) కోసం క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ను చంపే కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్తో కూడిన జట్టును న్యూజిలాండ్కు పంపిస్తూ క్రికెట్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ క్రికెట్ను అవమానపరిచిందని మండిపడ్డాడు. స్వదేశంలో జరిగే లీగ్పై అంత మమకారం ఉన్నప్పుడు న్యూజిలాండ్ సిరీస్ను మొత్తంగా రద్దు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ను చులకన చేసిందని, వాళ్లకు దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్టే ఎక్కువైందని తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్ను చులకన చేస్తూ క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పనిని చూసిచూడనట్లు వ్యవహరించినందుకు ఐసీసీ సహా బీసీసీఐపై కూడా మండిపడ్డాడు. ఐసీసీ, బీసీసీఐ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చాడు. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ను చులకన చేసేటువంటి చర్యలకు పాల్పడటం ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆ దేశ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం ఆస్ట్రేలియాకు ద్వితియ శ్రేణి జట్టును పంపించిందని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ లాంటి దేశాలు సైతం ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఇలాంటి చర్యలు టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు. మార్నింగ్ హెరాల్డ్తో మాట్లాడుతూ వా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్లను కాదని అనామక జట్టును న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
న్యూజిలాండ్కు ఇది అవమానమే.. ఆఖరికి పాక్ కూడా అలాగే: స్టీవ్ వా
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరును ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా తప్పుబట్టాడు. జాతీయ జట్టు కంటే వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువైపోయిందంటూ మండిపడ్డాడు. తనే గనుక న్యూజిలాండ్ క్రికెట్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా జట్టు యాజమాన్యానికి తగిన విధంగా బుద్ధి చెప్పేవాడినంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా న్యూజిలాండ్తో ఫిబ్రరిలో జరుగనున్న టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోని 14 మంది సభ్యుల్లో దాదాపు అందరూ కొత్త వారే. కెప్టెన్ నీల్ బ్రాండ్ కూడా పెద్దగా పరిచయం లేని పేరు. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్లో పాల్గొనున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు అనామక ఆటగాళ్లను కివీస్ పర్యటనకు పంపేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి సహా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్కు చరమగీతం పాడేలా చర్యలకు పూనుకుంటున్న సౌతాఫ్రికా క్రికెట్ను హెచ్చరించాల్సిన అవసరం మీకు లేదా అంటూ ప్రశ్నించాడు. ‘‘సౌతాఫ్రికాకు టెస్టు గురించి పట్టదు. భవిష్యత్తులో తమ ఆటగాళ్లు కేవలం సొంతగడ్డపై జరిగే లీగ్ క్రికెట్కే ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ నేనే గనుక న్యూజిలాండ్ స్థానంలో ఉండి ఉంటే.. ఈ సిరీస్ను రద్దు చేయించేవాడిని. అసలు కివీస్ జట్టు ఈ అనామక టీమ్తో ఆడేందుకు ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. టెస్టు క్రికెట్ అంతం కాబోతోందనడానికి ఇలాంటివి సంకేతాలు. ఐసీసీతో పాటు ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఏం చేస్తున్నాయి? వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలి. చరిత్ర, సంప్రదాయానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా? కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే.. సర్ డాన్ బ్రాడ్మన్, గ్రేస్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ వంటి దిగ్గజాల లెగసీని కొనసాగించేవారెవరు? టెస్టు క్రికెట్ ఫీజుల విషయంలో ఆయా బోర్డులు ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. అందుకే చాలా మంది ఆటగాల్లు టీ10, టీ20 లీగ్ల వైపు చూస్తున్నారు’’ అని సిడ్నీ హెరాల్డ్తో స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ.. అనామక జట్లను విదేశీ పర్యటనలకు పంపిస్తున్నాయని స్టీవ్ వా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా జాతీయ జట్టు టూర్లపై ప్రభావం పడటం ఇది రెండోసారి. గతేడాది టీ20 లీగ్ కారణంగా తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు చేసుకోవాలని భావించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు లేకుండానే సిరీస్ను ముగించేసింది. ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బాక్సిండే టెస్టులో భారత జట్టును చిత్తు చేసిన ప్రొటిస్ బుధవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా వార్నర్ -
భారత మహిళల మరో చరిత్ర
ముంబై: మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు కొత్త రికార్డును నమోదు చేసింది. పరుగులపరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలింగ్ ధాటికి మూడు రోజుల్లోపే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 35.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మరీ పేలవంగా 27.3 ఓవర్లకే కుప్పకూలింది. 479 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 131 పరుగులకే ఆలౌటైంది. హీతర్ నైట్ (21)దే అత్యధిక స్కోరు కావడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. మిగిలిన బ్యాటర్లలో ఎవరూ కూడా భారత బౌలర్లను కనీసం ప్రతిఘటించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లుతో చెలరేగిన ఆఫ్స్పిన్నర్ దీప్తి శర్మ రెండో ఇన్నింగ్స్లోనూ (4/32) ప్రత్యరి్థని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. పేసర్ పూజ వస్త్రకర్ ఆరంభంలో 3 కీలక వికెట్లు పడగొట్టగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్కు 2 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 186/6 వద్దనే భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 292 పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు ఇంగ్లండ్ ముందు 479 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మ్యాచ్లో మొత్తం 39 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు 87 పరుగులు సాధించిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. సొంతగడ్డపై భారత మహిళల జట్టు ఇంగ్లండ్ను ఓడించడం ఇదే మొదటిసారి (ఆరు టెస్టుల్లో) కావడం విశేషం. తాజా విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గురువారంనుంచి వాంఖెడే స్టేడియంలో ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టులో తలపడనున్న నేపథ్యంలో తాజా గెలుపు మరింత ప్రేరణ అందించడం ఖాయం. మరో వైపు ఇంగ్లండ్తో టెస్టులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి అర్ధ సెంచరీ సాధించిన శుభ సతీశ్ ఆసీస్తో మ్యాచ్కు దూరం కానుంది. ఎడమచేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆమె కోలుకునే అవకాశాలు దాదాపుగా లేవు. 347 మహిళల టెస్టుల్లో పరుగులపరంగా అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంక (309 పరుగులు) పేరిట ఉన్న రికార్డును భారత్ సవరించింది. ఈ రెండూ మినహా ఇతర టెస్టు విజయాలన్నీ 200 పరుగుల లోపు తేడాతోనే వచ్చాయి. 3 ఇంగ్లండ్పై భారత్కు ఇది మూడో విజయం. 15 టెస్టుల్లో భారత్ 1 మ్యాచ్ ఓడగా 11 ‘డ్రా’గా ముగిశాయి. మిగిలిన రెండు సార్లు ఇంగ్లండ్లోనే భారత్ గెలిచింది. 27.3 రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆడిన ఓవర్లు. ఆలౌట్ అయిన సమయంలో ఏ జట్టుకైనా ఇదే అతి చిన్న ఇన్నింగ్స్. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 428, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 136, భారత్ రెండో ఇన్నింగ్స్ 186/6 డిక్లేర్డ్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డంక్లీ (సి) (సబ్) హర్లీన్ 15; బీమాంట్ (బి) రేణుక 17; నైట్ (సి) యస్తిక (బి) పూజ 21; నాట్ సివర్ (బి) పూజ 0; వైట్ (సి) రాణా (బి) దీప్తి 12; జోన్స్ (సి) షఫాలీ (బి) దీప్తి 5; ఎకెల్స్టోన్ (బి) రాజేశ్వరి 10; డీన్ (నాటౌట్) 20; క్రాస్ (బి) దీప్తి 16; ఫైలర్ (బి) దీప్తి 0; బెల్ (సి) జెమీమా (బి) రాజేశ్వరి 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–27, 2–37, 3–37, 4–68, 5–68, 6–83, 7–83, 8–108, 9–108, 10–131. బౌలింగ్: రేణుకా సింగ్ 6–1–30–1, స్నేహ్ రాణా 4–0–19–0, పూజ వస్త్రకర్ 4–1–23–3, దీప్తి శర్మ 8–2–32–4, రాజేశ్వరి 5.3–1–20–2. -
OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..
Sachin Tendulkar- history Test cricket: క్రికెట్లో రికార్డులకు మారుపేరు సచిన్ టెండుల్కర్. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ లెక్కనేనన్ని ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నేటికీ కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుత తరం బ్యాటర్లలో ఎవరు ఏ రికార్డు సాధించినా అందులో సగం వరకు సచిన్ పేరుతో ముడిపడి ఉంటాయంటే ఈ టీమిండియా లెజెండ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ను పెద్దగా ఇష్టపడని వాళ్లకు సైతం ఆయన పేరు సుపరిచితమే. మరి అలాంటి.. మన క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో అక్టోబరు 17కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజు.. 2008లో సరిగ్గా ఇదే రోజు.. మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా సచిన్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా.. కంగారూ జట్టు పేసర్ పీటర్ సిడెల్ బౌలింగ్లో.. గల్లీ దిశగా బంతిని తరలించాడు సచిన్. లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్ ఈ క్రమంలో మూడు పరుగులు సాధించిన లిటిల్ మాస్టర్.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 11,953 పరుగులతో లారా అగ్రస్థానంలో ఉండేవాడు. ఇక 2006లోనే ఈ విండీస్ లెజెండ్ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పగా.. 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా సచిన్ టెస్టుల్లో ఆల్టైమ్ లీడ్ రన్స్కోరర్గా అవతరించాడు. ఆసీస్ ఆటగాళ్ల అభినందనలు ఇక కెరీర్లో అరుదైన ఘనత సాధించిన సచిన్ టెండుల్కర్కు నాడు మొహాలీ ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. నాటి ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సహా ఇతర ఆటగాళ్లు సచిన్ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపారు. వంద శతకాల వీరుడు.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఘనుడు కాగా 152 టెస్టులో సచిన్ టెండుల్కర్ 11955 పరుగులతో లారాను అధిగమించగా.. లారా 131 మ్యాచ్లలోనే 11953 రన్స్ సాధించాడు. అప్పటికి సచిన్ అత్యుత్తమ స్కోరు 248 నాటౌట్ కాగా.. లారా స్కోరు 400- నాటౌట్. ఇక తన 24 ఏళ్ల కెరీర్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 248 కాగా.. వన్డేల్లో 200. టెస్టు సెంచరీలు 51. వన్డే సెంచరీలు 49. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్కు భారీ షాక్! RECORDULKAR "Success is a process & during that journey sometimes there're stones thrown at you & you convert them into milestones"#OnThisDay in 2008 at 2.31pm, @sachin_rt became the Highest Run Scorer when he went past Lara's tally of 11,953 Test runspic.twitter.com/5VOdLBrdZu — Cricketopia (@CricketopiaCom) October 17, 2023 -
ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే! ఆటకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటన చేశాడు. కాగా 2018లో టీమిండియాతో ఓవల్ మ్యాచ్ తర్వాత కుక్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. భారత జట్టుతో నాటి మ్యాచ్లో వరుసగా రెండు ఇన్నింగ్స్లో 71, 147 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్కు పరిమితమయ్యాడు. కౌంటీల్లో ఎసెక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి.. 2019నాటి చాంపియన్షిప్లో టీమ్ను విజేతగా నిలిపాడు. అప్పుడు చాంపియన్.. కానీ ఈసారి తాజా చాంపియన్షిప్లో 14 మ్యాచ్లు ఆడి.. ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాల సాయంతో 836 పరుగులు సాధించిన కుక్.. ఎసెక్స్కు మరోసారి టైటిల్ అందించలేకపోయాడు. ఈసారి సర్రే టీమ్ విజేతగా నిలవగా.. ఎసెక్స్ రెండోస్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఎసెక్స్ సోషల్ మీడియా వేదికగా అలిస్టర్ కుక్ తన నిర్ణయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ‘వీడ్కోలు పలకడం అంత సులభం కాదు. క్రికెట్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నేనెన్నడూ ఊహించని ప్రదేశాలకు వెళ్లడం సహా.. అక్కడి వాళ్లతో అనుబంధాలు పెంపొందించుకోవడం ఆట వల్లే సాధ్యమైంది. కలలో కూడా ఊహించని ఎన్నో విషయాలను నేను సాధించగలిగాను. ఎనిమిదేళ్ల వయసులో అండర్-11 జట్టులో ఆడిన నాటి నుంచి.. ఇప్పటి దాకా.. ఒకింత గర్వం.. అంతకు మించిన బాధతో.. కుక్ భావోద్వేగం భిన్న భావోద్వేగాల సమాహారంతో ఆటకు వీడ్కోలు చెబుతున్నా. అయితే, జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలను ఆట నాకు మిగిల్చింది.. నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అంటూ 38 ఏళ్ల అలిస్టర్ భారమైన హృదయంతో బ్యాటర్గా శాశ్వతంగా ఆటకు దూరమయ్యాడు. కాగా ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్కు ముగింపు పలికిన కుక్ను ఉద్దేశించి.. ‘‘ఒక శకం ముగిసిపోయింది..’’ అంటూ అతడికి ధన్యవాదాలు తెలిపింది ఎసెక్స్ యాజమాన్యం. ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే కాగా ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్లలో ఒకడిగా అలిస్టర్ కుక్ పేరొందాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో 12400 పరుగులు సాధించి.. ఆల్టైమ్ లీడింగ్ రన్స్కోరర్గా కుక్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 352 మ్యాచ్లలో 26,643 పరుగులు చేశాడు. ఇందులో 74 సెంచరీలు ఉన్నాయి. ఇక 2006లో భారత్ వేదికగా టీమిండియాతో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుక్.. సొంతగడ్డపై టీమిండియాతోనే తన చివరి మ్యాచ్ ఆడటం విశేషం. చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్.. గుడ్న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ! ఇషాన్ అవుట్.. కానీ! -
టెస్టుల్లో స్టోక్స్ కంటే బెస్ట్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్! కానీ..
Ben Stokes- Ravindra Jadeja: ‘‘రవీంద జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. అంతేనా.. 10 ఓవర్ల పాటు(వన్డేలో) బౌలింగ్ చేయడం కూడా గ్యారెంటీ. ఇక టెస్టుల్లో కేవలం టీమిండియా తరఫున మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్రౌండర్.. బెన్ స్టోక్స్ కంటే కూడా జడేజా బెస్ట్. ఎందుకంటే స్టోక్స్ ఎక్కువగా బౌలింగ్ చేయలేడు. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల సత్తా జడేజాకు సొంతం. కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు కానీ అనుకున్నంత స్థాయిలో అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏదేమైనా టెస్టుల్లో జడేజా బెస్ట్ ఆల్రౌండర్ అని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో ఇద్దరూ.. కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ జడేజా, ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్.. ఇద్దరూ టెస్టుల్లో అత్యుత్తమ ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్లో జడ్డూ గత కొంతకాలంగా నంబర్ 1లో కొనసాగుతుండగా.. స్టోక్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జడ్డూ, స్టోక్స్ గణాంకాలు ఇలా ఇక ఇప్పటి వరకు 67 అంతర్జాతీయ టెస్టులాడిన జడేజా.. 2804 పరుగులు చేయడంతో పాటు.. 275 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ 97 టెస్టుల్లో 6117 పరుగులు సాధించడంతో పాటు 197 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో బెస్ట్ ఎవరంటే తాను జడ్డూ వైపే మొగ్గు చూపుతానని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ పైవిధంగా స్పందించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సైకిల్లో జడ్డూ 13 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 5- వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ అత్యుత్తమ గణాంకాలు 7/42. అదే విధంగా.. రెండు సెంచరీలు.. మూడు ఫిఫ్టీలతో 721 పరుగులు రాబట్టాడు. వన్డేల్లో రీఎంట్రీ.. రికార్డు సృష్టించి ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 మ్యాచ్లలో.. రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు సాధించాడు. అదే విధంగా 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ వన్డేల్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. మూడో వన్డేలో ఏకంగా 182 పరుగులతో చెలరేగి ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. మరోవైపు.. జడ్డూ ఆసియా వన్డే కప్-2023 ఆడాడు. వీరిద్దరు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఎలా ఆడాతారో చూడాలిక! చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్కు గుడ్బై
శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుక్రికెట్కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్కు తెలియజేశాడు. పరిమిత ఓవర్లపై దృష్టిసారించేందుకే హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడిని నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కూడా అంగీకరించరింది. మేము హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము. "మా వైట్-బాల్ జట్టులో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని భావిస్తున్నామని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా పేర్కొన్నాడు. కాగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఇప్సటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ప్రాతినిథ్యం వహించాడు. హసరంగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్లో బీలవ్కాండీ జట్టుకు సారధిగా ఉన్నాడు. చదవండి: ODI WC 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు? -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన బ్రాడ్కు శాపంగా మారింది. ఓవరాల్గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్కప్లో బ్రాడ్ ఇంగ్లండ్కు కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
పాకిస్తాన్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! టీమిండియాకు కూడా
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం ముగిసిన ఆఖరి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య లంకపై గెలిచింది. ఓవర్నైట్ స్కోరు 563/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన పాక్ 134 ఓవర్లలో 576/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ రిజ్వాన్ (50 నాటౌట్; 4 ఫోర్లు, 1సిక్స్) అర్ధసెంచరీ పూర్తికాగానే డిక్లేర్ చేసింది. ఆగా సల్మాన్ (132 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలి చాడు. దీంతో పాకిస్తాన్కు తొలి ఇన్నింగ్స్లో 410 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 67.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ కరుణరత్నే (41; 6 ఫోర్లు) రాణించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ (7/70) చావుదెబ్బ తీశాడు. నసీమ్ షాకు 3 వికెట్లు దక్కాయి. పాకిస్తాన్ అరుదైన ఘనత.. ఇక సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. శ్రీలంక గడ్డపై పాకిస్తాన్కు ఇది ఐదో టెస్ట్ సిరీస్ విజయం. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్ట్ సిరీస్లు గెలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ రికార్డులకెక్కింది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు శ్రీలంకలో నాలుగు టెస్టు సిరీస్లను సొంతం చేసుకున్నాయి . తాజా సిరీస్ విజయంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను పాక్ అధిగమించింది. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్ధానంలో ఉంది. చదవండి: IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
ఏమున్నా ఈ రోజే ఎంజాయ్ చేయండి.. మరో 5 నెలలు చూడాలనుకున్నా కుదరదు..!
టెస్ట్ క్రికెట్ను ఆస్వాదించే భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి తర్వాత మరో ఐదు నెలల పాటు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడదు. ఫిక్సడ్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం భారత్ మరో ఐదు నెలల పాటు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతుంది. విండీస్లో ఇవాళ (రెండో టెస్ట్ ఆఖరి రోజు) రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముగిసాక భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత అటునుంచటే నేరుగా ఐర్లాండ్కు వెళ్లి అక్కడ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ఆగస్ట్ 30-సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్, ఆ తర్వాత అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్, అటు పిమ్మట డిసెంబర్ 10 నుంచి 21 వరకు సౌతాఫ్రికాలో 3 మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్లు.. ఇలా డిసెంబర్ 21 వరకు భారత్ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతుంది. తిరిగి డిసెంబర్ 26న టీమిండియా తెలుపు రంగు జెర్సీల్లో కనిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు టీమిండియా తొలి టెస్ట్ ఆడుతుంది. ఈ పర్యటనలో భారత్ ఈ టెస్ట్ తర్వాత మరో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్ 2024 జనవరి 3 నుంచి 7 మధ్యలో జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఐదు నెలల పాటు సుదీర్ఘ ఫార్మాట్కు దూరంగా ఉండనున్న భారత్.. సౌతాఫ్రికా పర్యటనలో తిరిగి వైట్స్లో దర్శనమిస్తుంది. విండీస్తో రెండో టెస్ట్ తదుపరి భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మరో ఐదు నెలల పాటు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడదని తెలిసి, టెస్ట్ క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు. టెస్ట్ క్రికెట్లో దొరికిన మజా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో దొరకదని వారు వాపోతున్నారు. ఒరిజినల్ క్రికెట్ అంటే టెస్ట్ క్రికెటేనని కామెంట్స్ చేస్తున్నారు. భారత టెస్ట్ జట్టు అభిమానులారా.. ఏమున్నా ఈ రోజే ఎంజాయ్ చేయండి.. మరో ఐదు నెలలు చూడాలనుకున్నా కుదరదని సోషల్మీడియా వేదికగా మెసేజ్లు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
టీమిండియా అదుర్స్.. వెస్టిండీస్పై ఇన్నింగ్స్ తేడాతో విజయం (ఫోటోలు)
-
అశ్విన్ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు.. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు మొత్తంగా 131 పరుగులిచ్చి 12 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► అశ్విన్కు టెస్టుల్లో ఇది 8వ 10 వికెట్ల హాల్. టీమిండియా తరపున అత్యధిక పది వికెట్ల హాల్ అందుకున్న జాబితాలో అనిల్ కుంబ్లేతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. కుంబ్లే కూడా 8సార్లు పది వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక హర్బజన్ సింగ్ ఐదుసార్ల పది వికెట్ల హాల్ సాధించాడు. ► ఇక విదేశాల్లో టీమిండియా తరపున బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో భగవత్ చంద్రశేఖర్(1977లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై 12/104), ఇర్ఫాన్ పఠాన్(2005లో హరారే వేదికగా జింబాబ్వేపై 12/126), తాజాగా అశ్విన్(2023లో వెస్టిండీస్పై 12/131), అనిల్ కుంబ్లే( 2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 12/279), ఇర్ఫాన్ పఠాన్(2004లో డాకా వేదికగా బంగ్లాదేశ్పై 11/96) ఉన్నారు. ► ఇక వెస్టిండీస్పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. తాజా ప్రదర్శనతో కలిపి అశ్విన్ ఇప్పటివరకు విండీస్పై 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కంటే ముందు కపిల్ దేవ్(89 వికెట్లు), మాల్కమ్ మార్షల్(76 వికెట్లు), అనిల్ కుంబ్లే(74 వికెట్లు), శ్రీనివాస్ వెంకటరాఘవన్(68 వికెట్లు) ఉన్నారు. ► ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్కు ఇది ఆరోసారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు ఈ ఫీట్ నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రంగనా హెరాత్ 8సార్లు, సిడ్నీ బార్నెస్ ఆరు సార్లు ఈ ఫీట్ సాధించాడు. 2nd 5-wicket haul in the ongoing Test 👍 34th 5-wicket haul in Test 👌 8th 10-wicket haul in Tests 👏 Well done, R Ashwin 🙌 🙌 Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/u9dy3t0TAd — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: WI Vs IND: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్పై ఇన్నింగ్స్ విజయం -
పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం దుబాయ్ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది. ►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ► ఇక టెస్టు క్రికెట్లో ఓవర్రేట్ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్మనీలో సమానత్వం -
Ind Vs WI 1st Test Photos: వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా తొలి టెస్టు డే-1 (ఫోటోలు)
-
తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్గా
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇదే టెస్టులో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా చరిత్ర సృష్టించిన అశ్విన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. మ్యాచ్ ద్వారా తండ్రీ కొడుకులిద్దరినీ టెస్టు క్రికెట్లో అవుట్ చేసిన తొలి భారత బౌలర్గా అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011లో తన తొలి టెస్టులో శివ్నారాయణ్ చందర్పాల్ వికెట్ తీసిన అశ్విన్.. తాజాగా తేజ్నరైన్ చందర్పాల్ను అవుట్ చేశాడు. గతంలో బోథమ్, వసీమ్ అక్రమ్, మిచెల్ స్టార్క్, సైమన్ హార్మర్ ఇలాంటి ఫీట్ను నమోదు చేశారు. ఇయాన్ బోథమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ వసీం అక్రమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ మిచెల్ స్టార్క్: శివనరైన్, తేజ్నరైన్ చందర్పాల్ సైమన్ హార్మర్: శివనరైన్, తేజ్నరైన్ చందర్పాల్ ఆర్ అశ్విన్: శివనరైన్, తేజ్నరైన్ చందర్పాల్ The moment Ravi Ashwin created history! The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze — Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023 33వ సారి ఐదు వికెట్ల హాల్.. అండర్సన్ రికార్డు బద్దలు ఇక టెస్టు క్రికెట్లో అశ్విన్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ను అధిగమించాడు. అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక అశ్విన్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్ను అందుకున్నారు. తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు(133 టెస్టులు), షేన్ వార్న్ 37 సార్లు(145 మ్యాచ్లు), రిచర్డ్ హడ్లీ 36 సార్లు(86 మ్యాచ్లు), అనిల్ కుంబ్లే 35 సార్లు(132 మ్యాచ్లు), రంగనా హెరాత్ 34 సార్లు( 93 మ్యాచ్లు) ఉన్నారు. చదవండి: అశ్విన్ పాంచ్ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్, తొలిరోజు టీమిండియాదే -
'వరల్డ్కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్లను తగ్గించండి'
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజులు సమావేశమైంది. ఈ సమావేశంలో టెస్టు క్రికెట్ సహా మహిళల క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ మ్యాచ్లను గణనీయంగా తగ్గించాలంటూ ఐసీసీకి ప్రతిపాదన పంపింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో లార్డ్స్లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలోకమిటీ మెంబర్లు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, కుమార సంగక్కర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్(FTP)పై ఐసీసీకి పలు సిఫార్సులు చేసింది. 2027 తర్వాత పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో ఆతిథ్య, టూర్లకు వచ్చే పూర్తి సభ్య దేశాలన్నింటికీ మ్యాచ్ల సమాన షెడ్యూల్ని నిర్ధారించాలని ఐసీసీని కోరింది. భారత్లో జరగనున్న ప్రపంచకప్ పూర్తయిన తర్వాత వన్డే మ్యాచ్లను గణనీయంగా తగ్గించాలని సూచించింది. ప్రతి ప్రపంచకప్కు ముందు ఒక సంవత్సరం వ్యవధి మినహా ద్వైపాక్షిక మ్యాచ్లను పరిమితం చేయడం ద్వారా వన్డే క్రికెట్ నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. "ఈ కారణంగా ప్రపంచ క్రికెట్ క్యాలెండర్లో మనకు కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. " అని WCC తెలిపింది. ఇటీవలే ప్రపంచ క్రికెట్ పాలక మండలి(WCC) రాబోయే సంవత్సరాల్లో జరిగే అన్ని గ్లోబల్ ఈవెంట్ల కోసం వారి మీడియా హక్కులను రికార్డ్ స్థాయిలో విక్రయించింది. The MCC World Cricket committee has proposed strategic funds for Test cricket and the women’s game to drive transformative change for the global game. More information ⤵️#CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) July 11, 2023 చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్ Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్
వెస్టిండీస్తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై వేటు పడింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్కు ముగింపు పడినట్లే అని సోషల్ మీడియాలో హోరెత్తింది. అయితే పుజారాను తప్పించడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం వెలగబెట్టారని.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను బలిపశువును చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు కూడా పుజారాకు మద్దతుగా నిలుస్తూ.. ''అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే విండీస్ టూర్కు తనను ఎంపిక చేయకపోవడంపై పుజారా పెద్దగా స్పందించలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేస్తూ బ్యాట్, బంతితో పాటు లవ్ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ కమ్బ్యాక్ ఇస్తానంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఎమోషనల్ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah — Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023 Best of luck for comeback🤞 — Shubman Gang (@ShubmanGang) June 24, 2023 Not finished 👍 — Naveen (@_naveenish) June 24, 2023 Comeback stronger like Rahane and ignore all comments including mine — Mr Wrong / Cr7 & Abd ❤️ (@wrong_huihui) June 24, 2023 చదవండి: కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం -
పుజారాపై వేటు... యశస్వికి చోటు
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో కీలక పరిణామం... సుదీర్ఘ కాలంగా జట్టులో కీలక సభ్యుడిగా, పలు చిరస్మరణీయ విజయాల్లో ముందుండి నడిపించిన చతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు విశ్వాసం కోల్పోయారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ను (డబ్ల్యూటీసీ 2023–2025) దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ చేయబోతున్న మార్పుల్లో భాగంగా అందరికంటే ముందుగా పుజారాపై వేటు పడింది. వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన భారత జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. అతనితో పాటు ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్ను కూడా జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ముకేశ్ కుమార్లను ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల ఈ టీమ్లోకి మరో పేస్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన అజింక్య రహానే తన స్థానం నిలబెట్టుకోవడంతో పాటు వైస్ కెపె్టన్గా కూడా ఎంపిక కావడం విశేషం. భిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ తన స్థానం నిలబెట్టుకోగా... గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలించలేదు. మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, జనవరి 2021 తర్వాత మళ్లీ టెస్టు ఆడని సైనీకి మరో చాన్స్ దక్కింది. భారత్, విండీస్ మధ్య జూలై 12–16, జూలై 20–24 మధ్య డొమినికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లలో రెండు టెస్టు మ్యాచ్లు జరుగుతాయి. అనూహ్య ఎంపికలేమీ లేకుండా... వెస్టిండీస్తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. భారత్ ఆడిన గత 4 వన్డే సిరీస్లకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి ఎంపిక కావడమే చెప్పుకోదగ్గ విశేషం. ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లలో తొలి బంతికే వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేసినా... సూర్యకుమార్ యాదవ్కు మళ్లీ అవకాశం దక్కింది . స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై వేటు పడింది. ఎంపిక చేసిన 17 మందితో పాటు గాయాల నుంచి కోలుకొని బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందు బాటులోకి వస్తే 20 మందితో వచ్చే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక సాగినట్లు అర్థమవుతోంది. భారత్, విండీస్ మధ్య జూలై 27, 29, ఆగస్ట్ 1 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. రంజీల్లో సత్తా చాటి... ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా ఘనంగా ఉండటం అతనికి టెస్టు టీమ్లో అవకాశం క ల్పించింది. 26 ఇన్నింగ్స్లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్లలో 213, 144 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కూడా రిజర్వ్గా అతను ఇటీవల జట్టుతో పాటు లండన్ వెళ్లాడు. ఫస్ట్క్లాస్లో 42.19 సగటు ఉన్న రుతురాజ్ రికార్డు గొప్పగా లేకపోయినా, అతని టెక్నిక్ టెస్టు ఫార్మాట్కు పనికొస్తుందని భావించి సెలక్టర్లు గత కొంతకాలంగా అతడిపై దృష్టి పెట్టారు. గత మూడు రంజీ సీజన్లలో బెంగాల్ రెండుసార్లు ఫైనల్ వెళ్లడంలో పేసర్ ముకేశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా రాణించిన అతను 39 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 21.55 సగటుతో 149 వికెట్లు తీశాడు. ఈ ముగ్గురిలో రుతురాజ్ ఇప్పటికే భారత్ తరఫున ఒక వన్డే, 9 టి20లు ఆడగా మిగతా ఇద్దరు ఇంకా అరంగేట్రం చేయలేదు. టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్. -
#ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టి ఇవాళ్టికి పన్నేండేళ్లు. పుష్కరకాలం పూర్తి చేసుకున్న కోహ్లి టెస్టుల్లో ఈ తరంలో గొప్ప క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లి ఇదే రోజున(జూన్ 20న)2011లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున వేగంగా వంద టెస్టులు ఆడిన క్రికెటర్గా నిలిచిన కోహ్లి లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ 12 ఏళ్ల కాలంలో 109 మ్యాచ్లాడిన కోహ్లి 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా కోహ్లి ఖాతాలో ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడు డబుల్ సెంచరీలు అతను కెప్టెన్ అయ్యాకే రావడం విశేషం. అంతేకాదు టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా తొలి స్థానంలో ఉన్నాడు. 2014లో ఎంఎస్ ధోని నుంచి టెస్టుల్లో సారధ్య బాధ్యతలు అందుకున్న కోహ్లి అనతికాలంలో టీమిండియాను టెస్టుల్లో నెంబర్వన్గా నిలిపాడు. ముఖ్యంగా కెప్టెన్గా కోహ్లి- హెడ్కోచ్గా రవిశాస్త్రి ద్వయం విదేశాల్లో భారత్కు విజయాలతో పాటు సిరీస్లు అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తరపున 68 టెస్టుల్లో కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా పనిచేసిన కోహ్లి.. ఎంఎస్ ధోని(60 మ్యాచ్లు) రికార్డును బ్రేక్ చేశాడు. కెప్టెన్గా కోహ్లి విజయాల శాతం 58.8గా ఉంది. టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్గా అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్గా కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ధోని 27 టెస్టు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్లు సొంతం చేసుకున్న టీమిండియాను కోహ్లి ముందుండి నడిపించాడు. ఇక స్వదేశంలో టెస్టుల్లో టీమిండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి 25 మ్యాచ్ల్లో టీమిండియాను గెలిపించగా.. తర్వాతి స్థానంలో ధోని (21 మ్యాచ్ల్లో విజయాలు) ఉన్నాడు. ఇక కెప్టెన్గా 20 శతకాలు బాదిన కోహ్లి.. గ్రేమి స్మిత్(సౌతాఫ్రికా మాజీ క్రికెటర్) తర్వాత టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఇక గ్రేమి స్మిత్ ప్రొటిస్ కెప్టెన్గా 25 శతకాలు బాదాడు 12 years of Virat Kohli in Test Cricket. Lucky and Grateful enough to witness his 12 years. Hopefully You keep playing Test Cricket for a long long Time Kohli Sahab ❤️🥹.@imVkohli pic.twitter.com/GVgkzxCXA0 — S°´ (@Snehexe) June 20, 2023 12 years of Virat Kohli in Test Cricket. Lucky and Grateful enough to witness his 12 years. Hopefully You keep playing Test Cricket for a long long Time Kohli Sahab ❤️#ViratKohli #GOAT𓃵 #TestCricket pic.twitter.com/sSVAOBKzna — cheeks.one8 (@cheeks__one8) June 19, 2023 The legacy is Unmatched 👑#cricket #testcricket #teamindia #ViratKohli𓃵 pic.twitter.com/ufamc4zrNv — Cricket Addictor (@AddictorCricket) June 20, 2023 చదవండి: 'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా' -
ఆఫ్గాన్ పేసర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్గా
టెస్టుల్లో ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్బౌలర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరగుతున్న ఏకైక టెస్టులో జకీర్ హసన్ను ఔట్ చేసిన మసూద్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్వర్త్ (1991), నీలేష్ కులకర్ణి (1997), చమిలా గమగే (2002),నాథన్ లియోన్ (2011), షామిందా ఎరంగా (2011), డేన్ పీడ్ట్ (2014), హార్డస్ విల్జోయెన్ (2016) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆఫ్గాన్పై బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(146) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మదల్ హసన్(76) పరుగులతో చెలరేగాడు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీం(41), మెహిదీ హసన్ మిరాజ్(43) పరుగులతో ఉన్నారు. చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్తో సహా -
#MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది
ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇటీవలే టెస్ట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడో లేదో ఈసీబీ అతన్ని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కోసం ఎంపిక చేసింది. ఇక జూన్ 16 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ సిద్ధమవుతున్నాడు. జాక్ లీచ్ గైర్హాజరీలో మొయిన్ అలీ జట్టు బౌలింగ్లో కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రధాన కారణం బెన్స్టోక్స్ అని మొయిన్ అలీ రివీల్ చేశాడు. స్టోక్స్ చెప్పిన యాషెస్ అనే ఒక్క పదం తనను మళ్లీ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేలా చేసిందన్నాడు. తొలి టెస్టు సందర్భంగా ఎడ్జ్బాస్టన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మొయిన్ అలీ మాట్లాడాడు. ''స్టోక్స్ నేను సరదాగా చాట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో యాషెస్?(Ashes?) అని అడిగాడు. అయితే ఆ సమయంలో జాక్ లీచ్ గాయపడ్డాడని నాకు తెలియదు. దీంతో లోల్(Lol) అని మెసేజ్ చేశా. అంతే స్టోక్స్ నవ్వుతో అయితే సిద్ధంగా ఉండు అని పేర్కొన్నాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత జాక్ లీచ్ గాయపడ్డాడని తెలిసింది. ఆ తర్వాత స్టోక్స్కు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. ఈ నేపథ్యంలో యాషెస్లో నీ అవసరం ఉందని స్టోక్స్ నాతో అన్నాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై ఒకసారి ఆలోచించు అని తెలిపాడు. ఒక కెప్టెన్ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం నచ్చింది. అందునా యాషెస్ అనే పదం వినగానే నాలో ఉత్సాహం వచ్చింది.. ఆడాలని నిశ్చయించుకున్నా. ఈసీబీకి చెప్పి రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా. టెస్టుల్లో నా కమ్బ్యాక్కు బెన్స్టోక్స్ ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పగలను'' అంటూ వివరించాడు. మొయిన్ అలీ కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్లు ఆడి 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. ఆసీస్పై 11 టెస్ట్లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్పై ఏకంగా 64.65గా ఉంది. ఇక స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టుల్లో దూసుకుపోతుంది. బజ్బాల్ విధానంతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు స్టోక్స్ కెప్టెన్సీలో 13 టెస్టుల్లో 11 విజయాలు నమోదు చేయడం విశేషం. 2015 తర్వాతి నుంచి మరో యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్ను ఓడించి యాషెస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. Moeen Ali's response when Ben Stokes first approached him about an Ashes comeback: "lol" 😂 pic.twitter.com/qIy8Jf6Btx — ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2023 చదవండి: అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్.. అభిమానులకు పండగే! -
చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది. టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా? ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది. India will create history if they chase down 444. No team chased down more 418 in Test cricket! pic.twitter.com/Tkyd3khSpz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి
క్రికెట్ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్. అయితే ఇదే టి20 క్రికెట్, వన్డే క్రికెట్కు మూలం సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్ వాళ్లు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్లో క్రికెట్కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాలక్రమంలో ఇంగ్లండ్ దేశం క్రికెట్కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఫార్మాట్లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో క్రికెట్పై క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్లకు కలర్ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే క్రికెట్కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్కు డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది. టెస్టు క్రికెట్ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో టెస్టు క్రికెట్ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? -
బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా!
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ను 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. అదే రోజు బ్యాటింగ్ కు వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే (45 బంతుల్లో 56, 11 ఫోర్లు) , బెన్ డకెట్ (178 బంతుల్లో 182, 24 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడారు. ఈ ఇద్దరితో పాటు ఓలీ పోప్(205) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వీరిముగ్గరి అద్భుత ఇన్నింగ్స్లు ఫలితంగా ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 524 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగలకు ఆలౌటైంది. కేవలం 10 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముంగిట ఐరీష్ జట్టు ఉంచింది. 10 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు బంతుల్లోనే ఛేదించింది. బెన్ స్టోక్స్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్గా స్టోక్స్ నిలిచాడు. ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. ఇలా జరగడం టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి సారి. చదవండి: WTC Final 2023: ‘ఓవల్’ను ఓ లుక్కేద్దామా! -
టెస్ట్లకు డేవిడ్ వార్నర్ గుడ్ బై
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది (2024) జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (పాకిస్తాన్) ఆడనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం టీమిండియాతో జూన్ 7 నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కఠోరంగా శ్రమిస్తున్న వార్నర్.. 2024 టీ20 వరల్డ్కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని తెలిపాడు. ఈ విషయాలను అతనే స్వయంగా వెల్లడించాడు. కాగా, 36 ఏళ్ల వార్నర్ ఇటీవలి కాలంలో టెస్ట్ల్లో పెద్దగా రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతనాడిన 17 టెస్ట్ల్లో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. అయితే వార్నర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో జట్టు మొత్తం విఫలమైన అతను మాత్రం ఇరగదీశాడు. ఇందుకేనేమో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మరో ఏడాది పాటు కంటిన్యూ కావాలని భావిస్తున్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వార్నర్.. ఇప్పటివరకు 103 టెస్ట్లు (25 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 8158 పరుగులు), 142 వన్డేలు (19 సెంచరీలు, 27 హాఫ్సెంచరీల సాయంతో 6030 పరుగులు), 99 టీ20లు (సెంచరీ, 24 అర్ధ సెంచరీల సాయంతో 2894 పరుగులు) ఆడాడు. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 176 మ్యాచ్లు ఆడి 4 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 6397 పరుగులు చేశాడు. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక
బౌలర్లు రమేశ్ మెండిస్ (5/64), ప్రభాత్ జయసూర్య (2/88), అసిథా ఫెర్నాండో (3/30) రాణించడంతో... ఐర్లాండ్తో గాలెలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో కరుణరత్నే కెప్టెన్సీలోని శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక జట్టుకిది 100వ టెస్టు విజయం కావడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 54/2తో ఆట చివరిరోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ 77.3 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ల తర్వాత.. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక.. ఐర్లాండ్పై రెండో టెస్ట్లో విజయంతో 100వ విక్టరీ సాధించింది. 311 టెస్ట్ల్లో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఆసియా దేశాల్లో భారత్ (569 టెస్ట్ల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్ట్ల్లో 146 విజయాలు) ల తర్వాత శ్రీలంక ఈ అరుదైన జాబితాలో చేరింది. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆసీస్.. 853 టెస్ట్ల్లో 405 విజయాలు సాధించింది. ఇక, అత్యధిక టెస్ట్లు ఆడిన రికార్డు ఇంగ్లండ్ (1060) పేరిట ఉంది. -
సూర్యకుమార్ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా
పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో సూర్యకుమార్కు భారత తుది జట్టులో చోటు దక్కింది. దీంతో టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్యకుమార్ కల నేరవేరింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు. 30 ఏళ్ల వయస్సు తర్వాత అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ 30 ఏళ్ల 181 రోజుల వయస్సులో టీ20ల్లో అరంగేట్రం చేయగా.. వన్డేల్లో 30 ఏళ్ల 307 రోజులు, టెస్టుల్లో 32 ఏళ్ల 148 రోజుల వయస్సులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తొలి టెస్టుకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో సూర్యకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. మరోవైపు ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ కూడా ఈ మ్యాచ్తోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు -
'భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది'
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోథం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని.. ఐపీఎల్ మోజు వల్లే ఇదంతా జరుగుతుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ బోథం వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మిర్రర్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇయాన్ బోథం మాట్లాడాడు. ఇప్పుడు ఇండియాకి వెళ్లి చూడండి.. అక్కడ ఎవరు టెస్టు క్రికెట్ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఐపీఎల్ ద్వారా బోర్డుకు కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మోజులో పడి అక్కడి జనాలు టెస్టు క్రికెట్ను చూడడం మానేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు. అయితే టెస్టు క్రికెట్ మొదలై ఇప్పటికే వందేళ్లు పూర్తయింది. టెస్టు క్రికెట్ ఎక్కడికి వెళ్లదు. ఎన్ని ఫార్మాట్లు వచ్చిన సంప్రదాయ క్రికెట్కు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తే మనం క్రికెట్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా మీనింగ్లెస్గా కనిపిస్తున్నా.. ప్రతీ ఆటగాడు ఒక సందర్భంలో టెస్టు మ్యాచ్ తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇక యాషెస్ టూర్ గురించి మాట్లాడుకుంటే.. ఈసారి ఇంగ్లండ్ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. బజ్బాల్ త్రీ లయన్స్(ఇంగ్లండ్)కు చాలా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించడం మాములు విషయం కాదు. పాక్ గడ్డపై ఈ ఫీట్ను అందుకోవడం ఇంగ్లండ్ క్రికెట్కు మంచి తరుణం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు.. వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? -
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కన్నుమూత
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెల్లింగ్టన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. 1969లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ తమ మొట్టమొదటి టెస్టు విజయంలో ముర్రే కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అతను 90 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 1968లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముర్రే.. న్యూజిలాండ్ తరపున 13 టెస్టులు ఆడారు. ఈ 13 మ్యాచ్ల్లో 29.9 సగటుతో 598 పరుగులు సాధించాడు. అతడు కెరీర్లో 5 హాఫ్సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఫస్ట్ క్లాస్ కెరీర్లో వెల్లింగ్టన్ తరపున 102 మ్యాచ్లు ఆడిన ముర్రే 6257 పరుగులు సాధించాడు. ఇక బ్రూస్ ముర్రే మనవరాళ్లు అమేలియా కెర్, జెస్ కెర్ ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళ జట్టులో కీలక సభ్యలుగా ఉన్నారు. చదవండి: లంకతో తొలి వన్డే.. సూపర్ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి -
ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అరుదైన రికార్డు
Rehan Ahmed: పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్లో అరంగేట్రం చేయడం ద్వారా ఇంగ్లండ్ క్రికెటర్ రెహాన్ అహ్మద్ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా రెహాన్ చరిత్ర సృష్టించాడు. రెహాన్.. 18 ఏళ్ల 126 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెహాన్కు ముందు ఈ రికార్డు బ్రియాన్ క్లోజ్ పేరిట ఉంది. క్లోజ్.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్ స్పిన్ బౌలర్ అయిన రెహాన్ పాకిస్తాన్ సంతతికి చెందిన వాడు. కౌంటీల్లో లీసెస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహాన్.. గత కౌంటీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ఇంగ్లండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రెహాన్.. ఇంగ్లండ్ తరఫున ఇదివరకే టీ20 అరంగేట్రం చేశాడు. 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇంగ్లండ్తో ఇవాళ (డిసెంబర్ 17) ప్రారంభమైన మూడో టెస్ట్ల్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8) తక్కువ స్కోర్కే ఔట్ కాగా.. షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వలేదనిపించారు. బాబర్ ఆజమ్ (43), సౌద్ షకీల్ (18) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ తలో వికెట్ పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు రెహాన్ అహ్మద్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్లో కివీస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విలియమ్సన్ తప్పుకున్నాడు. వర్క్లోడ్ కారణంగానే టెస్టు కెప్టెన్సీకి గుడ్బై చెప్పినట్లు సమాచారం. ఇకపై కేన్ మామ టీ20లు, వన్డేల్లో మాత్రమే సారథ్యం వహించనున్నాడు. 6 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సారథ్య బాధ్యతలు నిర్వహించిన కేన్.. తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కాగా 2016లో బ్రెండెన్ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు విలియమ్సన్ స్వీకరించాడు. ఇక విలియమన్స్ స్థానంలో టెస్టుల్లో టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. కేన్ సారథ్యంలో 38 టెస్టు మ్యాచ్లు ఆడిన బ్లాక్క్యాప్స్.. 22 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా అతడి నాయకత్వలోనే గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ను కివీస్ సొంతం చేసుకుంది. చదవండి: FIFA WC:సెమీస్లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం -
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. భారత క్రికెటర్ భావోద్వేగం
కరుణ్ నాయర్.. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. అతడు మన భారత క్రికెటరే. సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్లో ఒక యువ సంచలనం. తన అరంగేట్ర టెస్టు సిరీస్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. అయితే అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పక్కన పెట్టింది. కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ఉన్నాడన్న విషయాన్నే భారత సెలక్టర్లు మార్చిపోయారు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. కానీ మళ్లీ భారత జెర్సీ ధరించేందుకు కరుణ్ నాయర్ మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా..త్వరలో జరగనున్న రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. తొలి రెండు మ్యాచ్లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్ బోర్డు.. అతడికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను తాకుతుంది. "డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ" ట్విటర్ వేదికగా భావోద్వోగానికి లోనయ్యాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. "నీ లాంటి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లను తొక్కేసారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ భారత జట్టులో తిరిగి నిన్ను చూడాలి అనుకుంటున్నాము భయ్యా అంటా పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ కరుణ్ నాయర్ 2016 నవంబర్లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. Dear cricket, give me one more chance.🤞🏽 — Karun Nair (@karun126) December 10, 2022 Revisit Karun Nair triple century scoring moment.pic.twitter.com/MV1ERnUwFY — Cricket Master (@Master__Cricket) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి సెషన్లో ఇంగ్లండ్ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. తద్వారా టెస్టు మ్యాచ్ తొలి రోజు మొదటి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. అంతకుమందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు తొలి సెషన్లో దక్షిణాఫ్రికా 179 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ 120 ఏళ్ల దక్షిణాఫ్రికా రికార్డు బ్రేక్ చేసింది. ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ ఇక ఇంగ్లండ్తో రెండో టెస్టులో పాక్ అరంగేట్ర స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అదరగొట్టాడు. డెబ్యూ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే ఏడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక అహ్మద్ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్తో పాటు జహీద్ మహ్మద్ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డాకెట్ (63), ఓలీ పాప్(60) పరుగులతో రాణించారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు! -
రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ వార్నర్..?
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే క్రికెట్లో ఓ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచన ప్రాయంగా వెల్లడించాడు. తాజాగా జరిగిన ప్రైవేట్ షోలో వార్నర్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తే.. మొదటగా అది టెస్ట్ క్రికెట్ అవుతుందని, బహుశా సుదీర్ఘ ఫార్మాట్లో మరో ఏడాది పాటు కొనసాగుతానని, టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు వైట్బాల్ క్రికెట్లో మాత్రం 2024 టీ20 వరల్డ్కప్ వరకు కొనసాగుతానని, పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగే అంశంపై తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. వార్నర్ టెస్ట్ల్లో మరో ఏడాది కొనసాగితే.. ఈ మధ్యలో భారత్తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2023 ఫిబ్రవరి, మార్చి), ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ (2023 జూన్, జులై)లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, 36 ఏళ్ల వార్నర్.. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్కప్లో ఘెరంగా విఫలమైన విషయం తెలిసిందే. అతనితో పాటు అతను ప్రాతినిధ్యం వహించే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా పేలవ ప్రదర్శన కనబర్చి, గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా, గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న వార్నర్.. 96 టెస్ట్లు, 138 వన్డేలు, 99 టీ20లు ఆడి, దాదాపుగా 17000 పరుగులు సాధించాడు. ఇందులో 43 శతకాలు, 84 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే కథ వేరేలా ఉండేది: పాక్ కెప్టెన్ -
విజయసాయిరెడ్డి నోట క్రికెట్ మాట.. టెస్ట్ ఫార్మాట్పై ఐసీసీకి పలు సూచనలు
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తొలిసారి రాజకీయేతర అంశాలపై స్పందించారు. ట్విటర్ వేదికగా క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ మనుగడపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు (ఐసీసీ) పలు సూచనలు చేశారు. టీ20 క్రికెట్ అంటే మనందరికీ ఇష్టమంటూనే, పొట్టి క్రికెట్ మోజులో పడి ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడం విచారకరమని అన్నారు. We love T20 cricket but it's worrisome that accomplished players like Trent Boult & Quinton de Kock have distanced themselves from classic Test cricket. ICC must ensure it manages to retain the interest of top players towards the purest form of game,keeping entertainment intact. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2022 ఆటగాళ్లు టీ20ల కోసం సుదీర్ఘ ఫార్మాట్ను నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్కు ప్రతిరూపమైన టెస్ట్ ఫార్మాట్ నుంచి అగ్రశ్రేణి ఆటగాళ్లు వైదొలగకుండా చూడాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందన్నారు. టెస్ట్ క్రికెట్ వైభవం పది కాలాల పాటు పదిలంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ అంశంపై ఐసీసీ ప్రత్యేకమైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది
-
'రోజులో 90 ఓవర్లు వేయకపోతే ఇంకెందుకు?.. సస్పెండ్ చేయాల్సిందే'
టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల మ్యాచ్. రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదు రోజుల పాటు 450 ఓవర్లు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు టెస్టు మ్యాచ్ అంటే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. స్లో ఓవర్ రేట్ .. వెలుతురులేమి.. వర్షం అంతరాయం ఇలా ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో రోజులో 90 ఓవర్ల ఆట సాధ్యమవడం లేదు. అయితే వర్షం అంతరాయం, వెలుతురులేమి వదిలేస్తే ఓవర్ రేట్ అనేది మన చేతుల్లో పని. - సాక్షి వెబ్డెస్క్ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి టైంను వృథా చేయకుండా బౌలింగ్ చేస్తే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు పూర్తి చేయొచ్చు. ఆయా జట్ల కెప్టెన్లు ఇలా చేయలేక అనవసరంగా జరిమానాలు.. కొత్తగా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడుతుంది. ఇవన్నీ నష్టాన్ని కలిగించేవి. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టెస్టు క్రికెట్లో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో చాపెల్ ఇదే అంశంపై తన కాలమ్లో రాసుకొచ్చాడు. ''టెస్టు మ్యాచ్లు అనేవి ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. వన్డే, టి20 క్రికెట్ వచ్చినా సంప్రదాయ ఫార్మాట్కు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడున్న టెస్టు క్రికెట్లో ప్రధానంగా వేధిస్తున్న సమస్య రోజులో 90 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయలేకపోవడం. వాతావరణ సమస్య.. వెలుతురులేమి ఇతరత్రా కారణాలు వదిలేస్తే మ్యాచ్లో మరో కీలకఅంశం ముడిపడి ఉంది. అదే ఓవర్ రేట్. వన్డేలు, టి20లు ఒక్కరోజులో ముగిసేవి కాబట్టి స్లోఓవర్ రేట్ పడడం సాధారణం. కానీ టెస్టులు ఐదు రోజుల పాటు జరిగేవి. సరిగ్గా వినియోగించుకుంటే రోజులో కచ్చితంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. అలా చేయని పక్షంలో జట్టు కెప్టెన్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక టెస్టులో తమ బౌలర్లతో రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయించకపోతే కెప్టెన్ను సస్పెండ్ను చేసే అంశాన్ని పరిగణించాలి. దీనివల్ల టెస్టు క్రికెట్లో కొంతైనా మార్పు వస్తుంది. ఇటీవల ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో 90 ఓవర్ల ఆట కాస్త కనబడింది. దాదాపు మూడురోజులు ఇరు జట్లు 90 ఓవర్ల ఆట పూర్తి చేయడానికి మొగ్గుచూపాయి. ఇది అభినందిచాల్సిన విషయం. కొన్ని డీఆర్ఎస్లు సమయాన్ని వృథా చేయడంతో ఓవర్రేట్ పడడంతో మూడు నాలుగు ఓవర్లు మిగిలిపోయాయి. అందుకే ఓవర్ రేట్లపై తక్షణ శ్రద్ధ అవసరం. అంపైర్లు ఈ విషయంలో ఆన్-ఫీల్డ్ ప్రోటోకాల్ను అమలు చేయలేరు ఎందుకంటే వారికి అధికారాలు లేకపోవడమే. ఇక బౌలర్లు ఆరు గంటల్లో 90 ఓవర్లు బౌలింగ్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ లక్ష్యం నెరవేరకపోతే కెప్టెన్ను ప్రశ్నించకుండా సస్పెండ్ చేయాలి. దశాబ్దాలుగా ఓవర్రేట్ అనేది టెస్టు క్రికెట్కు ఇబ్బందిగా మారింది. దీనివల్ల టెస్టు ఆటకు ముప్పు ఉందని'' చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
బజ్బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర
Bazball: బజ్బాల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్బాల్..? క్రికెట్కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్లో చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పదం బజ్బాల్. ఈ సిరీస్లో ఇంగ్లండ్ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్బాల్ అని అంటారు. మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ నిర్ధేశించిన భారీ టర్గెట్లను ( 277, 299, 296) బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్లోనూ ఇంగ్లండ్ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్ మోడ్లో సాగే టెస్ట్ క్రికెట్లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేసే ఈ అటాకింగ్ స్టయిల్నే బజ్బాల్ అంటారు. మెక్కల్లమ్, స్టోక్స్లు ఇంగ్లండ్ కోచింగ్, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్బాల్ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్ శర్మ -
కోహ్లి 0, స్మిత్ 1, రూట్ 11.. శతక్కొట్టుడులో రూట్ రూటే సపరేటు
బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్లో అజేయ శతకం బాది ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్నందించిన జో రూట్ ప్రస్తుత తరం టెస్ట్ క్రికెటర్లలో అత్యుత్తముడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత రెండున్నరేళ్లుగా అతని గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్ల పటౌడీ ట్రోఫీలో 4 సెంచరీల సాయంతో 737 పరుగులు బాదిన రూట్.. గత 24 టెస్ట్ల్లో 11 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 3000 పైచిలుకు పరుగులు సాధించి రికార్డుల మోత మోగిస్తున్నాడు. గత కొంతకాలంగా మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధిస్తున్న రూట్.. శతక్కొట్టుడు విషయంలో తన రూటే సపరేటు అని చాటాడు. ప్రస్తుత తరంలో తనకు పోటీగా చెప్పబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్లు కెరీర్ దుర్భర దశను ఎదుర్కొంటుండగా.. రూట్ వారి కళ్లెదుటే కెరీర్ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. కోహ్లి, స్మిత్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా అవస్థ పడుతుంటే.. రూట్ మాత్రం పరుగుల వరద పారిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కోహ్లి టెస్ట్ల్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతుంటే.. రూట్ ఈ మధ్యకాలంలో ఏకంగా 11 సెంచరీ బాదాడు. మరోవైపు స్మిత్ సైతం ఏడాదిన్నరగా సెంచరీ మార్కు అందుకోలేక సతమతమవుతున్నాడు. కోహ్లి టెస్ట్ల్లో 27వ సెంచరీ నమోదు చేసే సమయానికి 17 సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. కోహ్లిని అక్కడే పెట్టి తాను మాత్రం సెంచరీ ఎక్స్ప్రెస్లా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోహ్లి, స్మిత్లు 27 టెస్ట్ శతకాలతో సమానంగా ఉంటే తాజాగా టీమిండియాపై సెంచరీతో రూట్ (28 సెంచరీలు) వారిద్దరిని అధిగమించాడు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం 16వ స్థానంలో ఉన్న రూట్.. మరో మూడేళ్లు ఇదే ఫామ్ను కొనసాగిస్తే సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ సెంచరీల (51) రికార్డును సులువుగా అధిగమించే అవకాశం ఉంది. చదవండి: IND VS ENG 5th Test: కోహ్లి, స్మిత్లను దాటేసిన రూట్ -
Ind Vs Eng: 100 వికెట్లతో బుమ్రా అరుదైన రికార్డు.. విదేశీ గడ్డపై..
India Vs England 5th Test: టీమిండియా స్టార్ పేసర్, తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సేనా దేశాల్లో(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై 36, ఆస్ట్రేలియాలో 32, న్యూజిలాండ్లో ఆరు, సఫారీ గడ్డపై 26 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ సేనా దేశాల్లో 100 వికెట్లు తీసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు బుమ్రా కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. WHAT. A. JAFFA. 🔥#TeamIndia needed something special to break this ominous opening partnership, and Bumrah delivered 🤩 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/6TCIm8TY62 — Sony Sports Network (@SonySportsNetwk) July 4, 2022 ఇక ఈ మ్యాచ్లో మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగోరోజు అంతా తలకిందులైంది. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ చివరి రోజు మరో 119 పరుగులు చేస్తే చాలు! మ్యాచ్ టీమిండియా చేజారుతుంది. అలాగే సిరీస్ సమమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగో రోజు ఆట వరకు మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: IND VS ENG: తొలి టీ20కి కోచ్గా లక్ష్మణ్.. ద్రవిడ్కు ఏమైంది..? A rapid 5️⃣0️⃣ @aleesy14 🔥 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/PIsXWRZlTP — England Cricket (@englandcricket) July 4, 2022 -
టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఇంగ్లండ్.. టీ20ల తరహాలో విధ్వంసం
బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తుంది. ఇంగ్లండ్లోనే పురుడు పోసుకున్న సుదీర్ఘ ఫార్మాట్ను స్టోక్స్ సేన కొత్త పుంతలు తొక్కిస్తుంది. స్టోక్స్ టీమ్ టీ20ల తరహాలో ప్రత్యర్ధిపై విరుచుకుపడుతూ టెస్ట్ క్రికెట్లో వేగాన్ని మరింత పెంచేస్తుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్. 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (బ్రెండన్ మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు ఊహలకందని విధంగా రెచ్చిపోయింది. మూడు మ్యాచ్ల్లో భారీ స్కోర్లను అలవోకగా ఛేదించి ప్రత్యర్ధిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన (3 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ శతకాలతో 53 పరుగులు) మరుగున పడింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో ముఖ్యంగా జానీ బెయిర్స్టో విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. 32 ఏళ్ల ఈ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ప్రస్థానం న్యూజిలాండ్తో సిరీస్కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సిరీస్లో బెయిర్స్టో విధ్వంసం ఆ రేంజ్లో సాగింది. 3 మ్యాచ్ల్లో అతను 120కి పైగా స్ట్రయిక్ రేట్తో (394 పరుగులు) 2 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి టెస్ట్లో విఫలమైన బెయిర్స్టో రెండో టెస్ట్లో (ఛేదనలో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. తాజాగా ముగిసిన మూడో టెస్ట్లో బెయిర్స్టో విధ్వంస పర్వం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్లో (296 పరుగుల ఛేదనలో) 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్ను క్లీన్స్వీప్ చేయడంలో ముఖ్యభూమిక పోషించాడు. ఈ ఇన్నింగ్స్లో బెయిర్స్టో (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, సిక్సర్లు) అజేయమై అర్ధశతకం సాధించి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. బెయిర్స్టో తర్వాత బెన్ స్టోక్స్ ఈ సిరీస్ ఆ స్థాయి విధ్వంసం సృష్టించాడు. స్టోక్స్ 5 ఇన్నింగ్స్ల్లో 82.55 స్ట్రయిక్ రేట్తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ సాధించింది తక్కువ పరుగులే అయినా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేగంగా పరుగులు సాధించాడు. కివీస్ను వైట్వాష్ చేయడంలో జో రూట్ కాంట్రిబ్యూషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూట్ 6 ఇన్నింగ్స్ల్లో 99 సగటున 74 స్ట్రయిక్ రేట్తో 396 పరుగులు సాధించి సిరీస్లో టాప్ 2 రన్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్స్టో.. కివీస్ను ఊడ్చేసిన ఇంగ్లండ్ -
భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20 ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?
భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తేదీ భారత క్రికెట్కు ముగ్గురు దిగ్గజాలను అందించిన చిరస్మరణీయమైన రోజు. వివరాల్లోకి వెళితే.. భారత క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన ముగ్గురు క్రికెటర్లు ఇదే తారీఖున టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. ఒకరేమో తనదైన కెప్టెన్సీ మార్కుతో, దూకుడైన ఆటతీరుతో భారత క్రికెట్లో కొత్త శకానికి నాంది పలుకగా.. మరొకరు తనకు మాత్రమే సాధ్యమైన దుర్భేద్యమైన డిఫెన్స్ టెక్నిక్తో, భారీ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరుగా నిలిచి టెస్ట్ క్రికెట్కు పునరుజ్జీవనం అందించారు. ఇక మూడవ వ్యక్తేమో పై ఇద్దరి టాలెంట్లను కలబోసుకుని ఆధునిక క్రికెట్కు మార్గనిర్ధేశకుడిగా నిలిచాడు. భారత క్రికెట్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కాగా.. రెండో వ్యక్తి ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మూడో వ్యక్తి టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి. Time flies 🇮🇳#20June #TestDebut pic.twitter.com/eIktcGLg6i — Virat Kohli (@imVkohli) June 20, 2022 వీరిలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు 1996, జూన్ 20వ తేదీన (లార్డ్స్ టెస్ట్) టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయగా.. ఈ ఇద్దరి ఆరంగ్రేటం తర్వాత సరిగ్గా 15 ఏళ్లకు 2011, జూన్ 20వ తేదీన (వెస్టిండీస్ పర్యటనలో కింగ్స్టన్ టెస్ట్) విరాట్ కోహ్లి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ దిగ్గజ బ్యాటింగ్ త్రయంలో గంగూలీ తన తొలి ఇన్నింగ్స్లోనే శతకం (131) బాది కెరీర్కు బలమైన పునాది వేసుకోగా, ద్రవిడ్ కూడా తన అరంగేట్రం ఇన్నింగ్స్లో 95 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి తన తొలి టెస్ట్ మ్యాచ్లో(4, 15) విఫలమైనప్పటికీ ఆతర్వాత క్రమంగా పుంజుకని భారత క్రికెట్ మూలస్తంభాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఒకే తేదీన టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ ముగ్గురు వ్యక్తిగతంగానే కాకుండా టీమిండియా కెప్టెన్లుగా అద్భుతంగా రాణించారు. గంగూలీ 113 టెస్టుల్లో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7212 పరుగులు.. 311 వన్డేల్లో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11,363 పరుగులు చేయగా, ద్రవిడ్ 164 టెస్టుల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 12 శతకాలు, 83 అర్ధశతకాలతో 10,889 పరుగులు చేశారు. వీరిద్దరి కెరీర్ పీక్స్లో ఉండగానే టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన కోహ్లి 101 టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 8043 పరుగులు, 260 వన్డేల్లో 43 సెంచరీలు, 64 అర్ధసెంచరీలతో 12311 పరుగులు సాధించాడు. వీరిలో విరాట్ కోహ్లి టీమిండియాకి 40 టెస్టు విజయాలు అందించి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో టాప్ 4లో నిలిచాడు. గ్రేమ్ స్మిత్ 53, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41 టెస్టు విజయాలతో విరాట్ కోహ్లి కంటే ముందున్నారు. చదవండి: T20 WC 2022: పంత్ వైఫల్యం.. డీకే జోరు.. ద్రవిడ్ ఏమన్నాడంటే! Time flies 🇮🇳#20June #TestDebut pic.twitter.com/eIktcGLg6i — Virat Kohli (@imVkohli) June 20, 2022 -
Joe Root: త్వరలోనే సచిన్ అరుదైన రికార్డు బద్దలవడం ఖాయం!
England Vs New Zealand Test Series 2022: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడి భీకర ఫామ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందంటూ ఆకాశానికెత్తాడు. 31 ఏళ్ల రూట్ ఇంకో ఐదేళ్లు పాటు ఆడగలడని, కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదని చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ స్వదేశంలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కేవలం 11 పరుగులకే పరిమితం అయిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇంకో ఐదేళ్లు... కాబట్టి ఇక ఈ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన జో రూట్.. టెస్టుల్లో 10 వేల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కిన అలిస్టర్ కుక్ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ నేపథ్యంలో రూట్ను అభినందించిన టేలర్.. ‘‘రూట్ కనీసం ఇంకో ఐదేళ్ల పాటు ఆటలో కొనసాగుతాడు. కాబట్టి టెండుల్కర్ రికార్డును అధిగమించడం అసాధ్యమేమీ కాదు. గత రెండేళ్లుగా ముఖ్యంగా 18 నెలలుగా అతడి బ్యాటింగ్ అమోఘం. రూట్ మాంచి ఫామ్లో ఉన్నాడు. ఒకవేళ తను ఫిట్గా ఉండి ఇలాగే ఆటను కొనసాగిస్తే 15 వేలకు పైచిలుకు పరుగులు పెద్ద కష్టమమేమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా సచిన్ టెస్టుల్లో 15921 పరుగులు చేసి ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో ముందున్న విషయం తెలిసిందే. వరల్డ్క్లాస్ ప్లేయర్.. విమర్శకులకు బ్యాట్తో సమాధానం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుసేన్ సైతం.. రూట్ను వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ కొనియాడాడు. అద్భుతమైన టెక్నిక్ అతడి సొంతమని.. టెస్టు క్రికెట్లో రూట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. కాగా బ్యాటర్గా రాణించినా.. తన కెప్టెన్సీలో ఇంగ్లండ్ వరుస పరాజయాలు చవిచూడటంతో రూట్ ఇటీవలే టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. బెన్ స్టోక్స్ రూట్ స్థానాన్ని భర్తీ చేయగా.. అతడు బ్యాట్ ఝులిపిస్తూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్తో సమాధానం చెబుతున్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్కు నో ఛాన్స్..! Did someone ask for a montage of every scoring shot from @root66's hundred? 😎 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/1bXj1eeolu — England Cricket (@englandcricket) June 5, 2022 "One of England's all-time greats!" 👏 The moment Rooty reached his 26th Test century 🏏@Root66 | @IGCom pic.twitter.com/DBO9QKiurG — England Cricket (@englandcricket) June 5, 2022 -
'టెస్టు క్రికెట్ చనిపోయే దశకు వచ్చింది'
టెస్టు క్రికెట్పై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటితరం క్రికెటర్లు టి20 క్రికెట్ ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. దీనివల్ల టెస్టు క్రికెట్ చనిపోయే దశలో ఉందంటూ పేర్కొన్నాడు. హోమ్ ఆఫ్ హీరోస్ షోలో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు. ''టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టి20 క్రికెట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు, టి20 ఫార్మాట్లో ఆడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు వన్డేల కంటే టి20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కరోజు టి20 ఆడితే రూ.50 లక్షలు వస్తున్నప్పుడు.. ఐదు రోజుల క్రికెట్ ఆడి రూ. 5 లక్షల ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. దీంతో వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతోంది. టి20 ఫార్మాట్కు అలవాటు పడ్డాకా 50 ఓవర్ల మ్యాచ్ కూడా టెస్ట్ మ్యాచ్లాగే అనిపిస్తోంది. అందుకే టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి మిడిలార్డర్ ప్రధాన కారణం. 2019 వన్డే వరల్డ్కప్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ వరల్డ్కప్కు జట్టును సరిగ్గా ప్లాన్ చేయలేదు. కేవలం 5,6 వన్డేలు ఆడిన విజయ్ శంకర్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ గాయపడడంతో అతని స్థానాన్ని రిషబ్ పంత్తో భర్తీ చేశారు. అప్పటికే మంచి అనుభవం ఉన్న రాయుడుకు మాత్రం అవకాశం కల్పించలేదు. 2003ప్రపంచకప్ జట్టులో నేను ఆడినప్పుడు.. నాతో పాటు మహమ్మద్ కైఫ్, దినేష్ మోంగియా అప్పటికే 50 వన్డేలు ఆడి కొంత అనుభవాన్ని గడించాము. టీమిండియా 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు, అప్పటి జట్టులో మేమందరం ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ కలిగి ఉన్నాం. అందుకే 28 సంవత్సరాల తర్వాత కప్ను గెలిచాం.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై.. -
అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్ కెప్టెన్ కొత్త రికార్డు?!
క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్వైట్ కొత్త రికార్డు సృష్టించాడు. అదేంటి టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొలి స్థానంలో ఉన్నాడు.. మరి క్రెయిగ్ బ్రాత్వైట్ ఎక్కడినుంచి వచ్చాడు అని కంగారు పడకండి. టెస్టుల్లో ఒక బ్యాట్స్మన్ను రిపీట్గా ఔట్ చేయకుండా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బ్రాత్వైట్ నిలిచాడు. విషయంలోకి వెళితే.. బ్యాట్స్మన్గా ఎక్కువ పేరు సంపాదించిన బ్రాత్వైట్ ఇప్పటివరకు 77 టెస్టుల్లో 25 వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 25 వికెట్లు 25 బ్యాట్స్మెన్లవి. దీనర్థం ఏంటంటే.. బ్రాత్వైట్ తాను సాధించిన 25 వికెట్లలో ఒక్కaటి కూడా రిపీట్ కాలేదని. సాధారణంగా ఒక బౌలర్ ఒక బ్యాట్స్మన్ను రిపీట్గా ఔట్ చేస్తుంటాడు. చాలా సందర్బాల్లో బౌలర్లకు తొలి 25 వికెట్లలోనే ఆ రిపీట్ బ్యాట్స్మన్ కనబడ్డారు. కానీ బ్రాత్వైట్ మాత్రం తాను తీసిన 25 వికెట్లు కొత్తవే కావడం విశేషం. ఇలా చూసుకుంటే ఇది రికార్డు కిందకే వస్తుంది. ఇంతకముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉండేది. అష్రాఫుల్ తాను ఒక బ్యాట్స్మన్ను రిపీట్గా ఔట్ చేయకముందు 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా బ్రాత్వైట్ అష్రాఫుల్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక శ్రీలంక బౌలర్ సజీవ డిసిల్వా కూడా తాను తీసిన 16 వికెట్లతో ఒక్క రిపీట్ బ్యాట్స్మన్ కూడా లేకపోవడం విశేషం. ఇక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్( 133 టెస్టుల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్(145 టెస్టుల్లో 708 వికెట్లు) రెండో స్థానంలో.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్(169 టెస్టుల్లో 640 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(132 టెస్టుల్లో 619 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Virat Kohli: వరుసగా ఐదో ఏడాది ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్ కోహ్లి IPL 2022: 'అతడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు.. ప్రపంచకప్ భారత జట్టులో చోటు ఖాయం' -
ఐపీఎల్ ద్వారా కోట్లు అర్జించాడు.. ఇప్పుడేమో అవసరం లేదంట!
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే టెస్టు క్రికెట్ తన నెంబర్వన్ ప్రాధాన్యత అని కుండబద్దలు కొట్టాడు.డైలీ మిర్రర్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టోక్స్ మాట్లాడుతూ..'' ప్రస్తుతం టెస్టు క్రికెట్ నా మొదటి ప్రాధాన్యత. టెస్టు కెప్టెన్గా ఉన్న జోరూట్తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం. అసలే మా టెస్టు క్రికెట్ చాలా బ్యాడ్గా ఉంది. అందుకే ఈసారి ఐపీఎల్లో పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో సుధీర్ఘంగా ఆడాలని కోరుకుంటున్నా. అందుకోసం ఐపీఎల్ లాంటి లీగ్స్కు దూరంగా ఉంటూ టెస్టు క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తున్నా. ఒకవేళ ఐపీఎల్కు పేరు రిజిస్టర్ చేసుకొని ఏదో ఒక ఫ్రాంచైజీకి వెళ్లినప్పటికి మనస్పూర్తిగా ఆడకపోయి ఉండొచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Virat Kohli 100th Test: స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసిన బీసీసీఐ ఇక ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్గా పేరు పొందిన స్టోక్స్ను 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ రూ.14.5 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మొదటి సీజన్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసిన స్టోక్స్ 12 వికెట్లతో పాటు 316 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతని ప్రదర్శనకు మెచ్చిన రాజస్తాన్ రాయల్స్ వేలంలో రూ.12.5 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. అప్పటినుంచి రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్ గతేడాది ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లో గాయపడ్డాడు. ఆ తర్వాత సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. కాగా స్టోక్స్ వ్యాఖ్యలపై ఐపీఎల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఐపీఎల్లో ఆడి కోట్లు వెనుకేసుకున్నప్పుడు ఈ మాటలు గుర్తుకురాలేదా.. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ కంటే టెస్టు క్రికెటే ప్రాధాన్యత అని చెప్పడం ఏం బాగాలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్షాక్! ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్ మెగావేలానికి స్టోక్స్ తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. కాగా వేలంలో పాల్గొననున్న 590 మంది క్రికెటర్లలో 228 మంది విదేశీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇక ఇంగ్లండ్కు యాషెస్ సిరీస్ పీడకలను మిగిల్చింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన యాషెస్ను 4-0తో కోల్పోయిన ఇంగ్లండ్కు స్వదేశంలో అవమానాలు ఎదురయ్యాయి. జట్టును మొత్తం సమూలంగా మర్చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో రూట్, స్టోక్స్ సహా మరికొందరు క్రికెటర్లు టెస్టు క్రికెట్ను సవాల్గా తీసుకొని రాబోయే సిరీస్ల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. చదవండి: IPL 2022 Auction: మెగావేలానికి నాలుగు రోజులే.. జేసన్ రాయ్ విధ్వంసం -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. స్పందించిన పుజారా
టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగడంపై టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ట్విటర్ వేదికగా స్పందించాడు. ఏడేళ్లపాటు సారథిగా సేవలు అందించి, జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టాడని ప్రశంసలు కురిపించాడు. అతని సేవలు మరింతకాలం పాటు జట్టుకు అవసరమని అన్నాడు. కోహ్లి విజయవంతమైన కెప్టెన్గా పేరుతెచ్చుకున్నాడని పేర్కొంటూ అభినందనలు తెలిపాడు. సమర్థవంతమైన నాయకుడిగా జట్టుకు ఎనలేని సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని పుజారా చెప్పుకొచ్చాడు. కోహ్లి కెరీర్లో మరింత ఎదగాలని పుజారా ఆకాంక్షించాడు. ఇక ఇప్పటికే టీ20, వన్డే జట్ల నాయకత్వాన్ని వదులుకున్న కోహ్లి.. తనకెంతో ఇష్టమైన టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు అతను శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్గా కోహ్లి కొనసాగాడు. ఎంఎస్ ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన అతను 68 టెస్టులకు నాయకత్వం వహించాడు. వాటిల్లో భారత్ 40 మ్యాచుల్లో విజయం సాధించింది. Congrats @imVkohli, on a captaincy tenure you can truly be proud of! You have driven Indian cricket to greater heights, and am sure have a lot more to contribute. Wishing you the very best! 👍 pic.twitter.com/YeO2NLrFSF — cheteshwar pujara (@cheteshwar1) January 16, 2022 (చదవండి: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ గుడ్బై.. అనుష్క ఎమోషనల్ పోస్ట్) -
అందుకే టెస్టు సిరీస్కు దూరం.. 3 ఫార్మాట్లు ఆడటం కష్టం.. త్వరలోనే గుడ్బై!
Shakib Al Hasan Comments: ‘‘ఏ ఫార్మాట్ ఆడటం ముఖ్యమైనదో... దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నాకు తెలుసు. టెస్టు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టెస్టులు ఆడతానో లేదో తెలియదు. ఒకవేళ ఆడినా.. ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు. వన్డేల్లో భాగం అవ్వాలో లేదో కూడా నిర్ణయించుకోవాలి. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వన్డేలు ఆడాల్సిందే’’అని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. త్వరలోనే టెస్టులకు గుడ్బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల టీమ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు షకీబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు దూరం కావడం వివాదానికి దారి తీసినా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం అతడికి సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలో స్థానిక టీవీ చానెల్ల్తో మాట్లాడిన షకీబ్ టెస్టులకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ఏదో ఒక ఫార్మాట్ను ఎంచుకోవాల్సి వస్తే మాత్రం వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘నేను ఇప్పటికిప్పుడు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని చెప్పడం లేదు. టీ20 వరల్డ్కప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్లో కూడా ఆడకపోవచ్చు. టెస్టులు, వన్డేలు ఆడతాను. అయితే.. మూడు ఫార్మాట్లు ఆడటం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమే. రెండు టెస్టులకోసం నెలలపాటు కష్టపడటంలో అర్థం లేదనిపిస్తోంది. బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్తాను. స్మార్ట్గా ఆలోచించాలి కదా. జనవరిలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను’’ అని షకీబ్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా బయో బబుల్ జీవితం జైలులా ఉందన్న ఈ ఆల్రౌండర్... ‘‘నచ్చిన చోటుకు వెళ్లకుండా ఒకే చోట ఉండటం మనసుకు కష్టంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్ జట్టు చూడండి ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించిందో... కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాళ్ల అండర్-19 జట్టును ప్రపంచకప్ టోర్నీకే పంపలేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా కుటుంబాలకు దూరంగా ఉంటూ... ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది. వారి పెంపకంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్నాళ్ల పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా’’ అని షకీబ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు దూరమైనట్లు వెల్లడించాడు. చదవండి: IND vs SA: 'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్కు అవకాశమిస్తే' -
రిటైర్మెంట్పై స్పందించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్..
Ravindra Jadeja: టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. అందుకు చాలా సమయం ఉందంటూ(Long Way To Go) ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్పై దృష్టి సారించేందుకు టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించాడు. అవన్నీ గాలి వార్తలనేనని కొట్టిపారేశాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. Long way to go💪🏻💪🏻 pic.twitter.com/tE9EdFI7oh — Ravindrasinh jadeja (@imjadeja) December 15, 2021 కాగా, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా జడ్డూ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆడిన జడేజా.. గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలెక్టర్లు అతన్ని దక్షిణాఫ్రికా పర్యటన(3 టెస్ట్ల సిరీస్)కు ఎంపిక చేయలేదు. ముంచేతి గాయానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న జడేజా.. కోలుకునేందుకు మరో 6 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జడేజా టీమిండియా తరఫున 57 టెస్ట్ల్లో 232 వికెట్లు సాధించడంతో పాటు 2195 పరుగులు సాధించాడు. చదవండి: Kohli-Rohit: కలిసి ఆడకపోతే వాళ్లకే నష్టం.. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు..! -
టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పనున్న హార్దిక్ పాండ్యా!
Has Hardik Pandya Retirement Of Test Cricket? టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడా!.. అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హార్దిక్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల జట్లకు దూరమయ్యాడు. టి20 ప్రపంచకప్ అనంతరం జట్టు నుంచి ఉద్వాసనకు గురైన హార్దిక్ ప్రస్తుతం రీహాబిటేషన్ కోసం ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు. తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. వన్డేలు, టి20లపై దృష్టి పెట్టేందుకు టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: Ashwin-Ajaz Patel: ఎజాజ్ పటేల్కు అశ్విన్ సాయం.. ఫ్యాన్స్ ఫిదా ''హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. రీహాబిటేషన్ పేరుతో ఎన్సీఏ అకాడమీలో ఉన్న హార్దిక్ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పే యోచనలో ఉన్నాడు. అతను అధికారికంగా ఈ విషయం చెప్పకపోయినా సంకేతాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. వైట్బాల్ క్రికెట్పై ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తొందర్లోనే అతను తన ఫామ్ను తిరిగి పొందుతాడు. ఎలాగు హార్దిక్ టెస్టు క్రికెట్ ఆడి మూడు సంవత్సరాలైంది. అతని వయస్సు 28 ఏళ్లు.. టీమిండియాకు మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన హార్దిక్ రానున్న రెండు ప్రపంచకప్ల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకోసం తను టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Mitchell Santner: మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు ఇక హార్దిక్ పాండ్యా టీమిండియా తరపున చివరి టెస్టును 2018లో ఇంగ్లండ్తో ఆడాడు. తన కెరీర్లో 11 టెస్టులు ఆడిన పాండ్యా 532 పరుగులు సహా 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2020 సీజన్కు ముందు వెన్నుముక సర్జీరీ చేయించుకున్న హార్దిక్ అప్పటినుంచి పెద్దగా రాణించింది లేదు. ఆల్రౌండర్ ట్యాగ్ ఉన్నప్పటికి ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. తాజాగా ముగిసిన టి20 ప్రపంచకప్లోనూ బౌలింగ్కు దిగని హార్దిక్ .. అటు బ్యాటింగ్లోనూ భారంగా మారి జట్టులో చోటు కోల్పోయాడు. ఇక దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా హార్దిక్ పాల్గొనడం లేదు. రీహాబిటేషన్ పేరుతో హార్దిక్ ఎన్సీఏకే పరిమితం అయ్యాడు. -
టెస్ట్ క్రికెట్కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ గుడ్బై...
James Pattinson retires from Test cricket: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ ముందు ప్యాటిన్సన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణాల్లో మోకాలి గాయం కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా మోకాలి సమస్యలతో ప్యాటిన్సన్ ఇబ్బంది పడుతున్నాడు. కాగా 2011లో టెస్టు క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ప్యాటిన్సన్.. అరంగేట్ర మ్యాచ్లోనే ఐదు వికెట్లు సాధించి ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే ఆ తర్వాత మెకాలి గాయంతో చాలా సిరీస్లకు దూరమయ్యాడు. గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ హాజెల్వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండడం వల్ల ప్యాటిన్సన్కు టెస్ట్ క్రికెట్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే 21 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్యాటిన్సన్.. నాలుగు ఐదు వికెట్ల హాల్లతో సహా 81 వికెట్లు సాధించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
ఇంగ్లండ్ అభిమానులకు షాకిచ్చిన మొయిన్ అలీ..
Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఊహించని షాకిచ్చాడు. 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సాంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకున్న విషయం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. కాగా, 2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్ల్లో 2914 పరుగులు చేయడంతో పాటు 195 వికెట్లు పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా -
Test Cricket: కోహ్లిని ‘అధికార ప్రతినిధి’ని చేయండి!
మెల్బోర్న్: టెస్టు క్రికెట్ను బతికించుకోవాలంటే ఏం చేయాలో అగ్రశ్రేణి ఆటగాళ్లంతా కూర్చొని చర్చించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈతరం ఆటనుంచి మంచి టెస్టు క్రికెటర్లు రావడం లేదని, ఎంత సేపూ భారీ హిట్టింగ్పైనే వారంతా దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. ‘ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మున్ముందూ టెస్టు క్రికెట్ ప్రకాశిస్తుంది. లేదంటే అదంతా గతంలా మారిపోతుంది.అన్ని రకాల నైపుణ్యాలతో అన్ని ఫార్మాట్లలోనూ రాణించాలంటే ప్రాధమికాంశాల్లో ఎంతో పట్టుండాలి. విరాట్ కోహ్లి దానికి అసలైన ఉదాహరణ. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నిజంగా టెస్టు క్రికెట్కు తాము విలువ ఇస్తున్నామని భావిస్తే టాప్ ప్లేయర్లంతా ఆట భవిష్యత్తు కోసం తమ వైపునుంచి ప్రయత్నించాలి. విరాట్ కోహ్లి మాత్రమే అలాంటి వేదికకు సరైన అధికార ప్రతినిధి కాగలడు’ అని ఇయాన్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: అందుకే సిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!Virat Kohli: 'కోహ్లి నోరు తెరిస్తే బూతులే': మాజీ క్రికెటర్ -
టెస్ట్ క్రికెట్లో ఏదో మాయ ఉంది: మంత్రి కేటీఆర్
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. క్రికెట్పై అమితాసక్తి కనబర్చే మంత్రి.. సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్పై పలు కామెంట్లు చేశారు. టెస్ట్ క్రికెట్లో ఏదో మాయ ఉందని, ఈ ఫార్మాట్లో ఉన్న మజానే వేరని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అందులోనూ బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే మైదానాల్లో టెస్ట్ క్రికెట్ ఆడితే ఆ గమ్మత్తే వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. There is something truly magical about Test cricket & that too when it’s played in seaming conditions Best; Kohli versus Andreson is as riveting as it can get & of course scintillating performance of Rohit just adds to the glory of the game#INDvENG — KTR (@KTRTRS) August 12, 2021 ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఇంగ్లీష్ బౌలర్ అండర్సన్ స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కొన్న తీరు అత్యుత్తమమని కొనియాడాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన అమోఘ ప్రదర్శనతో మ్యాచ్కు వైభవాన్ని తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. కాగా, గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127) అజేయ సెంచరీతో అదరగొట్టగా, రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్తో పాటు రహానే(1) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2, రాబిన్సన్కు ఓ వికెట్ దక్కింది. -
11 ఏళ్ల క్రితం ఈ రోజు శ్రీలంక స్పిన్ దిగ్గజం ఏం చేశాడో గుర్తుందా..?
కొలంబో: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు నేలకూల్చిన తొలి క్రికెటర్గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రోజుకో రికార్డు బద్దలవుతున్నా నేటి క్రికెట్లో 11 ఏళ్ల క్రితం మురళీ నెలకొల్పిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బహుశా భవిష్యత్తులో ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి చేరేలా కనిపించడం లేదు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా గాలేలో 2010 జులై 22న భారత్తో జరిగిన తొలి టెస్ట్లో మురళీధరన్ 800 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన మురళీ.. ఈ మైలురాయిని చేరుకునేందుకు మరో వికెట్ అవసరమైంది. అయితే, అప్పటికే భారత్ రెండో ఇన్సింగ్స్లో 9 వికెట్లు చేజార్చుకుంది. దీంతో మురళీ 800 వికెట్లు మైలురాయిని చేరుకుంటాడా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగింది. ఎందుకంటే ఈ టెస్టు ప్రారంభానికి ముందే మురళీ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తొలి టెస్టు తర్వాత తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో 800 వికెట్ దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ క్రీడాభిమానుల్లో మొదలైంది. అయితే, చివరికి ఆ సమయం రానే వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝాకు ఆఫ్ స్టంప్ ఆవల సంధించిన బంతి బ్యాట్ ఎడ్జ్కు తాకి జయవర్థనే చేతుల్లో పడడంతో స్టేడియం మార్మోగిపోయింది. బాణాసంచా మోతెక్కింది. ఆనందాన్ని పట్టలేని మురళీ మైదానంలో గెంతులేశాడు. సహచరులంతా ఈ సందర్భాన్ని మరపురాని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, మురళీధరన్ తన టెస్ట్ కెరీర్ మొత్తంలో 113 టెస్ట్ మ్యాచ్లు ఆడి 800 వికెట్లు పడగొట్డాడు. మురళీధరన్ ఆడిన చివరి టెస్ట్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది. -
అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ
ముంబై: భువనేశ్వర్ కుమార్.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థులను తన బౌలింగ్తో బెంబేతెత్తిస్తుంటాడు. నకుల్ బౌలింగ్తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మ్యాచ్ల్లో పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమయ్యేవాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా నిలిచిన భువీ ఒకానొక సందర్భంలో అన్ని ఫార్మాట్లలో కీలక బౌలర్గా మారాడు. కానీ క్రమంగా టెస్టులు ఆడడం తగ్గించేశాడు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భువీని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్కు సరిగ్గా సరిపోతాయి. అయితే భువీ పరిమిత ఓవర్లు, టీ20ల్లో దృష్టి పెట్టేందుకే టెస్టులకు దూరమవుతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. దీనిపై భువీ స్వయంగా తన ట్విటర్ ద్వారా స్పందించాడు. '' టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడడానికి నేను ఎప్పుడూ సిద్దమే. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్కే మొదటి ఓటు ఉంటుంది. వన్డే, టీ20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్ అయినా సరే.. సంప్రదాయ క్రికెట్కే మొగ్గు చూపుతాడు. ఒక బౌలర్కు తన బౌలింగ్లో వైవిధ్యం ఎక్కువగా చూపించే అవకాశం టెస్టుల్లోనే లభిస్తుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్టులకే ప్రాధాన్యమిస్తా. కేవలం ఊహాగానాల ఆధారంగా నాపై అసత్య ప్రచారాలు రాయొద్దంటూ '' చెప్పుకొచ్చాడు. ఇక భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం టెస్టు క్రికెట్లో టీమిండియా తరపున బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్లు అద్భుతంగా రాణిస్తుండడంతో పరోక్షంగా భువీకి టెస్టుల్లో అవకాశాలు తగ్గిపోయాయి. చదవండి: WTC Final: కొత్త వ్యూహంతో కివీస్ ఆటగాడు పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు -
అఫ్ఘనిస్తాన్ తరఫున తొలి టెస్టు క్రికెటర్గా
అబుదాబి: హష్మతుల్లా షాహిది అఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో అజేయ డబుల్ సెంచరీ (443 బంతుల్లో 200 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) సాధించడం ద్వారా అఫ్ఘనిస్తాన్ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా అవతరించాడు. అతడితో పాటు కెపె్టన్ అస్గర్ అఫ్గాన్ కూడా శతకం (257 బంతుల్లో 164; 14 ఫోర్లు, 2 సిక్స్లు) బాదడంతో... ఓవర్నైట్ స్కోరు 307/3తో రెండో రోజు ఆట కొనసాగించిన అఫ్ఘనిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 545 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హష్మతుల్లా, అస్గర్ నాలుగో వికెట్కు 307 పరుగులు జోడించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే గురువారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో వికెట్నష్టపోకుండా 50 పరుగులు చేసింది. చదవండి: పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు.. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం నార్త్సౌండ్: వికెట్ కీపర్ షై హోప్ సెంచరీ (133 బంతు ల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్)కి ఎవిన్ లూయిస్ బాధ్యతాయుత బ్యాటింగ్ (65) తోడవ్వడంతో శ్రీలంకతో ఆరంభమైన వన్డే సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధ రాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్ జట్టు 8 వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దనుష్క గుణతిలక (55), దిముత్ కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్, లూయిస్ తొలి వికెట్కు 143 పరుగులు జోడించి విండీస్కు శుభారం భం అందించారు. చివర్లో డారెన్ బ్రావో (37 నాటౌట్) రాణించడంతో విండీస్కు విజయం దక్కింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే నేడు జరుగుతుంది. చదవండి: 2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా -
ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో..
అహ్మదాబాద్: టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అరుదైన రికార్డ్కి అడుగు దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల మార్క్ని అశ్విన్ అందుకోగా.. ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియం వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు డే నైట్ తరహాలో ప్రారంభంకానుంది. ఈ మూడో టెస్టులో అశ్విన్ 6 వికెట్లు పడగొడితే.. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్గా రికార్డులెక్కనున్నాడు. 2011లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ 76 టెస్టు మ్యాచ్లాడి 394 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 సార్లు 10 వికెట్ల మార్క్ని అందుకున్న అశ్విన్.. ఏకంగా 29 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. టీమిండియా తరపున దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టెస్టుల్లో టాప్లో ఉండగా.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు), హర్భజన్ సింగ్ (417) టాప్-3లో కొనసాగుతున్నారు. ఒకవేళ అశ్విన్ 400 వికెట్ల మార్క్ని అందుకోగలిగితే.. ఈ ఘనత సాధించిన మూడో భారత స్పిన్నర్గా నిలవనున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 800 వికెట్లతో ఉన్నాడు. చదవండి: 'మాస్టర్' డ్యాన్స్తో దుమ్మురేపిన క్రికెటర్లు సిక్సర్లతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ -
టెస్టు క్రికెట్కు సీనియర్ ఆటగాడు గుడ్బై
జోహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ టెస్టు క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు, టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. 2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన 36 ఏళ్ల డు ప్లెసిస్ ప్రొటీస్ తరపున 69 టెస్టు మ్యాచ్ల్లో 40 సగటుతో 4,163 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 21 అర్థసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు అన్ని ఫార్మాట్లలో డు ప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు 36 టెస్టుల్లో 18 విజయాలు,39 వన్డేల్లో 28 విజయాలు, 40 టీ20ల్లో 25 విజయాలు సాధించింది. డుప్లెసిస్ టెస్టు రిటైర్మెంట్పై స్పందించాడు. 'టెస్టులు ఇక ఆడకూడదనే నిర్ణయంతో నేను క్లియర్గా ఉన్నా. టెస్టులకు గుడ్బై తర్వాత కొత్త చాప్టర్ను మొదలుపెడుతా. పరిమిత ఓవర్లతో పాటు టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా 9ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వచ్చే రెండేళ్లలో ఐసీసీ టీ20 ప్రపంచకప్తో పాటు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం వాటిపైనే ఉంది. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు థ్యాంక్యూ 'అంటూ ముగించాడు. పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం డు ప్లెసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని కలిగించింది. పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి డు ప్లెసిస్ 55 పరుగుల మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే అంతకముందు జరిగిన లంక సిరీస్లో మాత్రం సెంచరీతో అదరగొట్టి విమర్శకుల నోరు మూయించాడు. చదవండి: 'ప్లీజ్.. పీటర్సన్ను ఎవరు ట్రోల్ చేయొద్దు' ధోని కెప్టెన్సీ వదులుకుంటే.. అతడికే అవకాశం! -
క్రికెట్లో మినిమమ్ ఏజ్ పాలసీ..!
దుబాయ్: ఇక నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలంటే వయసు అనేది అనివార్యం. గతంలో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశానికి ఇంత వయసు ఉండాలనే నిబంధన ఉండేది కాదు.. ఇప్పుడు దానికి చరమగీతం పాడింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలనే నిబంధనను చేర్చింది. ‘ ప్రతీ క్రికెట్ బోర్డు వయసు నిబంధనను అమలు చేయాల్సి ఉంది. కనీస వయసు అనేది తప్పనిసరి చేయాలి. అండర్-19 క్రికెట్లోనైనా, ద్వైపాక్షిక క్రికెట్లోనైనా పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్లోనైనా కనీస వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి’ అని ఐసీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. (10 టీ20 మ్యాచ్లు ఆడితే చాలు..!) ఒకవేళ అంతకంటే తక్కువ వయసు కల్గిన ఆటగాడిలో అపారమైన ప్రతిభ ఉండి, మానసికంగా ధృఢంగా ఉన్నాడనిపిస్తే అప్పుడు సదరు బోర్డు ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది. గతంలో పలువురు క్రికెటర్లు 15 ఏళ్ల వయసు కంటే చిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన సందర్భాలను చూశాం. పాకిస్తాన్కు చెందిన హసన్ రాజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా పిన్నవయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డును సాధించాడు. హసన్ రాజా 1996 నుంచి 2005 మధ్యకాలంలో 16 వన్డేలకు, 7 టెస్టులకు పాక్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15 ఏళ్లు దాటాకే అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం చేశాడు. 16 ఏళ్ల 205 రోజుల వయసలో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతని అంతర్జాతీయ కెరీర్లో భాగంగా టెస్టుల్లో 15, 921 పరుగులు చేయగా, వన్డేల్లో 18, 426 పరుగులు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లలో సచిన్ 100 శతకాలను సాధించాడు. దాంతో వంద అంతర్జాతీయ శతకాలు సాధించిన తొలి ప్లేయర్గా సచిన్ రికార్డు నెలకొల్పాడు. -
ఆ టోర్నీ షెడ్యూల్లో మార్పులేదు: ఐసీసీ
దుబాయ్: కరోనా కారణంగా క్రికెట్కు ఆటంకం కలిగినా... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జూన్లోనే దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. కోవిడ్–19 కారణంగా పలు టెస్టు సిరీస్లు రద్దయినా ఐసీసీ దీనిపై పునరాలోచన చేయడం లేదు. ‘ఇప్పటి వరకైతే టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తేదీల్లో మార్పు లేదు. అయితే పాయింట్ల కేటాయింపు విషయంలో మార్పులు అవసరమైతే దానిపై దృష్టి పెడతాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టెస్టు చాంపియన్షిప్లో భాగంగా టాప్–9 జట్లు ఒక్కొక్కటి కనీసం ఆరు సిరీస్ల చొప్పున ఆడాల్సి ఉంది. అయితే భారత్, ఇంగ్లండ్ మాత్రమే నాలుగేసి సిరీస్లు ఆడగా, ఆస్ట్రేలియా మూడు సిరీస్లలో పాల్గొంది. (చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం) -
‘టెస్టు మ్యాచ్లు ఆడటం ఇక అనుమానమే’
డెర్బీ: ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్ల్లో ఆడేది అనుమానమేనని వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. దాదాపుగా తన టెస్టు కెరీర్ ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు. 3 వన్డేలు, 3టి20 మ్యాచ్ల సిరీస్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్న ఫించ్... కెరీర్ ముగిసేలోగా చివరగా ఒక టెస్టు మ్యాచ్ ఆడాలని ఉందంటూ తన ఆసక్తిని బయట పెట్టాడు. భారత్లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ తనకు చివరి సిరీస్ అవుతుందని చెప్పాడు. ‘నేనింకా టెస్టులు ఆడే అవకాశం ఉందని అనుకోవట్లేదు. ఎరుపు బంతితో ఆడతానని చెప్తే అది అబద్ధమే అవుతుంది. టెస్టు జట్టులో చోటు కోసం ఇప్పట్లో నేను ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడలేను. మరోవైపు యువకులు దూసుకొస్తున్నారు. టాపార్డర్లో ఇమిడిపోయే యువకులే అధికంగా వెలుగులోకి వస్తున్నారు’ అని ఫించ్ చెప్పాడు. ఇప్పటివరకు కేవలం 5 టెస్టుల్లోనే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల ఫించ్... 126 వన్డేలు, 61 టి20లు ఆడాడు. (చదవండి: ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్)