vardhelli murali
-
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!
సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్ కల్యాణ్కు సనాతనాభివందనాలు!ఇప్పుడు పవన్ కల్యాణ్ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్ మాట్లాడలేదు.ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.లెఫ్ట్ నుంచీ సెంటర్కూ, అక్కడి నుంచి రైట్కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్ నార్మన్ బెథూన్, డాక్టర్ ద్వారకానాద్ కోట్నిస్ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు. తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. ‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్కే పార్టీ మీద దాడి చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.పవన్ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్ పరి వార్ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్బిన్లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్ లీడర్! ఇటువంటి మాస్ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్మోహన్రెడ్డి. దట్సాల్!సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. రెడ్బుక్ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్ బాగానే తెలుసు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్మోహన్రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్మోహన్రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్ ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేసే టీమ్, కాన్వాయ్, రోప్ పార్టీ, ఎస్కార్ట్ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్బుక్ స్థానాన్ని రెడ్బుక్ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్ ప్లస్ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.జగన్ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రజానాయకుడైన జగన్మోహన్రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్మోహన్రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!రాజశేఖర్రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.జగన్మోహన్రెడ్డి మరో బలమైన మాస్ లీడర్గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్ లీడర్ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్ఫండ్స్ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. అయినా సరే, జనం మాత్రం జగన్ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అప్పారావు చిటికెల పందిరి!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్ పీరియడ్’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్ సిక్స్’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్ సిక్స్’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్ సిక్స్’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.ఎకనామిక్స్ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్ తీసుకున్నారు. పవర్ పాయింట్ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 2047 నాటికి డాలర్ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్ జ్యోతిషం తెలుసు.ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్గా మారింది. ‘‘ఇన్ ద లాంగ్ రన్ వి ఆర్ ఆల్ డెడ్’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్ మార్కెట్ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్ వేసిన సెటైర్గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్కు బాగా నప్పుతుంది.చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్లో లిక్కర్ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్ జగన్ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్’లనూ బాబు సర్కార్ ఆశ్రయిస్తున్నది.ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్మోహన్రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ!
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే... ఎవరి నామ స్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు. కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు! పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదిరించే శక్తి ప్రజలకే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా జనం మీద వరసగా పిడుగుల్ని కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే, ఏపీలో ఉన్న బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో! జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రయిక్గానే చాలామంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు.కార్పెట్ బాంబింగ్పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన ‘విజన్–2020’కి కొనసాగింపే ‘స్వర్ణాంధ్ర–2047’. అంతేకాకుండా గతేడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్– 2047’ పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం! ఆర్థికవృద్ధి లెక్కల్లో కనిపించింది. బహుళ అంతస్థుల భవంతుల్లో కనిపించింది. పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సంద ర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులూ, చేతివృత్తిదారుల బలవన్మరణాలకు సాక్షి సంత కాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది.భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతివృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిష్ హయాంతో పోల్చినా కూడా ‘విజన్–2020’ తొలి ఐదారు సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయా లను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు, సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్ఢిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ – ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్నే ‘సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్’ అంటారు. దీని కారణంగా గడచిన మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోయాయి. ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వ యిజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్టయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత పదిహేనేళ్లుగా పెరుగుతూనే ఉన్నది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపైన చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతున్నది. ఈ ధోరణి వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి పోతుందనీ, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందనీ ఆయన చెప్పారు. ఈ ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలి తాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం.చంద్రబాబు కొత్తగా ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర–2047’ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. రెండు మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరేసరి! రైతుల ఆదాయాలు పెంచుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామని కూడా చెప్పారు. ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి, 2047 నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యు మెంట్లోని గొప్పలు సాధ్యం కావు.పేదవర్గాల ప్రజలు నూటికి నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించగల విద్యావిధానానికి తాను వ్యతిరేకం కనుకనే అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని, మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలుచేసిన ‘రైతు భరోసా’ను ఎగరగొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసే లేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నా లజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్ధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు.‘నేను ’95 మోడల్ చంద్రబాబున’ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్! పారిశ్రామికవేత్తలకూ, పెట్టుబడిదారులకూ వనరులన్నీ కట్టబెట్టాలి. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) అనే మూడు సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగు తున్నకొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి ఒకటి రెండు విషయాల్లో కొద్దిగా మినహాయింపులు ఇచ్చారు. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలుచేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు. ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంత ర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చుపెట్టరు. ‘స్వర్ణాంధ్ర–2047’ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇకముందు అన్ని రంగాలకూ విస్తరించ నున్నది.రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్!ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో మూడింట రెండొంతుల మేరకు పూర్తి చేయగలిగారు. ఇంకా ఒక వంతు మిగిలే ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారెంటీలన్నీ గ్యారెంటీగా అటకెక్కినట్టే! పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లయితేనేమీ, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లయితేనేమి 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్లపై చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్. ఇది కాకతాళీయమో, వ్యూహాత్మకమో తెలియదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది.నిన్నటి అల్లు అర్జున్ అరెస్ట్ సంగతే చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారుండరు. ఖండించని వారుండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాయెకిన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, అదీ బెయిల్ దొరక్కుండా వారాంతంలో చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పుచేసి దొరికి పోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకెళ్లిన సంద ర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నద నేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్నా నిర్ధారణ కాలేదు. ఎందుకని అంతగా టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్కు సానుభూతి మాత్రం పెరిగింది.చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే! సెలబ్రిటీలు అయినంతమాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పనిని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకొనిపోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావలసి వచ్చింది. అందుకు బయ టకు కనబడే కారణాలైతే ఏవీ కనిపించడం లేదు. ఉంటేగింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిశోర్రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు గానీ, ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండ వచ్చు.ఆ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో ‘హైడ్రా’ను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది. ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వది లేయడం ప్రశ్నార్థకంగా మారింది. ‘హైడ్రా’ భయంతో హైద రాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చలామణీ మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూము లమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాధుడు కనిపించక అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే! ఇకముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే! కానీ, ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకూ, ప్రభుత్వంపై నెగెటివ్ ఇమేజ్కూ కారణమైంది. ఇటు వంటి సర్జికల్ స్ట్రయిక్స్ను ఏడాది కాలంలో ఒక డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని, చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ప్రభుత్వానికీ, ప్రజలకూ క్షేమకరం!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీజ్ ద పోర్ట్
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్ వారు ఏం చేస్తున్నారో తెలుసా?ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్చేసి ఉన్నాయట! అందులో మన రేషన్ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్ ద షిప్’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ సినిమా అవసరం లేదు. ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్ ద షిప్’ ఓ డైలాగ్ మాత్రమే! సినిమా టైటిల్ ‘సీజ్ ద పోర్ట్’ కావచ్చు!!నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ యాంకరేజి పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్ ద షిప్’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్ వాటర్ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్’ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారు. డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్సెన్స్ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా! ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్సెన్స్ ప్రశ్న! భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న. ఒక సాధారణ రైస్ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్సీఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్ ద పోర్ట్’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘సాక్షి’పై కేసు సరికాదు
ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవినీతిని ఎండగట్టినందుకు సాక్షి ఎడిటర్పై కేసు నమోదు చేయడాన్ని పలు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈకేసునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతి/విశాఖ సిటీ కేసు ఉపసంహరించుకోవాలి: ఏపీయూడబ్ల్యూజేమీడియా కథనాలపై కేసు నమోదు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి కథనాల్లో అవాస్తవాలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అలా కాకుండా ఎడిటర్ వర్ధెల్లి మురళిపై కేసు పెట్టడం సరైనచర్య కాదని పేర్కొన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కేసును వ్యతిరేకిస్తున్నాం: ఏపీడబ్ల్యూజేఎఫ్ పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి పోలీసు కేసులు పెట్టే వైఖరిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) వ్యతిరేకిస్తోందని ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు తెలిపారు. ఈ సంస్కృతిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళిపై పోలీసులు కేసు బనాయించటం సరికాదు. పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తా కథనాలకు సంపాదకుడిదే బాధ్యత అయినా పత్రిక ప్రధాన లక్ష్యం ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం. ఆ ప్రక్రియలో లోటుపాట్లుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి. పోలీసు కేసులు పెట్టడం మీడియాను భయపెట్టే చర్యగా భావిస్తున్నాం. మీడియాను భయపెట్టేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళిపై పెట్టిన కేసు ఆ కోవలోకే వస్తుంది. ఇటువంటి ధోరణులను పోలీసు యంత్రాంగం మానుకోవాలి..’ అని వారు చెప్పారు. ఈ కేసు సరికాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసు అక్రమం: స్సామ్నా మీడియా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తాజాగా జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంఘం (స్సామ్నా) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక వార్తా కథనం పేరుతో ‘సాక్షి’ ఎడిటర్ వి.మురళిపై విజయవాడలో పోలీస్ కేసు నమోదు చేయడం అక్రమమని స్సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సిహెచ్.రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై ఈ మాదిరిగానే నమోదు చేసిన కేసును ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని కూటమి ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఆదిలోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదన్నారు. గతంలోను చట్టాలు, జీవోలు, అధికార ఒత్తిళ్లతో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపేయించడం, జర్నలిస్టులపై కేసులు బనాయించడం వంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఇప్పటికైనా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసును ఉపసంహరించాలని, చానళ్ల ప్రసారాల విషయంలో కేబుల్ టీవీ ఏజెన్సీలపై ఒత్తిళ్లను మానుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం సరికాదని, జర్నలిస్టులపై కేసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని స్సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, కార్యదర్శి ఎస్.గంగరాజు కోరారు. సాక్షి ఎడిటర్పై కేసు అన్యాయం: ఏపీడబ్ల్యూజేయూ సాక్షి ఎడిటర్ మురళిపై విజయవాడలో కేసు నమోదు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) విశాఖ జిల్లా యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ యూనిట్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, ఆర్.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్తా కథనం పేరుతో సాక్షి ఎడిటర్ వి.మురళిపై కేసు నమోదు అక్రమమని పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇదేరీతిలో ఒక జర్నలిస్టుపై నమోదుచేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జర్నలిస్టు సంఘాలు అంగీకరించే పరిస్థితి లేదని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్పై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంయమనంతో వ్యవహరించాలి: జాతీయ జర్నలిస్టుల సంఘం పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి.. పోలీసు కేసులు పెట్టే వైఖరి సరికాదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. సమాజంలో వైషమ్యాలు, అంతరాలు మరింతగా పెరిగేందుకు దోహదపడే చర్యలకు పాల్పడకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. -
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్ల హ్యాకింగ్లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్డీ తేల్చింది.ఈవీఎమ్లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్ల ఆపరేషన్ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎవరికోసం ఈ అవతారం?
భారతీయ జనతా పార్టీ వారు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావించుకుంటారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికి కొత్త ప్రాంతాలకు విస్తరించాలి. ఇది కాషాయ దళానికి తక్షణ కర్తవ్యం. ఉత్తరాదిన బలపడటం కోసం మూడు దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత ఆ పార్టీదే! అదే వ్యూహంతో దక్షిణాది విస్తరణకు కమల దళం అడుగులు వేస్తున్నది. కర్ణాటక, తెలంగాణాల్లో దాని ఎత్తుగడలు ఒకమేరకు ఫలించాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేరళలో ఆ పార్టీ వోటు బ్యాంకు చెప్పుకోదగినంత పెరిగింది. ఆంధ్ర, తమిళనాడు మాత్రమే ఇంకా కొరకరాని కొయ్యలుగా మిగిలాయి.ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కమల దళాలను కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడేసుకుంటున్నారని బీజేపీలో చాలామంది బాధపడుతుంటారు. చంద్రబాబుకు ఆయన మామగారైన ఎన్టీరామారావు ‘జామాతా దశమగ్రహం’ అనే పేరును ఖాయం చేశారు. ఈ దశమ గ్రహానికి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తున్న కారణంగా స్వయం ప్రకాశితం కాలేక పోతున్నామని ‘ఒరిజినల్ పరివార్’ (ఓపీ బ్యాచ్) చింతాక్రాంత మవుతున్నది. వ్యక్తిగత పొరపొచ్చాల వల్ల మధ్యలో రెండు పార్టీలు దూరమైన ఓ రెండేళ్లు తప్పితే రాష్ట్ర బీజేపీలో ఎప్పుడూ ‘యెల్లో పరివార్’ (వైపీ బ్యాచ్)దే పైచేయి.ఇటీవల చంద్రబాబు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని ప్రసా దాన్నే రాజకీయాల్లోకి లాగడం, ఫలితంగా ఆయనపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతులే. తెలుగు దేశం పార్టీ నాయకులెవరూ సుప్రీం వ్యాఖ్యలపై స్పందించలేదుకానీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైపీ బ్యాచ్ నాయకురాలు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయ మూర్తుల కామెంట్లనే ఆమె తప్పుపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సంద ర్భాన్నీ, సన్నివేశాన్నీ కూడా గమనించాలి.కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఒక్క హామీని పట్టాలెక్కించకపోవడం... వరద నివారణ చర్యల్లో వైఫల్యం... వరద బాధితుల సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సందర్భం. మూడు కూటమి పార్టీలు ముచ్చటగా జరుపుకున్న శతదినోత్సవ వేడుక ఆ సన్నివేశం. కనుక తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం కూటమి ఉమ్మడి వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. ఆ వ్యూహం గొంతు కలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఉండటంతో వైపీ బ్యాచ్ బీజేపీకి బీపీ పెరిగిపోయింది.చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడటం, ఆయన పల్లకీని నిరంతరం మోయడం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు న్నాయి. రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన వైపీ బ్యాచ్ (యెల్లో పరివార్)కు యథాతథ స్థితి పట్ల అభ్యంత రాలేమీ లేవు. ఒరిజినల్ పరివార్ (ఓపీ బ్యాచ్) మాత్రం పార్టీ సొంతంగా ఇంకొంత బలం పుంజుకుంటేనే చంద్రబాబు దగ్గర కూడా గౌరవం లభిస్తుందనీ, లేకుంటే ఉపగ్రహం మాదిరిగానే మిగిలిపోతామనీ హైకమాండ్ దగ్గర వాదిస్తున్నది. తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించినా సొంత బలం పెంచుకొని ఎక్కువ స్థానాలను దక్కించుకోవలసిన అవసరం జాతీయ నాయకత్వానికి కూడా ఉన్నది. సొంత బలం పెంచుకోవడానికి వారి దగ్గరున్న ప్రణాళిక పాత మంత్రమే! మత విశ్వాసాలను ఆలంబన చేసుకోవాలి.వైపీ బ్యాచ్ నాయకత్వం కింద ఉన్న రాష్ట్ర బీజేపీతో ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడి ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వాడు, దాదాపు 13 శాతం జనాభా ఉన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, సినిమాల్లో మాదిరిగా వేషాల్నీ, సంభాషణల్నీ అవలీలగా మార్చగలిగినవాడు వారి దృష్టిలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా బీజేపీ అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటున్నారు. ఇంక కావలసిందేముంది? వీరవైష్ణవావతారం సిద్ధమైంది. శ్రీమహావిష్ణువు అవతారాలన్నీ ధర్మ సంస్థాపనార్థం సంభవించి కర్తవ్యం పూర్తికాగానే ఆయనలోనే ఐక్యమైపోయాయని చదువుకున్నాము. కానీ కమలం పార్టీ సృజించిన ఈ కొత్త వీరవైష్ణవమూర్తి వచ్చే ఎన్నికల కర్తవ్యానికి ముందుగానే అదే పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. సినీనటుడు కావడం వల్ల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన సేవలు వాడుకోవాలని బీజేపీ పెద్దల ఆలో చన. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలుగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనక్కూడా మరో దారి లేదు. వంద రోజుల్లోనే ప్రభుత్వ ప్రతిష్ఠ కనీవినీ ఎరుగని రీతిలో దిగ జారింది. ఈ మాట ప్రతిపక్షం వాళ్లు చెప్పడం కాదు. తెలుగు దేశం పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారు, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కోసం ఎన్నికల యుద్ధం చేసినవారు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.ఇకముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగ జారుడే తప్ప మెరుగయ్యే అవకాశం లేదు. ఉద్యోగుల బదిలీల్లో, ఇసుక దోపిడీలో, లిక్కర్ దుకాణాల పేరుతో పిండుకుంటున్న లంచాల ఫలితంగా ఇప్పటికే పార్టీ జెండా అవినీతి కంపు కొడు తున్నది. ఒక్క వాగ్దానం అమలు కాలేదు. ఈ రకమైన ట్రాక్ రికార్డుతో వారు జనం ముందుకు వెళ్లగలిగే పరిస్థితి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు మత విశ్వా సాలు రెచ్చగొట్టే పార్టీ వెంట నడవడం గుడ్డిలో మెల్ల కదా!పవన్ కల్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్ఠను పణంగా పెట్టి ఆయన ఆ టెంకా యను కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన మూడోరోజే పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష – కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్టు చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచకా తీసేయవచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది.ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సనాతన ధర్మం’ అనే మాటను హిందూ మతానికి పర్యాయపదంగానే ఆయన వాడారు. ‘నేను ముమ్మాటికీ సనాతన హిందువునే. నా ప్రాణాన్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు... నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధమ’ని గంభీరంగా ప్రకటించారు. గతంలో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్పై పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు.పవన్ కల్యాణ్ తన ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడిన ‘సనాతన ధర్మం’ అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదళ్లను ఇప్పుడు తొలుస్తున్నది. ఆయన ఉపన్యాసమంతా గమనిస్తే హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం అని భావిస్తున్నట్టుగా ఉన్నది. భారతీయ తాత్విక ధారలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రస్తావన లేదని పలువురు పండితుల అభిప్రాయం. అపౌరుషేయాలుగా, సకల శాస్త్రాలకు మాతృశాస్త్రంగా భారతీయులు పరిగణించే వేదాల్లో సనాతన ధర్మం అనే మాటను ఎక్కడా వాడలేదని చెబుతారు. బౌద్ధ సాహిత్యంలో ఏది సత్యమో అది సనాతనం... అంటే శాశ్వతమైనదనే ప్రస్తావన ఉన్నదట! అంటే ఉషస్సు సత్యం. సూర్యుడు సత్యం. చంద్రుడు సత్యం, గ్రహగతులు సత్యం కనుక అవి సనాతనం, అంటే శాశ్వతమని అర్థం.అట్లాగే సత్య వాక్కు కూడా! వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానతలకు పెద్దపీట వేసి, స్త్రీ స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలనే సనాతన ధర్మమనే ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధానంతరం అంపశయ్య మీదున్న భీష్మాచార్యుని దగ్గర రాజధర్మాన్ని తెలుసు కోగోరిన పాండవులు ఆయన చెంతకు వచ్చారట! పరిపాలకులు ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టి ఉండటం సనాతనమని భీష్ముడు వారికి ఉపదేశించాడట! వ్యాస భారతంలో ఈ ప్రస్తావన ఉన్న దని ఇటీవల ‘ఫ్రంట్లైన్’ ప్రచురించిన ఓ వ్యాసంలో రచయిత ఉటంకించారు.సత్యం సనాతనం, అంటే శాశ్వతం. ధర్మం యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి సామాజిక కట్టుబాటు కోసం ఏర్పడిన నియమావళి. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైంది. మన రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడింది. అట్లాగే ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రకటించింది. పౌరుల హక్కులకు పట్టం కట్టింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ ధర్మానికి భిన్నమైనదా? ఎందు కంటే, సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని కూడా తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అభియోగాన్ని మోపారు. పైగా అన్యమతాలకు కొమ్ము కాస్తున్నాయని కూడా న్యాయస్థానాలపై ఆయన విమర్శలు చేశారు.భారత రాజ్యాంగాన్ని నిర్వచించడం, దాని ఆదర్శాలను నిలబెట్టడం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాల విధి. అటువంటి న్యాయస్థానాలకు స్వమతం ఏమిటి? అన్యమతం ఏమిటి? ఇదేమి అభియోగం? రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సనా తన ధర్మాన్ని క్రోడీకరిద్దామా! ఇప్పుడు బీఫ్ తిన్నారనే అభియోగాలతో వీరహిందువులంతా కొందరిని వెంటాడి వేటాడి వధిస్తున్నారు. ఇది సనాతనమా? వేదకాలంలోని ముని వాటికల్లో పశుమాంస భక్షణ ఆమోదయోగ్యమే కదా!రుగ్వేద కాలంలో వసుక్ర రుషి దేవేంద్రుడిని ఇలా ప్రార్థించాడట! ‘‘ఓ ఇంద్రుడా! నీ కొరకు రుత్వికులు వేగంగా మత్తెక్కించే సోమాన్ని సిద్ధం చేస్తున్నారు. నీవు సోమాన్ని తాగు తున్నావు. వారు నీ కొరకు వృషభాన్ని వండుతున్నారు. నీవు ఆహారాన్ని తింటున్నావు’’ – ఈ రుగ్వేద శ్లోకాన్ని మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఉటంకించారు. కనుక ఆచార వ్యవహారాలు, ఆహారపు అల వాట్లు వగైరా ధర్మాధర్మ విచికిత్సలన్నీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతున్నది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనా తన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాము లున్నారు. శంకర పీఠాలతో సహా బోలెడన్ని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారీ, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థచింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పరిపాలనకు ‘తిరు’క్షవరం
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్మోహన్రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి. ఆయన మీద రాళ్లు రువ్వాలి. దాడులకు తెగబడాలి. అందుకు ఏర్పాట్లు కూడా జరి గాయి. వేలాదిమందిని సమీకరించి పెట్టుకున్నారు. వైసీపీ వాళ్లను గృహనిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్రెడ్డి వెళ్లి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం. అందుకు నెపాన్ని కూడా ఆయన పైనే∙వేయడా నికి స్క్రిప్టు రెడీ.పరిస్థితిని గమనించి జగన్మోహన్రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ వెళ్లలేదనే ప్రచారం ప్రారంభం. ఈ ప్రచారానికి సాక్షాత్తూ ముఖ్య మంత్రే నాయకత్వం వహించారు. ఆయన ప్రెస్మీట్ నుంచి సందేశాన్ని అందుకున్న కూటమి నాయకులు పొట్టోడు, పొడు గోడు అనే తేడా లేకుండా డిక్లరేషన్ దండకాన్ని అందుకున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగింది.తన వంద రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఓ అభూతకల్పన సృష్టించారు. నిజా నిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థానం మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకొని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితే అక్కడున్న వ్యవస్థలో ఉండదు. అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపుల్నే గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంపించింది. మైసూర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్కు పంపించే సంప్ర దాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్కు పంపించారు.పంపించడానికి ఒకరోజు ముందు ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లతో టీటీడీ ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్ర పతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు.మైసూర్ ల్యాబ్కు కూడా ఇదే కంటైనర్లోని శాంపుల్ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా? లేదా? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిగితే చాలా అంశాలు బయటకు రావచ్చు.కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకర జాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు.తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతున్నది. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్చేసి ఎల్–వన్గా వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డెయిరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న.డెయిరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే వుంటే రూ.300లకు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్య మేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డెయిరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డెయిరీ నిర్వాహకుల అభిప్రాయం. ఏఆర్ డెయిరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండ ర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డెయిరీ ఎల్–వన్గా నిలిచింది. వాళ్లు రూ. 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎల్–వన్గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65 శాతం సరఫరా కాంట్రా క్టును, ఎల్–టూగా ఉన్న నందినీ డెయిరీ వారు 35 శాతం సర ఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు.నందినీ డెయిరీ లోగోలోనే సంకర జాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందనీ, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబు తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక ఎల్–వన్గా వున్న ఆల్ఫా ఫుడ్స్ డెయిరీ ప్లాంట్కు తిరుపతి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంత దూరాభారాన్ని మోస్తూ అక్కడినుంచి వాళ్లే సరఫరా చేస్తారా లేక అదే పేరుతో స్థానిక డెయిరీలు ఏవైనా ఆ పని చేస్తాయా, అనే చర్చ కూడా జరుగు తున్నది. ఆల్ఫా డెయిరీ అనేది అన్లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడింకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోప ణలు చేసిన రోజున అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డెయిరీ షేర్ విలువ రూ. 565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి అది రూ.635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా?ఇక డిక్లరేషన్ విషయానికొద్దాం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 15 వందల ఏళ్ల క్రితం వరకూ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరు మలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదనిగానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని గానీ ఎన్నడూ లేదు. ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987లోనే ప్రారంభమైంది. అన్యమత స్థులు శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలున్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధనను తీసు కొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుడిని ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా!తిరుమలేశుని దర్శనానికి రోజుకు సుమారు ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవ స్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్ను పాటించినంతవరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరినీ డిక్లరేషన్ అడగదు.గత రెండు రోజులుగా బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉన్నది. స్వామివారి వెండి వాకిలి చెంతనున్న బీబీ నాంచారమ్మ మూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తు్తన్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా ఆరేడుసార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందూ, ముగించిన తర్వాత కూడా కాలినడకన వెళ్లి వేంకటనాథుని దర్శనం చేసుకున్నారు.ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాలోనైనా ఇటువంటి పట్టింపులు న్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను నూటా ముప్పయ్యేళ్ల కిందనే స్వామి వివేకానందుడు ఈసడించుకున్నారు. మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకొనే నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకూ పరమాత్మకూ మధ్యన ఉండే సంబంధమని లండన్ (1895)లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరేసి ప్రశంసలందుకున్న వివేకానందుని కంటే గొప్ప హిందువులా ఈ నడమంత్రపు నామాలవారు?సహనం హిందూమతపు సహజ భూషణమని ఆయన ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం. అన్ని మతాలు సత్యమైనవనే నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సము ద్రంలో చేరినట్టే, అన్ని రకాల ఆరాధనా మార్గాలూ ఆ సర్వే శ్వరుడినే చేరుతాయి. ఇది హిందూమత సారమని వివేకానందుడు ప్రకటించారు. ఏది ఆ స్ఫూర్తి? అటువంటి సహనం నిన్న మొన్నటి వీరాలాపాల్లో కనిపించలేదే? కాషాయ వస్త్రాలు ధరించినవారు కూడా కళ్లెర్రజేసి పళ్లు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్నవారేనా వీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతం రంగు పులుము కున్న పౌండ్రక వాసుదేవులా?బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూమత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రా మికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి. హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రలో వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్మోహన్రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అను యాయులు తరలివెళ్లారు.కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈమధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటి స్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు. ఇది ఎప్పట్నుంచో ఆరెస్సెస్ పరివారం చేస్తున్న డిమాండే! ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నల్లోకి రావాలనేది వారి సంకల్పం. జమిలి ఎన్నికల ఉద్దేశం కూడా అదే! రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుకొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్నీ, భిన్నసంప్రదాయాలనూ కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు.ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండలవాడే దిక్కనే పరి స్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క అడుగూ ముందుకుపడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని ఏకైక రాష్ట్ర పాలకుడుగా ఇప్పటికే అపఖ్యాతి పాల య్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను అటకెక్కించారు. గ్రామ స్వరా జ్యానికి తూట్లు పొడిచారు. నాలుగు నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాద కరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి 'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్ వెదర్మ్యాన్’, ‘తెలంగాణ వెదర్మ్యాన్’ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్మ్యాన్’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్’ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కల్యాణ్కు ఆయన విజ్ఞప్తి చేశారు.వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్లోకి, చలో హైదరాబాద్ మోడ్లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్ కుషన్’ మెయింటెయిన్ చేయలేదని జగన్మోహన్రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్ కెనాల్’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్ కూలింగ్ కెనాల్పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్ డీఈ మాధవనాయక్ ‘సాక్షి’ టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనేస్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్ లెవెల్ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్ లెవెల్ 11 మీటర్లు. ఐదారు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్ కెనాల్ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్లెవెల్ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్ ప్లాంట్ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘భూత్’ బంగ్లా సర్కార్!
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్లైన్తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్పీస్గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి -
ఇది రాజ్యాంగంపై దాడే!
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్గా అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం. ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్లాగా, ఏథెన్స్కు సోలాన్ లాగా భారత్కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం. దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్రావు దామోదర్ సావర్కర్లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది. ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి. ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్మీట్లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు. ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు వీఎఫ్డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్బీకేల సేవలు ఆవిరయ్యాయి. విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి. విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్మోహన్రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పశ్చిమాసియా ఓ మందు పాతర!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్నే విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్కు విసిరిన సవాల్! ఇజ్జత్ కా సవాల్గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్తో పాటు లెబనాన్లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్ ఆఫ్ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్హౌస్ ప్రకటించింది.ఇరాన్ – ఇజ్రాయెల్ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.ఇరాన్తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్కు దౌత్య సంబంధాలున్నాయి.కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్లతో కలిసి ‘ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్’ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే!ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.ఇజ్రాయెల్... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్... జస్ట్ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
స్వరం మార్చిన బ్రిటన్!
జనాభాపరంగా చూస్తే బ్రిటన్ దేశం ఇంచుమించుగా మన కర్ణాటక రాష్ట్రంతో సమానం. కానీ ఒకప్పుడు రవి అస్తమించనంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్ర ఛాయలోకి తెచ్చుకున్న దేశం బ్రిటన్. ఈ ఘనత (?) న భూతో న భవిష్యతి. భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాలను స్థాపించిన మౌర్య, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోని భూఖండాల కంటే బ్రిటిష్ సామ్రాజ్యం తొమ్మిది, పది రెట్లు పెద్దది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్లు మనదేశాన్ని కూడా రెండు శతాబ్దాలు పాలించి పీడించి దేశ సంస్కృతిపై బలమైన ముద్రనే వేశారు. కనుక బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలపై భారతీయులు ఆసక్తి చూపడం చాలా సహజం.పైపెచ్చు నిన్నటి దాకా ప్రధానిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. భారత జాతీయతనూ, హిందూ మతాన్నీ పర్యాయపదాలుగా మార్చుకున్న మన ఎగువ మధ్యతరగతి శిష్ట వర్గాలకు సునాక్ మరింత ప్రీతిపాత్రుడు. ఆయన కుటుంబం టెన్ డౌనింగ్ స్ట్రీట్ వాకిట్లో దీపావళి కాకరపువ్వొత్తులు కాలిస్తే మనవాళ్లు పులకించిపోవడం కూడా తాజా జ్ఞాపకమే! మన ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ఆయన సతీమణి – మోటివేషనల్ స్పీకర్ హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టిన సుధామూర్తిల ఏకైక అల్లుడు. అందువల్ల సునాక్ మళ్లీ ప్రధాని అవుతాడా లేదా అనే ఉత్కంఠ భారతీయులకు ఉండటంలో ఆశ్చర్యం లేదు.సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆయన మాత్రం తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. భారతీయ మూలాలున్న వ్యక్తులు 29 మంది ఈ ఎన్నికల్లో గెలుపొందారు. సునాక్ మళ్లీ ప్రధాని కానందుకు బాధపడే భారతీయులెవరైనా ఉంటే వారికి ఈ సంఖ్య పెద్ద ఊరట. ఇటీవల జరిగిన ఇండియన్ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన ముస్లిం అభ్యర్థుల కంటే బ్రిటన్ దిగువ సభకు ఎక్కువమంది భారతీయులు ఎన్నికయ్యారు.భారతదేశంతో సంబంధాల విషయంలో కన్సర్వేటివ్, లేబర్ పార్టీల మధ్యనున్న ప్రధాన తేడా కశ్మీర్ అంశంపైనే! ఈ అంశంపై రెఫరెండం జరగాలన్నది లేబర్ పార్టీ పాత విధానం. అయితే ఇప్పుడు అది పెద్దగా పట్టింపులకు పోవడం లేదంటున్నారు. అట్లాగే సునాక్ హయాంలో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పట్ల కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. సునాక్ ప్రధాని కాలేదన్న లోటును ఎక్కువమంది భారతీయ సంతతివారు ఎన్నికల్లో గెలిచి భర్తీ చేశారు. కనుక భారత్కు సంబంధించినంత వరకు బ్రిటన్లో జరిగిన అధికార బదిలీ ఎటువంటి మార్పులకూ దారితీయకపోవచ్చు.స్టార్మర్ గెలుపు ఇండియా విషయంలో యథాతథ స్థితి కొనసాగింపే కావచ్చు. కానీ ప్రపంచ రాజకీయ వేదికపై ఓ పెద్ద మార్పు. ఒక గొప్ప ఊరట. మితవాద (రైటిస్టు) భావాల ఉప్పెన పాన్ అట్లాంటిక్ దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ఒక మధ్యేవాద – వామపక్షంగా గుర్తింపు పొందిన లేబర్ పార్టీ బ్రిటన్లో ఆ ఉప్పెనను తట్టుకొని నిలవడం, భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈమధ్యనే జరిగిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలు వాటి తఢాఖాను చూపెట్టాయి. ఇటలీ, నెదర్లాండ్స్ ఎన్నికల్లో మితవాద శక్తులు విజయం సాధించాయి. ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినికి అసలు సిసలైన సైద్ధాంతిక వారసురాలు జోర్జా మెలోని ఇటలీ అధ్యక్షురాలయ్యారు. ఇండియన్ రైటిస్టు నాయకుడు మోడీతో సెల్ఫీలు దిగి ‘మెలోడీ’ పేరుతో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ మితవాద శక్తులకు సూపర్ బాస్ లాంటి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. బ్రిటన్ ఎన్నికల్లో కరుడుగట్టిన మితవాద నాయకుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీ ఎన్నడూ లేని విధంగా 14 శాతం ఓట్లను సాధించింది. ఎన్నో దండయాత్రల తర్వాత ఫరాజ్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఫరాజ్ను డొనాల్డ్ ట్రంప్ అభినందనల్లో ముంచెత్తడాన్ని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల ఐక్యత అల్లుకుంటున్న సంగతి బోధపడుతుంది. ట్రంప్కు అనుకూలంగా మన ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేసిపెట్టిన వైనాన్ని కూడా ఈ కోణంలోంచే చూడాలి. ఫ్రాన్స్లో కూడా ఒక మితవాద సునామీ వేగంగా సన్నద్ధమవుతున్న సూచనలు వెలువడుతున్నాయి. మెలైన్ లీపెన్ నాయకత్వంలోని ఆర్ఎన్ (నేషనల్ ర్యాలీ) అనే పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుంటున్నది. ఆమె గతంలో మూడుసార్లు ఫ్రెంచి అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయారు. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 32 శాతం ఓట్లు సాధించి లీపెన్ పార్టీ అధ్యక్షుడు... మేక్రాన్ అలయెన్స్ను మూడో స్థానానికి నెట్టివేశారు. దీంతో అప్రమత్తమైన మేక్రాన్ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి.జూన్ 30న తొలి రౌండ్ జరిగింది. మితవాద ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమికి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ ఎన్నికల్లో 12.5 శాతం (ఎనిమిదో వంతు) ఓట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఈ ఆదివారం నాడు రెండో రౌండ్ పోలింగ్ జరుగుతున్నది. తొలి రౌండ్లో ప్రజానాడిని గమనించిన మధ్యేవాద – వామపక్ష కూటములు ఈ ఎన్నికల్లో ఏకమయ్యాయి. ఓట్ల బదిలీ జరిగి మితవాద శక్తులను ఈ కూటమి ఓడిస్తుందా, లేదా అన్న సంగతి తేలిపోనున్నది. ఒకవేళ ఆర్ఎన్ పార్టీయే పైచేయి సాధిస్తే మేక్రాన్ అధ్యక్ష పాలనకు ఒడుదొడుకులు తప్పవు.మేక్రాన్ అధ్యక్ష పదవికి ఇంకో మూడేళ్ల గడువున్నది. సాంకేతికంగా చూస్తే ఆయన తప్పుకోవలసిన అవసరం ఉండదు. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో మేక్రాన్ సాపేక్షంగా విజయం సాధించినట్టే లెక్క. రాజకీయంగా కూడా మేక్రాన్ మధ్యేవాద మితవాదే (రైట్ ఆఫ్ ది సెంటర్). ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కొనసాగుతున్న వలసలను నిరోధించడంలో ప్రభుత్వాధినేతలు విఫలమవడం పట్ల యూరప్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అన్ని దేశాల్లోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కవల పిల్లల్లా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక కారణాలు మితవాద రాజకీయ శక్తులకు ఆక్సిజన్ మాదిరిగా పనిచేస్తున్నాయి.వలసల పట్ల స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రిషి సునాక్ కొంత ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి, పునరావాస ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ మేరకు రువాండాతో బ్రిటన్కు ఒప్పందం కూడా కుదిరింది కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. యూరప్ దేశాలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు వలసలే కారణమనే వాదాన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని తరాల ముందే వలస వచ్చి ఆ యా దేశాల ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతిలో భాగస్వాములైన వారిపై కూడా వివక్షాపూరిత దృక్కులు ప్రసరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.ప్రస్తుతం జరుగుతున్న ఫుట్బాల్ యూరో కప్ పోటీల ప్రారంభం ముందు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ బప్పే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘మితవాద రాజకీయ భావాలు అధికారపు వాకిట్లోకి వచ్చి కూర్చున్నాయి. మా విలువల్నీ, మనోభావాల్నీ గౌరవించని దేశం తరఫున ఆడేందుకు మేం సిద్ధంగా లేము’’. ఆఫ్రో – యూరోపియన్ల మనోభావాలను ఆయన బలంగా వెళ్లగక్కారు. అక్రమ వలసదారులు వస్తున్నారని యూరప్ ప్రజలు నిందిస్తున్న దేశాలన్నీ ఒకప్పుడు యూరప్ దేశాల వలసలే! వంద నుంచి రెండొందల ఏళ్లపాటు యూరోపియన్లు ఈ దేశాల వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఆ దేశాల ఆర్థిక మూలుగల్ని పీల్చి పిప్పి చేశారు. ఫలితంగా వలస దేశాల అభివృద్ధి చరిత్ర శతాబ్దాల పర్యంతం ఘనీభవించిపోయింది. వలస దేశాల సంపదతోనే యూరప్ దేశాలు చాలా కాలంపాటు వైభవోజ్జ్వల అధ్యాయాలను లిఖించుకున్నాయి. ఇప్పుడు ఈ దేశాల్లోకి వలస వస్తున్న ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు. పొట్టకూటి కోసం వారు వస్తున్నారు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం వస్తున్నారు. ఉన్నత విద్య కోసం, అవకాశాల కోసం వారు వస్తున్నారు. వలసలపై యూరప్ దేశాల మితవాదుల వైఖరి ఇట్లా వుంటే... అమెరికా మితవాదుల ధోరణి మరింత ఆశ్చర్యకరంగా ఉన్నది. అమెరికా నిర్మాణానికి వలసలే పునాది. అక్కడి భూమి పుత్రుడెవరు మిగిలారు అమెరికాలో! వాళ్లందరినీ యూరప్ వలసదారులు ఎప్పుడో వేటాడి నిర్మూలించారు. యూరప్ దేశాల ఆశాజీవులు, ఆఫ్రికా నుంచి బంధించి తెచ్చిన బానిసల సహాయంతో పెరిగిన అమెరికా ఒక వలసదారుల దేశం. వలసలకు కేరాఫ్ అడ్రస్. ఆ దేశంలోని ట్రంపిస్టులు కూడా వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం న్యూయార్క్ నగరంలోని స్వేచ్ఛా ప్రతిమ పాదపీఠిక మీద చెక్కిన ఎమ్మా లాజరస్ కవితా పంక్తుల స్ఫూర్తికి విరుద్ధం. ఆ స్వేచ్ఛా ప్రతిమ వలస జీవులను రారమ్మని పిలుస్తున్నట్టుగా ఆ కవితా పంక్తులు ఉంటాయి. ‘‘డస్సిపోయిన మీ జనాలనూ, మీ నిరుపేదలనూ, / స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తహతహలాడుతున్న మీ సకల కూటములనూ, / మీ తీరాలలో కిక్కిరిసిన తిరస్కృతులనూ, / నిరాశ్రయులనూ, తుపానుల్లో చిక్కుకుపోయిన అభాగ్యులనూ నా దరికి పంపండి. / బంగారు ద్వారం పక్కన దారిదీపాన్ని పైకెత్తి నిలుచున్నాను.’’ – (తెలుగు అనువాదం).మితవాద శక్తుల ప్రభంజనం నేపథ్యంలో బ్రిటన్లో లేబర్ పార్టీ గెలుపునకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచవ్యాపితంగా వున్న మితవాద రాజకీయ పక్షాలన్నిటికీ మతవాద, జాతివాద సారూప్యతలే కాకుండా ఆర్థిక విధానాల సారూప్యతలు కూడా ఉన్నాయి. కొంతమందే సంపద సృష్టించి, దాన్ని వారే సొంతం చేసుకునే ఆర్థిక కార్యక్రమం వారిది. బ్రిటన్ కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ భిన్నమైన గళాన్ని ఎన్నికలకు ముందే వినిపించారు. కార్మిక వర్గం కోసం సంపద సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్య సేవలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. న్యాయమైన ఈ ఎజెండాకు బ్రిటన్ ప్రజలు జైకొట్టడం ఆహ్వానించదగిన పరిణామం. వలసదారుడిని ప్రధానిగా చేసిన పార్టీని శిక్షించడానికే ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది బ్రిటన్ ప్రజల విజ్ఞతనూ, చైతన్యాన్నీ శంకించడమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్ఫండ్స్తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్ఫండ్స్కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఏ ఫర్ ఎటాక్... పీ ఫర్ పొక్లెయిన్?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్ చెప్పారు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనే కొటేషన్ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్ ఇంజన్ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్ వయసు డెబ్బయ్ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్ ఫీల్డ్ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్జెన్ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్ఫీల్డ్ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే. మయన్మార్ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్ జంగిల్ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్ ఎస్టేట్ మోడల్ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్ నిర్మాత కులీ కుతుబ్షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ఫీల్డ్ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.ప్రధాన డ్యామ్కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లుగా వ్యవహరిస్తారు.ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్ వాల్ కడతారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్ డ్యామ్లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్ డ్యామ్లను సగం కట్టి వదిలేశారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్ వాల్ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్ 11 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తయినట్టు అక్కడో పైలాన్ను ఆవిష్కరించారు.ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్లు పూర్తిచేయడానికి, స్పిల్ చానల్ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్ డ్యామ్లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్ వాల్ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్ నుంచి కోరుతూ వస్తున్నది.మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్ ఆల్, పీ ఫర్ పీపుల్’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్ ఎటాక్, పీ ఫర్ పొక్లెయిన్’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్మోహన్రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్మోహన్రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్సభ స్పీకర్ జీ.వీ. మావలంకర్ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. మూడు – స్పీకర్ గుర్తించాలి. ఈ స్పీకర్ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్పాట్ మీకు రోల్మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్బుక్ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్కింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే.... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు. షర్మిల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు. తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి. చంద్రబాబు నాయుడు వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది. ఈ ఛాలెంజ్ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే! పురందేశ్వరి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్ వైస్రాయ్కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది. బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. షర్మిల తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్ జగన్లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు. చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్. రెండోది జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్కు చెందిన ప్రైవేట్ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి. కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా! చంద్రబాబునాయుడు అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్–స్టేషన్లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది! యెల్లో కార్డ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగితే జగన్ ఖండించలేదట. మణిపుర్ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు. బీజేపీకి జగన్ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఎంజీఆర్ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్ హుందాగా స్పందించారు. రెడ్కార్డ్ చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పెత్తందారుకు టిప్పర్ సవాల్!
మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్న మాట కూడా నిజం. ఈ కుల–వర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం. అవమానాలను మోసే స్థానం. ఈ విభజన సత్యాన్ని గుర్తించే సాహసం మన రాజకీయ నాయకులు చస్తే చేయరు. ఆ సత్యం మీద మసిపూసి మాయం చేస్తారు. అందరి క్షేమం తమ ధ్యేయమంటారు. సకల జనుల శ్రేయోరాజ్యం తమ ఆశయమంటారు. సర్వేజనాః సుఖినో భవన్తని ఆశీర్వదిస్తారు. అభివృద్ధి–సంక్షేమం తమకు రెండు కళ్లంటారు. ‘పేదల కోసం సంక్షేమం, పెద్దలతోనే అభివృద్ధి’ అనే చిత్ర రచన చేస్తారు. పేదలకు తిండి దొరకని పరిస్థితిని ఈ సంక్షేమం అరికట్టగలిగింది. లేబర్ మార్కెట్ నిక్షేపంగా నిలబడేందుకు ఈ సంక్షేమాన్ని మన పాలకులు వెదజల్లుతారు. ఐదు రూపాయలకే భోజనం పెట్టేంత అపురూపమైన ఔదార్యాన్ని కూడా మన పాలకులు కనబరుస్తుంటారు. అది బాల్యవివాహమైనా సరే ఓ పాతిక వేలు సర్కారీ కట్నం చదివించి మంచి మనసును చాటుకుంటుంటారు. బాల్యవివాహం వల్ల పిల్ల చదువు ఆగిపోయినా లెక్క చేయరు. హిందూ,ముస్లిం, క్రైస్తవులకు ఒక్కో పండుగ చొప్పున ఓ సంచెడు ఉప్పూ, పప్పూ, చక్కెర వగైరాలతో స్వయం పాకాన్ని అందజేస్తారు. పండు ముదుసళ్లను పదిసార్లు తిప్పించుకున్నప్పటికీ ఓ వేయి రూపాయలను పెన్షన్గా అందజేసేంత విశాల హృదయం మన సంక్షేమ పాలకుల్లో ఉన్నది. కానీ, పేదలు సాధికారత సంతరించుకునే అవకాశాలు వీరి కార్యక్రమంలో ఉండవు. ఈ తరహా రెండు కళ్ల సిద్ధాంత ‘సంక్షేమ’ పాలకుల్లో మన చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతంలో అభివృద్ధి – సంక్షేమం అనేవి రెండు సమాంతర రేఖలు మాత్రమే! ఒకదాన్నొకటి తాకదు. సంక్షేమం కోటాలోని జనం అభివృద్ధి కేటగిరీలోకి చేరిపోవడమనేది ఒక అరుదైన సన్నివేశం. లేబర్ మార్కెట్లోని ప్రజలు సంపన్న శ్రేణిలోకి చేరాలంటే వారికి నాణ్యమైన ఉచిత విద్య మొదటి షరతు. ఇక్కడే మన సంక్షేమ పాలకుల వర్గదృక్పథం బట్టబయ లయ్యేది. నాణ్యమైన ఉచిత విద్యకు మన పాలకులు ససేమిరా అంగీకరించరు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ముఖ్య మంత్రి హోదాలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. విద్యారంగాన్ని వ్యాపారస్తుల రేస్కోర్స్గా మార్చిన ఘనుల్లో నిస్సందేహంగా చంద్రబాబు అగ్రగణ్యుడు. విద్యాబేహారులకు ప్రభుత్వ పాలనలో పెద్ద పీట వేసినవాడు చంద్రబాబు. పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకుండా ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించాడో మనం చూశాము. నాణ్యమైన విద్యకు బదులుగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పు కొస్తున్నారు. పైగా దాన్ని తక్కువ ధరలకే అందజేస్తారట. ఇంకో రెండు రోజులు పోతే డోర్ డెలివరీ కూడా చేస్తామంటారేమో! మద్యం ఆరోగ్యానికి హానికరమైనదని వైద్యులందరూ చెబు తారు. నాణ్యమైన మద్యమైతే నెమ్మదిగా చస్తారు. నాసిరకం మద్యమైతే వెంటనే చస్తారని ఆయన భావం కావచ్చు. ఈ చంపే యడంలో నాణ్యతా ప్రమాణాలు దేనికి? ప్రజలను సాధికారం చేసే విద్యలోనూ, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే వైద్యంలోనూ నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వం పనికాదనీ, అది ప్రైవేట్ వ్యాపారుల క్రీడాస్థలమనేది చంద్రబాబు సిద్ధాంతం. అందువల్లనే ఆయన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలమై పోయాయి. ఈ రెండు వ్యవస్థల్లోనూ కార్పొరేట్ రంగం రంకె లేసింది. ఐదేళ్ల జగన్ పరిపాలన అందుకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాస్పత్రులు ఇప్పుడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 58 వేల ఉద్యోగ ఖాళీలను 58 మాసాల కాలంలో భర్తీ చేయగలిగారు. అంటే నెలకు వేయి ఖాళీల చొప్పున భర్తీ. ప్రభుత్వం ఎంత ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇది సాధ్యమవుతుంది? వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాస్పత్రులను ఆధునికం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో పీరియాడికల్గా ప్రభుత్వ వైద్యుడు పర్యటిస్తాడు. రోగగ్రస్తులందరి రికార్డు ఆయన దగ్గరుంటుంది. క్రమం తప్పకుండా ఆయనే వాళ్లను పరీక్షించి మందులిస్తాడు. ఆ రకంగా ప్రతి పేదరోగికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ను అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ విధానానికి ఈ ఐదేళ్లలోనే శ్రీకారం చుట్టారు. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. విద్య, వైద్య రంగాల్లో ఏ పాలకుని వైఖరి ఏమిటో తెలిస్తే ఆ పాలకుని వర్గ స్వభావమేమిటో చెప్పవచ్చు. చంద్రబాబు పుట్టుకరీత్యా పేదవాడే కావచ్చు. కానీ ఎత్తుజిత్తులతో పెత్తందారీ శ్రేణిలో చేరిన ఆయన ఆ వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక ఉగ్రవాదిగా మారిపోయాడు. ఇందుకు పూర్తి భిన్నంగా సంపన్న కుటుంబంలో పుట్టిన జగన్మోహన్రెడ్డి పేదల ఎజెండాను భుజానికెత్తుకున్నాడు. పేదవర్గాలు–మహిళల సాధికారతను తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాడు. సమాజంలోని రెండు వైరివర్గాల గురించి ప్రస్తావించడమే కాకుండా ఈ రెండు వర్గాల మధ్యన యుద్ధం జరుగుతున్నదనీ, ఈ యుద్ధంలో తాను పేద వర్గాల తరఫున అర్జునుడి పాత్ర పోషిస్తాననీ కూడా ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో క్లాస్ వార్ (వర్గ పోరాటం) గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే. కమ్యూనిస్టులు చెప్పే క్లాస్ వార్ వేరు. వర్గపోరు గురించి మాటలు చెప్పే కమ్యూనిస్టులు ఆచరణలో వర్గదృక్పథాన్ని కోల్పోయి ఉనికిని పోగొట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కమ్యూనిస్టులుగా ప్రకటించుకునే వారిలో కొంత మంది పెత్తందారీవర్గ ప్రవక్త చంద్రబాబు చుట్టూ చేరి చిడతలు వాయించే స్థితికి దిగజారిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పేదల విముక్తి కోసం క్లాస్ వార్కు పిలుపునిచ్చి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని జగన్మోహన్రెడ్డి సృష్టించారు. ఈ క్లాస్ వార్ మరో సారి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది. క్షేత్ర స్థాయి ప్రజా స్పందనల అంచనా ప్రకారం 2019 ఎన్నికల ఫలి తాలే పునరావృతం కాబోతున్నాయి. తాను పెత్తందారీ వర్గ ప్రయోజనాల కిరాయి మనిషిననే విషయాన్ని చంద్రబాబు తన చేతల్లోనే కాదు మాటల్లో కూడా పదేపదే వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే మొన్నటి టిప్పర్ ఎపిసోడ్. అనంతపురం జిల్లా సింగనమల నియోజక వర్గం నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన విద్యాధికుడైనప్పటికీ బ్రతుకుతెరువు కోసం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పార్టీ కార్యకర్తగా కూడా పని చేస్తున్న అతని సేవలను గుర్తించి జగన్మోహన్రెడ్డి అతడిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. పెత్తందారీ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు ఈ ఎంపికను అవహేళన చేస్తున్నారు. సింగనమలలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అనే మాటను పదేపదే వెటకారంగా ఒత్తి పలికారు. ఇటు వంటి నిశానీగాళ్లకు ఓటేస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతారని ఎద్దేవా చేశారు. అంటే పేదవాళ్లు అజ్ఞానులనీ, వాళ్లు రాజకీయాలకు అనర్హులనే అర్థంలో మాట్లాడారు. ఈవిధంగా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని మీడియా సమావేశంలోనే ఆయన తన మనస్తత్వాన్ని బయట పెట్టు కున్నారు. నాయీ బ్రాహ్మణ (బీసీ వర్గం) ప్రతినిధులను మీడియా సమక్షంలోనే ‘మీ తోకలు కత్తిరిస్తాన’ని బెదిరించారు. బీసీలకు జడ్జీ పదవులు ఇవ్వొద్దని, వారందుకు తగరని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికే ఆయన స్వయంగా లేఖ రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అని మహిళా విద్వేషాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. నాయకుడి నుంచి ఈ స్ఫూర్తిని తీసుకొని పేదవర్గాలపై ఆయన అనుచరగణం చేసిన దాష్టీకం అంతా ఇంతా కాదు. ఎన్నికల యుద్ధంలో తలపడకుండా పేద వర్గాలను, సంఘ సేవకులను దూరం చేసిన భాగ్యశాలి కూడా చంద్రబాబే. ఎన్టీఆర్ మరణానంతరం ప్రజాదరణ పెద్దగా లేని తాను నెగ్గుకు రావడం కోసం ఉపఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుపెట్టి సంచలనం సృష్టించారు. అప్పటినుంచీ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలవారినే నిలబెట్టడం మొదలుపెట్టారు. ఆయన్ను చూసి మిగిలిన పార్టీల వాళ్లు కూడా అంతో ఇంతో అనుసరించక తప్పలేదు. పెట్టుబడి – రాజ కీయాల మధ్యన ఉండే పరోక్ష బంధం నాటినుంచి ప్రత్యక్షంగా మారిపోయింది. వందల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచి పోవడమనే అప్రజాస్వామిక ధోరణికి గేట్లు తెరిచినవాడు చంద్ర బాబు. ఈ అక్రమార్జనపరులైన కోటీశ్వరులపై సామాన్యులు విజయభేరి మోగించినప్పుడే మళ్లీ మన సిసలైన ప్రజాస్వామ్యం మన చేతికొస్తుంది. టిప్పర్ డ్రైవర్గా చంద్రబాబు అవహేళన చేసిన వీరాంజ నేయులు సింగనమలలో విజయఢంకా మోగిస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుంది. మడకశిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్ప భారీ మెజారిటీతో నెగ్గితే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వికసిస్తుంది. చదువుల సరస్వతీదేవిని అంగడి సరుకుగా మార్చి లక్షలాది సామాన్యుల రక్తం తాగి తెగబలిసి వేలకోట్లు ఆర్జించిన నారాయణ నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తు న్నాడు. వందల కోట్లు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు. అతడితో తలపడుతున్న సామాన్యుడు స్వర్ణకార వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్ అహ్మద్ గెలిస్తేనే ప్రజా స్వామ్యం గెలిచినట్టు! అనకాపల్లి లోక్సభ సీటుకు సీఎం రమేశ్ పోటీ చేస్తున్నాడు. ఈయన మనిషి బీజేపీలో ఉంటాడు. ఆత్మ తెలుగుదేశంలో ఉంటుంది. స్నేహం కాంగ్రెస్తో ఉంటుంది. కాంట్రాక్టుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జన చేశాడని ప్రతీతి. చంద్రబాబుకు బినామీగా కూడా చెబుతారు. ఇప్పుడు ఎంపీగా గెలవడం కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకూ వందకోట్ల చొప్పున ఖర్చు చేస్తాడట! డబ్బు విసిరితే గెలుస్తామనే ధీమా. ప్రజల వివేకం మీద చిన్నచూపు. ఇతని మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర మంత్రి. పేరుకు మంత్రే కానీ,ఆర్థికంగా సామాన్యుడు. ఇప్పుడిక్కడ బీసీ వెలమ వర్సెస్ ఓసీ వెలమ, లోకల్ వర్సెస్ నాన్ లోకల్, సామాన్యుడు వర్సెస్ సంపన్నుడి మధ్యన పోటీ జరగబోతున్నది. సామాన్యుడు గెలి స్తేనే ధనస్వామ్యం తోక ముడుస్తుంది. ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఆ కంటెయినర్ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విలన్ డెన్లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్లో ఉండే విదూషక క్యారెక్టర్కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్నేహం కాదు, దాసోహం!
ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్సెన్స్ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్ విసరడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్టించుకున్న ‘ఇండియా’ బొంత ప్రతిపక్షాలకు స్ఫూర్తినివ్వలేక పోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సమరశీలతను కోల్పోవడం బీజేపీకి అయాచిత వరంగా మారింది. ఈ పరిస్థితు లలో తనకు ఏమాత్రం బలం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి రెండు సీట్లు గెలిచి తీరవలసిన అవసరం బీజేపీకి లేదు. ఈ ఎన్నికల్లో గెలవాల్సిన తక్షణ లక్ష్యంతోపాటు బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం కోసం అది వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఇది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బీజేపీ తొలి టార్గెట్ తెలంగాణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గురి తప్పినా 14 శాతం ఓట్లను సమీకరించుకోగలిగింది. గెలిచే అవకాశాలున్నాయన్న వాతావరణాన్ని ఎన్నికల ముందు సృష్టించగలిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం రెట్టింపు అయి వుండేదన్న అంచనా ఆ పార్టీకి ఉన్నది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న అంచనాతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. రాజకీయ పరిశీలకుల అభి ప్రాయాలు కూడా ఈ అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తేలిపోతుందని ఇటీవల లక్ష్మణ్ వంటి సీనియర్ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో గద్దెనెక్కిన మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ను ఈ నాయకుల మాటలు గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రయోగాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయగలిగితే బీజేపీ తన లక్ష్యాన్ని దాదాపుగా చేరు కున్నట్టే! తెలంగాణ షిండేకు పార్టీ తీర్థప్రసాదాలను ఇవ్వడం ఆ తర్వాత ఒక లాంఛనం మాత్రమే! లోక్సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడితే షిండే ప్రయోగం ప్రారంభం కావచ్చన్న అభిప్రాయం బలపడు తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే బీజేపీకి తన సహకారం అవసరమనే ఒక ప్రతిపాదన చంద్రబాబు ద్వారా ఆ పార్టీ పెద్దలకు చేరింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల కథ ముందుకు కదిలింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడి, బీజేపీ బలం పుంజుకుంటే ముందుగా ముప్పు ముంచు కొచ్చేది కాంగ్రెస్కే! తెలంగాణ భవన్లో స్విచాఫ్ చేస్తే గాంధీ భవన్లో చీకటి కమ్ముతుందన్నమాట!! తెలంగాణలో ఏక్నాథ్ ఎఫెక్ట్కూ, ఆంధ్రప్రదేశ్లో పొత్తు లకూ ఏమిటి లంకె? చంద్రబాబుకు బీజేపీ చేయగలిగిన ప్రత్యుపకారమేమిటి? బీజేపీ జతగూడితే చంద్రబాబు ఏపీలో గెలుస్తాడా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి తొంభై శాతం అవకాశాలున్నాయనుకుంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నూరు శాతం అవకా శాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 40 శాతం ఓటర్ల మద్దతు కనిపిస్తుంటే, ఏపీలో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటర్ల మద్దతు కనిపిస్తున్నది. డజన్కు పైగా జాతీయస్థాయి సర్వేలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. బీజేపీకి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. కానీ చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రాణావసరం. ఆయనకది జీవన్మరణ సమస్య. ఎన్డీఏ కూటమి తరఫున 400 సీట్లు, 50 శాతం ఓట్లు సంపా దించి రికార్డు సృష్టించాలని బీజేపీ పెద్దలు కలలు కంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏకి 45 శాతం ఓట్లు లభించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడిన సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలిచింది. 49 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి ఆ రికార్డుపై కన్నేసింది. అందు కోసం కలసిరాగల ప్రతి రాజకీయ పక్షాన్నీ తన దొడ్లో కట్టేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు విజ్ఞప్తిని మన్నించడానికి అది ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మరో ప్రత్యా మ్నాయం కూడా బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్నప్పటికీ, సైద్ధాంతికంగా బీజేపీ భావజాలానికి, రాజకీయ కూటమికి దూరంగానే ఉంటున్నారు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని ఎంజీ రామచంద్రన్ నుంచి నవీన్ పట్నాయక్ వరకు పలువురు ముఖ్య మంత్రులు అవలంబించి వారి రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడుకొచ్చారు. ఏపీ సీఎం జగన్దీ అదే వైఖరి. టీడీపీ వినతిని బీజేపీ నాయకత్వం అంగీకరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఫలించాలంటే వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ క్షీణించాలి. ఆ ఖాళీని మాత్రమే బీజేపీ ఆక్రమించగలదు. సాపేక్షంగా వైసీపీ యువ పార్టీ. పన్నెండేళ్ల వయసు. ఎదిగే దశ. యాభైశాతం ఓటుతో బలంగా ఉన్నది. పైగా అధికారంలో ఉన్నది. టీడీపీ అధినేతతో పోల్చితే వైసీపీ అధినేత వయసు పాతికేళ్లు తక్కువ. పాలనా సంస్కరణలు అమలు చేస్తూ, సామాజిక విప్లవాలను ఆవిష్కరిస్తూ, సరికొత్త శక్తులను పార్టీ నిర్మాణంలోకి సమీకరించుకున్నది. ఇప్పుడు మండే నెత్తురుతో ఆ పార్టీ ఇంజన్ నడుస్తున్నది. ఇందుకు భిన్నంగా టీడీపీ పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడింది. ఉపన్యాసాల్లో ఒక మాటకు బదులు మరో మాట చెబుతున్నారు. పార్టీలోకి కొత్త తరం రావడం లేదు. వచ్చినా ఒక సామాజిక వర్గం నుంచే వస్తున్నారు. పార్టీ నాయకత్వం బాగా బలహీనపడింది. అధినేత సొంత కొడుకుతో పాటు, బావమరిది కూడా అప్రయోజకులుగా ముద్ర పడ్డారు. ఆ కారణంగానే బాబు జైల్లో పడ్డప్పుడు అసలు వారసు లకంటే పవన్ కల్యాణ్ ఎక్కువ వీరంగం వేశారు. పార్టీ క్షీణ దశతో పాటు చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు పార్టీని గుప్పెట్లోకి తీసుకొని నెమ్మదిగా దాని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చు. గతంలో పలుమార్లు అవకాశ వాద పొత్తులతో బీజేపీని దగ్గరకు తీసుకొని, దాన్ని ఎదగనీయ కుండా బాబు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు దానికి బీజేపీ ప్రతీ కారం తీర్చుకోవచ్చు. ఈసారి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి కాబోతున్నది. ఏదో అద్భుతం జరగకపోతుందా? ఈ ఒక్కసారికి సూర్యుడు పడమటి కొండపై ఉదయించకపోతాడా? అనే ఆశ చంద్రబాబు, రామోజీ అండ్ గ్యాంగ్లో మిణుకుమిణుకుమంటున్నది. వారు తప్ప వివేకవంతులెవరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భావించడం లేదు. సర్వేలు మాత్రమే కాదు. క్షేత్ర వాస్తవికత కూడా అందుకు భిన్నంగా లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని పెత్తందారీ పోకడల కీళ్లు విరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయ స్రవంతిలోకి ప్రవేశిస్తున్నారు.ఒకటి కాదు,రెండు కాదు వరసగా మూడుసార్లు జగన్ సభలకు లక్షోప లక్షలుగా జనం హాజరయ్యారు. నేడు నాలుగో సభ పోటెత్తు తున్నది. రాజకీయ సభలకు ఈ స్థాయిలో జనం హోరెత్తడం వర్త మాన భారతంలో ఇంకెక్కడా మనకు కనిపించదు. వచ్చే ఎన్ని కల్లో జగన్ ప్రభంజనానికి ఇంతకంటే రుజువేమి కావాలి? మరోసారి అధికారం దూరం కాబోతున్నదన్న ఏడుపే కాదు, చేసిన పాపాలు శాపాలై కేసుల రూపంలో వెంటాడ బోతున్నాయన్న భయం బాబు, రామోజీలను నిద్రపోనీయడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన బాబు ఇప్పుడు బెయిల్పై బయటకొచ్చారు. ‘ముసలివాణ్ణి, ఆరోగ్యం బాగాలేదు, దయచూడండ’ని కోర్టువారిని బతిమాలు కొని బయటకొచ్చి తిరుగుతున్నారు. అమరావతి ప్రాంతాల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 1500 ఎకరాల అసైన్డ్ భూమిని కొల్లగొట్టిన కేసు తలపై వేలాడుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వప్రయోజనాల కోసం అష్టవంకర్లు తిప్పిన కేసు. నిబంధనలను అటకెక్కించి ఫైబర్నెట్ను బినామీకి అంటగట్టిన కేసు. చేలాగాళ్ల డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులిచ్చిన కేసు. ఇసుక కుంభకోణంలో పదివేల కోట్లు దోచేసిన కేసు... ఇలా వరుసగా అనేకం చంద్రబాబును వెన్నాడుతున్నాయి. ప్రతి కేసులోనూ చంద్రబాబు మీద పలు సెక్షన్లు నమోద య్యాయి. వాటిలో సీఆర్పీసీ 409 సెక్షన్ కింద నేరం రుజువైతే ప్రతి కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టం 13 (2) రెడ్ విత్ 13 (1) సీ, డీ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఒక్కో కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. 17ఏ సెక్షన్ సాయంతో తప్పించుకోవాలనే చంద్ర బాబు ఎత్తు పారలేదు. ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. చంద్రబాబు మీద నమోదు చేసిన అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు న్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆధారాలున్నందువలన కేసు కొట్టి వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పేర్కొ న్నది. బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. హరిహర బ్రహ్మాదులొచ్చినా ఆపలేరు. కానీ బీజేపీ వాళ్లు ఆపగలరని చంద్రబాబు దింపుడుకళ్లం ఆశ. అందుకే వారి ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కేసులే దడ పుట్టిస్తుంటే ముగిసిపోయిందనుకున్న ఐఎమ్జీ కేసు ముందు కొచ్చింది. సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా? మమ్మల్ని ఆదే శించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించడం బాబు క్యాంపులో గుబులు రేకెత్తిస్తున్నది. ఒకవేళ దర్యాప్తుకు ఆదేశిస్తే అచ్చం అలాంటిదే సింగపూర్ ప్రైవేట్ కంపె నీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా కుంభకోణం తెరమీదికొస్తుంది. దాని మీద విచారణ తప్పదు. గత మూడు రోజులుగా యెల్లో మీడియాలో కామెడీ షో నడుస్తున్నది. చివరి రోజు స్వయంగా చంద్రబాబే టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆ షోను కొనసాగించారు. ‘బాబ్బాబూ! మాక్కొంచెం ఎక్కువ సీట్లు దానం చెయ్యవా ప్లీజ్...!’ అని అమిత్ షా, నడ్డాలు బతిమాలుకున్నారట. ‘ఛస్తే కుదరదు, ఇచ్చింది తీసు కోండి, ఎక్కువ సీట్లిస్తే మీరు గెలవర’ని బాబు గట్టిగా చెప్పా రట! అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామా లను వారికి వివరించారట. ఆర్థికశాస్త్రాన్ని వారికి బోధించారట. చివరికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తును కుదుర్చుకుంటున్నట్టుగా వివరించి షా, నడ్డాల కళ్లు తెరిపించారట! బాబు విషయ పరిజ్ఞానానికి వారు అబ్బురపడిపోయారట. చివరికి బీజేపీ, జనసేనలకు కలిసి 8+30 సీట్లను బాబు అనుగ్రహించ డంతో వారు సంతృప్తి చెందారట! అమావాస్య తర్వాత సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటిస్తారట! ఆ తర్వాత మన యెల్లో మీడియా బాబు విజయో త్సవాలు పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. జయజయ మహావీర మహాధీర ధౌరేయ....... వంటి గద్యాలను రోజుకొకటి చొప్పున వినవలసి రావచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై బీజేపీ వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఒక్క సీటు కూడా తాము గెలవబోవడం లేదనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. వారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒకటి రెండు సీట్లు కాదు. మొత్తం పార్టీయే వాతాపి జీర్ణం. రాజకీయ చరమాంకంలో కూడా చంద్రబాబు అండ్ కో ప్రదర్శిస్తున్న అతిశయాన్ని చూస్తే మాత్రం దిగ్భ్రాంతి కలుగుతున్నది. తాను కేసుల నుంచి బయటపడేందుకు కాళ్ల మీద పడి పొత్తు కుదుర్చుకున్నారని లోక మంతా తెలుసు. కానీ దానికి ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అనే ముసుగు వేయడం, దాన్ని యెల్లో మీడియా విస్తృతంగా ప్రచా రంలో పెట్టడం మాత్రం ఏవగింపు కలిగిస్తున్నది. చంద్ర బాబుకు, రామోజీకి పడిసెం పడితే తెలుగు ప్రజలంతా తుమ్మా లన్నట్టుంది ఈ వ్యవహారం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
యెల్లో సేనలు డీలా!
పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు... ఇలా! పేరేదైనా సరే పెత్తందార్ల దోపిడీకి కాపుకాయడమే ఆ రాజు పని. భయంకరంగా కనిపి స్తున్నాడని వాడికి భయపడితే పేదల బతుకులు ఎప్పటికీ మారవు. మన ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ విషసర్పపు కోరలు పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. పేద పిల్లలకు బంట్రోతు చదువులు... సంపన్నులకు దొరబాబు చదువులా? ఎన్నాళ్లీ దుర్నీతి? ఇది ప్రజాస్వా మ్యమా... పెత్తందారీస్వామ్యమా?... ఇన్నాళ్లూ పెత్తందారీ స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది. ఈ దుష్పాలన ఇంకానా... ఇకపై చెల్లదని ఐదేళ్ల కింద జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లోని అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేదవర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన ‘మాగ్నాకార్టా’ను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తున్నది. రెండేళ్లు కోవిడ్ కోతకు గురైన ఈ అయిదేళ్ల పదవీ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒకపక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు కూడా అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధిరంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో పది పదిహేనేళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నదని పలువురు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుపట్టేవారు. ‘గుడ్ ఫిలాసఫీ బట్ బ్యాడ్ ఎకనామిక్స్’ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కదానిపైనా ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ‘గుడ్ ఫిలాసఫీ అండ్ గుడ్ ఎకనామిక్స్’గా పరిగణన పొందాయి. అందువల్లనే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశి స్తున్నది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వలన రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. అతి భయంకరుడూ, గండర గండడనుకున్న పెత్తందారులను తరిమికొట్టొచ్చన్న భావన బల పడుతున్నది. ఈ పెత్తందారీ శిబిరానికి తెలుగు నాట కాపలా దార్లయిన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగైరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నది కదా! మరి వాళ్లెట్లా పెత్తందారీ వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగవచ్చు. చంద్రబాబు పార్టీది పూటకూళ్ల సంక్షేమ సిద్ధాంతం. అన్న క్యాంటీన్లు, అక్క క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగేది తాత్కాలిక ఉపశ మనమైతే దాన్ని కంటితుడుపు సంక్షేమమంటారు. తాత్కాలిక ఉపశమనంతోపాటు లబ్ధిదారుని అభ్యున్నతికీ, సాధికారతకూ ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్ చేస్తే అది మానవాభి వృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు. పద్దెనిమిది వేల అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని ‘కల్యాణమస్తు’ పేరుతో జగన్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 యేళ్లు, వరుడికి 21 యేళ్లు వయఃపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. దాంతో పాటు పదవ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది. అందువల్ల తప్పనిసరి టెన్త్ పాసవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో మూడేళ్ల గడువుంటుంది. ఇంటర్ వరకూ ‘అమ్మ ఒడి’ కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు కచ్చితంగా ఇంటర్ కూడా పూర్తి చేస్తారు. డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారి కాళ్ల మీద నిలబడటానికి తోడ్పతే విధంగా డిజైన్ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే! జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్మెంట్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాల ప్రజలు కూడా పెద్ద వారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నతస్థాయి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్య మైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది. చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్య క్రమాలను అమలుచేస్తూ ఆర్బీకే సెంటర్ల పేరుతో గ్రామ గ్రామానా ఊతకర్రలను నిలబెట్టింది. పేదవర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధమ్యాలు చంద్రబాబు సర్కారులో కని పించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్ పాయింట్ ఎజెండా. అదో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. కాంట్రాక్టర్లకూ, పెట్టుబడులు పెట్టిన పెత్తందార్లకూ మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్ను కట్టి అందులో 30 శాతం కమిషన్ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్గా మార్చు కున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. కమిషన్ల కక్కుర్తికి ప్రతిష్ఠా త్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పనుల్లో అవాంఛ నీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు. ఇదొక్కటే కాదు ఆయన ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల భారీగా లబ్ధిపొందిన వారు ఆయన, ఆయన ఆంతరంగికులు, కాంట్రా క్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్లు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల లబ్ధి పొందినవారు రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాల ప్రజలు. ఈ ప్రాధమ్యాల కారణంగానే జగన్ ప్రభుత్వానికి ‘పేదల ప్రభుత్వం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, యెల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీషు మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేదవర్గాల భవిష్యత్తును సుంద రంగా మార్చివేస్తాయి. జగన్ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కీ తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి. వ్యవసాయ విధానాలు సాగుబాటను సంపన్నం చేస్తాయి. ఈ విధా నాలను వ్యతిరేకిస్తున్నారు కనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తున్నది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్మోహన్రెడ్డి పేదవాడా? ఆయనది పేదల ప్రభుత్వం ఎట్లా అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా, పేద వాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధా నాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేదే ముఖ్యం. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే! చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే! రాష్ట్రంలోని పేదవర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడు తున్నది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షో భంలోకి కూరుకొని పోయింది. జనసేన పార్టీని తన ప్రయో జనాలకోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం మూడో వంతు సీట్లయినా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకొని పోయారు. ఈ రెండు పార్టీల బలంతోనే జగన్ పార్టీని ఎదుర్కో లేమనీ, బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్లు తనవంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ ద్వారా లాబీయింగ్ నడిపిస్తున్నారు. అదేకాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు. పరిస్థితులను గమనిస్తుంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబు – పవన్ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్ భాగస్వామి పాత్ర పవన్ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీరోపన్యాసాలు చేశారు పవన్? వాళ్లు ‘సిద్ధం’ అంటే మేము ‘యుద్ధ’మని మొన్ననే ఆయన గర్జించి నట్టు కూడా గుర్తు. ఒకసారెప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు ‘సీఎం... సీఎం’ అనే నినాదాలు చేశారు. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏమిటి? ‘మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని. ఇప్పుడెలా అడుగుతామ’ని అశక్తతను ప్రకటించాడు. ఇప్పుడు కూడా అంతే! 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో పావలా పర్సెంట్ గెలిచినా 6 సీట్లే. కనుక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే అయిదేళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు కనుక! రెండు పార్టీలూ కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వుడు సీట్లు న్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే! బీసీ ఓట్లు పూర్తిగా దూరమైనట్టే! అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పవన్ కల్యాణ యితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు. కేటాయించిన 24 సీట్లలో ఐదుగురి పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం, ఆయన ముఖకవళి కల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా ఉండేందుకే కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గానీ, చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంతమాత్రమూ బలాఢ్యుడు కాదు. అతడొక గాలి తీసిన బెలూన్ మాత్రమే. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అబద్ధాలే ఆయుధాలు!
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది. ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ఫ్రంట్స్ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది. పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు. ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షౌహిణులు సిద్ధం!
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్మోహన్రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్రెడ్డి. ‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్ను రాష్ట్ర కాంగ్రె స్కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్ను ప్లస్గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
షణ్ముఖ కూటమి... సిద్ధమా?
ఒకే ఒక్కడు సిద్ధం! ‘జో జీతా వొహీ సికిందర్’ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలి కింది. ఏమా జనం? లక్షలాది నింగి చుక్కలు ఒక్కచోటనే రాలిప డ్డట్టు లేదూ! బీదాబిక్కీ జనం, బడుగు బలహీనవర్గాల ప్రజలే వారంతా! తమ జీవితాలకు గొడుగు పట్టిన జగన్మోహన్రెడ్డి జైత్రయాత్రకు తాము సైతం అన్నట్టుగా తరలివచ్చారు. యుద్ధా నికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో వారంతా శ్రుతి కలి పారు. జన హోరుపై గౌరవంతో సముద్రుడు తన కెరటాలను అవనతం చేశాడేమో! జన సాగర సందడిలో అలల చప్పుడు వినిపించలేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్ధమ య్యారు సరే! మరి ప్రత్యర్థుల సంగతి? ఆ ప్రత్యర్థి ఏకవచ నమా? బహువచనమా అనే సందేహం అవసరం లేదు. బహు వచనంగా కనిపించే ఏకవచనం. చంద్రబాబు బహురూపి. ఒక రూపం నుంచి మరో రూపంలోకి పాదరసంలా ప్రవహించగల నేర్పరి. పాదరసం ఒక లోహం. కానీ సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో కనిపిస్తుంది. ఈయనా అంతే – ద్రవరూపంలో కని పించే ఒక లోహ విశేషం. ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ఆరు రూపాల్లోకి ప్రవహించారు. ఇందులో కొన్ని పాత రూపాలే. కొన్ని కొత్తవి. ఆరు ముఖాల వాడిని సంస్కృతంలో షణ్ముఖం అంటారు. తమిళ సంప్రదాయంలో ఆర్ముగం అంటారు. ఇప్పుడు మన ఆర్ముగం చంద్రబాబు ఆరు ముఖాలతో ఆరు శిబిరాలను తన కోసం సన్నద్ధం చేసుకున్నారు. ఇందులో మొదటి ముఖం తనదైతే, రెండోది యెల్లో మీడియా లీడర్ రామోజీది. వీరిద్దరు సియామీ కవలలు. ఇద్దరిలో ఎవరిది ఒకటో నెంబరో తేల్చడం కష్టం. పొలిటికల్ ఫేస్ కనుక బాబునే ఒకటి అనుకుందాం. ఇక మూడో ముఖం జగమెరిగిన జనసేనాధిపతి. తన కోవర్టుల సాయంతో కబ్జా చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ నాలుగో ముఖం. తాను కొనుగోలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఐదో ముఖం. ఈ సిక్ యూని ట్ను ‘కొనుగోలు’ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ‘కనుగోలు’ సేవలు ఉచితంగా లభిస్తాయట! ఇక సందర్భాన్ని బట్టి తనకు ఉపయోగపడే పనులు చేసిపెడుతూ, అప్రకటిత ఓఎస్డీగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖ ఆరో ముఖం. ఇందులో ఎవరికి నిర్దేశించిన పాత్రను వారు పోషిస్తూ చంద్రబాబుకు తోడ్పాటునందిస్తుంటారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే చంద్రబాబు, యెల్లో మీడియాలు తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి నుంచే జగన్ సర్కార్పై యెల్లో మీడియాలో దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. కాకపోతే ఆరు శిబిరాలను సమయాత్తం చేసి ఆరు ముఖోటాలను తగిలించడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు షణ్ముఖ కూటమి సిద్ధమైంది. షడ్యంత్రం కూడా ఎప్పుడో సిద్ధమైంది. ఆరు రకాల మాయోపాయాలను ఉప యోగించి నడిపే కుట్రను ‘షడ్యంత్రం’ అని పూర్వం అనేవారు. శాస్త్ర ప్రకారం చేసే కుతంత్రమన్నమాట. మన ఆర్ముగం మాస్టారు ఆరు రకాలేం ఖర్మ... అరవై రకాల మాయోపాయాలను ఏకకాలంలో ప్రయోగించగల నేర్పరి. కీలకమైన ఆరు మాయలను చెప్పాల్సి వస్తే దాంట్లో మొద టిది మోసం లేదా వెన్నుపోటు లేదా నమ్మకద్రోహం. గూగుల్ ఇమేజెస్లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే వచ్చే బొమ్మల్లో 90 శాతానికి పైగా చంద్రబాబు బొమ్మలే కనిపిస్తాయి. అకడమిక్ ఆసక్తి ఉన్నవారెవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెన్నుపోటు కేటగిరీలో బాబు, యెల్లో మీడియాలు యూనివర్సల్ పేటెంట్ హోల్డర్లు. మిగిలిన నాలుగు ముఖాలకు కూడా తరతమ భేదా లతో ఈ లక్షణం ఉన్నది. మాయోపాయాల్లో రెండోది – దుష్ప్ర చారం లేదా గోబెల్స్ ప్రచారం. తప్పుడు ప్రచారాలకు ఆది గురువుగా పేరొందిన గోబెల్స్ మహాశయుడు ఇప్పుడు కనుక బతికి వుంటే యెల్లో మీడియా బడిలో మరోసారి ఓనమాలు దిద్దుకునేవాడు. యెల్లోమీడియా ఘనత ఈ రంగంలో దిగంతా లకు వ్యాపించింది. మూడో మాయోపాయం – అవకాశవాద పొత్తులు. నాలు గోది – వ్యవస్థలను దురుపయోగపరచడం. ఐదవది – పార దర్శకత లేమి. ఆరవది – గోముఖ వ్యాఘ్రంలా పెత్తందారీవర్గ స్వభావాన్ని దాచిపెట్టడం. ఈ ఆరు లక్షణాల్లో చంద్రబాబుకు, యెల్లో మీడియాకు ఉన్న ప్రావీణ్యతను గురించి కొత్తగా చెప్పన వసరం లేదు. వీరు కూడగట్టుకున్న కొత్త మిత్రులందరిలోనూ ఈ లక్షణాలు అంతో ఇంతో కనిపిస్తాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకొక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలు మార్లు రుజువైంది. మాట నిలకడ లేదని కూడా ఆయన పదేపదే నిరూపించుకుంటున్నారు. ఒక నమ్మదగిన నాయకుడుగా స్థిరపడలేకపోయాడు. చంద్రబాబు ప్రయోజ నాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శిస్తారు. అదొక సహజ వ్యతిరేకత. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఓట్లు పరోక్షంగా తనకు లభించేట్టుగా పన్నిన కుతంత్రమేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశమే ఎక్కువ. పవన్ కల్యాణ్ పార్టీని ఎన్టీఏ కూటమిలో చేర్పించడం కూడా చంద్రబాబు వ్యూహమేనని తెలియని వారెవరూ రాష్ట్రంలో లేరు. తన పార్టీ ఎంపీలను, పైరవీకార్లను కూడా బీజేపీలో చేర్పించింది చంద్రబాబేనన్న సంగతి జగమెరిగిన సత్యమే. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే మాత్రం లోకానికి నిజం తెలియకుండా ఉంటుందా? గడిచిన ఎన్నికల్లో జరిగిన దారుణ పరాభవంతో బాబుకు జ్ఞానోదయమైంది. రాష్ట్రంలో యాభై శాతం ఓట్లను అప్పటికే స్థిరపరచుకున్న జగన్తో పోరా డాలంటే తన బలం సరిపోదనీ మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలనీ ఆయనకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే కాదు, జగన్ అను కూల ఓటర్లలో కూడా ఏదో ఒకరకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనల్లోంచే ఈ షణ్ముఖ కూటమి పుట్టింది. బీజేపీలో చేరిన బాబు కోవర్టులు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కల్యాణ్ల ప్రయత్నాలతో పాటు తన పాత పరిచ యాలతో చేసిన లాబీయింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్రశాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలిగా వచ్చారు. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఆ వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబు మార్చేసు కున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దానితోపాటు ఈగలు తోలుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరి పించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలిగా వేయించుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిశోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియా చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డీకే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డీకేకూ, చంద్రబాబుకూ దోస్తీ కుదిరింది. ఆ దోస్త్ ద్వారా రాయ బారం నడిపి, షర్మిలను ఇక్కడికి డిప్యుటేషన్ వేయించుకున్నా డని కాంగ్రెస్ వర్గాల భోగట్టా.. దీన్నే చావు తెలివితేటలంటారు. ప్రభుత్వ అనుకూల వోటును ఎంతోకొంత చీల్చడం కోసం కాంగ్రెస్ కొంపను బాబు అద్దెకు తీసుకున్నారు. నెగిటివ్ ఓటును చీల్చడం సాధ్యమవు తుందేమోగానీ పాజిటివ్ ఓటును చీల్చలేమన్న కనీస అవగా హన అనుభవజ్ఞుడైన బాబుకు లేకపోవడం ఒక విషాదం. విశ్వస నీయతను కోల్పోవడంలో పవన్ కల్యాణ్ కంటే పదిరెట్ల వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై ఆమె వ్యక్తం చేసిన విరుద్ధ అభిప్రాయాలు వింటే చాలు, ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతా లేదనే విషయం ఎవరికైనా అర్థమ వుతుంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేకపోయినా చంద్రబాబు పడుతున్న పాట్లను వివరించడానికే ఈ ప్రస్తావన! అంతకన్నా ప్రాధాన్యత లేదు. సీపీఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అదొకప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం పోరాడిన పార్టీ. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తుంటే టీడీపీ పలురకాలుగా అడ్డుపడింది. ఆ పార్టీకి సీపీఐ వంతపాడటం విచిత్రం. ఈ అయిదేళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ షణ్ముఖ కూటమి ఆపసోపాలు పడుతున్నది. ఆయన చేసిందేమిటి? ఆయన ఎటువంటి వ్యక్తి! ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయ చరి త్రలో ఏ నాయకుడి మీద జరగనంత దుష్ప్రచారాన్ని జగన్ మీదా యెల్లో మీడియా సాగించింది. వ్యక్తిత్వ హననానికి ఉండ వలసిన హద్దులన్నీ చెరిపేసి బర్బర మనస్తత్వాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కయి ఒకే ఒక్క యువకుడిని వేధించడం, రాజకీయ అంకురాన్ని మొలకెత్తకుండా కేసులు పెట్టడం, పదహారు నెలలు జైల్లో ఉంచడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అవి తప్పుడు కేసులనీ, రాజకీయ కేసులనీ అర్థం కావడానికి మనిషికి కామన్ సెన్స్ ఉంటే చాలు. జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లమని గులామ్నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన అప్పట్లో సోనియా గాంధీ కోటరీలోని ముఖ్యవ్యక్తి. ముఖ్యమంత్రిని చేయనందుకే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని అప్పట్లోనే దుష్ప్రచారాన్ని సృష్టించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సంతకాలు సేకరించారని ఓ అభాండం వేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న యువకుడిపై ఇటు వంటి అమానవీయ దాడి చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి. ఆయనకు సంతకాల సేకరణతో ఎటువంటి సంబంధం లేదని అప్పట్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ ఇంట ర్వ్యూలో భట్టి విక్రమార్క కూడా ఈ ఆరోపణను నిర్ద్వంద్వంగా ఖండించారు. రోశయ్యను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నిండు పేరోలగంలో ప్రతిపాదించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డే అనే సత్యాన్ని దాచేస్తే దాగుతుందా! ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం. ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం! తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికి ముప్పయ్యారేళ్ల వయసున్న జగన్మోహన్రెడ్డి తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాల సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నిండు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను ఆయన వేసుకున్నారు. ‘పదవులూ, అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యమ’ని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కష్టాల పాలవుతావని నాయకత్వం హెచ్చరించింది. ఖాతరు చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా పదేళ్లపాటు కష్టాలు కడగండ్లతో కూడిన కడలిని ఈదవలసి వచ్చింది. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. పదేళ్లలో ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయననొక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనాదక్షునిగా తీర్చిదిద్దింది. షడ్ యంత్రాన్ని తిప్పికొట్టగల ఆరు అద్భుతమైన లక్షణాలు ఆయన అయిదేళ్ల పాలనలోంచి మనం గ్రహించవచ్చు. విశ్వస నీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్య – ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం. ఈ లక్షణాలు ఫలితాలివ్వడం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతు న్నది. నిన్నటి భీమిలి సభలో అదే ఆత్మవిశ్వాసం సమర శంఖం పూరించింది. ‘వైనాట్ 175?’ అని ఆ విజయశంఖం ప్రశ్నించింది. ‘యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా?’ అని ఆ సింహ నాదం ప్రశ్నించింది. సిద్ధం.. సిద్ధం.. సిద్ధం – లక్షలాది గళాల్లో ఓ తారకమంత్రం మార్మోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దగుల్బాజీ పాత్రికేయం!
కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించడానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ? మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది? మీరు సింపతీ కోసం లీక్ చేసిన పడక సీన్ ఫోటోలను చూసి ఉన్నప్పటికీ... మిమ్మల్ని తిట్టకుండా ఉండటం సాధ్యం కావడం లేదు. ఇది ఒక్కడి తహతహ కాదు. లక్షలాదిమంది మానసిక స్థితి. ఉన్మత్త ప్రేలాపనలతో మీరు అచ్చొత్తి ఫ్రీగా పంచుతున్న మీ అశుద్ధ పత్రికను చదివిన పాఠకులు అస్వస్థతకు గురవుతున్నారు. మీ కడుపు నొప్పితో, మీ కక్కుడు పారుడు రోగంతో జనసమూ హంలో జుగుప్సాకర వాతావరణాన్ని తయారు చేస్తున్నారు జీ. మంచిది కాదు జీ. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కుతంత్రాన్ని పన్నుతున్నారో ఆ ప్రయోజనం నెరవేరేది కాదని మీకు తెలియదా? అయినా... ఏమో గుర్రం ఎగరకపోతుందా అనే దింపుడు కళ్లం ఆశతో ఇంత దిగజారుడుతనం వాంఛనీయం కాదు జీ! మీ పేరు చివర జీ అక్షరం వింతగా ఉన్నది జీ. అది పెట్టుడు పేరో, దత్త పేరో తెలియదు గానీ అందులో తెలుగు దనం, తెలుగు సంప్రదాయం లేదు జీ. ‘తెలుగు భాష కోసం పుట్టిన ఏకవీర నేనే’నని తమరు వీరతాళ్లు వేయించుకుంటారు కదా! ఈ మరాఠీ సంప్రదాయ పేరు అందుకు నప్పలేదు జీ. ఇంగ్లిషు పదాలకు మీ విషపత్రికలో చేసే తెలుగు అనువాదా ల్లాగే ఉన్నది. ‘పిల్లి కాదు మార్జాలం’ అన్నట్టుగా ‘కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్’ అన్నట్టుగా మీ పత్రిక అనువాదాలుంటాయి. ఇదీ అలాగే ఉన్నది. దగుల్బాజీ అనే మాట పారశీక సంప్రదాయం నుంచి వచ్చిందేమో కానీ శతాబ్దాల కిందనే తెలుగులో కలిసిపోయింది. కనుక చివర్లో జీ ఉన్నప్పటికీ అది తెలుగు మాటగానే రూపాంతరం చెందింది. ఆ మాటను జనసామాన్యం యథేచ్ఛగా వాడేస్తున్నప్పటికీ దాని అసలు అర్థం మోసగాడు అనే! ఈ పేరేదో బాగా అతికినట్టున్నది. చూస్తారా? మీరు మోసగాళ్లే కదా జీ. అలా అని పలు సందర్భాల్లో కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయిగదా జీ! ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించినట్టు న్నారు కదా! జీజే రెడ్డి సహకారంతో మీరు వ్యాపారంలో వేసిన తొలి అడుగుల్లో మోసం లేదా? యాభయ్యేళ్ల కింద మీరు విశాఖపట్నంలో ‘ఈనాడు’ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని నమ్మి భూమి లీజుకిచ్చిన ఆదిత్య వర్మకు మీరు చేసిందేమిటి? మోసమే కదా! అది రుజువైంది కదా! దాన్ని దగుల్బాజీ వ్యవ హారం అంటారా అనరా? పైగా వర్మ భూమిని కొంతభాగం రోడ్డు విస్తరణకు అప్పగించి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమరు కైంకర్యం చేయలేదా జీ! దీన్నేమంటారు? ఈ వ్యవహారంలో మీ మీద ఫోర్జరీ కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించలేదా? ఫోర్జరీ కూడా మోసమే కదా! సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫిలిం సిటీలో వేలాది ఎకరాల భూమిని మీరు పోగేశారని రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదా? అది మోసం కాదా? ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని కూడా భోంచేశారు కదా! చిట్ఫండ్ పేరుతో ఫిలింసిటీలో ఉన్న 137 ఎకరాల భూమి చట్టప్రకారం చందాదారులకు దక్కాలి కదా? మీరెందుకు చంకలో పెట్టుకున్నారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మీరు వసూలు చేసిన 2600 కోట్ల డిపాజిట్లు మోస పూరితమైనవిగా రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయా, లేదా? చిట్ఫండ్స్ పేరుతో మీరు మోసగించారని చందాదారులు ఫిర్యాదులు చేశారా, లేదా? సీఐడీ కేసు నడుస్తు న్నదా, లేదా? ఇంకా చెప్పాలా? అబ్బబ్బ... తనువంతా ఇన్ని మచ్చలేంది స్వామీ? పైగా వేరొకరిపై నిత్యం అభాండాలా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా? ఎన్టీ రామారావు ఏమన్నారు? మీ పత్రిక ఓ చెత్త కాగితాల కట్ట. మీరు గోబెల్స్ను మించిన దుష్ప్రచారకులు. తిమ్మిని బమ్మిని చేయడమే మీ నైజం. చివరికి మీరు చరిత్ర పెంట కుప్పలోనే మిగిలిపోతారు. అవే మాటలు కదా ఆయనో ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఘడియలు తరుముకొచ్చి నట్టున్నాయి కదూ! అనారోగ్యంతో మంచం మీద ఉంటే మా నాన్న కాగితాల మీద సంతకాలు తీసుకున్నారనీ, నానా మాటలు అన్నారనీ స్వయంగా మీ కుమారుడే చెప్పిన విషయం మర్చిపోయారా? మీ విశ్వసనీయతకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకేముంటుంది? ఇంతటి ఘనత వహించిన తమరు చిత్తం వచ్చినట్టు కాకమ్మ కథలు చెబితే జనం నమ్ముతారా? ఈ కాకమ్మ కథలనూ, కనికట్టు రాతలనూ ఎవరూ ఊహించలేని అధమాధమ స్థాయికి తీసుకెళ్లారేమిటి జీ? పత్రికా ప్రమాణాల పాతాళం డైవింగ్లో మీ రికార్డులను మీరే బద్దలు కొట్టారు. హుర్రే! ఈ ఫీట్ ఇంకెవడి వల్లా కాదు. ఈ వయసులో అదేదో బూస్టర్ గోళీ వేసుకున్నట్టు ఇంత ఉన్మత్త ఆవేశమేమిటో? కారణముందిలే! అసలే జగన్మోహన్రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయన పేద వర్గాల రాజకీయ ప్రతినిధి. తమరు పెత్తందారీ వర్గాల కులగురువుగా నేమ్ ప్లేట్ను వాకిట్లో తగిలించుకున్నవారు. అయిదేళ్లుగా మీ వర్గం ఆటలు సాగడం లేదు. మీ కాకమ్మ కథలు పండటం లేదు. పేదలకు చదువు చెబుతున్న సర్కారు బళ్లు ఆధునికతను సంతరించు కున్నాయి. మీ పెత్తందారీ వర్గ పిల్లలతో సమానంగా పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోగలుగుతున్నారు. నాణ్యమైన వైద్యం పేదల ఇంటి ముంగిట్లోకి వచ్చింది. కార్పొ రేట్ వ్యాపారులకు సెగ తగిలింది. చిన్న రైతులకు వ్యవ సాయం గిట్టుబాటు కావడం మొదలైంది, లాభాల బాట వైపు కూడా పయనం ప్రారంభమైందని దేశదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి చూస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో సామాన్య మహిళలు సైతం సంపద సృష్టిలో పాల్గొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. రిటెయిల్ వ్యాపారం అనూహ్య లాభాలనార్జిస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు దేశంలోనే అగ్రస్థానంలో పెరుగుతున్నది. కరోనా కాటేసిన కాలం పోగా మిగిలిన స్వల్పకాలంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. పెత్తందార్లు పంచుకు తినవలసిన సొమ్ము ప్రజల చేతుల్లో వృద్ధి పొందుతున్నది. జగన్మోహన్రెడ్డి మీద పెత్తందారీ వర్గా నికి కంటగింపు కలగడానికి ఈ కారణాలు చాలవా? తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి గురు పత్రిక నాయకత్వంలోని యెల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం కనిపించడం లేదు. నిరాశా నిస్పృహలతో ఆ మీడియా హద్దుల్ని దాటేస్తున్నది. మర్యాదలను అతిక్రమిస్తున్నది. సంప్ర దాయాలను చాపచుట్టేసింది. కనీస ప్రమాణాలను కూడా అటకెక్కించింది. గజ్జి సోకిన గ్రామ సింహాల్లా యెల్లో మీడియా వర్తిస్తున్నది. వారి ఖర్మ కొద్దీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఇప్పుడే వచ్చింది. పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహం. ప్రపంచంలో అంబేడ్కర్ విగ్రహా లన్నిటిలోకీ పెద్దది. విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంత మైన బందర్ రోడ్డుపై పద్దెనిమిదిన్నర ఎకరాల స్వరాజ్ మైదాన్ ఆయన స్మృతివనానికి వేదికైంది. పెత్తందారీ వర్గానికి ఇది మరో కంటగింపు కారణం. ప్రాంతీయ పెత్తందారీ వర్గా నికీ, ఆ వర్గం వైభవానికీ గుర్తు బందర్ రోడ్డు. ఈ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు పోనూ మిగిలిన ఖరీదైన భవనాల్లో ముప్పాతిక శాతానికి పైగా ఒకే వర్గ పెత్తందారీ కుటుంబాల వారివే. విజయవాడ నగరంలో ఏం జరగాలన్నా బందర్ రోడ్డు బాద్షాలు ఎస్ అంటే ఎస్! నో అంటే నో!! రాష్ట్ర విభజన తర్వాత బందర్ రోడ్డు మీదుగా ఒక మెట్రోలైన్ను కేంద్రం కేటాయించింది. మనవాళ్ల భవనాలు చాలా కూల గొట్టవలసి వస్తుంది కనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. చంద్రబాబు పార్టీకి అభివృద్ధి అంటే పెత్తందారీ వర్గం అభివృద్ధి మాత్రమే! వారికి నష్టం కలిగించే అభివృద్ధిని అస్సలు సహించరు. మెట్రోలైన్నే కాదు రోడ్డు విస్తరణను సైతం ఈ వర్గాలు అడ్డుకున్నాయి. ఇదే రోడ్డు మీద లీజుకు తీసుకున్న స్థలంలో తిష్ఠ వేసిన ‘ఈనాడు’ జీ రోడ్డు విస్తరణకు ససేమిరా అన్నారు. మూడు దశాబ్దాలపాటు భూ యజమానిని ముప్పుతిప్పలు పెట్టి రెండు దశాబ్దాల పాటు రోడ్డు విస్తరణను అడ్డుకొని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరవై రోజుల కింద తట్టాబుట్టా సర్దుకొని, అన్ని గేట్లూ మూసుకొని తరలిపోవలసి వచ్చింది. చెన్నయ్లోని ‘ది హిందూ‘ కార్యాలయాన్ని ‘మౌంట్ రోడ్ మహావిష్ణు’ అనేవారట. అదేవిధంగా తన కార్యాలయాన్ని కూడా బందర్ రోడ్డు బాద్షాగానో, జాంగ్రీగానో పిలిపించు కోవాలని ఆయన ఆశించాడట! కానీ కథ అడ్డం తిరిగింది. వందేళ్ల కిందట ఒకసారి స్వరాజ్ మైదాన్లో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో దళిత సంఘాల సభ జరిగిందట! అప్పుడు స్థానిక పెత్తందార్లు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయం తలుపులు మూయించారట. దళితులు ఆలయానికి రాకూడ దన్న దుష్ట తలంపుతో! ఆ పెత్తందార్ల ఆటలు ఏదో రూపంలో సాగుతూ వచ్చాయి. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క! ఇప్పుడు బెజవాడంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేడ్కర్! జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత స్క్రీన్ప్లే మారింది. పెత్తందార్లు, వారి మీడియా కడుపు మంట ద్విగుణం, త్రిగుణం కావడానికి ఈ పరిణామాలన్నీ కారణం. ఆ కడుపు మంట ఫలితమే విగ్రహావిష్కరణ రోజున యెల్లో పత్రికల నిండా పరుచుకున్న అశుద్ధం. ఆ పద్దెనిమిది ఎకరాల్లో ఓ పెద్ద మాల్ కట్టించి తన వాళ్లందరూ వ్యాపారాలు చేసుకునేలా చూడాలని అప్పట్లో చంద్ర బాబు ప్లాన్ చేశాడట! మిగిలి ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యా లయాలను ఎక్కడికన్నా తరలిస్తే బందరు రోడ్డు మీద ఇక తమదే గుత్తాధిపత్యం. కలలు చెదిరిపోయి ఇప్పుడు అంబే డ్కర్ వచ్చి చేరాడు. అదే బందరు రోడ్డు మీద ముప్పయ్యేళ్ల క్రితం తమ పెత్తనాన్ని ధిక్కరించిన వంగవీటి రంగాను అడ్డు తొలగించుకోగలిగారు. ఇప్పుడెట్లా? మింగలేక కక్కలేక చస్తు న్నారు. అంబేడ్కర్పై ప్రేమ లేకున్నా అది బయటకు ప్రకటించలేరు. దళితులపై భూస్వాముల దాడులు, దౌర్జన్యాలకు ‘ఈనాడు’లో మొదటి నుంచి ప్రాధాన్యత లభించేది కాదు. కారంచేడులో దళితుల నెత్తురు ఏరై పారినప్పుడు కూడా ఆ పత్రికలో ఓ చిన్న క్రైమ్ వార్తగానే వచ్చింది. అటువంటి ‘ఈనాడు’ అంబేడ్కర్ ఆశయాల పట్ల గౌరవాన్ని నటిస్తూ ఒక దిక్కుమాలిన వార్తను అచ్చేసింది. ‘అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్’ అంటూ జీ పత్రిక ఒక ఫుల్పేజీని కేటాయించింది. అంబేడ్కర్కు ముడిపెడుతూ తలాతోకా లేని ఓ పది పాయింట్ల సొల్లు కార్చారు. ఈ చచ్చు పాయింట్లకు గ్రామసీమల్లోని ఏ సాధారణ పౌరుడైనా గట్టిగా సమాధానం చెప్పగలడు. అంత పారదర్శ కంగా జగన్ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తున్నది. మద్యనిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మద్యాన్ని పారిస్తున్నదట! దశలవారీ మద్య నియంత్రణకు వైసీపీ హామీ ఇచ్చిన మాట నిజం. ఆ హామీకి కట్టుబడి 43 వేల బెల్ట్షాపులను తొలగించారు. మద్యం ప్రైవేటు వ్యాపారాన్ని రద్దు చేసి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసు కున్నది. 4,380 నుంచి 2,934 వరకు షాపుల సంఖ్యను తగ్గించారు. రాత్రి తొమ్మిది గంటల వరకే అమ్మకాలకు అనుమతి నిచ్చారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. సహజ వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా వినియోగించుకోవాలని అంబేడ్కర్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ‘ఈనాడు’ భాష్యం. ఇసుక మీద ప్రభుత్వానికి ఎవరి హయాంలో ఆదాయం వచ్చింది? గ్రానైట్, సున్నపు రాయి, మాంగనీస్, రోడ్ మెటల్... ఇలా మైనింగ్ కారక్రమాలన్నింటిలో ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది? ఈ లెక్క లేవీ చెప్పకుండా బట్టకాల్చి మీద వేసే బద్మాష్ గిరీకి ‘ఈనాడు’ పాల్పడింది. ఆదాయాలకు మూలమైన పరిశ్ర మలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవని అంబేడ్కర్ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వానికి భారీ పరిశ్ర మలను తీసుకు రావడం సాధ్యం కాలేదట. పైపెచ్చు కొన్ని పరిశ్రమలు పారిపోయాయట. రాష్ట్రంలో తమ కార్యక్రమా లను విస్తరించబోతున్నట్టు అమరరాజా గ్రూప్ అధికారికంగా ప్రకటిస్తే ఆ సంస్థ పారిపోయిందంటూ ‘ఈనాడు’ గీకి పారే సింది. జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయి. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటిద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి మీట్ జరిగింది. పార్టీ కార్యకర్తలకు కోట్లు వేసి నకిలీ ఒప్పందాలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా పోలిక ఉన్నదా?ఇంగ్లిష్ మీడియంలో చదువొద్దని అంబేడ్కర్ చెప్పారట. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదట! పేద వర్గాల ఇంగ్లిష్ చదువుల మీద పెత్తందార్లు ఎంత ద్వేషం పెంచుకున్నారో ఈ అభూత కల్పనను చూస్తేనే అర్ధమవు తుంది. ఇంగ్లిష్ మీడియంపై ఏ అంబేడ్కరిస్టుతోనైనా ఓ గంటసేపు మాట్లాడి ఉంటే ఎంతోకొంత జ్ఞానోదయమై ఉండేది. ప్రతిపక్షాలు, పత్రికలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని అంబేడ్కర్ చెబితే జగన్ ప్రభుత్వం వారిని రాచిరంపాన పెడు తున్నదట. అధికారంలో ఉన్న వారిని పచ్చి బూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసత్య ప్రచారాలకు తెగ బడినా సరే కేసులు పెట్టొద్దని అంబేడ్కర్ ఎక్కడ చెప్పాడో మాత్రం ఆ పత్రిక చూపెట్టలేకపోయింది. ఇటువంటి తలాతోకా లేని పాయింట్లతో కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన యెల్లో మీడియా గుండెలు గుభేల్ మనేలా, కళ్లలో గుంటూరు కారం మండేలా లక్షలాదిమంది పేద వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ జైత్రయాత్ర ఏప్రిల్లో ఎన్నికలు ముగిసేవరకే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగనున్నది. ‘తెలుగుదేశం’ రాజ కీయ కూటమి పెద్దలూ, యెల్లో మీడియా గద్దలూ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది. కౌంటింగ్ రోజున వారందరి ఇళ్ల ముందు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. కడుపు మంట అదుపు తప్పితే ఏమౌతుందో ఏమో! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రామ్... భీమ్... యుగధర్మం!
బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామ మయం’’. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాఙ్మయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసముండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామా యణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మనవాళ్లు దేశదేశాలకూ మోసుకొని వెళ్లారు. రామనామం పవర్ ఏమిటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకీ తెలియదు. మన దేశంలోని ఆబాల గోపా లాన్ని టెలివిజన్ ఛానెళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్సభలో కేవలం రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే తొంభై సీట్లకు, మూడంకెలకు, ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. పూర్వం రాజాధి రాజులు, చక్రవర్తులు బలంగా ఉన్నప్పుడే అశ్వమేధ యాగాలు చేసేవారట! శత్రు నిశ్శేషం చేసుకోవడం వాటి లక్ష్యం. ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉన్నది. అయినా రామాలయ ప్రతిష్ఠాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకున్నది. అశ్వమేధయాగం స్థాయిలో ఈ మహా క్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్ఠాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన పదకొండు రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రక రకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామ చంద్రుడు భార్యావియోగ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు వశిష్టాది రుషులంతా పూనిక వహించి ఆయన చేత అశ్వమేధం చేయిస్తారు. రాముడికో అనుమానం వస్తుంది. భార్యా విహీనుడైన తానెట్లా యాగం చేయగలనని ప్రశ్నిస్తాడు. భార్యా సమేతంగానే యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనాలనేది నియమం. శ్రీరామునికి బావ గారైన రుష్యశృంగ మహాముని ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. బంగారంతో భార్య విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేయొచ్చని తరుణోపాయం చెబుతాడు. త్రేతాయుగంలోనే అవసరాన్ని బట్టి విరుగుడు మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కలియుగం చివరి పాదంలో ఇప్పుడుండవా? కనుక ఆ విషయంలో మోదీపై అభ్యంతరాలు చెల్లవని శ్రీరామ వర్సెస్ అదర్స్ కేసులో రుష్యశృంగ న్యాయమూర్తి తీర్పు స్పష్టం చేస్తున్నది. శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీకా? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ, అది ఎన్నికల హామీయే కనుక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తున్నది. శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుంది. అసలు హిందూమతం అంటూ ఒకటున్నదా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తున్నది. ఒక నిర్ధారిత పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్లూ, సంఘ్ పరివార్ వాళ్లూ హిందూమతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటనే ఎక్కువగా వాడుతుంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. హిందూ ధర్మం అంటే ఏమిటి? అనేది ఇంకో ప్రశ్న. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. సనాతనమంటే శాశ్వతమనే అర్థమున్నది. ధర్మం శాశ్వ తంగా స్థిరంగా ఉంటుందా? కాలానుగుణంగా మారదా? యుగ ధర్మం అంటారు కదా! అంటే ఏమిటి? ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడు కృష్ణ భగ వానుడు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని భావం. అంటే యుగధర్మాన్ని కాపాడేందుకు అవతరించడమా లేక శాశ్వత ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరించడమా? ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందనీ, రాముడు ధర్మ స్వరూపుడనే అర్థంలో! పైగా ఈ మాట అన్నది ఎవరో కాదు. శ్రీరాముని శత్రు శిబిరంలోని వాడైన మారీచుడు. శ్రీరాముడు వరాలిచ్చిన దేవుడు కాదు. ఆపద మొక్కులవాడూ కాదు. ఒక మనిషి. స్వయంగా కోరి కష్టాలను అనుభవించినవాడు. రుజు ప్రవర్తన కలిగినవాడు. తండ్రి మాటను తలదాల్చినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాడు. ఒక్కరితోనే జీవన సాహచర్యమని నమ్మినవాడు, ఒక రాజుగా ప్రజాభిప్రాయాన్ని మన్నించినవాడు. శిష్టరక్షణకు దుష్టశిక్షణకు వెనుకాడనివాడు. ఈ రకంగా తన జీవితాన్ని ఒక పాఠంగా ఈ సమాజానికి అందించినవాడు కనుకనే ఆయనను ధర్మస్వరూపుడని కీర్తించారు. భారతీయులపై రామాయణ ప్రభావం మత విషయాల కంటే సాంస్కృతిక రంగంలోనే ఎక్కువ. సామాజిక కట్టుబాట్లపైన, నైతిక నియమాలపైన, మన సాహిత్యం, సంగీతం, కళలు, నాట్యంపైనా రామాయణం ముద్ర ఉన్నది. ధర్మం, కర్మ, జీవిత పరమార్థం వంటి అంశాలు మన తాత్వికతను పరిపుష్టం చేశాయి. మన పాత్రను సక్రమంగా ఎలా అర్థం చేసుకోవాలో రామాయణం చెబుతుంది. నమ్మిన మార్గంలో సవాళ్లు ఎదురైనా ఎలా ముందుకు వెళ్లాలో రామా యణం బోధిస్తుంది. లోతుగా పరిశీలిస్తే శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తుంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ–సంఘ్పరివార్ కొంత రాజకీయం పులమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటని మతపెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు. కొద్దిరోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకిక వాదుల విమర్శలు సరేసరి! బీజేపీ, సంఘ్ పరివార్ల మూడు దశాబ్దాల కృషి అయోధ్య రామమందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి? శ్రీరాముడి ఆదర్శాలన్నీ త్రేతాయుగానికి సంబంధించినంత వరకు ధర్మబద్ధమే కావచ్చు. యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి. వేదవేదాంగాల వంటి శ్రుతులు చెప్పిన విషయాలు నిత్య సత్యాలనీ, మనుస్మృతి వంటి స్మృతులు పెట్టిన నియమాలు కాలాన్నిబట్టి మారుతాయనీ పండితులు చెబుతారు. శ్రీరాముడు చేసిన కొన్ని పనులు ఆ తర్వాతి యుగాలకు సమ్మతమయ్యేవి కావు. బహుశా ఆ కాలంలో కూడా అసమ్మతి గళాలున్నా రామాయణంలో వినిపించలేదేమో. వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి తపస్సు చేస్తున్న శూద్ర శంబూ కుని తలను శ్రీరాముడు తెగనరికాడు. ఒకే ఒక్కడి మాటకు ప్రజాభిప్రాయమనే ముద్రవేసి సీతమ్మను అడవులకు పంపించాడు. రావణుడి చెర నుంచి విడిపించినప్పుడు ఆమె శీల పరీక్షకు ఆదేశించాడు. ఇవన్నీ ఏ యుగంలోనూ ఆదర్శాలు కాబోవు. ప్రజా క్షేమం కోరే పరిపాలన, మాట తప్పని వ్యక్తిత్వం, సవాళ్లకు తలవంచకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం, ఏక పత్నీవ్రతం వంటి రామయ్య సుగుణాలు సర్వకాల సర్వా వస్థల్లోనూ ఆదర్శంగా నిలబడతాయి. అటువంటి ఆదర్శాలకు గుర్తుగా భవ్యమైన రామమందిరం రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైతే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయో ధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సరిగ్గా మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్య క్రమం జరగబోతున్నది. శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే, ఈ ప్రజా స్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి, రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నది. రామాలయం లేని ఊరు ఉండదనేది యాభయ్యేళ్ల కిందట తెలుగునాట తరుచుగా వినిపించిన నానుడి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వామి విజృంభించడంతో ఇప్పుడు ఆ నానుడి వినిపించడం లేదు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నకొద్దీ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు నాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున పద్దెనిమిది ఎకరాల స్వరాజ్య మైదాన్లో ఆవిష్కృతం కాబో తున్న ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేడ్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తయినది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. మొత్తం కలిపి 210 అడుగులు. ఆంధ్రప్రదేశ్లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధి పత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయపోరాటం చేస్తున్నది. ఆ పోరా టానికి నిరంతర స్ఫూర్తి జ్వలితరూపంగా ఈ విగ్రహం నిలబడబోతున్నది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛా ప్రజాస్వామిక యుగధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్దపీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు. కులవ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు. దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటనా, ఆరాధనా స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది. ఆ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. యెల్లో మీడియా చానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు ముప్పావు భాగం స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయ డానికి వినియోగిస్తున్నాయి. అవకాశవాద పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెద జల్లుతున్నాయ్. మీడియా–సోషల్ మీడియాల విషప్రచారాలు చాలవని వేలాదిమందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విషప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగయుగాల సందేశం ఇదే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉరఫ్ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్ మోడల్ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది. మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా? వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు. తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమ్ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్ స్కీమ్ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్ కల్యాణ్తో తాను పెట్టించిన పార్టీని ఎన్డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్’పైనే ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్ ఎకాంప్లిష్డ్’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!! చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి. విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే! తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్పోర్టులో బ్రదర్ అనిల్తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు? అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్రెడ్డి మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్ మోహన్రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు. ‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది. ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్ శర్మ టీమ్తో పాటు ఒక రిటైర్డ్ డీఐజీ ఈ వింగ్ను పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పీకే అండ్ పీకే ఫార్ములా!
ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్ర బాబు కోసం పవన్ కల్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్పివి) జనసేన. అది ప్యాకేజీ ఫీజుతో కాంట్రాక్టుపై పనిచేస్తున్నదని వైఎస్సార్సీపీ నాయకులు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా జనసేన కోసం జీవితాలను ధారబోసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న యువకులు ఇంకో అడుగు ముందుకు వేసి చెబుతున్న మాట – ‘చంద్రబాబు సినిమాలో... జనసేన ఓ ఐటమ్ సాంగ్ మాత్రమే!’ కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు జనసేన కార్యకర్తల్లోని అనుమానాలను బలపరుస్తున్నాయి. ‘రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. నేనేం చేసినా ప్రశ్నించవద్దు. తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించేవాళ్లు పార్టీలో ఉండనవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పదేళ్లు కొనసాగవలసిన అవసరం ఉన్నది’. ఈ రకమైన సుభాషితాలు విశదం చేస్తున్న విషయమేమిటి? తెలుగుదేశంతో ఇంకో పదేళ్ల పాటు పొత్తుకు డీల్ కుదిరిందనే కదా! ఈ డీల్ వల్ల జనసేనకు ఒనగూరే ప్రయోజనమెంత? ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి పదవి జనసేనకు ఎన్నేళ్లు... టీడీపీకి ఎన్నేళ్లు? ఇటువంటి ప్రశ్నలు అడగొద్దనే ఉద్దేశంతోనే సొంత పార్టీ అభిమానుల ముందరి కాళ్లకు పవన్ ముందుగానే బంధనాలు వేశారు. దాటవేత పద్ధతిలో సొంత పార్టీ వారిని ఏమార్చుతూ వచ్చారు. ‘ముందుగా సీట్లు గెలవాలి. ఎక్కువ సీట్లు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి పదవిని అడగగలం... ముందు ఎక్కువ సీట్లలో జనసేనను గెలిపించండ’ని కార్యకర్తల పైనే పవన్ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. సరే, పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామని కార్య కర్తల ప్రశ్న. ముఖ్యమంత్రి పదవి దక్కేంతగా మెజారిటీ సీట్లు తీసుకోబోతున్నామా? పోనీ హరిరామజోగయ్య వంటి శ్రేయోభి లాషులు చెబుతున్నట్టుగా కనీసం 60 సీట్లు? జనసేనకు అంత సీన్ లేదని తెలుగుదేశం పార్టీ కో– పైలట్గా భావించుకుంటున్న లోకేశ్బాబు కుండబద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఒక్క సీట్లోనే ఓడిపోతే పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. అందువల్ల ఆ మాత్రం చులకన భావం లోకేశ్కు సహజం. కచ్చితంగా 150 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని తాజాగా ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూలో లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే సమస్యే రాదనీ, అటువంటి ప్రస్తావనే రాలేదనీ, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థనీ లోకేశ్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అంగీకరించినట్టు లోకేశ్ వెల్లడించారు. లోకేశ్బాబు ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం గరిష్ఠంగా 25 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నది. అందులో కూడా సగంమంది అభ్యర్థులకు కొత్తగా జనసేన తీర్థ మిచ్చి టీడీపీ సమకూర్చుతుందని విశ్వసనీయ సమాచారం. మిగిలిన పది, పన్నెండుమంది ఎంపికను కూడా టీడీపీ నాయ కత్వం ఆమోదించవలసి ఉంటుంది. ఇంత అవమానకరమైన ఒప్పందానికి ఏ రాజకీయ పక్షమైనా ఒప్పుకుంటుందా? ఇంకేదో మనకు తెలియని కోణం ఉన్నందువల్లనే ఇటువంటి పొత్తులు సాధ్యమవుతాయి. ఏమిటా కోణం? అదో సింగపూర్ రహస్య మంటారు జనసేన వ్యవహారాలు బాగా తెలిసినవాళ్లు. చిదంబర రహస్యం గురించి విన్నాం గానీ ఈ సింగపూర్ రహస్యం ఏమిటో అంతుపట్టడం లేదు. చంద్రబాబుకు సింగపూర్తో వ్యాపార సంబంధాలు చాలాకాలం నుంచి ఉన్నాయనేది బహి రంగమే. బహుశా రాజకీయ లావాదేవీలను కూడా అక్కడి నుంచి నరుక్కొస్తారేమో! ఈ కోణాల సంగతీ, కుంభకోణాల సంగతీ పక్కన పెడదాం. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పుకొని, రాష్ట్రంలో ఉన్న మరో బలమైన సామాజికవర్గపు ఆకాంక్షలతో ఊపిరిపోసుకున్న పార్టీ నిజస్వరూపం ఇలా వెల్లడైతే దాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? జనసేన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వస్తున్న క్షేత్రస్థాయి జనసేన కార్యకర్తల్లో చాలామందికి లోకేశ్బాబు తాజా ఇంటర్వ్యూ కళ్లు తెరిపించి ఉండాలి. వారి మనోభావాలనే హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కల్యాణ్కు చేరవేశారు. ‘లోకేశ్ చెప్పిన మాటలకు మీ ఆమోదం ఉన్నదా’ అని లేఖలో జోగయ్య ప్రశ్నించారు. ‘మీరు ముఖ్యమంత్రి కావాలనీ, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనీ కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నార’ని కూడా ఆయన ప్రశ్నించారు. చివరకు 60 సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా దక్కించుకోవాలని పవన్ కల్యాణ్కు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్తో వ్యవహరించే తీరుపై పెదబాబు, చిన బాబుల అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలున్నాయట! కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జనసైనికులకు సర్దిచెప్పడం కష్టమన్న పవన్ వైఖరి పట్ల చంద్రబాబు ఒకింత సానుభూతిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేశ్బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో అరెస్టు భయంతో చినబాబు ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్తో (పీకే) స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయా లని పీకేను లోకేశ్ అడిగారట! ఇప్పటికే పీకే టీమ్లో పనిచేసిన రాబిన్సింగ్ తెలుగుదేశం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగానే పవన్ కల్యాణ్ను అతిగా ఊహించుకోవద్దనీ, అతనికి కాపు సామాజికవర్గంలో కూడా పెద్దగా బలం లేదనీ పీకే లోకేశ్కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అంత ఎక్కువ నష్టం జరుగు తుందని తన అభిప్రాయంగా చెప్పారట! అయితే వ్యూహకర్తగా పనిచేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, తన సమా చారం ప్రకారం వైసీపీ మరోసారి గెలిచే అవకాశాలున్నట్టు చెప్పా రట! అప్పటినుంచీ పీకేను వ్యూహకర్తగా ఒప్పించడం కోసం లోకేశ్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరి మితం చేయాలని లోకేశ్ పట్టుదలగా ఉండడంతో విషయం తెలిసిన పవన్ కల్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావడానికి అంగీకరించిన పవన్ మొండికేయడంతో చంద్ర బాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారట! ఇతరత్రా ఒప్పందాల సంగతి తెలియదు గానీ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 25కు పెంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. జనసైనికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని భయపడినప్పటికీ ఆ సంఖ్యకు ఒప్పుకోక తప్పలేదు. ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా అప్పటి వాతావరణ ప్రభావం కనిపించింది. చంద్రబాబును సాగనంపడానికి బయటకొచ్చిన పవన్ దూరంగా నిలబడి ఉండగా నాదెండ్ల మనోహర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బాబుకు వీడ్కోలు చెప్పడం కనిపిం చింది. ఎట్టకేలకు లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ సభకు పెట్టుకున్న పేరు విజ యోత్సవ సభ. లైవ్లో కార్యక్రమాన్ని చూసిన వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే – అది విజయోత్సవ సభ కాదు, సంతాప సభలా ఉన్నదని! పోనీ పాదయాత్ర తొలి రోజున చనిపోయిన తారకరత్న సంతాప సభగా దాన్ని మార్చారా అంటే అదీ లేదు. అతని పేరు తల్చుకున్నవారే లేరు. కానీ వేదిక మీదున్న నాయకుల ముఖాలు మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి. అందుకు సభ ఫెయిల్యూర్ ఒక కారణం కావచ్చు. ఆరు లక్షలమందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో తెలియదు. సభకు నలభై నుంచి యాభైవేల మంది వరకు వచ్చి ఉంటారని తేలింది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని పదివేల మంది లేరు. ఇదీ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేనల ఉమ్మడి ప్రభావం. ఇక సంతాప వాతావరణానికి రెండో కారణం – పొత్తులో కత్తుల వ్యవహారం కావచ్చు. జనసేన శ్రేణుల్లో ఒకపక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ ఊడిపడ్డారు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎమ్ రమేశ్కు చెందిన ప్రైవేట్ విమానంలో లోకేశ్, కిలారు రాజేశ్లతో కలిసి ఆయన విజయవాడకు వచ్చారు. చంద్ర బాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం రెండు రకాలుగా ఉన్నది. తెలుగుదేశం – జనసేన కూటమి మాత్రమే వైసీపీతో తలపడటానికి సరిపోదనీ, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ – కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పడానికే చంద్రబాబును పీకే కలిశారని ఒక సమా చారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే వింత ఇంకోటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానంలో! రాచకార్యం కాంగ్రెస్ కోసం!! ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్సింగ్ టీమ్ పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోనే పనిచేసినందున... వారితో మాట్లాడి సలహాలిచ్చేందుకు రావలసిందిగా లోకేశ్ చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చాడని మరో సమాచారం. చంద్ర బాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీమ్ కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమవైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు వినపడుతున్నది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిశోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలను కోవడం నదిలో కొట్టుకొనిపోయేవాడు గడ్డిపోచను చూసి ఆశపడిన చందం! వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిపించేట్లయితే పార్టీలను మూసేసుకుని నాయకులు వ్యూహకర్తలనే ఆశ్రయించేవారు. అంబటి రాంబాబు చెప్పినట్టు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రీ ఏం చేస్తాడు? ఈ పీకే భేటీ సంగతేమోగానీ, ఈ పరిణామం మన పీకే (పవన్ కల్యాణ్) పీకకు చుట్టుకుంటుందేమో చూడాలి. అసలే పార్టీ నుంచి వరసగా జారుకుంటున్నారు. కీలకమైన కాపు సామాజికవర్గం నేతలే తాము ఈ పార్టీలో ఇమడగలిగే పరిస్థితి లేదని బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పాతిక సీట్లతోనే పార్టీ నేతలను ఒప్పించలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ కూడా తోడైతే వాళ్లకిచ్చే నాలుగు సీట్లు కూడా తన ఖాతా లోంచే కోత పడతాయి. పైగా బీజేపీ మీద అపారమైన అభి మానాన్ని కురిపిస్తూ ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చేరిన పవన్ ‘ఇండియా’ కూటమిని అంగీకరిస్తారా? ఆ పరిస్థితి ఎదురైతే తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? తెగతెంపులు చేసుకునేంత సాధారణమైన సంబంధమే తెలుగుదేశంతో ఉన్నదా? ఇవన్నీ సందేహాలే. తెలుగుదేశం పార్టీ ‘ఇండియా’ కూటమిలో చేరే అవకాశం లేదనే అనుకుందాం. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం. అసలే బీజేపీ అంటేనే బాబు ఝడుసుకుంటు న్నారు. మరో దారి లేకపోతే తప్ప ‘ఇండియా’ కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వడానికే పీకే బాబును కలిశాడనుకుందాము. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లతో జనసైనికులను మన పీకే సంతృప్తిపరచ గలరా? పదేళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావహుల ఆగ్ర హాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదనీ, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనీ బహిరంగంగా ప్రకటించి కాపు సామాజికవర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు. ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్ పీరియడ్గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది. గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే. ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది. వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి. సెక్రటేరియట్కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి. రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్ చర్యే! వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది. అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్లోకి వచ్చే ప్రొసీజర్స్ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది. కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం. తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్... కథ అడ్డం తిరిగింది! ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్ పార్టీ టెన్ బై టెన్ స్కోర్ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది. తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్ఎస్ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్ బూత్ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్పల్లి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్లో బీఆర్ఎస్కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్బీ కాలనీ బూత్ నెంబర్ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కృత్రిమ గాలులు పనిచేస్తాయా?
ఇంకో నాలుగు రోజులు మాత్రమే! ఈనెల 30న తెలంగాణ రాష్ట్రం మూడో సర్కార్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడో అసెంబ్లీ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారడం విశేషం. ఎన్నికలన్న తర్వాత సర్వేలు, ప్రజాభిప్రాయ నాడీ జ్యోతిష్యాలు, ‘గాలి’ వేగాన్ని అంచనా వేసి చెప్పడాలు... ఇటువంటి వన్నీ షరా మామూలే! ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల సర్వే ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇలా పొంతన లేకపోడానికి కారణం... ఇందులో కొన్ని ‘ఉద్దేశపూర్వకమైనవి’ కావడమే! అన్ని రకాల సర్వే ఫలితాలను క్రోడీకరిస్తే, ఒక మూడు అంశాలు నిగ్గుతేలుతున్నాయి. ఒకటి – ఈసారి అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పోటీని ఎదు ర్కొంటున్నది. కొన్ని జిల్లాల్లో పాత బలాన్ని కాపాడుకున్నట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో బలహీన పడినట్టు స్పష్టమవుతున్నది. రెండు – కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే పుంజుకున్నది. అయితే ఈ పరిణామం కొన్ని ప్రాంతాలకే పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా కనిపించడం లేదు. మూడు – బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బీజేపీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇదే ప్రకటన ఒక రెండు మూడు నెలల ముందు చేసి ఉన్నట్లయితే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణలుగా చెప్పడం రివాజు. కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితికి ఆ విభజన నప్పడం లేదు. రాష్ట్రానికి పడ మటి దిక్కున ఉన్న గ్రేటర్ హైదరాబాద్ (24), మెదక్ (10), నిజామాబాద్ (9) ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగానే కనిపిస్తున్నది. మొత్తం సీట్లు 43. ఇందులో ఆనవాయితీగా మజ్లిస్ గెలిచే సీట్లు 7 తీస్తే మిగిలినవి 36. ఇందులో అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంటుందనీ, రెండో స్థానం కోసం బీజేపీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కోవచ్చనీ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాను ఉత్తర తెలంగాణగానూ, నల్లగొండను దక్షిణ తెలంగాణను పరిగణిస్తుంటారు. సరిహద్దు జిల్లాలైన ఈ రెండింటినీ కలిపి తూర్పు తెలంగాణగా భావించవచ్చు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 22 సీట్లున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి అట్లా కాదు. వాయవ్య దిక్కు ఎంట్రీ పాయింట్లో (ముధోల్, ఆదిలాబాద్, బో«ద్, నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల) బలంగా కనిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా పాకెట్ల మాదిరిగా విస్తరించింది. బీఆర్ఎస్ స్థావరంలో 36 సీట్లు ఉండటమే గాక రెండో స్థానం కోసం బీజేపీ నుంచి గట్టి పోటీని కూడా కాంగ్రెస్ ఎదుర్కోవలసి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ స్థావరంలోని 22 సీట్లలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలవగలిగే సీట్లు ఆరు న్నాయి. మరో ఆరు సీట్లలో నువ్వా నేనా అనే పరిస్థితులున్నాయి. ఇది అధికార పార్టీకి సానుకూల అంశం. ఈ స్థావరాల నుంచి బయల్దేరి ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీట్ల కోసం మూడు పార్టీలు వేటాడవలసి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాపై మూడు పార్టీలకూ భారీగానే ఆశలున్నాయి. గాలివాటం ఎటువైపున్నా మూడు పార్టీలు కూడా కచ్చితంగా బోణీ కొట్టే అవకాశం ఉన్నది. బొగ్గు బెల్ట్లో కాంగ్రెస్ బలంగా ఉన్నదనీ, మిగిలిన ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు అవకాశాలున్నాయనీ స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థి కూడా బలంగా కనిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు కూడా రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది. రెండు ప్రధాన పార్టీల తరఫున రెడ్డి,వెలమ కులాలకు చెందిన ఇద్దరు బడా బాబులు హోరాహోరీ తలపడుతున్న చోట ఐఐటీ గ్రాడ్యుయేట్, పాతికేళ్ల పద్మశాలి యువతి గెలిస్తే బాగుండను కునే వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఇటువంటి కలలు ఫలించాలంటే మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి రావాలి. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే గదా ఏదో ఒకరోజు ఆ నవయుగం ఆవిష్కృత మయ్యేది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది. అయినా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నట్టు జరుగు తున్న ప్రచారం నేపథ్యంలో ఈ జిల్లాను హోరాహోరీ పోటీ కోటాలో వేయాల్సి వస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రెండు మూడు సీట్లలో సంచలనం సృష్టిస్తామని బీజేపీ నాయకత్వం చెప్పుకొస్తున్నది. అందుకు అను గుణంగానే చాప కింద నీరు మాదిరిగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ పాలకుర్తి నియోజ కవర్గం. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఓటమి ఎరగకుండా అనేక పోరాటాల్లో గెలిచిన వార్ వెటరన్ ఎర్రబెల్లి. కానీ ఈసారి ఒక పాతికేళ్ల యువతితో హోరాహోరీ పోటీని ఎదుర్కొంటు న్నట్టు వార్తలు వస్తున్నాయి. అమె రికాలో చదువుకొని వచ్చిన యశస్విని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నది. పద్నాలుగు నియోజకవర్గాలున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లో కొల్లాపూర్ నియోజకవర్గం ఉన్నది. రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన ఇద్దరు దొరలు అక్కడ తలపడుతున్నందుకు కాదు. ఒక నిరుపేద దళిత యువతి... పేరు కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క. అక్కడ బరిగీసి నిలబడింది. ఏ పార్టీ అండ లేదు. ఇండిపెండెంట్గానే! పుట్టెడు పేదరికం కారణంగా చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి అండగా ఉంటూ ఓపెన్ యూని వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించ లేదు. నాలుగు బర్రెలు కొనుక్కొని పోషిస్తూ సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క పేరుతో ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిరుద్యోగ యువత తరఫున తాను నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక సాధనంగా మలుచుకోవాలని నామినేషన్ వేసింది. ఈమె పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం నలు మూలల నుంచి యువతీ యువకులు తండోపతండాలుగా కొల్లాపూర్కు వెళ్లి బర్రెలక్కకు మద్దతును ప్రకటిస్తున్నారు. దీనర్థం అక్కడ బర్రెలక్క గెలుస్తుందని కాదు. అంత ఆశలేదు. ఒకవేళ కొల్లాపూర్ ప్రజల్లో హఠాత్తుగా ఏదో ఒక నవ చైతన్యం ప్రవేశించి బర్రెలక్క గెలిస్తే అదొక యుద్ధ ప్రకటనే! నోట్ల కట్టల ప్రజాస్వామ్యానికి రోజులు దగ్గర పడినట్టే! ఉమ్మడి పాలమూరులో బీజేపీ మూడు సీట్లపై ఆశలు పెట్టుకున్నది. కర్ణాటక సరిహద్దుల్లోని ఒక నియోజకవర్గాన్ని, గతంలో రెండుసార్లు గట్టి పోటీ ఇచ్చిన మరో నియోజక వర్గాన్ని ఖాయంగా గెలుస్తామని ఆ పార్టీవారు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ఢంకా బజా యించి చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనం బాగా బలంగా ఉంటే తప్ప బీఆర్ఎస్ ఆధిక్యాన్ని తగ్గించడం ఈ జిల్లాలో సాధ్యం కాకపోవచ్చు. బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి ఖాయంగా వస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అందుకు దోహదపడే కారణ మేమిటో స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కారణమా? లేక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూసి జనం మురిసిపోతున్నారనుకోవడమా? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమైతే కాంగ్రెస్కే జనం ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నది కదా! పైగా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానం మెజారిటీ రాష్ట్ర ప్రజలను ఆకర్షి స్తున్నప్పుడు కాంగ్రెస్నే ప్రత్యామ్నాయంగా ఎందుకుఎంచుకోవాలి? కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల సానుకూలత పెల్లుబకడానికి అందులో ఏమున్నది? కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలనే కొంచెం అటూ ఇటూ మార్చి అచ్చేశారు. ఆయన ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువ ముట్ట చెబుతామని చెప్పారు. కాలాను గుణంగా ఎవరైనా ఈ పెంపుదల చేయాల్సిందే. అంతకుమించిన మౌలికమైన మార్పుల ప్రతిపాదన ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. అంతకంటే బీజేపీ చెప్పిన బీసీ ముఖ్యమంత్రే వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పును సూచించే హామీ అవుతుంది. కనుక కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రజాస్పందన ఉన్నదనేది అవాస్తవం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని అనుకుంటే ప్రతిపక్షానికి జరిగే లబ్ధిలో బీజేపీ కూడా కచ్చితంగా భాగస్వామి అవుతుంది. ఆ పార్టీ చెబుతున్నట్టు రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రభంజనంలా లేకుండా సాధారణ స్థాయిలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలే ఉంటాయి. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతోకొంత వ్యతిరేకత వ్యక్తమవడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రచార మవుతున్నంత తీవ్రస్థాయిలో ఉన్నదా అనేది సందేహాస్పదం. అంత తీవ్ర వ్యతిరేకతకు తగిన ప్రాతిపదిక లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్లో వ్యాపార ప్రయోజనాలున్న కొందరు కోటీశ్వరులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పించే ఉపాయాలను అన్వేషిస్తున్నారు. సలహాలు – సంప్రతింపుల కోసం యెల్లో మీడియా పెద్దలను కూడా తరచూ కలుస్తున్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు బయట కొస్తున్నాయి. ఈ వ్యవహారానికి అందుబాటులో ఉండి మార్గదర్శనం చేయడం కోసమే చంద్రబాబు లేని జబ్బులు తెచ్చుకొని మెడికల్ బెయిల్ సంపాదించారన్నది నిర్ద్వంద్వంగా రూఢి అవుతున్నది. ఆయన రహస్య భేటీలు నిరాఘాటంగా జరిగిపోతున్నాయి. ఈ మొత్తం స్కీములో భాగంగానే తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి కృత్రిమ పవనాలను ప్రవేశ పెట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని సర్వే సంస్థలను వశపరచు కొని అనుకూలమైన రిపోర్టులను ప్రచారంలో పెట్టారు. సరికొత్త ఎత్తుగడగా రూమర్ స్ప్రెడర్లను (వదంతుల వ్యాపకులను) రంగంలోకి దించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఈ రూమర్ స్ప్రెడర్స్ తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని సోషల్ మీడియా ప్రచారానికి ఆజ్యం పోశారు. దసరా సెలవులను కూడా ఈ ప్రయోజనానికి వాడు కున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే పిల్లలకు ఉద్యోగాలు రావనే ప్రచారం విస్తృతంగా చేశారు. క్షేత్రస్థాయిలో జరుగు తున్న ఈ వ్యతిరేక ప్రచారాలను అధికార వర్గాలు గానీ, అధికార పార్టీ కార్యకర్తలు గానీ పసిగట్టలేకపోయారు. ఒక స్వార్థ వ్యాపార – రాజకీయ ముఠా రూమర్ స్ప్రెడర్స్నూ, సోషల్ మీడియా సైన్యాన్నీ రంగంలోకి దించి బీజేపీ సింగిల్ డిజిట్ దాటదనీ, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనీ గత రెండు మాసాలుగా పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా గాలి వీస్తున్నదనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ కృత్రిమ ‘గాలుల’ ప్రభావం ప్రజల మీద ఏ మేరకు పడిందనే విషయం మరో వారం రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. ఎన్నికల ఫలితాలను హైజాక్ చేయడానికి ఈ ముఠా ఇంత తీవ్రంగా ఎందుకు ప్రయత్నిస్తున్నదో, ఇన్ని వ్యయ ప్రయాసలకు ఎందుకోర్చుకుంటున్నదో ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’ పత్రికవాళ్లు అప్పుడెప్పుడో బ్రాండ్ క్యాంపెయిన్కు వాడుకున్నట్టు గుర్తు. ఇప్పుడు పైన చెప్పిన రెండో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పత్రిక యాజమాన్యం ‘త్యాగాలకు’ కూడా సిద్ధమైంది. ఇంటింటికీ ఉచితంగా పత్రికను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ‘సత్యం నినదించు గాక’ అనే క్యాంపెయిన్ను ‘ఈనాడు’ చాలాకాలం కిందటే నిలిపివేసింది. చంద్రబాబు–యెల్లో కూటమి అండ్ సన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా నిత్యం అసత్యాలను అచ్చొత్తడమే పనిగా పెట్టుకొన్నందున ఆ క్యాంపెయిన్ను కొనసాగించడానికి వాళ్లకే సిగ్గేసింది కాబోలు. ఏదో సినిమాలో మెడలో రుద్రాక్ష మాల ఉన్నంత వరకూ అల్లు అర్జున్ నాన్వయలంట్గా ఉండిపోతాడు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మాలను తీసి పక్కన పెడతాడు. ఈ తీసుకోవడం, వేసుకోవడం గొడవంతా ఎందుకని ‘ఈనాడు’ వాళ్లు సత్యం నినదించుగాక అనే క్యాంపెయిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అసత్య కథనాల వంటకాన్ని ‘ఈనాడు’ భారీగా పెంచేసింది. పేజీకో పొయ్యి చొప్పున వెలిగించి నిత్యాగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్నది. అసత్య కథనాలతో అధికార పక్షం మీద బురద జల్లడానికే అది పరిమితం కాలేదు.మానవ నాగరికత వికాసానికి మోకాలొడ్డే సాహసం చేస్తున్నది. ప్రజాస్వామ్య పరిణతి ప్రస్థానాన్ని వెక్కిరించే విదూషక పాత్రను పోషిస్తున్నది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే తింగరి చేష్టకు తెగబడుతున్నది. కష్టజీవులు తలపెట్టిన సాధికారత యజ్ఞంపై మారీచ మాయలు ప్రయోగిస్తున్నది. మహిళలూ – పేదవర్గాల సాధికారత అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఈ హామీని అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వా ధినేతలందరూ ఈ విషయంలో దోషులే. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ కల్పించడం ద్వారానే క్రమంగా సాధికారత సాధ్యమవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ క్రమం నెమ్మదించింది. ఇన్నాళ్లకు ఇప్పుడొక రాష్ట్ర ప్రభుత్వం దాని వేగాన్ని పెంచే పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు, అన్నివర్గాల మహిళలకు ఒక్కొక్కటిగా ఆర్థిక రాజకీయ సాంఘిక హోదాలను కట్టబెడుతూ వెళుతున్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని సాధికారత పథంలో పరుగు తీయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక జన జాగృత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాన వేసుకున్న మాట నిజమే. ఆ పార్టీ ప్రభుత్వమే, ఆ పార్టీ అధినేతే స్వయంగా పేదవర్గాల సాధికారతను ఒక పవిత్ర లక్ష్యంగా పరిగణిస్తున్నప్పుడు అదే పార్టీ ఈ కార్యక్రమానికి ముందు నడవడం అసహజమేమీ కాదు. వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గంగా మలిచే కార్యక్రమం వల్ల పాలక పార్టీ పలుకుబడి మరింత పెరుగుతుందనడం కూడా వాస్తవమే. ఈ ఒక్క కారణం చాలదా యెల్లో మీడియా కళ్లు మంటెక్కడానికి! దానికి తోడు శ్రామిక వర్గాల సాధికారతను సిద్ధాంతపరంగానే చంద్రబాబు కూటమి వ్యతిరే కిస్తున్నది. కబుర్లు ఏవైనా చెప్పవచ్చు. ఆచరణ ఏమిటన్నదే కీలకం.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సాధికారతకు బాటలు వేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పార్టీ – యెల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను వ్యతిరేకించాయి. ఇప్పటికీ అభాసుపాలు చేయ డానికి, విఫలం చేయడానికి ప్రయ త్నిస్తున్నాయి. మహిళల పేరు మీద సొంత ఇల్లు కట్టించే కార్య క్రమాన్ని వ్యతిరేకించాయి. కోర్టు మెట్లెక్కాయి. అమరావతి శాసన రాజధాని పరిధిలో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల పట్టా లిస్తే ఘోరమైన, క్రూరమైన అప చారం జరిగినట్టు గావుకేకలు పెట్టాయి. బాబు గార్లు ఉండాల్సిన చోట బడుగులు నివసించడమేమిటని వాదించాయి. కుల భ్రష్టమైపోతారట, మైలపడిపోతారట! ఇదే విషయాన్ని పాలిష్ చేసి చెప్పారు. జనాభా సమ తుల్యత దెబ్బతింటుందని! కోర్టులో కూడా ఇదే వాదన చేశాయి. పేదింటి ఆడబిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా, బాల్య వివా హాల రుగ్మతను రూపుమాపే విధంగా పెళ్లి కానుకల కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే కూడా ఈ కూటమి మండిపడింది. కారణం ఆడపిల్లల మీద అభిమానం కాదు. వారి అభివృద్ధి మీద ద్వేషం. అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఇలాగైతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఖర్చు చేయడానికి ప్రజల చేతిలో డబ్బులుంచాలని అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తలు చెప్పినా మన యెల్లో కూటమికి తలకెక్కలేదు. జనం సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకునే మన ‘చీ’ట్ ఫండ్ ముఠాకు అభిజిత్ ముఖర్జీలు, అమర్త్యసేన్లతో ఏం పని? చివరకు ఆర్థిక వేత్తలు చెప్పిందే నిజమైంది. జీఎస్డీపీ గ్రోత్ రేట్లో ఏపీ అగ్రగామిగా నిలబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మ విశ్వాసం ఇనుమడించింది. పేద వర్గాల ప్రజలు సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీదా చంద్రబాబు – యెల్లో ముఠా దాడులు చేస్తూనే వస్తున్నది. సాధికారత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మలిచి ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధమవగానే ‘ఈనాడు’ పత్రిక అన్ని విలువల్నీ వదిలేసింది. దిగంబరంగా నిలబడింది. చివరకు ఉచిత పత్రిక అవతారమెత్తింది. ‘సాక్షి’ చదివే పాఠకులందరికీ ఫ్రీగా పత్రికను పంచడం మొదలుపెట్టింది. ఇదితొలి దశ. క్రమంగా పాఠకులందరికీ పంచడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ‘ఈనాడు’ పాఠకులుగా వున్నవారు వచ్చేనెల బిల్లు కట్టే పరిస్థితి లేదు. పక్కింట్లో ఫ్రీగా వేస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బిల్లు కట్టాలి. చివరికి ఫ్రీగా పేపర్ వేయించుకోవడానికి కూడా నెలకు రెండు ప్రియా పచ్చడి సీసాలు గిఫ్టుగా ఇవ్వాల్సిన దుఃస్థితిలోకి మన ఉచిత పత్రిక కూరుకొనిపోవచ్చు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన వేళ ఈ విషాదం దాని స్వయంకృతం. సామాజిక సాధికారత యాత్ర మొదలవగానే ఫ్రీ పేపర్ కార్యక్రమాన్ని ఈ పత్రిక ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనేది ఒక కారణం కావచ్చు. అసలు కారణం పేదల, మహిళల సాధికారతకు యెల్లో కూటమి వ్యతి రేకమన్న విషయం గతంలో అనేక మార్లు రుజువైంది. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన వారెవరు? చంద్రబాబు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వారెవరు? చంద్రబాబు. దళితులు... మీకెందుకురా అధికారాలు, రాజకీయాలు... అవన్నీ మేం చూసుకుంటామని బోధించిన వారెవరు? బాబు శిష్యపరమాణువు చింతమనేని ప్రభాకర్. కోడలు మగపిల్లాడిని కంటా నంటే అత్త వద్దంటుందా అని మీడియా సమావేశంలోనే ప్రవ చించిన వారెవరు? చంద్ర బాబు. మహిళా అధికారి పట్ల వందలాదిమంది సాక్షిగా దుశ్శాసనుడిలా ప్రవర్తించింది ఎవరు? చంద్రబాబు శిష్య పరమాణువు చింతమనేని ప్రభాకర్. బీసీల తోకలు కత్తిరి స్తానని బెదిరించిందెవరు?చంద్రబాబునాయుడు. ఎస్సీ పిల్లలు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరని తిట్టి పోసిందెవరు? చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదినారా యణరెడ్డి. ముస్లిం మైనారిటీ లకూ, గిరిజనులకూ మంత్రి పదవి లేకుండా చేసిందెవరు? చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలి ఏర్పాటును అటకెక్కించిందెవరు? చంద్రబాబు నాయుడు. ఈ రకమైన దుర్నీతిని ప్రశ్నించకుండా, ప్రస్తావించకుండా, ఎండ గట్ట కుండా ఆమోదముద్ర వేసిన ప్రముఖ పత్రికారాజము ఏది? మన ఉచిత పత్రిక, దాని తోకపత్రిక. ఇటువంటి ముఠా ప్రజా సాధికారతను ఏ రకంగా సహిస్తుంది? రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రోజూ వేలాదిమంది బహు జనులు సాధికారత కోసం నినదిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. సభల్లో సగటున ఇరవై నుంచి పాతికవేల మంది చొప్పున మూడు ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. ఉష్ట్ర పక్షికి భయం వేసినప్పుడు దాని తలను ఇసుకలో దాచేస్తుందట! అప్పుడేమీ కనపడదు. భయం తగ్గిన తర్వాత మళ్లీ బయటకు తీస్తుంది. ఉచిత పత్రికకు కూడా అటువంటి భయమేదో ఉన్నట్టుంది. బాటలు నడిచీ, పేటలు కడచీ, కోటల న్నిటినీ దాటుకుంటూ వచ్చే శ్రామిక జనాన్ని చూస్తే భయం. అందుకే సభ ప్రారంభం కాకముందూ, ముగిసిన తర్వాత ఫోటోలు తీసి అచ్చేసుకొని సంబర పడుతున్నది. ఉష్ట్రపక్షి మాదిరిగా ఉచిత పత్రిక దాని తలను ఎక్కడో దాచుకుంటే నిజం దాగుతుందా? ఎన్నో టీవీ చానెళ్లు, పత్రికలు అసలు విషయాన్ని చూపెడుతున్నాయి కదా! అయినా సరే – నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆశల పల్లకిలో కాంగ్రెస్, అడ్వాంటేజ్ బీఆర్ఎస్!
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతోపాటు తెలంగాణాలో కూడా విజయం సాధిస్తే ‘ఇండియా’ కూటమిలో తన నాయకత్వానికి గౌరవం పెరుగుతుందనీ, ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవచ్చనీ ఆ పార్టీ వ్యూహం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. మధ్యప్రదేశ్లో కూడా సులభంగానే గెలుస్తామనే ధీమా ఆ పార్టీలో కనబడింది. నిన్నటి పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేయ వచ్చని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ పరిస్థితి ఇట్లా ఉంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే సంప్రదాయమున్న రాజ స్థాన్లో కాంగ్రెస్ గెలవడం మాత్రం అనుమానమే! రాజస్థాన్ను కోల్పోతే ఆ లోటును తెలంగాణతో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. కర్ణాటక ఎన్నికలు, బండి సంజయ్ను నాయకత్వం నుంచి తప్పించడం జరిగిన తర్వాత బీజేపీ బలహీనపడినట్టు కనిపించడం కూడా కాంగ్రెస్ ఆశలకు ఊపిరిపోసింది. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై సహజంగానే వ్యతిరేకత ఉంటుందనీ, అది తమకు కలిసివస్తుందనీ కూడా కాంగ్రెస్ అంచనా వేసుకున్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా ఒక భారీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల చేతి గుర్తు మీద వైకుంఠాన్ని చూపడానికి కూడా అది వెనకాడలేదు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలను, ఐదు డిక్లరేషన్లను, రెండు లక్షల ఉద్యోగాలను, ఇంకా అనేక హామీలను ప్రకటించింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, ఏపీలో చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తు గ్యారెంటీ... ఈ గ్యారెంటీ మాటలు మేనిఫెస్టోల్లో కొత్తగా చేరినట్టు కనిపి స్తున్నవి. కాంగ్రెస్ – తెలుగుదేశం మధ్యన ఈ ‘గ్యారెంటీ’ లింకేదో ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయ – వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. రైతుబంధు, రైతు బంధు పెంపు కూలీలకు వర్తింపజేయడం, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్... ఇంత వరకు లెక్కేసినా అదనంగా ఏటా 60 నుంచి 70 వేల కోట్లు అవసర మవుతాయి. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తే అదే 38 వేల కోట్లు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున పది లక్షల ఇళ్లు కేటాయిస్తే 50 వేల కోట్లవుతుంది. ఇలా ఒకసారి పెట్టే ఖర్చు ఈ రెండు పద్దులకే 88 వేల కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్లు కూడా చంద్రబాబు భాషలోనే సంపద సృష్టిస్తా మని చెబుతున్నారు. ఇంతకు ముందు ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు మాయం చేసిన ప్రజాధనం 5 లక్షల కోట్లుగా లెక్క తేలింది. కానీ సృష్టించిన సంపద మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విష యాన్ని గమనంలో ఉంచుకోవలసింది. కర్ణాటకకు ఒక తటస్థ బృందాన్ని పంపించి ఐదు గ్యారెంటీల అమలుపై అధ్యయనం చేసి ఇక్కడ ఆ నివేదికను విడుదల చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి విశ్వస నీయత పెరిగేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటక ఐదు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన పథకం ‘శక్తి’ మాత్రమే! ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరే ‘శక్తి’. ‘అన్న భాగ్య’ ఇంకో పథకం. రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని వారికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామన్నది ఎన్నికల గ్యారెంటీ హామీ. ఐతే ఐదు కేజీలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు. మరో ఐదు కేజీలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నగదు బదిలీలో జాప్యం జరుగు తున్నదనీ, కొందరికి అందడం లేదనీ ఆరోప ణలు వస్తున్నాయి. ప్రతి మహిళకు నెలకు రెండు వేలు అందజేసే పథకం పేరు ‘గృహ లక్ష్మి’. రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభించారు. కోటీ ఆరు లక్షల మంది లబ్ధిదారుల్లో 85 నుంచి 90 శాతం మందికి వరసగా మూడు నెలలపాటు నగదు బదిలీ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేసే ‘గృహజ్యోతి’ పథకం మాత్రం కర్ణాటకలో కల్లోలం సృష్టించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు రైతుల పంపుసెట్లకు ఏడు గంటల విద్యుత్ను ఇచ్చేవారు. ఇప్పు డది నాలుగు నుంచి ఐదు గంటలకు పడిపోయింది. బెంగళూరు నగరంతో సహా పగటిపూట కరెంట్ కట్లు పెరిగిపోయాయి. ‘గృహజ్యోతి’ రాష్ట్రంలో చీకట్లు నింపిందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. ‘యువ నిధి’ పేరుతో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు. ఇంకా అది ప్రారంభానికి నోచుకోలేదు. విద్యుత్ సరఫరా అంశంపై అధికార బీఆర్ఎస్ పార్టీ సవాళ్లను కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కో లేకపోతున్నది. అధికార పార్టీ విసిరిన ‘పవర్’ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చిక్కుకొని నష్టపోయిందనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలహీనపడిన పార్టీ పెద్దగా పుంజుకున్నట్టు ఇప్పటికీ కనిపించడం లేదు. బీజేపీ ప్రభ తగ్గిన తర్వాత దాని విస్తృతి కొంచెం పెరిగినట్టు కనిపిస్తున్నా... 90 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నది. సాధారణ మెజారిటీకి అవసరమైన యాభై శాతం స్ట్రయిక్ రేటును సాధించినప్పటికీ ఆ పార్టీ అవసరమైన సీట్లకు చాలా దూరంలోనే ఉండిపోతుంది. తాను గట్టిగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో మూడింట రెండు వంతుల స్ట్రయిక్ రేటు సాధించగలగాలి. ఆ స్థాయి స్ట్రయిక్ రేటును ‘వేవ్’గా పరిగణిస్తారు. అటువంటి ప్రభంజనం ఏదీ ఉన్నట్టుగా ఇప్పటి వరకూ ఏ ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ కూడా గుర్తించలేకపోయింది. అధికార పార్టీకి ఉన్న మరో సౌలభ్యం దానికి మజ్లిస్ మిత్రపక్షంగా ఉండటం! ఊరు మీద ఊరు పడ్డా మజ్లిస్ పార్టీ ఏడు సీట్లకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. బీఆర్ఎస్కు ఓ ఏడు సీట్లు తగ్గినా కూడా మజ్లిస్ తోడ్పాటుతో భర్తీ చేసుకోగలదు. యాభై శాతం స్ట్రయిక్ రేటుతో కూడా ఆ మాత్రం సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోగలుగుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన సారూప్యతను కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో నలభయ్యేళ్ల లోపు ఓటర్లు ఎంతమంది ఉన్నారో దాదాపుగా అంతే సంఖ్యలో 40 ఏళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారు. వివిధ సర్వేల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల ప్రకారం 40 ఏళ్ల లోపు సమూహంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నది. మార్పు కావాలన్న అభిప్రాయం ఈ సమూహంలో వినబడుతున్నది. నలభ య్యేళ్లు దాటిన వారిలో ప్రభుత్వ అనుకూలత బలంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్తో పాటు ఈసారి బీజేపీ కూడా పంచుకోవలసి ఉంటుంది. బీజేపీ ఓటర్లలో యువతరం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్కు ప్రతికూలమైన అంశం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లనే పొందిన కాషాయ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోబోతున్నదని శాస్త్రీయమైన సర్వేల్లో వెల్లడవుతున్నది. వ్యూహాత్మకంగా 25 స్థానాలపై కేంద్రీకరించి పరివార్ శక్తులు చాపకింద నీరులాగా పనిచేసుకుంటు న్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పది సీట్లకు తగ్గకుండా గెలవాలనీ, మిగిలిన పదిహేను చోట్ల రెండో స్థానంలోనైనా నిలవాలనీ బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలించినంత మేరకు కాంగ్రెస్ బలంలో కోత పడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన 34 సీట్ల హామీని కాంగ్రెస్ నిల బెట్టుకోలేక పోవడం కూడా ఒక మైనస్ పాయింట్. బీసీల్లో ఈ పరిణామం ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్న వాళ్లు కూడా అది గెలిచే నియో జకవర్గాల పేర్లను 45కు మించి చెప్పలేక పోతున్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తున్నది. సోషల్ మీడియాలో వీరు క్రియాశీలకంగా ఉన్నందు వల్ల కాంగ్రెస్ టాక్ కొంత గట్టిగా వినిపి స్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బేరీజు వేసుకు న్నప్పుడు అధికార పార్టీ విజయానికి ఢోకా ఉన్నట్టు కనిపించడం లేదు. కాకపోతే బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆవిర్భవించ వచ్చు. ఈరోజు వరకున్న పరిస్థితి – అడ్వాంటేజ్ బీఆర్ఎస్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3 శాతం ఓట్లు సంపాదించింది. ఆ మూడు శాతం ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్ను చంద్రబాబు చేతిలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణా యూనిట్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒక సారో పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే! లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో ‘హోమ్లీ ఫీలింగ్’ను కలుగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనుకాడటం లేదు. తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇండియా టుడే’ జాతీయ న్యూస్ ఛానల్ వాళ్లు హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతోపాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రెండు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ‘1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించింద’ని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50 వేల ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథా లాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటా యనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే రెండు చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? ఎనభయ్యో దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో యెల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి యెల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను ముని గింది గంగ! తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగివుండి తీరాలి. వేరే మార్గం లేదు! ఆ దశలో చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని సృష్టించి పరుగులరాణి పంచకల్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ‘ఐటీ రంగ సృష్టికర్త అతనే’ అని డప్పు వేయించారు. ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే – చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి, తనను తాను ఐన్స్టీన్కు అన్నయ్యగా, న్యూటన్కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా! రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్ఫోన్, కంప్యూటర్ వగైరా వగైరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేక పోవడానికి యెల్లో మీడియా డప్పుల మోతే కారణం. వాస్తవానికి హైదరాబాద్లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసు కున్న దార్శనికుడు... నాటి ప్రధాని పీవీ నరసింహారావు. ‘సాఫ్ట్వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్పై ఉండే మక్కువతో మొదటి పార్క్ను హైదరాబాద్కు కేటాయించారు. ఇప్పుడు ‘సైబర్ టవర్స్’గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) శంకు స్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి, ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు, బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలిస్థానంలో ఉండవలసిన హైదరాబాద్ను బెంగళూరు అధిగమించింది. ఆ రకంగా హైద రాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం! వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావల్సినవాడ య్యారు. కనుక ఐటీని కనిపెట్టినవాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు’ అనుకున్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్నని నమ్మడం మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్ను తీసుకోవాలి కదా? విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ వాళ్లే దీన్ని గుర్తించి క్రెడిట్ను కాంగ్రెస్కు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాటపడుతున్నారు. దాని కొనసాగింపే నిన్నటి ‘ఇండియా టుడే’ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు. చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్కు కాంగ్రెస్ వాళ్లు శంకుస్థాపన చేస్తే, ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారం భంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగురోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కి.మీ. రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే! కాగితం కదిలిందీ లేదు. సర్వే జరిగిందీ లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో, 175 కి.మీ. పొడవునా నిర్మించాలని సంకల్పించి, సర్వేలను ముగించి, శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే! ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి, ‘పెద్దలా? గద్దలా..?’ పేరుతో విషప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనుక ఆయన సలహాను వైఎస్సార్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభు త్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలామందికి గుర్తే! భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90 శాతాన్ని రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుదీ కరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా వుంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం యెల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభి మానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహ రిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్ఠలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు, పాంచాల రాజైన ద్రుపదుడు బాల్యస్నేహితులు. కష్టాల్లో ఉన్న ద్రోణుడు ఒకసారి సాయం కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడట. ద్రుపదుడు అవమానించి పంపాడు. ఆ కోపాన్ని చానాళ్లపాటు ద్రోణుడు కడుపులో దాచుకున్నాడు. కురు, పాండవ రాకుమారులకు విద్య నేర్పిన తర్వాత కడుపులోని అక్కసును వాళ్ల ముందు ద్రోణా చార్యుడు వెళ్లగక్కాడు. వెంటనే అర్జునుడు బయల్దేరి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు ముందు నిలబెడతాడు. ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదుర వుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోలెడంత ఊరట. తన విజన్ను పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు. ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు. అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకూ, రాచకొండ గుట్టలకూ మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్గా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివా దాలు వగైరా వేరే అంశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్ర బాబు గురువు. చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురుపరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకూ ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి! గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయాన్నందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్తో పాటు బాబు వర్గం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారూ సుమారు 150 మంది హైదరాబాద్లోని ఓ క్లబ్లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో భూములు కొనుగోలు చేసినవారున్నారు. ఇంకొందరు తెలుగు దేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలనీ, అందుకు అవసరమైన ‘సహకారాన్ని’ అందించాలనీ కూడా వారు తీర్మా నించినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి. అమరావతి వెంచర్లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు రాచకొండ ప్రక టనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్ష ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది. రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు. భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు కావలసింది అరచేతిలో వైకుంఠం చూపడమే! అమ రావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ‘హస్తం’లో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే! క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నాలుగు వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28వ తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాంగ్రెస్ వెనుక అదృశ్య హస్తం!
కొన్ని సారూప్యతలు కాకతాళీయం కావచ్చు. కొన్ని కాకతాళీయంగా భ్రమింపజేసే ప్రణాళికలు కావచ్చు. 83 సంవత్సరాల వృద్ధుడైన విప్లవ కవి వరవరరావుకు కూడా హైదరాబాద్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ముంబై ఎన్ఐఏ కోర్టు అనుమతి లభించింది. అయితే ఈ అనుమతి కోసం ఆయన గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నిస్తున్నారట! చంద్రబాబు కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం హైకోర్టు నుంచి మెడికల్ బెయిల్ సంపాదించిన సంగతి తెలిసిందే. వరవరరావుకు చంద్రబాబు కంటే ఓ వారం రోజుల ముందే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆయనకు ఆపరేషన్ కోసం ఒక వారం రోజులు మాత్రమే సమయమిచ్చారు. చంద్రబాబుకు ఆ హడావిడి లేదు. న్యాయ స్థానం ఉదారంగానే సమయాన్నిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడానికి ఒక రోజు ముందే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసేరోజు దాకా ఆయనకు బెయిల్ గడువు వర్తిస్తుంది. భలే టైమింగ్! రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వ్యవహారాల్లో బాబు ఆసక్తి చావలేదు. ఆయనకూ, ఆయనకు కావలసిన వారికీ అక్కడ విస్తారంగా ఆస్తులుండటం అందుకు కారణం కావచ్చు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా దొరక్కపోయి ఉన్నట్లయితే డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పన్నారట! ప్రభుత్వానికి ఉప్పందడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకోగలిగింది. హైదరాబాద్ మీద ఏపీకి పదేళ్లపాటు ఉన్న రాజధాని హక్కుల్ని వదులుకునేందుకు సిద్ధపడటంతో కేసీఆర్ ఈ కేసులో చంద్రబాబును వదిలేశారు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్తో జట్టుకట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించి భంగ పడ్డారు. ఆయన ఆసక్తికి తగినట్టుగానే ఆయన ప్రస్తుత మెడికల్ బెయిల్ టైమింగ్ కూడా బాగా కుదిరింది. బెయిల్ రావడానికి రెండు రోజుల ముందు తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ను చంద్రబాబు ములాఖత్కు పిలిపించుకున్నారు. ఆ భేటీ తర్వాత జ్ఞానేశ్వర్ హైదరాబాద్కు వెళ్లి ప్రెస్మీట్ పెట్టి పార్టీకి రాజీ నామా చేశారు. ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా టీడీపీ అభిమానుల ఓట్లు కాంగ్రెస్కు వేయించాలని చంద్రబాబు ఆయనకు చెప్పారట! ఈ వైఖరి నచ్చని జ్ఞానేశ్వర్ తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇదే సమయానికి తెలంగాణ కాంగ్రెస్ వైఖరిలో కూడా మార్పులు రావడం మొదలైంది. రాయ్పూర్ తీర్మానం మేరకు బీసీలకు, మహిళలకు, యువతరానికి టిక్కెట్ల పంపిణీలో పెద్ద పీట వేయబోతున్నట్లు ఊదరగొట్టారు. బీసీలకు 34 సీట్లను కేటాయించబోతున్నట్టు రాష్ట్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ కేటాయింపు దగ్గరికొచ్చే సరికి మొండి చేయి చూపెట్టారు. ఏపీ రాజ కీయాల్లో బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్ర బాబు హెచ్చరిస్తుంటారు. తెలంగాణా కాంగ్రెస్ వాళ్లు మాత్రం నిజంగానే బీసీల తోకలు కత్తిరించేశారు. ఇప్పటివరకు ప్రకటించిన 100 సీట్లలో 20 సీట్లు మాత్రమే బీసీలకు ప్రకటించారు. అందులో నాలుగు సీట్లు హైదరాబాద్ పాతబస్తీ లోనివి! డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేని స్థానాలు. అంటే నికరంగా బీసీలకు 16 సీట్లను మాత్రమే కాంగ్రెస్ ఇచ్చి నట్టు! ప్రకటించవలసిన సీట్లు 19. అవన్నీ బీసీలకు ఇస్తేనే కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నట్టు! కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మరో నాలుగు కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టడంతో అలిగి ఆఫీసుల్లో కూర్చున్న కమ్యూనిస్టు ముత్తయిదువలను కాంగ్రెస్ వాళ్లు బొట్టు పెట్టి మరీ పిలుచు కొచ్చారు. కనీసం చెరో రెండు సీట్లను వాయనంగా ఇస్తామని చివరిదాకా నమ్మబలికారు. ఆఖరు నిమిషంలో చెరొకటే ఇస్తామని చెట్టెక్కడంతో అవమానంగా భావించిన సీపీఎం కాంగ్రెస్తో తెగదెంపులు ప్రకటించింది. సీపీఐ మాత్రం ఆ ఒక్కటి చాలనే నిర్ణ యానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికీ, యువనేతలకూ టిక్కెట్ల పంపి ణీలో చేయిచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారికి బదులుగా దాదాపు 35 మంది పారాచూటర్లకు (అప్పుడే పార్టీలోకి వచ్చినవారు) టిక్కెట్లు కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలనే నిర్ణ యంతో రాయ్పూర్ డిక్లరేషన్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే పదేళ్లుగా అధికారంలో వుండి బాగా నునుపుదేలి ఉన్న బీఆర్ఎస్ గుర్రాలను ఈ కొత్త గుర్రాలు ఢీ కొట్ట గలుగుతాయా? కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్టు వారికి అనుకూలమైన గాలి వీస్తున్నట్టయితే బలిసిన అభ్యర్థులు దేనికి? రాయ్పూర్ డిక్లరే షన్కు కట్టుబడి ఉండవచ్చు కదా! అభ్యర్థుల ఎంపికకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ వివరణలు సంతృప్తికరంగా లేవు. వారి నిర్ణయాలను వారే తిరగదోడటం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉన్నట్టు తోస్తున్నది. పోస్ట్ ఎలక్షన్ ‘అవసరాలను’ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు–రామోజీ ద్వయం ఈ రకమైన వ్యూహాన్ని అమలుచేసింది. వెన్నుపోటు ఘట్టంలో ఈ వ్యూహం వారికి ఉపకరించింది. ‘గెలుపు గుర్రాల’ ఎంపికలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలను ప్రామాణికంగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. రాయ్పూర్ డిక్లరేషన్ తయారు చేయడంలో కూడా సునీల్ పాత్ర ఉందనే ప్రచారం ఉన్నది. తన డిక్లరేషన్కు విరుద్ధంగా తానే అభ్యర్థులను ప్రతిపాదిస్తాడా? ఇంకేదైనా కారణం ఉన్నదా? సునీల్ కనుగోలు మనవాడే! బళ్లారిలో పుట్టి పెరిగిన తెలుగువాడు. ఆంధ్రరాష్ట్రంతో సామాజిక బంధాలు – బాంధవ్యాలు ఉన్నవాడేనని చెబుతారు. రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నదట! తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున పనిచేయాలనే ఆలోచన కూడా ఉన్నదంటారు. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తన మార్గదర్శకాలను తానే ఉల్లంఘించడం కోసం సునీల్ కనుగోలు పేరును వాడేసుకుంటున్నది. చంద్రబాబు మెడికల్ బెయిల్పై విడుదలై హైదరాబాద్కు చేరుకున్న రోజున జూబ్లీహిల్స్లోని ఓ క్లబ్లో ఒక భారీ పార్టీ జరిగిందట! సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన సుమారు 150 మంది బాబు అనుయాయులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అందులో చర్చ జరిగిందట! చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఛోటా, బడా నేతలు ‘సెటిలర్లందరూ ఈసారి కాంగ్రెస్కే ఓటేస్తార’ని బడాయి కబుర్లు చెప్పడం వింటున్నాము. వాస్తవం ఏమిటంటే ఆంధ్ర సెటిలర్లలో చంద్రబాబు సామాజిక వర్గం వారి జనాభా కేవలం ఇరవై శాతం మాత్రమే. మిగిలిన ఎనభై శాతం జనాభాలో అత్యధికులు ఈ వర్గం రాజకీయ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధ అభిప్రా యాలతో ఉంటారు. కానీ సెటిలర్లందరి తరఫున వీరు చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచే అవకాశాలే ఎక్కువ. 25 అసెంబ్లీ సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ బాగా బలపడిందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సీఎస్డీఎస్కు చెందిన సంజయ్ కుమార్ ‘ఇండియా టుడే’ ఛానల్లో మాట్లాడుతూ మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోతున్నట్టు చెప్పారు. ‘టైమ్స్ నౌ’లో నావికా కుమార్ కూడా తమ సర్వేలో అటువంటి ఫలితమే వచ్చిందని చెప్పారు. ఒక్క సీ–ఓటర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను అంచనా వేస్తున్నది. కానీ ఆ సంస్థ ట్రాక్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి ఉపకరి స్తున్న మాట యథార్థమే. కానీ విజయ తీరాలను చేరడానికి కాంగ్రెస్ అనేక అడ్డంకులను అధిగ మించవలసి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అభిమానించే బీసీల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించ వలసి ఉన్నది. అంతర్గత కుమ్ము లాటలను అధిగమించవలసి ఉన్నది. అన్నిటినీ మించి కాంగ్రెస్ గెలిస్తే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరన్న నమ్మకం ఓటర్లకు కలగాలి. అప్పుడు కూడా బీజేపీ ఓటు శాతం సింగిల్ డిజి ట్కు పరిమితమైతేనే కాంగ్రెస్ బలమైన పోటీదారుగా రంగంలో ఉంటుంది. ఈలోగా బిడ్డను కనా ల్సిన తెలంగాణ కాంగ్రెస్కు బదులుగా చంద్రబాబు వర్గం తానే పురిటి నొప్పులు పడతానంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భావజాలం గీసిన భూమధ్య రేఖ!
నిఖార్సయిన వర్గ విభజన చోటు చేసుకుంటున్నది. కులమూ, వర్గమూ కలగాపులగమైన సమాజం మనది. పెత్తందారీ తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మనది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత రెండు వర్గాల మధ్య విభజన రేఖలా చీకట్లో కూడా మెరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో సామాజిక శక్తుల పునరేకీకరణ రాజకీయ శిబిరాల్లో వేగంగా జరుగుతున్నది. ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పేరుతో వైసీపీ పతాకాల నీడలో పీడిత వర్గాల ప్రజలు రాష్ట్రమంతటా కదం తొక్కుతున్నారు. అగ్రకుల పేదల సౌహార్దం ఈ యాత్రలకు వన్నె తెస్తున్నది. గడిచిన ఏడు రోజుల్లో 19 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరిగాయి. 19 బహిరంగ సభలు జరిగాయి. ఈ సభల్లో ఐదు లక్షలమందికి పైగా జనం పాల్గొన్నట్టు అంచనా. ఇంకా బస్సు యాత్ర పొడుగునా మద్దతు ప్రకటించినవారూ, బస్సులో ఉన్న నాయకుల సందేశాన్ని గ్రామగ్రామాన విన్న వారినీ కలుపుకుంటే ఈ సంఖ్య బహుశా రెట్టింపు ఉంటుంది. ఇంకో యాభై రోజులపాటు ఈ యాత్రలు కొనసాగనున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను గమనంలోకి తీసుకుంటే దాదాపు కోటిమంది సాధికార యాత్రల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పేద వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ నేతలు బలహీన వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఆలంబనతో సాధికారత పథంలోకి దూసుకొనిపోవలసిన ఆవశ్యకతను వారికి బోధిస్తు న్నారు. పాల్గొంటున్న జనం కూడా నాటి ప్రభుత్వ విధానాలు, నేటి ప్రభుత్వ విధానాల మధ్య గల తేడాలను బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే బహిరంగ సభల్లో ప్రస్తావించిన ఒక పోలిక ఇప్పుడు జనం చర్చల్లో నిత్యం నానుతున్నది. పేదల సంక్షేమం కోసం తాము ‘డీబీటీ’ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానాన్ని అనుసరిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘డీపీటీ’ (దోచుకో... పంచుకో... తినుకో) అమలు చేశారని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు జనం సాక్షిగా రుజువులు కనిపిస్తున్నాయి. అమ్మవొడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెన్షన్ కానుక వగైరా 29 స్కీముల పేరుతో అక్టోబరు చివరి నాటికి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వేసింది. జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక తదితర తొమ్మిది నాన్ డీబీటీ స్కీముల కింద మరో లక్షా 67 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు కాలం నాటి రాష్ట్ర బడ్జెట్తో జగన్ ప్రభుత్వం బడ్జెట్ దాదాపుగా సమానం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన ప్రకారం బాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ. మరి ఈ ప్రభుత్వం జనం ఖాతాల్లోకి పంపించిన డబ్బును బాబు హయాంలో దేనికి ఉపయోగించారు? జగన్ ప్రభుత్వ డీబీటీ, నాన్ డీబీటీ స్కీముల ద్వారా 1 కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి కుటుంబానికీ ఒకటి కంటే ఎక్కువ పథకాలు లభించాయి. ఈ కుటుంబాల వారికి సగటున 3 లక్షల రూపాయల లబ్ధి జరిగింది. మరి బాబు హయాంలో ఈ డబ్బులు పొందిన లబ్ధిదారులెవరు? చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అరకొర మాత్రమే! సంక్షేమ పెన్షన్ల మీద 53 మాసాల్లో జగన్ ప్రభుత్వం 81 వేల కోట్లు ఖర్చుపెడితే 60 మాసాల్లో బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 20 వేల కోట్లు మాత్రమే! ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుకార్చారు. ఇంతకు మినహా ఆయన అమలుచేసిన డీబీటీ స్కీములు ఏమీ లేవు. అప్పుడు పేద లబ్ధిదారులు ప్రయోజనం పొందిన స్కీములు తక్కువే అయినా పెత్తందారీ లబ్ధిదారులు మాత్రం కళ్లు చెదిరే మొత్తాలను స్కాముల ద్వారా కొల్లగొట్టారు. ఇందులో ఆరు స్కాములపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. 371 కోట్ల స్కిల్ స్కామ్లో లబ్ధిదారుగా చంద్రబాబు వైపే వేళ్లన్నీ చూపెడుతున్నాయి. 144 కోట్ల ఫైబర్నెట్ స్కామ్లో కూడా ఆయనే తుది లబ్ధిదారుగా సీఐడీ నిర్ధారణకొచ్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్లో అధమ పక్షం రెండు వేల కోట్ల భూ దోపిడీ జరిగింది. ఇందులో చంద్రబాబు కుటుంబంతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని, పవన్ కల్యాణ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలను లబ్ధిదారులుగా గుర్తించారు. 4,500 కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణ, లింగమనేని కుటుంబాలు ముఖ్య లబ్ధిదార్లు. మద్యం కుంభ కోణం విలువ 5,200 కోట్లు. చంద్ర బాబుతోపాటు అయ్యన్నపాత్రుడు, సుధా కర్ యాదవ్ (యనమల వియ్యంకుడు), ఎస్పీవై రెడ్డి లబ్ధిదారులు. ఇసుక కుంభ కోణం విలువ 10 వేల కోట్లు. చంద్ర బాబుతోపాటు పీతల సుజాత, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఆరు స్కామ్ల మీద సీఐడీ తగిన ఆధారాలతో కేసులను నమోదు చేసింది. ఇవే కాకుండా బలమైన ఆరోపణలతో డజన్ల కొద్దీ స్కాములున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే రూ. లక్ష కోట్ల విలువైన 20 వేల ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో వాటికి సంబంధించిన భూరికార్డులు గల్లంతయి నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలోనే చంద్రబాబు విశాఖలో మకాం వేసి తుపానుపై తాను యుద్ధం చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల కోట్ల విలువైన గ్రానైట్, ఇనాం, ప్రైవేట్ భూములను చెరపట్టినట్టు ఆధారాలు లభిస్తు న్నాయి. పవన విద్యుత్ ఒప్పందాల్లో 11,625 కోట్లు కొల్లగొట్టారు. అమరావతి బాండ్ల జారీ ముసుగులో చినబాబు, పెద బాబులు రెండు వేల కోట్ల పెట్టుబడులు బినామీ కంపెనీల ద్వారా పెట్టినట్టు ఆరోపణ లొచ్చాయి. నీరూ–చెట్టూ పథకంలో 24 వేల కోట్లను కైంకర్యం చేశారు. ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కాంట్రాక్టుల్లో 4 వేల కోట్లు స్వాహా చేశారు. తాత్కాలిక సచివాలయ భవనం కాంట్రాక్టులో 800 కోట్ల కమిషన్ బాబుకు చేరినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అమరావతి హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడిలో 380 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో కాంట్రాక్టుల్లో 675 కోట్ల మూలవిరాట్టుకు ముడుపు కట్టినట్టు సమాచారం. జెన్కో థర్మల్ ప్రాజెక్టు టెండర్లలో 670 కోట్లు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో 1800 కోట్లు అవినీతి ఖాతాలో పడి నట్టు రుజువులున్నాయి. ఇవి కొన్ని మాత్రమే! ఇక రాజధాని పేరు మీద తెరలేపిన అవినీతి ఒక అంతులేని అగాధం. దిగితే తప్ప దాని లోతు తెలియదు. బాబు జమానాలో దాదాపు ఆరు లక్షల కోట్ల మేరకు స్వాహాకార్యం జరిగినట్టు బలమైన ఆరోపణలున్నాయి. ఈ మొత్తంలో వాటాలు పొందిన వారిలో పెత్తందార్లు, ఉప పెత్తందార్లు చాలామందే ఉన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదార్లు సాధికారత పేరుతో జైత్రయాత్రలు చేస్తుంటే మన పెత్తందారీ, పిల్ల పెత్తందారీ లబ్ధిదారులు చూస్తూ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. స్కిల్ స్కామ్లో చంద్ర బాబు అరెస్ట్ సందర్భాన్ని ఉపయోగించుకొని సాధికారత యాత్రలను మరుగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ పేరుతోనూ, ఇతర సంఘాల పేరుతోనూ ఈ పిలుపులు ఇచ్చినప్పటికీ ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఒకే ఒక్క సామాజిక వర్గం వారు. ఈ కార్యక్రమాల కోసం సోషల్ మీడియా వేదికగా జరిగిన సన్నాహాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారి వివరాలను పరిశీలించినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. బాబు మెడికల్ బెయిల్పై విడుదలై విజయవాడ చేరుకున్న సందర్భంగా పబ్లిక్ షోను ఆర్గనైజ్ చేసిన వారిని పరిశీలించినప్పుడు కూడా ఇదే సంగతి తేటతెల్లమైంది. నలభయ్యేళ్ల చరిత్ర, అందులో ఇరవయ్యేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చివరికి ఒక సామాజికవర్గంపైనా, పిడికెడు మంది ఇతరులపైనా ఆధారపడాల్సి రావడం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ బలాబలాల పొందిక ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. ఇప్పుడు మేకతోళ్లు కప్పుకున్న తోడేళ్లను మంద గుర్తించ గలుగుతున్నది. ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల ప్రజాధనాన్ని భోంచేసిన పెత్తందారీ శక్తులు ఒక పక్కన, నాలుగున్నర లక్షల కోట్లను పైసా వృథా కాకుండా ప్రజా సంక్షేమానికి తరలించిన ప్రజాశక్తులు పక్కన మోహరించాయి. అధికారానికి దూరమైనప్ప టికీ ధనబలం కలిగిన పెత్తందారీ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇతర చిన్నాచితక రాజకీయ పార్టీలను అదుపులోకి తీసుకొని తనకు అను కూలంగా తోలుబొమ్మలాటలాడించగల సామర్థ్యం పెత్తందారీ పార్టీకి ఉన్నది. మీడియా మీద ఉన్న గుత్తాధి పత్యంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసుకోగల ప్రావీణ్యం దానికున్నది. వ్యవస్థ లను నియంత్రించి చట్టానికీ, ధర్మానికీ తాను కోరు కున్న భాష్యం చెప్పగల నేర్పరితనం దాని సొంతం. రాబోయే యుద్ధంలో పేదవర్గాలు గెలుపొందాలంటే నిరంతర జాగరూకత ఒక్కటే మార్గం. రచ్చబండలపై రాజకీయ పార్టీల జమాఖర్చులను దండోరా వేయడమే శరణ్యం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన తర్వాత, ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్తో చదివించారో కూడా పవన్, మనోహర్లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్ఎమ్వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బీసీ ‘కమలం’!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్ఎస్కు వందమందికి పైగా సిటింగ్ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది. కాంగ్రెస్కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు. వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్పాత్ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు. మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు. 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు. ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో వెళ్లండ’ని సీనియర్ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది. వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్రిజర్వ్డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్మెంట్ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మార్చింగ్ సాంగ్
నూరు గొడ్లను తిన్న ఒకానొక రాబందు ఓ చిరుగాలి వానకు గాయపడిందట! ఈ గాయం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమట! కానీ, గాయపడిన పిట్టల కోసం, రాలిపడిన పువ్వుల కోసం పరితపించడం మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమట! పిట్టల గాయాలు మాన్పి నింగి లోకి ఎగరేయడం నేరమట! రాలిన పువ్వులను మాల కూర్చి మందిరానికి చేర్చడం పాపమట! తీతువులు నీతులు చెబుతున్నాయ్. గ్రద్దలు క్రుద్ధమవు తున్నాయ్. తోడేళ్లు తొడలు చరుస్తున్నాయ్! ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ నేడు ప్రజాస్వామ్య పాఠాలను బోధిస్తున్నది. దాని తాబేదార్లు తందానా అంటున్నారు. పెత్తందారీ ప్రజా స్వామ్యం కోసం వందిమాగధులు, భజంత్రీలు సహస్ర గళార్చన చేస్తున్నారు. రాబందుల స్వేచ్ఛపై ఆంక్షలేమిటి? రామోజీల ‘చీట్’లకు ఆటంకాలేమిటని ప్రశ్నిస్తున్నారు. తోడేళ్ల మందలు స్వైర విహారం చేసినంత మాత్రాన బంధిస్తారా? ప్రభుత్వ పెద్దలు ఖజానాకు కన్నం వేస్తే అరెస్టు చేస్తారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊరేగుతున్నారు. ఇప్పుడక్కడ ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతున్నది. కులం,మతం, ప్రాంతం, జాతి, స్త్రీ–పురుష వివక్ష లేకుండా భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రసాదించిన హక్కులను వారికి దఖలు పరచడానికి, ఆదేశిక సూత్రాలను శిరసావహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షం, దాని తైనాతీల రూపంలో ఘనీభవించిన పెత్తందారీ వ్యవస్థ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నది. దాని దశకంఠాలు రణరంకెలు వేస్తున్నయ్. దాని వేయి చేతులు కత్తులు దూస్తున్నయ్. పేద ధనిక తేడా లేకుండా పుట్టిన ప్రతిబిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా పెరగడం కోసం, ఉన్నత లక్ష్యాల వైపు స్వేచ్ఛగా పరుగెత్తగలగడం కోసం, అందలాలు అందుకోవడం కోసం సమానావకాశాలుండాలని రాజ్యాంగం వాంఛించింది. ఆ వాంఛితానికి వాస్తవ రూపు కట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పెత్తందారీ వ్యవస్థ ప్రయోజనాలకు ఈ ప్రయత్నాలు వ్యతిరేకం. కనుకనే తెలుగుదేశం – యెల్లో మీడియాల సేనాధిపత్యంలో మోహరించిన పెత్తందారీ వ్యవస్థ యుద్ధం ప్రకటించింది. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘క్లాస్ వార్’గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘వర్గ పోరాటానికి’ తన సేనావాహినిని సమాయత్తం చేస్తూ ఈ వారం విజయవాడలో వైఎస్ జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలం, ఆ పైస్థాయి పార్టీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘మీరే నా సేనాపతులు. మీరే నా దళపతులు’... అంటూ ఈ సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికది ప్రసంగం కాదు. ఒక మార్చింగ్ సాంగ్. కవాతు గీతం. ‘పదండి ముందుకు, పదండి తోసుకు... పోదాం పోదాం పైపైకి! కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ’ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా సాగిందా ప్రసంగ పాఠం. ప్రజలందరికీ సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం తన ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘మాగ్నా కార్టా’పై ఆయన తన దళపతులకు సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నా... నా... నా... నా... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రకులాల పేదలు అని పదేపదే సంబోధిస్తూ ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీని ఘంటాపథంగా ప్రకటించారు. ఆ ఫిలాసఫీని పార్టీ నాయకశ్రేణుల మెదళ్లలోకి బలంగా జొప్పించే ప్రయత్నం చేశారు. గడిచిన ఎన్నికల్లో మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన ‘మాగ్నాకార్టా’ను 99 శాతం అమలు చేశామని ఆయన ఈ సభలో ప్రకటించారు. ‘‘ఈ 52 మాసాల్లో మనం చేసిన మంచే మన బలం... మన ధైర్యమని చెబుతూ ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాం. దేవుడి దయ మనకు తోడుగా ఉన్నది. చేసిన అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తున్నది. కనుక ’వై నాట్ 175‘ అనేది మన లక్ష్యం కావాల’’ని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేస్తూ సాగిన ఐదేళ్ల పదవీ కాలానికి ఒక వినూత్నమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రజా ఉద్యమ రూపంగా మలిచి ఆయన పార్టీ శ్రేణుల ముందుంచారు. ఈ ఉద్యమం నాలుగు రూపాల్లో సంక్రాంతి పండుగ దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత పెన్షన్ల పెంపుతో సహా మరో మూడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖాన్ని పూరించబోతున్నది. ఈ నాలుగంచెల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరుకూ చేరువవుతాయి. ‘మా పరిపాలనలో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మాటతోనే ఆయన పార్టీ సగం యుద్ధాన్ని గెలిచింది. అదే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి గడప ముందు వినిపిస్తారు. క్లైమాక్స్లోని మొదటి ఉద్యమ రూపం – ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం’. ఇది ప్రారంభమై పదిహేను రోజులు విజయవంతంగా నడిచింది. ఇంకో ఇరవై ఐదు రోజులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా పదిహేను వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాన్నీ, ఇంటినీ జల్లెడపడుతున్నారు. ఈ శిబిరాలు అందరికీ పరీక్షలు చేసి, సమస్యలున్నవారికి మందులు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కావడం లేదు – జబ్బులున్న వారినీ, దీర్ఘకాలిక రోగా లున్నవారినీ కూడా గుర్తించి వారికి చేయూతనిచ్చి రోగం నయమయ్యే దాకా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ శిబిరాలు జరిగినన్ని రోజులు ఊరూవాడా అంతటా ఆరోగ్య రంగంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైద్య సేవలు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. యాభై వేలకు పైగా వైద్య సిబ్బందిని కొత్తగా నియమించడం, ఊరూరా వెలసిన ఆరోగ్య కేంద్రాలు, పటిష్ఠమైన పీహెచ్సీలు, అందు బాటులోకి ఫ్యామిలీ డాక్టర్ పథకం, అంబులెన్స్ సర్వీసులు, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు వగైరా విషయాలన్నింటిపై జనంలో చర్చ జరుగుతుంది. వారికి అవగాహన పెరిగి, వైద్య సేవలను గరిష్ఠంగా వినియోగించు కోగలుగుతారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనేది రెండో దశ కార్యక్రమం. ఇది కూడా నలభై రోజుల దీక్ష. ఇందులో కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపునూ తడతారు. ఐదేళ్లలో వచ్చిన మార్పులను గుర్తు చేస్తారు. పరిపాలనా వికేంద్రీకరణనూ, కొత్త జిల్లాలను, గ్రామ సచివాలయాలను, వలంటీర్ వ్యవస్థను, వాటి ప్రయోజనాలనూ గుర్తు చేస్తారు. చేరువైన ఆరోగ్యరంగాన్నీ, మెరుగైన విద్యా వ్యవస్థనూ పరిశీలించాలని చెబుతారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆర్బీకే సెంటర్లనూ, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారు. మొత్తంగా ఆ ఇంటికీ, ఊరికీ, ఆ ప్రాంతానికీ జరిగిన మేలును విడమర్చి చెబుతారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల పనితీరును తులనాత్మక పరిశీలనకు పెడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే సామాజిక బస్సు యాత్రలు రెండు మాసాలపాటు సాగుతాయి. సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, వేసిన పెద్దపీట ఈ యాత్రలలో హైలైట్ అవుతుంది. రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక విద్యా రంగాల్లో ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సామాజిక న్యాయం, బాబు హయాంలో జరిగిన దురన్యాయాలు చర్చకు వస్తాయి. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జీలుగా పనికిరారు, బీసీల తోకలు కత్తిరిస్తా..’ అనే భావజాలానికీ, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అనే భావ జాలానికీ మధ్య ఉన్న తేడాను జనం గుర్తిస్తారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అనే పురుషాహంకారానికీ, మహిళా సాధికా రత స్వరానికీ మధ్య గల తేడాను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆఖరి దశలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమం ఒక యువ చేతనా ఉద్యమం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా క్రీడా రత్నాలను వెలికితీసే యజ్ఞం. లక్షలాదిమంది యువకులు ప్రత్యక్షంగా ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఎన్ని కల ప్రచారానికి ముందు ఐదేళ్ల పాలనా కాలానికి వైసీపీ అధినేత రూపకల్పన చేసిన భారీ క్లైమాక్స్ సన్నివేశం ఇది. ఐదేళ్లు ఆధికారంలో ఉన్న తర్వాత ప్రతి గడప తొక్కడానికీ, ప్రతి గుండెను తడమడానికీ ఎంత ధైర్యం కావాలి? ‘నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి’ అని చెప్పడానికిఎంత నైతిక స్థైర్యం కావాలి? ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న వైసీపీ ప్రభు త్వంతో తలపడేందుకు ప్రతిపక్ష శిబిరం దగ్గర ఉన్నదేమిటి? అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చట్టానికి దొరికిపోయి సెంట్రల్ జైల్లో సేద తీరుతున్న అధినాయకుడు. తండ్రి అరెస్టు తర్వాత పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చి నిలబడకుండా ఢిల్లీకి పారిపోయిన వార సుడు. నాయకుడు చేసిన అవినీతి గురించి వాదనలొద్దు, గవర్నర్ అనుమతి తీసు కోలేదు కనుక కేసు కొట్టేయాలని వాది స్తున్న ఖరీదైన లాయర్లు. ఒక సిద్ధాంతం, నిబద్ధత, మాట నిలకడ, విలువల కట్టు బాటు వంటివేమీ లేని ఒక నట భాగ స్వామి. ప్రతిపక్ష నేత సొంత పార్టీ కోమాలోకి జారుకోగా ఆయన సొంత కులం వారిని రెచ్చగొట్టి ఏవో కొన్ని కార్య క్రమాలను మమ అనిపిస్తున్న కోటరీ... ఇదీ ప్రస్తుత టీడీపీ, దాని మిత్ర పక్షాల పరిస్థితి. పెత్తందారీ శిబిరానికి అర్థబలం, అంగబలం దండిగానే ఉండ వచ్చు గాక. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దానికి నైతిక బలం హీనదశలో ఉన్నది. సాను భూతి కోసం నాటకాలాడే దుఃస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. పేదవర్గాలు చైత న్యంతో మెలిగితే మరో ఐదేళ్లలో ఆ వర్గాల సాధికారత ఇంకో వంద రెట్లు పెరుగుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
వచ్చే ఫిబ్రవరి లోగా చంద్రబాబుకు బెయిల్ దొరికే అవకాశం లేదు! ఆయన మీద నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో సీఐడీ చేస్తున్న వాదనలు పరిశీలించిన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది!! ఈ లోగానే ఆయనకు ఊరట లభించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పూర్వాశ్రమంలో ఇటువంటి అద్భుతాలు చంద్రబాబు వల్ల సాధ్యమయ్యేవి. ఆ మేజిక్ ఇప్పుడేమైపోయిందని బాబు అనుచరగణం కలవర పడిపోతున్నది. కొన్ని దశాబ్దాలుగా ఆయన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న ‘అద్భుత’ దీపాలు కొన్ని ఇప్పుడు వానప్రస్థం స్వీకరించి మిణుకుమిణుకుమంటున్నాయి. కనుక ఇప్పుడు పాత మేజిక్ మీద ఆశ పెట్టుకోవడం కుదరకపోవచ్చు. చంద్రబాబు మీద నమోదైన నేర శిక్షాస్మృతి సెక్షన్లు ఆరు మాసాల్లోగా బెయిల్ లభించడానికి అనుమతించవు. కనుకనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇదొక అక్రమ కేసుగా వాదిస్తూ విచారణే జరక్కుండా కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోపక్క చంద్రబాబు పార్టీ అనుయాయులు, యెల్లో మీడియా పెద్దలు సమష్టిగా ‘అక్రమ కేసు’ వాదాన్ని తీవ్రంగా ప్రచారంలో పెట్టే పనిలో నిమగ్న మయ్యారు. తప్పుడు సమాచారాన్ని అందజేసి కొందరు తట స్థుల చేత కూడా తమకు అనుకూలమైన ప్రకటనలు చేయించు కుంటున్నారు. యెల్లో మీడియా తనను తాను తాకట్టు పెట్టుకుంటూనే, బాబు సామాజిక వర్గాన్ని కూడా తాకట్టు పెడుతూ ఒక కృత్రిమ సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం వారొక తప్పుడు వాదాన్ని తయారుచేసి అందుకు అనుగుణంగా లా పాయింట్లు లాగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగిందా లేదా అనే చర్చను వారు పక్కనబెట్టి సాంకేతిక అంశాలను ముందుకు తెస్తున్నారు. ఆ సాంకేతిక అంశాలు కూడా న్యాయస్థానాల పరిశీలన ముందు నిలబడేవి కావని న్యాయకోవిదులు ఘంటాపథంగా చెబుతు న్నారు. ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ, 2018) సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే (మాజీ ముఖ్య మంత్రి కనుక) గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నర్ అనుమతి తీసుకున్నట్టు రికార్డు చేయలేదు కనుక కేసు కొట్టేయండి’ అని కోర్టులో వాదిస్తున్నారు. ‘ఒకసారి కేబినెట్ ఆమో దించిన తర్వాత దీన్ని ‘స్కామ్’ అని ఎట్లా అంటారు? ఇచ్చేయండి బెయిల్’ అని అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో దుర్వినియోగ మైన డబ్బులు బాబు ఇంటికి చేరినట్టుగా సాక్ష్యాలు చూపలేదు గనుక ఆయన్నెట్లా బాధ్యుడిని చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటివే మరికొన్ని సాంకేతిక అంశాలను రూపొందించుకొని చంద్రబాబు అరెస్టు అక్రమమనే వాదాన్ని యెల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ రకమైన ప్రచారంతో సాను భూతిని సృష్టించడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఇది రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా నమోదైన కేసుగా చిత్రిస్తున్నది. ఒకవేళ రాజకీయ కక్షే నిజమైతే ఆ కక్ష ఏ ప్రభుత్వానిది? కేంద్రానిదా... రాష్ట్రానిదా? ఎందుకంటే ఈ కేసు 2016లోనే వెలుగు చూసింది. వెలుగులోకి తెచ్చింది కేంద్ర ఏజెన్సీలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడే! పుణేలో ఉన్న కొన్ని డొల్ల కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం జీఎస్టీకి దరఖాస్తు చేసుకున్నాయి. సరుకులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీలో మళ్లీ వాటిని అమ్మేసినప్పుడు కంపెనీలు పన్ను రాయితీని క్లెయిమ్ చేస్తాయి. సరుకులను సొంతానికి కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించడం వల్ల ఈ రాయితీ లభిస్తుంది. ఎన్నడూ లక్ష రూపాయల వ్యాపారం కూడా చేసినట్టు చూపని కంపెనీలు హఠాత్తుగా భారీ ప్రమాణంలో ట్యాక్స్ ఇన్పుట్ను క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారు లకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. సరుకులు ఎక్కడా కొనకుండానే, అమ్మకుండానే బోగస్ ఇన్వాయిస్ (బిల్లులు)లు సృష్టించారని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోసం సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా బోగస్ ఇన్వాయిస్లు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రజాధనాన్ని ఎవరో ఈ రకంగా కొల్లగొడుతున్నారని జీఎస్టీ అధికారులకు అర్థమైంది. దాంతో వారు ఈ సమాచారాన్ని రాష్ట్ర సీఐడీకి అందజేశారు. ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు ఉన్న కారణంగా కేసు ముందుకు కదల్లేదు. తర్వాత ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) అధికారులు కూడా ప్రవేశించి కేసులు నమోదు చేశారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో భాగం కనుక, ఈ కేసును వెలికితీసింది వారే కనుక రాజకీయ కక్ష, దురుద్దేశం నిజమైతే కేంద్రానికే ఉండాలి కదా! ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ సంగతి చూద్దాం. దీని ప్రకారం నిందితుడి అరెస్టుకు అతని నియామక అధికారి (అపాయింటింగ్ అథారిటీ) ముందస్తు అనుమతి అవసరమని ఈ సెక్షన్ చెబుతున్నది. ముఖ్యమంత్రిగా నియమించేది గవ ర్నర్ కనుక ఆయన అనుమతి ముందస్తుగా ఉండాలని తెలుగు దేశం వాదన. అరెస్టయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతిని కూడా పక్కనపెడదాం. సీఐడీ చేస్తున్న వాదన ప్రకారం ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది 2018లో! కానీ ఈ స్కామ్ జరిగిందీ, జిఎస్టీ, ఈడీలు కేసులు నమోదు చేసిందీ అంతకుముందే కనుక గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన మరో విశేషమేమిటంటే చంద్రబాబు మీద కేవలం అవినీతి నిరోధక చట్టం కేసులు మాత్రమే నమోదు కాలేదు. సీఆర్పీసీ సెక్షన్లయిన 120బి, 107, 409 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. అవినీతి నిరోధక చట్టానికి జరిగిన సవరణ సీఆర్పీసీ సెక్షన్ల కింది జరిగిన అరెస్టులకు కూడా వర్తిస్తుందా? అందుకు ఏదైనా ఉదాహరణ ఉన్నదా? 409 రెడ్ విత్ 34 కేసులో ఆరు నెలల వరకు బెయిల్ రావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీమెన్స్తో ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలులో జరిగిన దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారు అనేది యెల్లో మీడియా అమాయకంగా అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవేళ కేబినెట్ భేటీ జరిగిందనే అనుకున్నా అనంతరం వెలువడిన జీవోలో ఏమున్నది? ఈ స్కీమ్కు సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులను ఉచితంగా కేటా యించడానికి ముందుకు వచ్చింది. మిగిలిన పదిశాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలని ఉన్నది. కేబినెట్ జరిగి ఉంటే ఇదే విషయాన్ని చెప్పి ఉంటారు. కానీ ఆచరణలో ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి మధ్యన జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్యాభివృద్ధి సంస్థ సదరు ఒప్పందంలో భాగస్వామి కావాలి. కానీ, కాలేదు. డిజైన్టెక్ అనే ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామిగా మారింది. సీమెన్స్ సంస్థ తర ఫున ఆ సంస్థ ఇండియా అధికారి దొంగసంతకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది అతని రెగ్యులర్ సంతకం కాదనీ,దొంగ సంతకమనీ నిరూపణయింది. అతని ఉద్యోగం ఊడింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ అధికారిక ప్రకటన చేసింది. న్యాయస్థానానికి కూడా లిఖిత పూర్వకంగా చెప్పింది. ఇదంతా బోగస్ వ్యవహారమనీ, దురుద్దేశ పూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఇవన్నీ సరైన కారణాలు కావా? మరో కీలకమైన విషయం – జీవోలో చెప్పినదాని ప్రకారం సీమెన్స్ సంస్థ 90 శాతం నిధుల్లో ఒక్క పైసా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం రూ.371 కోట్లను విడుదల చేయడం! దాన్ని డిజైన్టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఖాతాకు మళ్లించడం! ఇలా విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అధి కారులు నోట్ ఫైల్లో రాసినా చంద్రబాబు పట్టుబట్టి విడుదల చేయించారు. ఈ మేరకు నోట్ఫైళ్లలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. 13 చోట్ల సీఎం సంతకాలు చేశారని సీఐడీ ఆధారాలు చూపెట్టింది. స్కామ్ పూర్తిగా సీఎం కనుసన్నల్లో దురుద్దేశ పూర్వ కంగా జరిగిందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన గంటా సుబ్బారావు అనే వ్యక్తి, డిజైన్టెక్ కంపెనీ అధిపతి, సీమెన్స్ ఇండియాలోని ఉద్యోగి– ఈ ముగ్గురితో కలిసి కుట్రపూరితంగా నాటి ముఖ్య మంత్రి పథక రచన చేశారనడానికి కావల్సిన ఆధారాలు ఇవన్నీ! ఇక్కడే సీఆర్పీసీ సెక్షన్ 409, సెక్షన్ 34 వర్తిస్తున్నాయి. సెక్షన్ 409 అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్! నమ్మక ద్రోహానికి పాల్పడటం! ప్రజలు నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం గానీ, ఇతరుల ప్రయోజనాల కోసం గానీ వినియోగించడం!! ప్రజా ధనానికి పరిరక్షకుడిగా ఆయన్ను ప్రజలు నియమించారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆ ధనాన్ని షెల్ కంపెనీలకు తరలించడంలో కీలకపాత్రను పోషించారు. సెక్షన్ 34 – ఈ స్కామ్ వెనుకనున్న దురుద్దేశానికి వర్తిస్తుంది. ఈ రెండు సెక్షన్లూ రుజువైతే కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ‘సదరు స్కామ్ డబ్బులు బాబు జేబులోకే వెళ్లాయనేందుకు రుజువేమిటి? అది రుజువు చేయకుండా ఎలా కేసు పెడతారు? ఎలా అరెస్టు చేస్తార’ని మరో ప్రశ్నను టీడీపీ వారూ, యెల్లో మీడియా వారూ సంధిస్తున్నారు. బాబు మీద నమోదు చేసిన సీఆర్పీసీ 120బి, 107 సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కుట్రలో భాగస్వామి అయితే చాలు సెక్షన్ 120బి వర్తిస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండనక్కర్లేదు. అందుకు అనుమానం, ఆస్కా రం కలిగించే పరిస్థితులుంటే చాలు. అంటే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చాలు. 107 అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించడం. కనుక చంద్రబాబు జేబులోకి డబ్బులు వెళ్లాయా లేదా అనే విషయాన్ని అరెస్టుకు ముందో, రిమాండ్కు ముందో నిర్ధారణ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడో ఉదాహరణ చెప్పుకో వచ్చు. ‘ఏ’ అనే వ్యక్తి కుట్రపూరితంగా, దురుద్దేశంతో ‘బి’ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ‘బి’ బంధువులకు ఫోన్ చేసి ‘సి’అనే వ్యక్తికి డబ్బు చేరిస్తే విడుదల చేస్తానని చెప్పాడు. డబ్బు ‘సి’ చేతికి చేరుతుంది. డబ్బు నా చేతికి రాలేదు కనుక నేను నేరస్థుడిని కాదని ‘ఏ’ అనేవాడు బుకాయిస్తే చెల్లుతుందా? షెల్ కంపెనీల ద్వారా డబ్బును చంద్రబాబు గూటికి చేర్చడంలో ఆయన పీఏ శ్రీనివాస్ ముఖ్య భూమికను పోషించాడని సీఐడీ భావిస్తున్నది. అతడికి నోటీసులు ఇవ్వగానే దేశం విడిచి పారిపోయాడు. కుట్ర జరిగిందనడానికి ఇది మరో బలమైన సాక్ష్యం. రెండు రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ తరఫున వాదించిన ఏఏజీ సుధాకర్రెడ్డి ఓ కొత్త విష యాన్ని చెప్పారు. స్కామ్ సొమ్ములో ఓ 27 కోట్లు విరాళంగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయని ఆయన చెప్పారు. 27 కోట్ల విరాళం విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిర్ధారించారు. ఈ ఆరోపణకు సీఐడీ వారు ఆధారాలు చూపగలిగితే తెలుగుదేశం పార్టీ ఆస్తులనూ, ఖాతాలనూ సీజ్ చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే! ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక జీవచ్ఛవంలా తయారైంది. రక్తప్రసరణ దాదాపుగా నిలిచిపోయింది. సొంత పుత్రుడు, బావమరిది పార్టీని ఉద్ధరిస్తారనే నమ్మకాన్ని చంద్ర బాబు కూడా కోల్పోయి ఉంటారు. వైసీపీ వారు దత్తపుత్రుడిగా అభివర్ణించే పవన్ కల్యాణ్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పిలిపించుకున్నారు. చెవిలో ఏం చెప్పారో తెలియదు కానీ, బయటికి రాగానే పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆయన పక్కన మామాఅల్లుళ్ళు చేతులు కట్టుకొని అనుచరుల్లా నిలబడిపోయారు. తాను ‘అలగా జనం’గా పరిగణించే వారి సమక్షంలో బాలయ్య బ్రాండ్ బ్లడ్డూ, బ్రీడూ తల వంచుకొని నిలబడాల్సి వచ్చింది. ఆ పూటకు అలా గడిచిపోయింది. తర్వాత మూడు వారాల పాటు చినబాబూ లేడు, పవన్బాబూ లేడు. బాలయ్య బాబు పెద్దగా సందడి చేయలేదు. చినబాబు ఢిల్లీలో దాక్కున్నారు. అరెస్టు భయంతో పారిపోయాడని పార్టీ శ్రేణులు భావించాయి. మొన్న రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్ళగానే చినబాబు రాజమండ్రికి తిరిగొచ్చారు. తీరా సీఎం రాష్ట్రానికి రాగానే, చినబాబు భార్యను తీసుకొని మళ్ళీ ఢిల్లీ బాట పట్టాడు. కార్యకర్తల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. పార్టీలో కదలిక కోసం నానాతంటాలు పడవలసి వస్తున్నది. చివరికి బాబు సొంత సామాజిక వర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. వారం రోజుల కిందనే మళ్లీ రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం పరిస్థితిపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఆ పార్టీ పూర్తిగా బలహీన పడినందువల్లనే తాము యువరక్తం ఎక్కించవలసి వస్తున్నదని ఆయన సభలోనే ప్రకటించారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా కృషిచేసినా పవన్ సభలు గతంతో పోలిస్తే బోసిపోతున్నాయి. రెండు పార్టీల పొత్తు పట్ల జనసేనలో వ్యతిరేకత, తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. జనస్పందన తగ్గడంతో పవన్ కూడా షాక్ తిన్నట్లున్నారు. గతంలో పదిహేను రోజులకో, నెలకో మాట మార్చేవాడు. ఇప్పుడు ప్రతిరోజూ మారుస్తున్నారు. ఒకరోజు ఎన్డీఏ నుంచి బయటకొచ్చానంటాడు. ఆ మరుసటి రోజే ఎన్డీఏలోనే ఉన్నానని అంటాడు. అవినీతి రెండు రకాలని ఓ కొత్త భాష్యాన్ని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ‘ఆమోదయోగ్యమైన’దేనట! ఇదెక్కడి దౌర్భాగ్యం! పైగా ప్రజలే అవినీతిపరులంటూ శాప నార్థాలు పెడుతున్నారు. ఆయన పూర్తిగా బ్యాలెన్స్ కోల్పో యారు. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న అస్త్రాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో ఆయన ఇంకో ఆరు నెలలు జైల్లోనే ఉంటే పార్టీ బ్రెయిన్ డెడ్ ఖాయం. బయటకు వచ్చి అవయవదానం చేయవలసిందే! ఈ స్థితిని తప్పించడానికి యెల్లో మీడియా తెగ ప్రయాసపడుతున్నది. ‘ప్రజాస్వామ్యం కోసం’ అనే ముసుగులో మేధావుల పేరుతో కావలసినవారిని కొందరిని సమీకరించి ఒక సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి తంటాలు పడు తున్నారు. అధినేత అవినీతికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. అది పతనోన్ముఖాన వేగంగా జారిపోతున్నది. ఎలాగోలా బతికించాలని యెల్లో మీడియా తాపత్రయం. ‘అక్క ఆరాటమే గాని బావ బతికేట్టు లేడు!’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బ్రాండ్ బాబు బాగోతం!
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! తప్పించుకు తిరిగేవాడు దొరికితే సంచలనమే సుమీ!! చార్లెస్ శోభరాజ్ వంటి కరుడుగట్టిన నేరస్తుడు అరెస్టయితేనే అప్పట్లో అదో సంచలన వార్తయింది. అటువంటిది మన అతిపెద్దమనిషి చంద్రబాబు అరెస్టయితే సంచలనం కలగకుండా ఉంటుందా? ఆయనపై ఇప్పటివరకు కనీసం రెండు డజన్ల పెద్దస్థాయి అవి నీతి ఆరోపణలు వచ్చాయి. కనీసం ఒక్కదానిపై కూడా విచా రణ జరక్కుండా అడ్డుచక్రాన్ని గిరగిరా తిప్పి విసరడంతో ఆయన చూపుడు వేలు నేర్పరితనం ఇప్పటికే రికార్డు పుటల్లోకి ఎక్కింది. చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించిన అభియో గాలు ఇప్పుడు న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నాయి. కనుక వాటి మీద చర్చను పక్కనపెడితే, ఆయన అరెస్టు మాత్రం పెద్ద వార్తే అయింది. పెద్ద వార్తల చుట్టూ అనేక పిల్ల వార్తలూ, పిట్టకథలూ, ఉపాఖ్యానాలు, వ్యాఖ్యానాలు చేరిపోవడం సహజం. అలా చేరిపోయిన వాటిలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఇద్దరు నాయకుల రాజకీయ వ్యాఖ్యానాలు మరో చర్చకు దారితీశాయి. ఐటీ ఉద్యోగుల పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు రెండు, మూడు ఊరేగింపులు చేశారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం చెబుతూ ‘పక్క రాష్ట్ర రాజకీయ అంశంపై ఇక్కడెందుకు నిరసనలు? ఐటీ కారిడార్లో శాంతిభద్రతల సమస్య సృష్టించడమెందు క’ని ప్రశ్నించారు. వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దానిపై స్పందించారు. చంద్రబాబు జాతీయ నాయకుడనీ, ఆయన కోసం ఎక్కడైనా ఆందోళన చేయవచ్చనీ చెబుతూనే ‘బీఆర్ఎస్కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి గానీ, వాళ్ల సమస్యలు అక్కర్లేదా’ అని వ్యాఖ్యానించారు. ఈ చర్చలో అంతర్లీనంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి – ఐటీ రంగ అభివృద్ధికీ, హైదరాబాద్ అభి వృద్ధికీ మారుపేరుగా చంద్రబాబును ప్రస్తావిస్తూ ఒక ఫేక్ బ్రాండ్ ఇమేజ్ను గత పాతికేళ్లుగా యెల్లో మీడియా పోషించు కుంటూ వస్తున్నది. దాని కొనసాగింపుగానే ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబును తమ తాతపాదుల వారిగా తలపోస్తు న్నారనే భ్రాంతిని సృష్టించడం కోసం ఈ ర్యాలీలను తెలుగు దేశం పార్టీ నిర్వహించింది. ఈ ర్యాలీల్లో కూడా ఒక సామాజిక వర్గమే ప్రధాన భూమికను పోషించిందన్న మాట కూడా ఒక నిష్ఠుర సత్యం. ఇక రెండో అంశం – తెలంగాణలో ఆంధ్రావాళ్ల ఓట్లు. సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో, బాబు కనుసైగల అజమాయిషీలో ఉన్నట్టు కూడా యెల్లో మీడియా మరో భ్రాంతి జనిత బ్రాండ్ను సృష్టించింది. ఇద్దరు తెలంగాణ నాయకుల వ్యాఖ్యలు యథాలాపమా, ఆలోచనాపూర్వకమా అనే విషయం వారికి మాత్రమే తెలుసు. కానీ ఆచరణలో అవి స్పష్టమైన పాత్రనే నిర్వహించాయి. చంద్రబాబు మీద కప్పిన ఫేక్ బ్రాండ్ ముసుగును తొలగించే ప్రయత్నం కేటీఆర్ వ్యాఖ్యల్లో కనిపిస్తే, ఆ ముసుగును కాపాడే అంతరార్థం రేవంత్రెడ్డి మాటల్లో ధ్వనించింది. రేవంత్రెడ్డికి పూర్వాశ్రమంలో చంద్రబాబుతో ఉన్న సాహచర్యం కారణంగా అలా కావాలని మాట్లాడి ఉండవచ్చేమో! చంద్రబాబు పట్ల ఆయన సానుకూల స్పందన పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఆ నకిలీ బ్రాండ్ ముసుగును తొలగించడం బీఆర్ఎస్కు కచ్చితంగా ఒక రాజకీయ అవసరం. తమ హయాంలో జరిగిన నగరాభివృద్ధినీ, ఐటీ పురోగతినీ కూడా యథేచ్ఛగా యెల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఎంతకాలం భరిస్తుంది? తెలుగుదేశం పార్టీ నేతలకు తమిళ సినిమారంగ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు. ఎన్టీఆర్కు వెన్ను పోటు పొడిచిన సమయంలో ఆయన హైదరాబాద్కు వచ్చి మరీ చంద్రబాబు గ్యాంగ్కు మద్దతు పలికిన సంగతి చాలా మందికి గుర్తే. ఆయన ఈమధ్య మాట్లాడుతూ హైదరాబాద్కు వెళ్తే న్యూయార్క్కు వెళ్లినట్లుంటుందని చెబుతూ, అందుకు చంద్రబాబే కారకుడని ఓ వీరతాడును ఆయన మెడలో వేశారు. ఈ పదేళ్లలో హైదరాబాద్లో జరిగిన పరిణామాలకూ, ఇరవయ్యేళ్ల కిందనే తోక ముడిచిన చంద్రబాబుకూ ఏరకమైన సంబంధముంటుంది? ఇటువంటి ఘటనలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సహజంగానే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ అసౌకర్యమే కేటీఆర్ మాటల్లో వెల్లడై ఉండవచ్చు. యెల్లో మీడియాను మాత్రమే అనుసరించే వారి మెదళ్లలో ఈ ఫేక్ బ్రాండ్ గుజ్జు ఎంత నిండిందో తెలియజెప్పే ఉదంత మొకటి ఈమధ్యనే మీడియాలో కనిపించింది. బాబు అరెస్టుకు నిరసన తెలియజేస్తున్న ‘ఐటీ ఉద్యోగుల్లో’ ఒక యువతి ముందు మన యెల్లో మీడియా మైకు పెట్టింది. ‘‘సీబీఎన్ అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఖండించలేదండీ! ఎందుకంటే ఇప్పుడు సీబీఎన్ బయటకొస్తే ఆటోమేటిక్గా ఏపీ డెవలపయిపోతుంది. తెలంగాణ వెనకబడుతుంది. అందుకని వాళ్లు ఖండించరు’’. ఆహా ఎంత పరిణతి! సాక్షాత్తూ జ్ఞాన సరస్వతీ దేవి ఉపదేశమా ఇది. ‘‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ ... ... ... సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా!’’ మనం మరోసారి అక్షరాభ్యాసం చేయాల్సిందే. నిన్నటిదాకా ఆయన బయటే ఉన్నాడు కదమ్మా. ఐదేళ్లు అధికారంలో కూడా ఉన్నాడు కదమ్మా. మరి ఆటోమేటిగ్గా ఏపీ అగ్రస్థానంలోకి ఎందుకు దూసుకెళ్లలేదు తల్లీ అనే సహజమైన ప్రశ్న కూడా ఆ దిగ్భ్రాంతి క్షణాన ఎవరికీ జనించి ఉండదు. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార సాధనాల (మీడియా) ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయో (manufacturing consent) తెలియజెప్పే సిద్ధాంత పత్రాన్ని అమెరికా మేధావులు నోమ్ చోమ్స్కీ, ఎడ్వర్డ్ హెర్మాన్లు వెలువరించారు. ఏపీలో చంద్ర బాబు అధికారంలోకి రాకపూర్వమే అమెరికా పరిస్థితులను అధ్యయనం చేసి వారు ఈ థియరీని ప్రతిపాదించారు. కానీ, ప్రస్తుత మన యెల్లో మీడియా కర్మాగారాలను, వాటి ఉత్ప త్తులను చూసి ఉంటే పరిశోధన పక్కనపెట్టి మూర్ఛ పోయేవారు. ఈ కర్మాగారాల్లో తయారైన అతి ముఖ్యమైన ఉత్పత్తి ‘బ్రాండ్ బాబు’! ఐటీకి ఆద్యుడుగా, అభివృద్ధికి రోల్మోడల్గా, హైదరాబాద్ నిర్మాతగా బ్రాండ్ బాబును ప్రచారంలో పెట్టారు. ఇప్పుడీ బ్రాండ్ బాబు ఇమేజిపై పోస్ట్మార్టమ్ జరిగి తీరాలి. వర్తమాన చరిత్రకు జరుగుతున్న వక్రీకరణను సరిచేయవలసిన బాధ్యత కూడా వర్తమాన సమాజానిదే! హైదరాబాద్లోనే కాదు, మొత్తం దేశంలో కూడా ఐటీ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది మన తెలుగుజాతి కీర్తికిరీటం పీవీ నరసింహారావుకే దక్కాలి. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో హైదరా బాద్ మొదటిది. చంద్రబాబు నిర్మించినట్టుగా మనం చదువు కుంటున్న హైటెక్ సిటీ లేదా సైబర్ టవర్స్కు 1993లోనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోనే పెద్దవైన ఐదు ఐటీ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్స్ (టెక్ మహేంద్ర) 1987లోనే ఏర్పాటైంది. 1995లో జరిగిన వెన్నుపోటు పట్టాభిషేకం నాటికి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ది మూడో స్థానం. 2004లో చంద్ర బాబు గద్దె దిగేనాటికి నాలుగో స్థానం. ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది. ఐటీ ఎగుమతుల్లో ఇప్పుడు హైదరాబాద్ది దేశంలో రెండో స్థానం. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, క్వాల్కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వాటి అతిపెద్ద క్యాంపస్లను (అమెరికా వెలుపల) హైదరాబాద్లో చంద్రబాబు అనంతర కాలంలోనే ఏర్పాటు చేశాయి. ఐటీ రంగం విస్తృతమవుతున్న నేపథ్యంలో నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్తగా 11 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతినిస్తే, వాటికి వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో యెల్లో మీడియా ఆధ్వర్యంలో, కమ్యూనిస్టుల తోడ్పాటుతో, పెద్ద ఉద్యమాన్ని లేవదీసి వాటిని ఆపేశారు. చంద్రబాబు గద్దెనెక్కగానే ఏకంగా 30 కాలేజీలను ప్రారంభించారు. ఎవరూ కిమ్మనలేదు. ఆ పదకొండు ఎవరికి చెందినవి, ఈ 30 ఎవరివి అనేది ఒక ప్రత్యేక రాజకీయ – సామాజిక అధ్యయనాంశం. ఇప్పుడు అప్రస్తుతం. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇంజనీరింగ్ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో వీసాల కోసం అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని వైఎస్ హైదరా బాద్లో ఏర్పాటు చేయించారు. ఇవన్నీ వాస్తవాలు! చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. ఎవరైనా రికార్డులను పరిశీలించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డును, శంషాబాద్ ఎయిర్పోర్టును కూడా యెల్లో మీడియా బాబు ఖాతాలోనే వేస్తున్నది. బాబు సంగతి సరేసరి. ‘సెల్ఫోన్ కనిపెట్టింది కూడా నేనే’ అనే స్థాయికి చేరిన వైపరీత్యం ఆయన మనస్తత్వానిది. ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేసిందీ, కొత్త ఎయిర్పోర్టును ప్రారంభించిందీ కూడా వైఎస్సార్ హయాంలోనే! ఔటర్ రింగ్రోడ్డు కోసం భూసేకరణ దగ్గర్నుంచీ రోడ్డు నిర్మాణం 90 శాతం పూర్తయింది కూడా వైఎస్సార్ హయాంలోనే! ఇక ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ఎయిర్పోర్టు నుంచి నగరానికి వస్తున్నప్పుడు రజనీ కాంత్కు కనిపించిన న్యూయార్క్ దృశ్యం ఈ అయిదేళ్లలో ఆవిష్కృతమైన పరిణామం. పీవీ నరసింహారావుకు, వైఎస్సార్కు, కేసీఆర్కూ దక్కా ల్సిన ఘనతలను కూడా బరబరా లాక్కుని చంద్రబాబుకు కట్టబెట్టే సమాచార గూండాగిరీకి యెల్లో మీడియా పాల్పడు తున్నది. అది ప్రజాభిప్రాయ ‘ఉత్పత్తి’ దశను దాటి ప్రజాభి ప్రాయ ‘రిగ్గింగ్’ దశకు చేరుకున్నది. అందులో భాగమే తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న సెటిలర్లంతా బాబు వర్గమే అనే ప్రచారం. బాబు వర్గం అంటే వారి ఉద్దేశం ప్రకారం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం. సెటిలర్లలో వారు సింహభాగం ఉంటారు. మిగిలిన వారిని ప్రభావితం చేస్తారని వారి ఉద్దేశం. ఈ తప్పుడు లెక్కలతోనే తెలంగాణ రాజకీయ పార్టీలను యెల్లో మీడియా దబాయి స్తున్నది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయ బోయే నాయకులను బెదిరించి చంద్రబాబు అరెస్టును ఖండించే ప్రకటనలు యెల్లో మీడియా చేయిస్తున్నది. కానీ వారు చెబుతున్న లెక్కలు వాస్తవమేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం దాదాపు ఇరవై లక్షలమంది ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్లు ఉన్నారు. వీరిలో ఇరవై శాతం వరకు కమ్మవారుంటారని అంచనా. పదిహేను శాతం రెడ్లు, పదిహేను శాతం కాపులు. బీసీలు ముప్పయ్ శాతం. మిగిలిన ఇరవై శాతం ఇతరులు. ఇవి వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. యెల్లో మీడియా దబాయింపు ప్రకారం ఇరవై శాతం సామాజిక వర్గం చెప్పుచేతుల్లోనే ఎనభై శాతం మసలుకుంటున్నట్టు లెక్క. వాస్తవానికి ఆంధ్రా సెటిలర్లు అనేది ఒక ఓటు బ్యాంకు ఎంతమాత్రమూ కాదు. ఎవరి రాజ కీయ అభిప్రాయాలు వారివి. కులాల లెక్కలు కూడా చెల్లవు. అసలు ఆంధ్రప్రదేశ్లోనే కుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజకీయ పోరాటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గ పోరాటంగా మార్చివేశారు. పేదలకూ – పెత్తందార్లకూ మధ్య యుద్ధంగా ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇంకా తెలుగు దేశం పార్టీ మాత్రమే ఒక్క కులాన్ని పట్టుకుని వేలాడుతున్నది. అటువంటి విభజనే సెటిలర్లలో కొంతమేరకు ఉండవచ్చు. లేదా స్థానిక అంశాల ఆధారంగా వారి మద్దతు ఉండవచ్చు. సెటిలర్లపై చంద్రబాబు ప్రభావం అనేది యెల్లో మీడియా ఉత్పత్తి చేస్తున్న భ్రాంతి మాత్రమే. తెలంగాణ ప్రజలకు చంద్ర బాబులో ఇప్పటికీ ఒక సామాజిక విధ్వంసకుడు కన్పిస్తాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నదో లేక మరోసారి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడుతున్నదో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వికసించిన విద్వత్తేజం!
మూడు దశాబ్దాల అమానవీయ రాజకీయ వ్యవస్థ తన మరణ వాఙ్మూలాన్ని లిఖించవలసిన పరిస్థితులు పొడసూపు తున్నాయి. సమతామమతలతో కూడిన ఒక సరికొత్త సామాజిక పొందిక తన జనన నమోదుకు గుర్తుగా జేగంట మోగిస్తున్నది. ఎట్టకేలకు మన కపట రాజనీతి సామ్రాట్టు చట్టం చేతికి చిక్కి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పెత్తందారీ పరిపాలన పాపాలు ఒక్కొక్కటిగా బోనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మరో కొత్తకోణం ఆవిష్కృత మవుతున్నది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని మనకాలపు మాకియవెలీ న్యాయాధికారి ఎదుట బుకాయిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఒక అబ్బురం చోటుచేసుకున్నది. పెత్తందారీ పాలనలో అణగారిపోయిన పేదవర్గాల్లో మొగ్గతొడిగిన బాల్యం అంతర్జాతీయ వేదిక మీద గొంతు సవరించుకున్నది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పదిమంది బాలలు ఐక్యరాజ్యసమితి వేదికలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎలుగెత్తారు. విఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ధైర్యంగా మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో తమ కళ్లెదుటనే విప్పారుతున్న మరో ప్రపంచపు కాంతి కిరణాలను గురించి వివరంగా చెప్పారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బకలోరియేట్ (ఐబీ) సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో క్రమానుగతంగా ఐబీ సిలబస్ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే పాఠశాల విద్యా సిలబస్ ఇది. ఈ విధానంలో చదువుకునే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు. వారిలోని సృజనశీలతను వెలికితీసే విధంగా ఉంటుంది. హేతుబద్ధమైన స్వతంత్ర ఆలోచనా ధోరణి అలవడుతుంది. తార్కిక వివేచన అబ్బుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభగ్రాహ్యం చేసుకోగల నైపుణ్యం ఒంటబడుతుంది. ప్రపంచం మొత్తం మీద మూడు వేల స్కూళ్లలో, భారతదేశంలో రెండొందల కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈ సిలబస్ అందుబాటులో ఉన్నది. చదివే క్లాసును బట్టి, స్కూల్ స్థాయిని బట్టి ఏటా ఆరు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లోని అత్యంత సంపన్నులైన వారి పిల్లలకు మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉన్నది. వైఎస్ జగన్ ప్రభుత్వం అంత ఖరీదైన విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నది. మొదటి సంవత్సరం ఒకటో క్లాసుతో ప్రారంభించి ఏటా ఒక క్లాసును పెంచుకుంటూ వెళ్తారని సమాచారం. ఇదొక నిశ్శబ్ద విప్లవం. వచ్చే పన్నెండేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకమైన ఐబీ గొడుగు కిందకు వస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై లక్షలమందిని ఐబీ విద్యావిధానం తీర్చి దిద్దుతున్నది. ఏపీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడే యాభై లక్షల మంది చదువుతున్నారు. ఇంకో పన్నెండేళ్ల తరువాత ఎంత మంది ఉంటారో అంచనా వేయగలిగితే ఇప్పుడు పడిన అడుగు ఎంత విప్లవాత్మకమైనదో అర్థమవుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుం దనుకున్నా కూడా బహుశా సగంమంది ఏపీలోనే ఉంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య – వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్లు పనిచేసిన కాలంలోనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం ప్రారంభమైంది. విభజిత రాష్ట్రంలోనూ అదే పంథా కొనసాగింది. ఫలితంగా పేదపిల్లలకు నాణ్యమైన చదువు లభించక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయారు. చాలామంది డ్రాపవుట్లుగా మిగిలి పోయారు. మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం రుణభారంలో కూరుకుపోవడం సర్వ సాధారణమై పోయింది. ఆ పరిస్థితిని ‘నాడు–నేడు’ కార్య క్రమం చక్కదిద్దిందనేది మన కళ్లముందటే కదలాడుతున్న చరిత్ర. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతోనే ఆగిపోలేదు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిషు మీడియంతోపాటు సీబీఎస్ఇ సిలబస్ను కూడా ప్రవేశ పెట్టారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ప్రకటించిన జగన్మోహన్రెడ్డి ఆ ఆస్తి విలువను అనేక రెట్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. అప్పటికే కనాకష్టం మీద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లులను నిరుత్సాహపరచకుండా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వారికి కూడా వర్తింపజేశారు. ఇంగ్లిషు మీడియంలోకి పిల్లలు సులభంగా ప్రవేశించడానికి వీలుగా ఒకటి నుంచి పదో క్లాసు వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందరికీ అందజేస్తున్నారు. ‘విద్యాకానుక’ కింద పాఠ్య పుస్తకాలతోపాటు మూడు జతల యూనిఫాం, నోట్బుక్కులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బూట్లు, బెల్టును కూడా స్కూళ్లు తెరిచే తొలిరోజు నాటికే ఉచితంగా అందజేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల మీది నుంచి పిల్లల చదువు భారాన్ని పూర్తిగా తొలగించి జగన్ ప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకున్నది. ఇంగ్లిష్ మీడియంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ముందడుగు వేయడం కోసం డిజిటల్ బోధనా విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో విస్తృతంగా ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 8వ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు ట్యాబ్లను అందజేసింది. పాఠ్యాంశాల్లో తమ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ట్యాబ్ల ద్వారా ఖరీదైన ‘బైజూస్’ కంటెంట్ను అందు బాటులోకి తెచ్చింది. ఆరు నుంచి పదో క్లాస్ వరకు అన్ని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఒక్క ఉదాహరణ చాలు – చంద్రబాబు పరిపాలనా కాలంలో మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఆ యాభై శాతం మంది కూడా మరో గత్యంతరం లేక మిగిలి పోయినవారే! నాలుగేళ్లలో అది 60 శాతానికి పెరిగింది. ‘అమ్మ ఒడి’ కూడా అందుతున్న నేపథ్యంలో పెద్దక్లాసు పిల్లలు మధ్యలో స్కూల్ మారడం ఇష్టంలేక ఉండిపోతున్నారు. లేకుంటే ఈ శాతం మరింత పెరిగేది. ఒకటి నుంచి ఎనిమిదో క్లాస్ వరకు లెక్కిస్తే చేరికలు చంద్రబాబు హయాంలో 75 శాతం గరిష్ఠంగా ఉండగా ఇప్పుడది 100 శాతాన్ని దాటింది. అంటే హౌస్ఫుల్, ఎక్స్ట్రా బెంచ్ అన్నమాట! జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు ఉన్నత విద్యారంగాన్ని ఉద్దీపనం చేశాయి. ఎంతగా అంటే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగం చేరికల్లో 3.8 శాతం పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్లో 14.81 శాతం నమోదైంది. ఇది చాలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి! 2018–19లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 37 వేలమందికి ఉద్యోగాలు లభిస్తే 2022–23లో ఒక లక్షా 20 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. చేరికల్లోనూ, నియామ కాల్లోనూ నాలుగేళ్లలో నాలుగు రెట్లు ప్రగతి. ‘మేం బాలికలం, ఈ ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నామ’ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులో ఏపీ బాలిక రాజేశ్వరి సభావేదిక మీది నుంచి ప్రకటించింది. ఈ ప్రకటన హాజరైన సభికులను ముగ్ధుల్ని చేసింది. రాజేశ్వరి ఏపీలోని నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని. ఆంగ్లభాషలో అనర్గళంగా, నిర్భయంగా అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం చాలామంది గమనించి ఉండవచ్చు. మరో ఏపీ బాలిక షేక్ అమ్మజాన్ కూడా అంతే ధాటిగా మాట్లాడి ఆకట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగేళ్లలో ప్రారంభమైన విద్యా విప్లవం రాజేశ్వరి, అమ్మజాన్ వంటి వందలాదిమంది పేదింటి బిడ్డల్ని నాయ కత్వ శ్రేణుల్లో నిలబెట్టింది. ఆధిపత్య శక్తులు లేదా పెత్తందారీ వర్గాలు ఏరకమైన విప్లవాన్నీ సహించవు. విద్యావిప్లవాన్ని కూడా సహించలేదు. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినప్పుడే సాంస్కృతిక దాడికి పూనుకున్నారు. దీన్ని తెలుగు భాషపై జరుగుతున్న దాడిగా చిత్రించేందుకు చంద్రబాబు – యెల్లో మీడియా తెగ ప్రయాస పడ్డారు. తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని శాసిస్తున్న పెత్తందారీ శక్తుల అంతరంగాన్ని జనం గమనించారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కూడా యెల్లో మీడియా అవాకులు చెవాకులు పేలడం తాజా ఉదాహరణ. ఇప్పుడు సర్వహంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లపై పెత్తందారుల కన్ను పడింది. పొరపాటున అధికారంలోకి వస్తే ఈ స్కూళ్ల నిర్వహణను నారాయణ సంస్థలకు అప్పగించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడిక నారా యణకు ఫీజులు చెల్లించి చదువుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ స్కూల్ భవనాలనూ, స్థలాలనూ నారాయణకు అప్పగించే ప్రయత్నం జరిగింది. మరోసారి చంద్రబాబు గెలిచి ఉంటే పేద పిల్లలకు చెట్టుకింది చదువులే మిగిలి ఉండేవి. ఈ పరిస్థితి ఒక్క విద్యారంగానికే పరిమితమైనది కాదు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుకున్న వైద్యం, వ్యవసాయ రంగాలపై కూడా పెత్తందారీ శక్తులు కన్నేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్న ప్రయోజనాల పట్ల వైరుద్ధ్యంగా, ఆ వైరుద్ధ్యం పోరాటంగా రూపుదిద్దుకున్నాయి. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి పెత్తందార్లను మేపే విధానం చంద్రబాబు పార్టీది. ఆయన పద్నాలుగేళ్ల పాలనలో అనేకమార్లు రుజువైన నగ్నసత్యమిది. పెత్తందారీ శక్తుల కరదీపికగా యెల్లో మీడియా పనిచేస్తున్నదని కూడా పలుమార్లు రుజువైంది. బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకులపై హీనంగా, అవమానకరంగా బ్యానర్ వార్తలు వండి వార్చిన నేపథ్యం ఈ మీడియాది. కనుక పేద ప్రజలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఎజెండాను భుజాన వేసుకున్న జగన్మోహన్రెడ్డిని ఏమాత్రం సహించే స్థితిలో రాష్ట్రంలోని పెత్తందార్ల పార్టీ, వారి మీడియా లేదన్నది ఒక బహిరంగ రహస్యం. రాష్ట్ర రాజకీయ పోరాటాల అంతస్సారం ఇదే. పెత్తందారీ వర్గాలు, పేదల ప్రయోజనాలకు మధ్య వైరుద్ధ్యం, పోరాటం. ఈ సారాన్ని పేదలు, బలహీనవర్గాల ప్రజలు గ్రహించారు గనుకనే చంద్రబాబు కూటమికి భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నది. అన్నిరకాల అవకాశవాద పొత్తుల కోసం అర్రులు చాస్తున్నది ఈ బెంగతోనే! ఈ నేపథ్యంలో వచ్చిన అవినీతి కేసును సానుభూతి కోసం ఉపయోగించుకు నేందుకు ఆ కూటమి పడరాని పాట్లు పడుతున్నది. కానీ, జనస్పందన శూన్యం. అవినీతిలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానాలు కూడా భావించడంతో వారు ఆశించిన సానుభూతి రావడం లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సైతం వీధుల్లోకి రాని దైన్యం ఆ పార్టీని వెన్నాడుతున్నది. కేవలం చంద్రబాబు సొంత సామాజికవర్గం యువతీ యువకుల్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడక్కడా ప్రదర్శనలు చేసి మమ అనిపిస్తున్నారు. నిజానికి యాభయ్యేళ్లకు పూర్వం వరకు ప్రగతిశీల భావాలతో పరుగుతీసిన సామాజిక వర్గమే అది. కానీ చంద్రబాబు బ్రాండ్ స్వార్థ సంకుచిత రాజకీయాలు, యెల్లో మీడియా పెద్దల అవసరాల కోసం జనజీవన స్రవంతి నుంచి ఆ పాయను వేరుచేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కళాత్మక చౌర్యం
చతుష్షష్టి కళల్లో హస్తలాఘవం కూడా ఒకటి. దానర్థం దొంగతనమేనని మృచ్ఛకటికం నాటకంలోని శర్విలకుడు అనే దొంగ అభిప్రాయం. కనుక చాకచక్యంగా, కళాత్మకంగా చేసే దొంగతనాన్ని చోరకళగా భావించాలని వాదిస్తాడు. ఓ తెలుగు సినిమాలోని బ్రహ్మానందం పాత్ర కూడా ఇటువంటి అభిప్రా యాన్నే వ్యక్తం చేస్తుంది. జైలు గదిలో తనతోపాటున్న బ్రహ్మాజీని ఏం చేశావని బ్రహ్మానందం అడుగుతాడు. ఫోర్జరీ అంటాడు బ్రహ్మాజీ. ‘ఫోర్జరీ అంటే ఆర్ట్... ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా?’ అంటూ వాపోతాడు బ్రహ్మానందం. ఇప్పుడు తెలుగు దేశం, దాని మిత్రపక్షాలవారు, యెల్లో మీడియా బాస్లు కూడా ఇదేవిధంగా వాపోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద చంద్రబాబు ప్రమేయంతో జరిగిన ఒక స్కామ్పై సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. 371 కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ఈ స్కామ్లో 241 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరిన వైనాన్ని సీఐడీ నిర్ధారించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు ఆయనను నంద్యాలలో అరెస్టు చేసింది. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేసే ఫామ్పై (ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్) ఆయన సంతకాన్ని తీసు కున్న దృశ్యం టీవీల్లో కనిపించింది. కానీ తనకు కారణం చెప్ప కుండా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి హెలికాప్టర్లో తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అందుకు ఆయన నిరాకరించారు. అరెస్టు చేసిన ఇరవై నాలుగ్గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి ఉన్నందువల్ల, ఈలోగా సీఐడీ వారు ప్రశ్నించే సమయం ఇవ్వకూడదన్న వ్యూహంతో ఆయన వ్యవహరించి నట్టు కనిపించింది. అందుకే హెలికాప్టర్లో కాకుండా తన వాహనంలోనే వస్తానని భీష్మించుకున్నారు. పోలీసులు ఆయన మాటను గౌరవించారు. మొదట అరెస్టవడానికి ఆయన సమ్మ తించలేదు. మొండికేసే ప్రయత్నం చేశారు. కానీ, తప్పక పోవడంతో తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. రోడ్డు మార్గాన నెమ్మదిగా వెళ్తుంటే తన అరెస్ట్ వార్త దావానలంగా వ్యాపించకపోతుందా, వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు దండయాత్రకు రాకపోతారా? జనాన్ని చూసి జడుసుకొని అల్లూరి సీతారామరాజును విడిచిపెట్టి వెళ్లినట్టు పోలీసులు తనను కూడా వదిలేసి తోకముడవకపోతారా అనే రవ్వంత ఆశ కూడా ఏ మూలో ఉండవచ్చు. మార్గమధ్యంలో దండయాత్రలూ, దండుయాత్రలూ ఎదురు కాలేదు కానీ, ఆయన కోరుకున్నట్టుగానే బాగా ఆలస్యమైంది. సీఐడీ అధికారుల ప్రశ్నలకు సహాయ నిరా కరణలో కొంత సమయాన్ని, విశ్రాంతి పేరుతో కొంత సమ యాన్ని బాబు కరిగించారని సమాచారం. బాబు విజయవాడకు చేరుకోకముందే ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ల బృందం చేరుకున్నది. కోర్టులో హోరాహోరీగా వాదప్రతివాదాలు జరిగాయి. పది గంటలపాటు జడ్జి ఈ వాదనల్ని విన్నారు. ఇరువైపుల నుంచీ పలు సందర్భాల్లో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరకు ప్రభుత్వ న్యాయవాది వాదన, రిమాండ్ రిపోర్ట్ అంశాలతో ఏకీభవించి చంద్రబాబును రిమాండ్కు పంపారు. హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన కేసు కాబట్టేమో, సుదీర్ఘ సమయం వాదోపవాదాలు జరిగినా సరే జడ్జి ఓపిగ్గా విన్నారు. తీర్పు వెలువడిన మరుక్షణం నుంచే తెలుగుదేశం – యెల్లో కూటమి, దాని సోషల్ మీడియా బృందాలు వాటి వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. జడ్జి మీద వ్యక్తిగతంగా దాడుల్ని ఎక్కుపెట్టారు. ఎక్కడి నుంచి వెతికి పట్టుకున్నారో తెలియదు, అది నిజమో కాదో కూడా తెలియదు గానీ, జడ్జిగారిది బీసీ సామాజికవర్గంగా తేల్చేశారు. ఇంకేముంది... యెల్లో కూటమి పెత్తందారీ దురహంకారం బుసలు కొట్టింది. ‘బీసీలు జడ్జీలుగా పనికిరారు, వారిని నియమించకండి’ అంటూ కేంద్ర న్యాయశాఖకు లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడాయన అనుచర గణాలు ఆయన ఆదర్శాన్ని అందిపుచ్చుకొని విశృంఖలంగా చెలరేగి పోతున్నాయి. తీర్పు చెప్పే న్యాయమూర్తుల్లో, ప్రాణం పోసే డాక్టర్లలో, శాంతిభద్రతలు కాపాడే పోలీసుల్లో కూడా కులం నీడల్ని వెతికిపట్టుకునే దౌర్భాగ్యపు పెత్తందారీ దురహంకార సంప్రదాయాన్ని చంద్రబాబు కూటమి పెంచి పోషిస్తున్నది. పొరపాటున అవతలివారు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, మైనా రిటీలో అని తేలితే వారి ప్రతిష్ఠ మీద రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పరమైనది మాత్రమే కాదు... అది సామాజిక, సాంస్కృతిక విలువల పోరాటం కూడా! ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టించిన స్కిల్ కేసు వివరాలను మరోసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తన అనుచరులను తీసుకొచ్చి సంస్థ పగ్గాలను అందించారు. ఈ సంస్థకూ, డిజైన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థకూ, జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకూ మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని వెల్లడిస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సహకరిస్తుంది. ఇందుకోసం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల కొనుగోలు కోసం 3,300 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 90 శాతాన్ని సీమెన్స్ సంస్థ గ్రాంట్– ఇన్–ఎయిడ్గా (ఉచిత సహాయం) సమకూరుస్తుంది. ప్రభుత్వం తరఫున 10 శాతం కింద 330 కోట్లను సమ కూర్చాలి. జీఎస్టీ చెల్లింపులతో కలిపి అది 371 కోట్లు అవుతుంది. ఈమేరకు కుదిరిన ఒప్పంద పత్రంలో మాత్రం గ్రాంట్–ఇన్–ఎయిడ్ ప్రస్తావన గానీ, కుదిరిన తేదీగానీ ఏమీ లేవు. ప్రభుత్వ వాటాగా 371 కోట్లను తక్షణం డిజైన్టెక్ సంస్థకు విడుదల చేయాలని పైనుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. సీమెన్స్ వాటా విడుదల కాకుండానే పది శాతాన్ని ఏకమొత్తంగా విడు దల చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థికశాఖ అధికారులు నోటు ఫైళ్లపై కామెంట్లు రాసినా ఖాతరు చేయలేదు. పదేపదే పైనుంచి ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శులు నోటుఫైళ్లపై రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత డిజైన్టెక్ సంస్థకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డబ్బులు వెళ్ళాయి. అసలీ డిజైన్ టెక్ సంస్థ పాత్ర ఏమిటి? నేరుగా ఏపీఎస్ఎస్డీసీనే సీమెన్స్ సంస్థతో వ్యవహారం నడపవచ్చు గదా! 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్లను పిలవకుండా ఉండడానికి సీమెన్స్ ఉచిత సాయం కథ ముందుకు తెచ్చారు. ఉచిత సాయం 90 శాతం కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తారని మధ్యలో కథ మార్చారు. ఈ డిజైన్టెక్ అనే సంస్థది బ్రోకరేజీ పాత్ర. ఈ సంస్థకు చేరిన 371 కోట్లలో 59 కోట్లు వెచ్చించి సీమెన్స్ కంపెనీ నుంచి ఏపీఎస్ఎస్డీసీకి అవసరమైన పరికరాలను, సాఫ్ట్వేర్ను తెప్పించారు. ఈ కొనుగోలు జస్ట్ షాపింగ్ లాంటిదే. ఎవరైనా కొనుక్కో వచ్చు. ఒప్పందాలతో పనిలేదు. స్కిల్ సెంటర్ల కోసం మొత్తంగా చేసిన ఖర్చు ఇదే. దీనికే 3,300 కోట్ల బిల్డప్ ఇచ్చారు. టెండర్ల గోల లేకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కథను అల్లుకొచ్చారు. డిజైన్ టెక్ సంస్థ మిగిలిన సొమ్ములో 241 కోట్లను పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి తరలించింది. ఇది పుణె కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఆ సొమ్ము ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, సింగపూర్లోని కంపెనీకి తరలివెళ్లింది. వాటి వివరా లను కూడా సీఐడీ తన రిపోర్టులో పొందుపర్చింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొత్తం ప్రాజెక్టు వ్యయా నికి సరిపోయేలా నకిలీ ఇన్వాయిస్లను కూడా ఈ పుణె కంపెనీ సమీకరించుకున్నది. దీనికి బ్రోకరేజీ ఫీజు వసూలు చేసి ఉండ వచ్చు. ఇదిగో ఈ షెల్ కంపెనీల మీద జీఎస్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. అప్పటికింకా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. జీఎస్టీ అధికారులు ఈ నకిలీ వ్యవహారాలను రాష్ట్ర ఏసీబీకి ఉప్పందించారు. ఏసీబీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సూత్రధారి తానే కనుక ఆయన మౌనం వహించారు. ఏసీబీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. మౌనంగా నోట్ ఫైళ్లతో సహా సంబంధిత డాక్యుమెంట్లను కాల్చేయాలని ఆదేశించారు. తదనంతరం రంగంలోకి దిగిన ఈడీ ఈ మనీల్యాండరింగ్ వ్యవహారాన్ని మొత్తం నిర్ధారించింది. సీమెన్స్ కంపెనీకి ఇండియా విభాగం చీఫ్గా ఉన్న సుమన్ బోస్తో సహా డిజైన్టెక్ ఎంపీ వికాస్ కన్వీల్కర్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ సుమన్ బోస్ అసలు పేరు సౌమ్యాద్రి బోస్గానూ, డిజైన్టెక్ ద్వారా ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమన్ బోస్గా సంతకం చేసినట్టుగానూ ఈడీ గుర్తించింది. దొంగ సంతకం దొంగ స్కీమ్కు రుజువు కదా! ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగం ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పూర్వమే కేంద్ర జీఎస్టీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈ స్కామ్ను పసిగట్టాయి. ఆ కారణంగా సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్ ఉద్యోగం కూడా ఊడింది. ఈ కేసు మొత్తంలో అన్నిటికంటే ప్రధానమైన అంశం – సీమెన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)కి 2022, ఫిబ్రవరి మూడో తేదీ నాడు రాసిన లేఖ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదనీ, అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ తమ దగ్గర ఏమీ లేదని ఆ లేఖలో కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ స్వయంగా ఇటువంటి స్కీమ్ లేదని చెబుతుంటే మన చినబాబు, పెదబాబు, యెల్లో మీడియా మాత్రం ఉందని దబాయిస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఒక జాతీయ మీడియా చానల్లో కూర్చొని లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఉత్తర కుమారుడు యుద్ధానికి బయల్దేరితే జనించినంత ఆసక్తి చినబాబు మీడియా డిబేట్లపై జనించింది. కష్టంగా కొన్ని విషయాలు చెప్పాడాయన. అన్నీ టెక్నికల్ విష యాలే! గుజరాత్లో సీమెన్స్ కంపెనీ ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ను అమలు చేసిందనీ, దాన్ని పరిశీలించాకనే తాము ఒప్పందం చేసుకున్నామనీ లోకేశ్ చెప్పాడు. గుజరాత్లో జరిగిన ఒప్పంద పత్రంపై సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసిన వ్యక్తి ఏపీ ఒప్పందంపై సుమన్ బోస్ అని చేశాడు. అక్రమ పథకానికి అక్రమ సంతకం, సక్రమ పథకానికి సక్రమ సంతకం అన్న మాట. చివరకు అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. మామూలుగా తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బెదరగొట్టే విధంగా విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వామి చినబాబు విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శించాడు. మొదటి ఒకటి రెండు ప్రశ్నలు కొంచెం గట్టిగా అడగ్గానే లోకేశ్ కంగారుపడ్డట్టు కనిపించాడు. దాంతో ఆర్ణబ్ కొంచెం నెమ్మదించాడు. ‘లవకుశ’ సినిమాలో ‘ముక్కుపచ్చారని మునికుమారుల చంపకూడదని నే గొంకుచుంటి’ అనే పద్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావు ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ గోస్వామిలో కనిపించాయి. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే చైర్మన్ ఎలా బాధ్యుడవుతాడు అని లోకేశ్ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే మేనేజర్ స్థాయిలో తప్పు జరిగినట్టు అంగీకరిస్తున్నారా అనే సరికి చినబాబు ఖంగుతిన్నారు. స్కామ్ జరిగితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందో సీఐడీ నిరూపించాలి కదా, అలా నిరూపించ లేదని ఆయన ఆఖరి బాణం వదిలారు. నిరూపించకపోవడమేమిటీ? సీఐడీ నిక్షేపంగా నిరూపిస్తు న్నది. ఈడీ కూడా నిర్ధారిస్తున్నది. షెల్ కంపెనీల ద్వారా సింగ పూర్, దుబాయ్లకు డబ్బు చేరిన తర్వాత కథలోకి యోగేశ్ గుప్తా ఎంట్రీ ఇస్తాడు. ఆయన హవాలా మార్గంలో దేశానికి తరలించి, మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేస్తారు. పార్థసాని హైదరాబాద్లో పెండ్యాల శ్రీనివాస్కు (చంద్రబాబు పీఏ) అందజేస్తారు. శ్రీనివాస్ ద్వారా ప్యాలెస్ డెన్కు ఆ డబ్బు చేరుతుంది. సరిగ్గా ఇవే పేర్లు, ఇదే మోడస్ ఆపరెండీని మనం ఐటీ శాఖ వెలుగులోకి తెచ్చిన స్కామ్లో కూడా చూశాము. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం భవనం కాంట్రాక్టు ఇచ్చినందుకు గాను పల్లోంజీ సంస్థ చెల్లించిన 118 కోట్ల ముడుపులను (600 కోట్ల పనికి) ఇదే పద్ధతిలో తరలించినట్టు ఐటీ శాఖ కనిపెట్టింది. స్కిల్ స్కామ్లో విచారణ కోసం పై ముగ్గురికీ నోటీసులివ్వగానే వారు అందుబాటులో లేకుండా మాయమయ్యారు. యోగేశ్ గుప్తా కనిపించడం లేదు. మనోజ్ పార్థసాని దుబాయ్కీ, పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకూ ఉడాయించారు. స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసు కోవాలన్న ఆసక్తి నిజంగానే లోకేశ్బాబుకు ఉంటే ఆ ముగ్గుర్నీ పిలిపించి సీఐడీకి అప్పగిస్తే సరిపోతుంది. గడచిన మూడు దశాబ్దాలుగా ఎవరికీ దొరక్కుండా కళాత్మకంగా నెగ్గుకొస్తున్న ‘స్కామింగ్‘లో ఇప్పుడు తడబడట మేమిటని యెల్లో కూటమి విస్తుపోతున్నది. ఈ కేసులో అరెస్ట యిన దగ్గర్నుంచీ ఈ శిబిరం నుంచి సాంకేతిక అభ్యంతరాలే తప్ప దొంగతనం జరిగిందా లేదా అనే అసలు విషయం జోలికి వెళ్లడం లేదు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు గనుక స్కామ్తో తనకు సంబంధం లేదని బాబు వాదిస్తున్నారు. ఇదో వితండవాదం. నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే అనుమానితుల పేర్లతో వేసేది ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్). దర్యాప్తు క్రమంలో అసలు నేరస్తుడు బయట పడొచ్చు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు గనుక అసలు నేరస్తుడిని వదిలేస్తారా?.. నవ్విపోతారు. ఈ వ్యవహారంలో తన పాత్ర లేదనీ, ఎవరినీ ప్రభావితం చేయలేదనీ ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ అడుగడుగునా ఈ వ్యవహారంలో ఆయన పాత్రను సీఐడీ దర్యాప్తు నిగ్గుదేల్చింది. ఎపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, నిబంధనలకు విరుద్ధంగా తన మనుషుల్ని దానిలో జొప్పించడం వరకు ఆయనదే ప్రధాన భూమిక. హడావిడిగా ప్రభుత్వ వాటాను వెంటపడి విడుదల చేయించిందే నాటి ముఖ్యమంత్రి. ఇందు కోసం సంబంధిత ఫైళ్లలో 13 చోట్ల ఆయన సంతకాలు చేసిన విషయాన్ని సీఐడీ రుజువు చేసింది. విద్యాశాఖతో సంబంధం లేకుండా నిధుల విడుదలకు ప్రత్యేక గ్రీన్ఛానల్ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆర్థిక శాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నది. ఇవన్నీ ఎవరు చెబితే చేశారు? అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తనను అరెస్టు చేయడం కుదరదనీ, తన మీద ఐపీసీ 409 సెక్షన్పై కేసు బనాయించడం చెల్లదనీ వాదిస్తున్నారు. అంతే తప్ప స్కామ్ జరగలేదని వాదించడం లేదు. ఈ రెండు అంశా లపై ఏసీబీ కోర్టులో విస్తృతంగా వాదప్రతివాదాలు జరిగాయి. గౌరవ న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆయనలో వణుకు మొదలైందని సమాచారం. ఈ స్కామ్తోనే కేసులు ఆగవని, మరో అరడజన్ కేసుల్లో తాను ఇరుక్కోవడం ఖాయ మని భావిస్తున్నారట! చట్టానికి దొరక్కుండా కొల్లగొట్టే తన కౌశలం ఎందుకిలా కొడిగట్టిందో అర్థంకావడం లేదు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్తో సహా బాలకృష్ణ, లోకేశ్ వెళ్లి కలిశారు. ఆయనతో రాజకీయాలేవో మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత చేసిన వీరవిక్రమ ధీర గంభీర స్టేట్మెంట్ మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రకటనలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది – వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి. రెండో అంశం – ఇకపై వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పడం! వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభైమందికి ఎప్పుడో తెలుసు. అంత ఆవేశంగా చెప్పవలసిన కొత్త విషయమేమున్నది ఇందులో! బహుశా జైల్లో చంద్రబాబు ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల కావచ్చు. ఆయన మాత్రం చాలా ఆవేశపడ్డారు. యుద్ధం స్టోరీ కూడా పాతదే. పేద ప్రజల సాధికారత ఉద్యమంపైన పెత్తందార్ల తరఫున ప్రతిపక్ష శిబిరం ఎప్పటినుంచో యుద్ధం చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన కోసం సాగుతున్న యత్నాలపైనా యుద్ధం ప్రకటించింది. మహిళల పేర్ల మీద ఇళ్లు కట్టించి ఇస్తుంటే యుద్ధ సైరన్ వినిపించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే రణభేరి మోగించింది. పెత్తందార్లు యుద్ధం ఆపిందెప్పుడు? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్!
చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయంటారు. ఎన్నెన్ని శాపాలు మనల్ని వెంటాడుతున్నాయో లెక్కవేసి చూశారా బాబుగారూ ఎప్పుడైనా? ఎన్టీ రామారావు గుర్తున్నారా? ఎలా మరిచిపోగలరు? ఈమధ్యనే పురందేశ్వరి కుటుంబంతో కుదిరిన రాజీకి గుర్తుగా సహకుటుంబస్య ఓ చెల్లని బిళ్లను ఆవిష్కరించారు గదా! ఆయనకు మీరూ, మీ సహ నిందితుడైన పత్రికాధిపతి జాయింటుగా చేసిన నమ్మకద్రోహం గుర్తున్నదా? పొడి చిన వెన్నుపోటు జ్ఞాపకమున్నదా? ఆయన చేసిన ఆర్తనాదాలు, పెట్టిన శాపనార్థాలు జ్ఞాపకమున్నాయా? ఆలస్యమైనా సరే ఏ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆవర్జా ఖాతాలను ఆ జన్మలోనే ముగించాలి. ఇది మీ సహనిందితునికి కూడా వర్తిస్తుంది. వంగవీటి మోహనరంగారావు గుర్తున్నారా? కోస్తాంధ్ర నడిగడ్డ మీద ఆయన పొందిన ప్రజాదరణ ఎప్పుడైనా జ్ఞాపకమొస్తున్నదా? అది మీకు కంటగింపుగా మారడం నిజం కాదా? హరిరామజోగయ్యను అడగండి చెబుతారు. మల్లెల బాబ్జీ కూడా తెలుసు కదా! డేర్ డెవిల్ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ గుర్తే కదా! ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు తెలిసినవాడే కదా! ఇటువంటి వారి ఆత్మలు కూడా ఎవరినో శపించాయనీ, ఆ శాపాలు లక్ష్యసాధన కోసం ఈ గాలిలో తిరుగుతూనే ఉన్నాయని ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. తొలివిడత తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో వ్యవసాయం దండగ అనేది బాబు ఫిలాసఫీ. అందుకు అనుగుణమైన విధానాలు అవలంబించిన ఫలితంగా తెలుగు నాట పంటపొలాలన్నీ మృత్యు బీళ్లుగా మారిన సంగతి ఆయన కూడా మరిచిపోయి ఉండరు. ఆ కాలంలో వేలాదిమంది రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మరికొన్ని వేలమంది పురుగుల మందును ఆశ్రయించారు. వారి కుటుంబాలు ఎంత క్షోభించాయో, ఎంత రోదించాయో, ఎంత శపించాయో ఆయనకెట్లా తెలుస్తుంది? తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. రైతు ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన బషీర్బాగ్ దారుణం గుర్తున్నదా బాబూ! మీ సర్కార్ తుపాకుల గర్జనకు నేలకొరిగిన రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వాముల కుటుంబాలనడగండి, మిమ్మల్ని ఏమని దీవిస్తారో? క్షతగాత్రులైన డజన్లకొద్దీ యువతీ యువకులను అడగండి, వారు ఎలుగెత్తి మిమ్మల్ని ఏమని సంబోధిస్తారో! మీ ప్రభుత్వం చేసిన కాల్దరి కాల్పుల అమానుషత్వానికి రైతులు చేసిన హాహాకారం మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదా? నాగరికతకే మాయని మచ్చను తెచ్చిన ఉదంతం కాల్మనీ సెక్స్ రాకెట్. మహిళలకు అప్పులిచ్చి సమయానికి చెల్లించని వారిపై లైంగిక దాడులకు పాల్పడిన కీచకస్వామ్యానికి కర్తకర్మ క్రియలైన దుర్మార్గులను శిక్షించడానికి బదులు వారికి మీరు వీరతాళ్లు వేసి సత్కరించారు. బాధిత కుటుంబాలు శపించకుండా ఎట్లా ఉంటాయి. నయీమ్ అనే రాక్షసుడికి ప్రాణప్రతిష్ఠ చేసి, గిట్టని వారి మీదకు, ఉద్యమకారుల మీదకు అతడి ముఠాను ఉసిగొల్పిందెవరు? మనకేమీ సంబంధం లేదా బాబు గారూ? కానీ అతని బాధితులైన వందలాది కుటుంబాల వారు ఇప్పటికీ నయీమ్తోపాటు మిమ్మల్ని కూడా స్మరించుకుంటున్నారు. మీ అమానుష పాలనలోని కొన్ని మచ్చుతునకలు మాత్రమే ఇవి. ఇక అవినీతి కథలు కోకొల్లలు. వచ్చిన ప్రతి అవినీతి కథనూ వెంటనే కంచికి పంపడంలో బాబు ప్రావీణ్యం సాధించారు. కానీ ఇప్పుడు కంచి హౌస్ఫుల్. ఎప్పటికప్పుడు కథల పంచనామా జరిగి తీరవలసిందే! ఇప్పుడు బాబును అరెస్టు చేసిన కేసులో తాను దొంగతనం చేసినట్టు ఆయనకు తెలుసు. అన్ని ఆధారాలతో సహా దొరికి పోయానని కూడా తెలుసు. కానీ అలవాటు ప్రకారం ఆయన బుకాయింపులనే ఆశ్రయించారు. అవినీతికి సంబంధించిన ఆరోపణలను ఎదుర్కోవడంలో ఆయనకు ఒక విజయవంత మైన వ్యూహం ఉన్నది. యెల్లో మీడియా సహకారంతో ఒళ్లంతా నోరు చేసుకొని అదిలించడం, బెదిరించడం మొదటిదశ. ఆరోపణలు చేసినవారు విజయవంతంగా ఈ దశను దాట గలిగితే తనకున్న వ్యవస్థల నియంత్రణా నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. న్యాయస్థానాల్లోనూ, దర్యాప్తు సంస్థల్లోనూ కేసు కదలకుండా ఉండేందుకు స్టే భిక్షను యాచిస్తారు. ఈ విధంగా సాఫీగా సాగిపోతున్న ఆయన అవినీతి జీవనయాత్రకు సడన్గా ఒక పెద్ద కుదుపు. వాములు మింగే స్వామికి గడ్డిపోచ ఫలహారం అంటారు. మన స్కాములు మింగే స్వామికి రెండు ఫలహారం గడ్డిపోచలే గొంతుకు అడ్డంపడి బండారం బయటపెట్టాయి. అలా బయట పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలేనన్న విషయం ఇక్కడ గమనించాలి. ఒక స్కామ్ను ఇన్కమ్ట్యాక్స్ వారు పట్టు కున్నారు. ముంబైలో మనోజ్ వాసుదేవ పార్థసాని అసోసియేట్స్ సంస్థలో వారు వేరే కేసులో సోదాలు చేస్తుండగా ఈ తీగ దొరికింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కాంట్రాక్టును దక్కిచుకున్న షాపూర్జీ పల్లోంజి సంస్థకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఈ పార్థసానిది బ్రోకరేజీ పాత్ర. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 600 కోట్ల కాంట్రాక్టును ఇచ్చినందుకు గాను 119 కోట్ల రూపాయలను ముడుపులుగా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు ఐటీ వారికి పక్కా ఆధారాలు దొరికాయి. దాంతో వారు బాబుకు నోటీసులు పంపించారు. ఈ కేసులో కూడా బాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా బుకాయించడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ, కేసు నుంచి బయటపడటం బాబుకు సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పట్టపగటి నిలువు దోపిడీతో సమానం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలని సంకల్పిస్తున్నట్టు ఒక జీవోను విడుదల చేశారు. ఇందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ అనే మల్టీనేషనల్ సంస్థతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు. కానీ జీవోలో చెప్పిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అనే కొత్త సంస్థను విద్యాశాఖకు బదులుగా రంగంలోకి దించారు. సీమెన్స్, ఎస్డీసీ, డిజైన్ టెక్ అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 3,300 కోట్ల రూపాయల విలువైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం నిధులు గ్రాంట్–ఇన్–ఎయిడ్గా సీమెన్స్ అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం సమకూరిస్తే చాలు. ఒక ప్రైవేట్ సంస్థ మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసం మూడు వేల కోట్లు ఉదారంగా ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. స్కామ్లంటేనే ఇలాంటి అనేక ఆశ్చర్యాలుంటాయి. సీమెన్స్ నుంచి ఒక్క పైసా విడుదల కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్టెక్ కంపెనీకి తన వాటా పది శాతంతోపాటు జీఎస్టీ కలిపి రూ.371 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ ఫైలుపై సంతకం చేయడానికి నాటి ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం సీమెన్స్ నుంచి నిధులు విడుదలైతే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. ఇది ఆనవాయితీ. కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్చేసి విడుదల చేయాలని చెప్పడంతో సీఎస్ ఆ విషయాన్ని స్పష్టంగా ఫైల్పై పేర్కొని విడుదల చేశారు. ఇంత కంటే స్పష్టమైన ఆధారం ఏముంటుంది? సీమెన్స్తో ఒప్పందం ఒక డ్రామా అని రుజువైంది. సీమెన్స్ తరఫున ఇండియా విభాగం హెడ్ను రంగంలోకి దించి బాబు కథ నడిపించారు. విషయం అసలు కంపెనీకి తెలియగానే ఇండియా హెడ్ రాజీ నామా చేశారు. ఈ ఒప్పందంతో తమ సంస్థకు సంబంధం లేదని సీమెన్స్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం డిజైన్టెక్ సంస్థకు విడుదల చేసిన నిధుల్లో రూ.241 కోట్లు చంద్రబాబు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా సింగపూర్, దుబాయ్లలోని ఖాతాలకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో ముంబైకి చేరాయి. ఆ క్యాష్ను యోగేశ్ గుప్తా తీసుకుని మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేశారు. మనోజ్ హైదరాబాద్కు తెచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అప్పగించారు. పెండ్యాల శ్రీనివాస్ జూబిలీహిల్స్ ప్యాలెస్కు చేర్చారు. ఐటీ కుంభకోణంలో కూడా మనకు అచ్చంగా ఇవే పేర్లు కనిపించాయి. ఐటీ నోటీసుల విషయం మీడియా ద్వారా బహిర్గతం కాగానే మనోజ్ దుబాయికి, శ్రీనివాస్ అమెరికాకు పారిపోయినట్టు సమా చారం. యోగేశ్ గుప్తా అడ్రస్ లేడు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం చంద్రబాబు అధికారంలో ఉండగానే వెలుగు చూసింది. డిజైన్టెక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను చెల్లించడం కోసం పుణేలో వుండే షెల్ కంపెనీల నుంచి నకిలీ ఇన్వాయిస్లను తెప్పించింది. ఈ కుంభకోణం 2015లో జరిగింది. 2018లో పుణే షెల్ కంపెనీలపై జీఎస్టీ అధికారులు జరిపిన సోదాల్లో మన నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి జీఎస్టీ ఆధికారులు చేరవేశారు. ఏసీబీ కూడా ఈ విష యాన్ని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. కానీ సీఎం మౌనాన్ని అర్థం చేసుకున్న ఏసీబీ ఈ కేసులో ముందుకు వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను వెలుగులోకి తెచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి కొన్ని అరెస్టులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న ఘటన పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ‘నన్ను అరెస్టు చేస్తారట. ప్రజలంతా నా చుట్టూ రక్షణగా నిలబడా’లంటూ అప్పట్లో బహిరంగ సభల్లో చంద్రబాబు విజ్ఞప్తులు చేయడం కూడా తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడున్న ఆరోపణల కొనసాగింపే ఈ రోజున జరిగిన పరిణామం. దీనికి రాజకీయ రంగు పులిమి జగన్ ప్రభుత్వ కక్షసాధింపుగా కొందరు వ్యాఖ్యానించడాన్ని విజ్ఞతా రాహిత్యంగానే భావించాలి. రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో మాత్రమే కాదు... ఫైబర్ నెట్లో కూడా చంద్రబాబు దొరికిన దొంగ! మరో అరడజన్ స్కాముల్లో కచ్చితంగా దొరకనున్న నిందితుడు!! అందుకే ఆయన్ను అరెస్టు భయం వెన్నాడుతున్నది. ఢిల్లీ పెద్దల మద్దతు కోసం ఏడాది కాలంగా బాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా అందుకే! ఎన్టీఆర్ కూతురే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నందున అవసరమైతే ఆ సాకుతో తన పార్టీని విలీనం చేస్తానన్నంత దాకా చంద్రబాబు వెళ్లినట్టు సమాచారం. ఈ బిస్కట్తోనే దగ్గుబాటి కుటుంబాన్ని ఆయన దారిలోకి తెచ్చుకున్నట్టు వినికిడి. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మళ్లీ సరికొత్తగా మోసపోవడమే దగ్గుబాటి కుటుంబం ప్రత్యేకత కాబోలు. ఢిల్లీ రాయబారం సీన్ పండ లేదమో! మొన్నటికి మొన్న కూడా బహిరంగ సభల్లో ‘నన్ను అరెస్టు చేస్తారట తమ్ముళ్లూ’... అంటూ మొరపెట్టుకున్నారు. ‘నేను నిప్పులా బతికినవాడిని. నన్నెవరూ తాకలేర’ని బీరాలు పోవడం కూడా చూశాము. నిప్పు కథలూ, పప్పు కథలూ నెమ్మదిగా క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడులతోపాటు లోకేశ్ పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో కూడా లోకేశ్ పాత్ర సందేహాలకు అతీతంగా రుజువైనట్టు విశ్వసనీయ సమాచారం. నేడో రేపో చినబాబు అరెస్టు కూడా తప్పకపోవచ్చు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాళ్ల బేరం ఖరీదెంత?
‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అది ఎగిరే రాబందుల గురించి మాత్రమే. వేలాది మందిని పీడించి పిప్పిచేసిన పెత్తందారీ రాబందుల సంగతి కాదు. లక్షలాది మంది మూలుగల్ని పీల్చేసిన రాజకీయ రాబందుల విషయం కాదు. ఈ రాబందులకు ఒక్క గాలివాన చాలదు. ఇంకో ప్రచండ మారుతం కావాలి. ఝంఝానిలం పరివ్యాప్తం కావాలి. దావానలమై దహించాలి. కానీ, మొదటి గాలివాన లోంచే రానున్న ముప్పును ఆఘ్రాణించే నేర్పు వీటి నాసికలకున్నది. ఆ గ్రహింపు రాగానే వాటి రెక్కల పొగరు తాత్కాలికంగా ముడుచుకుపోతుంది. నక్క వినయాలు ఒంటబడతాయి. నంగినంగి మాట్లాడే కుటిలత్వం, వంగివంగి ప్రణమిల్లే అతి వినయం అలవాటవుతాయి. ఆతడనేక స్కాములయందు ఆరియు తేరిన వృద్ధ రాజకీయ వృకోదరుడు. మొదటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వంలోనే అవి నీతి కేసులపై 20 స్టేలు తెచ్చుకోగలిగిన తాంత్రికుడు. రెండో దఫా ఐదేళ్ల పాలనలో మరో డజన్ స్కాములకు వ్యూహకర్త. ఈసారి లెక్క లక్షల కోట్లలో! ఎందుకో మంత్రం పారట్లేదేమో నన్న అనుమానం మొదలైంది. ముప్పు ముంచుకొస్తున్నదని ముక్కుపుటాలు హెచ్చరిస్తున్నవి. గుండె లోతుల్లోంచి తీతువు కూత వినిపిస్తున్నది. ఎక్కడో ఒక జంబూకం ఊళ వేస్తున్నది. సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త వేగంగా స్పందించారు. ఎక్కడె క్కడో తీగలు కలిపారు. ఫలితంగా సమీప బంధువుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించింది. ఆమె సహకారంతో మరోసారి ఢిల్లీ ‘పవర్’ హౌస్లో పాదం మోపారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎదుట వంగివంగి విన్నపాలు చేసుకున్నారు. తన కంటే ఎంతో చిన్నదైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట చేతులు కట్టుకొని నిలుచున్నారు.. క్లాస్ టీచర్ ఎదుట పనిష్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్ మాదిరిగా! ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందన్న విషయం తెలిసిందే! ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చంద్రబాబుకు ఒక నోటీసు ఇచ్చారు. దీనిపై ఒక వార్త ‘హిందూస్థాన్ టైమ్స్’లో వచ్చింది. మరుసటి రోజున ‘దక్కన్ క్రానికల్’లో నోటీస్ కాపీతో సహా మరింత వివరంగా వార్త అచ్చయ్యింది. అయినా చంద్రబాబు నుంచి గానీ, ఆయన పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు. యెల్లో మీడియా కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నది. ఎందుకంటే బుకాయించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. చడీచప్పుడు లేకుండా స్టే తెచ్చుకోవాలి. స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుది గిన్నిస్ రికార్డు. మొన్నటి నోటీసు కంటే ముందే ఐటీ శాఖ చంద్రబాబుకు ఇంకో నోటీసు ఇచ్చింది. రెండింటి సారాంశం ఒక్కటే. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టులు పొందిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు అందుకు ముడుపుల కింద చెల్లించిన రూ.118 కోట్లు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరాయి. ఈ ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించలేదు. ఐటీ శాఖ వారు ముంబయ్లో మనోజ్ వాసు దేవ్ పార్ధసాని అసోసియేట్స్ సంస్థలో సోదా చేసినప్పుడు వారికి అనుకోకుండా చంద్రబాబు తీగ దొరికింది. ఆనవాయితీ ప్రకారం వారు చంద్రబాబుకు నోటీసు పంపించారు. తనకు ముడుపులు వచ్చాయా, లేదా అనే విషయాల జోలికి వెళ్లకుండా టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఐటీ శాఖకు సమాధానం ఇచ్చారు. తనకు నోటీసు ఇచ్చిన అధికారి పరిధి లోకి తాను రాననే దబాయింపు తప్ప కేసు మెరిట్ జోలికి చంద్రబాబు వెళ్లలేదు. చంద్రబాబు తన మీద వచ్చిన అన్ని రకాల కేసుల్లోనూ ఇటువంటి టెక్నికల్ పాయింట్లను వాడు కోవడం, వ్యవస్థలను లిటిగేషన్లతో ప్రభావితం చేయడం వంటి పద్ధతుల ద్వారానే స్టేలు పొందుతూ వచ్చారు, అయితే ఈ కేసులో బాబు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఐటీ శాఖ రెండో నోటీసు ఇచ్చింది. ఈ 118 కోట్ల రూపాయల ముడుపులు అనేవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. వేరే కేసులో సోదాలు జరుపుతుండగా యథాలాపంగా దొరికింది మాత్రమే. దీనిమీద మరికొంత ముందుకెళ్లిన ఐటీ అధికారులకు విస్తుపోయే ఆధారాలు లభించినట్లు సమాచారం. అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలోనే బాబు అందుకున్న ముడుపులు వేల కోట్లలో ఉన్నాయట! వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులు సేకరించారు. నోటీసులకు సంబంధించిన 118 కోట్ల రూపాయలను వెల్లడించనందుకు గాను అంతకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. పన్నెండు శాతం వడ్డీ అదనం. ఆదాయం పన్ను శాఖ నోటీసులను గౌరవించి చంద్రబాబు ఆ పెనాల్టీని చెల్లిస్తే ముఖ్యమంత్రిగా ఉండి లంచాలను తీసుకున్నట్టు అంగీకరించినట్టే! అలా అంగీకరించినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8ఏ ప్రకారం అధికార పదవులకు అనర్హుడవుతాడు. దాంతోపాటు ఐపీసీ సెక్షన్ 409ని కూడా ప్రయోగించవచ్చు. నేరపూరిత విశ్వాస ఘాతుకానికి గాను పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం కింద పదేళ్ల జైలు, జరిమానా వేయవచ్చు. మనీలాండరింగ్ చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చు. ఈ లంచాల్లో భాగంగానే ఆయన జూబ్లీ హిల్స్ ఇంటిని నిర్మించినట్టు రుజువైతే బినామీ చట్టం కింద ఆ ఇంటి మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. నోటీసులకు స్పందించకపోతే కూడా జైలుశిక్షకు ఆస్కారము న్నది. కనుక ముందుకు వెళ్లలేడు, వెనక్కు వెళ్లలేడు. ఇప్పుడాయ నకు కావలసింది స్టే! చంద్రబాబు, ఆయన గురువు రామోజీల తిరుమంత్రం స్టే! సాంకేతిక కారణాలు చూపి దబాయించడం రామోజీకి పెన్నుతో పెట్టిన విద్య. దాన్ని ఆయన వెన్నతో పెట్టి చంద్రబాబుకు నేర్పించారు. ఆయన ఈ కళలో పరిపూర్ణత సంపాదించి వ్యవస్థలను నియంత్రించగలగడం దాకా ఎదిగారు. తాజాగా చిట్ఫండ్స్ కేసులోనూ రామోజీది ఇదే వరస! చిట్ఫండ్స్ చట్టాన్ని రామోజీ దారుణంగా ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆధారాలను చూపిస్తున్నది. రామోజీ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించానని గానీ, ఉల్లంఘించలేదని గానీ చెప్పరు. ఎవరూ ఫిర్యాదు చేయందే కేసెట్లా పెడతారని వాదిస్తారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చనేది గురుశిష్యుల సిద్ధాంతం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ చంద్రబాబు అడ్డంగా బుక్కయిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో బేరమాడుతూ చంద్రబాబు మనిషి రేవంత్రెడ్డి ఉన్నారు. అక్కడ డబ్బుల బ్యాగ్ చేతులు మారిన వీడియో ఉన్నది. చంద్రబాబును ఎమ్మెల్యేతో మాట్లాడించడం కోసం రేవంత్రెడ్డి ఫోన్ కలిపిన దృశ్యం ఉన్నది. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ అన్న బాబు కంఠస్వరం వినిపించింది. అంత చక్కటి ఇంగ్లిష్ ఈ దేశంలో బాబు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని కేటీఆర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఉన్నది. అయినా సరే అసలు విషయాన్ని వదిలేసి ‘నా ఫోన్ను ఎట్లా ట్యాప్ చేస్తార’న్న బాబు దబాయింపు కూడా జ్ఞాపకం ఉన్నది. ఇదే పద్ధతిలో ఇప్పటిదాకా ఆయన ఇరవై స్టేలు తెచ్చు కున్నారు. ఆయన అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీపార్వతి రెండుసార్లు వేసిన కేసుల్లో రెండు స్టేలు. ఐఎమ్జీ భారత్ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన కేసులో స్టే. ఏలేరు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తెచ్చుకున్న స్టే. ఇంకా మద్యం ముడుపుల కేసు – వగైరాలు ఈ స్టేల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడెందుకో తాజా ఐటీ కేసు కొంచెం భిన్నంగా తోస్తున్నది. ఈ నోటీసుల వ్యవహారం బయటకు రాకుండా, ఐటీ అధికారులు ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకైతే ఫలితాలనివ్వలేదు. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి ఐటీ నోటీసులు మరికొన్ని రావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఇటువంటిదే! ఈ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా ప్రయాణం చేసి బాబు గారింటికి చేరుకున్నాయి. ఇక్కడ స్కిల్లూ లేదు, డెవలప్మెంటూ లేదు. ఇప్పటికే ఈడీ రంగప్రవేశం చేసి నలుగురిని అరెస్టు చేసింది. రాజధాని కుంభకోణాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పురాణంగా ఈ స్కామ్ చరిత్ర పుటల కెక్కబోతున్నది. ల్యాండ్ పూలింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్, పూలింగ్ పరిధి నుంచి తప్పించినందుకు క్విడ్ ప్రో కో ప్యాలెస్, అసైన్డ్ కుంభకోణం, సింగపూర్ కన్సా ర్టియం... ఇలా అనేక ఉప కుంభకోణాలతో కూడిన భారీ స్కామ్ ఇది. ఈ కేసుల్లోనే ఇరుక్కున్న సింగపూర్ మంత్రి, బాబు మిత్రుడు ఈశ్వరన్ ఇప్పటికే అరెస్టయ్యాడు. ఇంకో డజన్ స్కామ్లు విచారణ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఐటీ కేసు ముందుకు కదలడమంటే కేసుల తేనెతుట్టెను కదిలించినట్టే! కనుక అదిక్కడ ఆగాలి. స్టే మంత్రం ఫలించాలి. అందుకోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఆంతరంగిక సమాచారం. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనన్ని తిట్లు తిట్టిన బాబు ఆ తర్వాత ఎవరూ పొగడని స్థాయిలో పొగుడుతున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరిపోయి బీజేపీ – జనసేనల తోడ్పాటుతో అధికారంలోకి రాగలిగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని బాబు భావిస్తున్నట్టు విని కిడి. బీజేపీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థతో కేంద్రం చేయించిన సర్వేలో జగన్మోహన్రెడ్డికి 53 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో బాబు అవినీతి భారాన్ని మోయడం కంటే జనసేన – బీజేపీ కూటమిగా ఏర్పడితే 2029 ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థి కూటమిగా అవతరించవచ్చని దాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ స్థాయికి తగ్గయినా సరే కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ – జనసేనలకు కలిపి 75 అసెంబ్లీ సీట్లు, 12 లోక్సభ సీట్లను తాజాగా ప్రతిపాదించారట. పార్టీలోని విశ్వస నీయ వర్గాల ద్వారా ఇంకా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తున్నది. ఆయన ఎంత నిస్పృహలో ఉన్నారంటే, ‘తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తే, పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా వెనకాడకపోవచ్చ’ని చెబుతున్నారు. ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడితే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని ఉన్న శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రస్వామి తాయెత్తు విజన్!
తర్కంతో కొట్టలేనప్పుడు తాయెత్తుల మహిమను చూపాలి. పేదలు, బాధితులు, దగాపడిన తమ్ముళ్ల కంటిపాపల్లో కాంతి కిరణం మెరిసినప్పుడల్లా పెత్తందారీ హేతువులోంచి ఓ బేతాళుడు నిద్రలేస్తాడు. ఓం హ్రీం అంటూ ఆవులిస్తాడు. నయా పెత్తందారీవర్గపు ఉంపుడు సిద్ధాంతకర్త నారా చంద్రబాబు నాయుడులోంచి తాజా తేనెపూత విజన్తోపాటు ఓ బేతాళుడు కూడా బయటికొచ్చాడు. మహిళా లోకంపై మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆడబిడ్డలందరికీ ఆయన మంత్రించిన రాఖీలు ఇస్తాడట! వాటిని 45 రోజులు పూజగదిలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబును తలుచుకోవాలట! అనంతరంచేతికి కట్టుకోవాలి. అప్పుడు వారికి అష్టసిరులు ఒనగూరు తాయట! మంత్రదండం సాయంతో నారా చంద్రస్వామి ఈ రకంగా మహిళా సాధికారత సాధిస్తారన్న మాట.. నిత్యానంద స్వామి కైలాసాన్ని సృష్టించినట్టు! ఆగస్టు పదిహేనో తేదీనాడు చంద్రబాబు ‘విజన్– 2047’ పేరుతో విశాఖపట్టణంలో ఒక కాగితాల కట్టను విడుదల చేశారు. దాన్ని తన ఆలోచనగా చెప్పుకున్నారు. మామూలుగా పంద్రాగస్టు కార్యక్రమాలను కవర్ చేసేటప్పుడు తొలి ప్రాధా న్యాన్ని ప్రధానమంత్రికిస్తూ అదే స్థాయిలో రెండో ప్రాధాన్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికివ్వడం ప్రాంతీయ మీడియాలో ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ యెల్లో మీడియా మాత్రం ముఖ్య మంత్రిని పక్కకునెట్టి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్కు అగ్ర స్థానాన్ని ఇచ్చింది. ఇంతకూ ఇందులో ఏమంది? 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు నిండు తాయి. అప్పటికి దేశం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం ‘విజన్ – 2047’ను రూపొందించింది. ఆ ఏడాది కిందటి ఆలోచనలోంచి ఓ పిడికెడు మాదాకబళాన్ని తీసుకొచ్చి కొంచెం వెచ్చచేసి బాబు వడ్డించారు. పోనీ దాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తూ అనుసృజన చేసినా బాగుండేది. కానీ, ‘దేశ్ కీ నేతా’ హోదాకు ఇంచు కూడా తగ్గేందుకు బాబు సిద్ధ పడలేదు. బహుశా ‘రాజ్య్ (రాష్ట్ర) కీ నేతా’ హోదా మరోసారి దక్కే అవకాశం లేదని గట్టిగా నమ్మారేమో! ఇంకో పాతికేళ్లలో దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఏ హోదాతోనో చెప్పలేదు. ‘ఆప్ కౌన్ హై’ అని అడిగే అవసరం ఎవరికీ లేదు. తనకు యాభై అయిదేళ్లు నిండకముందే నాలుగు శతాబ్దాల పైచిలుకు వయసుతో హైదరాబాద్ను సృష్టించిన వ్యక్తికి ఏదైనా సాధ్యమేనని సరిపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ పవర్, రోబోటిక్స్ వగైరా తాజా పదజాలాన్ని ఆయన విజన్లో విరివిగా ఉపయోగించారు. అబ్బో మా బాబుగారికి చాలా విషయాలు తెలుసునని అనుయాయులు మురిసిపోవడానికి తప్ప సామా జిక చింతన ఏ కోశానా అందులో లేదు. ఇంటర్లో బైపీసీ చదివితే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగవచ్చనే ఒక గొప్ప ఉప దేశాన్ని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అనుగ్రహించారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న విజన్కు తాను కూడా ఇలా కోరస్ పాడితే ఆయన మెప్పు పొందవచ్చన్న తహతహ ఒక కారణం కావచ్చు. తనను గొప్ప విజనరీగా భజన చేస్తున్న యెల్లో మీడియాలో ఆత్మవిశ్వాసం నింపడం మరో కారణం కావచ్చు. ఈ రెండు అవసరాల కోసం చంద్రబాబు పంద్రాగస్టు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆయనకు పెద్దగా విశ్వాసం లేదు. ఎందుకంటే తన మొదటి విజన్ (2020) ఆర్థికంగా తనకు లబ్ధి చేకూర్చినా, రాజకీయంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక తెలుగు సమాజానికైతే ఆ విజన్ సృష్టించిన విధ్వంసం మరిచిపోలేని ఒక మహా విషాదం. చంద్రబాబు తన ‘విజన్–2020’ సారాంశంతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రచురించారు. తెలుగులో దాని పేరు ‘మనసులో మాట’. దాని పేరును బట్టే ఆ పుస్తకంలోని అభిప్రాయాలు చంద్రబాబుకు స్వాభావికమైన విగా, ఆయన నమ్మకాలుగా భావించాలి. ఉచిత పథకాలను ఈ పుస్తకంలో ఈసడించుకున్నారు. ఉచిత విద్యుత్ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు బుద్ధిగా మసలుకోవాలని (అప్పు డాయన అధికారంలో ఉన్నారు), ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరే కించకూడదని సుద్దులు చెప్పారు. ఉద్యోగాలు పర్మనెంటయితే వారికి బాధ్యత ఉండదని, అందువల్ల కాంట్రాక్టు పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టారు. విద్య, వైద్యం ఏదీ ఉచితంగా అందుబాటులో ఉంచకూడదని గట్టిగా వాదించారు. ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీల వసూలు ప్రారంభించారు. పేదవాడికి జ్వరం వచ్చినా డబ్బులు చెల్లించనిదే మందుబిళ్ల కూడా దొరకని దుర్మార్గ పరిస్థితి ఏర్పడింది. సర్కారు బడులను పాడుబెట్టి చదువు‘కొనలేని’ ఒక తరాన్ని మొత్తం విద్యకు దూరం చేశారు. మధ్యతరగతి ప్రజలు సైతం చదువుల ఖర్చులు భరించలేక అప్పుల ఊబిలోకి దిగబడిపోయారు. వ్యవసాయం దండగ అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రైతాంగంలో అదే అభిప్రాయం వ్యాప్తి చెందేలా చేశారు. రైతు కూలీలు భూబంధం నుంచి బయటపడితేనే సంపన్నుల పనులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయన కోరుకున్న ట్టుగానే లక్షలాది రైతు కూలీలు పొలం బంధాన్ని తెంచు కున్నారు. పొట్టకూటి కోసం వలస బాటలు పట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూలీ తల్లులు చంటిబిడ్డల నోటికి పాలపీకలు పెట్టిన కల్లు సీసాలను అందించారు. కల్లు మత్తులో ఆ బిడ్డ నిద్రపోయి తల్లి కోసం ఏడ్వదని వారు అలా తల పోసేవారు. మాటలకందని ఆ మహాదైన్యం అప్పుడు ఎక్కడ చూసినా కనిపించేది. వలసబాట పట్టకుండా మొండికేసి వ్యవసాయం చేసిన వారు బాబు విధానాల ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. బిడ్డలు వలసపోగా మిగిలిన అవ్వాతాతలు అంబలి కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తే! ఈ దుఃస్థితికే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే పాటలో అద్దంపట్టిన సంగతి తెలిసిందే. ఈ కన్నీటికి కారణం చంద్రబాబు విజన్. ఆ కన్నీటిపై ఐటీ పన్నీరు చల్లి ‘ఇదీ చంద్రబాబు విజన్’ అని ఆయన అనుకూలవర్గం ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. తాను ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడం వల్లనే ఐటీ నిపుణులు పెరిగారని ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతకంటే ఐదేళ్లు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రకటిస్తే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. హైటెక్ సిటీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధమైందని చంద్రబాబే స్వయంగా ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. రెడీగా ఉన్న ప్రణాళికను అమలు చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఆయన ఆలస్యం చేశారు. ఇదీ జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను యెల్లో మీడియా మసిపూసి మారేడుకాయలు చేసింది. ఒక సామాజిక విధ్వంస కుడికి విజనరీ ముసుగువేసి చరిత్రలో నిలబెట్టింది. ఇది చరిత్రలో జరిగిన ఒక ద్రోహం. బాబు విజన్తో కన్నీరు పెట్టిన పల్లెసీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ చిగురించడం మొదలైంది. రైతు మళ్లీ నాగలి పట్టాడు. వైద్యం పేదలకు చేరువైంది. జన సంక్షేమ విజన్కు ప్రాధాన్యం లభించింది. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ – పవన్ పొత్తులతో వెంట్రుకవాసి విజయాన్ని సాధించగలిగాడు. ఈ గెలుపు కోసం తన మనసులోని మాటను దాచిపెట్టాడు. సంక్షేమ ఎజెండాను ఎత్తుకోవడమే కాదు అలవిగాని హామీలతో తన ఎన్నికల మేని ఫెస్టోను నింపేశారు. గెలిచిన తర్వాత రాజధాని పేరుతో భూదోపిడీకి, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడేందుకు పరిమిత మయ్యారు. అదిగో అల్లదిగో అంటూ రాజధాని గ్రాఫిక్స్ను ప్రచారంలో పెడితే, ‘ఇది కదా విజన్’ అంటూ యెల్లో మీడియా పరవశించిపోయింది. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తడ బాటూ, శషభిషలూ లేని స్పష్టమైన పేదల అనుకూల ఎజెండాను తలకెత్తుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల పురోగతి కోసం, అన్ని వర్గాల్లోని మహిళల సాధికారత కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, అధికార వికేంద్రీ కరణ కోసం ఒక ఉద్యమాన్నే ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అడ్డువస్తున్న పెత్తందారీ వ్యవస్థపై జగన్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. వ్యవస్థలోని అన్ని పార్శా్వల్లో ఈ పెత్తందారీ వ్యవస్థ ఊడలు దించి బలోపేతమై ఉన్నది. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ వ్యవస్థపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసించలేదు. పెత్తందారీ వ్యవస్థతో తలపడటం, ఓడించడం ద్వారానే పేదల విముక్తి సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం అందుకు బరిగీసి నిలబడి ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ తన సహస్ర బాహువులతో జగన్ ప్రభుత్వంపై విషం చల్లుతున్నది. దశకంఠాలతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. తమ ఎన్నికల మేనిఫెస్టోను గడప గడపకూ పంపిణీ చేస్తూ తాము ఎన్ని హామీలను నెరవేర్చామో పరిశీలించి పరిపాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోను కనబడకుండా మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టోకు పటంకట్టి ఊరేగిస్తూ ‘మేం చేయని పనేమిటో చెప్పండ’ని పిలుపునిస్తున్న జగన్ ప్రభుత్వం ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ద్వంద్వ యుద్ధానికి తలపడటం సాధ్య మయ్యే పనేనా? కాదు కనుకనే మాయోపాయాలు, దుష్ప్రచారాలు, కుతంత్రాలు వేయి పడగలెత్తి బుసకొడుతున్నాయి. బాబుకు వేసిన విజనరీ ముసుగు జారిపోకుండా మొన్న ప్రకటించిన ఎంగిలి విజన్ ఒక పడగ. తాయెత్తు మహిమలు ప్రచారం చేయడం, మూఢనమ్మకాలను వ్యాపింపజేయడం ఇంకో పడగ. భారత రాజ్యాంగం 51వ అధికరణం ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం పౌరుల ప్రా«థమిక విధి. అందుకు విరుద్ధంగా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడే మూఢ నమ్మకాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ ద్రోహమవుతుంది. పైగా వాటికి ఆయన రాఖీలని పేరు పెట్టారు. మంత్రించి ఇచ్చేవి తాయెత్తులవుతాయి గానీ రాఖీలెట్లా అవు తాయి? అయినా తమ సాధికారతకు కట్టుబడిన వాళ్లకు, తమకు రక్షణగా నిలబడిన వాళ్లకు మహిళలే స్వయంగా రక్షాబంధనాలు కడతారు తప్ప మంత్రగాళ్లకు కాదు గదా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హింసా సంస్కృతి ఏ సందేశానికి?
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్ శక్తిమంతంగా పనిచేస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్ ఇంజన్తో, అంటే రెండో ఇంజన్ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు. వాస్తవానికి మణిపుర్లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్ ఇంజన్’ పవర్తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్ – ఆరెస్సెస్. మూడవ ఇంజన్ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్. 1999లో బీజేపీ, ఆరెస్సెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్కు అప్పగించినట్లు కనిపిస్తోంది. రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్ అయిన ఆరెస్సెస్ ప్రమేయం లేకుండా... మణిపుర్లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్ ఇంజన్. స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’. ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్సంఘ్ చాలక్ మాట్లాడుతున్నారు. మణిపుర్లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు! నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్ నింపిన ఆ ఇంజన్కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్ ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మణిపుర్లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్కు, అక్కడ నుంచి మద్రాస్లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
ఫీల్గుడ్ తుపాకీ పేలుతుందా?
ఆర్థిక అసమానతలు మనుషుల మధ్యనే కాదు. ఎకరాల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షలకు ఎకరం లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొన్న సర్కారు వారి పాటలో ‘కోకాపేట’ కనకం మాత్రం వందకోట్ల కిరీటాన్ని ధరించింది. హైదరాబాద్ నగరానికి పడమటి దిక్కున ఔటర్ రింగ్రోడ్డును ఆనుకుని ఈ కోకాపేట వేంచేసి ఉన్నది. ఇప్పుడీ కోకాపేట ఒక దేవకన్యలా మెరిసిపోతున్నది. ‘దివినే వదిలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అని పాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఔటర్ రింగ్రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే కోకాపేట తేజస్సు తెలిసి వస్తుంది. బొంగుళూరు నుంచి పెద్దఅంబర్పేట మీదుగా కీసర, మేడ్చల్ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా లేరట! గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు వెల్లడైన విషయమిది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఒన్ జీవో (జీవో 111) సామ్రాజ్యం కూడా కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల ఆ ‘విముక్త’ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్ చేస్తూ కోకాపేట ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ అసహజత్వం అర్థం కావాలంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా అవగాహన ఉండాలి. గంటగంటకూ గమ్యాన్ని మార్చుకునే తుపాన్ల సృష్టికి మన బంగాళాఖాతం పెట్టింది పేరు. బెంగాల్, బంగ్లాదేశ్లను కలిపి చూసినా వాటి ఉమ్మడి సముద్ర తీరం కంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వంద కిలోమీటర్లు ఎక్కువ. అయినా ‘బే ఆఫ్ బెంగాల్’ అన్నారు గానీ, ‘బే ఆఫ్ ఆంధ్రా’ అనలేదు ఎందుకో! ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుత ప్రసంగం కావచ్చు. బంగాళాఖాతం తుపాన్ల మాదిరిగానే తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా గత ఏడాది కాలంగా రకరకాల మార్పులకు లోనైంది. ఇప్పుడిప్పుడే తీరం దాటి గమ్యం చేరినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సర్వే బృందాలు వర్ధిల్లడానికి అవకాశమిచ్చింది. సెఫాలజీ ఒక ఉపాధి అవకాశంగా విస్తరించింది. రాజకీయ పార్టీలు ఒకటో రెండో మూడో బృందాలను నియమించుకున్నాయి. జాతీయ బృందాలతోపాటు ప్రాంతీయ, స్థానిక టీమ్లు కూడా పనిచేశాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా తమ బలం మీద అంచనా కోసం సర్వేలు చేసుకున్నారు. గోడ దూకుదామనుకున్న వాళ్లు కూడా సర్వేలు చేసుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా పార్టీ మారినవారు మళ్లీ వాతావరణ మార్పులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంగా ఈ సర్వే బృందాలు ఇస్తున్న నివేదికలను స్థూలంగా పరిశీలిస్తే, సీట్ల సంఖ్యలో తేడాలు కనబడుతున్నాయే తప్ప, ట్రెండ్లో తేడాల్లేవు. ఈ మేరకు సర్వేలు సరిగ్గానే జరిగినట్టు అనుకోవాలి. మొదట్లో బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనబడింది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. ఇంకేముంది కొద్ది రోజుల్లో మిగిలిన పార్టీల్లోని ముఖ్యనేతలంతా బీజేపీలో చేరిపోతారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చాలామంది ప్రగాఢంగా నమ్మారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెమ్మదిగా కమలం వైపు కదులుతున్న సూచనలు కనిపించాయి. కానీ కేసీఆర్ చాణక్యాన్ని అంచనా వేయడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఆ పార్టీకి అత్యంత కీలక నాయకుడైన బీఎల్ సంతోష్ జుట్టును కేసీఆర్ దొరకబుచ్చుకోవడంతో అది చేష్టలుడిగిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వెనుక బీఎల్ సంతోష్ ప్రమేయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిరూపణ చేయగలిగింది. దాని అడుగులు నెమ్మదించాయి. పులి మీద పుట్రలా కర్ణాటక ఫలితాలు. ఇంతటితో ఈ సంవత్సరపు తొలి అంకం సమాప్తం. రెండో అంకంలో కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకోవడం మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫలితాలు అందజేసిన ఆక్సిజన్ అందుక్కారణం. బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విస్తృతి ఎక్కువ. ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీ కూడా! కేసీఆర్ను వ్యతిరేకించే వారిలో చాలామంది బీజేపీతో సౌకర్యంగా ఉండలేరు. కాంగ్రెస్తో ఆ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రతి పల్లెలో కాంగ్రెస్ జెండాను ఎత్తుకోవడానికి కనీసం పదిమందైనా ఇప్పటికీ మిగిలే ఉన్నారు. మైనారిటీ ఓటర్లకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ఒక చాయిస్గా ఉంటుంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలుంటాయన్న అంచనాలు వెలువడ్డాయి. కొన్ని వలసలు జరిగాయి కూడా! ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ కనీసం 30 సీట్లు గెలుచుకుంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి. మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకో 30 గెలిచినా చాలని అనుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ’ అంటారు. రాజకీయాల్లో అస్సలు జరగవు. కాంగ్రెస్ పార్టీ బలమైన స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెద్దపెద్ద వలలు వేసి కూర్చున్నదనే సంగతి అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటి పోయింది. అంతఃకలహాలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వ లక్షణమే కావచ్చు. కానీ ఇప్పుడున్నంత తీవ్రస్థాయి వైరుద్ధ్యాలు మునుపెన్నడూ లేవని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం ఓడించడానికి కూడా వెనకాడనంత తీవ్రస్థాయిలో వైరుద్ధ్యాలున్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరికి నాయకత్వం అప్పగించినా ఇంకొందరు పార్టీ మారడానికి వెనుకాడని పరిస్థితులున్నాయని చెబుతున్నారు. పార్టీ కీలక నాయకుడే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో కీలక నేత కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. 35 నుంచి 40 స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటూ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక ఇవ్వడంలోనూ, ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాని లీకులివ్వడంలోనూ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హస్తం ఉండవచ్చని సీనియర్ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క కాపురమంతా కలహాల సంతగా సాగుతుండగానే ఏలిన్నాటి శని మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ను చంద్రబాబు తగులుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరిందనుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చివరి రెండు నెలల్లో తలకిందులు కావడానికి ఆ పార్టీకి తెలుగుదేశంతో కుదిరిన పొత్తే కారణమని పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్రెడ్డి ఇప్పటికీ బాబుకు సన్నిహితుడేనని కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ టీవీ’ అనే న్యూస్ ఛానల్ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నదని చెబుతున్నారు. ఈ ఛానల్ తెలంగాణలో రేవంత్కూ, ఏపీలో చంద్రబాబుకూ ప్రచారం చేసిపెడుతున్నది. కాంగ్రెస్కు బలమైన స్థావరాలుగా పేరున్న ప్రాంతాల్లో, వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘తానా’ (అమెరికా) సభల్లో రేవంత్ పాల్గొనడం, అక్కడ చేసిన ఉపన్యాసం కూడా కాంగ్రెస్ వర్గాలతోపాటు తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి అనాలోచితంగా చేసిన కామెంట్ కూడా కాంగ్రెస్కు పెద్ద మైనస్గా మారింది. రేవంత్ కామెంట్ను తనకు అనుకూలమైన రీతిలో ఎడిట్ చేసి బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టింది. ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదనే మెసేజ్ను ఇరవై నాలుగ్గంటలలోపే ప్రతి రైతు చెంతకూ చేరవేసిన బీఆర్ఎస్ తన సంస్థాగత బలాన్ని మరోసారి చాటి చెప్పింది. నష్టనివారణ కోసం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్లలో హడావిడి చేసి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రికార్డులేవో చూపించబోయారు. కానీ రైతులెవరూ దాన్ని పట్టించుకోలేదు. తనకు సరిపోయే కరెంటు వస్తున్నప్పుడు అది ఇరవై నాలుగ్గంటలా? పన్నెండు గంటలా అనే లెక్కలెవరికి కావాలి? చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ వెలవెలబోయింది. కాంగ్రెస్కు సంఖ్యాబలం లేమి ఒక కారణమైతే కావచ్చు గానీ గేమ్లో చివరి గోల్ను కూడా బీఆర్ఎస్ కొట్టిందనేది ఒక వాస్తవం. గతంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో నెలరోజులుగా ఫీల్గుడ్ వాతావరణం క్రమంగా ఆవరిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్, బీజేపీల స్వయంకృతాపరాధాలు, వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. బీఆర్ఎస్తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం మేరకే బీజేపీ కొంత వెనక్కు తగ్గిందనే ప్రచారం కూడా బలంగానే ఉన్నది. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ – బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి ఏర్పడితే సహజంగానే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుంది. అది దాని రాజకీయ అవసరం. ఇంకో అతి ముఖ్యమైన విషయం నాయకత్వ సమస్య. కేసీఆర్కు ధీటైన నాయకుడు ప్రతిపక్షాల్లో కంచుకాగడా వేసుకొని వెతికినా ఎవరూ కనిపించరు. ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తాజాగా జరిగిన అన్ని గ్రూపుల సర్వేల్లోనూ వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ గెలిచే సీట్లలో దాదాపు సగం సీట్లు గెలిచి కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందట! బీజేపీ మూడో స్థానంతో సర్దుకోవచ్చంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి రెండు మూడు స్థానాలు మారతాయట! రెండో స్థానంలోకి బీజేపీ చేరుతుంది. ఫీల్గుడ్ వాతావరణం మొదలైన తర్వాతనే కేసీఆర్ మరింత దూకుడును పెంచి వరసగా తాయిలాలను ప్రకటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. బొటాబొటీగా కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే ఆ ప్రభావం లోక్సభపై కూడా పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత డబుల్ డిజిట్ను తాకకపోతే బాగుండదనే ఆభిప్రాయం ఉండవచ్చు. 2018 ఎన్నికల వాగ్దానమైన రైతు రుణమాఫీ కొంతమేరకు చేసిన అనంతరం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ దాన్ని కిందకు దించి పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించారు. చేతివృత్తుల వారికి లక్ష సాయం, మైనారిటీలకు లక్ష సాయం, వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా వరస వరాలను ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం! ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు అది సాధ్యం కాదని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే బాట పట్టారు. పనిలో పనిగా కోకాపేట సమ్మోహనాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎందుకు చేసినట్టు? ఎకరా వందకోట్ల చొప్పున మూడున్నర ఎకరాల బిట్టు కొన్నవాళ్లు ఎన్ని అంతస్థులు కడితే గిట్టుబాటు అవుతుంది? మొత్తం ఎన్ని వేల ఫ్లాట్లు కట్టాలి? చదరపు అడుగుకు ఎంత ధర పెడితే గిట్టుబాటు అవుతుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేయగలిగినవారు వేల సంఖ్యలో వారికి దొరుకుతారా? మూడున్నర ఎకరాల్లో వేల కుటుంబాలుంటే పర్యావరణ సమస్యలు ఏర్పడవా? ఇలాంటివన్నీ మనలాంటి అల్పజీవులకు కలిగే సందేహాలు. ప్రభువుల లెక్క వేరు. బుల్లెట్ దిగిందా లేదా! ‘హైదరాబాద్ షైనింగ్’ అనే ప్రచారం బాగా పనిచేస్తే బుల్లెట్ దిగినట్టే! ఈ షైనింగ్, ఫీల్గుడ్లతో ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఒక్కోసారి ఈ ప్రచారం వికటించవచ్చు. వాజపేయి ప్రభుత్వం కూడా ఫీల్గుడ్ తుపాకీ ట్రిగ్గర్ నొక్కి ఎన్నికలకు వెళ్లింది. తుపాకీ పేలలేదు, బుల్లెట్ దిగలేదు. ఈ తుపాకీ పేలుతుందేమో చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నా దేశం నగ్నదేహమా?
అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది. మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్ (ఓబీసీ), కుకీ (ఎస్టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది. కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు. చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఒక దశలో ఇంఫాల్ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్ ప్రశ్నించింది. ఆమె మైతేయ్ తెగ మహిళ. స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది. కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్ ఆర్మీ... రేప్ అజ్’ అనే బ్యాన ర్తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది. తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది. మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి? మణిపుర ఘటనలు ‘డబుల్ ఇంజన్’ సర్కార్ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్... సంఘ్ పరివార్! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్ మహిళను కుకీ తెగవారు రేప్ చేశారని ఒక ఫేక్ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు. దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు. జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది. నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు. ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇంటిదొంగ – ఈశ్వరన్!
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తొలగింపు, అరెస్ట్ వార్తలు మన దగ్గర కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఇందుకు మూడు కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి అత్యల్పంగా కనిపించే సింగపూర్లో అవినీతి ఆరోపణలపై ఒక మంత్రి అరెస్ట్ కావడం మొదటి కారణం. రెండవది ఈశ్వరన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. మూడో కారణం మరీ ముఖ్యమైనది. ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్లోబల్æ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరన్ కూడా భాగస్వామి. అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియానికి చంద్రబాబు అప్పగించారు. ఈ ఒప్పందం కోసం ఈశ్వరన్, ఆయన సింగపూర్ టీమ్ పలుమార్లు విజయవాడకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్లు కూడా సింగపూర్లో పర్యటించారు. చివరికి 2017లో ఒప్పందం కుదిరింది. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నాటకం రక్తికట్టింది. ఆయనతోపాటు పాల్గొన్న సింగపూర్ ‘అధికారులు’ కూడా ఆ తర్వాత తమ అవతారాలను మార్చడం వింతగొలిపే విషయం. అసెండస్ – సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ఫ్ అనే ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఇవి ప్రభుత్వ కంపెనీలేనని బాబు సర్కార్ బుకాయించింది. సింగపూర్లో చాలా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థల వాటా అంతో ఇంతో ఉంటుంది. సెంబ్ కార్ప్లో కూడా టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉన్నది. కానీ మెజారిటీ వాటా ప్రైవేట్దే! ఈ టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్కు ఒక మూడేళ్లపాటు ఈశ్వరన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. సెంబ్కార్ప్లో టుమాసెక్ పెట్టుబడి వెనుక ఆయన పలుకుబడి ఉపయోగపడి ఉండవచ్చు. సెంబ్కార్ప్పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండవచ్చు. సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆరోజుల్లోనే పలువురు ముక్కున వేలేసుకున్నారు. సింగపూర్ కన్సార్టియం, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) ఏర్పాటయింది. ఈ సంస్థకు ప్రభుత్వం 1691 ఎకరాల భూమిని అప్పగించింది. కనీస ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఈ మొత్తం భూమి కనీస విలువ 6,764 కోట్లు. ఇంత విలువ చేసే భూమిని ఏడీపీకి ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఇందులో 250 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు ఉచితంగా కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసుకుని వారే అమ్మేసుకోవచ్చు. ఈ మొత్తం భూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బాబు సర్కార్ అంగీకరించింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కమిటీ (సీసీడీఎంసీ) తన వాటా కింద 221 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. భూమి విలువతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 12,485 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం పెట్టే ఖర్చు ఒక్క రూపాయి కూడా లేదు. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా వేసి విక్రయించడానికి ఇంకో 3,137 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 306 కోట్ల ఖర్చును సింగపూర్ కన్సార్టియం భరిస్తుంది. మొత్తం పెట్టుబడిలో కన్సార్టియం ఖర్చుపెట్టేది సుమారు రెండు శాతం! కానీ వ్యాపారంలో దాని వాటా 58 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం మాత్రమే. సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు ఈ ఒప్పందం సరైన ఉదాహణ. ఇది కాకుండా మరో 250 ఎకరాల భూమి కన్సార్టియంకు ఉచితంగా దక్కుతుంది. అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మి వ్యాపారం చేసే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)ది కాదు. ఇందుకోసం మరో మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అమరావతి మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో విజయవాడ అడ్రస్తో ఆర్వోసీలో రిజిస్టరయింది. దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బెంజిమిన్ యాప్ నియుక్తులయ్యారు. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో యాప్ సింగపూర్ ప్రభుత్వ అధికారి హోదాలో పాల్గొన్నారు. చివరికి విజయవాడలో రిజిస్టరయిన కంపెనీకి ఈవోగా అవతారం మారింది. అమరావతి కుంభకోణంలో ఇటువంటి వింతలు ఇంకెన్నో బయటపడాల్సి ఉన్నది. చంద్రబాబు – ఈశ్వరన్ల మధ్య పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. సింగపూర్లో చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది. ఈశ్వరన్ పదవీచ్యుతి, అరెస్ట్ వెనుక కూడా ఓ హోటల్ కనెక్షన్ ఉన్నది. ఆంగ్ బెంగ్ సెంగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్. అవినీతి, అక్రమ వ్యవహారాల ఆరోపణపై ఆంగ్ను సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) అరెస్ట్ చేసింది. అతడిని విచారిస్తున్న నేపథ్యంలోనే ఈశ్వరన్ తీగ దర్యాప్తు సంస్థకు దొరికింది. ఆంగ్ బెంగ్ సెంగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్ర హోటళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయట. ఇవన్నీ ఆంగ్ సొంతం కావు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, సంపన్నుల సొమ్ముతో భారీ హోటళ్లు నిర్మించి వాటిని తాను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయా? ఉంటే అవి సింగపూర్లోనే ఉన్నాయా? లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చంద్రబాఋకు ఈశ్వరన్తో ఉన్న బంధం, ఈశ్వరన్కు హోటల్ ప్రాపర్టీస్ అధిపతి ఆంగ్తో అనుమానాస్పద కనెక్షన్ను బట్టి చూస్తే చంద్రబాబు హోటళ్ల ప్రచారానికి బలం చేకూరుతున్నది. ఆంగ్ బెంగ్ సెంగ్పై వచ్చిన ఆరోపణలేమిటి? వాటితో ఈశ్వరన్కు ఉన్న సంబంధమేమిటి? అసలు ఈశ్వరన్ను పట్టడానికే ఆంగ్ను ఎరగా వేశారా? ఈశ్వరన్పై జరగనున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది? ఆ దర్యాప్తుకు అమరావతి తీగ తగులుతుందా లేదా? తగిలితే చంద్రబాబు భవిష్యత్తేమిటి? వగైరా ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు. సింగపూర్ దర్యాప్తులో అమరావతి కోణం తగిలినా తగలకపోయినా, ఈ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఆర్జించాలనుకున్న చంద్రబాబు కల మాత్రం కరిగిపోయినట్టే భావించాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ను ఎదుర్కోవడానికి చంద్రబాబు దగ్గర పనికొచ్చే అస్త్రాలేమీ లేవు. అమరావతినీ, రాజధానినీ ఒక మిడిల్క్లాస్ సెంటిమెంట్గా మార్చి రంగంలో నిలబడేందుకు బాబు దళం ఆపసోపాలు పడుతున్నది. సింగపూర్ దర్యాప్తులో అమరావతి తీగ తగిలితే, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైతే సెంటిమెంట్ పప్పులుడకవు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎదురుదెబ్బలు వరసగా తగులుతున్నాయి. అధికార వైసీపీ కులమతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో గణనీయంగా బలపడింది. ఇటీవల జరిగిన రెండు మూడు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైసీపీ ఓటింగ్ బలం 51 నుంచి 55 శాతం వరకు ఉంటుందని ఆ సర్వేలు ప్రకటించాయి. నిజానికి సర్వేలు కూడా అవసరం లేదు. పేదలు – పెత్తందార్ల ప్రయోజనాల నడుమ విభజన రేఖ ఏర్పడింది. ప్రతిపక్షం పేదల వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే తీసుకుంటున్నది. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారిన వలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో పాఠాలు చెప్పొద్దని అభాసుపాలైంది. ప్రాణాంతకమైన మద్యం ధరలు తగ్గించాలని కోరుతున్నది. పేదలకు ఇళ్లు కట్టించడంపై కోర్టులకెక్కుతున్నది. దశాబ్దాల తర్వాత వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయతలపెడితే హర్షించలేకపోతున్నది. ఆరోగ్య విప్లవంపై అవాకులు పేలుతున్నది. ఈ తరహా ఆత్మహత్యాసదృశ వైఖరితో ప్రతిపక్షం తనను తాను హననం చేసుకుంటున్నది. ముప్పాతిక శాతం ప్రజల హృదయాల నుంచి వెలివేతకు గురవుతున్నది. మరోపక్క తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ గురుతుల్యునిగా, రక్షకునిగా నిలబడుతున్న రామోజీ పాపభాండం బద్దలైంది. ‘మార్గదర్శి’ పేరుతో చేసిన చట్టవిరుద్ధ నిర్వాకం మెడకు చుట్టుకుంటున్నది. ముదివయసు విచక్షణను కోల్పోయింది. అడ్డగోలు రాతలతో యెల్లో మీడియా విశ్వసనీయతను జారవిడుచుకున్నది. రెండు వారాలకే వారాహి యాత్ర రోత పుట్టించింది. నటుడి మనోధృతిపై జనంలో శంక మొదలైంది. ఒక ప్రయోగం నిష్ఫలమైంది. ఇప్పుడు బాబు కూటమికి ఎటుచూస్తే అటు చీకటి. పటు నిరాశ. అన్నీ దుశ్శకునములే! కొసరుగా ఇప్పుడీ సింగపూర్ పీడకల!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
NATA Political debate: సీఎం వైఎస్ జగన్ సర్కారు మార్గమే సరైనది
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అట్టడుగు స్థాయి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా, సంస్కరణలలో కూడిన పాలన సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్న దారే సరైనదని ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)’తెలుగు మహాసభల్లో వక్తలు తేల్చి చెప్పారు.. వైఎస్సార్ సీపీ అమలు చేస్తున్న పథకాలు, విధానాలను ఏపీలో ప్రతిపక్షాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించడం ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలోని డాలస్లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు–2023లో భాగంగా రాజకీయ ప్యానెల్ చర్చలు జరిగాయి. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. అవాస్తవ ప్రచారాలతో మభ్యపెడుతూ.. ఇటీవల చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని.. ఏదైనా వైఎస్ జగన్ చేసిన దానికి ఐదు రెట్లు చేస్తామని ప్రకటించారని కొమ్మినేని చెప్పారు. ఇన్నాళ్లూ జగన్ సంక్షేమ పథకాలను తప్పుపట్టిన రెండు పత్రికలు.. చంద్రబాబు హామీలను ఎంతో పొగిడాయని గుర్తు చేశారు. అంటే వైఎస్ జగన్ చేస్తున్నదే సరైనదని, చంద్రబాబు దాన్ని అనుసరించాల్సిందేనని వారే ఒప్పుకొంటున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల మేనిఫెస్టోకు ఒక విలువ, ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని.. చెప్పింది చెప్పినట్టుగా 98.5 శాతం హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారు. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేక.. కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ అవాస్తవ ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. సుస్థిర అభివృద్ధి దిశగా పాలన ‘‘స్వాతంత్య్రం నాటికి విపరీతమైన అసమానతలు, భిన్నత్వం, కుల వ్యవస్థ, పాలన తీరు వంటివి ఉన్నా.. రాజ్యాంగం దేశాన్ని ఒక్కటిగా, ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకెళ్లింది. రాజ్యాంగ పీఠిక ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమన్యాయం కలి్పస్తామని హామీ ఇచి్చంది. ఈ సైద్ధాంతిక పునాది, స్ఫూర్తితోనే పేదలు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారో అన్నింటిలోనూ వారిని ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా.. సుస్థిర అభివృద్ధికి వీలుగా విధానాలను, పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే..’’అని ‘సాక్షి’మీడియా గ్రూపు ఎడిటర్ వర్ధెల్లి మురళి తెలిపారు. ఇటీవలి ‘టైమ్స్ నౌ–నవభారత్ సర్వే’ప్రజల్లో వైఎస్ జగన్కు ఉన్న ఆదరణను పట్టి చూపిందని, 24–25 ఎంపీ సీట్లు వైఎస్సార్ సీపీకే వస్తాయని తేలి్చందని వివరించారు. నాడు–నేడు ఎంతో మార్పు విద్య, వైద్యంతోపాటు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో ‘నాడు–నేడు’ఎంతో మార్పు వచి్చందని.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఆర్థిక సాయం దాకా అన్ని అంశాల్లో పేదలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు పథకాలను అమలు చేస్తుంటే దోచిపెడుతోందంటూ ప్రతిపక్షం అవాస్తవ ప్రచారాలకు పాల్పడుతోందని.. పేదలకు మంచి విద్య, సరైన వైద్యం అందిస్తే దోచిపెట్టినట్టా? అని ప్రశ్నించారు. మాటలే కాదు.. చేతల్లో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. పూర్తి వీడియో -
సైంధవ రుతు'పవనం'!
జూన్ 16, పిఠాపురం: ‘శక్తిపీఠం సాక్షిగా చెబుతున్నా. నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ – ఉప్పాడ సెంటర్లో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రకటన ఇది. జూన్ 21వ తేదీనాడు రెండు యెల్లో మీడియా ప్రధాన పత్రికలు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను చాంతాడంత పొడవుతో ప్రచురించాయి. అందులో ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం: ‘‘సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను. సీఎం పదవి అంటే చాలా అనుభవం కావాలి. సీఎం అని మా వాళ్లు అదేపనిగా అరుస్తుంటే, నా కేడర్ స్టేట్మెంట్ను ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా అనుకోవాలి.’’ ఇరవై ఒకటిన పేపర్లలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇరవైన ‘ఆ రెండు’ పత్రికలకు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే పిఠాపురం సభ తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు! దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో సర్వశక్తిమంతమైనదిగా ప్రాచుర్య మున్న పురుహూతికాదేవి శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన నాలుగు రోజులకే చెల్లుబాటు కాకుండా పోయింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో (‘ప్రజారాజ్యం’ స్థాపన దగ్గర నుంచి) తన మాటలను తానే చెల్లుబాటు కాకుండా చేసుకున్న ఘటనలు కోకొల్లలు. రాజ కీయాల్లో మా వాడు చెల్లని రూపాయిగా మారిపోతున్నాడని ఆయన అభిమానులు బహిరంగంగానే ఆవేదన పడుతున్నారు. పిఠాపురంలో శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటనకు సరిగ్గా 36 రోజుల ముందు ఇదే అంశంపై మంగళగిరిలో ఆయన ఇంకో రకంగా మాట్లాడారు. మే 11న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సీఎం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఇలా బదులిచ్చారు – ‘‘ఒక మాట చెబుతున్నా. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అటువంటప్పుడు మన వాదన (సీఎం కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్ స్టార్ను చేయలేదు.నేను సాధించుకున్నదే! రాజకీయాల్లో కూడా టీడీపీ కావచ్చు.బీజేపీ కావచ్చు. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు? నేనే టీడీపీ అధ్యక్షుడినైనా ఆ మాట అనను. బలం, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే పని జరగదు. పొత్తుల కోసం నా ఏకైక కండిషన్ వైఎస్సార్సీపీని గద్దె దించాలి. అంతే.’’ తన అసలు లక్ష్యాన్ని పవన్ అక్కడ ప్రకటించారు. ‘ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానుల నుంచీ, జనసేన కార్యకర్తల నుంచీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందేమో’నని ఒక విలేకరి తన సందేహాన్ని పవన్ ముందు వ్యక్తం చేశారు. ‘‘విమర్శలు వస్తాయనే భయాలు నాకు లేవు. అభిమానులు నిరాశపడటానికి ఇదేమీ సినిమా కాదు. కార్య కర్తలైనా సరే నాతో నడిచేవాళ్లే నా వాళ్లు’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంటే పొత్తులు ఖాయమనీ, ముఖ్యమంత్రి పదవి అడిగే అర్హత తనకు లేదనీ, కార్యకర్తలు ఇందుకు అంగీక రించవలసిందేననే భావాన్ని ఆయన కుండబద్దలు కొట్టి ప్రకటించారు. మరి నెలరోజులు తిరిగే సరికే పిఠాపురం శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన? సినిమా షూటింగ్ కోసం అనుకోవాలా? కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల్లో కూడా సూపర్స్టార్లూ, పవర్ స్టార్లూ, మెగాస్టార్లూ తరహా విభజన ఉండేది. అప్పట్లో అర్ధరథి, రథి, అతిరథి, మహారథి వంటి పేర్లతో పిలిచేవారు కావచ్చు. అందులో ఓ పవర్స్టార్ స్థాయి వీరుని పేరు సైంధవుడు. కాకపోతే అతని పవర్ యుద్ధంలో ఒక్కరోజుకే పరిమితం. యుద్ధంలో అతని లక్ష్యం – కౌరవులను గెలిపించడం! స్వయంగా తానే పాండవులను ఓడించాలనే కోరిక అతనికి మొదట్లో ఉండేది. అందుకోసం ఘోరమైన తపస్సు కూడా చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తన చేతిలో పాండవులు ఓడిపోవాలని సైంధవుడు కోరుకున్నాడు. స్థాయికి తగని వరాన్ని ఇవ్వడం పాడి కాదనుకున్నాడు శివుడు. సైంధవుడికి హితవు చెప్పి అర్జునుడు అందుబాటులో లేని రోజున, మిగిలిన నలుగురిని యుద్ధంలో ముందుకు పోకుండా అడ్డు కోగలిగే ‘సింగిల్ యూజ్’ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ఒక్కరోజుకే పనికొస్తుందన్న మాట! ఈ ‘వన్డే వండర్’ను దుర్యోధనుని గెలుపు కోసం ఉపయోగించాలని సైంధవుడు భావిస్తాడు. సైంధవుడి కథ సాంతం మనందరికీ తెలిసిందే. ఇతడి కారణంగానే అభిమన్యుడు అసువులు బాసిన సంగతీ తెలిసిందే. ఎవరైనా హఠాత్తుగా ఊడిపడి ఏ కార్యానికైనా అడ్డుతగిలితే సైంధవుడిలా అడ్డు పడ్డాడనడం రివాజుగా మారింది. 2014లో వైసీపీ విజయానికి పవన్ కల్యాణ్ సైంధవుడిలా అడ్డుపడ్డాడనే మాట కూడా వినిపించింది. అందులో కొంత లాజిక్ కూడా ఉన్నది. రెండు శాతం కంటే తక్కువ తేడాతో అప్పుడు జగన్ పార్టీ అధికా రానికి దూరమైంది. జనసేన పార్టీ పోటీ చేయ కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. అప్పుడు దానికి ఓ నాలుగు శాతం ఓట్లు ఉండవచ్చని అంచనా. 2019లో బీఎస్పీ – కమ్యూనిస్టుల పొత్తుతో జనసేన కూటమికి ఆరు శాతం ఓట్లు పడ్డాయి. ఆ నాలుగు శాతం అంచ నాకు ఇదే ఆధారం. 2014లో జనసేన విడిగా పోటీ చేసిన ట్టయితే ఫలితం తరగబడి ఉండేదేమో! చంద్రబాబు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీకి ఉపయోగ పడే ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్గా జనసేన పార్టీ ఏర్పాటైందనే విమర్శ కూడా ఉన్నది. ఇది ఫక్తు రాజకీయ విమర్శే. కానీ, ఈ విమర్శకు బలం చేకూర్చే పరిణామాలు కూడా జరుగుతున్న నేప థ్యంలో దీనిపై లోతైన పరిశీలన అవసరమౌతున్నది. ముఖ్యంగా మూడు అంశాలు జనసేన మీద విమర్శలకు బలం చేకూర్చు తున్నాయి. 1. ఎన్నికల సమయానికల్లా తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా జనసేన ఎత్తుగడలు ఉండటం. 2. ఒక స్థిరమైన సైద్ధాంతిక ప్రాతిపదిక, రాజకీయ దృక్పథం లేకుండా ఎప్పటికప్పుడు రంగులు మార్చేయడం. 3. తాజా పరిస్థితుల్లో జనసేన ఎంచుకుంటున్న క్షేత్ర ప్రాధాన్యతలు, టార్గెట్ చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం. మొదటి ఎన్నికల్లో కలిసి పోటీచేయడం ద్వారా తెలుగు దేశం పార్టీకి దోహదపడిన జనసేన రెండో ఎన్నికల్లో అదే ప్రయోజనం కోసం విడిగా పోటీ చేసింది. అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా పడకుండా చీలిపోతే తనకు ఉపయోగమని భావించింది. ఆ వ్యూహం ప్రకారమే విడిగా జనసేన ఫ్రంట్ ఏర్పాటైందని వైసీపీ ఆరోపణ. ఆ ఆరోపణను పూర్వపక్షం చేయడంలో జనసేన విఫలమైంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ భావిస్తున్నది. ఈ భావననే హెచ్ఎంవి గ్రామఫోన్ రికార్డు మాదిరిగా పవన్ కల్యాణ్ పదేపదే వినిపిస్తున్నారనే అభిప్రాయం బలపడు తున్నది. రాజ కీయాల్లో జనసేన కూడా టీడీపీ కోసం సైంధవ పాత్ర పోషిస్తున్నదని జనం భావిస్తే ఆ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలితం ఉండకపోవచ్చు. జనసేనకు స్పష్టమైన సిద్ధాంతాలు గానీ, ఆశయాలు గానీ లేవని జనసేనాపతి మాటల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. జనసేన ఆవిర్భవించిన తర్వాత ఈ పదేళ్లలో ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన ప్రసంగాలు, ధారబోసిన భావజాలం, ఒలకబోసిన వాగామృతం – అంత టినీ ప్రోది చేసి చూస్తే ఎంతటివారలైనా గందరగోళానికి గురి కాక తప్పదు. అటువంటి గందరగోళానికి జనసైనికులూ, వీర మహిళలూ గురికాకూడదని పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘వ్యూహం నాకొదిలేయండి, మీరు అనుసరించండ’ని కార్యకర్తలతో ఆయన పదేపదే చెబుతున్నారు. ‘ఒక్కసారి నేను కమిటయితే మీ మాట మీరే వినకండి, బ్లైండ్గా ఫాలో అవ్వండి’ అనేది ఆయన సందేశం. రాజకీయ పార్టీ ఇలా కూడా ఉంటుందా? ఉండదు! ఇది చంద్రబాబు ప్రారంభించిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థులు అలా ఆరోపిస్తూనే ఉంటారు. కానీ, ఆరోపణ తప్పని రుజువు చేయవలసిన బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ భుజస్కంధాలపైనే ఉన్నది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేయడమన్నది పక్కా అయినట్లే. ఇది బాబు డిసైడ్ చేసిన స్కీమే కనుక ఇందుకు భిన్నంగా ఉండదు. ఆ దేవుడు శాసించాడు... ఈ అరుణాచలం పాటిస్తాడు, అంతే. బీజేపీని కూడా లాక్కొని రావాల్సిన బాధ్యతను పవన్కు బాబు అప్పగించారు కనుక ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వ్యూహాత్మక ఆలస్యం జరిగి ఉండవచ్చు. 34 అసెంబ్లీ సీట్లున్న గోదావరి జిల్లాల్లో గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే కర్తవ్య దీక్షతో వారాహి రథం మొదట గోదావరి తీరానికే చేరింది. కాపులతోపాటు ఇతర వర్గాల్లో కూడా పేరు ప్రఖ్యాతులున్న ముద్రగడ పద్మనాభంపై కొత్తతరం కాపు యువతను ఎగదోసే ప్రయత్నం చేశారు. ముద్రగడను అవ మానించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు శత్రువు తనకూ శత్రువే అన్నట్టుగా పవన్ కల్యాణ్ ఈ పర్యటనలో వ్యవహరించారు. ముద్రగడను సామాజిక వర్గానికి దూరం చేయకుండా ఆ ఓట్లను బాబు వైపు మళ్లించడం సాధ్యంకాకపోవచ్చన్న ఆలోచన కూడా ఈ టార్గెట్కు కారణం కావచ్చు. తన సామా జికవర్గ బలం పెద్దగా లేకపోయినా అన్నివర్గాల మద్దతుతో కాకినాడలో నెగ్గుకొస్తున్న ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ఇందుకు బదులుగా కాకినాడలో ద్వారంపూడిపై గానీ, పిఠాపురంలో తనపై గానీ పోటీ చేయాలని ముద్ర గడ విసిరిన సవాల్కు మాత్రం పవన్ జవాబు చెప్పలేక పోయారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సహజం. పవన్ కూడా ప్రభుత్వం మీద ఈ పర్య టనలో చాలా విమర్శలే చేశారు. ఆ విమర్శలకు ఆధారం మాత్రం యెల్లో మీడియా కథనాలు, తెలుగుదేశం ప్రవచనాలే అన్నట్టుగా ఈ పర్యటన సాగింది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం. రాష్ట్రంలో 31,177 మంది మహిళలు అదృశ్యమయ్యా రనీ, వీరిలో 40 శాతం మంది 18 యేళ్లలోపు యువతులేననీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ఆధారంగా చెబుతున్నాననీ పవన్ అన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019 నుంచి 2022 మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా మహిళల అదృశ్యానికి సంబంధించిన టాప్–టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో రాష్ట్రంలో అదృశ్యమైన వారి సంఖ్య 2,746. అందులో 2,737 మందిని సురక్షితంగా మళ్లీ ఇళ్లకు చేర్చారు. ఇంకా జాడ తెలి యనివారు కేవలం తొమ్మిది (9) మంది మాత్రమే. అదే బాబు హయాంలో అంతకు ఒక సంవత్సరం ముందు 2018లో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,520. అందులో ఇళ్లకు చేరిన వారు 2,195 మంది. 4,325 మంది జాడను ఆ ప్రభుత్వం కని పెట్టలేకపోయింది. బాబు హయాంలోని ఐదేళ్లూ, జగన్ హయాంలో నాలుగేళ్ల లెక్కలూ దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి. వాస్తవాలకు మసిపూయడంలో ఈయన యెల్లో మీడియాతో పోటీపడుతున్నట్టున్నారు. గడచిన ఎన్నికల్లో తనను భీమవరం నియోజకవర్గంలో కక్షకట్టి ఓడించారనీ, అక్కడ మొత్తం ఓట్లకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయనీ మరో ఆరోపణ చేసి నవ్వులపాలయ్యారు. ఎన్ని కల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం అక్కడ 77.9 శాతం ఓట్లు పోలయ్యాయి. 22.6 శాతం మంది ఓటే వేయలేదు. ప్రజల తెలివితేటల మీద, వివేచనా శక్తి మీద చులకన భావం ఉన్నవారు మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేయగలుగుతారు. తొలివిడత వారాహి యాత్ర జనసేన పార్టీకి పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది. భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఉంచిన లెక్కలు తనకు కంచుకోటగా పవన్ భావించుకునే ప్రాంతాల్లో రోడ్లపై జరిగిన సభలకు ఎక్కడా మూడు నాలుగు వేలమందికి మించి రాలేదు. అందులో సగంమంది ఇరవయ్యేళ్ల లోపు పిల్లలే! ఎక్కడా యాభై మందికి మించి మహిళలు కనిపించలేదు. ఒక్క అమలాపురంలో మాత్రం సుమారు రెండొందల మంది కనిపించారు. జనసేన పార్టీకి జనసందేశం ఏమిటో అందినట్టేనా? ఈ సందేశానికి కారణమేమిటి? చంద్రబాబు ఎజెండా ప్రకారం జనసేన పనిచేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణం. దాన్ని పూర్వపక్షం చేయాలంటే ఒకటే మార్గం. జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం. లేదంటే పవన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి మెజారిటీ స్థానాల్లో పోటీచేసి ఇతర పార్టీలతో మిగిలినచోట్ల పొత్తు పెట్టుకోవడం. జగన్ ప్రభుత్వం కంటే మెరుగ్గా తానెలా పరిపాలించబోతున్నాడో సోదాహరణంగా చెప్పగలగడం. అలా చేయకుండా చంద్రబాబు విసిరే పాతిక, ముప్పయ్ సీట్లను మహాప్రసాదంగా కళ్లకు అద్దుకుంటే జనసేన పార్టీ తెలుగుదేశం అనుబంధ సంఘమనే ప్రజాభిప్రాయాన్ని అధికారికంగా ధ్రువీకరించినట్టే! ఏటా రుతుపవనాలు వచ్చి పోయినట్టే చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా ఒక సైంధవ పవనం వచ్చి పోయేదని చరిత్రలో స్థిరపడిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈ యుద్ధం ఓ వరం!
యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు. వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు. అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది. సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి. పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్గా మారింది. పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు. చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా? పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం. పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు. వీరి టీమ్లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్ కల్యాణ్. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది. అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం. వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్ ఏరియాలు గేమ్ ఛేంజర్స్గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ది హోలీ మ్యానిఫెస్టో!
మేరే పాస్ మ్యానిఫెస్టో హై! ఎన్నికల కోసం చంద్రబాబు సకల శస్త్రాలు, అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అదనపు సైన్యాల కోసం రాయబారాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దగ్గర రామోజీరావు అనే ఓ మీడియా మాంత్రికుడున్నారు. అదే తరహా శిష్య పరమాణువుల్లాంటి ఇంకో ఇద్దరు ముగ్గురు మాంత్రికులున్నారు. ఇంకా చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ అనే సినీనటుడున్నారు. ఆ నటుడి బిల్డప్ కోసం ఓ మిలటరీ ట్రక్కు కూడా ఉన్నది. ఇటువంటి టక్కుటమారాలు చంద్రబాబు దగ్గర చాలా ఉన్నాయి. మరి జగన్మోహన్రెడ్డి దగ్గర ఏమున్నది? ‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అంటున్నారాయన. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ మ్యానిఫెస్టోలను ప్రకటిస్తాయి కదా! ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? తాజా వాగ్దానాలతో కూడిన సరికొత్త మ్యానిఫెస్టో కాదు. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాత మ్యానిఫెస్టో గురించి ఈ చర్చ. ‘ఇదిగో మేమిచ్చిన హామీలు... ఇదీ మేము అమలుచేసిన తీరూ– తెన్నూ’ అంటూ పాత మ్యానిఫెస్టోను ప్లకార్డులా పట్టుకొని ఆ పార్టీ బృందాలు ముందుకు కదలబోతున్నాయి. ఈ పని చేయడానికి ఏ పార్టీకైనా చాలా గుండె బలం కావాలి. భారత రాజకీయాల్లో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ ఇటువంటి సాహసానికి పూనుకున్న దాఖలాలు లేవు. చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ అటువంటి ఆలోచన కూడా ఉండదు. అలవిగాని హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత తదుపరి ఎన్నికల సమయానికి పాత మ్యానిఫెస్టోను మార్కెట్లో కనబడకుండా చేయడం తెలుగుదేశం ప్రత్యేకత. మొన్నటి ఎన్నికల సమయానికైతే దాన్ని పార్టీ వెబ్సైట్ నుంచి కూడా ఆ పార్టీ మాయం చేసింది. ఆరొందల హామీలతో కూడిన బృహత్కథామంజరి సదరు ఎన్నికల ప్రణాళిక! అంత గ్రంథాన్ని కూడా గుటకాయస్వాహా అన్నారు. తాను చేసిన వాగ్దానాలను గుర్తుచేసుకోవడం అంటే చంద్రబాబుకు తగని భయం. పాత మ్యానిఫెస్టో ఫోబియా ఉందాయనకు! కొత్తగా ఎన్నికల ముందు తయారుచేసే మ్యానిఫెస్టోల్లో ఇసుమంత కూడా సృజనశీలత లేకపోవడం తెలుగుదేశం ప్రత్యేకత. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన అనంతరం తెలుగుదేశం పార్టీ తయారుచేసిన ఎన్నికల ప్రణాళికలన్నీ కాపీ, పేస్ట్ వంటకాలే. రాబోయే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో నుంచి చిన్న టీజర్ అంటూ మొన్నటి మహానాడులో ప్రదర్శించిన పాచి పదార్థం హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును రాష్ట్రమంతటా వెదజల్లింది. జగన్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలను సైతం నిస్సిగ్గుగా పేర్లు మార్చి ప్రకటించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కనుక వారి మ్యానిఫెస్టో నుంచి ఓ రెండు స్కీములు తీసుకున్నారు. ఒకవేళ బీజేపీ గెలిచి వుంటే ఈ స్కీములను కచ్చితంగా తీసుకునేవారు కాదు. అప్పుడు బీజేపీ మ్యానిఫెస్టోనే కాపీ కొట్టేవారు. సినిమా ప్రపంచాన్ని కొంతకాలంపాటు ఫార్ములా జాడ్యం వెంటాడిన విషయం మనకు తెలిసిందే. ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, అందులో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్లున్నాయి, ఎన్ని మిల్లీమీటర్ల సెంటిమెంట్, ఎన్ని సెంటీమీటర్ల కామెడీ ట్రాక్ ఉన్నాయో లెక్కలేసుకుని సినిమాలు తీసేవాళ్లు. కానీ ఆత్మ లాంటి కథ సంగతి మాత్రం పట్టించుకునేవారు కాదు. చంద్రబాబు కూడా ఈ తరహా సక్సెస్ ఫార్ములా మ్యానిఫెస్టోల రూపకల్పనకు అలవాటుపడ్డారు. కనుక ఈ మ్యానిఫెస్టోలకు ప్రజా జీవితంతో సంబంధం ఉండదు. ప్రజల అవసరాలేమిటో, వారి ఆకాంక్షలేమిటో, వాటినెలా నెరవేర్చాలో అనే ఆలోచనా, వివేచన ఈ మ్యానిఫెస్టోల్లో ఉండదు. తమకు అధికారం కావాలి, అందుకోసం ఎన్ని వాగ్దానాలైనా చేయాలి. ఎంత పెద్ద పుస్తకమైనా అచ్చేయాలి. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి దాచేయాలి. ఇదీ చంద్రబాబు ‘సైకిల్’. మానవ సంబంధాల్లోంచి ఏరుకొని మట్టి పరిమళాలద్దిన అక్షరాలతో జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను రాసుకున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ని గుర్తు చేసుకోవచ్చు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటాడు తిలక్. ప్రజల కోసం తన అక్షరాలను అంకితం చేసిన తీరిది. జగన్మోహన్రెడ్డి తయారుచేసుకున్న మ్యానిఫెస్టో కూడా అంతే! తన సుదీర్ఘ పాదయాత్ర, ఓదార్పు యాత్రల్లో ఆలకించిన జనకోటి గుండెచప్పుళ్ళ సందేశం మ్యానిఫెస్టోలోని అక్షరాల్లో నిక్షిప్తమై ఉన్నది. ఆ అక్షరాలకు అందుకే జవాబుదారీతనం ఉన్నది. ఆ బాధ్యతతోనే పాత మ్యానిఫెస్టోను జనం ముందుకు వైఎస్సార్సీపీ తీసుకొస్తున్నది. ‘ఇదిగో ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చాము. మాకు ఎన్నికల పరీక్షలో 99 శాతం మార్కులు వేయండ’ని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి. మద్యనిషేధం, ఓపీఎస్ అనే రెండు విషయాల్లో చేయ గలిగిన మేరకు చేసినప్పటికీ, చెప్పినంతగా చేయనందున రెండు అరమార్కులు తగ్గించి, 99 శాతం వేయండని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా అక్కడక్కడా ఒకటో రెండో హామీలు ఇంకా మిగిలిపోయే ఉండవచ్చు. చేను కోసిన తర్వాత పరిగె మిగలడం సహజం. తమ ఇళ్ల స్థలాల హామీ అలాగే ఉండిపోయిందని జర్నలిస్టు సోదరులు గొణుగుతూనే ఉన్నారు. ఇటువంటి పరిగె ఇంకెక్కడైనా మిగిలిందేమో లోతుగా పరిశీలించే శక్తి ప్రజలకు ఉంటుంది. కనుక ఆ పార్టీ వారు అడుగుతున్నట్టు 99 శాతం కాకపోయినా 95 శాతమో, 90 శాతమో మార్కులు వేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. 86 శాతం మార్కులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి జనం నమ్మకాన్ని నిలబెట్టున్నందువలన ఆ మాత్రం ఇంక్రిమెంటు సహజంగానే ఉండవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ వారు పాత మ్యానిఫెస్టోను దాచిపెట్టినప్పటికీ జనం గుర్తుపెట్టుకుని 13 శాతం (23 సీట్లు) మార్కులే వేశారు. ఈసారి అమల్లో ఉన్న మ్యానిఫెస్టోను కాపీ కొడుతూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయినందు వలన ఇక భవిష్యత్తులో ఎన్నికల పరీక్ష రాయకుండా డీబార్ శిక్ష పడినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అమలుచేసిన మ్యానిఫెస్టోను జనం ముందు పెట్టి తీర్పు చెప్పవలసిందిగా జనాన్ని అభ్యర్థిస్తూ దేశ రాజకీయాల్లో జగన్మోహన్రెడ్డి ఒక కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసారి వైసీపీ ఎన్నికల విజయం తర్వాత మిగిలిన పార్టీల మీద ఆయా రాష్ట్రాల ప్రజలు మ్యానిఫెస్టో అమలుపై వివరణ కోరవచ్చు. ఇక ముందు ఏ పార్టీ కూడా ఈ జవాబుదారీతనాన్ని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. దాదాపు యాభయ్యేళ్ల కింద విడుదలైన సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ‘దీవార్’ చాలామంది చూసి ఉంటారు. ఆ సినిమా మర ఫిరంగిలా పేల్చిన డైలాగ్ ‘మేరే పాస్ మా హై’! ఇప్పటికీ ఆ డైలాగ్ జనంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఇకముందు రాజకీయ పార్టీలు పాత మ్యానిఫెస్టోలను దాచిపెట్టకుండా ‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అని ధైర్యంగా జనం తీర్పు కోరే పరిస్థితులు ఏర్పడితే స్వాగతించవలసిందే. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి ఒక కొత్త ట్రెండ్కు జగన్మోహన్రెడ్డి ఎందుకోసం శ్రీకారం చుడుతున్నారు? చేసిన హామీలను అమలుచేసి జవాబుదారీతనానికి టార్చ్ బేరర్గా నిలవాలని ఆయన ఎందుకు భావిస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచీ చేస్తున్న రాజకీయ ప్రసంగాల్లో ఒక తాత్విక భూమిక మనకు కనిపిస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అత్యవసరమని తన ప్రతి ప్రసంగంలో చెప్పేవారు. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన రాజ్యాంగం ఆధారంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. దేశంలోని సకల జనులకూ సామాజిక – ఆర్థిక న్యాయం జరగాలనీ, భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉండాలనీ, సమాన హోదా అందరికీ సిద్ధించాలనీ, సౌభ్రాతృత్వంతో అందరూ సమస్కంధులుగా నిలబడగలగాలనీ పేర్కొన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. పైపెచ్చు అసమానతలు పెరిగిపోయాయి. ఇందుకు కారణం రాజకీయ వ్యవస్థ మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం లభించడం, సమాన అవకాశాలు లభించడం వల్ల ఈ వర్గాల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అందువల్ల పేదలను మరింత పేదలుగా మార్చే విధానాలు మన దేశంలో అమలవుతున్నాయి. ఈ విధానాల్లో పూర్తిస్థాయి మార్పులను విజయవంతంగా తీసుకురాగలగాలి. అదే ‘ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ అవుతుంది. ప్రస్తుతం మనం పెత్తందారీ వర్గ ప్రయోజనాల పరిధిలోనే జరిగే ఫిరాయింపులనూ, అధికారం నిలబెట్టుకోవడాన్నీ, మ్యానిపులేషన్స్నూ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్గా భ్రమిస్తున్నాం. అసలైన ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ వ్యవస్థాగతమైన ప్రక్షాళనలోనే ఉన్నది. అయితే అదంత సులభసాధ్యం కాదు. పెత్తందారీ వర్గాల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. అవసరమైతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి రావచ్చు. అందుకు సిద్ధపడే మనోధైర్యం కావాలి. ప్రక్షాళన జరగాలంటే పరిపాలనలో పారదర్శకత పెరగాలి. అందుకు రాచమార్గం పాలనా వికేంద్రీకరణ. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన ఇంగ్లిషు విద్య, మెరుగైన వైద్యం లభించాలి. కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరికీ అవకాశాలు సమానంగా ఉండాలి. ధనికుల పిల్లలతో పోటీపడగల నైపుణ్య శిక్షణ పేద పిల్లలకు అందజేయగలగాలి. చిన్న రైతులకు కూడా వ్యవసాయాన్ని లాభసాటి చేయగల విధానాలను అనుసరించాలి. మహిళను సాధికారశక్తిగా మలచాలి. చిన్నతరహా పరిశ్రమలకు ఊతమిచ్చి మధ్యతరగతి పేదవర్గాల నుంచి నయా సంపన్నశ్రేణిని సృష్టించాలి. రాష్ట్ర సహజ బలాలను (వ్యవసాయం, సముద్ర తీరం) గుర్తించి పూర్తిస్థాయిలో వినియోగించుకోగలగాలి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ మార్గాలన్నింటిలో అడుగులు వేయడమే కాదు, పరుగులు తీయవచ్చని జగన్ సర్కార్ నిరూపించింది. ఈ పరుగులకు కరదీపికగా దారి చూపింది మాత్రం కచ్చితంగా ‘నవరత్న’ ఖచితమైన మ్యాని ఫెస్టోనే! ఇటువంటి మ్యానిఫెస్టోను అమలు చేయడం పెత్తందార్ల ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వాళ్లు కత్తి కట్టడంలో ఆశ్చర్యం లేదు. ఈ పెత్తందారీ కుట్రలపై పేదల్ని జాగృతం చేయడంలో కూడా జగన్ సర్కార్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బాబుగారి ఢిల్లీ యాత్ర!
‘‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!.... క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా...’’ ఈ భక్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే! తెలియక చేసిన నా తప్పుల్ని మన్నించి నా మీద దయ చూపమని శ్రీరామచంద్రుని చరణారవిందాల ఎదుట రామదాసు ప్రార్థి స్తాడు. సరిగ్గా ఇదే భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట ప్రకటించాలని మన చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి మోదీ దర్శన భాగ్యం కోసం, రామదాసు సన్నివేశం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పుడొకసారి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో మోదీకి చంద్రబాబు ఎదురుపడ్డారు. పూజకు వీలు చిక్కలేదు కానీ, హారతి కళ్లకద్దుకునేంత ఘడియ సమయం మాత్రం దొరికింది. అప్పుడాయన ప్రధాని వెళ్లే మార్గం పక్కన తొంభై డిగ్రీల లంబకోణంలో నిలబడి ఉన్నారు. వరుసగా అందర్నీ పలకరించినట్టే సీనియర్ నాయకులైన బాబును కూడా ప్రధాని పలకరించారు. వెంటనే తన మనసు లోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. ‘మీరు ఏకాంత సమయమిస్తే చాలా విషయాలు మనవి చేసుకుంటాన’ని సిగ్గుపడకుండా అడిగేశారు. సరే చూద్దామంటూ ప్రధాని వెళ్లిపోయారు. అప్పటినుంచి ప్రధాని ఏకాంత సేవకు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని బాబు ఎదురు చూడని క్షణం లేదు. ఈమధ్య బాహాటంగానే ప్రధాని గుణగణాలను ప్రస్తుతించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మామూలుగా పొగడలేదు. శ్రీ రఘువీర గద్యానికి ఇంచుమించు సరిసాటిగా భజించారు. అదేమిటి... ఎన్నికలకు ముందు ప్రధానమంత్రిని అన్ని బూతులు తిట్టిన నోటితోనే ఎలా పొగుడుతున్నారనే అనుమానం ఎవరికైనా వస్తే వారు అమాయకుల కిందే లెక్క! చంద్రబాబులో ఉన్న చతుష్షష్టి కళల గురించి అవగాహన లేనివారికిందే లెక్క! రంగు మార్చుకొని ఊసరవెల్లి కావడం తొండకు మాత్రమే తెలుసా? ఆయనక్కూడా తెలుసు. గోడ మీద కూర్చొని ఎటు కుదిరితే అటు దూకడం పిల్లి మాత్రమే నేర్చిన విద్యా? ఆయన కూడా నేర్చారు. అందువల్ల ఆయన ఏం చేసినా ఆశ్చర్యపడకూడదు. నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం, బాబు రాజకీయంలో నీతి కోసం వెతకడం – రెండూ అవివేకమైన పనులే. ఇన్నినాళ్లు వేచిన బాబు హృదయం శనివారం నాడు ఎగసిఎగసి పడిందట. అదే ఊపులో ఢిల్లీకి ఆయన ఎగిరివెళ్లారు. ప్రధానమంత్రి మోదీతో, అమిత్ షాతో చంద్రబాబు సమావే శాలను ఏర్పాటు చేయడం కోసం ఆయన లాబీయిస్టులు రెండు మూడేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. అయినా ఖరారు కాని అపాయింట్మెంట్ కొన్ని ‘అదృశ్యశక్తుల’ ఎంట్రీతో ఎట్టకేలకు ఖరారైందట! ఈ మేరకు శనివారం రాత్రి అమిత్ షాను చంద్ర బాబు కలిశారు. మోదీ టైమ్ కోసం ఇంకా ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఒడిషాలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ అపాయింట్మెంట్ విషయం ఏమవుతుందో చివరిదాకా చెప్పలేము. కానీ, ఇన్నాళ్లు బాబుకు టైమివ్వని బీజేపీ నాయకత్వం ఇప్పుడెందుకు ఇచ్చినట్టు? చక్రం తిప్పిన అదృశ్యశక్తులెవరు? ఇప్పుడు ఢిల్లీ తెలుగు సర్కిల్స్లో ఇదే చర్చనీయాంశం. బీజేపీ కేంద్ర నాయకత్వంతో బాబు చర్చించాలనుకున్న రాజకీయ ఎజెండాకు తోడు ఇప్పుడొక అత్యవసర కర్తవ్యం వచ్చి పడింది. తనకూ, తన పార్టీకీ, యెల్లో కూటమికీ సారథిగా, సచివునిగా భావించే రామోజీరావు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడా యన్ను చిక్కు ల్లోంచి బయట పడేయడానికి ప్రయత్నించడం బాబుకు తక్షణా వసరం. ఈ కర్తవ్య నిర్వహణ కోసమే ‘అదృశ్య శక్తులు’ కూడా సహకరించాయని సమాచారం. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం – 1982ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నది. చట్టం ప్రకారం ఏ బ్రాంచి పరిధిలోని చందాదారుల సొమ్ము ఆ బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలి. అలా చేసినట్లయితే జనం సొమ్ముతో సొంత వ్యాపారం చేసుకోవడం కుదరదు గనుక మార్గదర్శి సంస్థ ఆ చట్ట నిబంధనల్ని పాటించడం లేదు. ఆ నిబంధనల్ని పాటించాల్సిందేనని ఏపీ చిట్స్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో గత డిసెంబర్ నుంచి కొత్త చిట్స్ను సంస్థ నిలిపివేసింది. దాంతో మనీ రొటేషన్ లేక చిట్ పాడుకున్న వారికి డబ్బులు చెల్లించలేకపోతున్నది. ఇప్పటికే పలువురు చందాదారులు సీఐడీకి ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. చందాదారుల హక్కుల పరిరక్షణ కోసం మార్గదర్శి చరాస్తులను అటాచ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని సీఐడీ కోరింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చిట్ఫండ్స్ ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు, మ్యూచువల్ ఫండ్స్లో దాని పెట్టుబడులు కలిపి 739 కోట్లను అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయాన్ని న్యాయస్థానానికి నివేదించి తదుపరి చర్యలను చేపట్టడానికి సీఐడీ సన్నాహాలు చేసుకుంటున్నది. మరోపక్క సీఐడీ నోటీసులకు స్పందించకుండా, దానికి సమాచారం ఇవ్వకుండా మార్గదర్శి ఎమ్డీ శైలజా కిరణ్ అమె రికా పర్యటనకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరో తేదీన విచారణకు హాజరు కావలసిందేనని సీఐడీ మరో నోటీసు ఇచ్చింది. ఇప్పటికే మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో చట్టాన్ని అతిక్రమించి తలబొప్పి కట్టించుకున్న రామోజీ, చిట్ఫండ్స్ రచ్చతో తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టయింది. దాంతో చివరి ప్రయత్నంగా మంచమెక్కి ఆపసోపాలు పడుతూ తన పరిస్థితి కాలమహిమో, జగన్ మహిమో తెలియట్లేదని చెబుతూ వీడియోలను విడుదల చేయించుకున్నారు. ఆయన ఆశించినట్టుగా ఎక్కడా ఇసుమంత సానుభూతైనా వ్యక్తం కాలేదు. అయినా మోసానికి బలైన వాడిని చూస్తే అంతో ఇంతో సానుభూతి వ్యక్తమవుతుంది గానీ మోసం చేసినవాడిని చూస్తే సానుభూతి ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడో రామోజీ! ఇప్పుడాయనకు గజేంద్ర మోక్షం లాంటి వరం కావాలి. ఎలా? తన దగ్గరికి శ్రీహరి రాడు. తాను వైకుంఠానికి వెళ్లలేడు. అందుకని తన దూతగా శిష్యుడు చంద్రబాబును పంపించాలని నిర్ణయించారట! బాబు మొఖం చూడటం ఇష్టంలేని నాయక ద్వయాన్ని ఒప్పించడానికి తన యాభయ్యేళ్ల నెట్వర్క్లను వాడి ఉంటారు. స్వామికార్యంతో పాటు స్వకార్యం అనుకుంటూ రెండు దస్త్రాలను వెంటబెట్టుకుని బాబు బయల్దేరారు. చట్టాన్ని ఉల్లంఘించిన విషయంలో కేంద్రం చేయగలిగే సాయం ఏమీ ఉండదన్న సంగతి రామోజీకి తెలియంది కాదు. ‘కానూన్ కే హాథ్ లంబే హోతే హై’ అన్న మాట కూడా ఆయన వినలేదని అనుకోలేము. అయినా ఏదో ఆశ! మిణుకు మిణుకుమంటున్నది. అమిత్ షా భేటీలో పనిలో పనిగా తన ముందస్తు ‘వేడుకోలు’ ప్రార్థన కూడా చంద్రబాబు చేసినట్టు భోగట్టా. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో ఇప్పటికే దొరికిపోవడం, రాజధాని భూ కుంభకోణంలో దొరికిపోయే పరిస్థితులు ఉండటంతో ఆయన తీవ్ర ఆందోళన పడుతున్నారని తెలుస్తున్నది. ఇక రెండో దస్త్రం సంగతి. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్రెడ్డిని ఎదుర్కోవడానికి జనసేనతోపాటు బీజేపీ కూడా తన వెంట ఉండాలని బాబు వాంఛ. ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఆయన వరసగా చేయించుకుంటున్న సర్వేల్లో జగన్మోహన్రెడ్డి ప్రజామోదం ఎప్పుడూ 53 శాతానికి తగ్గడం లేదు. టీడీపీ, జనసేనలకు కలిపి చూసినా ఇంకా పదమూడు శాతం మైనస్లో ఉంటున్నారు. ఈ గణాంకాల్ని బట్టి చూస్తే వీరికి బీజేపీ తోడైనా కూడా ఫలితాల్లో పెద్ద మార్పేమీ రాదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ వెంట ఉంటే ఇప్పటికే తాము ప్రారంభించిన విషప్రచారాలను ఇంకా ఉద్ధృతం చేయవచ్చు. 2014 లాగా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చని టీడీపీ ఆరాటపడుతున్నది. ఇది మబ్బుల్లో నీళ్లను చూసి విత్తనాలు వేసుకోవడమే! అయినా అంతకు మించిన తరుణోపాయం టీడీపీ దగ్గర లేదు. బీజేపీ ఆలోచనలు భిన్నంగా సాగుతున్నాయని తెలుస్తు న్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేసినా ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఓడించడం సాధ్యం కాదన్న అంచనాకు బీజేపీ వచ్చింది. మరోపక్క టీడీపీ సంస్థాగతంగా బాగా బలహీనపడింది. నాయకత్వ ప్రతిష్ఠ అట్టడుగు స్థాయికి చేరు కున్నది. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆ పార్టీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితినే బీజేపీ కోరుకుంటున్నది. టీడీపీ పతనమైతేనే ప్రతిపక్షంగా తాము ఎదుగు తామని అది ఆలోచిస్తున్నది. జనసేన కూడా తమతో ఉంటే ఉమ్మడిగా 29 ఎన్నికల నాటికి వైసీపీకి బలమైన ప్రత్యామ్నా యంగా నిలవొచ్చని భావిస్తున్నది. ఒకవేళ జనసేన బాబుతోనే వెళితే ఎన్నికల తర్వాత ఇద్దరూ కోలుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు ఒంటరిగానైనా సరే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంగా తామే నిలబడగలుగుతామని బీజేపీ నాయకత్వం ఆలోచనగా చెబుతారు. అయితే రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు అనుకూల సెక్షన్ కొంత ఉన్నది. వీరికి కేంద్రం నుంచి ఆశీస్సులు అంద జేస్తున్న నాయకులు కొందరున్నారు. వీరందరూ టీడీపీ లాబీయిస్టులకు సహకరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ మీద దక్షిణాది ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో గెలిస్తేనే కర్ణాటక గాయం మానుతుందని భావిస్తున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా తెలంగాణ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి చేరికలు దాదాపుగా ఆగిపోయాయి. కాంగ్రెస్లో కొంత కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ముందు బాబు ఒక ప్రతిపాదన ఉంచారు. తెలుగుదేశంతో అలయెన్స్ కుదిరితే హైదరాబాద్ సిటీ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి మెరుగ వుతుందని కొన్ని కాకిలెక్కలు తయారు చేసినట్టు సమాచారం. అలయెన్స్ కారణంగా బీజేపీలో చేరికలు కూడా పెరిగి ఒక ఊపు వస్తుందనీ, ఎల్లో మీడియా సంపూర్ణ సహకారం కూడా బీజేపీకి లభిస్తుందనీ చంద్రబాబు, అమిత్ షాతో చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్లోని ఒక వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా గోడ దూకించేందుకు కూడా సహకరించగలనని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. టీడీపీ అలయెన్స్ ప్రతిపాదనను గతంలోనే రాష్ట్ర బీజేపీ నాయ కులు తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చిన వాతావరణ మార్పును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో సింహాన్ని ఎదుర్కోవడానికి కలిసివచ్చే తోడేళ్ల కోసం ఆయన అన్వేషణ సాగుతూనే ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ట్రిపుల్ వన్ (111) జీవో రద్దు: గండిపేట రహస్యం!
హైదరాబాద్ నగర చల్లదనం ఓ పాతతరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ నగరం వేసవి విడిదిగా ఉండేదని చెబితే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. పైగా నవ్వుకోవచ్చు. గండిపేట నీళ్ల తీయదనం కూడా మన కళ్ల ముందే జ్ఞాపకాల్లోకి జారిపోతున్నది. నగరానికి పడమటి దిక్కున ఆనుకొని ఉన్న 84 గ్రామాలను వెనుకబాటుతనం నుంచి ‘విముక్తం’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం వేగంగా విస్తరిస్తూ శివారు పల్లెలనూ, పచ్చదనాలనూ ఆక్రమిస్తూ సాగుతున్నది. ఈ పరిణామంతో భూముల ధరలు పెరగడం వల్ల శివారు రైతులకూ అంతో ఇంతో ఆర్థిక లబ్ధి కలుగుతున్నది. నగరంలోని ఖరీదైన, పురోగామి పథంలో ఉన్న ప్రదేశాలకు ఈ 84 గ్రామాలు అతి చేరువలో ఉంటాయి. పాతికేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ట్రిపుల్ వన్ (111) జీవో ఆంక్షలు ఈ ప్రాంత వాసులకు శాపంగా మారాయని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ భూములున్నవారిది కూడా అదే అభిప్రాయం. కొందరు ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్ బాబులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. మరెందుకింక ఆలస్యం? ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు మొన్నటి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నది. అనంతగిరుల్లో పుట్టిన మూసీ, దాని ఉపనది ఈసీల మీద ఆనకట్టలు కట్టి ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జంట జలాశయాలను సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరానికి ఆధునిక వన్నెలు తొడిగి ప్రపంచపటంలో సగర్వంగా నిలబెట్టిన నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఖాతాలోదే ఈ జంట జలాశయాల ఘనత కూడా! మూసీ వరదల నుంచి హైదరాబాద్ను రక్షించడం, నగరవాసుల దాహార్తిని తీర్చడం అనే రెండు లక్ష్యాల సాధన కోసం సర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఈ రెండు చెరువులను తవ్వించారు. సుమారు యాభయ్యేళ్లపాటు ఈ జంట జలాశ యాలే పూర్తిగా సిటీ అవసరాలను తీర్చాయి. విస్తరణ వేగం పెరగడంతో క్రమంగా మంజీర, కృష్ణా జలాలు వచ్చి చేరాయి. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కోటి దాటిన నగర జనాభా అవసరాలను తీర్చడంలో ఈ జలాశయాల వాటా ప్రస్తుతం 15 శాతమే. అయినా గండిపేట గండిపేటే! గండిపేట నీళ్లు ఏ ప్రాంతానికి సరఫరా అవుతాయంటూ ఇప్పటికీ ఆరా తీసేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. నగర నీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నాము కనుక జంట జలాశయాల మీద ఆధారపడే అవసరం లేదనీ, కావాలంటే వాటిని కూడా గోదావరి జలాలతో నింపు తామని ప్రభుత్వం చెబుతున్నది. వందేళ్ల క్రితం నదీ ప్రవాహాల మీద నిర్మించిన తటాకాలు, ఇన్నేళ్లుగా ఆ తటాకాల చుట్టూ అల్లుకున్న ఎకోసిస్టమ్, ఏర్పడిన పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత మంతటా భూగర్భ నీటి ఊటలు... ఇటువంటి వ్యవస్థకు పైపుల ద్వారా లేదా కాల్వల ద్వారా నీటిని తరలించి నింపే రిజర్వాయర్లు సరైన ప్రత్యామ్నాయమేనా? సరే, ‘విస్తృత’ ప్రజాప్రయో జనాల కోసం పర్యావరణంతో రాజీ పడటం, బడుగుల జీవితాలను బలిచేయడం నేర్చుకున్నాము కనుక ఈ ప్రత్యామ్నా యాలతో కూడా రాజీ పడవచ్చు. నిజంగా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయా? అన్నదే ప్రశ్న. జీవో రద్దుతో ఎవరికి మేలు? ఎవరికి నష్టం? చర్చించవలసి ఉన్నది. గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉండే మొయినాబాద్ మండలంలోని సాగుయోగ్యమైన భూమిలో ఇప్పుడు స్థానిక రైతుల చేతిలో 20 శాతం భూమి మాత్రమే ఉన్నది. పలు రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ సంస్థలకు వందల ఎకరాల్లో భూములు న్నాయి. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఐఏఎస్ – ఐపీఎస్ అధికారులకు, సినీనటులకు పది నుంచి పాతికెకరాల వరకు భూములున్నాయి. శంషాబాద్ మండలంలోనూ అదే కథ. ఎనభై శాతానికి పైగా పరాధీనమైంది. తొందరపడి ఎకరా రెండెకరాలను పప్పుబెల్లాలకు అమ్ముకున్న చిన్న రైతులందరూ ఇప్పుడు దినసరి కూలీల అవతారమెత్తారు. జీవో రద్దయిన సంగతి తెలుసుకుని తమ వారసత్వ భూముల దగ్గరకెళ్లి దీనంగా చూస్తున్నారు. తాము ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటయినందుకు మౌనంగా రోదిస్తున్నారు. షాబాద్ మండలంలో రెండే గ్రామాలు జీవో పరిధిలో ఉన్నాయి. ఇందులో 40 శాతం మాత్రమే స్థానిక రైతుల చేతిలో ఉన్నది. చేవెళ్ల మండలంలో జీవో పరిధిలోకి వచ్చే తొమ్మిది గ్రామాల్లో 70 శాతం భూమి పరాధీనమైంది. అంతో ఇంతో స్థోమత గల రైతులు మాత్రమే భూముల్ని నిలబెట్టుకోగలిగారు. చిన్న రైతులందరూ అవసరాల కోసం, ప్రలోభాలకు లోనై అమ్మే సుకున్నాను. శంకర్పల్లి మండలంలో జీవో పరిధిలోని ఏడు గ్రామాల్లో రైతుల దగ్గర మిగిలింది 15 శాతం భూమి మాత్రమే! ఎకరాకు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా వెచ్చించి బడాబాబులు భూములు కొనుగోలు చేశారు. అజీజ్నగర్ వంటి సమీప ప్రాంతాల్లో కొంత ఎక్కువ పెట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేత ఖాయమని తెలిసి ఈ ఏడాదిలోపు కొనుగోలు చేసిన వారు మరికొంత ఎక్కువ వెలకట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేసిన ప్రకటన తర్వాత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే బడాబాబులకు సగటున ఎకరాకు ఐదు కోట్ల లాభం చేకూరినట్టు అంచనా వేస్తున్నారు. సుమారు 70 వేల ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన వారికి ఎంత ప్రయోజనం చేకూరిందో ఎవరి లెక్కలు వారు వేసు కోవచ్చు. అక్కడ మౌలిక వసతులు విస్తరించి, నగరం పెరుగు తున్నకొద్దీ బడాబాబుల భూములు బంగారు గనులవుతాయ నడంలో ఆశ్చర్యమేముంటుంది? భూములు రైతుల చేతుల్లో ఉన్నప్పుడు ఆంక్షల సంకెళ్లలో బంధించి, బడాబాబుల చేతుల్లోకి 80 శాతం బదిలీ అవగానే ‘విముక్తి’ చేయడంలోని మతలబు ఏమిటో తేలవలసి ఉన్నది. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం లక్షలాది ఎకరాల సాగు భూమినీ, ఇళ్లనూ, వాకిళ్లను సమర్పించుకొని నిర్వాసితులైన వేలాది కుటుంబాల మీద ఎన్నడూ కురవని సానుభూతి వాన జల్లు ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని నయా ‘భూ’పతుల మీద కురవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల’ రీత్యా తీసుకున్న జీవో రద్దు నిర్ణయానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి? రాబోయే తరాల భవిష్యత్తని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం సంకల్పించింది. నగర జీవనం నందనవనంగా మారితేనే అది సాధ్యమౌతుంది. ఇరవై శాతం నీటి వనరులు, మరో ఇరవై శాతం హరితహారం ఉంటేనే అది నందనోద్యానంగా విలసిల్లుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కు ఆ ఘనత ఉన్నది. వందలాది చెరువులు కాలనీలుగా మారిపోయాయి. తోటలు పేటలుగా మారాయి. నగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఈ మార్పు ఫలితంగా నగర ఉష్ణోగ్రతలు ఇప్పటికే సగటున రెండు డిగ్రీలు పెరిగాయని వాటర్మ్యాన్ రాజేందర్సింగ్ హెచ్చరి స్తున్నారు. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే ఈ జంగిల్ అక్కడ కూడా విస్తరిస్తుందనీ ఉష్ణోగ్రతలు, భూతాపం మరింత పెరిగి విధ్వంసకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరివాహక ప్రాంతపు నేలలు స్వభావరీత్యా డైక్ ల్యాటరేట్ కేటగిరీకి చెందినవట. భారీ వర్షాలకు కుంగిపోయే స్వభావం ఈ నేలలకు ఉన్నదంటారు. ఇటువంటి నేలల్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు చేరితే అవి త్వరగా వ్యాప్తిచెంది జలాశయాల్లోకి చేరుతాయి. ఈమేరకు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన రెండు నిపుణుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికల ఆధారంగానే సుప్రీంకోర్టు జీవోను సమర్థించింది. ఇప్పుడు మళ్లీ ఈ సమస్య సుప్రీంకోర్టుకూ, గ్రీన్ ట్రిబ్యునల్కూ వెళితే ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. పర్యావరణ సందేహాలకు సమాధానాలు చెబుతూ, విస్తృత ప్రజా ప్రయోజనాలను వివరిస్తూ ఒక వివరణ ఇచ్చిన తర్వాతనే ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అటువంటి వివరణ లేకపోతే జనం మదిలో అదొక గండిపేట రహస్యంగానే మిగిలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తెలం‘గానా’నికి కర్ణాటక సంగీతం!
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది.’ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఎవరి చావు కొచ్చినట్టు? ఎవరి మేలు కొచ్చినట్టు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన తాజా చర్చ. అసలు ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం పక్క రాష్ట్రం మీద ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది? ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికే పరిమితం కదా! అటువంటప్పుడు కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ఎలా ప్రభావం చూపిస్తాయన్న మీమాంస కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రధాన రాజకీయ పక్షం. దానితో తలపడబోయే నెంబర్ టూ పార్టీ ఏదీ అన్న ప్రశ్నకు గత కొంతకాలంగా అస్పష్టమైన సమాధానాలు లభిస్తున్నాయి. అటువంటి అస్పష్టతకూ, సందిగ్ధతకూ కర్ణాటక ఫలితాలు తెరదించనున్నాయా? రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణా ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కాంగ్రెస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు కారణం ప్రజల్లో ఆదరణ లేకపోవడం కాదు. నాయకత్వ వైఫల్యం ప్రధాన కారణం. మొదటి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సారథిగా సహజంగానే కేసీఆర్కు కొంత సానుకూలత ఉన్నది. కానీ దాన్ని అధిగమించగలిగే సంస్థాగత బలం, కేంద్ర–రాష్ట్రాల్లో అధికారం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే ఖ్యాతి కాంగ్రెస్కు ఉన్నాయి. కానీ కేసీఆర్ జనాకర్షణతో పోల్చినప్పుడు అందుకు దీటైన నాయకుడు కాంగ్రెస్లో లేకపోవడం ఎన్నికల ఫలితాలను శాసించింది. రెండోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతున్నదని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా చారిత్రక తప్పిదానికి ఒడిగట్టి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకొని భారీమూల్యం చెల్లించింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడొంతులమంది అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఫిరాయింపుల పర్వం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణలో బీజేపీ వేట మొదలైంది. కాంగ్రెస్ బలహీనపడుతున్న క్షణాలను తనకు అను కూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలిస్తే, బీజేపీ నాలుగు చోట్ల గెలవడం ఆ పార్టీకి అనుకోకుండా ఊపు తెచ్చింది. బీఆర్ఎస్ నాయకత్వం చేసిన పొరపాట్ల వల్ల హుజూరాబాద్, దుబ్బాక నియోజక వర్గాల్లో గెలిచి, బీజేపీ ఒక సంచలనానికి కారణమైంది. మునుగోడులో విజయతీరాల దాకా చేరుకున్నా బీఆర్ఎస్ అప్రమత్తత వల్ల కొద్ది తేడాలో ఓడిపోయింది. తెలంగాణలో తాను బలపడ్డాననే అభిప్రాయం కలిగించడం కోసం బీజేపీ ఉప ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసింది. అదే సమయంలో ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో తాను ఆశించినంత కాకపోయినా ఎంతో కొంత మేరకు బీజేపీ విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ‘బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా... కాషాయ పార్టీనా’ అనే సందిగ్ధత జనంలో ఏర్పడింది. కర్ణాటక ఫలితాలు సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్నీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్నీ నింపుతాయి. ఈ ప్రభావం ఎలా ఉండ బోతున్నది? బీఆర్ఎస్కు లాభమా–నష్టమా? కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికార పార్టీని సవాల్ చేయగలగుతుందా? కర్ణా టక గాయాన్ని మరచిపోవడానికి బీజేపీ తెలంగాణలో విజృంభి స్తుందా? ఈ విషయాల మీద స్పష్టత రావాలంటే క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలించాలి. ఓట్ల చీలిక కారణంగా మూడోవంతు ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ‘చారిత్రక’ తప్పిదం వల్ల రెండోసారి ఆ పార్టీ ఓట్ల శాతం 47కు పెరిగింది. నాలుగు మాసాల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో 41 శాతానికి దాని మద్దతు పడిపోయింది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతోకొంత వ్యతిరేకత సహజం. బీఆర్ఎస్ విషయంలో ఈ వ్యతిరేకత కొంత ఎక్కువగానే కనిపిస్తున్నది. ముఖ్యంగా నలభయ్యేళ్లలోపు యువతలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీఆర్ఎస్కే ఓటువేసే వారి సంఖ్య కూడా తక్కువ లేదు. ఇటువంటి ఓటర్లు సుమారు 35 శాతం ఉంటారని అంచనా ఉన్నది. ఇంకో ఐదారు శాతం మందికి బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతగానీ, వల్లమాలిన అభిమానం గానీ ఉండకపోవచ్చు. పరిస్థితులను బట్టి వారు ఆ పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో స్పందించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కు ఓటు వేయని వారు 60 శాతం వరకు ఉండొచ్చని కొన్ని క్షేత్రస్థాయి పరిశీలనలు సూచిస్తున్నాయి. ఇందులో నాలుగైదు శాతం ఓట్లు చిన్న పార్టీలకు పడొచ్చు. నికరంగా 55 శాతం బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు. కాంగ్రెస్ బీజేపీలు ఈ ఓట్లను పంచుకోవాలి. ఇందులో కాంగ్రెస్ నికర ఓటు ఎంత? బీజేపీ నికర ఓటు ఎంత? అనే పరిశీలన అవసరం. గడచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు దాదాపుగా 30 శాతం ఓట్లు పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం పైచిలుకు ఓట్లు పడ్డాయి. కనుక కాంగ్రెస్ నికర ఓటును 25 శాతంగా పరిగణించవచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు మాత్రమే సంపాదించిన బీజేపీ 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు సంపాదించింది. లోక్సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సంపాదించడం బీజేపీకి మొదటిసారి కాదు. 1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి, దాదాపు ఇదే శాతం ఓట్లను ఆ పార్టీ పొంద గలిగింది. తర్వాత కాలంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చిక్కి శల్యమైంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్ను తాకలేక పోయింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్నీ, ఈ మధ్యకాలంలో పెరిగిన విస్తరణనూ పరిగణనలోకి తీసుకుంటే 15 శాతం వరకు బీజేపీ నికర ఓటు ఉంటుందని భావించవచ్చు. సీట్లవారీగా క్షేత్ర స్థాయి పరిశీలన సైతం ఇదే స్థాయి నికర ఓటును నిర్ధారిస్తున్నాయి. దాదాపు వంద సీట్లలో బీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. అంటే గెలవడమో, లేదా రెండో స్థానంలో నిలవడమో అన్నమాట. కాంగ్రెస్కు అటువంటి నియోజక వర్గాలు అరవైకి పైనే కనిపిస్తున్నాయి. బీజేపీకి సుమారు ముప్ఫయ్ నియోజక వర్గాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి, అర్ధబలం... అంగబలం దండిగా ఉన్న బీజేపీ తెలంగాణలో వేట మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రెండో స్థానానికి చేరుకోలేకపోవడానికి కారణాలేమిటి? అనుకున్న స్థాయిలో చేరికలు ఎందుకు ఉండడం లేదు? అనైక్యతతో, క్రమశిక్షణా రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో బీజేపీ నేతలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? బీజేపీ వ్యూహమే దాని ఎదుగుదలకు గుదిబండగా మారుతున్నదన్న అభిప్రాయం కూడా ఉన్నది. తెలంగాణలో ఎకాయెకిని హార్డ్కోర్ హిందూత్వ ఎజెండాను తలకెత్తుకున్నట్టు కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో హార్డ్కోర్ హిందూత్వ ఎజెండాతో అడ్వాణీ రథయాత్రలు చేయడం వల్ల పార్టీ విస్తరణ జరిగిందే కానీ, అధికారం సిద్ధించలేదు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి సాఫ్ట్ హిందూత్వ ముఖాన్ని ముందుపెట్టిన తర్వాతే తొలిసారి బీజేపీకి కేంద్ర పీఠం దక్కింది. ఆ పునాదుల మీదనే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిలబడింది. హార్డ్కోర్ హిందూత్వ ఎజెండానే బీజేపీ బలంగా ముందుకు తోస్తే... ఇరవై శాతం ఓట్ల మార్కును దాటడం కష్టమే! ఆ వైతరణీ నదిని దాటాలంటే కచ్చితంగా సెక్యులర్, లేదా సాఫ్ట్ హిందూత్వ ఎజెండాయే శరణ్యం. ఇక కాంగ్రెస్ పార్టీ గణాంకాలు చూస్తే బాగానే ఉన్నా, ఎక్స్రే మాత్రం బలహీనతలను ఎత్తిచూపుతున్నది. నాయక శ్రేణుల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఆ పార్టీలో ఐక్యత ఓ మరీచిక. అగ్రనాయకత్వంపై అందరికీ విశ్వాసం లేదు. ఒకరినొకరు ఓడించుకునే అవకాశాలను తోసిపుచ్చలేము. ఎన్నికలకు ముందే ఆ పార్టీ అభ్యర్థులందరూ పార్టీ ఫిరాయించబోమని బహిరంగంగా ప్రమాణాలు చేస్తే తప్ప ప్రజలు నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఈ బలహీనతలన్నింటినీ అధిగమించగలిగితే గట్టి పోటీదారుగా నిలబడగలిగే అవకాశం ఇప్పటికీ కాంగ్రెస్కు ఉన్నది. అదే సందర్భంలో కర్ణాటకను కోల్పోయిన బీజేపీ దక్షిణాదిన మరో స్థావరం కోసం గాయపడ్డ పులిలా విరుచుకుపడడం ఖాయం. ఇతర పార్టీల్లో ప్రజాదరణ గల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకొని ఒక ప్రభంజనం సృష్టించే ప్రయత్నం తప్పక చేస్తుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే... జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హవ్వ... సముద్రం ఒకడి కాళ్ల దగ్గరా?
‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు, నేనంతా పిడికెడు మట్టే కావచ్చు – కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.’’ గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పంక్తులివి. పవన్ కల్యాణ్ తన గురించీ, తన రాజకీయ ప్రస్థానం గురించీ చెప్పుకోవడానికి ఈ పంక్తుల్ని వాడుకున్నారు. వేలాదిమంది అభిమానులు హాజరైన ఒక బహిరంగ సభలో జనసేన కార్యకర్తలకు ఆయన చేసిన బాస ఇది. ఇప్పుడేమైంది పవన్జీ? ఆ ధీర గంభీర ప్రవచనాల కేమైనది? ఏవి తండ్రీ నిరుడు కురిసిన అగ్నిధారలు ఎక్క డయ్యా? నేనంతా పిడికెడు మట్టినే కదా! 175 నాకెట్లా సాధ్యమని బేలగా పలుకుతున్నారేమిటి? పొత్తుల జోలెలో చంద్రబాబు వేసే ముప్పయ్యో, నలభయ్యో చాలంటున్నారెందుకని? మీలో ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఎందుకు అవనతమైనది? ఆ పొగరు జెండాను తమ గుండెల మీద ఎగరేసుకున్న మీ అభిమానుల పరిస్థితేమిటి? ‘‘ఇల్లేమో దూరం. చీకటి పడింది. దారంతా గతుకులు. చేతిలో దీపం లేదు. అయినా గుండెల్లో ధైర్యముంది... వెళ్లొస్తా చిన్నమ్మా’’ అనే కవితను మీరు చదివినప్పుడు ‘అబ్బో మావాడు మహా తోపు’ అనుకున్న జనసైనికుల పరిస్థితి ఏమి కావాలిప్పుడు? జగన్ సర్కార్ను తానొక్కడిగా ఎదిరించడం సాధ్యం కాదని పవన్ కుండబద్దలు కొడుతున్నారు. తానొక్కడి వల్లే కాదు, ఏ ఒక్కరి వల్లా కాదని కూడా తేల్చేశారు. ‘ఈ చీకటి దారిలో నేనొక్కడినీ వెళ్లలేను చిన్నమ్మా. తోడు కావాల’ని దీనంగా అర్థిస్తున్నారు. తోడు దొరికినా కూడా తాను ముందు నడవరట! ముందు చంద్రబాబు నడవాలి. ఆ వెనకే తానూ, తనతోపాటు మిగిలిన సమస్త జీవరాశి. లెఫ్ట్, రైట్ తేడాలు పక్కనపెట్టి తన చుట్టూ నిలబడాలని అభ్యర్థిస్తున్నారు. వీలైతే పంచభూతాలు, సప్త సముద్రాలు, నవగ్రహాలు కూడా అండగా వస్తే బాగుంటుందని ఆయన మనసులో బలంగా ప్రార్థిస్తూ ఉండవచ్చు. ఆంధ్ర రాజకీయ రంగంలో ఒక విలుకాడుగా నిలబడు తాడని కొందరు అభిమానులు ఆశపడ్డ ఈ నటుడు చివరికి తన బొటనవేలును కోసి చంద్రబాబుకు దక్షిణగా సమర్పిస్తున్నారు. ‘నా పక్కన ఉండే నాదెండ్ల మనోహర్ను ఒక్క మాటన్నా సహించబోను. ఖబడ్దార్! ఆయనంటే ఇష్టం లేనివాళ్లు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చ’ని కూడా పవన్ బాహాటంగా హెచ్చరించారు. మనోహర్... చంద్రబాబు ఏజెంటని పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం పెద్దల నిశ్చితాభిపాయం. నిరంతరం పవన్ కదలికలను బాబుకు ఆయన చేరవేస్తుంటారని వారు బహిరంగంగానే ఆరోపిస్తుంటారు. బీజేపీతో సహా ఇతర పార్టీల నేతలను పవన్ కలిసినప్పుడు కచ్చితంగా మనోహర్ వెంట ఉంటారట! ఆ సంభాషణల కేసెట్ను చంద్రబాబుకు చేరవేస్తుంటారట! చంద్ర బాబు – పవన్ భేటీలో మాత్రం మనోహర్ కనిపించరట! ఎవరికీ చేరవేయవలసిన అవసరం లేదు కనుక! జనసేన ముఖ్యులే చెవులు కొరుక్కుంటున్న మాటలివి! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థనీ, వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి టీడీపీ – బీజేపీ – జనసేనలతో కూడిన కూటమి ఏర్పడబోతున్నదనీ నిన్న పవన్ ప్రకటించడాన్ని ఒక కొత్త విషయంగా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వైసీపీ వాళ్లు మాత్రం ఈ సంగతి మాకెప్పుడో తెలుసని తేలిగ్గా తీసుకున్నారు. అసలు జనసేన పార్టీ సృష్టి స్థితి లయకారుడు చంద్రబాబేనని వాళ్లు ఎప్పటి నుంచో చెబు తున్నారు. పవన్ కల్యాణ్కు చంద్రబాబు దత్తపుత్రుడనే నామకరణాన్ని కూడా వైసీపీ అధినేత ఎప్పుడో ఖరారు చేశారు. బాబు చేత, బాబు కొరకు, బాబు పెట్టిన పార్టీగానే జనసేనను వైసీపీ వాళ్లు పరిగణిస్తారు. కనుక పవన్ కల్యాణ్ రాజకీయ విధాన ప్రకటన వారికెటువంటి ఆశ్చర్యాన్నీ కలిగించలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఎదురులేని శక్తిగా యువనేత జగన్మోహన్రెడ్డి కనిపించారు. ఆయన్ను ఓడించడానికి చంద్రబాబు ఒక పద్మవ్యూహాన్ని రూపొందించవలసి వచ్చింది. అందులో భాగంగానే జనసేన పేరుతో ఒక టాస్క్ఫోర్స్ను తయారుచేసి, దాని చీఫ్గా పవన్ కల్యాణ్ను నియమించారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఈ అంచనా నిజమేనని తదుపరి పరిణామాలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఆ ఎన్నికల్లో బాబు అప్పగించిన టాస్క్ మేరకు జనసేన పోటీ చేయలేదు. సినిమా వ్యామోహమున్న యువతీయువకుల్లో, కొంతమేరకు కాపు యువతలో తనకున్న క్రేజును టీడీపీ ఓట్లుగా మలచడానికి పవన్ యథాశక్తి కృషి చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్, ఆయన టాస్క్ఫోర్స్ అతిథి పాత్రనే పోషించాయి. తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు కొత్త టాస్క్ను అప్పగించారు. ఆయన అధికారంలో ఉన్నారు గనుక తనకు వ్యతిరేకంగా పడే ఓట్లు గంపగుత్తగా వైసీపీకి వెళ్లకూడదని భావించారు. వ్యతిరేక ఓటును చీల్చడం కోసం టాస్క్ఫోర్స్కు కమ్యూనిస్టులనూ, బీఎస్పీనీ జతచేసి రంగంలోకి దించారు. అయినా ఫలితం దక్కలేదన్నది వేరే విషయం. ఇప్పుడు బాబు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలకూడదు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని పవన్ కల్యాణ్ గంభీరంగా చేస్తున్న ప్రకటనల వెనుక పరమార్థం – చంద్రబాబు ప్రయోజనమే! మొన్నటి ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులను గిరాటు వేసి, పవన్ బీజేపీ చెంతకు చేరడం కూడా బాబు వ్యూహంలో భాగమేనని కనిపెట్టడానికి కామన్సెన్సు సరిపోతుంది. ఆ ఎన్నికల ముందు చంద్రబాబు... నరేంద్ర మోదీని అసభ్యంగా తిట్టిపోశారు. ఆయన ఓడిపోతారనే గుడ్డి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం కూడా చేశారు. చంద్రబాబు గ్రహచారం బాగాలేక నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించారు. మోదీ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి చేయగూడని పనులన్నీ చేయడానికి బాబు సిద్ధపడ్డారు. పూర్వం బలవంతులైన రాజుల కటాక్ష వీక్షణాల కోసం బలహీనమైన రాజులు పడిన ప్రయాసనంతా చంద్రబాబు పడ్డారు. ధనరాశులతోపాటు గుర్రాలను, ఏనుగులను, యుద్ధ వీరులను, అందాల కన్యలను కూడా బలవంతుడైన రాజుకు కానుకలుగా పంపేవారట! చంద్రబాబు కూడా తన పార్టీలోంచి కొందరు నాయకులనూ, అందులో కొందరు ఎంపీలనూ బీజేపీ లోకి పంపించారు. వారితోపాటు తాను పెట్టుకున్న టాస్క్ఫోర్స్ జనసేననూ, దాని చీఫ్ను కూడా బీజేపీ శిబిరానికి పంపించారు. చంద్రబాబు చాణక్యంపై బీజేపీ పెద్దలకు గ్రహింపు ఉన్నా కూడా సమర్పించిన కైంకర్యాలను వారి ప్రయోజనార్థం వారు స్వీకరించారు. బీజేపీ శిబిరంలోకి చంద్రబాబు పంపించిన వారంతా బాబు సేవలోనే తరిస్తున్నారని చెప్పడానికి దృష్టాంతాలు కోకొల్లలు. బీజేపీ కొంగుతో చంద్రబాబు కొంగును ముడివేయడానికి పవన్ యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇది వాస్తవం. బయటకు కనిపించిందంతా నటనే! పవన్పై చంద్రబాబు వన్సైడ్ లవ్ ప్రకటించడం నటనే. తరువాత తనను కలిసిన బాబుతో ‘ఐ లవ్ యూ టూ’ అని పవన్ చెప్పడం కూడా నటనే! ఈ సన్నివేశాలన్నీ చంద్రబాబు కూటమి రాసిన నాటకంలో భాగాలే. పరిణా మాలను గమనిస్తే– చంద్రబాబు సేవలో పవన్ కల్యాణ్ నిమ గ్నమై ఉన్నారని అర్థమవుతూనే ఉన్నది. అందుకు కారణ మేమిటన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. తన ప్రధాన ఫ్రత్యర్థులుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న వైసీపీలోని చాలామంది నాయకులు ‘అంతా ప్యాకేజి మహిమ’ అనే భాష్యం చెబుతారు. ఆ మాట వింటే పవన్కు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. ఆ కోపంలో ఒకసారి ప్రత్యర్థులకు చెప్పును కూడా చూపించారు. విమర్శలకూ, సమస్యలకూ ఆగ్రహం సమాధానం కాదని మన పురాణాలు, ఇతిహాసాలు ఎప్పటినుంచో బోధిస్తున్నాయి. పూర్వం కౌశికుడు అనే తపోబల సంపన్నుడిపై ఓ కాకి రెట్ట వేసిందట! కౌశికుడు కోపంతో కన్నెర్రజేసి కాకి వంక చూస్తాడు. ముని తపోబలం చేత ఆ కాకి మాడిపోతుంది. అక్కడి నుంచి భిక్షాటన కోసం ఒక గ్రామాన్ని చేరుకొని, ‘భవతీ భిక్షాం దేహి’ అని ఒక ఇంటి ముందు పిలుస్తాడు. వ్యాధిగ్రస్థుడైన భర్త సేవలో పడి, ఆ ఇల్లాలు కొంత ఆలస్యంగా భిక్ష తెస్తుంది. ఆలస్యం చేసినందుకు కౌశికుడికి కోపం వస్తుంది. అలవాటు ప్రకారం కంటి అరుణిమను ఇల్లాలిపై ప్రయోగిస్తాడు. ఆమె కాలిపోదు. పైపెచ్చు చిరునవ్వు నవ్వుతుంది. ‘‘ఓయీ కౌశికా! నువ్వు కోపగిస్తే కాలిపోవడానికి నేను కాకిని కాదు. గృహధర్మానికి కట్టుబడిన ఇల్లాలిని. నా ధర్మనువర్తనలో కొంత ఆలస్యం జరిగినది. ధర్మాన్ని గురించి తెలియని నీ తపస్సు వృథా! వెళ్లి నేర్చుకో’’ అని హితబోధ చేస్తుంది. ప్యాకేజి విమర్శలను పూర్వపక్షం చేయాలని పవన్ భావిస్తే అందుకు పరిష్కారం పాదరక్షలు కాదు. తన రాజకీయ ఎత్తుగడలు ప్రజల ప్రయోజనాల కోసమేనని వారిని నమ్మించగలగాలి. చంద్రబాబుతో తన మైత్రి లోకకల్యాణార్థమని రుజువు చేయగలగాలి. అందరూ కలిసి జగన్మోహన్రెడ్డిని ఓడిస్తే నెలకు మూడు వానలు కురుస్తాయనీ, బంగారు పంటలు పండుతాయనీ తాను చదివిన లక్ష పుస్తకాల పరిజ్ఞానంతో సహేతుకంగా నిరూపించవలసి ఉంటుంది. తాను చేగువేరా దగ్గర నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ వరకు చేసిన ప్రయాణంలో బోలెడంత తాత్వికత దాగి ఉన్నదని తార్కికంగా నిరూపించ వలసి ఉంటుంది. అలా చేయకపోతే – మీ కన్నెర్రకు కాకులు భయపడతాయేమో... లోకులు భయపడరు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈ బెదిరింపుల వెనుక..!
‘‘అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అన్నాడు శతకకారుడైన బద్దెన. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్నీ, పూజించినా కోర్కెలు తీర్చని దేవుడినీ, యుద్ధంలో తానెక్కినప్పుడు పరుగెత్తని గుర్రాన్నీ వెంటనే వదిలేయాలని దాని అర్థం. అటువంటి అక్కరకు రాని ఒక చుట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల కింద వదిలించుకున్నారు. అలా వదిలించుకోవడం ఆయనకు బొత్తిగా నచ్చలేదు. కోపం తన్నుకొస్తున్నది. ఉక్రోషం లావాలా ఉప్పొంగుతున్నది. కళ్లెర్రబారుతున్నాయి. తనను వదిలించు కున్న ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. తనను ఓడించిన నాయకుడిపై బెదిరింపులకు దిగుతున్నారు. మధ్యేమధ్యే శోకం సమర్పయామి... వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఓదార్పు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి సెలబ్రిటీలను బతిమాలి పిలిపించుకుంటున్నారు. ‘యే దిల్ మాంగే సింపతీ’ అంటూ ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతంలో ఓదార్పు యాత్ర చేశారు. బాధలో ఉన్న వారిని ఓదార్చ డానికి ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఈ నాయకుడు మాత్రం తనను ఓదార్చండని యాత్రలు చేస్తున్నారు. ఇదీ ఇద్దరు నాయ కుల ఫిలాసఫీల్లో ఉన్న మౌలికమైన తేడా! ‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అలాగైంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఆయన మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. కష్టాలన్నీ కట్టగట్టుకొని తన మీద దాడి చేస్తున్నాయని జనం నమ్మి తనను ఓదార్చాలి. తాను అధికారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమాలకు రాజ్యాంగ బద్ధమైన ఇమ్యూనిటీ ఉండాలని ఆయన గట్టిగా నమ్ముతారు. కర్ణునికి కవచ కుండలాలెంత సహజమో, బాబుకు అవినీతి ఇమ్యూనిటీ అంత సహజమనీ మూడు దశాబ్దాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఈ ముప్పయ్యేళ్లలో ఎన్ని ఆరోపణలు కోర్టు మెట్లెక్కినా, బదిలీ లేని ‘స్టే’షన్ మాస్టర్లా తాను పాతుకొనిపోలేదా? విచారణ జరగకుండా ఇరవైకి పైగా స్టేలు విజయవంతంగా తెచ్చుకోలేదా? ఇప్పుడేమైంది. తాను నగ్నంగా దొరికిపోయే కేసులో సుప్రీంకోర్టు స్టేను తొలగించ డమేమిటి? కలికాలం కాకపోతే!... ఇదీ బాబు అండ్ కో భావజాలం. రాష్ట్ర విభజన వెంటనే జరిగిన ఎన్నికల్లో మోదీ గాలి ఆసరాగా యెల్లో తెరచాప ఎత్తిపట్టి బాబు అధికారంలోకి వచ్చారు. ఫార్టీ ఇయర్స్ అనుభవజ్ఞుడు కనుక క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాడేమోనని కూడా కొందరు వయోధిక ఓటర్లు ఆలోచించి ఉండవచ్చు. నిజానికి అప్పుడు చంద్రబాబుకు లభించిన అవకాశం ఓ అద్భుతం. నవ్యాంధ్రను తీర్చిదిద్దడానికి లభించిన దివ్యమైన అవకాశం. సద్బుద్ధితో ఆలోచించి ఉంటే పాత పాపాలను కడిగేసుకోగలిగేవారు. ఆయన చంద్రబాబు కనుక అలా జరగలేదు! ‘‘ఎలుక తోలు తెచ్చి యేడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు గాదు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ!’’ అన్నారు. స్వభావం మారకపోగా విశ్వరూపం దాల్చింది. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనే మేనేజ్ మెంట్ పాఠాన్ని బాబు పదేపదే వల్లెవేసేవారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని సొంత అవకాశంగా మలుచు కునేటందుకు ఒక అవినీతి క్రతువును ఆరంభించారు. అప్పటి ప్రతిపక్షం ఆ క్రతువు ఖరీదు ఆరు లక్షల కోట్లు ఉండవచ్చని ఉజ్జాయింపు అంచనా వేసింది. గ్రామస్థాయిల్లోనూ జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి పిండారీ ముఠాలను ఎగదోశారు. ఆ అయిదేళ్లలో అవినీతి సెగ తగలని మనిషే లేడంటే అతి శయోక్తి కాదు. జనం కీలెరిగి వాతపెట్టారు. ఎన్నికల సమ యానికి ఉప్పెనలా విరుచుకుపడి అక్కరకు రాని చుట్టాన్ని తరిమికొట్టారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం బాబు అవినీతి పురాణంపై ఓ కేబినెట్ సబ్కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ అవినీతి తాలూకు నివ్వెరపోయే నిజాలను రూఢి పరుస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. బాబు ప్రభుత్వం అవినీతి విశ్వరూపానికిసంబంధించిన అనేక ఆధారాలను ‘సిట్’ సంపాదించగలిగింది. బ్రహ్మరాక్షసి లాంటి అవినీతిని తవ్వి తీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని ప్రభుత్వానికి ‘సిట్’ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈలోగా చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. నాటి ప్రభుత్వంలో భాగస్వాములు కాని ఇద్దరు వ్యక్తుల చేత హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్ వేయడానికి వారికి ఎటువంటి అర్హత (లోకస్ స్టాండై) లేదనే న్యాయ నిపుణులు భావించారు. అయినప్పటికీ హైకోర్టులో ‘సిట్’ దర్యాప్తుపై స్టే మంజూరైంది. అదీ చంద్ర బాబు ప్రత్యేకత. దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చట. ఆ విద్య వలన ఆయన నీటిలో ఎంతసేపైనా మునిగి ఉండగలడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత మిగిలిన ఒక్క దుర్యోధనుడు ఓ మడుగులో దూరి దాక్కుంటాడు. రణశేషం ఉండకూడదు కనుక పాండవులు మడుగు వద్దకు చేరుకొని తిట్ల దండకం అందుకుంటారు. అభిమానధనుడైన దుర్యోధనుడు ఆ తిట్లు భరించలేక బయటకొచ్చి యుద్ధం చేస్తాడు. ఆ జలస్తంభన విద్య లాంటి న్యాయస్తంభన (స్టే ఆర్డర్) విద్య చంద్రబాబుకు తెలుసునని అభిజ్ఞవర్గాలు బలంగా నమ్ముతాయి. ఈ విద్య తెలిసినందున ఆయన దాని మాటున ఎంతకాలమైనా దాక్కో గలరు. దుర్యోధనుడి మాదిరిగా అభిమానధనం, గోంగూర ధనం వంటి సెంటిమెంట్లేవీ ఆయనకు లేవు. అందువల్ల కేసును ఎదుర్కోవాలని ఎవరెంత కవ్వించినా ఆయన చలించరు. ‘స్టే’షన్ మాస్టర్గానే ఉండిపోతారు. ఈవిధంగా ఇప్పటికి ఇరవై రెండు పర్యాయాలు ఆయనలాగే ఉండిపోయారు. కానీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇప్పుడేదో తేడా కొట్టడంతో బాబు కలవరపడిపోతున్నారు. ‘సిట్’ దర్యాప్తుపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేయడమేమిటి? దర్యాప్తు జరిగితే..? కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగితే ఏం చేయాలి? ఇప్పుడెవరికి చెప్పుకోవాలి? మార్గదర్శి లాంటి తన గురువు పరిస్థితే బాగాలేదు. ఆయన మంచం దిగనంటున్నారు. ఆపన్న హస్తం కోసం ఆయనే ఎదురుచూస్తున్నారు. కృష్ణపరమాత్ముడు పరమపదించారన్న వార్త విన్నప్పటి అర్జునుడి పరిస్థితి బాబుగారిది. ‘‘మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!’’ అని ధర్మ రాజు ముందు అర్జునుడు మొరపెట్టుకున్నాడట! ఇప్పుడు తానెవరి ముందు మొరపెట్టుకోవాలి? అకాల వర్షాలు ఆయన కంటికి ఒక సంక్షోభంలా కనిపించాయి. అవకాశాలు వెతుక్కో వడానికి గోదావరి జిల్లాలకు బయల్దేరారు. సుప్రీంకోర్టు స్టే తొలగించిన రోజు. మీడియా ముందు ఆయన మొరపెట్టుకున్నారు. దాంతోపాటు గర్జనలకూ, గాండ్రింపులకూ, బెదిరింపులకూ కూడా పాల్పడ్డారు. ఆయన ఆవేశానికి ఎదురుగా వున్నవారు మ్రాన్పడిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి సంబంధించి బాగా వైరలైన ఒక వీడియో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో పవన్ ఉన్నట్టుండి వీరావేశంతో చేసిన ఆంగిక వాచికాభినయాలకు పక్కనున్న కాకినాడ అభ్యర్థి జడుసుకుంటాడు. బిత్తరచూపులతో సదరు అభ్యర్థి ప్రదర్శించిన మూకాభినయం చార్లీ చాప్లిన్ను గుర్తుకు తెస్తుంది. మొన్నటి సమావేశంలో చంద్రబాబు ఎదురుగా ఉన్నవాళ్లలో కూడా పదిమందైనా చాప్లిన్లు ఉండి ఉంటారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ చంద్ర బాబు బెదిరింపులకు దిగారు. బహుశా ఏ రాజకీయ నాయ కుడూ తన ప్రత్యర్థిని ఉద్దేశించి ఇలాంటి బెదిరింపులు చేసి ఉండరు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పరోక్షంగా ప్రస్తా విస్తూ ‘‘అతనికి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. అతిగా ప్రవర్తించే వారికి ఇలాంటి ఎండింగే ఉంటుంది. దానికి అతను సిద్ధంగా ఉండాలి. అతనే కాదు. అతని పార్టీ వాళ్లు కూడా ఇలాంటి ట్రీట్మెంట్కు రెడీ కావాలి’’ – ఇదీ ఆయన బెదిరింపు. దీని తాత్పర్యమేమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయ నపై ఉన్నది. మిజరబుల్ ట్రీట్మెంట్ అంటే? ఏం చేస్తారు? నిస్పృహతో విసిరిన ఆఖరి బాణమా? ఏమైనా కుట్రనా? ఇది కోడ్ లాంగ్వేజా?... ఆయనే విడమర్చి చెప్పాలి. ఈ పర్యటనలో బాబు ఉపయోగిస్తున్న అన్ పార్లమెంటరీ భాషను ఇక్కడ ప్రస్తావించడం లేదు. జనం నవ్వుకునేలా గొప్పలు చెప్పుకోవడం గురించి కూడా ఒకే ఒక అంశాన్ని ప్రస్తావించుకుందాము. ‘తమ్ముళ్లూ! నేనే గనుక అధికారంలో ఉంటే మీ ధాన్యం తడిసే ఉండేదా?’ అని ప్రశ్నించారు. వెంటనే జనంలో ఓ గొంతు ‘మీరుంటే అసలు వర్షం పడితేగా?’ అని వినిపించింది. తనకు నచ్చని కామెంట్లను ఆయన పట్టించుకోరు. తన ధోరణి తనదే! ‘సముద్ర తీరంలో నిలబడి తుపాన్లను కంట్రోల్ చేస్తున్నాను, తుపాకులతో వర్షం కురిపించాను’... వగైరా వ్యాఖ్యానాలు చేసిన మానసిక స్థితిలోంచే.. ‘నేనుంటే మీ ధాన్యం తడిసేది కాద’న్న వ్యాఖ్యానం వెలువడి ఉంటుంది. జనానికి కొంత కాలక్షేపం. బాబు అవినీతి దర్యాప్తుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు తొలగించిన తర్వాత ఆయన కూటమికి మరో పిడుగు లాంటి వార్త. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన యాభైవేల మంది పేద ప్రజలకు సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రెండేళ్లుగా బాబు కూటమి చేయని ప్రయత్నం లేదు. పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలిస్తే ‘సామాజిక సమతౌల్యత’ దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. అదొక గంభీరమైన పదం మాత్రమే! ఆ ముసుగు పదాన్ని తొలగిస్తే పేద ప్రజల పట్ల అదొక భయంకరమైన అస్పృశ్య భావన. తమ పక్కన పేదవారు నివసిస్తే మైలపడి పోతామనే పెత్తందారీ తనపు కొవ్వెక్కిన అహంకారం. ఈ మనో వికారానికి ముసుగు కప్పి సాంకేతిక కారణాలు జోడిస్తూ చేసిన అభ్యంతరాలను ప్రభుత్వ న్యాయవాది బలంగా తిప్పికొట్టారు. ఈ తీర్పు వచ్చిన రోజు కూడా చంద్రబాబువి ఆగ్రహా వేశాలే! కొంత తటస్థంగా ఉండే మీడియాను కూడా ఈసారి బెదిరించారు. తాను కోరుకున్నట్లు ప్రసారాలు చేయని రెండు చానల్స్ను నిషేధిస్తానని బ్లాక్మెయిలింగ్కు దిగజారారు. ఆ రెండు చానల్స్ను పేరుపెట్టి మరీ హెచ్చరించారు. ‘సాక్షి’ సంగతి సరేసరి. దాన్ని ముందే నిషేధిస్తారట! మీడియా మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 మాదిరిగా ఉండాలి. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదనే సందేశాన్ని ఆయన బహిరంగంగా పంపిస్తున్నారు. రాజకీయంగా చిట్టచివరి జారుడు మెట్టు మీదకు చేరుకోవడంతో ఆయన నిస్పృహ మాటల్లో స్పష్టంగా బయటపడుతున్నది. పేదలకు ఇళ్లస్థలాలు రాజధానిలో ఇవ్వకూడదనీ, పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, పేద పిల్లలకు ఇంగ్లిషు చదువులొద్దనీ, అవి తమ పిల్లలకు మాత్రమే పరిమితం కావాలనీ హూంకరిస్తున్న పెత్తందారీతనంపై సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. తమ పిల్లలు కూడా పెద్దవారితో సమా నంగా నాణ్యమైన చదువులు చదవాలనీ, వైద్యరంగం అభివృద్ధితో పెరుగుతున్న ఆయుఃప్రమాణాలు తమకూ వర్తించాలనీ, తమ శ్రమకు లాభదాయకమైన విలువ, గౌరవం లభించాలనీ పేద ప్రజలు కోరుకుంటున్నారు. బలహీనవర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో తగిన వాటానూ, గౌరవప్రదమైన స్థానాన్నీ అభిలషి స్తున్నారు. ఇవన్నీ న్యాయమైన కోర్కెలు. రాజ్యాంగం ఇచ్చిన హామీలే. కానీ ఇన్నాళ్లు ఈ సామాజిక న్యాయం తమకు దక్కకుండా చేసిన పెత్తందారి తోడేళ్లెవరో జనం గుర్తించగలుగు తున్నారు. తమకు అండగా నిలబడుతున్నవాళ్లెవరో ప్రజలకు తేటతెల్లమవుతున్నది. రాజధానిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్యే ఒక లిట్మస్ టెస్ట్. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా పెత్తందారీ తొత్తులే! వాడు ఎర్రజెండా ముసుగేసుకున్నా సరే! ఎవరేమిటనే సంగతి జనానికి స్పష్టంగా తెలిసిపోయిందన్న ఉక్రోషమే ‘బాబు అండ్ కో’లో బుసకొడుతున్నది. వచ్చే ఎన్ని కల్లో పాత ఫలితాలే పునరావృతమయ్యే పరిస్థితి విస్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే ఈ నిస్పృహ. అందుకే ఈ బెదిరింపులు. - వర్ధెళ్లి మురళి, Vardhelli1959@gmail.com -
విజనరీ వేషధారి!
మాజీ సూపర్స్టార్ రజనీకాంత్ ఒక విషయాన్నయితే కుండ బద్దలు కొట్టారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఆయన ఈ మధ్యనే హైదరాబాద్లో పర్యటించారట. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు. న్యూయార్క్లో ఉన్నానా? ఇండియాలో ఉన్నానా అనే అను మానం వచ్చిందట! ఇరవయ్యేళ్ల్ల కిందట అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలిస్తున్న కాలం. ఆయన తర్వాత రెండు దశాబ్దాలకు హైదరాబాద్ అభివృద్ధి సాధించిందని రజనీ భావన. చంద్రబాబు విజనరీయే అని చెబుతూ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆయనది కాదని రజనీకాంత్ చెప్పకనే చెప్పారు. ఆయన నటించిన ‘నరసింహ’ అనే సూపర్హిట్ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో ఓ కామెడీ పాత్రధారి పెళ్లిచూపులకు బయల్దేరుతాడు. వెంట మిత్రబృందం కూడా ఉంటుంది. ఆ బృందంలో రజనీకాంత్ కూడా ఉంటారు. దారిలో ఎదురైన ప్రతివారికీ అడిగినా అడక్కపోయినా పెళ్లి కొడుకును రజనీకాంత్ పరిచయం చేస్తుంటాడు. అదిగో ఆయనే పెళ్లికొడుకు, వేసుకున్న డ్రస్ మాత్రం అతనిది కాదని చెబుతుంటాడు. ఇలా ముగ్గురు నలుగురికి చెప్పేసరికి సదరు పెళ్లికొడుక్కి సిగ్గుతో చచ్చినంత పనవుతుంది. ఆ డ్రస్ను విప్పి పారేసి పెళ్లిచూపులకు వెళ్లకుండా వెనక్కి వెళ్లిపోతాడు. మొన్న జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభలో రజనీకాంత్ మాటలను చంద్ర బాబు పాజిటివ్గానే తీసుకున్నారు. అస్సలు సిగ్గుపడలేదు. తనది కాని ఘనతను ఎవరైనా తనకు ఆపాదించి పొగిడి నప్పుడు అభ్యంతరం పెట్టే అలవాటు బాబుకు బొత్తిగాలేదు. పైగా ఆ ఘనత తనకు లభించిన పేటెంట్ హక్కు కింద భావిస్తారు. చేతనైన మేరకు తానూ ప్రచారంలో పెట్టుకుంటారు. సెల్ఫోన్ను దేశానికి తీసుకురావడం, కంప్యూటర్ను కనిపెట్టడం, హైదరాబాద్ను నిర్మించడం వంటివన్నీ ఈ కోవకు చెందినవే. మొబైల్ ఫోన్ దాని ప్రాథమిక రూపంలో ప్రారంభమై యాభ య్యేళ్లు పూర్తయిన సందర్భంగా చాలా విషయాలు బయట కొస్తున్నాయి. కమర్షియల్గా ప్రజావినియోగంలోకి రావడానికి ఆ తర్వాత చాలాకాలం పట్టింది. భారత్లో మరింత ఆలస్యంగా ప్రారంభమైంది. 1995లో అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి ఢిల్లీలోని కేంద్రమంత్రి సుఖ్రామ్కు కాల్ చేయడంతో మనదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగేళ్లకు చంద్ర బాబు భాగ స్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తాను అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఎడ్యుకేట్ చేసి ఒప్పించిన తర్వాతనే దేశంలో మొబైల్ ఫోన్లు ప్రారంభమయ్యాయని బాబు, ఆయన అనుంగు యెల్లో మీడియా ప్రచారం చేసుకోవడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నిండా ఏడాది కూడా సమయం లేదు. భారీ శాంపుల్స్తో పెద్ద పెద్ద జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు మరోసారి బాబు పార్టీకి చావు డప్పు మోగిస్తున్నాయి. తన పార్టీకి ఏదో ఒక ఎజెండా తక్షణావసరం. ఇంకో రెండు మూడు జెండాలు అండగా నిలబడాలి. ఈ రెండు కర్తవ్యాలను నిర్వహించడం కోసం ఆయన బ్యాక్ ఆఫీసు బ్రోకర్లూ, ఢిల్లీ లాబీయిస్టులూ రౌండ్ ది క్లాక్ చెమటలు కక్కుతున్నట్టు భోగట్టా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను బాబు విమర్శించలేడు. పైగా ఏమాత్రం సంకోచం లేకుండా వాటిని కొనసాగిస్తానని కూడా చెప్పు కొస్తున్నాడు. ఇది సరిపోదు. చంద్రబాబుకు ఇంకేదో మేకోవర్ కావాలి. మొన్నటి పదవీకాలంలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు. పాతికేళ్ల కింద యెల్లో మీడియా చంద్రబాబుకు వేసిన విజనరీ వేషాన్నే మళ్లీ వేయాలని సంకల్పించారు. గొప్ప విజన్ (దూరదృష్టి) గలవాడిగా ప్రచారం చేయడానికి అట్టహాసంగా కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఎంతసేపూ యెల్లో మీడియా పొగిడితేనే సరిపోదు కనుక, కొంచెం పాపులర్ వ్యక్తులను కూడా రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతిని ఇందుకోసం వాడుకున్నారు. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే శతజయంతి సభను గొప్పగానే నిర్వహించేవారు. నిండా నాలుగు వేలమంది కూడా రాని సభతో మమ అనిపించారు. కానీ, వారి ప్రయోజనం వేరు. బాబుకు విజనరీ (దార్శనికుడు)గా డప్పేయడం కోసం ఈ వేదికను వాడుకో వడం. ఆ డప్పు వాయించే పనిని రజనీకాంత్కు అప్పగించాలని నిర్ణయించారు. వృద్ధనారీ పతివ్రతల్లాంటి ఇద్దరు సినీ ప్రముఖులు నడుం కట్టి రజనీకాంత్ చేతికి స్క్రిప్టును అంద చేశారట. ఈ ఇద్దరూ కృష్ణా జిల్లా నేపథ్యం కలిగినవారే. ఒకరు రిటైర్డ్ దర్శకుడు. మరొకరు రిటైర్డ్ నిర్మాత. ఎన్టీఆర్ను వెన్ను పోటు పొడిచినప్పుడు హైదరాబాద్కు వచ్చి మరీ చంద్రబాబును ఆశీర్వదించిన చరిత్ర రజనీకాంత్ది. కానీ నిన్నటి సభలో ఎన్టీఆర్ను ఆకాశానికెత్తేయడం ఆశ్యర్యం కలిగించింది. అంతకంటే ఆశ్చర్యం ఎన్టీఆర్ కోసం చంద్రబాబు నటించిన ఆరాటం. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు పోరాటం ఆపడట! ఇటువంటి సందర్భాలను బట్టే సామెతలు పుడతాయి. ‘చెప్పేవాడికి లేకపోతే వినేవాడికన్నా సిగ్గుండాలి కదా’ అనే సామెత కూడా ఇలాంటిదే. చంద్రబాబు వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామి. ఆయన చెవిలో చెప్పి ఇండియాకు సెల్ఫోన్లు తెప్పించారు. కలామ్ను రాష్ట్రపతిగా చేశారు. స్వర్ణ చతుర్భుజి వంటి భారీ రహదారులను నిర్మింపజేశారు (ఆయన చెప్పుకున్నవే). ఎన్టీఆర్కు ‘భారతరత్న’ ఎందుకు ఇప్పించలేదో అనే అనుమానం ఎవరికీ రాదని ఆయన నమ్మకం. ప్రజల వివేచనాశక్తి మీద, జ్ఞాపకశక్తి మీద ఆయనకున్న చులకన భావానికి ఇది నిద ర్శనం. రజనీకాంత్ ప్రసంగం మాత్రం ఎన్టీఆర్ కోసం వచ్చినట్టని పించలేదు. చంద్రబాబుపై చేసిన పొగడ్తలు కూడా సహజంగా లేవు. బాలకృష్ణపై చేసిన ప్రశంసలు వెటకారంలా ధ్వనించాయి. సినిమా రక్తి కట్టలేదు. ‘బాషా’ను తీయబోతే ‘బాబా’ తయారైంది. విజనరీ మేకోవర్ కోసం ఈ వారంలోనే మరో కార్యక్రమాన్ని ఢిల్లీ లాబీయిస్టులు కుదిర్చారు. రిపబ్లిక్ టీవీ వారు గత మంగళ వారం నాడు ఒక సదస్సును నిర్వహించారు. ఇందులో చంద్ర బాబుతో ప్రశ్నలు–జవాబుల కార్యక్రమం ఉండేలా లాబీయి స్టులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందే ఓ రెండుసార్లు ఛానల్ హెడ్తో బాబు చేత మాట్లాడించారట! కార్యక్రమంలో చంద్రబాబునుద్దేశించి యాంకర్ అడిగిన ప్రశ్నలు చూస్తే హాస్యా స్పదంగా ఉంటాయి. ప్రశ్నలూ–జవాబులూ లాబీయిస్టులే తయారు చేసినట్టు చిన్నపిల్లవాడికైనా అర్థమవుతుంది. ‘మీరు గొప్ప దార్శనికులు. ప్రధాని కూడా దార్శనికుడు. ఇద్దరూ కలిస్తే మంచిదే కదా?’, ‘మీ మాటల్ని బట్టి చూస్తే మోదీ అంటే మీకు చాలా ఇష్టమని తెలుస్తున్నది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకు చింతిస్తున్నారా?’, ‘ఎన్డీఏ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో ఒకే రకంగా ఉంటాయి. మీరిద్దరూ దేశం కోసం పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేయడం మీకు సమ్మతమేనా?’ ఇలా ఉన్నాయి యాంకర్ ప్రశ్నలు. ప్రధానమంత్రి కటాక్షం కోసం, బీజేపీ పొత్తు కోసం రిపబ్లిక్ టీవీ ఛానల్ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నట్టుగా సాగిందా కార్య క్రమం. వాస్తవంగా దాని ఉద్దేశం కూడా అదే! బీజేపీతో పొత్తు విజ్ఞాపనతో పాటు చంద్రబాబు ఒక దార్శనికుడని పలుమార్లు పలకడం మేకోవర్ వ్యూహంలో ఒక భాగం. ఇంతకూ ఏమిటి చంద్రబాబు విజన్? తన దార్శనికతకు దర్పణంగా ఆయన రాసు కున్న ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని ఎందుకు దాచిపెట్టారు? వ్యవసాయ రంగాన్ని సంక్షోభం పాల్జేసి వేలాది మంది రైతులను ఆత్మహత్యలకు పురికొల్పినది చంద్రబాబు విజన్ కాదా? ప్రభుత్వ పాఠశాలలను శిథిలం చేసి పేద బిడ్డల్ని చదువులకు దూరం చేసిన విజన్ చంద్రబాబుదే కాదా? ప్రభుత్వాసు పత్రుల్లోకి వెళ్లే నిరుపేదల గోళ్లూడగొట్టి యూజర్ చార్జీలు వసూలు చేసిన దార్శనికత ఆయనదే కదా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను వ్యతిరేకించింది ఆయన విజనే కదా? ప్రభుత్వ ఉద్యోగులెందుకు దండగని ఔట్సోర్సింగ్ బాటలు వేసిన విజన్ ఆయనదే కదా! అదిగో అదే విజన్తో మళ్లీ ముందుకొస్తున్నాడు విజనరీ. ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని చెబుతున్నాడు. ముఖ్యమంత్రి మొన్న ఒక సభలో చెప్పి నట్టు చెరువు పక్కన ముసలి పులి పొంచి కూర్చున్నది. బంగారు కడియాన్ని చూపెట్టి కవ్విస్తున్నది. అఖిలాంధ్ర జనులారా తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
Ramoji Rao: గాడ్ఫాదర్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్!
గాడ్ఫాదర్ నవల ఎపిగ్రాఫ్... బిహైండ్ ఎవ్రీ ఫార్చూన్, దేర్ ఈజ్ ఎ క్రైమ్! (ప్రతి అదృష్టం వెనుక నేరమో, ఘోరమో ఉంటుందని తాత్పర్యం.) ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి రెండు దారులుంటాయి. ఒకటి: స్వయంకృషి, రెండు: అదృష్టం. మొదటి దారిలో వెళ్లడానికి పట్టుదల కావాలి. ప్రతిభ ఉండాలి. ఏళ్లకేళ్లు నిరీక్షించాలి. కష్టాల కొలిమిలో సానబట్టు కోవాలి. అడ్డంకులను ఓర్పుగా అధిగమించగలగాలి. హై రిస్క్ రోడ్! రెండో దారి అదృష్టం. కొంతమందికి యథాలాపంగా లాటరీ మాదిరిగా తగలొచ్చు. వీరి సంఖ్య బహుస్వల్పం. కోటి కొక్కరు ఉండవచ్చు. అదృష్టవంతుల్లో అత్యధికులు అక్ర మార్కులే! మాకియవెలీ శిష్యులే. మోసం, కపటం వారి స్వభావం. చట్టం, న్యాయం వీరికి పట్టవు. నిత్యం ఉషోదయంతోపాటు ఓ అసత్యాన్ని వెలిగిస్తారు. వక్రమార్గదర్శులు వీరు. అరవయ్యేళ్ల కింద ఈ రెండో దారిలో బయల్దేరిన ఒక పెద్దమనిషి నమ్మకం అనే మాట గొంతు నులిమి, విశ్వస నీయతకు శిలువేసి, మెట్టుమెట్టుకూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పైస్థాయికి చేరి స్వార్థశక్తులకు మార్గదర్శిగా నిలబడిపోయారు. నేర సామ్రాజ్యాల అంతిమ లక్ష్యం ‘పవర్’ మీద పట్టు బిగించడమే! ఈ మార్గదర్శి కూడా అదే బాటలో పయనించారు. పిడికిట్లోకి ‘పవర్’ను తెచ్చుకున్నారు. చట్టాలను కాలదన్నారు. జనం సొమ్ముతో వేలకోట్లకు పడగెత్తారు. పైకి మాత్రం ధర్మ ప్రబోధకుడి మాదిరిగా ఫిలిం సిటీలో పీఠం వేసుకొని కూర్చు న్నారు. ఒక దశలో ముక్కోటి దేవతలను కూడా తన కాంపౌండ్లోకే తెచ్చేసుకుందామని ఆలోచించారు. ‘ఓం సిటీ’ పేరుతో ఓ ప్రణాళిక తయారుచేసుకున్నారు. దైవకార్యంగా భావించి ఇంకో నాలుగొందల ఎకరాలను కేటాయించాలని తెలంగాణ ప్రభు త్వానికి అర్జీ పెట్టుకున్నారు. కానీ, దైవకృప లేకపోవడం వల్ల అది అక్కడే ఆగిపోయింది. రామోజీ కొందరికి స్వామీజీ. కొందరికి కులగురువు. రాజకీయ, వ్యాపార రంగాల్లోని స్వార్థశక్తులకు గాడ్ఫాదర్. ఈ గాడ్ఫాదర్కు పట్టిన ప్రతి అదృష్టం వెనుక నేరం ఉంది. ఘోరం ఉంది. అసత్యముంది. మోసం, దగా దాగున్నాయి. ఎన్టీ రామా రావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థశక్తుల రాజకీయ వేదికగా మార్చడంలో కీలకపాత్ర రామోజీదే! ఇందుకు ఆయ నకు కలిసొచ్చిన అస్త్రం చంద్రబాబు. వ్యాపార రంగంలోని తన లక్షణాలను రాజకీయ రంగంలో కలిగి వున్న అపూర్వ సహో దరునిగా ఆయనకు బాబు కనిపించారు. ఇద్దరూ సుందోపసుందుల వలె కలిసిపోయారు. మీడియాను మాఫియాగా మార్చి పారేశారు. గోబెల్స్ ప్రచారాలతో చెలరేగిపోయారు. ముప్పయ్యే ళ్లుగా తెలుగునాట వీరు సృష్టించిన రాజకీయ కాలుష్యపు విష ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనకు వ్యతిరేకంగా ఈ ముఠా సృష్టిస్తున్న అసత్య ప్రచారం, కల్పిస్తున్న కట్టుకథలు, సృష్టిస్తున్న విద్వేషం, కక్కుతున్న విషం... ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నిర్వహణలో రామోజీరావు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించిన అంశాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయి. ఇంతకాలం రామోజీని మీడియా మొఘల్గా, పద్మభూషణుడిగా అమాయకంగా నమ్మిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన అరవయ్యో దశకంలో వేసిన తొలి అడుగే వంచన, ద్రోహచింతన అనే థీమ్తో పడింది. తొలి భాగం ‘రామోజీ: ది రైజ్’ నమ్మకద్రోహంతోనే మొదలైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం రెండో భాగం ‘రామోజీ: ది రూల్’ నడిచింది. ఇప్పుడిక ఆఖరిభాగం ‘రామోజీ: ది ఫాల్’ విడుదలకు సిద్ధంగా ఉన్నది. అందుకే పతన భయం రామోజీ మీడియాను వణికిస్తున్నది. అదుపు తప్పిన ఉన్మాదంతో అది ఊరేగుతున్నది. అన్ని విలువలనూ విప్పేసి నగ్నంగా నర్తిస్తున్నది. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన జీజే రెడ్డి అనే ఆయన ఆరోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పుతుండేవాడు. 1960, 70 దశ కాల్లో అధికార, రాజకీయ వర్గాల్లో ఆయన పలుకుబడి పతాక స్థాయిలో ఉండేది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్లిన రామోజీ సొంత జిల్లావాడైన జీజే రెడ్డి దగ్గర గుమాస్తాగా కుదురుకున్నాడు. మార్గదర్శి, ఈనాడు పత్రికల స్థాపన జీజే రెడ్డి ఆలోచనే అని అప్పటి రామోజీ సహచరులు చెబుతున్నారు. మార్గదర్శిలో పెద్దమొత్తంలో పెట్టుబడులు కూడా ఆయనవే! రామోజీ ప్రారంభ వాటా 10 రూపాయలు మాత్రమే! ‘ఈనాడు’కు ఆదిలో పెట్టుబడిని సమకూర్చింది కూడా జీజే రెడ్డేనని చెబుతారు. విశాఖ ఎడిషన్ కోసం తన పలుకుబడితో తూర్పు జర్మనీ నుంచి సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ కూడా ఆయన తెప్పించారట. జీజే రెడ్డి ద్వారా ఢిల్లీలోని పలుకుబడి గల నాయకులతో రామోజీ కూడా పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత కాలంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఈ పరిచయాలు పనికొచ్చాయి. 1977లో జీజే రెడ్డి మీద దేశద్రోహం కేసు నమోదైంది. కేసును విచారించిన ఢిల్లీ కోర్టు ఆయనను ద్రోహిగా నిర్ధారించింది. ఆయన ఆస్తులన్నీ జప్తు చేయాలని ఆదేశించింది. ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆస్తులన్నీ జప్తు చేశారు. కానీ రామోజీ సంస్థల్లో ఉన్న అధికారిక షేర్లను ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. జీజే రెడ్డి పారిపోయే నాటికి డైరెక్టర్ హోదాలో ‘మార్గదర్శి’లో ఆయనకున్న షేర్లు ప్రభుత్వానికి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకనో ప్రభుత్వం కూడా చొరవ చూపలేదు. ఆ తర్వాత కాలంలో జీజే రెడ్డి కుమారుడు ఆస్తుల విషయంలో రామోజీని కలిశాడట! కానీ రామోజీ మాత్రం అతడిని చీకొట్టి పంపించాడని తెలిసింది. అలా మొదలైంది ‘రామోజీ: ది రైజ్’. ‘ఈనాడు’ను మొదట విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. అందుకోసం సీతమ్మధారలో 2.78 ఎకరాల స్థలాన్ని,అందులో 40 వేల అడుగుల్లో నిర్మితమైన భవనాలను నెలకు మూడు వేల చొప్పున 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. భూమి యజమాని పేరు మంతెన ఆదిత్యవర్మ. గడువు ముగిసిన తర్వాత వర్మ ఖాళీ చేయమని అడిగినా రామోజీ అంగీకరించలేదు. దానితో ఆయన కేసు వేశారు. ఇదిలా ఉండగా అందులో ఉత్తర భాగంలో కొంత భూమిని రోడ్డు వేయడానికి ప్రభుత్వం తీసుకున్నది. ఇందుకు బదులుగా వెనుక వైపున్న స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. లెక్కప్రకారం ప్రభుత్వం ఇచ్చే స్థలం భూయజమాని ఆదిత్యవర్మకు చెందాలి. కానీ పలుకుబడితో రామోజీ తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేశారు. వర్మ దాని మీద కూడా కేసు వేశారు. అసలు రోడ్డుకు తాను స్థలమే ఇవ్వలేదనీ, ముందునుంచే అక్కడ రోడ్డు ఉన్నదనీ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ను ఫోర్జరీ చేసి రామోజీ కోర్టుకు సమర్పించారు. అది ఫోర్జరీ డాక్యుమెంట్గా కోర్టులో నిర్ధారణ అయింది. కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యల కింద రామోజీపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదీ రామోజీ ఘనచరిత. ‘ఈనాడు’ విజయవాడ, హైదరాబాద్ స్థలాల విషయంలోనూ యజమానులను రామోజీ ముప్పతిప్పలు పెట్టాడు. విజయవాడ స్థలం స్వయానా ఆయన తోడల్లుడు ‘డాల్ఫిన్’ అప్పారావుకు చెందినది. రామోజీ మోసపూరిత చర్యల గురించి అప్పారావు పలుమార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఆయనకు మానవత్వం లేశమాత్రమైనా లేదనీ, ఆయనొక పయోముఖ విషకుంభమనీ అప్పారావు తీవ్రంగా విమర్శించారు. రామోజీ ఫిలిం సిటీలోని భూముల విషయంలో జరిగిన అక్రమాలకు లెక్కేలేదు. అసైన్డ్ భూములను, చెరువు భూములను, పోరంబోకు భూములను కబ్జా చేశారు. అవే కాకుండా ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించారు. ఫిలిం సిటీలో 1,363 ఎకరాలు సీలింగ్ చట్టానికి మించి ఉన్నదని రెవిన్యూ అధికారులు సర్వే చేసి నిర్ధారించారు. నోటీసులిచ్చారు. కథ అక్కడే ఆగిపోయింది. రామోజీ ఆక్రమించిన భూముల్లో 500 మంది స్థానిక పేదలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారులకు ఇప్పించడంలో అధికారులు, స్థానిక నేతలు ఇప్పటికీ చొరవ చూప లేకపోతున్నారు. ఫిలింసిటీలో చిట్ఫండ్ కంపెనీకి కూడా 137 ఎకరాల భూమి ఉన్నది. ఇది చందాదారుల సొమ్ముతో కొన్నారా? కమీషన్ సొమ్ముతో కొన్నారా? అనే అంశంపై క్లారిటీ లేదు. నాన్బ్యాంకింగ్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదన్న ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరు మీద సుమారు 2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేశారు. అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐలకు ఫిర్యాదు చేశారు. రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అంగీకరించలేదు. సంస్థపై కేసు నమోదు చేయాలని సూచించింది. ఆమేరకు కేసు పెట్టారు. డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తానని ఆర్బీఐకి రామోజీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. హడావిడిగా ఫైనాన్షియర్స్ సంస్థను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా అలా మూసేయడం కూడా నేరం. చేసిన తప్పుల తాలూకు ఆధారాలు దొరక్కుండా ఆయన ఆ నేరానికి ఒడిగట్టారు. డిపాజిటర్ల జాబితాను కూడా ఈనాటికీ విడుదల చేయలేదు. అది విడుదల చేస్తే తప్ప అది నల్లధనమో, తెల్లధనమో నిర్ధారణ కాదు. తాజాగా ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ల చొరవతో జాబితా వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏం చేస్తారో చూడాలి! ఫైనాన్షియర్స్ను మూసివేసినా ఆ తరహా వ్యాపారాన్ని చిట్ఫండ్స్ ముసుగులో కొనసాగిస్తున్నారని వెల్లడవుతున్నది. 1982 కేంద్ర చట్టం ప్రకారం చిట్ఫండ్ సంస్థలు ఇతర వ్యాపారాలు చేయరాదు. కానీ, చిట్ఫండ్ కంపెనీ తన చందా దారుల సొమ్మును ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లోకి, మార్గదర్శి చిట్ఫండ్స్ కర్ణాటక, తమిళనాడు విభాగాల్లోకి అక్ర మంగా తరలించి వ్యాపారాలు చేస్తున్నది. కేవలం కమీషన్ సొమ్ముతో ఉషాకిరణ్ మీడియాలో 88.50 శాతం వాటా చిట్ఫండ్స్కు దాఖలా పడటం సాధ్యం కాదు. ఉషాకిరణ్ మీడియా పేరు మీద ఫిలింసిటీలో వందల ఎకరాల భూములు, ఆ భూముల్లో వెలసిన నిర్మాణాలున్నాయి. మరి మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులకు ఆ భూముల్లో గానీ, అక్కడి వ్యాపారంలో గానీ వాటా ఉండాలా వద్దా అనే విషయం కూడా ఆలోచించాలి. చిట్ఫండ్స్ అక్రమాలపై ఏపీ సీఐడీ అధికారుల దర్యాప్తు జరుగుతున్నది. ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి. ఇవి కొన్ని మాత్రమే. ఒక నేర సామ్రాజ్యపు దుర్నీతికి సంబంధించిన శాంపుల్స్ మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నందు వలన దాని కుదుళ్లు కదులు తున్నాయి. ఫైనాన్షియర్స్ డిపాజిటర్ల జాబితా వెల్లడయితే అజ్ఞాతంలో ఉన్న ఇంకొందరు అవినీతి చక్రవర్తుల భాగోతం కూడా బయటపడవచ్చు. రాజధాని భూముల బినామీల వెనుక దాక్కున్న వారి బండారం కూడా ఇంకా బయటపడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ రాజకీయ – వ్యాపార ముఠా బెంబేలెత్తిపోతున్నది. ముఠా చేతిలో ఉన్న మీడియాను విచ్చల విడిగా దుర్వినియోగపరుస్తున్నది. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిపై ముసుగులు వేయాలని తాపత్రయపడుతున్నది. అభూతకల్పనలతో కూడిన రసాయన బాంబులను ప్రయోగి స్తున్నది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిల బడినట్టు ప్రాజెక్ట్స్ టుడే సర్వేలో వెల్లడైతే యెల్లో మీడియా కళ్లు మూసుకుంది. జీడీపీ వృద్ధిరేటులో 11.43 శాతంతో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంటే అది వారికి అసలు వార్తే కాదు. ఆహార ధాన్యాల దిగుబడిలో 20 శాతం వృద్ధిని నమోదుచేసి రికార్డు సృష్టిస్తే ఆ వార్తనూ తొక్కేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి దేశంలో అత్యుత్తమ పంటల బీమా స్కీమ్గా గౌరవం లభిస్తే వారి చెవికెక్కలేదు. ఆర్బీకే తరహా సేవలను తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ఇప్పటికే అరడజను రాష్ట్రాలు ముందుకొస్తే వారికి కనిపించలేదు. తమ అక్రమాలను, అరాచ కాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఆ కూటమి ఏకైక ఎజెండా. అందుకోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధం! చెత్త కాగితాల గుట్ట ‘ఈనాడు’, గోబెల్స్ను తలదన్నిన రామోజీ: ఎన్టీఆర్ ‘‘రామోజీ దుర్మదాంధుడు, స్వార్థపరుడు. నాపై కర్ర పెత్తనం చేయాలని చూశాడు. అసత్యాన్ని అందలమెక్కించడమే అతని లక్ష్యం. తిమ్మిని బమ్మిని చేయడమే అతని నైజం. ఇక చరిత్ర పెంట కుప్పల్లోనే మిగులుతాడు. జనం నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. పత్రిక చేతిలో ఉందని చెత్తరాతలు రాస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.’’ (వెన్నుపోటు అనంతరం ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్) అనారోగ్యంతో మంచం మీద ఉంటే కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు: సుమన్ ‘‘ఆస్పత్రిలో ఉన్నాను. రేడియేషన్ జరుగుతున్నది. నాన్నగారు కాల్ చేశారు. గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. కార్డ్లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ. ఆయన నానామాటలు అంటున్నారు. నాకు ఒక్కటే ఏడుపు. అమ్మ వారిస్తోంది. అటువంటి సమయంలో నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి నానామాటలు అనాలా అని బాధపడ్డాను. ఇంట్లో మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాగితాల మీద సంతకాలు తీసుకొని ‘ఈ’టీవీని నా నుంచి దూరం చేశారు.’’ (‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామోజీ కుమారుడు సుమన్) రామోజీని పెంచి పోషించింది మా నాన్నే: యూరీ రెడ్డి ‘‘మా నాన్న జీజే రెడ్డి ‘మార్గదర్శి’ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. దాని సీడ్ క్యాపిటల్ కూడా ఆయనదే. మా నాన్న ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. మార్గదర్శి, నవభారత్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలన్నీ ఇంటర్ లింక్డ్ అని చెప్పారు. మరణశయ్యపై నుంచి ఒక తండ్రి కుమారునితో చెప్పిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. డాల్ఫిన్ హోటల్లో కూడా తన పెట్టుబడులున్నాయని నాన్న చెప్పారు. ‘ఈనాడు’ ప్రింటింగ్ ప్రెస్ను కూడా తూర్పు జర్మనీ నుంచి నాన్నే తెప్పించారని మా అంకుల్స్ చెప్పారు. నాన్న జీవితంలో చాలా మందికి సాయం చేశారు. ఎంతో మందిని పెంచి పోషించారు. వారిలో రామోజీ కూడా ఒకరు.’’ (‘సాక్షి’ ఇంటర్వ్యూలో యూరీ రెడ్డి) వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మైండ్ గేమ్... మనీ గేమ్!
అడ్డదారులు తొక్కి అధర్మ మార్గాన్నెంచుకొని ఏదో సాధించాలనుకోవడం ఎప్పుడూ ప్రమాదకరమే. తాత్కాలిక ఫలితాలు సిద్ధిస్తాయేమో గానీ అంతిమంగా పతనం తప్పదనే నీతి సారాన్ని మన ఇతిహాస కథలు బోధిస్తున్నాయి. అహల్యను చెరచడానికి దేవేంద్రుడు ఆమె భర్త గౌతముని వేషం దాల్చి మోసగిస్తాడు. చివరికి గౌతముని శాపానికి గురై కురూపిగా చిరకాలం బతకవలసి వచ్చింది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించడానికి వీలుగా మారీచుడు బంగారు జింకలా మారి రామలక్ష్మణులను ఏమార్చుతాడు. ఒంటరిగా ఉన్న సీతమ్మను మారువేషంలో వచ్చిన రావణుడు అపహరిస్తాడు. కానీ, అజేయుడని పేరున్న రావణాసురుడు అంతిమంగా రామ బాణానికి నేలకూలక తప్పలేదు. మహాభారతంలోని మాయా జూద ఘట్టంతో సహా మనకు ఇటువంటి వృత్తాంతాలెన్నో ఉన్నాయి. ఇతిహాస మోసాలకు మరింత పదును పెట్టిన వాడు ఆధునిక యుగంలో గోబెల్స్. హిట్లర్ దగ్గర ప్రపగాండా మంత్రిగా పనిచేసిన గోబెల్స్, దుష్ప్రచారాలకు పర్యాయ పదంగా మిగిలిపోయాడు. అతని ప్రచారాల అండతో చెలరేగి పోయిన హిట్లర్ కనీవినీ ఎరుగని మారణకాండకు కారకు డయ్యాడు. చివరికి ప్రాణ భయంతో కలుగులో దాక్కొని కుక్కచావు చచ్చాడు. గోబెల్స్ ప్రపగాండా చాతుర్యానికి మరిన్ని కుయుక్తులు చేర్చి ఒక అధునాతన వంచనా శిల్పాన్ని చెక్కిన అపఖ్యాతి మన తెలుగువారైన చంద్రబాబుకూ, ఆయన భాగస్వాములైన యెల్లో మీడియాకూ సంయుక్తంగా దక్కుతుంది. తెలుగువారి ఘనకీర్తిని అంతర్జాతీయ యవనికపై ఎగరేసిన మహానుభావులెందరో మనకున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఇటువంటి అపకీర్తి కలుపుమొక్కలు కూడా కొన్ని మొలకెత్తడం ఒక విషాదం. ఇప్పుడు చంద్రబాబు సహా యెల్లో కూటమి సభ్యులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. జీవన్మరణ సమస్య ఒక కరవాలం మాదిరిగా వారి మెడపై వేలాడుతున్నది. అధికారంలో ఉన్నప్పుడు వీరూ, వీరి అనుయాయులు వేల కోట్ల రూపాయ లను అమరావతి జూదంలో ఫణంగా ఒడ్డారు. రైతుల నుంచి భూసమీకరణ చేయడమనేది బూటకమనీ, ఇందులో అత్యధిక శాతం భూమిని చంద్రబాబు కూటమి సభ్యులే కొనుగోలు చేసి రైతుల పేరు మీద సమీకరణకు ఇచ్చారనే వాస్తవాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో చేసిన ప్రహసనంలో ఆధార్ కార్డులు చూపెట్టి పాల్గొనడానికి అరవై మంది కూడా ముందుకు రాకపోవడంతో ఈ అభిప్రాయానికి బలం చేకూరింది. ప్రైవేట్ అంచనాల ప్రకారం యెల్లో కోటరీ సభ్యులు సోకాల్డ్ భూసమీకరణ మీద పదిహేను వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం వారు అను కున్నట్లు కొనసాగి వుంటే ఇంతకు పదింతలు సంపాదించవచ్చనే ఆశతో వారీ సమీకరణ తంతును జరిపించారు. అచ్చం రియల్ ఎస్టేట్ కంపెనీవాళ్లు విడుదల చేసినట్టే ప్రింటెడ్, డిజిటల్ గ్రాఫిక్ బ్రోచర్లను స్వయానా చంద్రబాబునాయుడే విడుదల చేసిన వైనం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ వెంచర్లో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు యెల్లో ముఠా ఎంత అల్లకల్లోలం చేసిందో కూడా గుర్తుండే ఉంటుంది. కోర్టు మెట్లెక్కి మరీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. నోటిదాకా వచ్చిన లక్షన్నర కోట్ల కేపిటల్ లడ్డూ అందకుండా పోతున్నదని ఈ ముఠా కుమిలి కుమిలి కునారిల్లు తున్నది. శాసన రాజధాని అక్కడే కొనసాగుతుందనీ, పాలనా, న్యాయ రాజధానులను మాత్రమే తరలిస్తామనీ ప్రభుత్వం చెప్పే సమాధానం ససేమిరా మింగుడుపడడం లేదు. అదిగో సచివాలయం, అల్లదిగో అసెంబ్లీ, అటు చూడు హైకోర్టు అని వెంచర్ను ప్రచారం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో చిక్కుకున్నామని ఆందోళనపడుతున్నారు. చంద్రబాబు విడుదల చేసిన బ్రోచర్లను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. కృష్ణానది చీలి అమరావతి నగరం మధ్యలో పారుతున్నట్టు ఒక కల. ఒక కలర్ పిక్చర్. వెనిస్ నగరానికి అమ్మలాగా నగరం మధ్యలో పడవ ప్రయాణం. తాజ్మహల్ అమ్మమ్మ లాంటి కట్టడాలు, వీలైతే పారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ను కొనుగోలు చేసి మన మందడం పక్కన పాతించడం... ఈ రకమైన సెట్టింగ్స్ వేయడమెలాగో తెలుసుకోవడానికి రాజమౌళితో కూడా చంద్రబాబు సంప్రదింపులు సాగించిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రచారానికి ప్లాన్ చేసుకున్న వారికి ఒక్క అసెంబ్లీ ఏం సరిపోతుంది? భూముల విక్రయాల ద్వారా ఆశించిన లక్షన్నర కోట్లే కాదు... ఆ తర్వాత డెవలప్మెంట్ పేరుతో అంతకు రెట్టింపు ఆర్జించే ప్రణాళికను బాబు, ఆయన కోటరీ తయారుచేసుకున్నది. ఇప్పుడా కలలన్నీ కల్లలుగా మారే పరిస్థితి ఎదురుకావడంతో, పెట్టిన పదిహేను వేల కోట్ల పరిస్థితేమిటని బాబు, ఆయన భాగస్వాములు వణికి పోతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే, ఏదో మేరకు డ్యామేజి కంట్రోల్ జరగాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచితీరాలి. సాధ్యమేనా? అసాధ్యమనే సంగతి తెలియనంత అమాయకుడు కాదు చంద్రబాబు. జాతీయ స్థాయిలో ప్రతిష్ట గలిగిన ఒక సర్వే సంస్థ ఒక జాతీయ పార్టీకోసం రాష్ట్రాల వారీగా చేసిన అభిప్రాయ సేకరణ ద్వారా ఈ సంగతి రూఢీ అయింది. తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఇరవై శాతానికి పైగా ఎక్కువ మద్దతున్నట్టు వెల్లడైంది. గడిచిన ఎన్నికల్లో ఈ తేడా పదిశాతం మాత్రమే. ఇప్పుడు వైసీపీ మద్దతు గతంతో పోలిస్తే రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే పెరిగినప్పటికీ తెలుగుదేశం మద్దతు దాదాపుగా పదిశాతం పడిపోయింది. రెండు పార్టీల మధ్యన ఉన్న ఈ అగాధాన్ని దాటాలంటే హనుమంతుని మాదిరిగా లంఘించే పవన విహార విద్య తెలిసి ఉండాలి. గత ఎన్నికల్లో వైసీపీకి యాభై శాతానికి పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఓట్లు తక్కువైనప్పటికీ నూటా యాభయ్యొక్క సీట్లొచ్చాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం యాభై నాలుగు శాతం ఓట్లు వస్తే ఎన్ని సీట్లు రావాలి? ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం నెగ్గుకురావాలంటే ఏం చేయాలి? హనుమంతుడిలా అగాధ లంఘన విద్యను ఎలా అభ్యసించాలి? చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ శిరోభారం నుంచి బయటపడేందుకు చాలాకాలం కిందటే తెలుగుదేశం పార్టీ డబుల్ యాక్షన్ విక్స్వేపోరబ్ వంటి ఒక ద్విముఖ వ్యూహాన్ని రంగంలోకి తెచ్చింది. ఈ డబుల్ యాక్షన్లో ఒకటి మనీ గేమ్, రెండు మైండ్ గేమ్! నాన్–వైసీపీ పార్టీలు, సంస్థ లన్నింటినీ తన నాయకత్వంలో ఒక్క తాటిపైకి తేవాలి. ఇందు కోసం అవసరమైతే మనీ గేమ్కు రెడీ! అధికారం వస్తే ఓ రెండు లక్షల కోట్లను (అమరావతి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా) కొల్లగొట్టే అవకాశం ఉన్నప్పుడు అందులో రెండు శాతమో మూడు శాతమో వెదజల్లితే మాత్రం నష్టమేమిటన్న నిర్ధారణకు యెల్లో కూటమి వచ్చేసినట్టు కనిపిస్తున్నది. ఇక వైసీపీకి జనంలో ఉన్న మద్దతును గణనీయంగా తగ్గించాలి. ఇందుకోసం మైండ్ గేమ్. దీనికి గోబెల్స్ ప్రచారమే ప్రాతిపదిక. కాకపోతే దానికంటే వెయ్యి గిగాబైట్ల సామర్థ్యమెక్కువ. దీన్ని ఆధారం చేసుకొని జనం మెదళ్లతో గేమ్ ఆడటం. వైసీపీ బలం క్షీణించిందనే అభిప్రాయాన్ని జొప్పించడం. ఇందుకోసం ఉపయోగపడే ఒక సందర్భాన్ని వాడుకోవడానికి చాలాకాలం క్రితమే ఆ పార్టీ ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలను శాసనమండలికి జరిగే ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం చాలా అరుదు. ఎప్పుడైనా ఒకటీ అరా సందర్భాల్లో ప్రతిష్టకు పోయి, డబ్బులు వెదజల్లి విపక్షాలను చీల్చినప్పుడు స్వల్ప తేడాతో గెలవడం జరిగేదేమో. అది కూడా ఒకటి రెండు సందర్భాలకు మించి లేవు. ఈ ఓటర్లలో వామపక్షాలకు ఆది నుంచి బలం ఎక్కువ. ఆ తర్వాతి స్థానం బీజేపీది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు ఓటర్లుగా ఉంటారు. సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరూ స్వచ్ఛందంగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవడానికి ఉత్సాహం చూపరు. ఈ పనిని ఎవరో ఒకరు చేసిపెట్టాల్సిందే. వామపక్షాలు, బీజేపీ కార్యకర్తలు ఈ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. పైగా ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, బ్యాంకు ఉద్యోగుల సంఘాల్లోనూ వామపక్షాల పలుకుబడి మొదటినుంచీ ఉన్నది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు, రాయలసీమలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలపై చాలాకాలం క్రితమే టీడీపీ కన్నేసింది. వామపక్ష ఓట్లు, బీజేపీ ఓట్లు తన పార్టీ అభ్యర్థులకు ఎక్కువగా పోలయ్యేలా రహస్య మంత్రాంగం చేసింది. రంగంలో లేని జనసేన ఓట్లు స్వల్పమే అయినా టీడీపీ ఖాతాలో వేసుకున్నది. బీజేపీ, వామపక్షాల ఓట్లు గణనీయంగా టీడీపీకి బదిలీ అయిన ట్రెండ్ లెక్కింపులో కనిపించింది. పశ్చిమ రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పోటీచేసిన ఇండిపెండెంట్ గెలిచారు. ఈసారి ఆయన వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకే ఆధిక్యత లభించింది. యాభై శాతం ఓట్ల మార్కుకోసం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించినప్పుడు టీడీపీ అభ్యర్థి గెలుపొందాడు. మొదటి ప్రాధాన్యతలో పీడీఎఫ్ (లెఫ్ట్), బీజేపీలకు ఓట్లేసినవారు గంపగుత్తగా రెండో ప్రాధాన్యతలో టీడీపీకి వేశారు. టీడీపీ చేసిన రహస్య మంత్రాంగానికి స్పష్టమైన ఉదాహరణ ఇది. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో పీడీఎఫ్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగి స్వల్ప తేడాతో బీజేపీ గెలిచింది. ఈసారి వారి ఓట్లు తగ్గి టీడీపీ అభ్యర్థి గెలిచారు. తూర్పు రాయలసీమలో ఇంతకుముందు పీడీఎఫ్ గెలిచింది. ఇప్పుడు టీడీపీ గెలిచింది. ఇక్కడా అదే పరిస్థితి. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. దానికి మీడియాలో సరైన ప్రాధాన్యత లభించలేదు. ఒక గాలిని పోగేయడం, ఒక మూడ్ను సృష్టించడం కోసం తెలుగుదేశం, యెల్లో మీడియా సర్వశక్తులు ఒడ్డి ఫోకస్ పెట్టాయి. గత కొంత కాలంగా ఉద్యోగుల మనసుల్లో యెల్లో మీడియా నాటుతున్న ప్రభుత్వ వ్యతిరేక విషబీజాల ప్రభావం కూడా ఎంతోకొంత ఉండవచ్చు. ఇంతా చేస్తే మొత్తం పోలయిన ఓటల్లో వైసీపీ అభ్యర్థులకంటే టీడీపీకి వచ్చిన ఓట్లు కేవలం ఆరేడు శాతమే ఎక్కువ. బౌన్సీ పిచ్పై బ్యాటింగ్ చేసిన జట్టు చాలా గౌరవప్రదమైన స్కోరు చేసినట్టే వైసీపీ ఫలితాన్ని పరిగణించాల్సి ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ఈ స్థాయి ప్రభావాన్ని చూపలేదు. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలను గెలుచుకోలేదు. ఇదీ వాస్తవికత. కానీ తెలుగుదేశం యెల్లో మీడియా ప్రభుత్వ వ్యతిరేక పవనం వీస్తున్నదని ప్రచారంలో పెట్టింది. దీన్నే మైండ్ గేమ్ అంటారు. ఎమ్మెల్యేలు ఓటేసే ఎమ్మెల్సీ సీట్లలో ఏడుకు గాను ఒక సీటును టీడీపీ గెలిచింది. విలువలను దిగజార్చడం ఇష్టంలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వదిలేసుకున్న సీటు అది. వదిలేసిన సీటును గెలిచి ఎమ్మెల్యేలలోనూ ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం వీస్తున్నదని డప్పేయడం మొదలుపెట్టారు. చచ్చి పడి ఉన్న ఓ పెద్దపులి గోళ్లను కత్తిరించుకొచ్చి పులిని చంపింది నేనే అన్నాడట పూర్వం ఒకడు. ఇప్పుడు కూడా ఒకాయన రోజూ అంటూనే ఉంటాడు... సెల్ఫోన్ నాదే, కంప్యూటర్ నాదే, టీవీ నాదే, కెమెరా నాదే, హైదరాబాద్ నాదే, బాగ్దాద్ నాదే, దావోస్ నాదే, ఇస్తాంబుల్ నాదే, సింగపూర్ నాదే... ఈరకమైన వ్యవహార శైలికి ఏం పేరు పెట్టాలి? సామాన్య జనుల సాధికారత కోసం, జనాభాలో సగమైన అక్కచెల్లెమ్మలకు సముచిత స్థానంకోసం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రజాస్వామిక విప్లవం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గోబెల్స్ ప్రచారాలతో, మైండ్ గేమ్లతో, మనీ గేమ్లతో ఓడించగలమని భావిస్తే... అది అహంభావమైనా కావాలి... ఉన్మాదమైనా కావాలి. ఈ రెండూ జత కలిసి ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్లో జమిలి నాట్యం చేస్తున్నవి. ఒకడు మీడియాను మాఫియాగా మార్చిన ప్రబుద్ధుడు. అనేకానేక ఆరోపణలు ఎదుర్కొంటున్నా మాయో పాయాలతో న్యాయవ్యవస్థ కళ్లు కప్పుతున్నవాడు. మార్గదర్శి వ్యవహారంలో నేర నిర్ధారణ జరిగి కటకటాల వెనక్కి వెళ్ల వలసినవాడు. మరొకడు రాజకీయ నేత. రాజకీయాన్ని జూదంగా మార్చినవాడు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నవాడు. సవాలక్ష అవినీతి పనులకు కేరాఫ్ అడ్రస్. ఎత్తులతో, జిత్తులతో న్యాయ సమీక్షకు దూరం జరుగుతున్నవాడు. పాపాలు పండుతున్నాయి. ఒక్కొక్క స్కామ్ సాక్ష్యాధారాలతో బద్దలవు తున్నది. నేడో రేపో జైలు ఊచలు లెక్కపెట్టవలసినవాడు. ఇద్దరూ కలిసి ఆంధ్రదేశం కళ్లకు ఇంకెంతకాలం గంతలు కట్టాలి? ఓ అఖిలాంధ్ర మేధావులారా వీరి చట్టవిరుద్ధ చర్యలను ప్రశ్నించరెందుకని? నిజం నిద్ర లేవకముందే అబద్ధాలతో, అభూతకల్పనలతో ప్రభాత భేరీలు మోగిస్తున్న ఆషాఢభూతుల కదలికలపై కన్నేయవలసిన అవసరం లేదా? పేద ప్రజల మేలుకోసం, సామాన్య ప్రజల శ్రేయస్సుకోసం సాగుతున్న యజ్ఞాన్ని తమ స్వార్థంకోసం, సొంత వర్గ ప్రయోజనాల కోసం భగ్నం చేయజూస్తున్న యెల్లో ముఠాను ఎలుగెత్తి ఖండించడం నేటి కర్తవ్యం కాదా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జైలు తప్పదా బాబూ?
తోటకూర కట్ట దొంగిలించినప్పుడే మందలించి ఉంటే బిడ్డ గజదొంగగా మారకపోవు గదా అని బాధపడిందట వెనుకటికి ఒక తల్లి. చిన్ననాటి చేతివాటాన్ని చూసి అప్పుడు ముచ్చట పడింది. పెద్దయ్యాక తొండ ముదరడంతో కంగారు పడింది. మన యెల్లో మీడియాకు మాత్రం అటువంటి కంగారేమీ లేదు. ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు ప్రదర్శిస్తున్న జిత్తులమారితనానికి అది మురిసిపోతూనే ఉన్నది. బాబు వ్యూహం, బాబు ఎత్తుగడ, బాబు మంత్రాంగం వంటి పేర్లతో భజన చేసింది. ఇప్పుడు కూడా అదే వరస. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి పారిపోయినా యెల్లో మీడియా బాణీ మారలేదు. అమరావతి నిర్మాణం కోసం హైదరాబాద్ను వదిలి వచ్చాడని సర్దిచెప్పింది. అది బాబు కమిట్మెంట్గా బాకా ఊదింది. ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ‘ఈనాడు’ పత్రికాధిపతి చంద్రబాబుకు తోడుగా నిలబడ్డాడు. ఇవి రాజ కీయపరమైన ఆరోపణలు కావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కులు ఎన్టీ రామారావు పబ్లిగ్గా చెప్పిన మాటలు. ‘రామోజీరావు గొంతెమ్మ కోర్కెలు నేను తీర్చలేకపోయాను. అందువల్లనే ఆయన నా మీద కత్తిగట్టాడు. చంద్రబాబు నయవంచకుడు. మొదటి నుంచీ అతనివి స్వార్థపూరిత ఆలోచనలే. అదను కోసం నా దగ్గర పొంచి ఉన్నాడు. సమయం రాగానే వెన్నుపోటు పొడి చాడు’ అని రామారావు బహిరంగంగా ఆరోపించారు. ఈ అపవిత్ర కూటమి గురించి ఎన్టీ రామారావు కంటే సాధికారికంగా ఎవరు చెప్పగలరు? అపవిత్ర కూటమికి అందలం దక్కితే పవిత్ర కార్యక్రమాలు చేపడుతుందని ఆశించడం అవివేకం కాదా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనలో వ్యతిరేక వార్తలు లేవు. అన్ని పత్రికలూ ఆస్థాన భజంత్రీలే. ఉపఎన్నికల్లో గెలుపు కోసం ఆ రోజుల్లోనే చంద్రబాబు కోట్లు గుమ్మరిస్తే, ఎన్నికలను జూదంగా మారిస్తే ‘ఆహా చంద్రబాబు చాణక్యం’ అని కీర్తించాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే,ఎంపీలను ఫిరాయింపజేస్తే, స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకున్నా పీఠాలను కైవసం చేసుకుంటే చంద్రబాబు చక్రం తిప్పాడని రాసేవారు. ఇటువంటి చర్యలు తప్పులుగా, ప్రజాస్వామ్య విరుద్ధమైనవిగా యెల్లో ఫోర్త్ ఎస్టేట్కు కనిపించలేదు. కనుకనే బాబు చెలరేగిపోయారు. వ్యవస్థలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నారు. న్యాయ వ్యవస్థలో నెగ్గుకు రావడమెలాగో అభ్యాసం చేశారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీని, జెండాను, బ్యాంకు ఎకౌంట్లను ‘న్యాయ’బద్ధంగా లాగేసుకున్నారు. ఆ అనుభవం అక్కరకొచ్చింది. ఎవరైనా కోర్టుల్లో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకోవడంలో ప్రావీణ్యత సంపాదించారు. ఆయన అవినీతిపై పత్రికలు ఒక్క ముక్కా రాయలేదు. రెండెకరాల కుటుంబ ఆస్తితో రాజకీయ జీవితం మొదలు పెట్టిన చంద్రబాబు వేలకోట్ల ఆస్తులకు పడగెత్తారు. దేశంలోని రాజకీయ నాయకులందరిలోకి చంద్రబాబే సంపన్నుడని తెహల్కా డాట్కామ్ లెక్కలతో సహా ఆనాడే ప్రకటించింది. వామపక్షాలు కూడా ఈయన ఆస్తుల వివరాలతో కరపత్రాలు ప్రచురించాయి. కానీ యెల్లో మీడియా మాత్రం ఏనాడూ బాబు స్కామ్ల జోలికి వెళ్లలేదు. ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు కోరుతూ న్యాయస్థానాల్లో పిటీషన్లు పడితే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ విచిత్రమైన సాకులు చెప్పింది. తమ దగ్గర తగినంత సిబ్బంది లేని కారణంగా బాబు అక్రమాస్తులపై దర్యాప్తు చేయ లేమని న్యాయస్థానానికే చెప్పింది. ఇదీ చంద్రబాబు నిర్వహణా ‘దక్షత’. ఈ దక్షతనే యెల్లో మీడియా నేటికీ వేనోళ్ల కొనియాడు తున్నది. ఏపీ అసెంబ్లీ నుంచి మొన్న జరిగిన కౌన్సిల్ సభ్యుల ఎన్నికలోను చంద్రబాబు చాతుర్యాన్ని యెల్లో మీడియా ప్రశంసించకుండా ఉండలేకపోయింది. 175 మంది సభ్యులున్న అసెంబ్లీ నుంచి ఈ దఫా ఏడుగురిని కౌన్సిల్కు ఎన్నుకోవలసి ఉన్నది. సభలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులుండాలి. కానీ పార్టీతో విభేదించి వేరువేరు సందర్భాల్లో నలుగురు సభ్యులు పార్టీకి దూరంగా జరిగారు. అధికారపక్షం వారు ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం వలన వారు స్వతంత్రంగా ఉంటున్నారు. టీడీపీకి 19 మంది మిగిలారు. ఒక్కరిని కౌన్సిల్కు గెలిపించుకోవడానికి 22 ఓట్లు కావాలి. నికరంగా 19 ఓట్లే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ తన పాత పద్ధతుల్లోనే బేరసారా లకు దిగుతుందని అప్పుడే అర్థమైంది. అందుకు అనువైన వాతావరణాన్ని కూడా వైసీపీ నాయకత్వం కల్పించింది. ప్రజా దరణ కోల్పోతున్న ఎమ్మెల్యేలనూ, గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించడంలో పలుమార్లు విఫలమైన వారినీ వైసీపీ నాయ కత్వం గుర్తించింది. వారిలో కొందరికి హెచ్చరికలు జారీ చేసింది. ఇక బాగుపడే అవకాశం లేని కేసులుగా భావించిన వారిని పిలిచి, ‘వచ్చే ఎన్నికల్లో మీకు టిక్కెట్ ఇవ్వబోవడం లేద’ని నాయకత్వం ఖరాఖండిగా చెప్పేసింది. ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమ అసంతృప్తిని రెండు నెలల కిందనే వెళ్లగక్కారు. తెలుగు దేశం పార్టీతో సఖ్యతగా ఉండటం మొదలుపెట్టారు. పార్టీ కూడా వీరిని దూరం పెట్టి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నది. ఈ రెండు ఓట్లనూ వైసీపీకి లెక్కలోకి తీసుకోలేదు. ఏ అభ్యర్థికీ కేటాయించలేదు. టిక్కెట్ రాదని తెలిసి అసంతృప్తితో ఉండే చేపలను పట్టేందుకు చంద్రబాబు వలవేసి కూర్చున్నారు. ఈ రెండు చేపలూ ముందుగానే పడ్డాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ నాయకత్వానికీ, స్వయంగా ముఖ్యమంత్రికీ కూడా తెలుసు. అయినా సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవడానికే ఆయన కట్టు బడ్డారు. ఓటింగ్ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చారు. ఆరోజు కూడా ఆమెకు టిక్కెట్పై హామీ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ సంగతి యెల్లో మీడియా హెడ్డు ‘ఈనాడే’ రాసింది. తప్పుడు హామీలిచ్చి ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలనుకుంటే చంద్రబాబు వలలో పడ్డ నాలుగు ఓట్లూ వైసీపీ ఖాతాలోనే ఉండేవి. కానీ ఒక సీటును గెలుచుకోవడం కంటే మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమనే నిబద్ధతను ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శించారు. ఇది నాయకత్వ లోపంగా, చాతుర్యం లేకపోవడంగా యెల్లో మీడియా పరిగణిస్తున్నది. వైసీపీలో టిక్కెట్ దొరకదని ఖాయంగా తేలిపోయిన నాలుగు పుచ్చు వంకాయల కొను గోలుకు 50 కోట్లు వెచ్చించడం చంద్రబాబు సమర్థతగా కనిపించింది. తెలుగునాట రాజకీయాలను ఈ స్థాయిలో భ్రష్టుపట్టించిన ఘనత మాత్రం నిస్సందేహంగా బాబు – యెల్లో మీడియా కాంబినేషన్దే! మీడియాలో ఇప్పటికీ పెద్ద సెక్షన్ బాబు వెంటనే ఉన్నది. వ్యవస్థలతో నెగ్గుకు రావడం తనకు తెలిసిన కనికట్టు విద్యే. మిగిలిన ప్రతిపక్షాలను అవసర సమయాల్లో లొంగదీసుకునే వశీకరణ మంత్రం కూడా తెలుసు. కనుక యెల్లో మీడియా దన్నుతో తాను చేసిన లక్షల కోట్ల అక్రమాలు ఎప్పటికీ నిరూ పితం కావనే ధీమా బాబులో ఉండేది. కానీ, ఆయన హిరణ్యకశిపుని కథను మరిచిపోయాడు. పగలు కానీ – రాత్రి కానీ, భూమిపై కానీ – ఆకాశంలో కానీ, ఏ ఆయుధం చేత కానీ, మనిషి చేత – జంతువు చేతకానీ తనకు మరణం సంభవించ కుండా బ్రహ్మను మెప్పించి హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడు. ఆ వరభంగం కాకుండానే నారసింహావతారం ఆ రాక్షసుడిని సంహరించింది. ఎన్ని రక్షణ కుడ్యాలను నిర్మించు కున్నా పాపం చేసినవాడు తప్పించుకోలేడని ఈ కథ మనకు చెబుతున్నది. అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం అనే కార్యక్రమం వెనుక ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం దాగి ఉన్నదని విజ్ఞులందరికీ ఇప్పుడర్థమవుతున్నది. ఇంగితజ్ఞానం కలిగిన సామాన్యులకు సైతం ఆ కహానీ విన్నప్పుడు అదే అభిప్రాయం కలుగుతుంది. రాజధాని డొంకలో గజిబిజిగా అల్లుకున్న వేలాది అవినీతి తీగెల్లో ఒక తీగె యథాలాపంగా ఒకసారి ఆదాయపు పన్ను అధికారుల కాళ్లకు తగిలింది. ఆ తీగె వెంట బయల్దేరితే అది చంద్రబాబు ఇంటి దొడ్లోకి దారితీసింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే ఒక కన్సల్టెంట్ ఇంట్లో ఏదో కేసుకు సంబంధించి సోదాలు చేసిన ఐటీ అధికారులకు అనుకోకుండా అమరావతి లింకు దొరికింది. దాని మీద శోధన మొదలుపెట్టిన అధికారులు ఈ సృజనాత్మక అవినీతికి నోళ్లు వెళ్లబెట్టారు. చివరకు తాము శోధించినంత మేరకు ఒక నివేదికను పొందుపరుస్తూ గడిచిన నవంబర్లో చంద్రబాబుకు నోటీసులు కూడా పంపించారు. ఈ నాలుగు నెలలు విషయం బయటకు పొక్కకుండా ఆపగలిగేందుకు... చక్రం తిప్పే కళ చంద్రబాబుకు ఉపకరించింది. ఇక ఈ నిప్పును ఎంతోకాలం దాచలేడు. సదరు మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే ఆయన షాపూర్జీ పల్లోంజీ అనే కంపెనీకి కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీకి, దాంతోపాటు ఎల్ అండ్ టీకి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పనులను కాంట్రాక్టు ఇచ్చింది. అమరావతిలో సచివా లయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు కొన్ని టిడ్కో ఇళ్లను కూడా అప్పగించారు. ఈ నిర్మాణాల కోసం చదరపు అడుగుకు రూ. పదకొండు వేలకు పైగా చెల్లిస్తున్నారనీ, ఇది అసాధారణమనీ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కానీ కమీషన్లు భారీగా దండుకోవాలంటే ఆ మాత్రం ఉండాలని బాబు ప్రభుత్వం భావించింది. 2019 జనవరిలో తమకు రావాల్సిన కమీషన్లలో కొంత భాగాన్ని తను కోరు కున్నట్టుగా బదిలీ చేయించుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. తన పీఏ శ్రీనివాస్, లోకేశ్ పీఏ రాజేశ్లకు టాస్క్ను అప్పగించారు. వారు మనోజ్ వాసుదేవ్తో మాట్లాడి తాము చెప్పిన కొన్ని సూట్కేస్ కంపెనీల్లోకి నిధుల్ని బదిలీ చేయాలని ఆదేశించారు.అలా చెల్లించడానికి మొదట షాపూర్జీ కంపెనీ ప్రతినిధులు అశక్తత వ్యక్తం చేశారట! కావాలంటే పార్టీ ఫండ్గా ఇస్తామని ఆఫర్ చేశారట. అందుకు బాబు పీఏ శ్రీనివాస్ అంగీక రించకుండా తాము చెప్పినట్లు చేయకపోతే పెండింగ్ బిల్లులు ఆపేస్తామని బెదిరించారు. దీంతో చేసేదిలేక కంపెనీ ప్రతి నిధులు శ్రీనివాస్ చెప్పినట్టే చేశారు. మనోజ్ వాసుదేవ్ను పిలిచి అర్జెంట్గా డబ్బులు కావాలని చంద్రబాబు చెప్పడంతో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి 52 కోట్ల 50 లక్షలను హయగ్రీవ, అన్నై, షలాకా కంపెనీల్లో, 62 కోట్ల 90 లక్షలు నవొలిన్, ఎవరెట్ కంపెనీల ఖాతాల్లోకి వేయించాడు. ఎల్ అండ్ టీతో మాట్లాడి 41 కోట్ల 90 లక్షలు బోగస్ కంపెనీల్లో వేయించాడు. ఈ కంపెనీల నుంచి మొత్తం 157 కోట్ల రూపాయలు రామోజీ చిన్నకొడుకు వియ్యంకుడైన ఆర్వీఆర్ రఘు, మరికొందరి కంపెనీల్లోకి బదిలీ అయ్యాయి. వారు ఆ సొమ్మును చంద్రబాబుకు చేర్చారు. ఇవి కాకుండా దుబాయ్లో చంద్రబాబుకు స్వయంగా క్యాష్ రూపంలో 15 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన దీరామ్లను అంద జేసినట్టు కూడా మనోజ్ వాసుదేవ్ ఐటీ అధికారుల ఎదుట వాఙ్మూలాన్నిచ్చాడు. ఈ విషయాలన్నీ నిజమేనని బాబు పీఏ శ్రీనివాస్ కూడా అధికారుల ఎదుట అంగీకరించి సంతకం చేశాడు. మనీలాండ రింగ్ అంశం కూడా ఇమిడి ఉన్నందువలన నేడో రేపో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నది. పక్కా సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో జైలు శిక్షను తప్పించు కోవడం దాదాపు అసాధ్యమే. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన మరో స్కామ్లో వివిధ బోగస్ కంపెనీల ద్వారా 371 కోట్ల రూపాయలు చంద్రబాబు ఇంటిదారి పట్టాయి. ఈ వ్యవహా రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడమే కాకుండా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇక్కడ స్కిల్లూ లేదూ, డెవలప్మెంటూ లేదు. ప్రజాధనం మాత్రం చంద్రబాబు జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు చేరింది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్ అనే కంపెనీ ఉదారంగా ముందుకు వచ్చిందనీ, ప్రాజెక్టు విలువ 3,356 కోట్లనీ, అందులో 90 శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందనీ, మనం పదిశాతం పెడితే సరి పోతుందనీ చంద్రబాబు కేబినెట్లో చెప్పారు. ఆ తర్వాత జీవోలో కూడా అదే విషయం చెబుతూ రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆ క్లస్టర్లలో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఉంటుందని చెప్పారు. చివరకు ఒప్పందంలోకి వచ్చేసరికి సీమెన్స్ గ్రాంటు ప్రస్తావన లేదు. కొసమెరుపు ఏమిటంటే ఒప్పందం చేసుకున్నది కూడా సీమెన్స్ సంస్థతో కాదు. అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో! విషయం తెలిసి కంపెనీ ఆ ఉద్యోగులను తొలగించింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. సీమెన్స్ గ్రాంటు రాలేదు కానీ ప్రభుత్వం పెట్టాల్సిన పదిశాతం పన్నులతో కలిపి 371 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా ప్రయాణం చేసి చంద్ర బాబు ఇంటికి చేరుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు సాక్ష్యాధారాలు లభించిన ఈ రెండు కేసులూ చంద్రబాబు అవినీతి పురాణానికి సంబంధించిన టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. తవ్వాల్సిన కొండ ఇంకా చాలా ఉన్నది. ఇప్పటికే వెలుగు చూసిన కొండ కొస అంచు కూడా చాలు – బాబుకు శిక్ష పడేందుకు! అందుకే ఆయనలో భయం పెరిగింది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గజగజ వణుకుతున్నాడనే పాట మొదలుపెట్టాడు. యథా బాప్... తథా బేటా! పితాశ్రీని చూసి సుతాశ్రీ కూడా మొదలుపెట్టాడు. నన్ను చూసి జగన్ భయపడుతున్నాడనీ పాదయాత్రకు వచ్చే కార్య కర్తలకు వినోదాన్ని పంచుతున్నాడు. సుతాశ్రీ డైలాగులు వింటుంటే కిల్ బిల్ పాండే (బ్రహ్మానందం క్యారెక్టర్) గుర్తు కొస్తున్నాడని కార్యకర్తలు మురిసిపోతున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పబ్లిక్ పాలసీ – ‘పట్టభద్ర’త
చేరవలసిన గమ్యం ఎంత దూరమున్నా, దారంతా గతుకు లున్నా, చీకటి ముసురుకొస్తున్నా, చేతిలో చిన్న దీపం లేకున్నా గుండెలో ధైర్యం ఉంటే చాలంటాడు కవి తిలక్. లోకరీతి పలుకు బడి గలవారి పక్షం వహిస్తున్నప్పుడు, సాంఘిక న్యాయం శాప గ్రస్తమైనప్పుడు న్యాయం పక్షాన నిలబడటానికి కూడా ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం దారి చూపినప్పుడే చరిత్ర కూడా కొత్త మార్గాలను అనుసరిస్తుంది. లోకరీతిని సవరిస్తుంది. ‘నేను యుద్ధం చేస్తున్నది పెత్తందార్లతో. నా ఎకనామిక్స్, నా పాలిటిక్స్ పేదవర్గాల ప్రజలకోసమ’ని ఏపీ అసెంబ్లీలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం చేసిన యుద్ధ ప్రకటన ఇది. సరకులు, ఉత్పత్తి, మార్కెట్లు, లాభాలు, డిమాండ్, సప్లై వగైరాలు ముమ్మరించిన తర్వాత భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బు చుట్టూ తిరగడం ప్రారంభించింది. తన చుట్టూ పరిభ్రమించే భూమ్మీద ఆట నియమావళిని అప్పటినుంచే డబ్బు రూపొందిస్తున్నది. ఎక నామిక్స్ పితామహుడుగా భావిస్తున్న ఆడమ్ స్మిత్ జన్మించి ఈ సంవత్సరానికి సరిగ్గా మూడొందల యేళ్లయింది. ఎకనామిక్స్ వయసు కూడా ఇంచు మించు అంతే! ఆయన రాసిన ‘జాతుల సంపద’ అనే ఉద్గ్రంథం లేజేఫెయిర్ (స్వేచ్ఛా వాణిజ్యం) ఎకనామిక్స్ పాలిటి పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథం వెలుగులోనే మన పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థ ఈనాటికీ కొన్ని మార్పు చేర్పులతో వెలుగు లీనుతున్నది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిబంధనావళిని గతంలో చాలామంది సవాల్ చేశారు. కారల్ మార్క్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎకనామిక్స్ను పేద ప్రజల పక్షాన పునర్నిర్మించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు పెను సంచ లనాలకు కారణమయ్యాయి. అయినప్పటికీ ఆడమ్ స్మిత్ను మార్క్స్ పూర్తిగా ఓడించలేకపోయారు. కాలాను గుణమైన మార్పులతో ఆడమ్ స్మిత్ కొనసాగుతూనే ఉన్నాడు. అయినా వ్యవస్థలో సమానత్వం కోసం సాగు తున్న పోరాటాలు ఆగలేదు. ‘మానవ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే’ అని మార్క్స్ ప్రకటించినట్లుగానే, సమా నత్వం కోసం జరిగే పోరాటాల చరిత్రగా థామస్ పికెటీ అభివర్ణిస్తున్నారు. ఈయన ఫ్రెంచి ఆర్థికవేత్త. చరిత్రలో జరిగిన యుద్ధాలు, విప్లవాలు, విధ్వంసం, వ్యవస్థల మార్పు వగైరా పరిణామాల్లోంచి కూడా క్రమంగా మానవ సమాజం సమానత్వం వైపు కొద్దికొద్దిగా పురోగమించిందని పికెటీ సూత్రీకరించారు. గతంతో పోలిస్తే లింగ, జాతి వివక్షలు కొంచెం తగ్గాయి. ఆర్థిక వనరుల పంపిణీ మెరుగైంది. మెజారిటీ ప్రజలకు విద్య, వైద్యం అందు బాటులోకి వస్తున్నది. పౌరులకు హక్కులు సంక్రమి స్తున్నాయి. ఈ మార్పులకు కారణమైన విద్య, వైద్య, సాంఘిక, ఆర్థిక, న్యాయ వగైరా వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారాసంపూర్ణ సమానత్వం వైపు పయనించవచ్చని ఈ తరహా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంటే పేద, ధనిక, కుల, మత, లింగ ప్రాంత భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానావ కాశాలు కల్పించడం, సమాన స్థాయిలో పోటీ పడగలిగేలా ప్రభుత్వ వ్యవస్థలు అండగా నిలవడం ద్వారా సమానత్వ సాధన సులభ సాధ్య మవుతుందని వారి అభిప్రాయం. ఆర్థికవేత్తలే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఇందుకోసం ప్రయత్నించిన ఉదాహరణలు లేకపోలేదు. భారతదేశంలో పరిమితమైన వనరులతో కూడిన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వ వ్యవస్థల దన్నుతో సమా నత్వ సాధనకు కృషి చేస్తున్న వారిలో అతి ముఖ్యమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృత స్థాయిలో సమానత్వ సాధనకు కృషి చేసి ఉండలేదు. నాణ్య మైన విద్య, మెరుగైన వైద్యం ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి జగన్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఇంత వరకు జరగలేదు. విత్తు నుంచి విపణి వరకు రైతును చేయి పట్టుకొని నడిపించే విస్తృతమైన రైతు భరోసా కార్యక్రమం చరిత్రలో ఇదే మొదటిసారి. వెనుకబడిన కులాలన్నింటికీ కార్పొరేషన్ల ఏర్పాట్ల ద్వారా ఆత్మగౌరవ ప్రకటన చేయించారు. దేవాలయ కమిటీలతోపాటు, అన్ని నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు, మహిళలకు సింహభాగం వాటా కల్పించారు. రాష్ట్ర మంత్రిమండలి నుంచి పెద్దల సభల వరకు అత్యధిక పదవులు బలహీనవర్గాలకు కేటాయించారు. ఆర్థిక రంగంలో పేదల అనుకూల విప్లవాన్ని స్వయంగా ప్రభుత్వమే ప్రారంభించింది. బటన్ నొక్కడం ద్వారా లబ్ధి దారుల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షలకోట్ల రూపాయలను బదిలీ చేసింది. ప్రభుత్వ ఆసరాతో బలం పుంజుకున్న డ్వాక్రా సంఘాలు సకాలంలో అప్పులు చెల్లిస్తున్నందు వలన లక్ష కోట్ల రూపాయలకు పైగా వాటికి బ్యాంకుల రుణాలు లభించాయి. ఈ మొత్తం ఇంకా పెరుగుతూ వస్తున్నది. ఇక్కడే మూడు లక్షల కోట్ల రూపాయలు పేద వాడలను చుట్టేస్తూ ప్రవహిస్తున్న వైనం మన కళ్లకు కనబడుతున్నది. గతంలో సంక్షేమం పేరుతో కేటా యించిన పద్దుల్లోంచి అవినీతి కమీషన్లు పోనూ మిగిలిన సొమ్ము మాత్రమే ఈ వాడల్లోకి బట్వాడా అయ్యేది. పేద మహిళల పేర్ల మీద ఇంటి స్థలాలను కేటాయించి ఇళ్ల నిర్మాణం మరో హెర్క్యులస్ టాస్క్! ప్రభుత్వం తలపెట్టిన 30 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే కనీస పక్షం ఒక్కో ఇంటికి పది లక్షల చొప్పున మరో మూడు లక్షల కోట్ల ఆస్తి పేద మహిళల చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మరో ప్రత్యేక శ్రద్ధ వలన దాదాపు లక్షకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొత్తగా వచ్చి చేరాయి. పది లక్షలమందికి పైగా అదనంగా ఉపాధి దొరికింది. ఇందులో అత్యధికులు దిగువ మధ్యతరగతి వర్గ ప్రజలేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవ సరం లేదు. ‘నాడు–నేడు’ కింద చేపట్టిన విద్య–వైద్య సంస్థల పునరుజ్జీవనం గురించి, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి వేలాది గ్రామీణ సెక్రటేరియట్లు, ఆర్బీకే కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డీబీటీ కాకుండా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన లక్షల కోట్ల కిమ్మతు చేసే కార్యక్రమాల గురించి కూడా చర్వితచర్వణం అవసరం లేదు. ప్రపంచంలోని తత్వవేత్తలెందరో స్వప్నించిన విధంగా, మన దేశ రాజ్యాంగ నిర్మాతలు అభిలషించిన విధంగా సంపూర్ణ సమానత్వానికి వేగంగా బాటలు వేయగల కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. మెజారిటీ ప్రజలకు ఇది స్వాగతించదగిన కార్యక్రమమే కావచ్చు. కానీ పాతకాలపు వ్యవస్థలో ప్రయోజనం పొందుతున్న పెత్తందారీ వర్గాలకు ఇది కంటగింపు కలిగించే కార్యక్రమమే. అందుకే ఈ వర్గాలు కత్తిగట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం మినహా మిగిలిన అన్నిరకాల పబ్లిక్ సంస్థలపై, వ్యవస్థలపై ఈ పెత్తందార్ల పట్టు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చూపెట్టగల సామర్థ్యం ఇంకా ఈ వర్గాలకు ఉన్నది. తాము చెప్పిందే న్యాయంగా, తాము చెప్పిందే ధర్మంగా, తాము చెప్పిందే అభివృద్ధిగా ఒప్పించగల నైపుణ్యం ఇంకా పెత్తందార్లకు ఉన్నది. ఎందుకంటే ఇంతకాలం గేమ్ రూల్స్ను నిర్ణయించింది వీరే కనుక. మీడియా వీరి చేతిలో ఉన్నది. వ్యవస్థలు వీరి చేతిలో ఉన్నాయి. జగన్ ప్రభుత్వ సమానత్వ ఎజెండా వలన ప్రజలు సోమరిపోతులవుతున్నారని ప్రచారం మొదలు పెట్టింది. అభివృద్ధి ఆగిపోయిందనే భ్రాంతిని సృష్టి స్తున్నది. జగన్ ప్రభుత్వ కార్యక్రమాల వలన ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న అరవై నుంచి డెబ్బయ్ శాతం పేద వర్గాలకు పైనున్న వర్గాల్లో విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టింది. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి శ్రేణుల మెదళ్లను కలుషితం చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వో ద్యోగుల్లో కొందరు, ఉన్నత ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఈ శ్రేణుల్లోకి వస్తారు. పేద ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు పయనింప జేయడంలో ముందువరసన నిలబడవలసిన వారు ప్రభుత్వోద్యోగులు. పేద ప్రజలూ – ప్రభుత్వోద్యోగులు శత్రు వర్గాలు కాదు. ప్రభుత్వోద్యోగుల్లో మెజారిటీ పేద వర్గాల నుంచి వచ్చిన వారే. రాజ్యాంగ లక్ష్యాల మేరకు పేదలకు అండగా నిలబడ వలసిన వారు కూడా ప్రభుత్వో ద్యోగులే. పేద ప్రజల ప్రయోజ నాలకు వ్యతిరేకంగా వీరిలో కొందరి మనసులను కలుషితం చేయడంలో పెత్తందార్లు విజయం సాధించడం ఒక విషాదం. రాష్ట్ర ప్రభుత్వ విధా నాలు పెత్తందార్లకు వ్యతిరేకం. తమకు వ్యతిరేకమైన ప్రభు త్వాన్ని ఉద్యోగ వ్యతిరేకిగా ఉద్యోగుల ముందు చిత్రించే ప్రయత్నం పెత్తందారీ వర్గం చేస్తున్నది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లోనూ పెత్తందారీ వర్గం ఈ ప్రయత్నాలను యథేచ్ఛగా చేసింది. ఇంత చేసినా వారు ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? నెరవేరిందని ఎల్లో మీడియా, కొందరు విశ్లేషకులు, జగన్ ప్రభుత్వ వ్యతిరేకులు ఢంకా భజాయిస్తు న్నారు. ఇదెంతవరకు వాస్తవం? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా పట్ట భద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన దృష్టాంతాలు చాలా తక్కువ. ఈ పరిణామం కొత్తది కాదు. ఈసారి రెండు స్థానాలను టీడీపీ గెలవడం, మూడో స్థానంలో గట్టి పోటీలో గట్టెక్కడం వెనుక ప్రత్యేక కారణాలు న్నాయి. ఒకటి – ఈ ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉండే ప్రభుత్వోద్యోగులలో ప్రభుత్వ వ్యతిరేకత నింపడం, రెండు – ఈ నియోజకవర్గాల్లో సంప్రదాయకంగా బలంగా పోటీ పడే పీడీఎఫ్ (సీపీఎం అనుకూలురు) అభ్యర్థులు పేలవ మైన పోటీ ఇవ్వడం (తమ ఓట్లను గంపగుత్తగా టీడీపీకి బదిలీ చేయడం కారణం). మూడు – గతంలో ఉత్తరాంధ్రలో గెలిచిన బీజేపీ ఓట్లు కూడా టీడీపీకి బదిలీ చేయడం. నాలుగు – టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర, తూర్పు రాయల సీమల నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఓటర్లలో విస్తృత పరిచయాలు కలిగి ఉండడం, ఏడాది కాలంగా వారు ఓటర్ల నమోదు, ప్రచార కార్య క్రమాల్లో నిమగ్నమై ఉండటం. ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కారణాలు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ మూడింటిలో ఒక్కటి మాత్రమే (పశ్చిమ రాయలసీమ) గతంలో వైసీపీ మద్దతుతో ఇండిపెండెంట్ గెలిచిన సీటు. మిగిలిన రెండు సీట్లలో వైసీపీ ఎన్నడూ పోటీ చేయలేదు. ఆ ఒక్క సీటులోనూ తొలి లెక్కింపులో ఆధిక్యతను నిలబెట్టుకున్నది. రెండో లెక్కింపులో బీజేపీ – పీడీఎఫ్ ఓట్ల సాయంతో టీడీపీ గెలవగలిగింది. ఇక ఈ మూడు సీట్లలో గెలుపుతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినట్టేనని ఎల్లో మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయనీ, వాట న్నింటిలో టీడీపీ గెలిచినట్టేనని ‘ఈనాడు’ గాలిమేడలు కట్టేసింది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ – పీడీఎఫ్ అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీకి గానీ, సీపీఎంకు గానీ చెరో అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. చిత్తూరు నుంచి తూర్పు గోదావరి వరకు మూడు పట్టభద్రుల స్థానా లనూ పీడీఎఫ్ గెలిచింది. ‘ఈనాడు’ లెక్క ప్రకారం సీపీఎంకు ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చి ఉండాలి? అరవై శాతం పేద వర్గాల్లో గణనీయమైన పలుకుబడితో ఉన్న వైసీపీ ప్రభావాన్ని తక్కువ చేసి చూపడం కోసం,కొంతమందిని ప్రభావితం చేయడం కోసం ఎల్లో మీడియా ప్రచారం ఉపయోగపడవచ్చేమో కానీ ఫలితాలను తారుమారు చేయగలంత బలమైన సీన్ ఈ సినిమాలో లేదు. కాకపోతే వరస విజయాలతో మత్తెక్కి ఉన్న వైసీపీ మత్తేభానికి పట్టభద్రులు సరైన సమయంలో వాతలు పెట్టినట్టు భావించాలి. ఆ మేరకు పట్టభద్రులకు వైసీపీ కృతజ్ఞతతో ఉండాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వినాశ కాలే విపరీత బుద్ధిః
రక్తబీజుడు అనే అసురుని వృత్తాంతం మన పురాణాల్లో ఉన్నది. ఈ కథను చాలామంది వినే ఉంటారు. ఆ రాక్షసుడు అతిభయంకరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని వశపరచుకొని దారుణమైన ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. వాడి ఒంటి నుంచి రాలే ఒక్కో రక్తపు బొట్టులోంచి ఒక్కో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అలా పుట్టుకొచ్చిన జూనియర్ రక్తబీజులు కార్చే ప్రతి రక్తపు బొట్టులోంచి ఒక్కో సబ్జూనియర్ రక్తబీజుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా ఒక్క నెత్తురు చుక్క నుంచే వేలమందితో కూడిన సైన్యాన్ని సృష్టించుకోగల వరాన్ని పొందడంతో వాడు చెలరేగి పోయాడు. అతడి దాష్టీకానికి, దోపిడీకి అతల సుతల సురాతల భూతలాది చతుర్దశ లోకాలూ గజగజ వణికిపోయాయి. దేవతలు హడలిపోయి పాహి... పాహి అంటూ పరుగులు తీశారు. చివరికి సర్వశక్తి స్వరూపిణి పార్వతీదేవి కాళీమాత అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. దైత్యుని దునుమాడి ఆ తల్లి లోకాలను కాపాడుకున్నదని దేవీ మహత్యం కథ ద్వారా మనకు తెలుస్తున్నది. మహాకాళి తొమ్మిది ఛాయల్లో ఒకరు మన బెజవాడ కనకదుర్గమ్మ. అమ్మవారు కొండ మీద వేంచేసి ఉండగా కొండ కింద రక్తబీజుని అంశతో కూడిన రాజకీయాలు నేటికీ జరుగు తుండటం ఒక విషాదం. సాక్షాత్తూ అమ్మవారి సమక్షంలో క్షుద్రపూజలు కూడా చేసి రక్తబీజుని వారసత్వాన్ని ఈ ‘అంశాం’ కురాలు ఘనంగా చాటుకున్నాయి. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టాలు తప్పకుండా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో కూడిన పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రమైన మూడు స్తంభాలుగా వ్యవహరించాలని భావించారు. మీడియాను నాలుగో స్తంభంగా గౌరవించారు. ఎలక్షన్ కమిషన్, విజిలెన్స్ కమిషన్ వగైరాలను స్వతంత్ర సంస్థలుగా రూపొందించారు. రాజకీయ నాయకత్వం వ్యవస్థల మీద దండయాత్ర చేసి నియంతృత్వంలోకి దేశాన్ని మళ్లించకుండా పలు చర్యలను తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యవస్థల మీదకు రాజకీయ నాయకత్వం జరుపుతున్న దండయాత్రలపై పలుమార్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బహిరంగ దండయాత్రలు కాకుండా చాపకింద నీరు మాదిరిగా వ్యవస్థల్లోకి పాక్కుంటూ వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే విద్యలో పీహెచ్డీ చేసిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు ఒక్కడే. ఈ పాకుడు కళతోనే ముప్పయ్యేళ్లుగా ఆయన రాజకీయాల్లో కొనసాగగలుగుతున్నారు. రక్తబీజుడు వెదజల్లే నెత్తురులోంచి సైన్యాన్ని తయారుచేసుకున్నట్టు ఈయన వివిధ వ్యవస్థల్లో తన సైన్యాన్ని తయారుచేసుకున్నాడు. అందుకోసం ఏం వెద జల్లాడనేది రహస్యం. మీడియా అధిపతులను వ్యాపార మిత్రులుగా, ఆశ్రిత పెట్టుబడిదారులుగా మార్చుకొని, వారిచేత జేజేలు కొట్టించుకొని ఒక నాయకునిగా వ్యవహారంలోకి వచ్చాడు. ఈ మీడియా భజన కార్యక్రమం శ్రుతి మించడంతో అది ఎల్లో మీడియాగా ఏనాడో అప్రతిష్ఠను మూటకట్టుకున్నది. న్యాయ వ్యవహారాల్లో ఎలా నెగ్గుకు రావాలో చంద్ర బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఏ తెలుగువాడిని అడిగినా టక్కున చెప్పేస్తాడు. బెంచ్ హంటింగ్, నాట్ బిఫోర్ వంటి కోర్టు పదజాలం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించుకున్నాడనీ, దాని జెండాను, ఎన్నికల గుర్తును తానే డిజైన్ చేసుకున్నాడనీ నాటి తెలుగు ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఆశ్రయం కోరుతూ ఒక శరణార్థి మాదిరిగా చంద్రబాబు ప్రవేశించాడని కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ఆ పార్టీపై దురాక్రమణ చేసి హైకోర్టు ద్వారా దానికి న్యాయ ముద్రను వేయించుకున్న బాబు లాఘవం గురించి కూడా ప్రజలకు తెలుసు. ఎన్ని కేసులు వచ్చినా దర్యాప్తు జరక్కుండా స్టేలు తెచ్చుకోగల చాకచక్యం గురించి కూడా తెలుసు. రాజకీయ ప్రత్యర్థుల మీద శూన్యంలోంచి అభియోగాలు సృష్టించి పకడ్బందీగా కేసులు నడపగల దిట్ట అని కూడా తెలుసు. కీలకమైన అనేక పబ్లిక్ విభాగాల్లో, దర్యాప్తు సంస్థల్లో తనకు అనుకూలమైన మానవ వనరులను గుప్పిట్లో పెట్టుకోవడంలో ఈయన ప్రావీణ్యం సంపాదించినట్టు ఇప్పటికే రుజువైంది. సీబీఐ, ఐటీ, విజిలెన్స్ వగైరా విభాగాల్లోని కొందరు వ్యక్తులు గతంలో చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించారని చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా వ్యవహరించిన ఒక అధికారి చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా ఎముకలు మెడలో వేసుకొని మరీ వ్యవహరించిన తీరు తెలిసిన విషయమే. బాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన అధికారి పచ్చ కండువాను బహిరంగంగా కప్పుకోవడం మాత్రమే మిగిలింది. ఆయన అప్రకటిత తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి చంద్రబాబుకు రామోజీ వంటి మీడియా అధిపతులు తోడుగా నిలబడి గడిచిన పాతిక ముప్పయ్యేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుపుతున్న అత్యాచారాల కథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రామోజీ గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గనందువల్లనే, అక్రమాలకు సహకరించనందువల్లనే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని ఎన్టీ రామారావు స్వయంగా ఆరోపించారు. హైదరాబాద్ శివార్లలో ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఈ అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటు పూర్తిగా ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ రామోజీ వాటిని యథేచ్ఛగా కొనుగోలు చేసి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ‘నాలా’ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు, ఫిలిం సిటీలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు 147 ఉన్నాయని ప్రభుత్వ అధికారులే లెక్క తేల్చారు. 600 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కింద రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టిన 16 ఎకరాల భూమిని కూడా రామోజీ తన కబ్జాలోనే ఉంచుకున్నారు. ఆ స్థలాన్ని అప్పగించాలని పలుమార్లు సీపీఎం ఆధ్వర్యంలో పేద ప్రజలు ప్రదర్శనగా వెళ్లారు. వారిని తరిమికొడుతున్నాడే తప్ప వారి భూమిని వారికి ఇప్పటికీ అప్పగించడం లేదు. తన ఫైవ్స్టార్ ఫిలిం సిటీ పక్కన పేదల ఇళ్లేమిటనే అసహ్య భావనతోనే రామోజీ వారిని తరిమేస్తున్నాడని అనుకోవాలి. ఈ అపూర్వ సహోదరుల భావసారూప్యత చూడండి. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టుకే వెళ్లిన చంద్రబాబు.. ఫిలిం సిటీ చేరువలో పేదల ఇళ్లుంటే గ్లామర్ దెబ్బతింటుందని ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి లబ్ధిదారులు రాకుండా తరిమేస్తున్న వ్యక్తి రామోజీ.. ఇద్దరి ఐడియాలజీ పెత్తందారివర్గ ప్రయోజనాలే అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా? ఇద్దరూ పేద ప్రజల సాధికారత బద్ధవిరోధులే అని చెప్పడానికి ఎన్ని దుష్టాంతాలు కావాలి? ప్రభుత్వ స్కూళ్లను బాగుచేస్తుంటే, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుంటే వీరూ, వీరి అనుబంధ ఎల్లో మీడియా సంయుక్తంగా కళ్లల్లో నిప్పులు పోసుకోలేదా? పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెబుతుంటే గగ్గోలు పెట్టలేదా? ఇప్పటికీ పెట్టడం లేదా? రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని రామోజీ బాహాటంగా ఉల్లంఘించిన విషయం ప్రజలకు తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఆయన 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లను వసూలు చేశారు. ఈ నేరానికి రెండేళ్ల జైలు, రెట్టింపు సొమ్ము అంటే రూ. 5,200 కోట్ల జరిమానా పడాలి. కానీ రిలయన్స్ దగ్గర అప్పుచేసి ఆ సొమ్ము తిరిగి చెల్లించాను కనుక కేసు తూచ్ అంటున్నారు రామోజీ. దొంగతనం బయటపడిన తర్వాత ఆ దొంగసొత్తును వెనక్కు ఇచ్చేస్తే శిక్ష ఉండదా? భారత శిక్షాస్మృతిలో అటువంటి వెసులుబాటు ఏమైనా ఉన్నదా? చంద్రబాబు అండ్ కో లోని కీలక సభ్యులంతా ఇటువంటి గురువింద గింజలే. ఈ గింజలన్నీ కలిసి ఇప్పుడొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ముఠాలోని కమెండోల్లాంటి కీలక సభ్యులను ముందుజాగ్రత్త కోసం చంద్రబాబు ఎప్పుడో బీజేపీలో చేర్పించారు. తమ ప్రయోజనాల కోసం ఏ గడ్డి కరిచేందుకైనా, ఏ జెండా మోసేందుకైనా ఏమాత్రం సిగ్గుపడని షార్ప్ షూటర్స్ వీళ్లంతా. చంద్రబాబుకు అనుకూలంగా జాతీయస్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమంలో వీళ్లంతా ఇప్పుడు బిజీగా మారిపోయారు. నిత్య అసత్య వ్రత కథనాలతో ఎల్లో మీడియా విరుచుకుపడుతున్నది. వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన డమ్మీ రక్తబీజులంతా ఏకకాలంలో ఒకే రాగం తీస్తున్నారు. విషయం సుస్పష్టం. సాఫ్ సీదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా చెప్పినట్టు ఇప్పుడక్కడ వర్గపోరు జరుగుతున్నది. పేదల అనుకూల విధానాలను జగన్ ప్రభుత్వం ప్రబలంగా అమలు చేస్తున్నది. పెత్తందారీవర్గ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న బాబు–రామోజీ ముఠా స్వార్థ ప్రయోజనాలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ట్రెజర్ హంట్ స్వప్నం కరిగిపోతున్నది. రాజధాని పేరుతో తలకెత్తుకున్న లక్షల కోట్ల వ్యాపారం చెదిరిపోతున్నది. భూములపై పెట్టుబడి పెట్టిన వారిలో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల దాకా ఆగేంత ఓపిక లేదు. ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ లేదు. కోట్ల రూపా యలు తగలేసి మూడు నెలలకోసారి నిపుణుల చేత చేయించుకుంటున్న సర్వేలు వెక్కిరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అంతో ఇంతో ఓట్ల శాతం పెరగాలి. గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఫిబ్రవరి మొదటివారంలో వచ్చిన సర్వే ఫలితాలు కరకట్ట అతిథిగృహం గుండెల్లో డైనమైట్లను పేల్చాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుణంగా 26 శాతానికి పడిపోయిందని సర్వేలో వెల్లడైంది. గడిచిన మూడు నెలల్లో ఐదు శాతం పతనం. ఈ స్థాయి పతన దశలో వున్న పార్టీ బతికి బట్టగట్టి ఏడాది లోపల ఎన్నికలకు సమాయత్తం కావడం అసాధ్యం. ఈ సర్వే ఫలితాలను ఎంత రహస్యంగా ఉంచుదామనుకున్నా కుదరలేదు. పార్టీ శ్రేణుల్లో చాలామందికి తెలుసు. మిత్రపక్షాలకూ తెలుసు. మన బలాన్ని బట్టే కదా పొత్తు కుదుర్చుకునేవారు బేరమాడేది. ఈపాటికే బయల్దేరవలసిన పవన్ కల్యాణ్ వారాహి రథం ఎందుకో బయల్దేరలేదు. ఎల్లో ముఠాకు కవి హృదయం అర్థమైంది. కడుపుమంట పుట్టుకొచ్చింది. పవన్ కల్యాణ్కు కేసీఆర్ వెయ్యి కోట్లతో బేరం పెట్టారని బ్లాక్ మెయిలింగ్కు దిగింది. ఐననూ కదలిక లేదు. బహుశా ఇప్పటికే కుదిరిన ఒప్పందాన్ని తిరగరాయాల్సి రావచ్చు. లోకేశం బాబు శనివారం నాడు ఎన్టీఆర్ బావకు నర్మగర్భంగా ఆహ్వానం పలి కాడు. ఇదొక విశేషం. లోకేశం బావ కారణంగానే ఎన్టీఆర్ బావ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడనేది బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న స్థితి నుంచి పైకి లేపడానికి ఎన్టీఆర్, పవన్ కల్యాణ్లే కాదు... అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి క్రేన్లను ఉపయోగించినా ఫలితముండదు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై కట్టుకథల ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. ప్రభుత్వం జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న ప్రతి సందర్భంలోనూ మీడియా దృష్టి మళ్లించేందుకు ఏదో ఒక రభసను సృష్టించే ప్రయత్నాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. నవంబర్ సర్వే ఫలితాల తర్వాత వేగాన్ని మరింత పెంచింది. ఫిబ్రవరి ఫలితాలతో పార్టీ పెద్దలతోపాటు మీడియా పెద్దలు కూడా విచక్షణ కోల్పోయారు. అనపర్తిలో, గన్నవరంలో గోక్కోవడం ఈ విచక్షణా రాహిత్యంలో భాగమే. ఎన్ని అసత్యాలు రాసేందుకైనా, ప్రసారం చేసేందుకైనా వెనుకాడేది లేదన్నట్టుగా ఎల్లో మీడియా రెచ్చిపోతున్నది. తానే రెచ్చగొట్టి సవాల్ చేసి, గన్నవరం వెళ్లిన పట్టాభిని పోలీసులు కొట్టినట్టుగా ఈనాడు బ్యానర్ వార్తలను వండేయడం క్షుద్రవిద్యకు పరాకాష్ట. ఇందుకోసం రెండేళ్ల కిందటి ఫోటోలను ఈనాడు నిస్సిగ్గుగా వాడేసింది. నడిరోడ్డు మీద గుడ్డలూడదీసుకొని పత్రికారంగ మాన మర్యాదలను మంటగలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబరచడానికి ఎంత దారుణానికైనా దిగజారేందుకు తెలుగుదేశం, ఎల్లోమీడియాలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవలి పరిణామాలన్నీ నిరూపిస్తున్నాయి. 2019లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ఎల్లో మీడియా పలురకాల మలుపులు తిప్పుతున్న తీరు పెద్ద ఆశ్చ ర్యాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్పై దాఖలైన తప్పుడు కేసుల దర్యాప్తు సందర్భంగా కూడా కొందరు దర్యాప్తు అధికారులతో కలిసి ఈ ముఠా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులను కలిసిన సంద ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ అవినాశ్రెడ్డి చెప్పిన మాటలు గమనించదగ్గవి. కేసు దర్యాప్తు ఫ్యాక్ట్స్ టార్గెట్గా కాకుండా పర్సన్ టార్గెట్గా జరగడం సరికాదని అవినాశ్ అన్నారు. ఎవరినో ఇరికించే ఉద్దేశంతోనే దర్యాప్తు జరుగు తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రాథమిక సాక్ష్యాలను, వాస్త వాలను విస్మరిస్తూ దర్యాప్తు జరుగుతున్నదని ఇంగిత జ్ఞానానికి కూడా అవగతమవుతున్నది. ఈ కేసులో నిందితుడుగా వున్న సునీల్ యాదవ్ అనే వ్యక్తి బెయిల్ పిటీషన్ వేసుకుంటే దాని మీద సీబీఐ కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లోకి అవినాశ్రెడ్డి పేరును లాక్కొచ్చింది. తెల్లారి ఎల్లో మీడియాలో ‘అవినాశ్ ఇంట్లో సునీల్’, ‘అవినాశ్రెడ్డే’ వంటి పతాక శీర్షికలతో మసాలా వార్తలు వచ్చాయి. అవి చదివినవారు హత్య వెనుక అవినాశ్రెడ్డి హస్తముందని అనుకోవాలి. హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అనే వ్యక్తి అవినాశ్ ఇంట్లో ఉన్నాడని గూగుల్ చెప్పిందట. గూగుల్ చెప్పింది గనుక అదే నిజమని అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్నది. కానీ, ఆరోజు రాత్రి మూడు గంటలపాటు తానూ సునీల్ యాదవ్, నందిక అనే ఆస్పత్రి వద్ద కలిసే ఉన్నామని భరత్ యాదవ్ అనే విలేకరి చెప్పిన విషయాన్ని, ఇచ్చిన వీడియో సాక్ష్యాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. వివేకా రాసినట్టు చెబుతున్న లేఖ హత్యాస్థలంలో ఆయన పీఏ కృష్ణారెడ్డి దాచి పెట్టాడు. పొద్దున అక్కడికి వచ్చిన అవినాశ్కు గానీ, పోలీసులకు గానీ వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉన్నట్లయితే అది హత్య అనే విషయం వెంటనే తెలిసి ఉండేది. లేఖను ఎవరికీ ఇవ్వొద్దని వివేకా అల్లుడు ఎందుకు ఆదేశించినట్టు? వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడం వారి కుటుంబంలో పెద్ద వివాదానికి కారణమైంది. రెండో కుటుంబానికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి వివేకా నిర్ణయించారన్నది కూడా రహస్యమేమీ కాదు. ఈ నిర్ణయాన్ని మొదటి భార్య, కూతురు, అల్లుడు రాజశేఖరరెడ్డి, అల్లుని సోదరుడు శివ ప్రకాశ్రెడ్డి (వీరు వివేకా మొదటిభార్య సోదరులు) వ్యతి రేకిస్తున్నారు. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరి చాలాకాలంగా వివేకాకు సన్నిహితులు. ఆ కారణంగా ఆయన మొదటి కుటుంబ సభ్యులతో కూడా వారికి సాన్నిహిత్యం ఉన్నది. కేసు దర్యాప్తులో ఈ ప్రాసంగిక కోణం కనిపించడం లేదేమన్న అనుమానం సాధారణ ప్రజల్లో కూడా ఉన్నది. ఏమైనా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నది. న్యాయస్థానం విచారణ పూర్తి చేయవలసి ఉన్నది. ఈలోగానే ఎల్లో మీడియా నిత్యం తీర్పులు రాసేయడం, వారికి దర్యాప్తు అధికారుల నుంచి లీకులు అందడం విలువల పతనానికి పరాకాష్ట. ప్రజా కోర్టులో వైఎస్ జగన్ను గెలవ లేమన్న భీతితోనే ఈ కూటమి ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్నదని అనుకోవాలి. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
క్రాంతి – సంక్రాంతి
‘అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్’ అని గర్వంగా చెప్పు కునే జాతి మనది. వ్యవసాయం మన జీవన విధానం అనే నానుడి కూడా ఉన్నది. వ్యవసాయేతర వృత్తులు కూడా ఒకనాడు వ్యవసాయానికి అనుబంధంగానో, దాని చుట్టూనో అల్లుకున్నవే కావడం ఈ నానుడికి కారణం. కనుకనే మన జీవన గమనంలో ఇప్పటికీ అడుగడుగునా వ్యవసాయ సంస్కృతి తొంగి చూస్తున్నది. పలకరిస్తున్నది. ఆటలో, పాటలో, పలకరింపులో, వేడుకలో, వంటలో, విందులో, పండుగలో... ఇలా ప్రతి ఉత్సాహంలో, ఉద్వేగంలో, ఉత్తేజంలో వెన్నంటే నడుస్తున్న మన మేనిఛాయ వ్యవసాయం. వ్యవసాయ జీవితపు శిరస్సుపై ప్రకృతీ, పర్యా వరణాలు అందంగా అలంకరించిన శిరోభూషణం – పట్టుకుచ్చుల పంచరంగుల తలపాగా సంక్రాంతి పండుగ. ఈ పండుగ హరిదాసులు పాడే ఒక పాట. గాలిపటాలు, కోడి పుంజుల ఆట. రంగవల్లుల రంగుల చిత్రం. గొబ్బెమ్మల ఆరోగ్య తంత్రం. తృప్తిపడిన జీవి తపు నర్తనోత్సవం. ఒక్క మానవ జీవితపు ఉల్లాసమే కాదు... సమస్త ప్రకృతి పర్యావరణ శక్తుల సమష్టి సెలబ్రేషన్ సంక్రాంతి. దేశంలోని ప్రధాన వ్యవసాయాధార రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇప్పటికీ ఎక్కువమంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయరంగంపై ఆధారపడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. వ్యవసాయ అనుబంధ రంగాలు రాష్ట్ర సంపదకు చేర్చుతున్న వాటా కూడా దేశ సగటుతో పోలిస్తే ఎక్కువే. మకర సంక్రాంతి పండుగ వైభవం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. ఇక్కడే ఇప్పుడు సంక్రాంతి శోభతో ముడిపడిన ఒక రాజకీయ యుద్ధమేఘం ఆవహించి ఉన్నది. సంక్రాంతి స్ఫూర్తిని రగిలించే రాజకీయం ఒకవైపు, దహించే రాజకీయం ఒకవైపు మోహ రించి ఉన్నాయి. ప్రజా జీవితాల్లోకి పాలనా కాంతుల సంక్రమణం చేయించిన సంక్రాంతి రాజనీతి ఒకవైపు – ఆ క్రాంతిని కబళించాలని చూస్తున్న రాహు, కేతు పన్నాగం మరో వైపూ నిలబడి తలపడేందుకు సిద్ధపడుతున్నాయి. ముక్కారు పంటలతో అలరారిన ముప్ఫై మూడువేల ఎకరాల హరితావరణాన్ని బీడుగా మార్చి, ప్రకృతి గుండెల్లో కాంక్రీట్ గునపం గుచ్చాలని చూస్తున్న రాజకీయ పెత్తందార్లు ఒకపక్కన నిలబడ్డారు. ప్రతి పల్లెకూ పట్టాభిషేకం చేసి రాజధానిగా గౌరవించి, పంట చేనుకూ, రైతుబిడ్డకూ రాచ మర్యాదను కల్పించిన ప్రజానాయకుడు మరోపక్కన నిలబడ్డాడు. తల్లీ సంక్రాంతీ, పుష్యలక్ష్మీ నీవే తీర్పు చెప్పాలి! జంధ్యాల పాపయ్యశాస్త్రి రచించిన అజరామర కావ్యం ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తున్నది. ‘‘నేనొక పూలమొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గోరా నెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి ‘మా ప్రాణము తీతువా’ యనుచు బావురుమన్నవి,కృంగిపోతి’’ అంటాడు. బావురుమనడమే కాదు, చివర్లో ఆ పూమొగ్గలన్నీ మనుషుల్ని శపించాయని కూడా అంటాడు. ‘ఓయీ మానవుడా... బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్యచేసెడి హంతకుండ! మైలపడిపోయె నోయి నీ మనుజ జన్మ’ అన్నాయట! పాపయ్యశాస్త్రి సొంత జిల్లా గుంటూరులోనే ముప్ఫై మూడు వేల ఎకరాలను బీడు చేసినప్పుడు ఎన్ని లక్షల పూబాలలు ఎన్ని రకాల శాపనార్థాలు పెట్టి ఉంటాయో! మన పెత్తందార్ల ముఠామేస్త్రీ చంద్రబాబును ఇప్పుడు కొందరు ‘బోల్సోనారో ఆఫ్ ఆంధ్రా’ అని పిలుస్తున్నారు. నిజానికి అలా పిలవడం తప్పు. బోల్సోనారోనే ‘చంద్రబాబు ఆఫ్ బ్రెజిల్’గా పిలవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే పెత్తందార్లందరూ అభివృద్ధి పేరుతో ముద్దుగా పిలుచుకునే దోపిడీ మోడల్ను అనుసరించడంలో బోల్సోనారో కంటే చంద్రబాబు ఇరవయ్యేళ్లు సీనియర్. ఈ మధ్యకాలంలో అపు రూపమైన అమెజాన్ అడవులను వందల కిలోమీటర్ల పర్యంతం నరికివేసి, ప్రాణవాయువును సైతం లూటీ చేయడానికి తెగబడిన ఘనుడు బోల్సోనారో. ఎన్నికల్లో ఓడిపోయినా ఒప్పుకోకుండా కబ్జాకోరుతనంతో కాలు దువ్వి ‘ట్రంపరి’తనాన్ని ప్రదర్శించడాన్ని కూడా ప్రపంచం గమనించింది. అటువంటి బోల్సోనారోలకు గురుపాదులు మన బాబు. వీరి అభివృద్ధి మోడల్ సిద్ధాంతం ప్రకారం డబ్బే పెట్టుబడి. అధికారం దానికి అండ. ఈ రెండూ ఉన్న వారు సమస్త సహజ వనరుల్నీ, మానవ శ్రమనూ యథేచ్ఛగా దోపిడీ చేయవచ్చు. నదుల్ని కలుషితం చేయవచ్చు. కొండల్ని పిండి చేయవచ్చు. అడవుల్ని నరికేయవచ్చు. కాంక్రీట్ అరణ్యాలను నిర్మించవచ్చు. మానవ శ్రమను, మేధను కారుచౌకగా కొనేయవచ్చు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఈరకంగా అభివృద్ధి సాధిద్దామంటారు మన బాబులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే వారి బాబులు కూడా! ఇది అమానవీయమైన అభివృద్ధి అనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా చాలా నమూనాలు ముందుకొస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి నమూనా ఒకటి. మానవ వికాసానికి అవసరమైన మేరకు సహజ వనరుల్ని హేతుబద్ధంగా వాడుకొని వాటిని భవిష్యత్ తరాల అవసరాలకోసం కూడా మిగిల్చే పద్ధతులను ఈ నమూనా అనుసరిస్తుంది. మానవ శ్రమను, మేధను వనరులుగా కాక పెట్టుబడి గానే గుర్తించాలన్న ఆలోచనలు కూడా ముందుకు వస్తున్నాయి. వీటి సారాంశం ఒక్కటే – ఈ ప్రపంచం అందరిదీ, సమస్త జీవరాశిది. ఈ తరాలకే కాదు భవిష్యత్తు తరాలకు కూడా చెందినది. మానవ జాతి సమష్టిగా సృష్టించుకునే సంపద కూడా అందరికీ చెందినది. సంపద సృష్టి – పంపిణీ హేతుబద్ధంగా ఉండాలి. ఇది ప్రజాహితమైన, పర్యావరణ హితమైన అభివృద్ధి మోడల్. ఈ రెండో రకమైన అభివృద్ధిలోనే నిజమైన జనక్రాంతి ఇమిడి ఉన్నది. అసలైన సంక్రాంతి దాగి ఉన్నది. ఈ సంక్రాంతికి సంకెళ్లు వేయాలంటుంది బోల్సోనారో – బాబు అభివృద్ధి మోడల్. ఈ సంక్రాంతులు జనజీవితమంతా పరుచుకోవాలంటుంది ప్రత్యా మ్నాయ అభివృద్ధి మోడల్. ఆంధ్రప్రదేశ్లో మొదటి మోడల్కు చంద్రబాబు, రెండో మోడల్కు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. వారిద్దరి విధాన నిర్ణయాల బేరీజుతోనే ఈ అంచనాకు రావచ్చు. వేల ఎకరాల్లో విస్తరించిన పచ్చందనాలకు ఉరి బిగించే చంద్రబాబు అభివృద్ధి నమూనాను వైఎస్ జగన్ తిరస్కరించారు. రాజధాని వికేంద్రీకరణకు నడుం కట్టారు. జనసాధికారతలో వికేంద్రీకరణ అనేది తొలి అడుగు. ఆ వికేంద్రీకరణను మరింత విప్లవాత్మకం చేసి పదిహేను వేల మినీ రాజధానులను ఆయన సృష్టించారు. పేద ప్రజల పురోగతికి అత్యవసరమైన నాణ్య మైన విద్య, వైద్యాలను ధనికులతో సమానంగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపకరణాలు ఇంటి ముంగిటకొచ్చాయి. నడివయసు మహిళలు కూడా ప్రభుత్వ ‘చేయూత’తో చిన్నచిన్న వ్యాపారాలు చేయగలుగుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు పెద్దపెద్ద అడుగులు వేస్తు న్నాయి. ఈ పరిణామాల ప్రభావం సంక్రాంతి పండుగపై కూడా పడింది. పల్లెపల్లెనా సంక్రాంతి శోభ పరుచుకున్నది. పండుగ షాపింగ్లతో పట్టణాలు కళకళలాడుతున్నాయి. బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల కొనుగోళ్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. పండుగలకు పల్లె టూళ్లకొచ్చే జనం కూడా పాత రికార్డులను బద్దలు కొట్టారు. మూడేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడం, ఒక్కటంటే ఒక్కటైనా కరువు మండలం లేకపోవడం పల్లెటూళ్లలో పండుగ కాంతిని ద్విగుణీకృతం చేసింది. ధాన్యానికి గిట్టుబాటు ధర దొరకలేదన్న మాట వినిపించడం లేదు. అమూల్ డెయిరీ ప్రవేశంతో రాష్ట్రంలో మళ్లీ సహకార పాడి వ్యవస్థ జవజీవాలు పుంజుకున్నది. పొలం నుంచి రైతునూ, సముద్రం నుంచి మత్స్య కారుణ్ణి, అడవి నుంచి గిరిజన బిడ్డను వేరుచేయని సుస్థిర అభివృద్ధి మార్గాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నది. పరిశ్రమల పేరిట కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టడానికి ఎక్కడా చారెడు పొలం లాక్కోలేదు. పైగా రైతు భరోసాతోపాటు ఆర్బీకేల ద్వారా బతుకు భరోసాను కూడా రైతులకు కల్పిస్తున్నది. గనుల తవ్వకం పేరిట గిరిజనుల్ని తరిమేయలేదు. గిరిజన రైతులకు అన్నివిధాల అండగా నిలబడి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. గత్యంతరం లేక గంజాయి ఉచ్చులో చిక్కుకున్న వారిలో పరివర్తన తీసుకు వస్తున్నది. మత్స్యకారులు దూర దేశాలకు వలస పోకుండా అనేక చర్యలు తీసుకున్నది. ఆధునిక మైన ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నది. ఈ పరిణా మాలన్నీ నేటి సంక్రాంతి పండుగ కాంతులీనేందుకు కారణమవు తున్నాయి. కొత్త కాంతితో, కొత్త క్రాంతితో సంక్రాంతి మెరుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కుట్రపూరితం వీధి నాటకం!
ఒకనాడు కొండంత రాగం తీసిన మన తెలుగు పద్యనాటక వైభవం అంతరించిందని చింతించవలసిన అవసరం లేదు. రంగస్థలం మీద మహేంద్రజాలం చేయగలిగిన సురభి వారి ప్రజ్ఞాధురీణత మాయమైపోయిందని బాధ పడనవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఆ లోటును తీర్చేస్తున్నారు. నిజ రాజకీయాన్నే వీధి నాటకంగా మార్చి అధునాతన కళా కౌశలాన్నంతా అందులో రంగరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్సింగ్ అనే ఆయన వ్యవహరిస్తున్నారట! చంద్రబాబు సభలకు వస్తున్న జనం సంఖ్య, వారి స్పందన ఆయనకు నిరాశ కలిగించిందట!. ఈ మేరకు పార్టీ నాయకత్వానికి తన అభిప్రాయాలను వ్యూహకర్త నివేదించారట. జనం నాయకుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా, నాయకుని కోసం ఎగబడుతున్నట్టుగా చిక్కగా తనకు విజువల్స్ కావాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అడిగారట. పార్టీ మేధో బృందం ఓ మూడు పద్ధతులను ఇందుకోసం రూపొందించింది. మొదటిది కుంభాకార దర్పణ (Convex Lens) టెక్నిక్. రెండోది ప్రలోభ ( Luring) టెక్నిక్, మూడోది కట్–పేస్ట్ టెక్నిక్. మొదటి పద్ధతికి ఉదాహరణ కందుకూరు విషాదం. కుంభాకార దర్పణం అంటే గోరంతను కొండంతగా చూపడమన్నమాట. సభకు వచ్చిన జనాన్ని పది పన్నెండింతలు పెంచి చూపెట్టే ప్రయత్నం. ఈ ప్రయోగం ఫలితమే కందుకూరు విషాదం. పోలీసులు అనుమతించిన సర్కిల్లోనే సభ జరిగి వుంటే ఎనిమిది ప్రాణాలు పోయేవి కాదు. కానీ సభ పేలవంగా జరిగినట్టు కనిపించేది. జనాకర్షణలో బాబు బలహీనత స్పష్టంగా తెలిసేది. అందుకని పక్కనే ఉన్న ఇరుకు సందులోకి వచ్చిన రెండువేల మందిని గొర్రెల మందను మళ్లించినట్టుగా తరిమేశారు. సందులో ఒత్తిడి పెరిగింది. వాళ్లు తిరిగి సర్కిల్లోకి రాకుండా చంద్రబాబు తన వాహనాన్ని 50 మీటర్లు ముందుకు ఉరికించి సందుకు అడ్డంగా నిలబెట్టారు. సీసా మూతికి బిరడా బిగించినట్టుగా తొక్కిసలాట మొదలైంది. అదే టీడీపీ బృందానికి కావల్సింది. రెండో టెక్నిక్ను ప్రయోగాత్మకంగా గుంటూరులో అమలు చేశారు. సమాజ సేవనే గాలిగా పేల్చుకునే ఒకానొక ఎన్ఆర్ఐ మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని చెబుతున్నారు. ఆ వ్యక్తిపేరు ఉయ్యూరు శ్రీనివాస్. కార్యక్రమానికి అనుమతి మాత్రం టీడీపీ తీసుకున్నది. వచ్చివవాళ్లకు ఈ మహానుభావుడు చీరెసారెలు పంచుతారని పది రోజులపాటు ప్రచారం చేసుకున్నారు. సుమారు 30 వేలమందికి టోకెన్లు పంచారట. వచ్చినవాళ్లకు కానుకలు పంచకుండా చంద్రబాబు వచ్చేంతవరకు నాలుగు గంటలపాటు కూర్చోబెట్టారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంతసేపు డ్రోన్ కెమెరాలు వాటి పని అవి నిర్వర్తించాయి. ‘బాబుకోసం తండోపతండాలుగా తరలివచ్చి ఆయన ఉపన్యాసాన్ని వింటున్న జనం’ అనే కాన్సెప్టుకు తగినట్టు ఫోటోలు తయారుచేసుకున్నారు. పాపం వచ్చిన వారు మాత్రం ‘చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద’ అన్నట్టుగా కానుకల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత రెండువేల మందికి సరిపడా తెచ్చిన కానుకలను బిస్కెట్ల మాదిరిగా విసిరేశారు. ఫలితంగా దుర్ఘటన చోటుచేసుకున్నది. ఉయ్యూరు శ్రీనివాస్ తరహా సంఘసేవకులను మరో పదిహేను మందిని చంద్రబాబు సిద్ధం చేసి ఉంచారని చెబుతున్నారు. ఎన్నికలయ్యేవరకు నెలకొకరు చొప్పున గుంటూరు తరహా చీరెసారెల సభలు నిర్వహించాలి. అందుకుగాను సదరు సేవకుల అభిరుచిని బట్టి ఎమ్మెల్యే టిక్కెట్లు గానీ, గెలిస్తే కాంట్రాక్టులు గానీ హామీ ఇచ్చారట!. ఇక మూడో టెక్నిక్ – ‘కాపీ–పేస్ట్’ పద్ధతి. బహుశా సోషల్ మీడియాకే పరిమితం చేస్తారు కాబోలు. కర్ణాటకలో సిద్ధేశ్వర స్వామి అనే మఠాధిపతి చనిపోతే ఆయన అంతిమయాత్రకు రెండు లక్షలమంది హాజరయ్యారు. ఆ ఫొటోను తెచ్చి చంద్రబాబు కుప్పం పర్యటనలో పాల్గొన్న జనసందోహమంటూ ప్రచారంలో పెట్టారు. ఎవరూ కనిపెట్టి కౌంటర్ చేయకపోతే ఇటువంటి ఫోటోలతో సోషల్ మీడియా ప్రచారం ముమ్మరంగా సాగించే అవకాశమున్నది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏదో ఒకరోజున అన్నాదురై అంతిమయాత్ర ఫోటో కూడా టీడీపీ ఖాతాలో పడుతుందేమోనని భయంగా ఉన్నది. కోటిన్నర మంది పాల్గొని ప్రపంచంలోనే అతిపెద్ద జనసందోహంగా రికార్డయిన ఘట్టమది. చంద్రబాబునాయుడు కుట్రపూరిత రాజకీయాల గురించి, ఆయన గురువింద నీతిపై తెరలు కప్పే ఎల్లో మీడియా మ్యాజిక్ గురించి తెలుగు ప్రజల్లో చాలామందికి తెలుసు. కానీ, ఇప్పుడు జరుగుతున్న కుట్ర మరింత ప్రమాదకరమైనది. ఈ కుట్రకు సంబంధించిన అంశాలు ఒక్కటొక్కటే ఆవిష్కృతమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని సంపన్న వర్గాలు... ముఖ్యంగా రెండున్నర పాత జిల్లాల సంపన్నవర్గా్గల కనుసన్నల్లో ఈ దారుణమైన కుట్ర పురుడుపోసుకున్నది. ఈ వర్గాల ప్రయోజనాలకోసం భుజంకాసే నాయకత్వ శ్రేణులు కుడినుంచి ఎడమకు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. సాంస్కృతిక సాహిత్య రంగాల నుంచి ప్రజాసంఘాల వరకు విస్తరించి ఉన్నారు. వివిధ వృత్తి సంఘాల్లోనూ పాతుకొనిపోయి ఉన్నారు. రకరకాల వ్యవస్థల్లో స్లీపర్సెల్స్ అవతారంలో పొంచి ఉన్నారు. కుట్రకు సంబంధించిన ప్రణాళిక, అందులో భాగస్వాములు పోషించవలసిన పాత్రల గురించి మార్గదర్శకాలు ఇప్పటికే అందరికీ జారీ అయ్యాయి. ఇంతకూ ఏమిటా కుట్ర?. ఆంధ్రరాష్ట్ర సహజ వనరులనూ, ఆదాయాలను ఇంతకాలంగా దోచుకు తింటున్న కొన్ని పందికొక్కులకు ఇప్పుడు ఊపిరి సలపడంలేదు. వాటికి ‘మేత’ దొరకడం లేదు. ఆ ‘మేత’కు అభివృద్ధి అనే అందమైన పేరును పందికొక్కులు తగిలించుకున్నాయి. ‘అభివృద్ధి ఎక్కడుందీ?’ అని అవి ప్రశ్నిస్తున్నాయి. ‘ఔనౌను అభివృద్ధే కానరావడం లేద’ని ఈ ‘మేత’ కొక్కులకు వంతపాడే నేతలంతా అభిప్రాయపడుతున్నారు. ఎల్లో మీడియా అదే పాట పాడుతున్నది. దాని అనుబంధ సోషల్ మీడియా కోరస్ పాడుతున్నది. రెండు లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు ప్రత్యక్షంగా బదిలీ చేస్తే పందికొక్కులు తవ్వుకునేదెట్లా? ఇంకో లక్షన్నర కోట్లను నవరత్నాల పేరుతో పేదవర్గాల సాధికారతకు ఖర్చు పెడితే పందికొక్కులు చిక్కిపోవా? విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న పరిశ్రమల పునరుజ్జీవం కోసం వేలకోట్లు ధారపోస్తుంటే తాము మింగేందుకు ఏం మిగులుతుంది? పతితులుగా, భ్రష్టులుగా, దగాపడిన తమ్ములుగా ముద్ర వేయించుకున్న నిరుపేదలు నిటారుగా నిలబడితే, మనుషులుగా బలపడితే చీప్ లేబర్ దొరికేదెట్లా? వనరులన్నింటినీ తమ చేతికి అందివ్వకుండా, ఆదాయాన్ని తమ నోట్లో కుక్కకుండా, చీప్ లేబర్ దొరక్కుండా ప్రభుత్వమే పూనుకుంటే ఇక ‘అభివృద్ధి’ ఎట్లా? ఇదే ఇప్పుడు అభివృద్ధిపై జరుగుతున్న తర్కవితర్కం. ఈ రకమైన ‘అభివృద్ధి’కి అడ్డుగోడగా నిలబడిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలి. యాభై శాతానికి పైగా ప్రజా మద్దతున్న ప్రభుత్వాన్ని ఓడించడం ఎలా సాధ్యం? ఆ మద్దతును తగ్గించాలి. నాన్–వైసీపీ పార్టీల ఓట్లు చీలకుండా ఒక్కచోటుకు చేర్చాలి. అలా ఒకచోటుకు చేర్చడం కోసం ‘సేవ్ డెమోక్రసీ’ అనే ముసుగు కావాలి. ఆ ముసుగు కోసమే వీధి నాటకాల ప్రదర్శనలు. ప్రతిపక్ష నేతల సభలకు జనం విరగబడుతున్నారన్న మూడ్ను సృష్టించడంతోపాటు తొక్కిసలాటలూ, గలాటాలూ జరగాలి. కొన్ని ప్రాణాలు పోయినా ఫరవాలేదు. శాంతిభద్రతలు క్షీణించాయని ప్రచారం చేసుకోవచ్చు. ప్రజా భద్రతకు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నా ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో అందరినీ ఏకం చేయాలి. ఇదీ ఇప్పుడు చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియాల సారథ్యంలో పెత్తందారీ వర్గాలు ప్రదర్శిస్తున్న నాటక సారాంశం. నాటకం పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో విజయవాడలో సకలపక్ష సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ – చంద్రబాబులు మొన్న విజయవాడలోనూ, నేడు హైదరాబాద్లోనూ సమావేశమయ్యారు. ఈ భేటీలకు కూడా అదే పేరు పెట్టారు. పేద పిల్లల ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ప్రపంచ రచయితల సభలైనా, వికేంద్రీకరణకు వ్యతిరేకంగా గురిపెట్టిన ఉత్తరాంధ్ర చర్చా వేదికైనా ఈ మొత్తం కుట్రలో భాగంగానే పరిగణించాలి. తెలుగు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లు హైదరాబాద్ గడప దాటి ఆంధ్రలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని, సినిమా నటులు నిర్వహిస్తున్న టాక్ షోలను కూడా నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నదేమో!. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై జరుగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే దిగ్భ్రాంతికి గురికావలసి వస్తున్నది. దిగజారుడుతనం చిట్టచివరి మెట్టును కూడా దిగేసింది. అసలా జీవోలో రోడ్డు షోలపై, ర్యాలీలపై నిషేధమే లేదు. సభలను కూడా రోడ్డు మీద కాకుండా సమీపంలో ఉండే మైదానాల్లో పోలీసుల అనుమతితో నిర్వహించుకోవచ్చని చెప్పింది. జీవో అనేది బహిరంగ రహస్యం. ఎవరైనా చదువుకునే అవకాశం ఉన్నది. అటువంటి నగ్నసత్యంపై మసిపూయడానికి తెగించడం ఎల్లో మీడియా, ప్రతిపక్షాల తెంపరితనానికి నిదర్శనం. ఈ అసత్య ప్రచారం ప్రాతిపదికగా ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను నిర్మించడానికి పూనుకోవడం ఒక దుర్మార్గమైన నిస్సిగ్గు ఎత్తుగడ. ప్రజల వివేకాన్ని కూడా అవహేళన చేసే చర్య. నిజానికి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులపై సైతం రాజ్యాంగ బద్ధమైన కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, క్లాజు 1లోని సబ్క్లాజు ‘బి’ ప్రకారం ‘పౌరులందరికీ శాంతియుతంగా, ఆయుధాల్లేకుండా సమావేశమయ్యే హక్కు’ ఉన్నది. క్లాజు 3లో ఇందుకు సంబంధించిన వివరణ కూడా ఉన్నది. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పరిరక్షించడానికి, ‘పబ్లిక్ ఆర్డర్’ను కాపాడటానికి ఉద్దేశించి ఇప్పటికే అమలులో ఉన్న చట్టానికి కానీ, కొత్తగా చేసే చట్టానికి గానీ ఈ సమావేశ హక్కు అవరోధంగా ఉండదు. పబ్లిక్ ఆర్డర్ అనే మాటలో ప్రజల భద్రత అనే అంశం కూడా ఇమిడి ఉంటుందని న్యాయకోవిదుల అభిప్రాయం. అంటే ప్రజాభద్రతకోసం ఈ ప్రాథమిక హక్కుపై కొన్ని ఆంక్షలు పెట్టవలసి వస్తే అవి చెల్లుబాటు అవుతాయి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదు. కేవలం సమావేశాలను రోడ్డుపై కాకుండా మైదానంలో పెట్టుకోవాలని జీవో సూచించింది. ఈ జీవోను నల్ల చట్టానికి పుట్టిన బిడ్డగా విపక్షం, ఎల్లో మీడియా అభివర్ణిస్తున్నాయి. నిజాల మీద మసి పూస్తున్నాయి. బరి తెగించి బట్టలూడదీసుకొని నర్తిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఇదే చట్టాన్ని యధేచ్ఛగా వాడిన వైనాన్ని దాచేస్తున్నాయి. జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు అనేక ఆంక్షలు పెడుతూ అప్పటి డీజీపీ ప్రెస్మీట్ పెట్టిన విషయాన్ని కూడా మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వర్ధెల్లి మురళి :::vardhelli1959@gmail.com -
న్యూఇయర్ ‘ఆయుధ పూజ’
అర్జునా... జాగ్రత్త! ఏకలవ్యుల బొటనవేళ్లు ఇక మీదట తెగిపోవడం లేదు. వారి వింటి నారి ఝంకారాన్ని విని ఝడుసుకోకు. సూతపుత్ర కర్ణుడి దివ్యాస్త్రాలు పనిచేయకుండా ఏ పరశు రాముడూ ఇప్పుడు శపించలేడు. నీ అరివీరుని ధనుష్టంకారానికి అదిరిపడకు. ఆయుధమే కదా విజేత ఎవరో విజితుడెవరో నిర్ణయించేది! ఆయుధ ప్రయోగ మంత్రమే కదా విజేతల విజయ రహస్యం! అది దేశాల మధ్య యుద్ధమైనా, సమాజంలోని భిన్నవర్గాల పోరాటమైనా... ఆయుధమే గెలుపు తులాభారం. కేవలం నాలుగైదు దేశాలు ప్రపంచ రాజ్యాలన్నిటిపై పెత్తనం చేసి వలసపాలన స్థాపించగలిగింది ఆయుధ బలంతోనే. నూటికి ఎనభై మంది పేద ప్రజల జీవితాలతో పిడికెడుమంది శ్రీమంతులు యథేచ్ఛగా ఆటలాడుతున్నదీ సాయుధ గర్వంతోనే! మారుతున్న కాలంతోపాటు ఆయుధం కూడా తన రూపును మార్చుకుంటున్నది. ఒకనాడది తుపాకీ కావచ్చు. తుపాకుల్లో శ్రేష్ఠమైనదీ కావచ్చు. క్రమంగా విజ్ఞానమే ఆయు ధంగా మారుతున్నది. ఆయుధం పుస్తక రూపాన్ని కూడా సంతరించుకున్నది. ఆ పుస్తకం కాలానికి తగినట్టు కంప్యూటర్ అవతారమెత్తుతున్నది. సాంకేతిక నైపుణ్యాన్ని ఆవాహన చేసుకుంటున్నది. ఆ చదువే ఇప్పుడు పరమాయుధం. చదువే ఇప్పుడు పాశుపతాస్త్రం. చదువే ఇప్పుడు నారాయణాస్త్రం. చదువే ఇప్పుడు బ్రహ్మాస్త్రం! కాలంతోపాటు నడిపించే ఇంగ్లిషు మీడియం చదువు శ్రీమంతుల కుటుంబాలకే పరిమితం కావడం అన్యాయం కాదా? కాలాన్ని శాసించే కంప్యూటర్ చదువు వారి గుప్పిట్లోనే బందీ కావడం సామాజిక దోపిడీ కాదా? నిరుపేదల బిడ్డలు వసతుల్లేని బడుల్లో అరకొర అక్షర జ్ఞానంతో ఇంకెన్నాళ్లు వెనక బాటుతనాన్ని దిద్దుకుంటూనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడీ దుర్నీతికి సంకెళ్లు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విప్లవదీక్షతో ప్రభుత్వ బడుల స్వరూప స్వభావాలను మార్చివేసింది. కార్పొ రేట్ స్కూళ్లకు ధీటుగా పేదబిడ్డల చేతికి ట్యాబ్లను అంద జేస్తున్నది. కేవలం ట్యాబ్లే కాదు సుమా! అత్యంత ఆధునికంగా ఆడియో విజువల్ బోధనా పద్ధతులు మేళవించిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లవి. ఆ పెట్టెలో శస్త్ర సంధాన మంత్రోపదేశం ఉన్నది. అర్జునుడి చెవిలో ద్రోణాచార్యుడు చెప్పిన విలువిద్యా రహస్యం ఇక ఏకలవ్యులకు కూడా వినబడబోతున్నది. డిజిటల్ డివైడ్ అంతం కానున్నది. అక్షర పెత్తందారీతనానికి తెరపడబోతున్నది. సాంకేతిక దోపిడీకి చరమగీతం పాడే సమయం ఆసన్నమవుతున్నది. అదిగో ఈ ఫోటోలోని బాలిక పరవశాన్ని చూడండి. ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ను అపురూపమైన ఆయుధంగా భావించి ముద్దాడుతున్న ఆ బాలిక స్పందన చూడండి. పద్మవ్యూహ చక్రబంధంలో అభిమన్యుని ఇరికించిన కురువీరులు అధర్మ యుద్ధంతో అతడిని నిరాయుధునిగా మార్చినప్పుడు... ఏ అదృశ్యశక్తో అతడి చేతికి ధనుర్బాణాలను అందజేస్తే స్పందన ఎలా ఉండేదో?... ఈ ఏకలవ్యుల స్పందన కూడా అలాగే ఉన్నది. చేతికందిన విల్లంబుల్ని ఎక్కుపెట్టడానికి వారు సిద్ధపడు తున్నారు. చేప యంత్రాలను కొట్టడానికో, చెట్టుమీదున్న పిట్ట కన్నును పొడవడానికో వారు పరిమితం కాబోరు. ఈ లోకపు వెలుగుల్ని దిగంతాల దాకా మండించగల విలుకాళ్లవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్గపోరాటం (క్లాస్ వార్) నడుస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నిజమే ఇప్పుడిక్కడ స్పష్టమైన వర్గ విభజన ఏర్పడుతున్నది. పేదలంతా ఒకవైపు సమీకృతమవుతున్నారు. సంపన్నవర్గ ప్రయోజనాన్ని కాంక్షించే వారంతా ఒకవైపునకు కదులుతున్నారు. పేదవర్గాల ప్రజలందరికీ సమానావకాశాలు లభిస్తే, అవకాశాలను అందిపుచ్చుకోగల నైపుణ్యాన్ని ఆ వర్గాలు సంతరించుకుంటే సంపన్నుల పెత్తందారీతనానికి సవాల్ ఎదు రౌతుంది. సహజ వనరులపై, రాజకీయ, ఆర్థిక రంగాలపై వారికి ఉన్న పట్టు సడలుతుంది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు హామీ ఇచ్చింది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు. ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం కూడా. ఈ ప్రజాస్వామ్యాలు విస్తృతమవుతున్న కొద్దీ పేదవర్గాలు అదే నిష్పత్తిలో సాధికారతను సాధిస్తాయి. ఇది మౌలిక సూత్రం. అందువల్లనే ప్రజాస్వామ్యం విస్తృతమవడానికి పెత్తందారీ వ్యవస్థ ఇచ్చగించదనే సంగతి మనందరికీ తెలిసిన సత్యమే. రాజ్యాంగం కల్పించిన అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో వర్గపోరాటం అనివార్యమయ్యే పరిస్థితి నెలకొన్నది. పెత్తందారీ వ్యవస్థ వేయిచేతుల కార్తవీర్యార్జునుడి లాంటిది. ఏకకాలంలో ఐదువందల బాణాలను వివిధ లక్ష్యాల పైకి ప్రయోగించగలదు. మనం ఏం తింటే రైటు? ఎప్పుడు పడుకుంటే రైటు? సంప్రదాయాలేమిటి? ఆచారాలేమిటి? వగైరా వ్యక్తిగత విషయాలను కూడా కట్టుబాట్ల పేరుతో పెత్తం దారీ వ్యవస్థ నిర్దేశిస్తుంది. ఏది న్యాయం? ఏది ధర్మం? ఏది అభివృద్ధి? ఏది అరాచకం? అనే విషయాలను ఈ వ్యవస్థ తన వేయిబాహువుల ద్వారా వెల్లడి చేస్తుంది. దీన్నే మనం ఆధిపత్య భావజాలం అంటున్నాము. దాన్ని మనం నమ్మాలి. సేవ్ డెమోక్రసీ పేరుతో హఠాత్తుగా విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది. పెత్తందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది. దానికి జనసేనతోపాటు కమ్యూనిస్టు పార్టీలు రెండూ హాజరవుతాయి. పీపుల్స్ డెమోక్రసీ (జనతా ప్రజాస్వామ్యం) పేరుతో జాతీయ అధికార పత్రికను నడుపుతున్న రాజకీయ పార్టీ ఈ హెజిమోనిక్ డెమోక్రసీ (పెత్తందారీ ప్రజాస్వామ్యం) సమావేశానికి హాజరు కావడం విచిత్రం. అదే పెత్తందారీ కార్తవీర్యార్జునుడి ప్రత్యేకత. అదే విజయవాడలో అసందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సభ జరుగుతుంది. ఆ సభలోని వక్తలంతా తెలుగు భాష ప్రాచుర్యంపైన కాకుండా ఇంగ్లిష్ మీడియం బోధనపైన దాడిని ఎక్కుపెడతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా వ్యతిరేకించాయి. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తోక ముడిచాయి. పొలిటికల్ ఫ్రంట్లో కాల్పుల విరమణ ప్రకటించి ఇప్పుడు కల్చరల్ వార్ ఫ్రంట్ను ఓపెన్ చేశాయన్నమాట. పొలిటికల్ పార్టీ చేతికి మట్టి అంటకుండా ఆధిపత్య భావజాలం ద్వారా సంస్కృతి పేరుతో కొన్ని మెదళ్లనయినా కలుషితం చేయడమన్నమాట. మన పెత్తందారీ వర్గం చెప్పుచేతల్లోనే సినిమా రంగం కూడా ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు బామ్మర్ది, ప్రసిద్ధ నటుడైన బాలయ్య షో ఒకటి నడుస్తున్నది. ఆ షోలో అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన వెన్నుపోటు మహాపాతకంపై పసుపునీళ్లు చల్లి ప్రక్షాళన చేసే ప్రయత్నం ఆ షోలో చేశారు. ఒకరినొకరు ద్వేషించుకునే చరిత్ర ఉన్న నటులంతా కడుపులో కత్తులు దాచుకొని కౌగిలింతలు ప్రదర్శించడాన్ని ఈ షో ద్వారా జనం వింతగా చూస్తున్నారు. మేమంతా ఒక్కటే, పెత్తందారీ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడితే ఒక్కటిగా కదులుతామనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ షోను వాడేస్తున్నారని అర్థమవుతున్నది. పైన పేర్కొన్న మూడు దృష్టాంతాలు దేనికవే యథాలాపంగా జరిగినవి కావు. ఇవన్నీ పేద ప్రజల సాధికారత ఉద్యమానికి వ్యతిరేకంగా, వారికి స్ఫూర్తిగా నిలబడిన వైఎస్ జగన్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన బాణాలే. మూడు విషయాలనే మనం చర్చించుకున్నాము. కానీ పెత్తందారీ కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు, వేయి కుంపట్లను రాజేస్తూనే ఉంటాడు. వాటి లక్ష్యం మాత్రం ఒకటే. సాధారణ ప్రజలను, మర్మం తెలియని కొందరు మేధా వులను బోల్తా కొట్టించడానికి అభివృద్ధి అనే పాచికను ప్రయో గించడం పెత్తందారీ ప్రతినిధులకు అలవాటుగా మారింది. తెలుగుదేశం పార్టీ నగ్నదేహం మీద ఒక దేవతా వస్త్రాన్ని కప్పి దాన్నే అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం చాలామందికి తెలిసిన విషయమే. అభివృద్ధి అంశంపైన అర్థవంతమై చర్చకు సిద్ధపడితే ఈ ప్రతినిధులు తోక ముడవడం ఖాయం. వీరి అభివృద్ధి అంకంలో మొదటిది అమరావతి ప్రస్తావన. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని, దాని వెనకున్న లక్షల కోట్ల స్కామ్ను దాచే ప్రయత్నం చేస్తారు. రాజధానే లేని అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తారు. పల్లెపల్లెనా, వీధివీధినా వెలసిన పదిహేను వేల రాజధానులు (సెక్రటేరియట్లు) ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తుం డగా రాజధాని లేదనే ఆక్రోశమేమిటి? ఈ పదిహేను వేల రాజధానులు జనతా ప్రజాస్వామ్యానికి కొలమానాలైతే, బల హీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేని అమరావతి పెత్తందారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. మూడున్నరేళ్ల కింద మన ఊరు ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నది? పెత్తందారీ ప్రతినిధులు ఎవరైనా సరే గ్రామ చావడిలో కూర్చొని చర్చించడానికి సిద్ధమా? మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే సొంత ఊరిలోనే అన్ని వ్యవహారాలు నడిపి స్తున్న సెక్రటేరియట్. అక్కడ ఒక్క రూపాయి లంచమడగని కొత్త మార్పు. ఊళ్లో విలేజి క్లినిక్. అక్కడ ఎల్ల వేళలా సిద్ధంగా ఉండే మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టెలిమెడిసిన్ ద్వారా అందుబాటులో డాక్టర్. కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం. ఈ ఫ్యామిలీ డాక్టర్ క్రమం తప్పకుండా మన ఊరికి వచ్చే డ్యూటీ. ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రం. అక్కడ అందుబాటులో వ్యవసాయ – ఉద్యానవన శాఖలకు సంబం ధించిన అసిస్టెంట్లు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు. బుక్చేసిన 24 గంటల్లో సర్టిఫైడ్ ఎరువులు, విత్తనాలు అందజేసే కియోస్క్లు. వ్యవసాయ పనిముట్లు అద్దెకిచ్చే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... ఇవన్నీ ఊరికి ఎప్పుడొచ్చాయో ప్రత్యేకంగా చెప్ప వలసిన అవసరం ఉన్నదా? శిథిలమైపోయిన బడి ‘నాడు–నేడు’ తర్వాత కొత్త కాంతులు పూస్తున్న వైనం మన కళ్లముందే కనిపిస్తున్నది. బడికెళ్లే పిల్లలకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్, బ్యాగ్, పుస్తకాలు ... ఇలా అవసరమైనవన్నీ ప్రభుత్వం సమ కూర్చుతున్న వైనం... పిల్లల్ని బడికి పంపినందుకు అమ్మఒడిలో ఏటా పదిహేను వేలు. పెద్దక్లాసుల పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన. బీదా–బిక్కి తేడా లేకుండా రాబోయే తరం మొత్తంగా నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇవి కావా అభివృద్ధి రూపాలు? విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు హయాంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో 18వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకినట్టు ఇండియా టుడే నివేదిక వెల్ల డించింది. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఇచ్చిన నివేదికలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించారు. విద్యా రంగంలో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఇతర రాష్ట్రాలకు సూచించారు. పరిశ్రమలు కొత్తవి రావడం లేదనే విషప్రచారం యెల్లో మీడియాలో తరచూ చూస్తున్నాము. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, అతిభారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 60 వేల మందికి ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలొచ్చాయి. ఈ కేటగిరీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా సగటున 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఇప్పుడు మూడున్నరేళ్లలో రెండేళ్లను కరోనా కోసేసినప్పటికీ సగటున ఏటా 13 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లెక్కలు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు 2019 నాటికి ఒక లక్షా ఐదువేల యూనిట్లు ఉంటే ఈ మూడున్నరేళ్లలో వంద శాతానికి పైగా పెరిగి 2,13,826కు చేరుకున్నాయి. ఈ యూనిట్ల ద్వారా పది లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్ వెల్లడించిన గణాంకాలు ఇవి. 30 వేల కోట్లతో నాలుగు గ్రీన్ఫీల్డ్ పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం కాబోతున్నాయి. సముద్ర తీర ప్రాంత అభివృద్ధి కొత్త పుంతలు తొక్కబోతున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పడలేదు. మూడున్నరేళ్ల కాలంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలకెత్తుకున్నారు. ఈ సంవత్సరం అందులో ఐదు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు చెప్పండి ఎవరు అభివృద్ధి ప్రదాత? ఎవరు విజినరీ? కాకపోతే నిరుపేదల సాధికారతకూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. ఈ కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధ ధర్మంగా ఆయన పరిగణిస్తున్నారు. రాజ్యాంగ యంత్రాంగాన్ని ఇంతకాలంగా అదుపులో పెట్టుకున్న పెత్తం దారీ వర్గాలకు ఇది సహించడం లేదు. అందుకే పేదవర్గాల మీద పెత్తందారీ వర్గాలు యుద్ధాన్ని ప్రకటించాయి. పేదవర్గాలకు దన్నుగా నిలబడి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విష రసా యనాల దాడికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పేద వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నూతన సంవత్సరం ప్రభవించే వేళ ఆ వర్గాల ప్రజలు ‘ఆయుధ పూజకు’ సిద్ధపడుతున్నారు. కార్తవీర్యార్జునుడి వేయి చేతులనూ భార్గవ రాముడు ఒక్క గొడ్డలి వేటుతో నరికేశాడు. పేదవర్గాల ప్రజలు చైతన్యమనే ఆయుధాన్ని విసిరితే పెత్తందార్ల సహస్ర బాహువులూ తెగిపడక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అనగనగా ఒక చైనా కథ
పై పటంలోని ఆక్సాయిచిన్ ప్రాంతం ఇప్పటికే చైనా ఆక్రమణలో ఉన్నది. లదాఖ్, గిల్గిట్ – బాల్టిస్తాన్లను కలిపి భారత ప్రభుత్వం ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. కానీ, గిల్గిట్ – బాల్టిస్తాన్ పాక్ ఆక్రమణలో ఉన్నది. మనం కేంద్ర పాలితంగా ప్రకటించుకొన్న ఈ రెండు ప్రాంతాలు చైనాకే చెందుతాయనే తర్కాన్ని ప్రతిపాదించేందుకు చైనా సిద్ధపడుతున్నది. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ కార్యక్రమానికి ఈ ప్రాంతం కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనా ఓ కొత్త కథానికను రచిస్తున్నది. చైనావాళ్లు ఒక పాత కథను కొత్త పద్ధతిలో ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. నవరసాల మేళవింపుతో జనరంజ కంగా ఆ కథను చెప్పాలనుకుంటున్నారు. ఈ కథకు లోకం ఊకొడితే సరిహద్దుల్లో తమ సైనికుల గోడదూకుళ్లకు క్లీన్చిట్ దొరికినట్టే. ఈ కథ చెప్పాలన్న ఆలోచన ఈనాటిది కాదు. ఇంచు మించు ‘చైనా డ్రీమ్’కు ఉన్నంత వయసు ఈ ఆలోచనకు కూడా ఉన్నది. ఐరోపావాళ్లు నల్లమందు యుద్ధాలతో చింగ్ వంశ సామ్రాట్టు మెడలు వంచినప్పుడు చైనా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆ అవమానంలోంచి పుట్టిందే ‘చైనా డ్రీమ్స్’. అప్పటివరకూ ప్రపంచంలో తామే అందరికన్నా గొప్పవాళ్లమనే అభిప్రాయంతో చైనా ప్రజలుండేవారు. వారికి అందుబాటులో ఉన్న చరిత్ర, పుస్తకాలు ఈ అభిప్రాయాన్ని కలిగించాయి. ఐరోపావాళ్లు ఈ అభిప్రాయాన్ని అవహేళన చేశారు. మళ్లీ పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలనే సంకల్పం చైనీయుల మెదళ్లలో మొగ్గతొడిగిందప్పుడే. ఆధునిక చైనా నిర్మాత చైర్మన్ మావో ఝెడాంగ్ ‘చైనా డ్రీమ్’ను పట్టాలెక్కించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని బలంగా ముందుకు తెచ్చింది మాత్రం ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్. జిన్పింగ్ అధికారంలోకి వచ్చిందే తడవుగా ‘చైనా డ్రీమ్’ గురించి భజించడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. ప్రపంచపు వస్తూత్పత్తి కార్ఖానాగా అది మారింది. ‘చైనా డ్రీమ్’లో మిగిలిన భాగం అగ్రరాజ్యంగా అవతరించడం. నాలుగువేల సంవత్సరా లకు పైగా అందుబాటులో ఉన్న చరిత్రలో పూర్వపు రాజులు జయించిన, పాలించిన భూభాగాలన్నింటినీ మళ్లీ చైనాలో కలి పేసుకోవడం. ఈ రెండు అంశాల మీదా జిన్పింగ్ దృష్టి నిలిపారు. జిన్పింగ్ తలకెత్తుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కార్యక్రమం పూర్తిగా సాకారమైతే ప్రపంచంలోని కీలక భూభాగాల మీద, వనరుల మీద, మార్కెట్ల మీదా చైనాకు ఆధిపత్యం లభిస్తుంది. ఈ ఆధిపత్యమే అగ్రరాజ్య హోదాకు గుర్తు. బీఆర్ఐ పథకంలో అత్యంత వ్యూహాత్మకమైన భూభాగం పూర్వపు ఉమ్మడి జమ్ము–కశ్మీర్ ప్రాంతం. ఇందులో ఐదు ప్రధాన భౌగోళిక ఉపవిభాగాలున్నాయి. జమ్మూ ప్రాంతం, కశ్మీర్ లోయ, లదాఖ్, గిల్గిట్–బాల్టిస్తాన్, ఆక్సాయి చిన్లు ఆ విభాగాలు. కశ్మీర్ లోయలో పడమటి భాగం, గిల్గిట్ బాల్టిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయి. ఆక్సాయి చిన్ చైనా ఆక్రమణలో ఉన్నది. జమ్ము ప్రాంతం, మిగిలిన కశ్మీర్ లోయ, లదాఖ్లు భారత్లో ఉన్నాయి. ఇటీవలే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము–కశ్మీర్ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం విభజించింది. లదాఖ్ను, పాక్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్ము–కశ్మీర్లను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆక్సాయిచిన్ను లదాఖ్లో అంతర్భాగంగా భారత్ పరిగణిస్తుంది. ఆక్సాయిచిన్ నుంచి దక్షిణంగా కొద్ది మైళ్ల దూరంలోనే ప్యాంగ్యాంగ్ సో సరస్సు ఉంటుంది. ఆ కొద్ది భూభాగాన్ని అదుపులోకి తీసు కుంటే సరస్సుకు ఉత్తర, తూర్పు భాగాలు పూర్తిగా చైనా వశ మవుతాయి. ఈ వ్యూహం ప్రకారం జరిగిందే గల్వాన్ ఘర్షణ. తాజా అనుమానాల ప్రకారం ఇప్పుడు మొత్తం లదాఖ్పైనా, పాక్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్–బాల్టిస్తాన్ పైనా కూడా చైనా కన్నేసింది. ఇప్పుడు మనం రెడీమేడ్గా విడగొట్టిన రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకదాని మీద చైనా గురిపెట్టినట్టు కనిపిస్తున్నది. చైనా కొత్తగా చెప్పబోయే కథలో ఈ అంశం ఉండబోతున్నది. టిబెట్ను చైనా పశ్చిమ ప్రావిన్స్ షింజియాంగ్ రాజధాని కష్కర్కు అనుసంధానిస్తూ ఆక్సాయిచిన్ మీదుగా ఇప్పటికే భారీ రహదారిని చైనా అభివృద్ధి చేసింది. అక్కడి నుంచి లదాఖ్ మీదుగా కారాకోరం హైవేను కలుపుతూ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే చైనా బీఆర్ఐ కార్యక్రమానికి పెద్ద ఊతం లభిస్తుంది. లదాఖ్, గిల్గిట్–బాల్టిస్తాన్ల మధ్య 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల షాక్స్గమ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ గతంలోనే ధారాదత్తం చేసింది. ఐనా కూడా ఈ ప్రాంతాన్ని మొత్తంగా కబళించడానికే చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గిల్గిట్ – బాల్టిస్తాన్ నుంచి దక్షిణ ముఖంగా పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రాన్ని చేరుకోవచ్చు. అక్కడ పాక్ తీరంలో గ్వాదర్ నౌకా స్థావరాన్ని కూడా ఇప్పటికే చైనా ఏర్పాటు చేసుకున్నది. హిందూ మహా సముద్రంలోకి వెళ్లడానికి చైనాకు రెండోమార్గం లభ్యమవుతుంది. గిల్గిట్ నుంచి పశ్చిమంగా అఫ్గానిస్తాన్ మీదుగా పశ్చి మాసియా చేరువవుతుంది. ఇరాన్తో చైనా సంబంధాలు ఇటీ వల గణనీయంగా మెరుగైన నేపథ్యంలో ఈ వెసులుబాటు చైనాకు లాభిస్తుంది. ఉత్తర దిశలో సెంట్రల్ ఏసియన్ రిపబ్లిక్ లపై కర్ర పెత్తనానికి కూడా ఉపయోగపడుతుంది. షింజియాంగ్ రాష్ట్రంలోని వీగర్ ముస్లింల అసంతృప్తికి సెంట్రల్ ఏసియా ఆజ్యం పోయకుండా చూసుకోవచ్చు. పైగా గిల్గిట్ – బాల్టిస్తాన్ అపారమైన ఖనిజ సంపదకు ఆలవాలమని భావిస్తున్నారు. హిమనీ నదాలకు నిలయం ఈ ప్రాంతం. ఈ నదాల్లో అపా రమైన జలరాశి నిక్షిప్తమై ఉందట! ఈ ప్రాంతంలో సింధు నది, దాని ఉపనదుల మీద జలవిద్యుత్కేంద్రాలను నిర్మిస్తే 40 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చట. ఇంత కీలకమైన ప్రాంతం కనుకనే చైనా కన్నేసింది. మరి కబళించేదెట్లా? షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురావస్తు పరిశోధన (ఆర్కియాలజికల్ సర్వే) మీద చైనా ప్రభుత్వానికి ఆపేక్ష పెరిగింది. టిబెట్ ప్రాంతపు ఉజ్వల గతాన్ని వెలికి తీయడానికి పలుచోట్ల తవ్వకాలు మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వం ఐదారు శతాబ్దాల నుంచి సుమారు వెయ్యేళ్లపాటు టిబెట్ భూభాగంలో షాంగ్షుంగ్ రాజ్యం ఓ వెలుగు వెలిగిం దనీ, ఆనాటి నిర్మాణ కౌశలం, నాగరికతలపై సర్వే నిపుణులు ఇస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ మీడియాలో అడపాదడపా అచ్చవుతూనే ఉన్నాయి. మూతి ముడుచుకుని బిగదీసుకున్న ట్టుగా ఒక బ్యూరోక్రాట్ మాదిరిగా కనిపించే జిన్పింగ్కు ఆర్కియాలజీ పట్ల గల మక్కువపై జనం ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కాకపోతే తవ్వకాల కేంద్రీకరణ ఎక్కువగా లదాఖ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ, టిబెట్ – ఇండియా సరిహద్దు ల్లోనూ కేంద్రీకృతం కావడమే మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. పశ్చిమ టిబెట్ ప్రాంతంలోనూ, ప్రస్తుత లదాఖ్, గిల్గిట్– బాల్టిస్తాన్ ప్రాంతంలోనూ షాంగ్షుంగ్ (ఝాంగ్ ఝుంగ్) రాజ్యం విస్తరించి ఉండేదనీ, క్రమంగా టిబెట్ ప్రాంతమంత టికీ విస్తరించిందనీ చెబుతున్నారు. టిబెట్తోబాటు అరుణాచల ప్రదేశ్, భూటాన్, నేపాల్ ప్రాంతాలు (లదాఖ్ సహా) కూడా ఒక దశలో షాంగ్షుంగ్ రాజ్యంలో భాగంగా ఉండేవట! వాటికి శాస్త్రీయ ఆధారాలను ‘సమకూర్చే’ పనిలో ఇప్పుడు చైనా బిజీగా ఉన్నదట! ఆర్కియాలజీ నిపుణులు రేయింబవళ్లు ఈ అంశంపై కృషి చేస్తున్నారు. టిబెట్కు బౌద్ధమత సంక్రమణ కూడా షాంగ్షుంగ్ ద్వారానే జరిగింది. ఏడో శతాబ్దంలో అప్ప టికే ప్రాభవం తగ్గిన షాంగ్షుంగ్ను టిబెట్ ఆక్రమించింది. 1950వ దశకంలో టిబెట్ను దురాక్రమణ గావించక ముందు భారత్కు చైనాతో గట్టు్ట పంచాయతీ లేదు. అది మన సరిహద్దు దేశం కాదు. టిబెట్తోనే ఉత్తరాన లదాఖ్ నుంచి తూర్పున అరుణాచల్ వరకు సరిహద్దు ఉన్నది. భారత్– టిబెట్ల మధ్యన బ్రిటిష్ వాళ్లు గీసిన మెక్మహాన్ సరిహద్దు రేఖ చెల్లుబాటయింది. చైనా దురాక్రమణ తర్వాత ఆ సరిహద్దు రేఖను గుర్తించడానికి అది నిరాకరిస్తున్నది. సరిహద్దు రేఖలు సామ్రాజ్యవాదుల కుట్రగా చైనా అభివర్ణిస్తున్నది. భారత్తో పాటు చాలా దేశాల్లో నేటికీ టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష పట్ల ఇంకా సానుభూతి వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో షాంగ్షుంగ్ నాగరికతను తవ్వి తీయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. షాంగ్షుంగ్ నాగరికతకు చైనా ప్రాచీన సామ్రాజ్యాలకు ఉన్న సారూప్యతనూ, సామీప్యతనూ నిర్ధారించడం కోసం చైనా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే షాంగ్షుంగ్ రాజ్యం చైనాదవుతుంది. ఈ రాజ్యంలోంచి ఉద్భవించినది గనుక టిబెట్ కూడా తమదే అవుతుంది. టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష చెల్లదు. టిబెట్కు ఆధారం షాంగ్షుంగ్ రాజ్యం కనుక ఆ రాజ్యంలో ఉన్న భాగాలన్నీ టిబెట్కే చెందుతాయి. ఆ లెక్కన గిల్గిట్– బాల్టిస్తాన్ దగ్గర్నుంచి లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లు కూడా టిబెట్లో అంతర్భాగమవుతాయి. టిబెట్ చైనాలో అంతర్భాగం కనుక సహజంగానే ఇవన్నీ తమ ప్రాంతాలేనని చైనా వాదించబోతున్నది. షాంగ్షుంగ్ కథ ద్వారా తన విస్తరణ కాంక్షను హేతుబద్ధం చేసుకోవడానికి చైనా అడుగులు వేస్తున్నది. రానున్న కాలంలో ఈ ప్రాంతాల్లో మరిన్ని ఘర్షణలు, సరిహద్దులు దాటడం వంటి ఘటనలు జరగవచ్చు. పూర్తిస్థాయి యుద్ధానికి మాత్రం చైనా ఒడిగట్టకపోవచ్చు. రెండూ అతిపెద్ద దేశాలైనందువల్ల, మిలిటరీ పరంగా బలమైన దేశాలైనందువల్ల, అణ్వస్త్ర రాజ్యాలైన కారణంగా అటువంటి దుస్సాహసం చేయక పోవచ్చు. వాటికంటే ఆర్థిక కారణాలు మరీ ముఖ్యమైనవి. చైనా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ది ఎనిమిదో స్థానం. చైనా మొత్తం ఎగుమతుల్లో కేవలం మూడు శాతం మాత్రమే. కానీ చైనా – భారత్ వాణిజ్యంలో చైనాకు భారీ మిగులు ఉంటున్నది. చైనావాళ్లు 94 బిలియన్ డాలర్ల కిమ్మత్తయిన సరుకులను ఎగుమతి చేస్తే భారత్ నుంచి 21 బిలియన్ డాలర్లకు సరిపడా దిగుమతులను మాత్రమే చేసుకుంటున్నారు. ఈ ద్వైపాక్షిక వ్యాపారంలో భారత్కు 73 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు. ఆ మేరకు చైనాకు లాభం. వాణిజ్యంలో చైనాకు లాభాలు పండించే దేశాల్లో భారత్ది నాలుగో స్థానం. భారత పారిశ్రామిక రంగం, వినియోగదారుల మార్కెట్ చైనా మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్పై స్పందిస్తూ అది భారత్కే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని నీతిఆయోగ్ మాజీ వైస్చైర్మన్ పనగారియా హెచ్చరించడం గమనార్హం. కనుక రెండు దేశాలు యుద్ధానికి సిద్ధపడకపోవచ్చు. కానీ చైనా తన విస్తరణ కాంక్షను సమర్థించుకోవడానికి క్రమంగా చొచ్చుకొని రావడాన్ని హేతుబద్ధం చేసుకోవడానికీ పురావస్తు పరిశోధనలతో ముందుకొస్తున్నది. ఇప్పుడది ఆర్కియాలజికల్ వార్ను ప్రారంభించింది. షాంగ్షుంగ్ నాగరికతపై అందు బాటులో ఉన్న సమాచారాన్ని చదువుతున్నప్పుడు, చైనా కంటే భారత సంస్కృతితోనే దానికి ఎక్కువ సంబంధం ఉన్నట్టు సాధారణ పాఠకుడికి కూడా అర్థమవుతుంది. కానీ, మన ఆర్కి యాలజీని మనం దేశ సమగ్రత కోసం, జాతి గౌరవం కోసం వాడటాన్ని మానేశాం. ఇప్పుడు మన పురావస్తు పరిశోధనంతా మసీదులకు మాత్రమే పరిమితమైంది. మసీదులను తవ్విపోసి, ఆలయాల ఉనికిని వెలికితీసే పనిలో మునిగి తేలుతున్నది. చైనావాళ్లు వారి జాతీయతను ఇనుమడింపజేసుకోవడానికి మనం మన జాతిని చీల్చడానికి ఆర్కియాలజీని ఉపయోగించు కుంటున్నాము. ఇద్దరి మధ్యన ఇదీ తేడా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టార్చ్ బేరర్!
మనదేశంలో ఐడియాలజీ అనే ‘పదార్థం’ అంతర్ధాన మైనట్టేనా? సిద్ధాంతం అనే పేరుతో ఓ వెలుగు వెలిగిన భావసంచయానికి మన రాజకీయ వ్యవస్థ పాడె కట్టేసిందా? రాజకీయ నాయకులను ఈ ప్రశ్నలు అడిగితే వారు ఔననే సమాధానం చెబుతారు. అవకాశవాదులకు ఈ పరిస్థితి అయా చిత వరంగా పరిణమించింది. శషభిషలకు తావులేకుండా అవ లీలగా వారు అధికార పీఠం పంచన చేరగలుగుతున్నారు. లౌకిక రాజకీయాల్లో దశాబ్దాల తరబడి తలపండిన నేతలు కూడా సునాయాసంగా మతపార్టీల్లో చేరగలుగుతున్నారు. బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఎర్రజెండాలు మోసిన వందలాది భుజాలపై ఇప్పుడు కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. ఈ ధోరణి ఇప్పుడు వేగం పుంజుకున్నది కానీ, పాతికేళ్ల కిందనే ప్రారంభమైంది. అంతకుముందు కూడా అడపాదడపా ఫిరాయింపులు ఉన్నా అవి సిద్ధాంత పరిధుల్ని దాటేవి కావు. కమ్యూనిస్టులు బీజేపీలో చేరడం, బీజేపీ వారు కమ్యూనిస్టుల్లో కలవడం ఊహాతీతమైన విషయం. అలాగే లౌకికవాదులు మత పార్టీల్లో చేరడం కూడా! నిరక్షరాస్యులైన పల్లెప్రజల్లో కూడా ఈ కట్టుబాటు బలంగా ఉండేది. ఒక తండ్రికి పుట్టి మరో తండ్రి పేరు ఎట్లా చెప్పుకుంటామని వారు ప్రశ్నించేవారు. కష్టా లెదురైనా, నష్టాలెదురైనా నమ్ముకున్న పార్టీలోనే జీవితాంతం కొనసాగేవారు. ఆ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉండేవారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందనీ, ఇప్పుడున్న సిద్ధాం తమల్లా టూరిజం మాత్రమేననీ పాతికేళ్ల కిందనే చంద్రబాబు ప్రకటించారు. కమ్యూనిజం అనేది ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం. వంద సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన భావజాలం. ఆ సిద్ధాంతం వెదజల్లిన విత్తనాలు మొలకెత్తని నేల భూగోళం మీద ఏ ఖండంలోనూ లేదు. అటువంటి ఉజ్జ్వల చరితకు చావుడప్పు కొట్టడం ద్వారా చంద్రబాబు సిద్ధాంత రహిత రాజకీయాలకు స్వాగతం పలికాడు. కమ్యూనిస్టు చెట్టుకే కాసిన కుక్కమూతి పిందెలు కొన్ని అదే చంద్రబాబు పల్లకీ మోయడానికి బోయీలుగా ముందువరసలో నిలబడటాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ దౌర్భాగ్యాన్ని కూడా సిద్ధాంత రహిత రాజకీయాల్లో భాగంగానే గుర్తించాలి. సోవియట్ యూనియన్ పతనం (1991) తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది ఇక సిద్ధాంతాలకు కాలం చెల్లినట్టేనని భావించారు. అప్పటివరకూ రెండు ప్రధాన సిద్ధాంతాలైన కమ్యూనిజం – కేపిటలిజమ్ ప్రపంచాన్ని రెండుగా చీల్చాయి. ఒక వ్యవస్థ పతనమయింది కనుక ఇక సిద్ధాంతాలతో పనేముంది అనేది ఒక వాదన. ఇది పూర్తిగా అవకాశవాద ధోరణి. కేపిటలిస్టు ఆర్థిక వ్యవస్థకు ప్రజాస్వామ్యమే ఆలంబన. ప్రజాస్వామ్యమూ, సైద్ధాంతికత అనేవి అవిభాజ్యమైన అంశాలు. తత్త్వవేత్తలు సిద్ధాంతీకరించిన ప్రమాణాల పునాదుల పైనే ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం జరిగింది. జాన్లాక్, మాంటెస్క్యూ, రూసో వంటి తత్త్వవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఫ్రెంచి, అమెరికా విప్లవాలను మండించాయని మనకు తెలుసు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆ విప్లవా ల్లోనే ప్రభవించాయన్న సంగతి కూడా తెలిసిందే. కేపిటలిస్ట్ మార్కెట్ ఎకానమీని అనుసరించే ‘ప్రజా స్వామ్య’ దేశాల్లో కూడా క్రమంగా కొన్ని మార్పులు వచ్చాయి. అది కమ్యూనిస్టు శిబిరంతో ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం వల్ల కావచ్చు. ఆయా దేశాల్లోని సోషలిస్టు రాజకీయ శక్తుల ఒత్తిడి వల్ల కావచ్చు. వాటికంటే ముఖ్యమైనది – నియంత్రణ లేని మార్కెట్ ఎకానమీ వల్ల అసమానతలు పెరిగి అన్నార్తులు తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచి ఉండటం. ఈ కారణంగా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య దేశాలన్నీ క్రమంగా ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలుగా పరావర్తనం చెందాయి. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, లౌకిక విధానాలు, బహుళ పార్టీ రాజ కీయ వ్యవస్థ తదితర సంస్కరణలతో సైద్ధాంతిక విభజనకు దారితీసే అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణల వల్ల అసమానతలేమీ తగ్గలేదు. ఆకలి కేకలను తగ్గించగలిగారు. కానీ, అవకాశాల్లో సమానత్వం సిద్ధించలేదు. ఆధునిక ప్రజాస్వామ్య సిద్ధాంతానికి మూల స్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి సంపన్నులకే దఖలుపడ్డాయి. సమాజంలోని మెజారిటీ ప్రజలు పేదరికం చెరలో ఉండగా, వెనుకబాటుతనంలో ఉండగా ఈ ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు నిరర్థకాలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంతకంటే మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం కొన్ని ప్రతిపాదనలూ, ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాల్లోంచి పుట్టిన భావనే ‘సోషల్ కేపిటలిజమ్’ అనే ఆర్థిక వ్యవస్థ. ఇక్కడా ప్రైవేట్ పెట్టుబడి ఉంటుంది. చైనా వంటి కమ్యూనిస్టు దేశంలో కూడా ప్రైవేట్ పెట్టుబడి అనివార్య మైనప్పుడు అది లేని వ్యవస్థను ఊహించడం అసాధ్యం. అయితే ఇక్కడ ప్రైవేట్ పెట్టుబడితోపాటు మానవ వనరులను, ప్రకృతి వనరులను కూడా పెట్టుబడిగానే పరిగణిస్తారు. ప్రస్తుత లిబరల్ డెమోక్రసీ అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానంలో ఈ రెండు వనరులనూ పెట్టుబడులుగా కాకుండా సరుకులుగా పరిగణిస్తున్నారు. మానవ వనరులు పెట్టుబడిగా పరివర్తన చెందడానికి వీలుగా వారి నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ పెంచవలసి ఉంటుంది. వారిని పేదరికం నుంచి వెలికితీయవలసి ఉంటుంది. అందుకోసం ప్రజాస్వామ్య వ్యవస్థ కొంత పెట్టుబడిని పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టు అర్థం. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలకు మనదేశం కూడా దూరంగా ఏమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి మనదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను, ప్రణాళికాబద్ధమైన ఆర్ఢిక విధానాలను అమలు చేసింది. నెహ్రూ ప్రవచించిన సోషలిస్టు తరహా లౌకిక సూత్రాలను అనుసరించింది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలను, రాజ్యాంగ ఆశయాలను సాకారం చేసే ప్రయత్నాలు చేసింది. అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ సిద్ధాంతబద్ధమైన వైఖరిని అనుసరించింది. సోవియట్ యూనియన్ పతనమైన సమయం, మన దేశం ఆర్థిక సంస్కరణలను తలకెత్తుకున్న సమయం కాకతాళీయంగా ఒక్కటే. ఉదారవాద ఆర్థిక విధా నాలు దేశంలో సంపదను పెంచిన మాట నిజం. అదే సమ యంలో అసమానతలు మునుపటి కంటే పెరిగిన మాట కూడా యథార్థం. ప్రభుత్వం ఏ పార్టీదైనా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం రివాజైంది కనుక ఇక సిద్ధాంతాలతో పనేమిటి అనే అవకాశవాద ఆలోచన ఆ రోజుల్లోనే తెరపైకి వచ్చింది. ఈ ఆలోచనకు ఆద్యుడు చంద్రబాబునాయుడు. కమ్యూనిజం కంటే టూరిజం గొప్ప తరహా వాక్యాలు ఆయన నోటి వెంట జాలు వారాయి. ఆయన వ్యతిరేకత కేవలం కమ్యూనిజంపై మాత్రమే కాదు, సిద్ధాంత నిబద్ధత మీదనే ఆయన వ్యతిరేకత. సైద్ధాంతిక నిబద్ధత విలువల్ని కూడా కోరుకుంటుంది. విలువల్ని తుంగలో తొక్కడం ద్వారానే ఆయన అధికారంలోకి రాగలిగారు. కొనసాగ గలిగారు. కనుక సిద్ధాంత నిబద్ధత, విలువలు ఆయనతో మ్యాచ్ కాలేని విషయాలు. సిద్ధాంత రాహిత్యం అనేది అవకాశవాదానికి, స్వార్థపర త్వానికి, అవధుల్లేని దోపిడీకి అద్భుతంగా ఉపయోగపడే సాధనం. దాదాపుగా ఆ తరం రాజకీయ నాయకులందరికీ ఈ సిద్ధాంత రాహిత్య వైరస్ అంతో ఇంతో సోకింది. ఫలితంగా దేశంలో అసమానతలు ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. సంపద పెరిగిన సంతృప్తిని ఈ అసమానతలు మింగేస్తున్నాయి. ఒక్కశాతం కుబేరుల చేతిలో 55 శాతం దేశ సంపద బందీగా ఉండటం ఎవరికి గర్వకారణం? 10 శాతం శ్రీమంతుల కుటుం బాల్లో 70 శాతం జాతి సంపద పోగుబడటం ఎవరికి గొప్ప? 119 మంది బిలియనీర్ల సంపద మనదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉన్నందువల్ల మనం సిగ్గుపడాలా? ఆనందపడాలా? ఏటా ఆరున్నర కోట్లమంది ప్రజలు ఆస్పత్రి ఖర్చుల ఫలితంగా అప్పులపాలై దారిద్య్రంలో జారిపోవడం దుఃఖదాయకం కాదా? సంపన్న పెట్టుబడిదారులూ – పేదప్రజల మధ్య వ్యత్యాసం మాత్రమే కాదు. వేతన జీవుల మధ్య వ్యత్యాసం కూడా కలవరం కలిగించే మరో అంశం. ఒక పెద్ద గార్మెంట్ పరిశ్రమలో చీఫ్ ఎగ్జిక్యూటివ్కు ఒక సంవత్సర కాలంలో వచ్చే వేతనం మొత్తాన్ని సంపాదించాలంటే, కనీస వేతనం పొందే గ్రామీణ కార్మికునికి 961 సంవత్సరాలు పడుతుందట! ఎన్ని తరాలు గడిచిపోవాలి? మన డెమోక్రసీ సృష్టించిన ఈ అసమానతలను తొలగించి మానవీయ సమాజానికి పునాదులు వేయగల సోషల్ డెమోక్రసీ వైపు ఈ వ్యవస్థను ఎవరు నడిపించాలి?. అటువంటి మార్పులకు టార్చ్ బేరర్గా నిలబడగలిగిన నాయకుడెవరైనా ఉన్నారేమో చూడాలంటే మనం నవతరం నాయకత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పార్టీ వ్యవస్థల ప్రభావం తగ్గుతూ, నాయకుల ప్రాబల్యం పెరుగుతున్న దశ కనుక నాయకత్వ పరిశీలనే సమంజసమైనది. అందులోనూ ప్రభావవంతమైన నాయకత్వ దక్షత గలిగిన వారిని పరికిం చడమే ఉచితం. అరవై నుంచి ఎనభై యేళ్ల వయసున్న నేత లంతా సంప్రదాయ రాజకీయ విధానాల్లోంచి వచ్చినవారే. కొందరికి ఉద్యమాల నేపథ్యం ఉన్నది. కానీ, ప్రజలందరినీ సాధికారం చేయడం, వ్యవస్థను సోషల్ డెమోక్రసీ వైపు మళ్లించడం వంటి ఎజెండాను చేపట్టలేదు. నవతరం నేతల్లో ఫిఫ్టీ (50) క్లబ్, ఆ క్లబ్కు చేరువవుతున్న నాయకులున్నారు. ఫిఫ్టీ క్లబ్లో ప్రభావం చూపగల నాయకుల్లో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఆదిత్యనాథ్ ఉన్నారు. అమిత్ షా (58) అరవైకి చేరువలో ఉన్నారు. రాహుల్గాంధీ తనకు జాతీయ స్థాయిలో క్రియాశీల పాత్ర పోషించే అవకాశం లభించినప్పటికీ సిద్ధాంత రాహిత్య పరిపాలనలోనే కొనసాగారు. పేదలకు ఉపకరించిన ఒక్క ‘నరేగా’ కార్యక్రమం తప్ప మహిళా సాధికార తకు గానీ, విద్యా, వైద్య రంగాల పటిష్ఠతకు గానీ చేపట్టిన మరో కార్యక్రమం లేదు. కేజ్రీవాల్ కొంత భిన్నమైన నాయకుడు. విద్య – వైద్య రంగాల్లో ఆయన తన మార్కును ప్రదర్శించాడు. అయితే 70 శాతం గ్రామీణ ప్రజలున్న దేశంలో ఆయన పూర్తి పట్టణ ప్రాంతమైన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్ పాలనా ఫలితాలను చూసిన తర్వాతనే ఆయనను అంచనా వేయగలం. ఆదిత్యనాథ్కు సిద్ధాంతాలున్నాయి. ఆయనవి హిందూ రాష్ట్ర సిద్ధాంతాలు. లౌకికత్వానికి చోటు లేని డెమోక్రసీ అసలు డెమోక్రసీగానే పరిగణించలేము. ఇక సోషల్ డెమోక్రసీ గురించి ఆలోచించడం వృథా! ఫిఫ్టీ క్లబ్కు చేరువవుతున్న ప్రభావశీల నేతల్లో అఖిలేశ్ యాదవ్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేటీ రామారావు తదితరు లున్నారు. అఖిలేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో క్యాస్ట్ (కుల) పోలరైజేషన్ తీసుకురాగలిగారు గానీ క్లాస్ (వర్గ) పోలరైజేషన్ను సాధించలేకపోయారు. పేదవర్గాల సాధికారత సాధనకు వర్గ చైతన్యం కూడా అవసరం. కేటీఆర్ నాయకత్వ పటిమను చాటుకుంటున్నప్పటికీ ఇంకా తండ్రిచాటు బిడ్డకిందే లెక్క. ఆయన సొంతంగా పగ్గాలు చేపట్టిన తర్వాతనే సోషల్ డెమోక్రసీ పట్ల ఆయనకున్న అభిప్రాయాలు వ్యక్తమయ్యేది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే త్రిరత్నాలకు జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో పెద్దపీట వేశారు. పౌరులకు నిజమైన స్వేచ్ఛ, సమానత్వం అనేవి వారిని పేదరికం నుంచి విముక్తి చేసినప్పుడే సాధ్యమవుతాయనే తన విశ్వాసాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానం తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నదని ప్రకటించారు. రాజ్యాంగ పీఠికలోని అంశాలతోపాటు ప్రపంచ బ్యాంకు సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కూడా గమనంలోకి తీసుకుంటూ బడ్జెట్లకూ, ప్రభుత్వ విధానాలకూ రూపకల్పన చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఇప్పటికే పలు రాష్ట్రాల బృందాలను ఆకర్షించాయి. మహిళా సాధికారతకు చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శక పాలనకు సంబంధించి ఇంతకంటే ఇంకా ముందుకు వెళ్లడం అసాధ్యం. నిన్ననే జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లా డుతూ ప్రభుత్వ పేదల అనుకూల విధానాలపై పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారనీ, మనం ఓడిపోతే పేద ప్రజలు నష్టపోతా రనీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇది నిజం. సాధికారత కోరుకుంటున్న పేద ప్రజల మీద, సోషల్ డెమోక్రసీని కాంక్షిస్తున్న వర్గాల మీద, పేదరికం నుంచి విముక్తిని కోరు కుంటున్న ప్రజల మీద ఆంధ్రప్రదేశ్లో పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదవడాన్ని వారు ఈసడించుకుంటున్నారు. రాజధాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు ఇస్తే ‘కుల’ సమతౌల్యం దెబ్బతింటుందని చీదరించు కుంటున్నారు. ‘మీ వర్గాల్లో ఎవరు పుడతార’ని అసహ్యించు కుంటున్నారు. ‘మగపిల్లాడు పుట్టాలి గానీ ఆడపిల్ల పుట్టడమే మిట’ని ఎకసెక్కాలు చేస్తున్నారు. ‘దళితులకు మీకెందుకురా అధికారాలు, పదవులూ’ అంటూ దబాయిస్తున్నారు. పేద మహిళలు 30 లక్షలమందికి ఇళ్లు కట్టించడాన్ని ఆక్షేపిస్తూ కోర్టుల మెట్లెక్కుతున్నారు. ఈ వర్గాలకు అండగా నిలబడిన జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం మీద కత్తిగట్టారు. ‘కట్టుకథకూ – పెట్టు బడికీ పుట్టిన విషపుత్రిక... ఆంధ్రపత్రిక’ అని అప్పుడెప్పుడో శ్రీశ్రీ అన్నారు. ఇప్పుడు ‘రంకుతనానికీ – బొంకుతనానికీ పుట్టిన మాఫియా... ఎల్లో మీడియా’ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని దాడులకు గురవుతున్న సోషల్ డెమోక్రసీ వైపు జరుగుతున్న ప్రయాణానికి వైఎస్ జగన్ టార్చ్ బేరర్గా నిల బడ్డారు. ఆ రాష్ట్ర పేద ప్రజలు మరో మూడు రోజుల్లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇక భారతీయ అస్మిత!
గుజరాతీ ‘అస్మిత’ (ఆత్మగౌరవం) పులకించిపోయింది. ఆ పులకింత వెల్లువలో ఏడో వరస విజయం బీజేపీ ఒడిలోకి వచ్చి పడింది. గుజరాత్లో కనిపించే ఎత్తయిన విగ్రహం సర్దార్ పటేల్దే కావచ్చు. కనిపించని ఎత్తయిన విగ్రహం ఇప్పుడు గుజరాతీ అస్మిత. అది పులకించకుండా ఎలా ఉంటుంది? గుజరాతీ బిడ్డ నరేంద్ర మోదీ దేశంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. నెంబర్ టూగా మరో గుజరాతీ సేఠ్ అమిత్షా చక్రం తిప్పుతున్నారు. వారిద్దరి ప్రభావం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థను గుజరాతీ వ్యాపారులు నడిపిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు అనేకం దేశంలోని ఇతర ప్రాంతా లకు జెల్లకొట్టి గుజరాత్ బాట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ‘కెమ్ చో’ (ఎలా ఉన్నావ్) వంటి కొన్ని గుజరాతీ మాటలు నేర్చు కుంటున్నారు. మాట్లాడుతున్నారు. గుజరాతీ అస్మితకు ఇంతకంటే ఏంకావాలి? మధ్యతరగతి మందహాసం చేస్తున్నది. ఉన్నత వర్గాలు మీసం మెలేస్తున్నాయి. దరిద్రనారాయణుల ‘న్యూసెన్స్’ గురించి ఆలోచించే ఓపిక ఇప్పుడు అస్మితకు లేదు. మోర్బీ వంతెన కూలిపోయింది. అయితే ఏమిటి? వందమందికి పైగా చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం, అధికారుల అవినీతి ఈ విషాదానికి కారణం. అఫ్కోర్స్! ప్రపంచ రాజ్య కూటముల్లో ఎలైట్ క్లబ్గా పరిగణించే జీ–20కి ఇప్పుడు గుజరాతీ బిడ్డ నరేంద్రభాయ్ నేతృత్వం వహిస్తున్నారు. ఏది ముఖ్యం? ఇంతకంటే ఎక్కువ దేశాలు సభ్యులుగా ఉన్న అలీనోద్యమానికి పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకులుగా ఉన్నారు. ఇది రొటేషన్ పదవే కనుక వారు పెద్దగా పటాటోపాన్ని ప్రదర్శించలేదు. కానీ గుజరాతీలు వ్యాపార ప్రవీణులు. దీన్ని కూడా బ్రాండింగ్ చేసుకున్నారు. ఈ బిల్డప్ను ‘అస్మిత’ ఆమోదించింది. గుజరాతీ అస్మిత వేసిన తెరలకు ఆవల కూడా కొంత గుజరాతీ సమాజం ఉన్నది. అక్కడా ఓట్లుంటాయి. వాటికి ఏకైక హక్కుదారుగా ఉండవలసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనస్థితికి దిగజారింది. అహ్మద్ పటేల్ మరణం తర్వాత అది అనాధగా మారిపోయింది. కాంగ్రెస్ నిస్తేజమవడంతో దాని ఓట్లను కొల్ల గొట్టడానికి చీపురుకట్ట తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. పదమూడు శాతం కాంగ్రెస్ ఓట్లను చీల్చగలిగింది. ‘ఆప్’ చీల్చిన ఓట్ల కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుజరాత్ చరిత్రలో ఎన్నడూ ఎరగనంత ఘనవిజయం బీజేపీకి సాధ్యమైంది. వరసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన విషయమే. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ కూటమి ఒక్కటే ఇప్పటివరకూ బెంగాల్లో ఆ ఘనతను సాధించింది. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డును సమం చేసింది. ఏడవసారి గెలవడం, 52.5 శాతం ఓట్లను కొల్లగొట్టడం, 156 (182లో) సీట్లు సాధించడం స్వప్నతుల్యమైన విజయమే. బెంగాల్లో సీపీఎం కూటమి ఏడోసారి గెలిచినప్పుడు కూడా 50.5 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు గుజరాత్లో 10 పార్టీలు రంగంలో ఉంటే, అప్పుడు బెంగాల్లో 30 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే రెండు విజయాలూ సమాన మైనవే. కానీ, నేటి గుజరాత్ విజయాన్ని కనీవినీ ఎరుగని సునామీగా మేళతాళాలు మోగిస్తూ మీడియా ప్రకటించింది. ఇందులో పావలా వంతు ప్రాధాన్యం కూడా నాటి లెఫ్ట్ విజయానికి దక్కలేదు. దటీజ్ బీజేపీ! జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీతో పోల్చదగిన మరో నాయకుడు ప్రచారంలో లేడన్నమాట నిజం. ఆయన రాజకీయ కెరీర్లోనే ఇప్పుడు ఉచ్చదశలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన మేజిక్ ఎంతోకొంత పనిచేసే అవకాశం కూడా ఉన్నది. అయితే రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో అది పనిచేయాలన్న నియమం లేదు. హిమాచల్ప్రదేశ్ ఫలి తాలు ఈ అంశాన్ని నిర్ధారించాయి. ఈ రాష్ట్రం బీజేపీకి అనుకూల మైనదే. అసెంబ్లీ ఎన్నికల్లో చెరో అవకాశం ఇస్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటున్నది. 2019 ఎన్నికల్లో కమలం పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్లను కురిపించింది. సైనిక దళాల్లో ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పనిచేస్తుంటారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ కార్యక్రమాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. యాపిల్స్ పండించే రైతాంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతాంగ సమస్యను బీజేపీ పట్టించుకోకపోవడం మైనస్గా మారింది. జై జవాన్ – జై కిసాన్లిద్దరూ బీజేపీ ఓటమికి కారకులయ్యారు. మోదీ నాయకత్వం, హిందుత్వ, జాతీయవాదం వంటి అంశా లపై మెజారిటీ హిమాచలీయులకు ఎటువంటి పేచీ లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక అంశాల ఆధారంగానే వారు స్పందించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ను ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు కమలం పార్టీ ఏలింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ‘ఆప్’కి తలవంచక తప్పలేదు. ‘ఆప్’ ప్రస్తావించిన స్థానిక అంశాలపైనే ఓటర్లు స్పందించారు తప్ప మోదీ బొమ్మను పట్టించుకోలేదు. మునిసిపల్ అధికార యంత్రాంగంలో పేరుకొనిపోయిన అవినీతిని పెకిలిస్తామని ‘ఆప్’ ప్రచారం చేసుకున్నది. వీధి కుక్కల బెడద మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. వీధి వ్యాపారులను లంచాల నుంచి కాపాడతామని చెప్పింది. రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పింది. మునిసిపల్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఈ సాదాసీదా హామీల వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఈ ఎన్నికలతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఒక్క గుజరాత్లో అఖండ విజయం సిద్ధించినా, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరంలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవలసి ఉన్నది. డబుల్ ఇంజిన్ వ్యూహం హిమాచల్లో పనికిరాలేదు. గుజరాతీలు తమ ముఖ్యమంత్రిగా కూడా మోదీయే ఉన్నట్టు భావిస్తున్నారు. కనుక వారి దృష్టిలో అక్కడున్నది సింగిల్ ఇంజనే! విఫలమైన ఈ వ్యూహాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల్లో మళ్లీ అనుసరిస్తారా? పైగా సాధారణ ఎన్నికలకు ఏడాది వ్యవధి లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని డ్రెస్ రిహార్సల్గా పరిగణిస్తారు. సాధారణ ఎన్నికల ఆహార్యాన్ని ఎంతోకొంత ఈ ఎన్నికల్లో ప్రదర్శించవలసి ఉంటుంది. ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలపై విస్తృత చర్చ జరగ కుండా ఒక జాతీయ ఎజెండా, వీలైతే భావోద్వేగపూరితమైన అంశం చుట్టూ ప్రచారం కేంద్రీకృతమయ్యేలా బీజేపీ ప్రయత్నిస్తుంది. రాష్ట్రాల స్థానిక అంశాలపై చర్చలో బీజేపీ ఇరుక్కోవడమంటే మొసళ్ల మడుగులో గజేంద్రుడు పాదం మోపినట్టే! అప్పుడు ‘సిరికింజెప్పి, శంఖ చక్రములు’ సంధిస్తూ మోదీ వచ్చి వాలినా చేయగలిగిందేమీ ఉండదు. కనుక ఈ వేసంగిలో జరిగే కర్ణాటక ఎన్నికల నాటికే బీజేపీ సరికొత్త ఎజెండా శాంపుల్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీకి ఊరట కలిగించే విషయం ఒకటున్నది. వచ్చేయేడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ జాతీయ పార్టీలతోనే తలపడనున్నది. నాలుగు రాష్ట్రాల్లో వృద్ధ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. తెలంగాణలో నిన్ననే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి. కనుక తన కొత్త ఎజెండాపై డ్రెస్ రిహార్సల్ చేయడం సులభం. ఈసారి బీజేపీ ఏ నినాదంతో ముందుకు రావచ్చు? హిందూత్వ? జాతీయవాదం? ఆర్థికాభివృద్ధి? అన్నీ గుదిగుచ్చిన భారతీయ అస్మిత హారం? భారతీయ ఆత్మగౌరవ విజయాన్ని ఎలుగెత్తి చాటేందుకు సాధించిన విజయాలేమున్నాయి? హిందూత్వ అంశం తప్పకుండా ఉంటుంది. దండలో దారం మాదిరిగా ఇప్పుడూ ఉన్నది. ఇకముందు కూడా ఉంటుంది. బీజేపీ భౌతిక రూపాన్ని నడిపించే నాడీ మండలం ఆర్ఎస్ఎస్ అనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాల్లేవు. భారత రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన మరుసటిరోజే ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై స్పందించింది. ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదని అభిశంసించింది. మనుధర్మ శాస్త్రంలోని అంశాలను రాజ్యాం గంలో జొప్పించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ మూల సూత్రాలని డాక్టర్ అంబేడ్కర్ నొక్కి చెప్పారు. సమానత్వం అనేది భారతీయ భావన కాదంటారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్. భిన్నవర్గాల మధ్య సామరస్యతే భారతీయత అనేది ఆయన వాదన. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రవేశం ఫలితంగా అంబేడ్కర్ ప్రవచిం చిన రాజ్యాంగ మౌలిక ఆశయానికి దెబ్బతగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. అంటే ఆట మొదలైనట్టే కదా! భారతదేశం ఫెడరల్ వ్యవస్థగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నది. గురు గోల్వాల్కర్ తన రచనల్లో ఫెడరల్ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారు. దేశమంతా ఏకచ్ఛత్ర పాలన కింద, ఏకభాష (హిందీ), ఏకైక మతం (హిందూ)తో వర్ధిల్లాలనేది వారి ఆశయం. కొత్త పన్నుల విధానం (జీఎస్టీ), కొత్త విద్యావిధానాలను (ఎన్ఇపి) కూడా రాష్ట్రాల అధికారా లను కత్తిరించడానికి, వాటిని బలహీనపరచడానికి ఉపయోగి స్తున్న వైనం కనబడుతూనే ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ఎన్ఆర్సీ, హిజాబ్ నిషేధం వంటి పరిణామాల వెనుక హిందూత్వ ఎజెండా కనిపిస్తూనే ఉన్నది. గోహత్యా పాతకులుగా ముద్రవేయడం ద్వారా ఒక మతా వలంబుల్ని సమాజానికి దూరంగా నెట్టే ప్రయత్నమూ కట్టెదుటే ఉన్నది. కనుక హిందూత్వ ఎజెండా ఇప్పటికీ ఉన్నది. ఇంకా బలంగా ఉండబోతున్నది. మనదేశంలో తొంబయ్యవ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు కేవలం ఆర్థిక వ్యవస్థనే మార్చలేదు. సామాజిక, రాజకీయ వ్యవస్థలను కూడా ఆసాంతం మార్చి వేశాయి. ఎనభయ్యో దశకం తర్వాత పుట్టిన వాళ్లను ‘మిలీనియల్స్’ అంటున్నారు. ఈ మిలీనియల్స్, పోస్ట్ మిలీనియల్స్ తరాల్లో చరిత్ర, సమాజ పరిణామ శాస్త్రాల అధ్యయనం మృగ్యమైంది. అందువల్ల భావోద్వేగపూరితమైన, మతపరమైన, కులపరమైన అంశాలకు సులభంగా ప్రభావిత మవుతున్నారు. ఈ పరిణామం కూడా బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. సోషల్ మీడియాపై ఆ పార్టీకి ఉన్న పట్టు కారణంగా ఇకముందు కూడా ఉపయోగపడుతుంది. కనుక హిందూత్వ ఎజెండా ఇకముందు కూడా బలంగా ఉండబోతున్నది. కేవలం హిందూత్వ కార్డుతోనే ఎన్నికలకు వెళ్లడం కుదరదు కాబట్టి అందులో జాతీయవాదాన్ని మిక్స్ చేసి, ఆర్థికాభివృద్ధితో గార్నిష్ చేసుకుని ఎజెండాను వడ్డించవచ్చు. సరిహద్దుల్లో బలవంతుడైన చైనావాడితో ఢీ అంటే ఢీ అనడం, ఆక్రమిత కశ్మీర్ను హస్తగతం చేసుకుంటామని ప్రకటనలు చేయడం జాతీయ భావాలను ప్రేరేపితం చేసే కార్యక్రమాలే! అంతర్జా తీయ యవనికపై ప్రముఖపాత్రను పోషించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఆర్థికాభివృద్ధిని గురించి ఉటం కించడానికైతే గణాంకాలు అందుబాటులోనే ఉన్నాయి. 2014లో రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ 2022 నాటికి మూడున్నర ట్రిలియన్ డాలర్లకు చేరింది. తలసరి ఆదాయం లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను దాటేసి ఐదో స్థానంలోకి చేరింది. అయితే మానవ అభివృద్ధి సూచికలో మాత్రం దేశం 130వ స్థానం నుంచి 132కు దిగజారింది. మరి బలపడిన ఆర్థిక వ్యవస్థ మానవ అభివృద్ధికి ఎందుకు ఉపకరించలేదు? సృష్టించిన సంపద అంతా ఎక్కడికి వెళ్లింది? ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్టులో సమాధానం దొరుకుతుంది. సంపద అంతా పిడికెడు మంది చేతిలో కేంద్రీకృతమై ఉన్నది. 80 శాతం సంపద 10 శాతం శ్రీమంతుల చేతిలో ఉన్నది. అందులోనూ ఒక్కశాతం కుబేరుల చేతుల్లో 55 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నది. అయినప్పటికీ జీడీపీలోనూ, తలసరి ఆదాయంలోనూ పెరుగు దల కనిపిస్తున్నది కదా? అంబానీ ఆదాయం లక్షకోట్లు, అప్పారావు ఆదాయం లక్ష రూపాయలు అనుకుందాం. ఇద్దరి తలసరి ఆదాయం యాభైవేల కోట్ల యాభైవేల రూపాయలు అవుతుంది కదా! ఈ సంగతి తెలిస్తే అప్పారావు మూర్ఛపోతే పోవచ్చు గాక! లెక్క లెక్కే కదా! ఈ లెక్క ప్రకారం ఇండియా ఈజ్ షైనింగ్. ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజపేయి ప్రభుత్వం గతంలో దెబ్బతిన్నది. కనుక ఈ షైనింగ్లో ఈసారి హిందూత్వ మెరుపులు, జాతీయ తళుకులూ ఉండవచ్చు. ఇదొక సంభావ్యత మాత్రమే! కొత్త జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ రైతు రాజ్యాన్ని ఎజెండాగా ప్రకటించుకున్నది. కొత్తగా జాతీయ పార్టీ హోదా సాధించిన ‘ఆప్’కు ‘అవినీతి’ బాణం ఉండనే ఉన్నది. కాంగ్రెస్ సంగతేమిటో ఆ పార్టీలోనే ఇంకా ఎవరికీ తెలియదు. మూడు నాలుగు పాయలుగా చీలిన ప్రతి పక్షం మురిపిస్తుండగా బీజేపీ మెరిపించబోయే ఎజెండా కోసం దేశం ఎదురుచూస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జనసాధికార జైత్రయాత్ర!
చెరువు ఒడ్డున కొంగ ఒకటి ఒంటి కాలిపై నిలబడి జపం చేస్తున్నది. అది చేపల శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తున్నదట! నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి ఒకటి తీర్థయాత్రలు చేస్తున్నది. ఆ ఎలుకల ఆత్మశాంతి కోసం ఆ పిల్లి మొక్కులు చెల్లిస్తున్నదట! చంద్రబాబు ‘ఖర్మ’ యాత్రలు చేస్తున్నారు. ‘బీసీలూ... బీసీలూ నా పార్టీ మీ కోసమే’నని వేడుకుంటున్నారు. ‘దళిత సోదరులారా! నేను పుట్టింది మీ కోసమే’నని నమ్మబలుకు తున్నారు. ‘ఆడబిడ్డలారా! మహిళా సాధికారతకు ఆదిగురువు నేనే’నని ఒట్టేసుకుంటున్నారు. బీదా బిక్కీ జనం కాళ్లావేళ్లా పడాల్సి రావడమేమిటి? ఇదేం ఖర్మరా బాబూ నాకంటూ నిట్టూర్పులతో కూడిన ఖర్మయాత్ర చేస్తున్నారు. ఈ వర్గాలకు తాను చేసిన అన్యాయాన్ని గురించి మాత్రం ఆయన మాట్లాడడం లేదు. క్రూర కర్మములు నేరక జేసితి, మన్నించుడని శరణు కోరడం లేదు. తాను చేసిందంతా బలహీన వర్గాల శ్రేయస్సు కోసమేనని బహిరంగ సభా వేదికల ద్వారా దబాయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో జగన్మోహన్రెడ్డి నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించడంలో పెద్ద విశేషమేమీ లేదని బాబు అండ్ బృందం అభిప్రాయ పడుతున్నది. బాబు అధికారంలో ఉన్న పధ్నాలుగేళ్లు, ప్రతి పక్షంలో ఉన్న పదమూడేళ్ల కాలంలో ఇద్దరంటే ఇద్దరే బీసీలను రాజ్యసభకు పంపించడంలో మాత్రం చాలా గొప్ప మహత్తే ఉన్నదట! నలుగురు ఉపముఖ్యమంత్రులు సహా డెబ్బయ్ శాతం కేబినెట్ బెర్తులు బలహీనవర్గాలకు కేటాయించడంలో సామాజిక న్యాయం లేదట! ఎనభై శాతం జనాభా గల ఈ వర్గాలకు చంద్రబాబు 40 శాతం మంత్రి పదవులివ్వడమే అసలుసిసలు న్యాయమట! బలహీనవర్గాల అభ్యున్నతికి ఏర్పాటైన పన్నెండు కార్పొరేషన్లను పడావు పెట్టినందుకు తానే పేదల బంధువునని బాబు చెప్పుకొస్తున్నారు. పన్నెండును యాభై ఆరుకు పెంచి క్రియాశీలం చేయడంలో గొప్పతనమేమున్నదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కులాలకూ, మతాలకూ, ప్రాంతాలకూ అతీతంగా పేద వర్గాల ప్రజలందరూ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వెనుక సమీకృతమవుతున్నారు. ఇందుకు కారణాలున్నాయి. ఇంతవరకూ అవకాశాలకు దూరంగా ఉన్న ప్రజాసమూహాల చెంతకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి వెళ్తున్నది. ప్రజాధనం పైసాతో సహా పారదర్శకంగా కళ్ల ఎదుట ప్రవహిస్తున్నది. వెనుకబడిన ప్రజలు సమానావకాశాలను కోరుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతాలు సమానాభివృద్ధిని కోరుకుంటున్నాయి. దేశమేదైనా, రాష్ట్రమేదైనా ఈకాలపు ప్రజల గుండె చప్పుడు ఇదే! సాధికారత ఈ తరానికి తిరుమంత్రంగా మారుతున్నది. వారి ఆకాంక్షలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆలంబనగా మారింది. అందుకే పేద జనమంతా ఆ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నారు. ఈ పరిణామమే ప్రతిపక్షానికి కలవరం కలిగి స్తున్నది. చంద్రబాబు ఖర్మయాత్రకు ఈ కలవరమే కారణం. చిత్తశుద్ధి లోపం వల్ల చంద్రబాబు ఖర్మ యాత్ర ఫలిత మివ్వడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలహీనవర్గాల పట్ల చేసిన తప్పులకు ఆయన కానీ, వారసుడు గానీ క్షమాప ణలు చెప్పి ఉండవలసింది. ముక్కు నేలకు రాసి ఉండవలసింది. చెవులు పట్టుకుని గుంజీలు తీసి ఉండవలసింది. ప్రజల పట్ల వారు చేసిన అవమానాలు అమానుషమైనవి. అత్యాచారాలతో సమానమైనవి. బీసీల తోకలు కత్తిరిస్తానని సాక్షాత్తూ ఆ పార్టీ మూలవిరాట్టే బహిరంగ హెచ్చరికలు చేశారు. బీసీలను, ఎస్సీ లను హైకోర్టు జడ్జీలుగా నియమించరాదనీ, వారికి ఆ స్థాయి లేదనీ ఆయనే స్వయంగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. మహిళలను కించపరిచేవిధంగా మీడియా సమావేశంలోనే లింగ వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఉత్సవ విగ్రహాలు చేసిన అవమానాలకు అంతూపొంతూ లేదు. స్వయాన అగ్రనేత బావమరిది, పార్టీ నాయకుడు బాలకృష్ణ బహిరంగ వేదికపై నుంచి తీవ్ర అభ్యంత రకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలుగు ప్రజలందరూ గమనించారు. మహిళల్ని కించపరిచే మాటలను ఆయన యథేచ్ఛగా వాడేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ నాయకుడొకరు దళితులనుద్దేశించి ‘మీకెందుకురా అధికారాలు, పదవులూ. అవేవో మేమే చూసుకుంటామ’ని ఈసడించుకున్న సంగతీ అందరికీ తెలిసిందే. అదే ఎమ్మెల్యే తన ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తాసిల్దారును జుట్టు పట్టుకొని అవమా నించిన దృశ్యం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న ఒకాయన ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయర’ని చేసిన నీచమైన కామెంట్ ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అరాచకాలు అనేకం. సభ్యసమాజంపై చేసిన ఈ నేరాలు క్షంతవ్యం కానివి. ప్రజలచుట్టూ పొర్లు దండాలు పెట్టినా ఈ పాపాలకు నిష్కృతి లేదు. కానీ కనీసం ప్రాయశ్చిత్త ప్రయత్నాన్ని కూడా వారు చేయలేదు. పశ్చాత్తాపం లేని ఖర్మయాత్రలు ఆయన ఎన్ని చేసినా ఉపయోగపడవు. ఏకేశాలు, పీకేశాలు, లోకేశాలు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదు. చరిత్ర ఎరుగని దారుణమైన ఓటమితో జనం పరాభవిం చినా చంద్రబాబు మనస్తత్వంలో మార్పు లేదు. ఆయన పెత్తందారీ పోకడ మొక్కబోలేదు. పేదల వ్యతిరేక భావజాలం కరిగిపోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం విద్యను జీర్ణించుకోలేకపోయారు. పేదలంతా ఇంగ్లిషు విద్య చదివితే నౌకర్లు, చాకర్లు ఎట్లా అనే అహంకారం బుసలు కొట్టింది. ఎల్లో మీడియా సహకారంతో తెలుగు సెంటి మెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జనం తిరగబడేసరికి కొన్నాళ్లు మిన్నకున్నారు. అహంకార సర్పం మళ్లీ బుసకొట్టే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ఒకసారి శ్రీకాకుళం పర్యటన నుంచి వస్తూ విశాఖ జిల్లాలో ఒకచోట దారిపక్కన ఉన్న జనాన్ని చూసి ఆగిపోయి వారితో మాటామంతీ కలిపారు. ‘ఆయనేదో (జగన్) ఇంగ్లిషు మీడియం అంటున్నారు. ఆయన మాటలు వినకండి. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిం దట. మీ పిల్లలు ఎటూ కాకుండా పోతారం’టూ వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడున్న జనం వెంటనే జై జగన్ అంటూ నినదించడంతో నెమ్మదిగా చంద్రబాబు కాలికి బుద్ధి చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సామాజిక చేతన విప్లవాత్మక రూపాన్ని సంతరించుకున్నది. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీయడానికి నాణ్యమైన విద్య ఒక బలమైన సాధనమని ఆయన గట్టిగా నమ్మారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ దేశ పేద వర్గాలకు ఇచ్చిన సందేశం కూడా అదే. మహాత్మ జ్యోతిబా పూలే ప్రబోధించింది కూడా అదే. తల్లి సావిత్రిబాయి చెప్పిన పాఠం కూడా అదే. శ్రీ నారాయణ గురు ఉపదేశించిన మంత్రం అదే. పెరియార్ చెప్పిన సలహా అదే. జగన్ ప్రభుత్వం ఎంచుకున్న బాట కూడా అదే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటివారంలో విద్యా రంగంపై ఆయన సమీక్ష జరిపారు. ఆ సమీక్షలోనే తాను చేపట్టబోయే విద్యారంగ విప్లవానికి ప్రభుత్వ స్కూళ్లను సమాయత్తం చేసే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి రూపుదిద్దారు. ఇప్పుడు గ్రామగ్రామానా రూపురేఖలు మార్చుకొని కొత్త రంగులు అద్దుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాలే ఆయన చిత్తశుద్ధికి నిలువెత్తు సాక్ష్యాలు. ‘నాడు–నేడు’ కార్యక్రమానికి చేసిన భారీ వ్యయానికి అదనంగా అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన, విద్యాకానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద కార్యక్రమాలపై ఇప్పటికే 42 వేల కోట్లకు పైగా జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. విద్యారంగం తర్వాత మరో ప్రాధాన్యతగా ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం ఎంచుకున్నది. ఈ రంగంలో కూడా ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చి అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది. ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్క్లినిక్లను ఏర్పాటు చేసింది. ఒక్క వైద్య–ఆరోగ్య రంగంలోనే దాదాపు 50 వేల ఉద్యోగ నియా మకాలను పూర్తి చేసిందంటేనే ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. ప్రజారోగ్య రంగంలో గేమ్ ఛేంజర్ కాబోతున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ ఆలోచనకు పదును పెడుతున్నది. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం లబ్ధిదారుల్లో తొంభై తొమ్మిది శాతం ప్రజలు బలహీనవర్గాల వారు, అగ్రవర్ణ పేదలే. వారు సాధికారతను సంతరించుకొనే క్రమంలో ఈ రంగాలు రెండూ నిచ్చెన మెట్ల వలె ఉపయోగపడతాయి. ఆ ఎరుకతోనే ప్రభుత్వం ఈ రంగాల్లో బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. విద్య, వైద్య రంగాలతో పాటు రాష్ట్రంలో అత్యధిక ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభుత్వం ఫోకస్ ఏరియాగా ఎంపిక చేసుకున్నది. ఊరూరా వెలసిన రైతు భరోసా కేంద్రాలు, వాటికి అనుబంధ కియోస్క్లు వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా కార్యక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వం 37 వేల కోట్ల రూపాయల నగదు బదిలీ (డీబీటీ)ని లబ్ధిదారులకు అందజేసింది. ఈ లబ్ధి దారులంతా బలహీనవర్గాలు, అగ్రవర్ణ పేదలే. డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతుల్లో పేదవర్గాల ప్రజలకు ఈ మూడున్నరేళ్లలో 3 లక్షల 20 వేల కోట్లను బదిలీ చేశారు. ఒక్కపైసా దుర్వినియోగం కాకుండా, వృథా కాకుండా ఇంత పెద్దమొత్తం ప్రజల చేతికందిన ఉదాహరణ ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమ – సాధికారతా కార్య క్రమం ఒక్కటే. ఈ మొత్తంలో 1 లక్షా 65 వేల కోట్ల లబ్ధి ఒక్క బీసీ వర్గాలకే జరిగింది. వారి జనాభా నిష్పత్తిని దాటి బీసీలకు అండగా ప్రభుత్వం నిలబడింది. వాస్తవాలు ఇట్లా వుంటే తమది బీసీల పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటే వినేది ఎవ్వరు? నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రసంగం కీలకమైనదిగా భావించాలి. అంబేడ్కర్ భావజాలాన్ని, ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని మనసావాచా కర్మణా గౌరవించే ప్రభు త్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ముందడుగు వేశామని ఆయన చెప్పారు. తన ప్రభుత్వ దృక్పథాన్ని ఆయన ఢంకా బజాయించి ప్రకటించారు. ఆయన ప్రకటించిన స్ఫూర్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాడవాడనా జనచేతనమై జ్వలిస్తున్నది. అధికార వికేంద్రీకరణ కొత్త పుంతలు తొక్కింది. గ్రామ సచివాలయాల రూపంలో ఊరూరా మినీ రాజధాని ఏర్పడింది. ప్రధాన రాజ ధాని కూడా మూడు ప్రాంతాల్లో ఉండాలన్న అధినేత అభిమతా నికి మద్దతుగా కోట్ల గొంతుకలు కోరస్ పలుకుతున్నాయి. ప్రభుత్వ అండదండలతో, ఆలంబనతో జనసాధికారత కోసం చైతన్య యాత్రలు ప్రారంభమవుతున్నాయి. రేపు వికేంద్రీకరణ కోసం కర్నూలు ఎలుగెత్త బోతున్నది. మరో మూడు రోజుల్లో బీసీ వర్గాలు విజయవాడలో చైతన్య శంఖాన్ని పూరించబోతు న్నారు. ఇకముందు రాష్ట్రంలో ఒంటరి పాదయాత్రలకు బదులు జనసమూహాల జైత్రయాత్రలే కనిపిస్తాయి. శ్రీశ్రీ చెప్పినట్టు ‘వస్తున్నా యొస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచక్రాల్... లొస్తున్నా యొస్తున్నాయి’! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే యువత శ్రమించాలి
బన్సీలాల్పేట్: లక్ష్యసాధన కోసం అస్త్రాన్ని సంధించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు యువతీ, యువకులు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగా లని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం యశోద ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతీ, యువకుల సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చూసిన మీరు ఎంతో ధైర్యంతో ముందుకు సాగాలని యువతకు ఉద్బోధించారు. విద్యావంతులైన యువతకు సాఫ్ట్స్కిల్స్ ప్రాణవాయువు వంటిదనీ, అలాంటి స్కిల్స్లో మరింత సమర్థవంతంగా రాణించినప్పుడే అవకాశాలు వస్తాయని సూచించారు. సమాజంలోని అనాథలను చేరదీయాలని, వారు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే దేశానికి తీరని నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది అనాథలు, నిరుపేదలను చేరదీసి సాఫ్ట్స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావును సాక్షి ఎడిటర్ మురళి అభినందించారు. సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా యశోద ఫౌండేషన్ చిత్తశుద్ధితో సమాజమార్పు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి యశోద ఫౌండేషన్లో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న సోనీ(నిర్మల్), సురేఖ(నాగర్కర్నూల్), స్వాతి(యాదగిరిగుట్ట), రాకేష్, సరిత, స్వాతి, లిడియా, సుమిరాలు మాట్లాడుతూ కూలీ నాలీ చేసుకొని జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చి ఇక్కడి శిక్షణతో ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని వివరించారు. తినడానికి తిండి లేక, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని పరిస్ధితుల్లో ఇక్కడ శిక్షణతో ఆత్మవిశ్వాసం, స్కిల్స్తో జీవితంలో స్ధిరపడిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టారు. అనంతరం సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి, యశోద ఆసుపత్రి డైరెక్టర్ బాలక్రిష్ణరావుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి డైరెక్టర్ రాజేందర్, డాక్టర్ హరీశ్కుమార్, డాక్టర్ రఘవీర్, ప్రిన్సిపల్ అరుణజ్యోతి, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రామోజీ – బాబోజీ అండ్ కో...
షాపూర్జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ అత్యంత సృజనాత్మక మైన గ్రూప్ రామోజీ – బాబోజీ గ్రూప్! వారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవలసిన విషయం. అందరికీ మల్లేనే వీరికీ విడివిడిగా సంప్రదాయ వ్యాపారాలున్నాయి. పచ్చళ్లూ, పాలు, పెరుగు, పూటకూళ్ల హోటళ్లు, పత్రికలూ వగైరా! వేరువేరుగా ఇన్ని వ్యాపార పీస్లున్నప్పటికీ వారు మాత్రం నాట్ హ్యాపీస్! బొంబాయి మాఫియా మీద వచ్చిన అన్ని సినిమాల్లోనూ ‘వుడ్ బీ డాన్’లు కామన్గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘నేను బొంబాయిలో బతకడానికి రాలేదు, బొంబాయిని ఏలడానికి వచ్చాన’ని! రామోజీ, బాబోజీ హృదయాల్లో కూడా ఇటువంటి కోరికలే ఆరని అగ్నిజ్వాలలై భగభగ మండుతూ ఉండేవని వారి బయోగ్రఫీని తిరగేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వాదరినీ, నేనీదరినీ అన్నట్టుగా వేరువేరు చోట్ల మండుతున్న ఈ రెండు కంచు కాగడాలను విధియాడిన వింత నాటకం ఒక చోటకు చేర్చింది. ఇంకేముంది! ప్రళయం రానే వచ్చింది. ఆకాశంలోని పక్షు లన్నీ భయంతో అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ నేలకు రాలి పడ్డాయి. అచ్చం అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న చిట్ఫండ్ కంపెనీలన్నీ రాలిపడ్డాయి. సూర్యుడు భగభగ మండుతూ అగ్నిగోళంలా దర్శనమిస్తాడు. ఫలితంగా భూమ్మీద ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. చంద్రుడు బాబోజీ అనే అర్భకుడు రామోజీ సహకారంతో వెన్నుపోటు విద్యను ఉపయో గించుకొని దొడ్డిదారిన రాజ్యాధికారం చేపట్టాడు. చరిత్ర ఎరుగని వింతలు – విడ్డూరాలు ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ పరిణమించాయి. బిజినెస్ మ్యాన్ బాబోజీ అలియాస్ పొలిటికల్ చంద్ర బాబుకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం తెలుగు ్రçపజలకు చర్వితచర్వణమే. అతనిలోని నివురుగప్పిన బిజినెస్ నిప్పును రాజేయగల పెట్టుబడికి స్వయంగా స్థోమత లేదు. రెండెకరాల పేద రైతు కుటుంబం. అందుకని రాజకీయ రూట్లో నరుక్కు రావాలని సంకల్పించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్ కావాలనే పేరున్న నాయకుడు ఎవరూ మిగల్లేదు. ఏదో ఒక పార్టీ టిక్కెట్ పాలి టిక్స్కు పాస్పోర్టుగా పనికొస్తుందని చంద్రబాబు చంద్రగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. జాక్పాట్ తగిలినట్లయింది. ఇందిరమ్మ ప్రభంజనం రాష్ట్రాన్ని కమ్మేసింది. అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి అంజయ్యను ప్రసన్నం చేసుకోగలిగారు. మంత్రిపదవి లభించింది. బిజినెస్ మ్యాన్కు పెట్టుబడి దొరికింది. పెళ్లికాని యువకుడు, తమ సామాజికవర్గం వాడు మంత్రిపదవిలో ఉండడంతో ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. బిజినెస్ మొదలైంది. తొలిమెట్టుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోనే సొంత స్నేహితుల్ని మోసం చేసి ఒక హోటల్ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి మోసపు మెట్లనే ఒక్కొ క్కటిగా పేర్చుకుంటూ హెరిటేజ్ భవంతిని నిర్మించుకున్నారు. హెరిటేజ్ వ్యవహారంలో బాబు తనను మోసం చేశాడని మోహన్బాబు వంటి సెలబ్రిటీయే వాపోయిన సంగతి తెలిసిందే. కాలక్రమంలో చంద్రబాబుకు రామోజీతో ఒక సహకార ఒప్పందం కుదిరింది. ‘నీకిది – నాకది’ అనే సూత్రంపై కుదిరిన సహకార ఒప్పందం ఫలితంగా బాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయం ఆయన బిజినెస్గా మారింది. బిజినెస్లు బినామీ పేర్లతో ఖండాంతరాల్లో ప్రవర్ధమానమవుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అడ్డగోలుగా సంపాదించాలనుకునే చాలామందికి రామోజీ కథ చాలా ఉత్తేజభరితమైనది. అనుసరించిన మార్గం ఏదయితే నేమి ఆయనొక వ్యాపార మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలిగారని ఈ బ్యాచ్వారు కీర్తిస్తుంటారు. ఆరంభంలో చేరదీసిన జేజే రెడ్డి అనే శ్రేయోభిలాషికి రామోజీ శఠగోపం పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాతనే ఆయన ప్రస్థానం వేగం పుంజు కున్నదట! ‘ఈనాడు’ పత్రిక కోసం విశాఖలో స్థలాన్ని అద్దెకు ఇచ్చిన రాజుగారిని మానసిక హింసకు గురిచేశారు. అదే రాజుగారు హైదరాబాద్ స్థలాన్ని కూడా లీజుకిచ్చారు. అక్కడ కూడా ఆయనకు చుక్కల్ని చూపించారట! విజయవాడ స్థలాన్ని చ్చిన సొంత తోడల్లుడు కూడా తర్వాత ఘొల్లుమనడం అందరికీ తెలిసిన విషయమే! ‘ఒకటా రెండా? ఎన్నని చెప్పను మా బాబాయి లీలలు’ అంటూ రామోజీ సోదరుని కుమారుడు చంద్రమౌళి ఏకంగా ఒక పుస్తకాన్నే రచించి జనంలోకి వదిలారు. మూడు మోసాలు – ఆరు వంచనలతో ఇలా సాగుతున్న రామోజీ వ్యాపార ప్రస్థానం చంద్రబాబుతో కుదిరిన సహకార ఒప్పందం తర్వాత మరో మలుపు తిరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధానాంగాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ఈ ప్రధానాంగాలు. వాటితోపాటు ఆరోగ్యకరమైన మీడియా కూడా ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తుందన్న విశ్వాసంతో దాన్ని ‘ఫోర్త్ ఎస్టేట్’గా పిలిచి గౌరవించారు. అధికారంలో ఉన్నప్పుడు శాసన, కార్యనిర్వాహక విభాగాలను వారి వ్యాపార ప్రయోజ నాలకే వాడుకున్నారు. వారి ప్రయోజనాలనే లోకకల్యాణంగా ప్రచారం చేసుకోవడానికి ఫోర్త్ ఎస్టేట్ మీద వారు సాధించిన ఆధిపత్యం తోడ్పడింది. లిటిగెంట్ వ్యూహాలతో, నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి ఎత్తుగడలతో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలో ఉండ వలసిన రాజదండాన్నీ ఈ ముఠా చేజిక్కించుకున్నది. వ్యవస్థల మీద పట్టుతో, మ్యానిపులేషన్లతో సకల వనరుల మీద కూడా వ్యాపార భాగస్వాములు అదుపు సాధించారు. చెరువుల్ని, గుట్టల్ని, రహదారుల్ని యథేచ్ఛగా ఆక్రమించి, చట్టాన్ని చట్టుబండగా మార్చి రామోజీ ఫిలింసిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చట్టవిరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి సొంత వ్యాపారాలకు మదుపు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పునాది వేసిన ఐటీ టవర్స్ విషయాన్ని మూడేళ్లపాటు తొక్కిపెట్టి తమ బినామీలు, ముఠా సభ్యులతో దానిచుట్టూ రియల్ ఎస్టేట్ బేరాలు చేసిన అనంతరమే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంతో వేల కోట్ల రూపాయల లాభాన్ని వీరి ముఠా కళ్లచూడగలిగింది. మాదాపూర్ ఐటీ ప్రాంతంలో జరిగిన వ్యాపారాన్ని సూక్ష్మరూపంగా భావిస్తే అమరావతి రాజధాని ప్రాంతం విశ్వరూపంగా పేర్కొనవచ్చు. ఈ ముఠా వేల కోట్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉండవచ్చని అంచనాలున్నాయి. లక్షల కోట్లలో లాభాలు పిండుకోవాలని తహతహలాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో కథ అడ్డం తిరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ భిన్నమైన పాలనా విధానాన్ని ఎంచుకోవడం ఈ వ్యాపార ముఠాకు మింగుడు పడలేదు. జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకున్నది. అధికార యంత్రాంగం ప్రజలకు చేరువగా వెళ్లడం వలన పారదర్శకత పెరుగుతుందనీ, తద్వారా అవినీతికి అవకాశం చిక్కదనీ ఈ ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు టెక్నాలజీ వినియోగం ద్వారా ఒక్క పైసా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చేవిధంగా కార్యక్రమాలను తయారు చేసుకున్నది. మరోపక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాలం చేసిన గాయాలను గమనంలోకి తీసుకొని, మరోసారి గాయపడితే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న నిర్ధారణతో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక వినూత్న ఆలోచన. విస్తృతస్థాయిలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ప్రతిపాదన. కానీ బాబోజీ – రామోజీ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీ లకూ గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపవలసిన అగత్యం ఈ వ్యాపార ముఠాకు ఏర్పడింది. లక్షల కోట్ల కల గాలిలో దీపంలా మారడంతో ప్రభుత్వం మీద ఈ ముఠా యుద్ధాన్ని ప్రకటించింది. ఉచ్చమూ – నీచమూ అన్న ఇంగితం లేదు. న్యాయమూ – అన్యాయమన్న విచికిత్స లేదు. ధర్మమూ – అధర్మమన్న విచక్షణ లేదు. ప్రభుత్వం మీద బండలేయడమే ఏకైక కర్తవ్యంగా మారింది. ఈ కర్తవ్యంలో భాగమే ప్రతిరోజూ జరుగుతున్న విష ప్రచారం. రామోజీ పత్రిక ఛీనాడులో ప్రతిరోజూ శాపనార్థాలే బ్యానర్లు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే అది లోపల పేజీ వార్తగా మారింది. ఒక గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేస్తే అది ప్రభుత్వ కక్ష అనే బ్యానర్ వార్తగా మారింది. అప్పటికే ఆ వరసలో యాభై ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చారనీ, అందుకు ఆ ఇళ్ల యజమానులు సమ్మతించారనే వాస్తవాన్ని మాత్రం ఈ యెల్లో మీడియా విస్మరించింది. అంగీకరించని ముగ్గురు జనసేన కార్యకర్తల ఇళ్ల దగ్గరే ‘కక్ష’ సాధింపు రంగంలోకి వచ్చింది. పత్రికలో బ్యానర్ వార్త మాత్రమే సరిపోదని పాలిటిక్స్లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న పవన్ కల్యాణ్ను రంగంలోకి దించారు. ఆయన తన శాయశక్తుల ఓవరాక్టింగ్ చేసి వెళ్లారు. అయ్యన్నపాత్రుడు అనే సీనియర్ రాజకీయవేత్త అమ్మనాబూతులు మాట్లాడుతుంటే ఛీనాడుకు కమ్మగా తోచింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, అందుకోసం ఒక రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అయ్యన్నలో ఛీనాడుకు చిలిపితనం కనిపించింది. చేసింది తప్పు కనుక ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఛీనాడుకు కక్షసాధింపుగా కనిపించింది. వ్యక్తిగత ఫిర్యాదుతో సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ చేతికి గాయం చేసుకున్నది. ఇది ఛీనాడుకు బ్యానర్ శీర్షిక ‘నేను వినను, నేను కనను’! అంటే ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని దాని భావన. అంతకు ముందురోజే అధికారులతో స్పందన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పందన కార్యక్రమాన్ని మరింత క్రియాశీలకంగా చేయాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కోసం మరింత మెరుగైన వ్యవస్థను తయారుచేయాలని నిర్దేశించారు. ఈ సంగతిని మాత్రం ఛీనాడు రాయలేదు. అధికార యంత్రాంగాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చడంలో జగన్మోహన్రెడ్డి చేసిన కృషి యావత్తు భారతదేశ చరిత్రలో సాటిలేనిది. ఒకటో తేదీ తెల్లవారుజామున వెలుగు రేకలు విచ్చుకోకమునుపే పెన్షన్ డబ్బులు చేతికందిస్తున్న రెండున్నర లక్షలమంది వలంటీర్ల మోముల్లో అవ్వాతాతలు జగన్మోహన్రెడ్డి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో సేవకు సిద్ధంగా నిలబడిన సచివాలయాల సిబ్బందిలో ప్రజలకు జగన్ ప్రభుత్వం రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలూ, మంత్రులు సైతం ‘గడప గడపకూ జగన్ ప్రభుత్వం’ పేరుతో నిత్యం జనంలోనే తిరుగుతున్నారు. వారంతా జగన్ పంపితే వస్తున్నారని ప్రజలకు తెలియదా? ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్ జరుగుతున్నది. ఎవరికి సుస్తీ చేసినా వారింటికే డాక్టర్ రాబోతున్నాడు. ఇక మీదట జగన్మోహన్రెడ్డి ఇంటింటి ఫ్యామిలీ డాక్టర్ కూడా! ఇంతకంటే ప్రజలకు చేరువైన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరున్నారో చెప్పమంటే ఏం చెబుతారు? అటువంటి జగన్మోహన్రెడ్డి ‘నేను వినను – నేను కనను’ అంటున్నాడని శీర్షిక పెడతారా? ఇది సిగ్గులేనితనం కాదా! ఇది బరితెగింపు కాదా? ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యావ్యవస్థ అత్యున్నత ప్రమాణాలనందుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన పీజీఐ నివేదిక చాటిచెప్పింది. పైగా నాలుగేళ్ల కిందటి ఇదే నివేదికలో రాష్ట్రం అట్టడుగు పొరల్లో ఉంది. రెండేళ్లు కరోనా వెంటాడిన నేపథ్యంలో ఈ పురోగతి ఒక వండర్! కానీ ఛీనాడు మాత్రం పాఠశాల విద్య పతనమైందని తెంపరితనంతో కూడిన వంట కథలను వండి వార్చింది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామంగా దేశవిదేశాల్లోని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఛీనాడు, దాని అనుబంధ మీడియా మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం పడ కేసిందని కథలు అల్లుతారు. ఒక విషయం స్పష్టం. ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చే జగన్ ప్రభుత్వ విధానంపై వ్యాపార – రాజకీయ వర్గం యుద్ధం ప్రకటించింది. ప్రజల ప్రయోజనాలకూ, స్వార్థశక్తుల ప్రయోజనాలకూ మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. బాబోజీ – రామోజీ కంపెనీ నేతృ త్వంలో ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, ప్రజల మీద పరోక్షంగా నిత్యం బాంబులు కురిపిస్తున్నారు. విషపూరితమైన రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. యుద్ధం ప్రకటించినవాడు ఎంతటి శక్తిమంతుడైనా, ఎంతటి ధనాఢ్యుడైనా ప్రజలు చైతన్య వంతులైతే తోక ముడవక తప్పదు. అమెరికా మీద వియత్నాం ప్రజల విజయం చాటిచెప్పిన పరమ సత్యమిదే! ఠ్చిటఛీజ్ఛి జీ1959ఃజఝ్చజీ .ఛిౌఝ మోసాల గురూజీ ఛీనాడు రామోజీ! ► ఎవరీ రామోజీరావు? ఒక వ్యాపారవేత్త. ఈనాడు సంస్థల అధినేత. ఫిలిం సిటీ ఓనర్. సినిమా నిర్మాత. కొంతమందికి గురుపుంగవుడు. అంతేనా? ఇంకా వుంది. స్వార్థంకోసం సొంత చుట్టాలను కూడా మోసం చేయడానికి వెనుకాడని కపటి. వ్యవస్థలను మేనేజ్ చేయగల ప్రావీణ్యంతో బంధువులను కూడా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసిన తిమింగలం. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలను రచించిన ఘనుడు. ► విలువైన భూములపై ఆయన కన్ను పడితే చాలు హస్తగతం చేసుకునేంతవరకూ ఎన్ని కుట్రలైనా చేస్తాడని ఒక సన్నిహిత బంధువు స్వయంగా చెప్పాడు. తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వేసిన ప్రతి అడుగులో బంధువుల కన్నీటి మడుగులు, బడుగుల నెత్తుటి జాడలు కనిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిగో మచ్చుకు కొన్ని అడుగులు... ► విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న రెండెకరాల స్థలం రామోజీది కాదు. బంధువు, భాగస్వామి, తోడల్లుడైన ముసునూరు అప్పారావు, వల్లూరి వెంకటేశ్వరరావుల నుంచి రూ. 725 అద్దెతో 33 ఏళ్ళకు లీజు తీసుకున్నది. అక్కడ ‘ఈనాడు’ బిల్డింగ్ కట్టిన రామోజీకి స్థలం కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. లీజు ముగిసిపోతున్న వేళ మరో 33 ఏళ్ళ లీజు కావాలంటూ కోర్టుకెక్కారు. అప్పారావుకు ఆ స్థలం అప్పగించాలని ఆదేశిస్తూ, 2013లో కోర్టు మందలించినా లాభం లేకపోయింది. 2017లో జిల్లా కోర్టు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కారు. తాత్సారం చేస్తున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోగా, ఇవ్వాల్సిన అద్దెకు అతీగతీ లేదు. 1970 లెక్కల ప్రకారం చూసినా లక్షల్లో అద్దె బాకీ. సొంత బంధువు స్థలానికే శఠగోపం పెట్టాలని రామోజీ మార్కు విశ్వప్రయత్నం సాగుతూనే ఉంది. ► వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ కథా ఇలాంటిదే. భూ యజమానుల్ని మాయమాటలతో బెదిరించి, కారుచౌకగా స్థలం కొట్టేశారు. మొదట విశాఖలోని అల్లిపురం దగ్గర 1970 ప్రాంతంలో 8210 చ. గజాల స్థలాన్ని 50 ఏళ్ళకు రామోజీ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల డబ్బు అవసరాన్ని గ్రహించి, వాళ్ళను మభ్యపెట్టారు. లీజు గడువు ఇంకా 16 ఏళ్ళు ఉండగానే దాదాపు రూ. 150 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని రూ. 2.5 కోట్లకే 2005లో తన పేర ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ రూ. 2.5 కోట్లను కూడా మన నిరుపేద రామోజీ మూడు వాయిదాల్లో కానీ చెల్లించలేకపోయారట. మరో గమ్మత్తేమిటంటే – డాల్ఫిన్ హోటల్స్లో రామోజీతో సహా 172 మంది షేర్ హోల్డర్లు. రామోజీకి 95 శాతం, అంటే 3.82 లక్షల పైగా షేర్లున్నాయి. కానీ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన మిగిలినవారికి లాభాల్లో కనీస వాటా కూడా చెల్లించడం లేదట. ► ప్రియా పచ్చళ్ళ కంపెనీ నిర్మాణ సమయంలోనూ రామోజీది ఇదే స్టైల్. విజయవాడ శివారు కానూరు సమీపంలో సొంత బావ నుంచి 2 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నారు. ఆ స్థలానికి వెనకే మరో 2 ఎకరాల స్థలం ఉంది. దానికి వెళ్ళాలంటే ప్రియా పచ్చళ్ళకిచ్చిన స్థలంలో నుంచే దారి. స్థలంలో నుంచి దారి ఇస్తామని మొదట ఒప్పుకున్న రామోజీ అలవాటుగా నాలుక మడత తిప్పారు. దారి ఇవ్వకుండా సొంతవాళ్ళనే ఇబ్బంది పెట్టారు. ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించిన సొంత బంధువును తన పత్రికా బలంతో రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. చివరకు ఆ బంధువు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన స్థలానికి తాను వెళ్ళేందుకు దారి చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ►...ప్రతిచోటా కోర్టు నుంచి చీవాట్లు తిన్నా, తాను లీజుకు తీసుకున్న భూముల్ని సామ దాన భేద దండోపాయాలతో, తన చేతిలోని పచ్చ పత్రిక బలంతో కాజెయ్యడమే రామోజీ మార్కు నీతి, నిజాయతీ. ఈనాడు, మార్గదర్శి, ప్రియా... ఇలా ఆయన స్థాపించిన సామ్రాజ్యాల్లో చాలా భాగం లీజు భూముల లీగల్ కబ్జా లీలలే. న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల సహకారంతో ప్రతి విషయంలో తప్పుడు మార్గాల్ని అన్వేషించే రామోజీ తన పత్రికలో ఇతరుల భూకబ్జాల గురించి రాస్తారు. గురివింద గింజనే గుర్తుకుతెస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నెలలు నిండని కాన్పు!
మీడియాలో కనిపించినంత సంచలనం జనంలో కనిపించ లేదు. ఫామ్హౌస్ ఎపిసోడ్ను చూసి ప్రజలు ఆశ్చర్యచకితు లైనట్టుగా దాఖలాలు ఎక్కడా దొరకలేదు. సంతలో పశువుల బేరానికి దీటుగా ప్రజా ప్రతినిధుల్ని వేలం వేసినా ఎవరూ అవాక్కయ్యే పరిస్థితి లేదు. రచ్చబండ మీద ప్రజాస్వామ్యాన్ని తులాభారం వేసినా ఎవరూ దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశమే లేదు. సమస్త జనావళి హృదయాల్లోంచి సున్నితత్వాన్ని పారద్రోలి దిటవు గుండెలు ప్రసాదించిన మన రాజకీయ పార్టీలకు జేజేలు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా మన పార్టీలు ప్రజలకు స్థితప్రజ్ఞతను అనుగ్రహించాయి. తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డి ద్వారా వేయించిన ఫామ్హౌస్ బాంబు నుంచి పొగ మాత్రమే వచ్చింది. అది సరిగ్గా పేలకపోవడానికి చాలా కారణా లున్నాయి. ఫిరాయింపుల అండతో రాజ్య విస్తరణ చేసుకోవ డానికి భారతీయ జనతా పార్టీ తహతహలాడుతున్నదనేది బహిరంగ రహస్యం. అప్రజాస్వామికమైన పద్ధతులతో, అపవిత్రమైన ఎత్తుగడలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అది కూల్చివేసిందన్న విషయం కూడా అక్షరసత్యం. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ వ్యవస్థకూ, ఈ నేల తల్లి వెదజల్లే సహజ సుగంధమైన లౌకికత్వానికీ కేంద్రం ఉరితాళ్లు పేనుతున్న సంగతి కూడా ముమ్మాటికీ నిజం. తన రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తెలంగాణను తదుపరి టార్గెట్గా ఎంచుకున్నదని రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. ఈ మహత్తర కార్యసాధన కోసం కూడా అది ఫిరాయింపుల బాటనే ఎంచుకున్నది. అతి త్వరలోనే తమ పార్టీలో కొందరు అధికార పార్టీ ప్రముఖులు చేరబోతున్నారని రాష్ట్ర బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో ప్రకటించారు. కనుక మొన్నటి ఎపిసోడ్ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇటువంటి ఫిరాయింపుల బాగోతాన్ని ఎండగట్టాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావించడంలో తప్పేమీ లేదు. అందుకోసం అది ఎటు వంటి ట్రాప్ విసిరినా సమర్థనీయమే. అయితే ఈ వ్యవహారాన్ని ట్రాప్ చేశారా లేక డిజైన్ చేశారా అన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై శనివారం మధ్యాహ్నం వరకూ ‘లీకు’లపైనే మీడియా ఆధారపడవలసి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఒక్కటే అధికారిక పత్రం. మిగిలినవన్నీ లీకులే. నిందితుల రిమాండ్ను తిరస్క రిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును శనివారం మధ్యాహ్నం హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాతనే రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ కీలక నాయకుడైన కేటీఆర్ మీడియాతో మాట్లాడతారన్న సమాచారం వచ్చింది. కానీ, కేసు దర్యాప్తు జరుగుతున్న దశలో దానిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం నాటి వ్యవహారానికి కార్యస్థలం మొయినాబాద్ సమీపంలోని రోహిత్రెడ్డి ఫామ్హౌస్. రాత్రి 7–8 గంటల మధ్యన సైబరా బాద్ పోలీసులు ఈ ఫామ్హౌస్పై దాడి చేశారు. ఇంకో గంట తర్వాత మీడియాకు ఉప్పందింది. ఫామ్హౌస్లో వంద కోట్ల రూపాయల నగదు దొరికిందని మీడియాకు లీకులందాయి. దాన్ని కొంతసేపు ప్రసారం చేసిన తర్వాత దొరికిన నగదును 15 కోట్లకు తగ్గిస్తూ మరోసారి ‘లీక్’ వచ్చింది. చివరకు అర్ధరాత్రి సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడినప్పుడు డబ్బుల ప్రస్తావన రాలేదు. ఈ కప్పదాట్లకు కారణమేమిటో పోలీసులు వివరణ ఇవ్వకపోగా తప్పంతా మీడియాదేనని దులిపేసుకున్నారు. ఇప్పటివరకు లీకుల ద్వారా వచ్చిన సమా చారాన్ని బట్టి అక్కడ డబ్బేమీ దొరకలేదని అనుకోవాలి. నిందితులుగా పేర్కొంటున్న ఆ ముగ్గురి సంభాషణల్లో ‘వంద’ అనే మాట మాత్రం దొర్లింది. ఆ ముగ్గురిలో స్థానిక బ్రోకర్గా చెబుతున్న నందు అనే వ్యక్తికి కచ్చితమైన రాజకీయ విధేయత ఏమీ లేనట్టు తెలుస్తున్నది. అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు పెంచు కొని, ఫోటోలు దిగి, ప్రచారం చేసుకునే తరహా వ్యక్తిగా అర్థ్ధమవుతున్నది. మిగిలిన ఇద్దరు కూడా బీజేపీ నాయకులుగా అంతగా గుర్తింపు పొందినవారు కాదు. వాళ్ల మాటల్లో బీజేపీ అగ్రనేతల పేర్లు దొర్లినంత మాత్రాన అది సాక్ష్యంగా పనికి వస్తుందా? సమాజంలో చాలామంది మోసగాళ్లు తమకు వీవీఐపీలతో దగ్గరి పరిచయముందని అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. మోసపోయిన అమాయకులు సదరు వీవీఐపీ లపై కేసు పెడతానంటే ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు బయట కొచ్చిన వివరాలను బట్టి ఈరకంగా ఆలోచించవలసి వస్తున్నది. ఇంతకుమించిన సాక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే ఆ ‘లీకు’లు ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తెలియదు. ఇది నిజంగా బీజేపీ ఆపరేషన్లో భాగమే అనుకుందాము. ఆ ‘నిందితులు’ బీజేపీ కేంద్ర నాయకత్వం పనుపునే పని చేస్తున్నారని అనుకుందాము. వారి మాటల ప్రకారం ఈ నలు గురి చేరిక పక్కా అయితే పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి వస్తారు. ఇంకో రెండు మూడు రోజులు వేచి ఉంటే ఆ కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టేసుకొని ఉండేవారు కదా? అంతటి అద్భుతమైన, అమూల్యమైన అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు? జాతీయ స్థాయిలో బీజేపీని దోషిగా నిలబెట్టే తిరుగు లేని సందర్భాన్ని ఎందుకు కాలదన్నుకున్నారు? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రం తరువాత రాష్ట్రాన్ని కబళిస్తూ వస్తున్న బీజేపీ దండయాత్రకు ముకుతాడు వేయడం కోసం మరో రెండు రోజులు ఎందుకు ఓపిగ్గా ఉండలేకపోయారు? సీబీఐ, ఐటీ, ఈడీల త్రిశూల ప్రహారంతో గిట్టని రాజకీయ పక్షాలపై కక్ష సాధిస్తున్న కాషాయ పార్టీని బోనెక్కించగల బంగారు ఘడియల కోసం ఎందుకు ఎదురుచూడలేకపోయారు? సామాన్యుల మెదళ్లలో ఇటువంటి ప్రశ్నలు మొలకెత్తడం సహజం. రేపోమాపో ఈ సందేహాలను పటాపంచలు చేయగల మరిన్ని ఆడియో వీడియో సాక్ష్యాలు బయటకొస్తాయేమో చూడాలి. అప్పటిదాకా ఈ లీకుల వ్యవహారాన్ని ప్రీ మెచ్యూర్ డెలివరీగానే పరిగణించవలసి ఉంటుంది. ఈ నెలలు నిండని కాన్పు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఎంచుకొని ఉంటారు? మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేయడం అనేది తప్ప మరో తక్షణ కారణం కనిపించడం లేదు. అధికారంలో ఉండి, అనేక జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న పార్టీ ఒక ఉపఎన్నికలో గెలవడం కోసం బ్రహ్మాస్త్రాలను ఆశ్రయించవలసిన అగత్యం ఉంటుందా? ఇప్పటికే రెండూళ్లకో ఎమ్మెల్యే, పదూళ్లకో మంత్రి చొప్పున మోహరించి నెలరోజు లుగా కోరిన వరాలను తీరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రమాదకరమైన శత్రువు బలంగా దూసుకొస్తున్నాడన్న అభిప్రాయం కలిగినప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసు కోవడం తప్పులేదని అనుకుందాము. కానీ ఆ జాగ్రత్తలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తున్నాయనే గ్రహింపు కూడా అవసరం. క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి, వివిధ సంస్థలు చేపట్టిన సర్వేలను బట్టి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర్నుంచీ నేటివరకూ అధికార టీఆర్ఎస్ పార్టీ మెరుగైన స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆధిక్యతలో హెచ్చుతగ్గులుంటు న్నాయే తప్ప పూర్తిగా ఎప్పుడూ దిగజారలేదు. పదిరోజుల కింద ఉన్నంత మెరుగైన పరిస్థితి ఆడియో టేపుల లీకుల తర్వాత ఈరోజున లేదు. ఆ టేపుల్లో ఉన్న బాగోతం జనంలోకి పూర్తిగా చేరలేదా? చేరినా ప్రయోగం ఫలించలేదా? అన్నది తేలవలసి ఉన్నది. ఒక ఉపఎన్నికలో ఇంతగా సర్వశక్తులు ఒడ్డి పోరాడు తున్నప్పటికీ యాభై శాతం ఓట్లను సంపాదించే పరిస్థితిలో మాత్రం టీఆర్ఎస్ లేదని చెప్పవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఆలోచిస్తే ఇది ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. రెండు ప్రధాన ప్రతిపక్షాల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే తాము సులభంగా గట్టెక్కగలమనే ఆలోచన ఆ పార్టీ పెద్దలకు ఉండవచ్చు. ఇటువంటి అంచనాలు తప్పనిసరిగా నిజం కావాలనే రూలేమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉంటే ఈ రూల్ మారవచ్చు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత సహజం గానే ఉంటుంది. అది తీవ్రంగా ఉంటే ఒక ప్రతిపక్షం పూర్తిగా బలహీనపడి మరొకటి బలపడవచ్చు. దుబ్బాక, హుజూరాబాద్ లలో జరిగింది అదే. ఆ రెండుచోట్లా ప్రభుత్వ వ్యతిరేకత కంటే గెలిచిన అభ్యర్థుల పట్ల సానుభూతి ఈ పోలరైజేషన్కు కారణ మైంది. మునుగోడులో కూడా మూడో పార్టీ అభ్యర్థి, ఆ పార్టీకి ఉన్న పలుకుబడి స్థాయిలో ఓట్లు రాబట్టలేక పోవచ్చన్న అంచనాలున్నాయి. ఇక్కడ సింపతీ ఫ్యాక్టర్ లేదు. కనుక మూడో ప్రతి పక్షం ఓట్లు రెండో ప్రతిపక్షానికి బదిలీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతున్నట్టుగానే పరిగణించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలంటే, జాతీయ స్థాయిలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడ టంతో సమానంగా ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్య మివ్వాల్సి ఉంటుంది. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే ఓటు కూడా బలంగానే ఉన్నది. కుల, మత, జాతి భేదాలకతీతంగా పెన్షనర్ల ఓట్లు గుండుగుత్తగా కారు గుర్తుకే పడతాయి. రైతుబంధు పథకం ఫలితంగా రైతుల్లో సానుకూలత ఉన్నది. ఖరీఫ్ కాలంలో గరిష్ఠంగా సాగుచేసిన రైతు కుటుంబాల సంఖ్య 60 లక్షలు. వీరిలో రమారమి 20 లక్షలమంది కౌలు రైతులు. ఇందులో సొంత భూమి కొంత ఉండి కొంత కౌలుకు తీసుకునేవారిని మినహాయిస్తే కౌలు మీదనే ఆధారపడే వారి సంఖ్య పది పన్నెండు లక్షలుండవచ్చు. వీరికి ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నది. మిగిలిన 50 లక్షలమందిలో 15 లక్షలమంది ధరణి వల్ల చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా రైతుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా, ఒక వంతు మంది వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రధానంగా యువతరం నుంచి టీఆర్ఎస్ ఛాలెంజ్ను ఎదుర్కోవలసి ఉంటుంది. బలహీనవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఎంపవర్ చేయడం ఎజెండాలో తొలి అంశం కావాలి. అందుకు మొదటి మెట్టు విద్యారంగం. బలహీనవర్గాల పిల్లలు చదివే పాఠశాల లపై ప్రభుత్వం సరైన ఫోకస్ పెట్టలేదు. గురుకులాలను మినహాయిస్తే రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 22 వేల స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. వీటిని బాగుచేయడానికి చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. డీఈవోలు, ఎంఈవోల పోస్టుల్లో ఎక్కువ భాగం ఖాళీగానే ఉన్నాయి. విద్యా వలంటీర్ల సంఖ్య 18 వేల నుంచి 12 వేలకు పడిపోయింది. టీచర్లకు చిరకాలంగా పదోన్నతులు లేవు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం ఖాళీలు న్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్ల ఫీజులు భారీగా పెరిగాయి. సీఎమ్ఐఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో తాజా నిరుద్యోగితా రేటు 8.35 శాతం. భారతదేశపు సగటు నిరుద్యోగితా రేటు 6.43 శాతం. విద్యా–ఉపాధి కల్పన అంశాలపై దృష్టిపెట్టకపోతే వచ్చే ఎన్ని కల్లో యువతరాన్ని ఆకర్షించడం కష్టమే. భావోద్వేగ అంశాలతో ఈసారి వారు ప్రభావితం కాకపోవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అనిశ్చిత ప్రాభవం!
రాజకీయ రంగంలో తెలంగాణ అస్తిత్వాన్ని భారత్ మింగేసింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమైంది. దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పరావర్తనం చెందింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ఇప్పుడు ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ అనే కొత్త నినాదాన్ని వినిపిస్తున్నది. ఇక తెలంగాణలో అన్నీ జాతీయ పార్టీలే! బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తోడు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎమ్ఐఎమ్ వంటి చిన్నకారు సన్నకారు పార్టీలది కూడా జాతీయ హోదానే! ఎమ్ఐఎమ్కు మూడు నాలుగు రాష్ట్ర శాసనసభల్లో ప్రాతినిధ్యం ఉన్నందువల్ల అది కూడా జాతీయ పార్టీగానే చలామణీ అవుతున్నది. వైఎస్ షర్మిల పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీ. కొన్ని మరీ చిన్న పార్టీలు ఉన్నా లేనట్టే లెక్క. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల విలాసం, నివాసం హైదరాబాదే కానీ, తెలంగాణలో ఆ పార్టీకి సైన్ బోర్డ్ కూడా మిగల్లేదు. టీఆర్ఎస్ దక్షిణాదిలోని ఒక ప్రాంతీయ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా కూడా పిలిచేవారు. అటువంటి పార్టీ ఉత్తరాదికి విస్తరించి అతి బలాఢ్యుడైన శత్రువును ఢీకొట్టగలదా? ఇప్పుడిదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, శ్రీశ్రీ చెప్పినట్టు ‘అభాగ్యులం మేము, సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం. అన్నీ సమస్యలే. సందేహాలే మాకు’. అప్పుడెప్పుడో 13 శతాబ్దాలకు పూర్వం ఉత్తరాది చక్రవర్తి హర్షవర్ధనుడు దక్షిణాదిపైకి దండెత్తి వచ్చాడట! దక్కన్ ప్రాంత చాళుక్య రాజు రెండో పులకేశి ఆ చక్రవర్తిని నర్మదా నది ఆవలి దాకా తరిమి తరిమి కొట్టాడట! ‘కనోజ్ (హర్షుని రాజధాని) బహుత్ దూర్ హై’ అని భావించి ఉంటాడు. అందుకని అక్కడి దాకా వెళ్లే ఆలోచన రెండో పులకేశి చేయలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా దక్షిణాది నాయకుడెవరూ జాతీయ పార్టీని స్థాపించే ప్రయత్నం చేయలేదు. ఒక్క శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి మాత్రమే నెహ్రూ విధానాలతో విభేదించి స్వతంత్ర పార్టీని స్థాపించారు. ప్రకాశం పంతులు, ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, బెజవాడ రామచంద్రారెడ్డి వగైరా ఆంధ్రా నాయకులు ఆయనకు అండగా నిలబడ్డారు. పార్టీ ప్రభావం మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపించింది. 1967–71 మధ్యకాలంలో 44 సీట్లతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా పనిచేసింది. స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదిక మీద ‘స్వతంత్ర పార్టీ’ ఆవిర్భవించింది. సోషలిస్టు తరహా ఆర్థిక విధానాలకు ఆ పార్టీ బద్ధవ్యతిరేకి. పీవీ నరసింహారావు అమలుచేసిన ఆర్థిక సరళీకరణను ముప్ఫయ్యేళ్లు ముందుగానే ‘స్వతంత్ర పార్టీ’ ప్రవచించింది. కాలంతోపాటు కాకుండా ముప్పయ్యేళ్లు ముందు నడిచి అనతికాలంలోనే కాలధర్మం చెందింది. ఆ తర్వాత మరో దక్షిణాది నాయకుడు ఎవరూ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎమ్జీ రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డీఎమ్కే పార్టీకి ముందు ఆల్ ఇండియా అని తగిలించినప్పటికీ ఆ పార్టీ నాయకులెప్పుడూ రాజధాని ఎక్స్ప్రెస్ను ఎక్కే ఆలోచన చేయలేదు. ఎన్టీ రామారావు మాత్రం నేషనల్ పార్టీ కోసం కొన్ని కలలు కన్న తర్వాత నేషనల్ ఫ్రంట్తో సరిపెట్టుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది జాతీయ పార్టీ అనే గాండీవాన్ని దసరా నాడు జమ్మిచెట్టు దించారు. ఈ సాహసం వెనుక కేసీఆర్ లక్ష్యం ఏమిటి? సవాలక్ష సందేహాల్లో మొదటి సందేహం, ప్రశ్నల పరంపరలో మొదటి ప్రశ్న ఇదే! గుజరాత్ మోడల్ను ప్రచారం చేసుకొని మోదీ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణా మోడల్ను మేము జాతీయ రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటామని వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మోడల్ను ఓడించడమా? కేసీఆర్ మోడల్ను గెలిపించడమా? ఏది టీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం కానున్నది? వైరుద్ధ్యం లేనట్టు కనిపిస్తున్న ఈ రెండంశాలూ ఒకటి కాదు. సినిమాల్లో బాలకృష్ణ డైలాగ్ మాదిరిగా ‘బోత్ ఆర్ నాట్ సేమ్!’ ఈ రెండు లక్ష్యాల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన కార్యాచరణ అవసరమవుతుంది. మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటే, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ను బలహీనపరచాలనుకోవడం సరైన వ్యూహం కాకపోవచ్చు. కాంగ్రెస్ ఎంత దిగజారినా, ఇప్పటికీ సుమారు 170 లోక్సభ స్థానాల్లో బీజేపీని ముఖాముఖి ఎదుర్కోగల స్థితిలో ఉన్నది. కేరళలోని 20 స్థానాల్లో పోటీ కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమిల మధ్యనే ఉంటుంది. ఇంకో ఇరవై సీట్లలో ప్రాంతీయ పార్టీలతో ప్రధాన పోటీలో ఉండగల స్థితిలో ఉన్నది. కాలం కలిసొస్తే ట్రిపుల్ డిజిట్ను అందుకోగల సామర్థ్యం ప్రతిపక్షాల్లో ఒక్క కాంగ్రెస్కు మాత్రమే ఉన్నది. సమాజ్వాది పార్టీ సుమారు 50 సీట్లలో బీజేపీకి పోటీ ఇవ్వగలదు. తృణమూల్ కాంగ్రెస్ 40 సీట్లలో, ఆర్జేడీ 25 సీట్లలో, బీజేడీ 20 స్థానాల్లో బీజేపీని ఎదుర్కొంటాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు జాతీయ పార్టీలకూ ఠికానా లేదు. పైన చెప్పిన పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ముఖాముఖి బీజేపీతో తలపడేది తక్కువ సీట్లలోనే! తెలంగాణలో హైదరాబాద్ పోను మిగిలిన 16 స్థానాల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ ఉంటుంది. తెలంగాణకు బయట బీఆర్ఎస్ బలంగా నిలబడగలిగిన లోక్సభ సీటు ఇప్పటికైతే ఒక్కటి కూడా లేదు. బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్లో మద్దతు లభిస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. తెలంగాణ ‘ఇచ్చిన’ కాంగ్రెస్నే నామరూపాలు లేకుండా చేశారు అక్కడి జనం. ఇక ‘తెచ్చిన’ కేసీఆర్ను ఆదరిస్తారంటే నమ్మడం కష్టం. అందుకు వాళ్ల కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఒక మహానగరం లేని పరిస్థితిలో ఎలా ఉన్నదో అరవయ్యేళ్ల అనంతరం ఏపీ విభజన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఆశ్రయం కల్పించగల మహానగరం ఆవశ్యకతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు మహానగరాలే గ్రోత్ ఇంజన్లుగా మారుతున్నాయి. విలీనం – విభజన వంటి ప్రయోగాలు లేకుండా ఈ అరవయ్యేళ్లలో విశాఖపట్టణంపై ఫోకస్ పెట్టి వుంటే అదొక మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేదనీ, తాము మోసపోయామని వాళ్లు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్గానే ఉండబోతున్నది. కర్ణాటకలో జేడీఎస్ మీద కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ కాంగ్రెస్ – బీజేపీల మధ్య ఏర్పడిన పోటాపోటీ వాతావరణంలో జేడీఎస్ పలుకుబడి నానాటికీ క్షీణిస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాలపై నమ్మకం పెట్టుకోవడం కూడా కష్టం. ఆయా రాష్ట్రాల్లోని ప్రధానస్రవంతి రాజకీయాలకు భిన్నంగా భాషాపరమైన మైనారిటీలు వ్యవహరించడం సాధారణంగా జరగదు. మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమైతే కేసీఆర్ గతంలో చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ ప్లస్ కాంగ్రెస్ కూటమే మెరుగైన ప్రత్యామ్నాయమవుతుంది. అప్పుడు కేసీఆర్ జాతీయపార్టీ అవసరం ఉండదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద ఉన్నదనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదనే అంచనాతో ఆ స్థానాన్ని తమ జాతీయ పార్టీ భర్తీ చేయాలని వారు భావిస్తున్నారు. తెలుగు సినిమాలు కంటెంట్తో పాన్ ఇండియా సినిమాలుగా వెలుగుతున్న విషయాన్ని కేటీఆర్ పదేపదే గుర్తు చేస్తున్నారు. కంటెంట్తోనే పాన్ ఇండియా పార్టీ కూడా సక్సెస్ కొట్టగలదనే ధీమా ఆయనలో ఉన్నది. తెలంగాణా అభివృద్ధి మోడలే ఆ కంటెంట్! అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశం దృష్టిని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటున్నది. ముఖ్యంగా రైతులను, దళిత వర్గాలను ఫోకస్ సెక్షన్లుగా ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తున్నది. రైతు బంధు, దళిత బంధు, సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్ వంటి అంశాలనూ, తెలంగాణలోని సంక్షేమ పధకాలనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడే ఒక సమస్య ఉన్నది. తాము అమలు చేసిన పథకాలు దేశమంతటా జైత్రయాత్రకు ఉపకరిస్తాయని ఒకపక్క ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరోపక్క మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల కోసం రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను, పది గ్రామాలకో మంత్రిని నియమించి పద్మవ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకింత కురుక్షేత్ర యుద్ధ సన్నద్ధత? అధికారంలో ఉన్న పార్టీ ఒక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవడం కోసం ఆపసోపాలు పడవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? పైగా అక్కడ అధికార పార్టీకే ఎక్కువ అనుకూలతలున్నాయి. కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆ పార్టీకి అక్కడ పెద్దగా బలం లేదు. హుజూరాబాద్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులేత్తేసే పరిస్థితి లేదు. ఆ పార్టీ పునాదులు బలంగానే ఉన్నాయి. గట్టిగానే పోటీలో నిలబడగలుగుతుంది. రెండు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక అధికార పార్టీకి రాచబాటే కదా! అయినా ఎందుకో ఆ ధీమా కనిపించడం లేదు. ఈ పరిస్థితి మునుగోడుకే పరిమితమా? రాష్ట్రమంతటా ఉన్నదా అనేది ఇంకా అంతుబట్టడం లేదు. ఇప్పుడు మన సమాజంలో మిలీనియల్స్ తరం, ఆ తర్వాతి (ో) తరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. వారి ఆలోచనలే సమాజ అభిప్రాయంగా రూపుదిద్దుకుంటున్నాయి. సోషల్ మీడియాను పరిపాలిస్తున్నది వారే! వారి దృష్టిలో ప్రభుత్వ పాలన, సంక్షేమాలకు అర్థాలు మారిపోయాయి. సామాజిక పెన్షన్లు హక్కులుగా మారిపోయాయి. నేటి యువతరం తారకమంత్రం సాధికారత. వెనుకబడిపోయిన సమస్త వర్ణాలు, వర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఎదిగేందుకు సమానమైన అవకాశాలు అందుబాటులో ఉండటమే సాధికారత మార్గాలుగా యువతరం భావిస్తున్నది. మారుతున్న ఆలోచనల్ని గ్రహించి పబ్లిక్ పల్స్ పట్టుకోగలిగితే బీఆర్ఎస్కు ప్రయోజనం కలగవచ్చు. డిసెంబర్లో పార్టీ మొదటి బహిరంగ సభ జరిగి పార్టీ ప్రణాళిక విడుదలయ్యే వరకు ఊహాగానాలు, సందేహాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఆ పార్టీ ప్రణాళిక కార్యక్రమం పబ్లిక్లో విడుదలై కంటెంట్ నచ్చితే, కేసీఆర్ పంచ్ డైలాగులు పేలితే బొమ్మ పాన్ ఇండియా హిట్ కావచ్చు. అవుతుందనే ఆశిద్దాం. బీఆర్ఎస్ హడావిడి∙ఇండియాలో ఏమోగానీ తెలంగాణలో గులాబీ పార్టీకి కొంత మేరకు ఉపయోగపడవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మైనారిటీల ఓట్లు, లెఫ్ట్ భావజాలం ఓట్లు (కమ్యూనిస్టు పార్టీల ఓట్ల కంటే ఇవే ఎక్కువ) కాంగ్రెస్ను కాదని గులాబీ పార్టీ వెనుక సమీకృతమయ్యే అవకాశాలుంటాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని జీవచ్ఛవంగా అభివర్ణిస్తున్నారు. మోదీ ప్రభుత్వం కూడా ఈ మూడేళ్లలో వ్యతిరేక ఓటును బాగానే సంపాదించుకున్నది. అవీ గులాబీ ఖాతాలో పడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత న్యూట్రలైజ్ చేయవచ్చు. వెరసి రాష్ట్రంలో కొంత ఉపయోగం జరగవచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత తెలిసిందే. రాష్ట్రస్థాయి లక్ష్యసాధన కోసం జాతీయ స్థాయి ఆయుధం ధరిస్తే తప్పేమున్నది? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ధనస్వామ్యం దండయాత్ర!
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ చెప్పారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు. అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్’ కంటెంట్ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్డీపి గ్రోత్ రేట్ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్ పూలింగ్కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్సైడర్ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ను ఆయన ప్లాన్ చేశారు. ఈ వెంచర్పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్కు స్థిరపడిపోయింది. మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ విజన్కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి. ‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్ విజన్కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’ ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జెండా ఊంఛా రహే హమారా!
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హాసన్. హైదరాబాద్ వాసి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆజాద్ భారత్కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లలో వారి ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆక్రమించాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్ కోడ్ పాటించారు. వారి సెల్యూల్లో ఏ వంకా లేదు. ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి? రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే. ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం. మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టార్లోని వైట్కాలర్ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్ పదవులిస్తే కోపం. నామినేటెడ్ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్ డబ్బులు ఠంచన్గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు. ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అటు శనీశ్వరం – ఇటు కాళేశ్వరం
తెలుగు రాష్ట్రాలకు ఎండ వేడి ఎక్కువే. రాజకీయ వేడీ ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్లకోమారు జరగాలి. ఆ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తులు, పైయెత్తులూ రెండున్నరేళ్లు ముందుగానే ప్రారంభమవుతాయి. అందువల్ల రేయింబవళ్ల మాదిరిగా మన సగం జీవితకాలాన్ని ఈ రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 22 నెలల టైముంది. ఇంకో పదహారు నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు జరగాలి. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు సంధించ బోయే ప్రధానాస్త్రాలేమిటో ఇప్పటికే వెల్లడైంది. ఏపీలో శనీశ్వరుని పీడ, తెలంగాణలో కాళేశ్వరంపై రగడ! చంద్రబాబు పార్టీ, దాని అనుబంధ విభాగాలైన యెల్లో మీడియా, సోషల్ మీడియా, స్లీపర్ సెల్స్ అన్నిటినీ కలిపి శనీశ్వరుని పేరుతో పరిగణించవలసి వస్తున్నది. ఎందుకంటే ఈ యెల్లో సిండికేట్కు మంచీ–చెడులతో పనిలేదు. ఉచ్ఛ–నీచ విచక్షణ లేదు. న్యాయా న్యాయ విచికిత్స అవసరం లేదు. సమయమూ – సందర్భమూ ఉండదు. తన కూటమి అధికారంలో ఉండడానికి ఏం చేయడా నికైనా వెనుకాడదు. శనీశ్వరుడూ అంతే... ఎందుకు, ఎప్పుడు, ఎవరిలో ప్రవేశి స్తాడో తెలియదు. ఎందుకు పీడిస్తాడో తెలియదు. ఎప్పుడు వదులుతాడో తెలియదు. అతడి ప్రభావం నుంచి పరమ శివుడైనా తప్పించుకోలేడనే కథ ఒకటి ఉన్నది. ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లి శనీశ్వరుడి ఆగడాలపై పరమేశ్వరునికి మొరపెట్టుకున్నాడట! అతని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని సవాల్ చేశాడట. ‘ఆ శని నన్ను కూడా వేధించగలడా’ అని పరమశివుడు ప్రశ్నించాడట. ‘తప్పకుండా వేధిస్తాడ’ని నారదుల వారు బదులు చెప్పారట! అయితే డేటూ, టైమూ ఫిక్స్చేసి రమ్మని చెప్పు, ఏం చేస్తాడో చూద్దామని శివుడు ఆదేశించాడట. నిర్ణయించిన ముహూర్తానికి ఒక కీకారణ్యంలోకి వెళ్లి వటవృక్షం తొర్రలో పరమేశ్వరుడు దాక్కున్నాడట. నిర్ధారిం చిన ఘడియలు దాటిన తర్వాత విజయగర్వంతో శివుడు బయ టకు వస్తాడు. ఎదురుగా శనీశ్వరుడు! శివునికి నమస్కరించి, ‘స్వామీ! కైలాసంలో కూర్చొని లోకాలను పాలించవలసిన తమరు నా భయంతో కొన్ని ఘడియలైనా సరే చెట్టు తొర్రలో దాక్కున్నారు. అదీ నా ప్రభావం’ అని చెప్పాడట! యెల్లో సిండికేట్ కనికట్టు విద్యలో దిట్ట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడంలో బహు నేర్పరి. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా భ్రమించేంతవరకు వెంటపడుతూనే ఉంటుంది. ఈ యెల్లో శనీశ్వరుని లీలలే మనం ఏపీ ఎన్నికల ప్రచారంలో చూడబోతున్నాము. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ చేతిలో వజ్రాయుధంగా ఉండవలసింది. కానీ, దాన్నే ప్రతిపక్షాలు కూడా ప్రధాన ఆయుధంగా మలుచుకోగలగడమే వింతల్లో కెల్ల వింత. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది విపక్షాల ఆరోపణ. ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ కూడా కన్నేసిందనీ, ఈడీ రంగంలోకి దిగిందనే వార్తలు కూడా ముసురుకున్నాయి. ఈ వార్తలకు ప్రతిపక్షం కంటే అధికార పక్షమే ఎక్కువ ఆజ్యం పోయడం ఆసక్తి కలిగించే అంశం. దర్యాప్తు సంస్థల్ని చేతిలో పెట్టుకొని కేంద్రం ప్రతిపక్ష రాష్ట్రాలను బెదిరిస్తున్నదనీ, మేం దానికి భయపడేది లేదనీ స్వయంగా ముఖ్యమంత్రే పలుమార్లు ప్రకటించారు. దీంతో లోలోపల ఏదో జరుగుతున్నదనే అనుమానం జనంలో పొడసూపింది. ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అంటే ‘మోడీ, ఈడీ’ అనే నిర్వచనాన్ని కేటీఆర్ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఫలితంగా రాబోయే ఎన్నికల కాలాన్ని ప్రభావితం చేయబోయే అంశం కాళేశ్వరమేనన్న అభిప్రాయం బలపడుతున్నది. శని ఒకసారి ప్రవేశిస్తే కొంత కీడు చేస్తాడు. రెండోసారి ప్రవేశిస్తే ఇంకొంచెం ఎక్కువ కీడు చేస్తాడు. మూడోసారి కూడా ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమట. ఆ మూడో దశను మృత్యు పీడనతో పోల్చుతారు కొందరు జ్యోతిష్యులు. ఈ యెల్లో శనీశ్వరుడు ఇప్పటికే రెండుసార్లు అధికార పీఠంలో ప్రవేశించి, మొదటిసారి ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత రాష్ట్రాన్ని పీడించాడు. కాకపోతే శని పీడన కాలాన్ని కూడా స్వర్ణయుగంగా ప్రచారం చేయడం యెల్లో సిండికేట్ గొప్పతనం. మూడోసారి ప్రవేశం కోసం గత మూడేళ్లుగా యెల్లో శనీశ్వరుడు ప్రదర్శిస్తున్న ఇంద్రజాల విద్యల్ని చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ వారం నుడివిన పోలవరం సుభాషితాలను ఒకసారి పరిశీలించండి. గోదావరి వరదల తర్వాత రెండుసార్లు చంద్రబాబు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ఒకసారి, తర్వాత ఒకసారి! ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించి, వారికి కావలసిన వనరులను సమకూర్చి నిరంతరం పర్యవేక్షించడం, సలహాలివ్వడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించే పద్ధతి. తానే స్వయంగా పర్యటనకు వెళ్తే అధికార యంత్రాంగం తన చుట్టూ మూగుతారనీ, సహాయ చర్యలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఆయన ఈ పద్ధతిని అనుసరిస్తారు. ప్రపంచంలో చాలామంది ప్రభుత్వాధినేతలు కూడా ఈ పద్ధతినే అనుస రిస్తారు. చంద్రబాబు పద్ధతి వేరు. ఆయనొక షోమ్యాన్. సహాయ కార్యక్రమాలు అటకెక్కినా సరే తాను తుపానులను ఆపేస్తున్నట్టూ, వరదలను కంట్రోల్ చేస్తున్నట్టూ మీడియాలో కనిపించాలి. అధికార బృందాన్ని తన చుట్టూ నిలబెట్టుకొని వారి మీద అరుస్తుండాలి. తాను ఒక్కడే చురుగ్గా పనిచేస్తున్నట్టు మీడియాలో ఆహా ఓహో అనే వార్తలు రావాలి. వైఎస్ జగన్ అనుసరించే పరిష్కార వైఖరిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు మొదటిసారి వెళ్లారు. ‘సీఎం రాలేదు... నేను వచ్చాన’ని గొప్పలు చెప్పు కున్నారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే ఆయన మాటలను వక్రీకరించడానికి చంద్రబాబు మరోసారి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్రెడ్డి పూర్తిచేయలేరని తేల్చేశారు. తాను మళ్లీ వచ్చి పూర్తిచేస్తానన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యమని చెప్పారు. 22 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం 20 వేల కోట్లు ఇస్తుందని సలహా ఇచ్చారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తానన్నారు. ఎప్పుడూ చెప్పినట్టుగా సకల అనర్థాలకు జగన్ ప్రభుత్వమే కారణమనీ, తాను వస్తే జిందా తిలిస్మాత్ తెస్తాననీ మరోసారి ఢంకా భజాయించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని మూడు ముక్కల్లో పరిశీలిద్దాము. 195 టీఎమ్సీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందుకోసం గోదావరికి అడ్డంగా రెండున్నర కిలోమీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ను కట్టాలి. ఈ డ్యామ్ను కట్టాలంటే వరదను మళ్లించాలి. సీడబ్లు్యసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు ఎగువన అప్రోచ్ చానల్ నిర్మించి, నదీ ప్రవాహాన్ని కుడివైపుకు మళ్లించాలి. డ్యామ్కు సమాంతరంగా కుడివైపున నిర్మించే స్పిల్వే మీదుగా నీటిని విడుదల చేసి సుమారు 6 కిలోమీటర్ల తర్వాత మళ్లీ ప్రధాన నదిలో కలపాలి. స్పిల్వే పనులు కాగానే 35 మీటర్ల ఎత్తు కాంటూర్ పరిధిలో నివసించే 8,800 కుటుంబాలకు పునరావాసం కల్పించి, ఎగువ కాఫర్ డ్యామ్ను నిర్మించాలి. ఆ తర్వాత స్పిల్వే ద్వారా మళ్ళించి మళ్లీ నదిలో కలిపిన వరద వెనక్కు ఎగదన్ని డ్యామ్ పనులకు విఘాతం కలిగించకుండా దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించి, ఈసీఆర్ఎఫ్కు పునాదిగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ పద్ధతి మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం తలకిందులు చేసింది. నిర్వాసితుల పునరావాసంలో కమీషన్లు రావు కనుక అది పక్కనపెట్టి డయాఫ్రమ్ వాల్ పనులను చేపట్టింది. కాఫర్ డ్యాం ద్వారానే పంటలకు నీళ్లిస్తానని ప్రకటించి, స్పిల్వే కట్టకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పని ప్రారంభిం చారు. నిర్వాసితులు పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేయడంతో కాఫర్ డ్యామ్ల పనిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత 2019 ఆగస్టు, 2020 ఆగస్టుల్లో వచ్చిన వరదలు సగం కట్టిన ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా తక్కువ వైశాల్యంలో ప్రవహించవలసి వచ్చింది. దీంతో వరద ఉధృతి పెరిగి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై, రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిన్నది. ఇదీ తెలుగుదేశం ప్రభుత్వం పోలవరంలో సాధించిన ఘనకార్యం. ఈ పాపాలన్నిటినీ దాచిపెట్టి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంపై నిందలకు దిగారు. 22 మంది ఎంపీలు రాజీనా మాలు చేస్తే నిర్వాసితుల పునరావాసానికి డబ్బులు రావా అని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీటిపారుదల వ్యయాన్ని మాత్రమే ఇస్తామంటూ, అంటే నిర్వాసితుల పరిహారం తమ పరిధిలోది కాదంటూ గతంలో కేంద్ర కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పుడు 20 వేల కోట్లను పరిహారంగా తీసుకు రావడానికి ఆ తీర్మానమే అవరోధంగా మారింది. తీర్మానం చేసినప్పుడు కేంద్ర కేబినెట్లో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు న్నారు. వారు అభ్యంతరం చెప్పి వున్నా, రాజీనామా చేస్తామని హెచ్చరించి వున్నా ఈ కేబినెట్ తీర్మానం ఉండేది కాదు. ఇప్పుడీ అవస్థ ఉండేది కాదు. సిగ్గుతో తలదించుకోవలసింది ఎవరు? రాజీనామా చేయవలసింది ఎవరు? అలాగే, ‘అల్లూరి సీతారామ రాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉండటమేమిటి? అంతదూరం ఎలా వెళ్తారు? విలీన మండలాలతో ఒక ప్రత్యేక జిల్లానే ఏర్పాటు చేస్తా’నని కూడా చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం పద్నాలుగేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. రెండున్నరేళ్ల కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు పోలవరం జిల్లా ప్రకటన చూస్తే నవ్వు రాకుండా ఉంటుందా? పైగా గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత పనుల కోసం మండల కేంద్రాలకు వెళ్లే వారే కరువయ్యారు. ఇక జిల్లా కేంద్రానికి వెళ్లేవారి సంఖ్య బహుస్వల్పం. యెల్లో శనీశ్వరుల ప్రచారాలకు ఒక తర్కం గానీ, హేతుబద్ధత గానీ, వాస్తవికత గానీ, ఆధారాలు కానీ ఏమీ ఉండవు. స్వార్థ ప్రయోజనం తప్ప! వారానికి ఒకటి చొప్పున వెలువడుతున్న పోలవరం తరహా ప్రచారాలు విశ్లేషణలకు అందవు. బండకేసి బాదడమే మార్గం. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజినీరింగ్ వండర్గా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికవుతున్న వ్యయాన్ని బట్టి చూసినా ఇదొక ప్రపంచస్థాయి ప్రాజెక్టు. ఇప్పటికే రమారమి 80 వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో 40 వేల కోట్లయితే తప్ప మొత్తం ప్రాజెక్టు పూర్తి కాదు. 20 చోట్ల లిఫ్టులు, 20 రిజర్వాయర్లున్న బృహత్తర పథకం ఇది. ప్రాజెక్టు నిర్వహణకయ్యే విద్యుత్ వ్యయమే ఏటా 4 వేల కోట్లుంటుందని అంచనా. వ్యయంలో సింహభాగం రుణాలే కనుక రానురాను ఈ ప్రాజెక్ట్ నిర్వహణ భారంగా మారనున్నదని ప్రతిపక్షాలతో సహా కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ అంతకు అనేక రెట్లు రైతులు లాభపడనున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ రైతులు గత సంవత్సరం సాధించిన 2 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులను చూపెడు తున్నది. కానీ ఈ రెండేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి పోసిన నీళ్లు వంద టీఎమ్సీల కంటే తక్కువేనన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన జల యజ్ఞంలో భాగంగా ‘ప్రాణహిత – చేవెళ్ల’ అనే ఒక కొత్త ఆలోచనకు కూడా కార్యరూపం ఇచ్చారు. వార్ధా, వేనగంగ నదుల సంగమం తర్వాత ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా ఈశాన్య సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బరాజ్ నిర్మించాలి. అక్కడి నుంచి ఎల్లంపల్లి దగ్గర (గోదావరి – ప్రాణహిత సంగమానికి ముందు) గోదావరికి తరలించి, మిడ్ మానేరు మీదుగా రంగారెడ్డి జిల్లా వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీ–డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందనీ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చనే అంచనాతో ప్రాజెక్టును రీ–డిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి... సముద్రమట్టానికి దాదాపు సమానమైన ఎత్తులో ఉంటాయి. కనుక ఎత్తిపోతల వ్యయం తక్కువగా ఉంటుంది. మేడిగడ్డ తక్కువ ఎత్తులో ఉంటుంది. అక్కడ్నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేందుకు ఎక్కువ సామర్థ్య మున్న మోటర్లు, ఎక్కువ ఖర్చు అవసరమౌతాయి. పైగా రివర్స్ పంపింగ్! నదిని వెనక్కు పంపించడం! పోలవరంలో నదీ ప్రవాహాన్ని కుడిపక్కకు మళ్లించి, దిగువన ప్రవాహంలో కలిపేయడం ప్రత్యేకత. కాళేశ్వరంలో ఎగువకు మళ్లించడం ప్రత్యేకత. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నుంచి మూడు పంప్హౌస్ల సాయంతో ఎల్లంపల్లి దగ్గర గోదావరిలో కలుపు తారు. అయితే గడిచిన సంవత్సరం ఇలా 30 టీఎమ్సీలను ఎల్లంపల్లికి తరలించిన తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో అందులో 23 టీఎమ్సీలను గేట్లెత్తి మళ్లీ దిగువకు వదలాల్సి వచ్చింది. పీఛేముడ్ – ఆగేముడ్! కరెంట్ ఖర్చు అదనం. కాళేశ్వరం ప్రాజెక్టును సాంకేతిక అంశాలు, వ్యయప్రయాసల అంశాల అధారంగా విమర్శించే వారు ఒక వర్గం. రాజకీయ విమర్శలు చేసేవారు మరో వర్గం. ఈసారి ఎలాగైనా తెలంగాణాలో అధికారాన్ని సాధించి దక్షిణాదిన బలపడాలని బీజేపీ గట్టిగా కోరుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బలహీనపడుతున్నప్పటికీ తెలంగా ణలో మాత్రం ఇప్పటికీ బలమైన పునాదు లున్నందు వల్ల చావో–రేవో తేల్చుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడు తున్నది. ఈ రెండు పార్టీలు కాళేశ్వరాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకున్నాయి. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిం దని ఆరోపిస్తున్నాయి తప్ప ఇప్పటివరకు ఆ అవినీతికి సంబం ధించి ఒక్కటైనా నిర్దిష్టమైన ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని వనరులూ చేతిలో ఉన్న బీజేపీ కూడా ఎటువంటి ఆధారాన్నీ చూపెట్టలేకపోతున్నది. కాకపోతే ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పారదర్శకత లేదని వాదిస్తున్నది. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సాయం అందించే ఏఐబీపీ స్కీమ్లో చేర్చుతాము... వివరాలు పంపించమని అడిగితే రాష్ట్రం స్పందించడం లేదని కేంద్రం ఆరోపిస్తున్నది. ఖర్చులు, రుణాలు మొదలైన వివరాలను చెప్పడం ఇష్టం లేకనే స్పందించడం లేదని కేంద్రం అభిప్రాయం. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్రం చేసిన డిమాండ్పై కేంద్రం స్పందిస్తూ – ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతులు లేవనీ, అందుకే జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేమనీ చెప్పింది. ఎంతసేపూ ఖర్చులకు సంబంధించిన పారదర్శకత లేదని చెప్పడం ద్వారానే అవినీతి ముద్ర వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు కనిపి స్తున్నది. ‘కాళేశ్వరం – అవినీతి’ అనే అంశంపై జాతీయ పార్టీలు ఎంత దూకుడుగా ఉన్నాయో, టీఆర్ఎస్ అంతే దూకుడుగా ఉన్నది. వస్తేరానీ ఈడీ–మోడీ అంటున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే కాళేశ్వరం ట్రాప్లో జాతీయ పార్టీలను ఇరికించ డానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదా? టీఆర్ఎస్ను జాతీయ పార్టీలు ఇరుకున పెడుతున్నాయా అనేది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అడ్వాంటేజ్ ఇండియా?
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వారసుని ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంకృతాపరాధాల ఫలితంగా అవమానకరమైన రీతిలో ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకోవలసి వచ్చింది. తొలిదశలో ఎనిమిదిమంది పోటీపడ్డారు. వీరిలో ఇద్దరిని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎంపిక చేయవలసి ఉంటుంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత పోటీ నుంచి ముగ్గురు నిష్క్రమించారు. టాప్ టూలో మొదటి స్థానంలో రిషీ సునాక్, రెండో స్థానంలో పెన్నీ మోర్డంట్ ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల ఎంపికలో తుదివరకూ ఈ ఇద్దరే నిలబడవచ్చని అంచనా వేస్తున్నారు. కన్సర్వేటివ్ పార్టీలో సభ్యులుగా ఉన్న రెండు లక్షలమంది ఈ ఇద్దరిలో ఒకరిని ప్రధాని పదవికి ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ముందంజలో ఉన్న రిషి సునాక్కు భారతీయ మూలాలు ఉండడమే మనకు సంబంధించినంతవరకు ఈ వారం వార్తా విశేషం. గండభేరుండ రాజ‘పక్షులు’ ఎగిరిపోవడంతో శ్రీలంక కథ ఈ వారమే క్లైమాక్స్కు చేరుకున్నది. ప్రజాస్వామ్యం పేరుతో అధికార పీఠాన్ని ఎక్కి కుటుంబ పాలనతో నిరంకుశాధికారాలను చలాయించి శ్రీలంకను దివాళా అంచుకు నెట్టడం తాజావార్త కాదు. లంక వీధుల్లో జనస్వామ్యం ప్రజ్వరిల్లడమే వేడివేడి వార్త. నిరంకుశ ప్రభువులను తరిమి తరిమి కొట్టడమే గరమ్గరమ్ వార్త. వారి మెడలు వంచి రాజీనామాలిప్పించడమే ఈ వారపు తుదివార్త. తదుపరి కార్యక్రమాన్ని శ్రీలంక పార్లమెంట్ వచ్చేవారం చేపట్టబోతున్నది. ఈ రెండు పరిణామాలు ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారాలే కావచ్చు. కానీ, ఆర్థిక – సాంకేతిక రంగాల గ్లోబలైజేషన్ తర్వాత దేశాల ఏకాకితనం దూరమైంది. ఎక్కడ తీగ లాగినా డొంకంతా కదులుతున్నది. ఈ సందర్భంలో ఇతర దేశాల డొంకల కంటే భారత్ డొంక ఇంకొంచెం ఎక్కువ కదులుతున్నది. భారత ఉపఖండంలో భాగమైన దేశం శ్రీలంక. నిజానికి మనదేశానికి ఉపగ్రహం లాంటి దేశం. అలాంటి దేశంతో అచ్చిక బుచ్చికలాడి చైనా వాళ్లు మచ్చిక చేసుకున్నారు. అప్పులిచ్చి ప్రలోభపెట్టి, షరతులు పెట్టి దివాళా తీయించి దానితో ఆటలాడుకున్నారు. ఇటువంటి సమయంలో తలెత్తిన ఈ పరిణామాలు మిగిలిన ప్రపంచం కంటే భారత్కే ఎక్కువ ఆసక్తికరం. అవసరం కూడా! బ్రిటన్ పరిణామాలు భావోద్వేగపరమైనవి. రెండొందల ఏళ్లపాటు ఈ దేశాన్ని పీల్చి పిప్పిచేసిన బ్రిటీష్ సామ్రాజ్యవాద దేశానికి ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రధానమంత్రి కాగలడా అని ఎదురు చూసే అవకాశం రావడం... అదీ ఆజాదీ అమృతోత్సవ సంవత్సరం కావడం... ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన సన్నివేశం! తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి బ్రిటన్కు వలస వచ్చిన కుటుంబాల్లో మూడోతరం వాడు రిషీ సునాక్. అంతకంటే ఎన్ని తరాల ముందు ఇండియా నుంచి ఆఫ్రికా వెళ్లారనే వివరాలు అందుబాటులో లేవు. పూర్వీకులది పంజాబ్. రిషి తండ్రిపేరు యశ్వీర్. తల్లి పేరు ఉష. రిషి పితామహుడు కెన్యా నుంచి, మాతామహుడు టాంజానియా నుంచి వచ్చి బ్రిటన్లో స్థిరపడ్డారు. తమ కుటుంబం ఇప్పటికీ భారతీయ ఆచార సంప్రదాయాలనే పాటిస్తున్నదని రిషి బహిరంగంగానే ప్రకటించారు. తనను తాను బ్రిటీష్ ఇండియన్గా ప్రకటించుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు తాను హిందువునని కూడా ఆయన చెప్పుకున్నారు. మతాన్నీ, రాజకీయాలనూ మిళితం చేయకపోవడం, వేరువేరుగా పరిగణించడం బ్రిటన్ ప్రజల్లో ఉన్న ఒక గొప్ప సుగుణం. అందువల్లనే రిషి తనను తాను హిందువుగా పరిచయం చేసుకోగలిగారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె ఆకాంక్షను ఆయన పెళ్లి చేసుకున్నారు. రిషి అనేది భారతీయ పదమే. మరి సునాక్? ఇంటి పేరా? భారతీయ రుషి పరంపరలో శునకుడనే రిషి కూడా ఉన్నాడు. మహాభారత కథలో సుప్రసిద్ధుడైన శౌనక మహర్షి తండ్రిగా శునక మహర్షి ప్రస్తావన ఉంటుంది. ఒకవేళ రిషికి పెట్టాలనుకుంటే ప్రసిద్ధుడైన శౌనక రుషి పేరే పెడతారు కానీ అంతగా పేరు లేని శునక రుషి పేరెందుకు పెడతారు? పైగా శునకమంటే గ్రామసింహం. కాకపోతే రుషులకు పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఉండటం కూడా రివాజే! రామాయణంలో పిడకల వేట అనేది మన సంప్రదాయంలో ఒక భాగం కనుకనే ఈ పేరు గురించిన చర్చ. ఒకవేళ టోరీలు రిషిని ప్రధానిగా ఎంపిక చేస్తే ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ సవివరంగా బయటకొస్తాయి. ఎంపీల మద్దతు లభించినప్పటికీ పార్టీ సభ్యుల్లో మెజారిటీ కూడగట్టడం కష్టమే అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పటికే బోరిస్ జాన్సన్ రిషికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాడు. తాను ప్రజాదరణ కోల్పోవడానికి రిషీయే కారణమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నది. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం పెన్నీ మోర్డంట్కే తదుపరి ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. బ్రిటీష్ ప్రధానమంత్రి రేసులో భారతీయ మూలాలున్న వ్యక్తి సెమీఫైనల్ దాకా దూసుకొనిరావడం కూడా గొప్ప విషయమే. ఇప్పటికే యూరప్లో ఒక ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా పూర్వీకులది భారత్లోని గోవా రాష్ట్రం. అక్కడి నుంచి ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి వలస వెళ్లి ఆ తర్వాత పోర్చుగల్లో స్థిరపడ్డారు. మారిషస్ అధ్యక్ష, ప్రధానులుగా ఎప్పటినుంచో భారతీయ సంతతి వారుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ కూడా భారతీయ మూలాలున్నవారే. సింగపూర్, సురినామ్, గయానా, సీషెల్స్ ప్రస్తుత అధ్యక్షులు భారతీయ సంతతివారే! పాతికేళ్లపాటు మలేషియాకు నాయకత్వం వహించిన మహతీర్ మొహమ్మద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ కేవలం ఒక మెట్టు దూరంలోనే ఉన్నారు. అయితే అత్యున్నత పదవిని చేపట్టడానికి ఆమె రెండు పెద్ద ఆటంకాలను దాటవలసి ఉన్నది. ఒకటి – డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడం. రెండవది – ట్రంప్ లాంటి ప్రత్యర్థిని ఎదిరించి గెలవడం. కష్టమైన పనే! కానీ, రానున్న రోజుల్లో అమెరికా, బ్రిటన్, కెనడా దేశాధినేతలుగా భారతీయ సంతతివారు ఎన్నికయ్యే అవకాశాలు మాత్రం మెరుగవుతున్నాయి. భారతీయ మూలాలున్నవారు ఇతర దేశాల అధినేతలుగా ఉన్నంత మాత్రాన భారత్కు కలిగే ప్రయోజనమేమిటి? అదొక గర్వకారణం. ఒక తెలుగు సినిమాలో గురుశిష్యులైన పురోహితులుంటారు. గురువంటాడు శిష్యునితో – ‘అయితే అమితాబ్ బచ్చన్ కూడా మనవాళ్లేనేంట్రా?’ అని! ‘ఔను గురువుగారూ! వారు అలహాబాద్ బ్రాహ్మలు, మనం హైదరాబాద్ బ్రాహ్మలం. అంతే తేడా’ అని బదులిస్తాడు శిష్యుడు. ‘కిక్కురా కిక్కు’ అని పరవశించిపోతాడు గురువు. అలాంటి పరవశమేదో మనవాళ్లకు కలగవచ్చు. అది భావోద్వేగపరమైన ప్రయోజనం. ఎన్నో తరాలకు ముందే బతుకుతెరువు కోసం వెళ్లి అక్కడి సంస్కృతిలో, ఆచారాల్లో పుట్టి పెరిగినవారు కనుక మానసికంగా వారు ఆయా దేశాల పౌరులుగానే తయారవుతారు. తాతలనాటి దేశం కనుక భారత్పై వారికి అమ్మమ్మగారి ఊరి మీద ఉండేంత ప్రేమ ఉంటే ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఆశించలేము. ఆయా దేశాల ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే భారతీయ సంతతి వారైనా సరే వ్యవహరిస్తారు. కాకపోతే తటస్థ వేదికలపై కశ్మీర్ లాంటి అంశాలపై, సొంత దేశానికి ఇబ్బంది కలగని ఇతర విషయాల్లో భారత్కు అనుకూలంగా మెలగవచ్చు. అంతమాత్రమైనా దేశానికి ప్రయోజనకరమే! ‘గాడ్ఫాదర్’ నవల్లోని (సినిమా కూడా) మాఫియా డాన్ కాలీయోనీ కుటుంబంలోని పాత్రల వంటివే రాజపక్సే కుటుంబ పాత్రలని లంక ప్రతిపక్షాల అభిప్రాయం. నలుగురు అన్నదమ్ముల్లో మహింద రాజపక్సే ప్రముఖుడు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా, అధ్యక్షునిగా లంకలో చక్రం తిప్పినవాడు. 2009 మిలిటరీ ఆపరేషన్తో ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేసి సింహళ జాతీయవాద బౌద్ధులకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఈయన హయాంలోనే భారత్ను కాదని చైనాకు లంక దగ్గరయింది. తమిళుల ఊచకోతకు అవసరమైన ఆయుధాలను చైనా సరఫరా చేసింది. మానవ హక్కుల హననాన్ని భారత్తోపాటు మిగిలిన ప్రపంచం ఖండించినా, చైనా మాత్రం స్పందించలేదు. తన అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా లంక పాలకుడిని చైనా మచ్చిక చేసుకున్నది. అడిగిందే తడవుగా అప్పులు సమకూర్చింది. చైనా అప్పుల్లో రాజపక్సే కుటుంబానికి ఒక సౌలభ్యం కనిపించింది. తీసుకున్న రుణంలో సొంతానికి ఎంత కైంకర్యం చేసినా చైనా పట్టించుకోదు. మిగిలిన రుణదాతలైతే ఇచ్చిన రుణాన్ని దేనికెంత ఖర్చు పెడుతున్నారో లెక్క చెప్పమని అడుగుతారు. రుణగ్రస్థ దేశం ఆ రుణాన్ని సద్వినియోగపరిస్తేనే తిరిగి చెల్లించగలిగే స్థితిలో ఉంటుంది కనుక అటువంటి పర్యవేక్షణ ఉంటుంది. రుణగ్రస్థ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచి మెడలు వంచడమే చైనా లక్ష్యం కనుక లెక్కలడగదు. కానీ మిగిలిన వారికంటే ఎక్కువ వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తుంది. అప్పుల ఊబిలో ముంచే హంబన్తోట ఓడరేవును చైనా 99 ఏళ్లపాటు లీజుకు రాయించుకుంది. అయినా చైనా అప్పుల కోసమే రాజపక్సేలు ఎగబడ్డారు. ఆ పదేళ్ల కాలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు (భారతీయ కరెన్సీలో) మహింద సొంతానికి పోగేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. మొన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబయకు ఫైర్బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. సొంత కుటుంబీకులు ఈయనను ‘టెర్మినేటర్’ అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు. తమిళ ఈలం ఉద్యమాన్ని నెత్తుటేరుల్లో ముంచిన ఘనత ఈయనదే. అప్పట్లో రక్షణమంత్రిగా ఉండేవాడు. మరో సోదరుడు చమల్ రాజపక్సే మొన్నటిదాకా నీటిపారుదల శాఖ మంత్రి. మహింద అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్పీకర్గా ఉండేవాడు. సిరిమావో బండారు నాయకే ప్రధానిగా ఉన్నరోజుల్లో ఆమెకు అంగరక్షకుడిగా పనిచేశారు. అందువల్ల ‘బాడీగార్డ్’ అనే పేరు స్థిరపడిపోయింది. అన్నదమ్ముల్లో ఆఖరివాడు బాసిల్ రాజపక్సే. ఆర్థికమంత్రిగా అవకతవక విధానాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఈయనదే. కాంట్రాక్ట్ ఏదైనా సరే ఈయనకు ముందుగా పదిశాతం ముట్టజెప్పాలి. అందుకే ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ అనే పేరుతో ఈయన్ను పిలుచుకుంటారు. మహింద కుమారుడు నమల్ రాజపక్సే క్రీడలు – యువజన వ్యవహారాల మంత్రి. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న రోజుల నుంచే పెత్తనానికి అలవాటుపడ్డాడు. మరో అరడజన్ మంది రాజపక్సేలు, ఇంకొన్ని డజన్ల మంది వారి బంధువులు, హితులు రాజ్యాధికార చక్రం తిప్పి శ్రీలంక సంక్షోభానికి మరింత ఆజ్యం పోశారు. తీసుకున్న రుణంలో కొంతభాగాన్ని సొంతానికి వాడుకోవడానికి అలవాటుపడ్డ కారణంగా రాజపక్సేలు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. జీడీపీతో సమానంగా అప్పులు పెరిగాయి. 2015 ఎన్నికల్లో రాజపక్సేలు ఓడిపోవడానికి చైనా అప్పులు కూడా ఒక ప్రధాన కారణం. 2019లో జరిగిన ఎన్నికల్లో గెలవడానికి గొటబయ అలవికాని హామీలిచ్చాడు. వ్యాట్ను 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తాననీ, సంపన్నులక్కూడా ఆదాయపు పన్ను తగ్గిస్తాననీ వాగ్దానం చేశాడు. అధికారంలోకి రాగానే వాటిని అమలుచేశాడు. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. విదేశీ రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాడు. ప్రధాన ఆదాయ వనరైన టూరిజం కరోనా కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. కెమికల్ వ్యవసాయాన్ని మానివేసి ఎకాయెకిన అందరూ సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని శాసనం చేశాడు. రైతాంగాన్ని అందుకు సన్నద్ధం చేయకుండా రాత్రికి రాత్రే చేసిన ఈ మార్పు వల్ల దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. విదేశీ మారకాన్ని ఆర్జించిపెట్టే తేయాకు దిగుబడి కుదేలైంది. విదేశీ మారకం అడుగంటడంతో చెల్లింపులు చేయలేక నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. నో పెట్రోల్, నో డీజిల్, నో గ్యాస్. ఆహార ధాన్యాలకూ, కూరగాయలకూ కొరతే! ద్రవ్యోల్బణం విశ్వరూపం దాల్చింది. జనం రోడ్డున పడ్డారు. ప్రభంజనమై ఒక్క ఉదుటన కదిలారు. ఆధ్యక్ష ప్రధానమంత్రుల భవనాలను ముట్టడించారు. రాజపక్షులు పలాయనం చిత్తగించాయి. గడిచిన వారం రోజులుగా బీదాబిక్కీ బక్కజనం, మధ్యతరగతి యువజనం నగర వీధుల్లోనూ, అధ్యక్ష భవనంలోనూ చేసిన సందడి, చూపిన తెగువ ప్రజాస్వామ్య ప్రియులకు కనువిందు చేసింది. అధ్యక్ష కార్యాలయంలో అతని కుర్చీ మీద ఓ పేద యువకుడు ఠీవిగా కూర్చొని ఫైలు మీద సంతకం చేస్తున్నట్టు నటిస్తుంటాడు. మిగిలిన యువకులంతా హర్షధ్వానాలు చేస్తుంటారు. ఎంత మనోహరమైన దృశ్యం! ఎక్కడ ఆ ప్రజా కంటక పాలకుడు? అంతిమ విజేతలు ఎప్పుడైనా ప్రజలే కదా అనే సందేశాన్ని ఇచ్చినట్టు కనిపించిందీ సన్నివేశం. ఈ సంపూర్ణ ప్రజాస్వామ్యం ఆయుష్షు బహుశా ఇంకో మూడు నాలుగు రోజులుండవచ్చు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి త్వరలో పార్లమెంట్ సమావేశం కాబోతున్నది. అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిన నిబంధనల్ని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కొత్త ప్రభుత్వం మొదటి కార్యక్రమం కావచ్చు. తర్వాత ఏర్పడబోతున్న ప్రభుత్వం చైనా ప్రభావం నుంచి కొంతదూరం జరగవచ్చు. ఎందుకంటే దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన చైనాపై ప్రజల్లో ఆగ్రహం కనబడుతున్నది. ఇండో – పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఏ రకంగా ఎక్కడ బ్రేక్పడినా ఆ మేరకు భారత్కు ప్రయోజనమే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ
తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు.అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! -
ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!
స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు జరుపుకొంటున్న సంవత్సరమిది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వించదగిన కొన్ని మధుర క్షణాలను కూడా ఈ యేడు మోసుకొస్తున్నది. ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదా! ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడా హోదా మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దక్కబోతున్నది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదా కలిగిన పదవులేవీ దేశంలో 12 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలకు ఇంతవరకూ దక్కలేదు. పీఏ సంగ్మా కొంతకాలం లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కారణంగా ఎస్.టీ. గుర్తింపు లభించిందే తప్ప స్వతహాగా గిరిజన జీవితంలోంచి వచ్చినవాడు కాదు. అధిక జనాభా కలిగిన ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్ తెగకు చెందిన ద్రౌపదీ ముర్మూ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. 1857 నాటి సిపాయి తిరుగుబాటును మనం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తిస్తున్నాం. కానీ అంతకంటే ముందే అక్కడక్కడ విడివిడిగా జరిగిన ప్రతిఘటనా పోరాటాలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూనే ఉన్నాయి. కట్టబొమ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాలపై సినిమాలు కూడా వచ్చాయి. ఆ కోవలోనిదే, అంతకంటే విస్తృతమైనది, ప్రభావవంతమైనది సంతాల్ తిరుగుబాటు. 1855లో సంతాల్ గిరిజనులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. స్వతంత్ర భారతావని తొలి పారిశ్రామిక ప్రస్థానంలో ముందువరసలో నడిచిన కార్మికుల్లో సంతాల్ గిరిజనులున్నారు. అసన్సోల్, బీర్భూమ్ బొగ్గు బావుల్లోకి ప్ర«థమంగా దిగిన వారిలో, రూర్కేలా, జెమ్షెడ్పూర్లలో ఉక్కును మండించిన అగ్రగామి దళంలో అత్యధికులు సంతాల్ గిరిజనులే. ఇన్నేళ్లకైనా వారి త్యాగాలను దేశం గుర్తించి గౌరవించిందని భావించి ముర్మూ ఎంపికను స్వాగతించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. ప్రతిపక్ష శిబిరానికి రాజకీయ కారణాలుంటాయి కనుక, వారూ పోటీ అభ్యర్థిని రంగంలోకి దించారు. ప్రజాస్వామ్యంలో అది వారికి ఉన్న స్వేచ్ఛ, హక్కు. ఎవరూ కాదనలేరు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 48 శాతం ఓట్లున్నాయి. కొన్ని చిన్నాచితకా పార్టీలను సమీకరించి మెజారిటీ ఓట్లు సాధించడం బీజేపీ పెద్దలకు కష్టమేమీ కాదు. ఆ అవసరం లేకుండా ఇప్పటికే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు ముర్మూ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. ఒరిస్సా రాష్ట్ర మహిళ కనుక బీజేడీ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మద్దతిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీలో సామాజిక న్యాయం ఒక ముఖ్యాంశం. కనుక ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్మూకే తన ఓటని చెప్పారు. ముందుముందు మరికొన్ని పార్టీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నది. వారు బీజేపీ అగ్రనేతల ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ, నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక, మహారాష్ట్ర సంక్షోభం... వగైరా బర్నింగ్ టాపిక్లకు దీటైన ఒక రాజకీయ కలకలాన్ని సృష్టించవలసిన అగత్యం ఈ సందర్భంగా ఎల్లో మీడియాకు ఏర్పడింది. చంద్రబాబు అవసరమే ఎల్లో మీడియా అగత్యం. ఆయన ఆలోచన, మనసులోని మాట ముందుగా ఎల్లో మీడియా ద్వారా జనంలోకి వస్తుంది. సదరు ఆలోచనకు జనం నుంచి వ్యతిరేకత రాకపోతే ఇక విజృంభిస్తారు. వస్తే మాత్రం తాత్కాలికంగా కొంతకాలం సద్దుమణుగుతారు. అదును కోసం వేచి చూస్తారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో జరిగిందదే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ముందు ఎల్లో మీడియాను ఉసిగొలిపారు. జనంలో వ్యతిరేకత కనబడటంతో చంద్రబాబు తాత్కాలికంగా సర్దుకున్నారు. కొంతకాలం తర్వాత విశాఖపట్నం జిల్లాలో రోడ్డుపక్కనున్న జన సమూహంతో ముచ్చటిస్తూ మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు. మఖం మీద గుద్దినంత స్పష్టంగా జనం వ్యతిరేకించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. బలహీనవర్గాల అభ్యున్నతి పట్ల, సాధికారత పట్ల ఆయనే స్వయంగా తన వ్యతిరేకతను పలుమార్లు బయట పెట్టుకున్న వ్యక్తి కనుక, పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించడంలో ఎప్పటికీ తగ్గరు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన గానీ, ఎల్లో మీడియా గానీ బహిరంగంగా వ్యతిరేకించడం కష్టం. కానీ ద్రౌపదీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఈ కూటమి అసహనం స్పష్టంగా బయటకు వచ్చింది. ఉపరాçష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా గట్టిగా కోరుకున్న విషయం వాస్తవం. తప్పేమీ కాదు. ఆయన తెలుగువాడు కనుక, ఆయన రాష్ట్రపతి అయితే బాగుంటుందనుకోవడంలో ఏ దోషమూ లేదు. తెలుగుదేశం వారే కాదు. తెలుగువాళ్లందరూ సంతోషిస్తారు. కానీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవలసింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ తన జాతీయ అవసరాల కోసం, వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. అది సహజం. కానీ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక గిరిజన మహిళను మొట్టమొదటిసారిగా, అదీ ఆజాదీ అమృత మహోత్సవ సందర్భంలో ఎంపిక చేయడం స్వాగతించవలసిన విషయం. రాజకీయ ఎజెం డాలను పక్కన పెట్టి మద్దతు ఇవ్వవలసిన సందర్భం. కానీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఎల్లో ముఠా ఒక్క మాటయినా మాట్లాడకుండా, వెంకయ్యనాయుడును ఎంపిక చేయకపోవడం తెలుగు జాతిని అవమానించడమే అనే పాటను అందుకున్నది. అభ్యర్థి ఎంపికకు ఒకటి రెండు రోజుల ముందు ‘ఆయన అత్యున్నత పదవిలో ఉండాలని దేశం కోరుకుంటున్నట్టు’ ప్రత్యేక కథనాలు ఎల్లో మీడియాలో వచ్చాయి. ఎంపిక రోజున ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ‘యోగా డే’లో పాల్గొన్నారు. వెంటనే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడంతో ఎల్లో ఛానల్స్లో కూడా హడావిడి మొదలైంది. ‘రాష్ట్రపతిగా మన వెంకయ్య’ అంటూ ప్రత్యేక చర్చాగోష్ఠులు నడిపారు. చివరకు ద్రౌపదీ ముర్మూను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఒక యాంకరైతే దక్షిణ భారతదేశం విడిపోవడం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా మాట్లాడారు. వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడం వల్ల దక్షిణ భారతదేశం విడిపోవాలనే ఆలోచన చాలామందిలో వచ్చేసినట్టు ఆయన కనిపెట్టేశాడు. మరో చానల్ తన విచిత్ర కథనాన్ని నడిపింది. ఈ కథనం ప్రకారం రాష్ట్రపతి ఎంపికలో బీజేపీ బుర్ర లేకుండా వ్యవహరించింది. వెంకయ్యను ఎంపిక చేసి వుంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం వాళ్లు బీజేపీకి సహకరించే వారు. వారి మద్దతు లేకుండా తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? గోల్డెన్ ఛాన్స్ను బీజేపీ మిస్ చేసుకుంది... ఇలా సాగిందా కథనం. తెల్లారేసరికల్లా ఆ రెండు పత్రికల్లో విషాద కథనాలు... వెంకయ్యను మోసం చేశారు. వెంకయ్య ఎంత చేశారు మోదీకి! ఆయన ప్రధాని కావడానికి మన వెంకయ్యే కారణం. మోదీకి కృతజ్ఞత లేదు... ఇదీ సారాంశం. అంతా ఎల్లో మీడియా హడావిడే తప్ప రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి వెంకయ్య నాయుడు ఎక్కడా ఎవరితో మాట్లాడింది కూడా లేదు. ముర్మూ అభ్యర్థిత్వం గురించి తెలిసో తెలియదో కానీ, పార్టీ అవసరాల గురించీ, ఆలోచనల గురించీ ఆయనకు తెలిసే ఉంటుంది. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే తన ఆశీస్సుల కోసం వచ్చిన ముర్మూను సాదరంగా ఆహ్వానించారు. ఆయన ముఖంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనబడలేదు. కనిపించిన అసంతృప్తి ఛాయలు, విషాద ఛాయలన్నీ ఎల్లో మీడియాలోనే! ఎల్లో మీడియా అంటే చంద్రబాబు చేతిలోని మైకు తప్ప మరొకటి కాదు. కనుక ఎల్లో మీడియా విషాదమే చంద్రబాబు విషాదం. చంద్రబాబు విషాదమే తెలుగుదేశం పార్టీ విషాదం. అసలెందుకింత విషాదం? కోస్తా జిల్లాల్లోని ఒక బలమైన సామాజిక వర్గానికి ఈ ఎల్లో ముఠా తనను తాను వ్యాన్గార్డ్గా భావించుకుంటున్నది. ‘మీ రక్షకులం మేమే’నని సదరు సామాజిక వర్గాన్ని ఈ ముఠా భ్రమింపజేస్తున్నది. నిజానికి అనేక దశాబ్దాల కిందనే కృషితో, క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చిన సామాజిక వర్గమది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, అభ్యుదయవాదులు, హేతువాదులు, క్రాంతి కారులు ఆ వర్గం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత క్రమంగా అక్కడక్కడా కుక్కమూతి పిందెలు పడటం ప్రారంభమైంది. ఈ కుక్కమూతి పిందెలన్నీ కలిసే ఎల్లో సిండికేట్గా ఒక ముఠా ఏర్పాటైంది. ప్రగతిశీల సామాజిక వర్గంగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఈ ముఠా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీల్చి పిప్పిచేస్తున్నదని చాలామంది ప్రముఖులు ఇప్పుడు వాపోతున్నారు. వెంకయ్యనాయుడు ఈ ఎల్లో పార్టీతో సంబంధం లేని వేరే పార్టీకి జాతీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ వల్లనే తాను ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పు కుంటారు. ఆయన ఎల్లో ముఠా కబ్జా చేసిన సామాజిక వర్గంలో పుట్టినవారే. కనుక, ఆయన అత్యున్నత పదవిలో ఉంటే మన పార్టీని కష్టకాలంలో ఆదుకుంటారనేది ఎల్లో ముఠా తలపోత. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి బీజేపీకి బద్ధవిరోధం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉందన్న ఉద్దేశంతో కాబోలు, చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వెంకయ్యనాయుడు ఢిల్లీ స్థాయిలో సహకరించి ఉంటారు. అందువల్ల ఆయన రాష్ట్రపతి కావాలని ఎల్లో ముఠా గట్టిగానే కోరుకున్నది. అయితే రాష్ట్రంలో ఆయన సొంత పార్టీ నేతలెవ్వరూ కూడా ముర్మూ ఎంపికను వ్యతిరేకించలేదు. పైగా స్వాగతించారు. ఎల్లో ముఠా కోరుకున్నట్టు ఏ ఉద్యమమూ జరగలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. పైగా ఎల్లో మీడియా ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఆశాభంగం చెందిన ఎల్లో మీడియా కొత్త ఎత్తు వేసింది. తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. ఇదా సందర్భం? ఒక అద్భుతమైన చరిత్ర పురుడు పోసుకోబోయే వేళ భ్రూణహత్యకు పురిగొల్పుతున్నది ఈ ముఠా. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఏ శక్తులు కుయుక్తులు పన్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడు ‘బేరాల’ పాట పాడుతున్నాయి. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు. అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు
‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన నిజాన్ని గురించి చెప్పడానికి నిప్పును ఉపమానంగా తెచ్చుకోవడం మన అలవాటు. అగ్నిపరీక్షలో పాసైతే పవిత్రత అనే సర్టిఫికెట్ ఆటో మేటిక్గా లభిస్తుంది. ఇది మన సాంస్కృతిక భావజాలంలో ఊడలు దిగిన విశ్వాసం. సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ కూడా సమాజ వాస్తవికతలపై ఒక అగ్నిపరీక్షగా పనిచేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన దావానలం యథార్థాల ముసుగుల్ని దహించి, నగ్నంగా నిలబెట్టింది. ఈ దేశంలోని లక్షలాదిమంది యువకులు సైన్యంలో చేరడానికి చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారనేది ఒక వాస్తవం. ఎదురు చూపులు ఉపాధి కోసమా? దేశభక్తి ప్రపూరితమా అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరుద్యోగం పెనుభూతమై పీడిస్తున్న దేశంలో ఉపాధి ఆరాటమే తొలి కారణం కావచ్చు. దానికి దేశభక్తి కూడా జతకూడి ఉండవచ్చు. కారణమేదైనా సుమారు లక్షా డెబ్బయ్ ఐదు వేలమంది యువకులు ఏడాది కిందనే ఫిజికల్ టెస్టులూ, మెడికల్ టెస్టులూ గట్టెక్కి ఉన్నారు. నెలల తరబడి శిక్షణ తీసుకుని గురిపెట్టి విడిచిన బాణాల్లా పరుగులు తీసి పరీక్షలు పాసయ్యారు. ఇంకొక్క పరీక్ష. రాత పరీక్ష. అది పూర్తయితే ఇక సైన్యంలో చేరడమే! ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో తమను తాము ఎన్నిసార్లు ఊహించుకున్నారో! కరాన మర తుపాకీ... శిరాన ఉక్కుటోపీతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్టు ఎన్ని కలలు కన్నారో! దూరంగా, సొంత ఊరిలో ఉన్న తల్లి దండ్రులకు నెలనెలా జీతం డబ్బులు పంపి అండగా నిలబడ బోతున్నామని ఎంత సంబరపడ్డారో! జస్ట్... ఒక్క పరీక్ష!! అధికారులు చెబుతున్నట్టు కరోనా కారణంగానే అది వాయిదా పడుతూ వస్తున్నదని సర్దిచెప్పుకున్నారు. నేడో రేపో ఆ పరీక్ష పూర్తవబోతున్నదని ఎదురుచూస్తున్నారు. సైనిక బలగాల నియామకానికి పాత పద్ధతిని రద్దుచేస్తూ సరికొత్తగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు్ట ప్రకటన వెలువడగానే హతాశులయ్యారు. ఎదురుచూస్తున్న కొలువు ఎగిరిపోయింది. నోటి దగ్గర ముద్ద నేల రాలింది. ‘కొత్తగా వచ్చే కొలువులు నాలుగేళ్లు మాత్రమే’ అని చెప్పడంతో వారి కలలన్నీ కరిగి పోయాయి. ఒక్కసారిగా లక్షా డెబ్బైఐదు వేల గుండెలు పగిలిన శబ్దానికి త్రీగోర్జెస్ డ్యామ్ బద్దలైనంత విధ్వంసం దేశమంతటా ప్రవహించింది. ఈ విధ్వంసంలో కొన్ని ప్రతిపక్షాల పాత్ర ఉన్న దని కేంద్రం ఆరోపిస్తున్నది. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ప్పుడు ప్రతిపక్షం ఆజ్యం పోయడం సహజమే! ప్రభుత్వం చెబుతున్నట్టు సైనిక బలాల నియామకాల హేతుబద్ధీకరణ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అంశమే. ఇందుకు పైకి చెబుతున్న కారణాలు ఎన్ని వున్నా ప్రధానమైన అంతర్గత కారణం పెన్షన్ భారం. రక్షణ రంగంలో ఇప్పటికే 32 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ మొత్తం వార్షిక బడ్జెట్లో పెన్షన్ల వాటా 26 శాతానికి చేరుకున్నది. ఏటా యాభై వేలమంది పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ శాతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్లో పెన్షన్ల వాటా 10 శాతమే. యూ.కే.లో అది 14 శాతం. సైనిక బలగాలకోసం ఖర్చుచేసే పెన్షన్ను భారంగా భావించే దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికైన వారికి జీవితాంతం ఇచ్చే పెన్షన్ను ఎలా సమర్ధించగలుగు తారు? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే ప్రభుత్వం ఇతర కారణాలను చెబుతున్నది. ‘అగ్నిపథ్’ కింద నియమించేవారిలో నాలుగో వంతు మందిని 15 ఏళ్ల సర్వీస్ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయంఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. ఈ పద్ధతి ప్రపంచంలోని చాలా దేశాల్లో అమల్లో ఉన్నదని ఉదాహరణలిస్తున్నది. ఏదైనా ఒక రంగంలో సమూల మార్పు లకు సిద్ధపడినప్పుడు అందుకు సంబంధిత ప్రజానీకాన్ని ముందుగానే సిద్ధం చేయడం అవసరమని ఈ వివాదం మరో సారి చాటి చెప్పింది. వ్యవసాయ చట్టాల సందర్భంలోనూ, ఇప్పుడు రక్షణ శాఖ నియామకాల హేతుబద్ధీకరణలోనూ ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. ఈ పథకంలోని గుణదోషాల అంశాన్ని పక్కనపెట్టి పరిశీ లిస్తే... మన విద్యావ్యవస్థలోని లోపాలనూ, నిరుద్యోగ సమస్య తీవ్రతనూ ఈ సందర్భం ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలోని నాణ్యతా ప్రమాణాల క్షీణత, నైపుణ్య లేమి యువతరానికి శాపంగా పరిణమిస్తున్న వైనానికి అద్దం పట్టింది. దేశంలో ఏటా 24 లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తు న్నారు. వారిలో 10 లక్షల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారిలో సగం మంది అతికష్టం మీద చదువుతో సంబంధం లేని దిగువశ్రేణి ఉద్యో గాల్లో సర్దుకోగలుగుతున్నారు. సుమారు ఆరేడు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతియేటా రోడ్డు మీద మిగిలి పోతున్నారు. నాన్–ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యు యేషన్ పూర్తిచేసిన వారిలో ఇంగ్లిష్ నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ ఉన్న కొంతమంది మాత్రమే మెరుగైన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వారంతా తమ సోదర ఇంజనీరింగ్ సేన లతో కలిసి ఒక రిజర్వు నిరుద్యోగ ఫోర్స్గా ఉండిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉపాధి వీరికి లభిస్తున్నది. లేదంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. నైపుణ్యాల క్షీణతతోపాటు విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య... డ్రాపవుట్లు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సౌకర్యాల లేమి, ఆర్థిక పరిస్థితుల వలన ప్రైవేట్ చదువు కొనలేని పరిస్థితి. ప్రోత్సాహం లేకపోవడం ఈ డ్రాపవుట్లకు కారణంగా కని పిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యాప్రస్థానంలో టెన్త్, ఇంటర్ మజిలీల దగ్గరే చాలామంది మిగిలిపోతున్నారు. వీళ్లంతా నిరుద్యోగ రిజర్వు ఫోర్సే! దినసరి కూలీపై దొరికే లేబర్ పనులే వీరికి దిక్కు. వీళ్ల క్వాలిఫికేషన్కు తగిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వచ్చినప్పుడు మెరుగైన జీతం, జీవితం కోసం పోటీపడుతున్నారు. సైనికోద్యోగాలు కూడా అందులో ఒక భాగం. ఆర్థిక వృద్ధి నమోదవుతున్న ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ నిరుద్యోగ పెద్దన్నల మాదిరిగానే టెన్త్, ఇంటర్ నిరుద్యోగ సేన కూడా ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నది. ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లభించక నిస్పృహతో నిరుద్యోగ సేన రోడ్డెక్కుతున్నది. ఈ దేశాన్ని రానున్న కాలంలో నవజీవన బృందావనంగా తీర్చిదిద్దగల యువతరం రూపొందడానికి 4 కీలక అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ‘అగ్నిపథ్’ సందర్భం గుర్తు చేసింది. 1. ఆర్థిక వ్యవస్థను వృద్ధి గమనంలో నిలపడం, 2. రిజర్వు నిరుద్యోగసేనల సమస్య పరిష్కారం, 3. విద్యా రంగంలో ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, 4. డ్రాపవుట్లు లేకుండా చేయడం. ఈ అంశాల ప్రాధాన్యాన్ని తొలిదశలోనే గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రచించిన ఒకే ఒక్క రాజకీయ నేత ఏపీ సీఎం జగన్. ఇది వైఎస్సార్సీపీ చెప్పుకుం టున్న ఘనత కాదు. ఏపీ ప్రభుత్వం చాటింపు చేసుకుంటున్న విషయం కూడా కాదు. స్వతంత్ర ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్న అక్షర సత్యాలు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ ఐఈ) నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగితా రేటు 7.8 శాతం. ఆంధ్రప్రదేశ్లో అది 4.4. శాతం మాత్రమే! ఎల్లో మీడియా నిత్యం బ్యాండు మేళం మోగిస్తూ స్వర్ణయుగంగా కీర్తించే చంద్ర బాబు హయాం చివరిరోజు నాటికి నిరుద్యోగితా రేటు 5.2 శాతం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా దేశమంతటా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండేళ్లపాటు వరసగా కోవిడ్ మహమ్మారి పీడించింది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగితా రేటు పెరగడం సహజం. అలా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కూడా! కానీ ఏపీలో తగ్గింది. దీని వెనుక ఏ మాయా, మంత్రం లేవు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. చిత్తశుద్ధి, దూరదృష్టి, తపన మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ, చిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగాలను గుర్తించి వాటిని డైనమిక్గా నిలబెట్టడానికి పడిన శ్రమ ఉన్నది. చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం ఏపీలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 20 శాతం మందిని కోవిడ్ కాలం లోనే ఈ రంగం ఇముడ్చుకోగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎమ్ఎస్ఎమ్ఈలను గతిశీలకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలు అర్థం చేసుకోవడానికి! 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డీపీ 18.47 శాతం వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)ని నమోదు చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం కూడా 14.50 శాతం వృద్ధిని సాధించింది. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్ల వలన, రైతు భరోసా వలన, సకాలంలో ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఫలితంగా, ఉత్పత్తుల ధరలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నం దువలన ఈ విజయం సాధ్యమైంది. జగన్ ప్రభుత్వం రిజర్వ్ నిరుద్యోగ సేనల సమస్యను పరిష్కరించిన తీరు నభూతో నభవిష్యతి. పరిపాలనా వికేంద్రీకరణలో విప్లవాత్మక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతూ, అందులో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలిగింది. లక్షా 34 వేలమందికి ఒకేసారి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పించింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా మరో 2 లక్షల 60 వేల మంది గౌరవభృతితో సేవా పథంలోకి అడుగు పెట్టగలిగారు. విద్యారంగ సమూలక్షాళనకు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి – ఉన్నత ప్రమాణాల కోసం భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గేమ్ ఛేంజర్గా ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఎడ్టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకొని లెర్నింగ్ యాప్ ద్వారా శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించింది. రెండు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే విద్యార్థి తరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఏ స్థాయిలోనూ డ్రాపవుట్లు ఉండకుండా అందరూ ఉచి తంగా, నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన... ఇలా పలు పథకాలతో విద్యా రంగంలో డ్రాపవుట్ లేకుండా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ఇవన్నీ అక్షరాలా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ చంద్రబాబూ, మీడియా మొఘల్ శ్రీమాన్ రామోజీరావు నేతృ త్వంలో వాలతుల్యులు, తోకమాత్రులతో కూడిన యెల్లో మీడియా ఈ కార్యక్రమాలను రివర్స్ గేర్లో చూపెడుతున్నారు. ఇది రివర్స్ పాలన నమ్మండని చెబుతున్నారు. మన విద్యార్థు లను పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ముఠా. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట, ఇంగ్లిష్ మీడి యంలో చదివిస్తే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవు తారని రోడ్డు పక్కనున్న పల్లె జనానికి చంద్రబాబు సుద్దులు చెప్పబోయారు. వారు జై జగన్ అని బదులు చెప్పేసరికి పలాయనం చిత్తగించారు. ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా తెలుగు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి యెల్లో మీడియా శాయ శక్తులా ప్రయత్నించి తల్లిదండ్రుల వ్యతిరేకతతో తోక ముడి చింది. ఇప్పుడు బైజూస్ మీద విషపు దాడి ప్రారంభించారు. ఏటా 24 వేల ఖర్చు చేయాల్సిన ఈ బోధన ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. విద్యాబోధనను ఆధునికం చేసే అదనపు ఉపకరణం. సమగ్ర అవగాహనకు దోహదపడే ఆయుధం. పేదల చేతికి ఆయుధం దొరకకూడదు. వారు సాధి కారత సాధించకూడదు. ఇదీ చంద్రబాబు, యెల్లో మీడియా జాయింట్గా అమలు చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు లాంటి విజనరీ ప్రపంచాన లేడని పాత డప్పునే ఇప్పుడు మళ్లీ∙వాయిస్తున్నారు. ఈ ప్రచారం హోరులో నిజంగా తాను విజనరీ అనే భ్రమలోకి బాబు జారిపోయి చాలా కాలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో నిన్న విజయనగరంలో మాట్లాడారు. ‘‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’’ అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడినా జనం అనుమానిస్తారు. ‘ఎవరికైనా చూపెట్టండర్రా’ అని సలహా ఇస్తారు. ఇలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. ఒకసారి తాను తుపాన్లను అడ్డుకున్నానని చెప్పారు. విజయవాడలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గించాలని ఆదేశించారు. రెయిన్ గన్స్తో ఒక ట్యాంకర్ నీళ్లను చిలకరించి కరువును జయించానని ప్రకటించారు. ఎవరు అడి గినా అడక్కపోయినా మధ్యమధ్య ‘నేను మెంటల్లీ ఫిట్’ అని ప్రకటిస్తుంటారు. ఆయన మాటలన్నీ గొప్ప విజన్తో కూడిన వని యెల్లో మీడియా ఊదరగొడుతున్నది. ఆయనొస్తే అభివృద్ధి పరుగులు పెట్టుకుంటూ వస్తుం దని దండోరా వేస్తున్నది. జగన్ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నది. నిజాలపై ముసుగు కప్పుతున్నది. కానీ నిజం నిప్పు లాంటిది. నిప్పునూ దాచలేరు! నిజాన్నీ దాచలేరు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇండియా దటీజ్ భారత్...!
భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణం ఇది. ‘ఇండియా దటీజ్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’. రాజ్యాంగ ముసాయిదాలో మొదట ఇండియా అని మాత్రమే ప్రతిపాదించారు. రాజ్యాంగ సభలోని కొందరు సభ్యులకు ఇది రుచించలేదు. భారత్గా ప్రకటిద్దామని సూచించారు. మరి కొందరు ఇండియాగానే కొనసాగిద్దామని వాదించారు. ఇండియా దటీజ్ భారత్ అనే పదబంధాన్ని ప్రయోగించి డాక్టర్ అంబేడ్కర్ ఈ వివాదానికి తెరదించారు. ప్రాచీన చరిత్రలో భరతఖండ, భరతవర్ష అనే పేర్లతోనే మన దేశం వాసికెక్కింది. ఆధునిక చరిత్ర మాత్రం ఇండియా అనే పేరుతోనే పిలవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా వలసపాలనతో ఇండియా పేరు విశ్వవ్యాపితమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఇండియా నామస్మరణే కొనసాగుతున్నది. దేశీయంగా మాత్రం క్రమంగా భారత్ పలుకుబడి పుంజుకుంటున్నది. ఇండియా ఆధునికతకు సంకేతమని భావిస్తే, భారత్ ప్రాచీన యశస్సుకు గుర్తుగా భావించవచ్చు. ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాంతం వరకూ ఆర్థిక రంగంలో భారత్ ఒక సూపర్ పవర్గా కొనసాగింది. ఒకటో శతాబ్దం నుంచి 17వ శతాబ్ది వరకు ప్రపంచ దేశాల జీడీపీ లెక్కల్లో ఎక్కువ భాగం భారత్ అగ్రభాగాన కొనసాగిందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ వలసపాలన ఆ ప్రాధాన్యాన్ని పీల్చి పిప్పిచేసి మన మయూర సింహాసనం, కోహినూర్ వజ్రాలతో పాటు ఆర్థిక సూపర్ పవర్ టైటిల్ను కూడా కొల్లగొట్టింది. ఇండియా అనే మాట వలసపాలన అవశేషంగా మాత్రమే మిగిలిపోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాణానికి స్ఫూర్తిమంత్రంగా కూడా నిలబడింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలకూ, ఆదర్శాలకూ, ఆశయాలకూ మోడరన్ ఇండియా ఒక ప్రయోగశాల. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికీ, లౌకిక విలువలకూ, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకూ నెహ్రూ పునాదులు వేశారు. కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృ తులు, భాషలు ఎన్ని వేల వర్ణాలుగా కనిపిస్తున్నా ఆ భిన్నత్వాన్ని ఆయన గౌరవించారు. ఆ ఇంద్ర ధనుసులోనే ఇండియా అనే ఏకత్వాన్ని ఆయన దర్శించారు. స్థూలంగా దీన్నే నెహ్రూ ఇండియా అంటారు. ఇండియా, భారత్ అనే మాటలను పర్యాయ పదాలుగానే నెహ్రూ ఉపయోగించారు. విరుద్ధ భావాలుగా ఎప్పుడూ పరిగణించలేదు. కానీ నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించిన కొందరు గాంధేయవాదులూ, సోషలిస్టులూ తదితరులు ఈ విభజన తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల వాళ్లు, ఇంగ్లిష్ చదువుల వాళ్లనే నెహ్రూ విధానాలు బాగుచేస్తున్నాయనీ, గ్రామీణ ప్రజలకూ, రైతు కూలీలకూ ఉపయోగపడటం లేదనీ వారి అభియోగం. ఫలితంగా ఇండియా – భారత్గా దేశం విభజితమవుతున్నదని వారు ఆరోపించేవారు. పట్టణాలు, పరిశ్రమలు, ఇంగ్లిష్ చదువులు, ఉద్యోగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రణాళికలు వగైరా ఇండియా ఆస్తులైతే, వ్యవసాయం, చేతివృత్తులు, పల్లెటూళ్లు, వీధిబళ్లూ భారత్కు చిరునామాలుగా అప్పట్లో విమర్శకులు వర్గీకరించారు. ఈ రెంటిలో నెహ్రూ ఇండియా పక్షమని వారు వాదించేవారు. అప్పుడది తరుణ స్వరాజ్యదేశం కనుక చదువుకున్నవాళ్లు, మేధావుల సంఖ్య తక్కువగా ఉండేది. ఉన్న కొద్దిమందీ సహజంగానే చాతుర్వర్ణాల్లోని టాప్ త్రీ కేటగిరీ వాళ్లే ఉండేవారు. ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులు, తరువాత స్థానాల్లో వైశ్య, క్షత్రియ కులాలవాళ్లుండేవారు. శూద్ర వ్యవసాయ కులాల వాళ్లు అతి స్వల్పసంఖ్యలో ఈ అంతస్తును చేరుకోగలిగారు. రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రసీ ప్రధానంగా ఈ వర్గాల నుంచే తయారైంది. క్రమంగా వీరి వారసత్వం ఢిల్లీ అధికార పీఠాన్ని ప్రభావితం చేయగల అధికార కులీన సమూహంగా (పవర్ ఎలీట్) రూపొందింది. సుమారు ఏడు దశాబ్దాల పాటు ఢిల్లీ దర్బార్లో ఇదే ఎలీట్ క్లాస్ చక్రం తిప్పింది. అధికారంలో ఎవరు ఉన్నా ఈ కోటరీ మాత్రం తప్పనిసరి. శూద్ర వ్యవసాయ కులాలు, చేతివృత్తి దారులు, దళితులు, గిరిజనులకు ఉండే స్థానిక, ప్రాంతీయ అస్తిత్వ భావనలు ఈ ఎలీట్ క్లాస్కు తక్కువ. ప్రాంతీయ సెంటిమెంట్లను అధిగమించిన ఇండియన్ నేషనలిస్టులు వీరు. ఇంగ్లిష్లో మాత్రమే మాట్లాడతారు. స్టీఫెన్స్, జెఎన్యూ, ఐఐటీ లేదంటే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్లో చదువుకున్నవాళ్లు. రాజకీయాల్లోనూ, వ్యాపారరంగంలోనూ, బ్యూరోక్రాట్లలోనూ వీరు కనిపిస్తుంటారు. నెహ్రూ కాలంలో మొగ్గతొడిగి ఇందిరమ్మ జమానాలో వికసించిన తోట ఇది. బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి మధ్యలో ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ పూదోట పదిలంగానే ఉన్నది. 2014లో ఎంటర్ ది మోదీ సినిమా విడుదలతో పాతకాలపు పవర్ ఎలీట్కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఈ పరిణామాన్ని మావోజెడాంగ్ నాయకత్వంలో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంతో ప్రొఫెసర్ సంజయ్ బారు పోల్చారు. ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్గా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారుకు ఢిల్లీ పవర్ ఎలీట్ మీద సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో ఆయన ఇటీవల ‘ఇండియాస్ పవర్ ఎలీట్’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రొఫెసర్ సంజయ్ లెక్క ప్రకారం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన ఇంగ్లిష్ బాబులెవరూ ప్రస్తుత ప్రధానమంత్రి కార్యాల యంలో లేరు. అందరూ ‘దేశీ’ బాబులే! వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వారి సొంత భాషల్లో మాట్లాడేవారు (ముఖ్యంగా హిందీ, గుజరాతీ), సరికొత్త సామాజిక వర్గాల నుంచి వచ్చినవాళ్లు ఇప్పుడు ఢిల్లీ పవర్ సర్కిల్స్లో చక్రం తిప్పుతున్నారట! కులీన అధికారిక సమూహం నుంచి తొలితరపు అగ్రవర్ణ మేధావులను తప్పించి శూద్ర వ్యవసాయ కుటుంబాల వారు ఆక్రమించడానికి డెబ్బయ్యేళ్లు పట్టిందన్నమాట! తాము కూలదోసిన పాత తరాన్ని ‘లుటియెన్స్ ఎలీట్’గా, ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’గా కొత్త ఎలీట్ వేళాకోళం చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం లక్ష్యం కేవలం ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే కాదు. ఆ పార్టీ చుట్టూ అల్లుకున్న సంస్కృతిని ధ్వంసించడం. అధికార పీఠాల్లో అది ఏర్పాటు చేసుకున్న ఎకోసిస్టమ్ను దగ్ధం చేయడం కూడా! నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చాలావరకు సాధించింది కూడా. మారుమూల ప్రాంతాల వారికీ, మధ్యశ్రేణి సామాజిక వర్గాల వారికీ ఢిల్లీ అధికార సర్కిల్స్లో చోటు దొరకడం స్వాగతించదగ్గదే. రాజ్యాంగంలో చెప్పినట్టు ఇండియాతోబాటు భారత్కు కూడా అధికారంలో చోటు దొరుకుతున్నది. ఇదీ ఆహ్వానించదగినదే. నెహ్రూ కాలంలో మొదలైన ‘మూడు వర్ణాల’ ముచ్చటకు ప్రాధాన్యం తగ్గుతున్నది. దానితోపాటు నెహ్రూ పోషించిన లౌకిక విలువలకూ, భిన్నవర్గాల సౌభ్రాతృత్వానికి కూడా ఆదరణ తగ్గుతున్నది. కొత్త ఎలీట్ వాచాలత కోటలు దాటుతున్నది. దేశదేశాల విమర్శలకు తావిస్తున్నది. దేశంలో అభద్రతాభావం జనిస్తున్నది. విద్వేషం జ్వలిస్తున్నది. రాజధానిలో ఠికానా వేసిన ఇండియన్ నేషనలిజాన్ని మారుమూల ప్రాంతాల్లోని భారత జాతీయతతో అనుసంధానం చేయడం వరకు మంచి పరిణామమే. ఈ సాంస్కృతిక విప్లవాన్ని ఇక్కడితో ఆపితే మేలు. ఇండియా, భారత్లను దాటి ‘హిందూస్థాన్’ దాకా ప్రస్థానాన్ని కొసాగించదలిస్తే మాత్రం చేటుకాలం దాపురించినట్టే. హిందీ, హిందూ సామ్రాజ్యవాదం తలకెక్కితే ఈ దేశం అంగీకరించదు. హిందీయేతర దేశీ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఈ దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. మైనారిటీ మతావలంబులు ఇరవై శాతానికంటే ఎక్కువే ఉన్నారు. మనం హిందువులుగా పిలుచుకునే దళితులు, గిరిజనులు, దిగువశ్రేణి శూద్రకులాల సంస్కృతి భిన్నమైనది. సవర్ణ హిందువులు దేవుడికి శాకాహార నైవేద్యం పెడితే, దిగువ కులాల ప్రజలు అమ్మవారికి మాంసాహార బోనం పెడతారు. నెహ్రూవియన్ పాలకులకు ఈ భిన్నత్వాన్ని గౌరవించడం తెలుసు. మోదిత్వవాదులు ఎంతమేరకు గౌరవించగలరు? సాంస్కృతిక విప్లవ ప్రస్థానాన్ని ఆపివేసి, ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టవలసిన సమయం ఆసన్నమైనదని ఆర్థికవేత్తలు ఉద్ఘోషిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా కష్టాల బాటలు నష్టాల పేటలు దాటి వచ్చినప్పటికీ చరిత్ర మనకొక అమూల్య అవకాశాన్ని ఎదురుగా నిలబెట్టిందని వారు చెబుతున్నారు. వివిధ అంతర్గత నిర్ణయాల కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత తొలిసారిగా చైనా మందగమనం ప్రారంభమైంది. ఈ పరిణామం మనకు ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన దారులను ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం విజయవంతంగా పరిచింది. ఆయన అధికారం చేపట్టకముందు పదో స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఐదో స్థానానికి ఎగబాకింది. మోదీ ప్రకటించిన ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సవరించుకోవాలని రఘురామ్రాజన్ వంటి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. 2035 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుంటే ఇదీ సాధ్యమేనని ఆయన అభిప్రాయం. ఇప్పటికే డిజిటల్ డ్రైవ్తో దేశంలోని చిల్లర శ్రీమహాలక్ష్మిని ఆర్థిక వ్యవస్థతో మోదీ అనుసంధానం చేశారు. ఎకానమీలో పారదర్శకత పెరిగింది. వైషమ్యాలు, విద్వేషాల ఎజెండాను పక్కనపెట్టి, సాంస్కృతిక విప్లవానికి బదులు ఆర్థిక విప్లవంవైపు దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపితే రఘురామ్రాజన్ చెప్పిన లక్ష్యం అసాధ్యం కాబోదు. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విషవృష్టి యాగం..!
చెప్పాలని ఉంది... గొంతు విప్పాలని ఉంది. తెలుగుదేశం పార్టీ నలభయ్యేళ్ల ప్రస్థానం గురించీ, ఆ ప్రయాణంలోని మలుపుల గురించీ ఇప్పుడు క్లుప్తంగానైనా మాట్లాడుకోవాలి. తాజాగా ఆ పార్టీ ‘మహానాడు’ పేరుతో ఓ విషవృష్టి యాగాన్ని నిర్వహిం చింది. ఆ విబూదిని రాష్ట్రమంతటా చల్లక ముందే... తొలకరి వర్షాలతో కలిపి అది విషపు చుక్కల్ని కురిపించకముందే... విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఆ పార్టీని పెట్టిన ఎన్టీ రామా రావుకు ఇది శతజయంతి సంవత్సరం. పార్టీ వయసు 40 సంవత్సరాలు. అందువల్ల కూడా ఇది మాట్లాడుకోవలసిన సందర్భం. పదేళ్ల కింద వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూటికి 70 మంది నలభయ్యేళ్ల లోపువారే. కనుక తెలుగు రాష్ట్రాల్లోని నూటికి డెబ్బయ్ మందికి తెలుగుదేశం పార్టీ ప్రయాణంలోని పదనిసల గురించిన లోతైన అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఆ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసు కొచ్చిన ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ణి చేసి చంద్రబాబు 27 సంవత్సరాల క్రితం గద్దెనెక్కాడు. ఇప్పుడు నలభయ్యేళ్లున్న వారు కూడా అప్పటికింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ‘మహా నాడు’ హంగామాలను చూసి తెలుగుదేశం నాయకులంతా ఎన్టీ రామారావు శిష్యులనీ, భక్తులనీ, అనుచరులనీ వారు భ్రమించే అవకాశం ఉన్నది. అనారోగ్య కారణాలతో ఎన్టీ రామారావు తప్పుకొని స్వయంగా ఆయనే చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించాడని యెల్లో మీడియా కథలల్లడానికి ఇంకెంతో కాలం పట్టదు. అందువల్ల ఈ నలభయ్యేళ్ల కథను ఖుల్లం ఖుల్లా చెప్పుకోవాలి. రెక్కల గుర్రంపై ఎగిరొచ్చే కలల రాకుమారుడి కథలాంటిది ఎన్టీ రామారావు సినీ జీవితం. జానపదుల జనరంజక కథా నాయకుడు. దేవతామూర్తుల పాత్రల్లో ఒదిగిపోయిన స్ఫుర ద్రూపం. అద్భుతమైన నటపాండిత్యం. వెరసి తెలుగు నిఘంటు వులో హీరో అనే మాటకు అర్థం అతను. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు’ అనే బిరుదును ఆయన అభిమానులు ఇవ్వలేదు. భజన బృందం తగిలించింది కాదు. శృంగేరీ పీఠానికి సంబంధించిన యతీశ్వరులు స్వయంగా చేసిన ప్రశంస అది. ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే ఎన్టీఆర్ సినిమాలు రాబట్టిన కలెక్షన్లు ఇప్పటికీ రికార్డులే! ఒక డజన్ సూపర్ డూపర్ హిట్స్తో ఆయన తన 60వ ఏట సినీరంగం ఇన్నింగ్స్ను ముగించారు. ఇంతటి ప్రజాదరణ ఉన్నది కనుకనే తన సెకండ్ ఇన్నింగ్స్ను రాజకీయాల్లో పరీక్షించుకోదలుచుకున్నారు. రాజకీయాల్లో నెగ్గుకురావడానికి ప్రజాదరణ ఒక్కటే సరిపోదు. పరిస్థితులు కూడా కలిసిరావాలి. ఎన్టీఆర్ను అదృష్టం వరించింది. ఆ సమయానికి పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత ఏర్పడుతున్నది. బలమైన ప్రతిపక్షం లేని రాజకీయ శూన్యత ఆవరించి ఉన్నది. అప్పటి పత్రికా రంగం నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అసలే ఎన్టీఆర్. ఆపై రోడ్డెక్కారు. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పదజాలం కత్తులు దూసింది. రాజకీయాల్లోకి కొత్త నరేటివ్ వచ్చి చేరింది. ఈ మార్పు జనానికి కూడా నచ్చింది. ఫలితంగా సెకండ్ ఇన్నింగ్స్లో తొలి సూపర్హిట్ ఎన్టీఆర్ ఖాతాలో వచ్చిపడింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో చదువుకున్నవాడు కాబట్టి ఎన్టీ రామారావుపై జాతీయ భావాలు, ఆదర్శాల ప్రభావం కొంత ఉన్నది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్ఏటి) పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి ప్రదర్శనలిచ్చేవారు. విద్యార్థి రోజుల నుంచే కష్టపడి సంపాదించుకునే తత్వం. సినిమాల్లో కూడా రేయింబవళ్లు పనిచేశారు. ఏటా పది పన్నెండు సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి హీరో ఎన్టీఆర్ తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. ఆయన పోషించిన వందలాది ఉదాత్త, జనోద్ధారక పాత్రల ప్రభావం కూడా ఉండేది. ముఖ్యమంత్రిగా పరిపాలనలో పేదలకు, కష్టజీవులకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. చౌకబియ్యం ఇవ్వడంతోపాటు రైతుల విద్యుత్ ఛార్జీలను తగ్గించారు. పాలనా సంస్కరణలను ప్రారంభించారు. మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్ – పట్వారీ లేదా కరణం – మునసబుల వ్యవస్థ రద్దు – ఈ సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఎన్టీ రామారావు అనుసరించిన పేదల అనుకూల విధా నాలపై తెలుగుదేశం పార్టీలోనే కొందరు ముఖ్యులకూ, పార్టీకి అండగా నిలబడిన మీడియా మొగల్స్కూ సదభిప్రాయం లేదన్న సంగతి తదనంతర కాలంలో బయటపడింది. సదరు మీడియా మొగల్స్, బిజినెస్ మౌర్యాస్, సంపన్న నిజామ్స్.... అంతా కలిసి చంద్రబాబు రింగ్ లీడర్గా ఒక ముఠాను తెలుగుదేశం పార్టీలో తయారుచేసుకున్నారు. ’89 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఈ ముఠా పట్టు బిగిసింది. పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో ఉండే అన్ని కమ్యూనికేషన్ చానల్స్ ఈ ముఠా అధీనంలోకి వచ్చాయి. వయోధిక దశలో ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్కు సహాయ కురాలిగా ఉన్న లక్ష్మీపార్వతి మరో కమ్యూనికేషన్ చానల్గా మారవచ్చని ముఠా శంకించింది. ఆమెపై దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమెకు వ్యతిరేకంగా మెదళ్లలో విష బీజాలు నాటి కన్నబిడ్డల్ని సైతం ఎన్టీఆర్కు దూరం చేశారు. తనకు తోడుగా ఉన్నందుకు నిందలు మోస్తున్న మహిళకు అండగా నిలవడమే తన తక్షణ ధర్మంగా ఎన్టీఆర్ భావించారు. తిరుపతి బహిరంగ సభలో వేలాదిమంది సమక్షంలో ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబు ముఠా పార్టీపై ఎందుకు పట్టు బిగించిందో, నాయకుని కమ్యూనికేషన్ ఛానల్స్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నదో, లక్ష్మీపార్వతిని వెళ్లగొట్టడానికి ఎందుకు ప్రయత్నించిందో... 94 ఎన్నికల తర్వాత అర్థమైంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు కొంతమేరకే ఉపయోగం తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం సాధ్యపడదని బాబు అండ్ మొగల్స్ ముఠాకు అవగాహన ఉన్నది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి. అందుకోసం టిక్కెట్లలో సింహభాగం తమ నమ్మకస్థులకే దక్కాలి. ఇదీ కుట్ర. అయితే చివరి దశలో ఎన్టీఆర్ అప్రమత్తం కావడంతో కొంతమేరకు మాత్రమే వారి ఎత్తుగడ ఫలించింది. పైగా అరకొర మెజారిటీ కాకుండా ఎన్టీఆర్కు అఖండ విజయం సిద్ధించింది. కుట్ర అమలుకు కొన్ని నెలలు ఎదురు చూడవలసి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు నమోదు చేసిన నెలరోజులకే యెల్లో మీడియా ఎజెండాను పైకి తీసింది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్టు, కార్యకర్తలతో దూరం పెరిగినట్టు ప్రచారం మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే వ్యతిరేకత ఎట్లా వచ్చిందనే ప్రశ్నకు ఇక్కడ తావుండదు. యెల్లో మీడియా వార్తలకు తర్కంతోగానీ, హేతువుతోగానీ, వాస్తవికతతో గానీ సంబంధం ఉండదు. వేడివేడి బజ్జీలు వేయడం మార్కెట్లోకి వదలడం మాత్రమే దానికి తెలిసిన విద్య. ప్రచారం పీక్స్కు చేరగానే తాము టిక్కెట్లి ప్పించగా ఎన్టీఆర్ వేవ్లో గెలిచిన ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను ఈ ముఠా వైస్రాయ్ హోటల్కు పంపించేసింది. ఆ వెంటనే ఎన్టీఆర్కు వ్యతిరేకంగా 70 మంది ఎమ్మెల్యేలు ఆ హోటల్లో సమావేశమయ్యారని ప్రచారం మొదలుపెట్టారు. గంటగంటకూ ఆ స్కోర్ పెంచుతూపోయారు. ఏం జరుగుతోందో చూసి వెళ్దామని వచ్చిన ఎమ్మెల్యేలను అక్కడే బంధించారు. కొందర్ని బెదిరించి పిలిపించారు. మీడియా సహకారంతో తెల్లారేసరికల్లా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. గవర్నర్ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్టిచ్చి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసి, స్పీకర్ను చేసిన యనమల ఎన్టీఆర్కు మాట్లాడే హక్కును సైతం తృణీకరించారు. సైకిల్ గుర్తు, టీడీపీ జెండా, బ్యాంక్ డిపాజిట్లతో ఎన్టీఆర్కు సంబంధం లేదనీ, అవన్నీ బాబు పార్టీకి చెందుతాయనీ హైకోర్టు కూడా చెప్పేసింది. ఎదురుగా వెళ్లే ధైర్యం లేక వృద్ధసింహాన్ని మోసపూరితంగా బంధించి బోనులో పెట్టారు. తనవాళ్లే తనకు ద్రోహం చేయడాన్ని ఊహించలేకపోయిన ఎన్టీఆర్ షాక్కు గురయ్యారు. మనోవేదనతో కృశించి అనతికాలంలోనే ఆయన చనిపోయారు. ఆయన ఇంకొంతకాలం జీవించి ఉంటే ఈ ముఠాకు గుణపాఠం చెప్పి ఉండేవారు. ’94 ఎన్నికల్లో ఎన్టీఆర్ అండతో రెండు కమ్యూనిస్టు పార్టీలూ కలిసి 32 సీట్లు గెలుచుకున్నాయి. 1962 తర్వాత కమ్యూనిస్టులు ఇన్ని సీట్లు గెలిచిన సందర్భం మొదటి సారి, చివరిసారి కూడా ఇదే! అయినా ఆ పార్టీలు కృతజ్ఞత చూపెట్టలేదు. టీడీపీ ఆంతరంగిక వ్యవహారమని ముఖం చాటేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు మద్దతు ప్రకటించాయి. కమ్యూనిస్టులు తన సహజ మిత్రులనీ, తనకు బావగార్ల వరసవుతారనీ ఎన్టీఆర్ ఆప్యాయంగా చెప్పు కున్నారు. ఆ బావల నిర్వాకం చూసి ఆయన అవాక్కయ్యారు. కృత్రిమ సంక్షోభం తలెత్తిన వెంటనే కమ్యూనిస్టులు ఎన్టీఆర్కు మద్దతు ప్రకటించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికావాళ్లు జపాన్పై వేసిన ఆటమ్ బాంబ్తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తి కలిగిన హైడ్రోజన్ బాంబులు ఇప్పుడున్నాయి. ఎన్టీఆర్ మీద యెల్లో ముఠా చేసిన కుట్రను ఆటమ్ బాంబుతో పోల్చితే, అదే ముఠా సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అమలుచేస్తున్న కుట్రను హైడ్రోజన్ బాంబుతో పోల్చ వచ్చు. 27 ఏళ్ల కిందట కుట్రపూరితంగా అధికారం చేపట్టిన ఈ ముఠా ఆ కుట్రలూ కుహకాల్లో ఆరితేరి హైడ్రోజన్ బాంబులు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రజాసంక్షేమం, ప్రజల వద్దకు పాలన, బలహీన వర్గాల సాధికారత అనే అంశాల్లో ఎన్టీఆర్ నలభయ్యేళ్ల కింద ఒక అడుగువేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 40 అడుగులు వేశారు. ఈ విధానాలకూ, యెల్లో ముఠాకూ అస్సలు పొసగదు. ఈ ముఠాకు తన వర్గ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన బాబు అండ్ కో వైఎస్ రాజశేఖర రెడ్డిపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ఈ ముఠాకు ఎనిమీ నెంబర్ వన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, సామర్థ్యాన్ని, కమిట్ మెంట్నూ అందరికంటే ముందుగానే ఈ ముఠా గుర్తించింది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడానికి ముందే ఆ పార్టీ అధిష్ఠానంతో చేతులు కలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో షరీకై తప్పుడు కేసులు మోపడానికి రంగం సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే కేసుల కుట్రను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన గులామ్ నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మేము జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఆఫర్ చేశాము. కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము. మాట వినకపోతే జైలుకు పోవలసి వస్తుందని కూడా చెప్పాము. అయినా మాట వినలేదని ఆజాద్ అన్నారు. మాట వింటే అందలమెక్కిస్తాం, వినకపోతే జైలుకి పంపిస్తామని సాక్షాత్తూ ఢిల్లీ సామ్రాజ్ఞి చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కావలసింది సమాచారం కాదు. కామన్సెన్స్! జైలుకు పంపించే తప్పేమీ తాను చేయలేదని తన అంతరాత్మకు తెలుసు గనుక ఆయన పెద్దల బెదిరింపులకు జంకలేదు. తన ప్రయాణాన్ని తాను ఎంచుకున్నారు. ఆనాటి నుంచీ గడిచిన పదకొండేళ్లుగా యెల్లో ముఠా తన సర్వశక్తుల్నీ జగన్మోహన్ రెడ్డి పైనే కేంద్రీకరించింది. ఈ కాలంలో ఆయన మీద విష ప్రచారానికి కేటాయించిన న్యూస్ ప్రింట్నంతా ఒక పక్కన పడేసి వుంటే ఆ రెండు పత్రికలకు ఇంకో ఏడాదిపాటు ఆ న్యూస్ ప్రింట్ సరిపోయేది. విష ప్రచారాలతో, పొత్తుల ఎత్తులతో, నెరవేర్చని హామీలతో 2014 ఎన్నికల్లో జగన్ పార్టీని ఈ కూటమి ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడించగలిగింది. దీనికి సమాధానంగా వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల్లో 10 శాతం ఓట్ల తేడాతో టీడీపీని ఓడించింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో 50 శాతం ఓట్లను సంపాదించి సాధించిన విజయం. ఈ విజయంతో పోల్చదగిన విజయాలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో రెండే రెండున్నాయి. ఒకటి కమ్యూ నిస్టులతో పొత్తు పెట్టుకొని 1994లో ఎన్టీఆర్ సాధించిన గెలుపు. రెండోది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో సాధించిన గెలుపులో ఇందిరమ్మ ప్రభంజనం వీస్తున్న సమయంలో 1972లో కాంగ్రెస్ సాధించిన అసెంబ్లీ విజయం. అప్పుడు కాంగ్రెస్కు బలమైన ప్రతిపక్షం కూడా లేదు. ఇండిపెండెంట్లే ప్రతిపక్షం. మూడేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి సాధిం చిన కళ్లు చెదిరే విజయం కంటే కూడా ఆయన పరిపాలనా దక్షత యెల్లో కూటమికి ఎక్కువ కలవరపాటును కలిగిస్తున్నది. సామాజిక ఆర్థిక మార్పు సాధనంగా ఆయన రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్న తీరుకు దేశవిదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది. మహిళలూ, బలహీన వర్గాల సాధికారత విషయంలో జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలబడింది. రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ఒక అధ్యయనాంశంగా మారింది. ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని, ఆర్బీకేల పనితీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు బృందాలుగా ప్రతినిధులు వచ్చిపోతున్నారు. ఊరి స్వరూపం మారుతున్నది. ప్రతి పల్లె పట్టణ సొబగులను అద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో సహజంగానే వైఎస్సార్సీపీ బలం గత ఎన్నికల కంటే ఇప్పుడు పెరిగింది. యథాతథంగా ఎన్నికలు జరిగితే వైసీపీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. ఇతర పార్టీలతో జట్టు కట్టినా సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీకి యాభై శాతం కంటే ఎక్కువ ఓటింగ్ బలం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం లోకి రావడం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే అడ్డదారులు తొక్కడానికి సిద్ధపడింది. పాతమిత్రుల ప్రత్యక్ష, పరోక్ష సహకారాలతో సామాజిక విభజన కార్యక్రమానికి చాలాకాలం కిందనే శ్రీకారం చుట్టింది. పేద వర్గాల ప్రజ లందరూ ఒకవైపున సంఘటితం కాకుండా కులాల పేరున, మతాల పేరున విడిపోయి విద్వేషాలను విరజిమ్ముకొనేలా రెచ్చగొట్టే పథకానికి తెరతీసింది. ఎక్కడెక్కడ అటువంటి అవకాశాలుంటాయో పరిశీలించడానికి గతంలోనే కొన్ని రెక్కీలను నిర్వహించారు. కోనసీమలోని అంతర్వేదితో ఒక రెక్కీ ఆపరేషన్ జరిగింది. రామతీర్థంలో రెక్కీ జరిగింది. గుంటూరులో జిన్నా టవర్స్ పేరుతో ఒక రెక్కీ జరిగింది. ఇప్పుడు కోనసీమలో ఒక యాక్షన్ అమలుచేశారు. కోనసీమలో దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రకులాల వాళ్లు తరతరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. వ్యావసాయికంగానే కాక విద్యాపరంగా కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ అభివృద్ధి అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. చిన్న చిన్న తగాదాలు, వ్యక్తిగత పంచాయతీలు, పంతాలు పట్టింపుల వంటివి మాత్రమే వివిధ వర్గాల మధ్య పొడసూపుతున్నాయి. అప్పుడప్పుడు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇవేమీ పరిష్కరించ లేనంత తీవ్రమైన సమస్యలు కావు. కానీ వీటినే ఆసరా చేసుకొని ఇక్కడ విషం చిమ్మే క్రీడను ఈ కూటమి ప్రారంభించింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో వేళ్లన్నీ అటువైపే చూపు తున్నాయి. ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దళితులకూ – ఇతర కులాలకూ మధ్య, బీసీలకూ – ఇతరులకూ మధ్య, మైనారిటీలకూ – ఇతరులకూ మధ్య కృత్రిమ సమస్యలు సృష్టించి చిచ్చుపెట్టే వికృత క్రీడను ప్రారంభించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా, వినాశకరంగా పరిణ మించబోతున్న ఈ పాపాన్ని ప్రజలంతా ఉమ్మడిగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. శనివారం నాడు ఒంగోలులో జరిగిన ‘మహానాడు’లో పాలక పార్టీపై విద్వేషాన్ని రెచ్చ గొట్టడం తప్ప పేదవర్గాలను సాధికారం చేయగల ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయారు. కోనసీమకు అంబేడ్కర్ పేరుపై తన వైఖరేమిటో చెప్పకుండా నిజస్వరూపాన్ని చూపెట్టారు. ఇదొక హెచ్చరిక. సాధించిన విజయాలను నిలబెట్టుకోవడానికి పేద వర్గాలు సంఘటితం కావలసిన అవసరం ఉన్నది. బలహీన వర్గాల నాయకుల బస్సు యాత్రలు ఆహ్వానించవలసిందే! కానీ అదే చాలదు. పేదవర్గాల ప్రజ లందరూ ఐకమత్యంగా గ్రామగ్రామానా చైతన్య యాత్రలు జరపవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక – సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయవలసి ఉన్నది. అన్ని కులాలు, వర్గాల మధ్య సమైక్యతనూ, సౌభ్రాతృత్వాన్నీ నిలబెట్టవలసి ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘ఆజాదీ’ అంతరంగం!
మన ‘ఆజాదీ’కి ఇది అమృతోత్సవ సంవత్సరం. స్వాతంత్య్రం సిద్ధించిన అమృత ఘడియల్లోనే హాలాహలం కూడా పుట్టింది. మన ప్రజాస్వామ్య పరమశివుడు దాన్ని తన కంఠంలో బంధించలేకపోయాడు. డెబ్బౖయెదేళ్లు గడిచినా ఆ విష ప్రభావం తగ్గలేదు. ఇంకా బొట్లుబొట్లుగా రాలుతూనే ఉన్నది. అమృతోత్సవాలు వర్షించవలసిన సమయంలో హాలహలపు జడివాన మొదలైంది. బాక్సింగ్ ప్రపంచకప్ బరిలో హైదరాబాద్ యువతి నిఖత్ జరీన్ మన జాతీయ పతకాన్ని సమున్నతంగా ఎగరేస్తున్న సమయానికి మన జాతీయ న్యూస్ చానళ్లన్నీ జ్ఞానవాపీ మసీదు – మందిర సమస్యలో మునిగి తేలుతున్నాయి. ఈ డిబేట్ ఫలితంగా దేశంలోని ఒక వర్గం మరింత అభద్రతా భావంలోకి జారుకుంటున్నది. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన జాఫర్ ఇక్బాల్ (హాకీ), అబ్దుల్ రహీమ్ (ఫుట్బాల్), అజారుద్దీన్ (క్రికెట్), సానియా మీర్జా (టెన్నిస్), అబ్దుల్ బాసిత్ (వాలీబాల్), నిఖత్ జరీన్ (బాక్సింగ్) వగైరాలు పుట్టిన వర్గం అది. అయోధ్య ధారావాహికకు కొనసాగింపే – జ్ఞానవాపీ మసీదు ఎపిసోడ్. అయోధ్య వివాదం నేపథ్యంలో మన దేశ పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది. ‘ప్రార్థనా స్థలాల చట్టం – 1991’గా దాన్ని పిలుచుకుంటున్నాము. దేశంలో ఉన్న ఆరాధనా స్థలాల్లో 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఏ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయో ఇక ముందు కూడా అవే కొనసాగుతాయనీ ఆ చట్టం నిర్దేశించింది. చరిత్ర గమనంలో ఒక మతానికి చెందిన ప్రార్థనాలయాలను మరొక మతం వారు ధ్వంసం చేసి తమ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలుగా మార్చుకున్నారని కోకొల్లలుగా ఆరోపణ లున్నాయి. ఇటువంటి ఆరోపణలున్న ప్రతి ఆలయ స్వభావాన్ని ఇప్పుడు మార్చుకుంటూ పోతే ఇక దానికి అంతే ఉండదు. నిరంకుశ పరిపాలకులు రాజ్యమేలిన కాలంలో జరిపిన చర్యలకు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీకార చర్యలు అసమంజస మనే స్ఫూర్తితో 1991 చట్టాన్ని తయారు చేశారు. చట్టాల్లో లొసుగులు వెతకడం ఎంతసేపు? అయోధ్య పరిణామాలిచ్చిన ఊపుతో ఉన్న ఆరెస్సెస్ అనుబంధ సంస్థలకూ, హిందూ సంస్థలకూ ఈ చట్టం ఒక ప్రతిబంధకమనిపించలేదు. 1958 పురాతన కట్టడాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రదేశాలకు, అప్పటికే చర్చల ద్వారా పరిష్కారమైన ప్రదేశాలకు 1991 చట్టం మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపు ఆసరాతో హిందూ సంస్థలు కింది కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపి, అనుకూల తీర్పులు పొందగలుగుతున్నాయి. ఒక ప్రార్థనా స్థలపు మతస్వభావాన్ని నిర్ధారించే పరిశీలన 1991 చట్టం ప్రకారం కూడా నిషేధం కాదు కనుక కాశీలోని జ్ఞానవాపీ మసీదు సర్వే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూ సంస్థలకు ఇదొక బూస్టర్‡డోస్. జ్ఞానవాపీ సర్వేలో హిందూ ఆలయ ఆనవాళ్లు బయట పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మథురలోని ‘శ్రీకృష్ణ జన్మస్థానం – షాహీ ఈద్గా’ వివాదంపై విచారణకు కూడా జిల్లా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వెంటనే కుతుబ్ మినార్ కూడా లైన్లో ఉన్నదట! ఈ సర్వేల్లో కూడా వాటి పునాదుల్లో హిందూ ఆనవాళ్లు కనిపిస్తే కనిపించవచ్చు. మధ్యయుగాలనాటి ముస్లిం రాజుల పాలనలో, ముఖ్యంగా మొఘల్ కాలంలో వేలాది హిందూ దేవాలయాలను మసీదులుగా మార్పు చేశారని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలూ, హిందూ సంస్థలూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సంఖ్య అతిశయోక్తితో కూడినదని నిష్పాక్షిక పరిశోధకులు, పరిశీలకులు చెబుతున్నారు. అయితే సుమారు వంద వరకు ఆలయాలు ఈ కాలంలో మార్పులకు గురై ఉండవచ్చని కూడా అంగీకరిస్తున్నారు. మధ్యయుగానికి పూర్వం కూడా ఆరాధనా మందిరాలను ధ్వంసం చేసి మరో మతానికి చెందిన ఆలయాలుగా విస్తారంగా మార్పులు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రాచీన కాలంలో భరతఖండం నలుమూలలా బౌద్ధం పరిఢవిల్లిందని మనకు తెలుసు. ఆ కాలంలో వెలసిన వేలాది బౌద్ధారామాలు, చైత్యాలయాలు, విహారాలు, స్తూపాలను ధ్వంసం చేసి వాటి పునాదుల మీద హిందూ దేవాలయాలు నిర్మించారన్న ఆరోపణ లున్నాయి. ప్రసిద్ధికెక్కిన పూరీ, పండరీపూర్, తిరుపతి ఆలయాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పూరీ, ఖజురహో పునాదుల్లో బౌద్ధ చైత్యాలయాలున్నాయని పురాతత్వ వేత్తలు కూడా విశ్వసిస్తున్నారు. గుప్త వంశ రాజులు పాలిస్తున్న ఐదో శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు ఫాహియాన్ ఈ పరిణామాలకు ఒక సాక్షి. గౌతమ బుద్ధుడు కొంతకాలం నివసించిన శ్రావస్తిలో కూడా కుషానుల కాలం నాటి బౌద్ధారామాన్ని మార్చి హిందూ ఆలయంగా నిర్మించారని ఆయన రాశారు. ఏడో శతాబ్దంలో భారత యాత్ర చేసిన బౌద్ధ యాత్రికుడు సూన్ సాంగ్ ఈ విధ్వంసాన్ని మరింత వివరంగా గ్రంథస్థం చేశాడు. బుద్ధుడు మోక్ష జ్ఞానం పొందిన సమయంలో ఆయనకు నీడనిచ్చిన బోధి వృక్షాన్ని గౌడ శశాంకుడు నరికించాడనీ, ఆ కాలంలో వందలాది బౌద్ధారామాలను ధ్వంసం చేశారనీ సూన్సాంగ్ పేర్కొన్నాడు. ఈ ప్రదేశాలన్నింటి మీద కూడా ఇప్పుడు సర్వే జరగాలని కోరడం ఏ మేరకు సమంజసమవుతుంది? అట్లాగే మధ్య యుగాలనాటి మార్పులపైనే అధ్యయనం చేసి, ప్రాచీన చరిత్రలోని మార్పు లను వదిలేయాలనడం మాత్రం ఎంతమేరకు హేతు బద్ధమవుతుంది? కనుక 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్నీ, దాని వెనుకనున్న స్ఫూర్తినీ యథాతథంగా గౌరవించడమేమన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి దోహదపడు తుందని భావించాలి. ఆలయాల పునరుద్ధరణ డిమాండ్ ఒక మతపరమైన వ్యవహారంగానే మిగిలిపోతే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ అదొక రాజకీయ ఎజెండాగా, బలమైన రాజకీయ శక్తుల చేతిలో ఆయుధంగా మారడం మాత్రం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన అంశమే. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవలసినంత అవసరం, అగత్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలక బీజేపీకి ఉన్నదా? అసలట్లా వాడుకోవడం సరైనదేనా అనే ప్రశ్నను కాస్సేపు పక్కన పెడదాం. బీజేపీ రామబాణాన్ని ప్రయోగించకపోయినా దానితో పోరాడగల శక్తి ప్రధాన ప్రతిపక్షానికుంటుందని ఈ దేశంలో ఎవరూ భావించడం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఒక విఫల ప్రయోగం గానే మిగిలిపోయే సూచనలు ఇంకా కనబడుతున్నాయి. తాను నాయకత్వం స్వీకరించడు. ఇంకొకరికి అప్పగించడు. బరువు తాను మోయడు, మరొకరిని నమ్మడు. ఇటువంటి బాధ్యతా రాహిత్యాన్ని దేశ ప్రజలు హర్షించలేరు. ఈ కారణం వల్లనే ప్రధాని అభ్యర్థి రేటింగ్స్లో నరేంద్ర మోదీ సమీపంలోకి కూడా రాహుల్ రాలేకపోతున్నారు. మసీదులను మార్చే కార్యక్రమం ఒక్కటే కాదు, ముస్లిం మత ఆచార వ్యవహారాలపై కూడా దాడి జరుగుతున్నది. వారి ఇళ్ళ మీదకు బుల్డోజర్లు దండెత్తుతున్నాయి. అలహాబాద్ పేరు మారిపోయింది. లక్నవూ ఇక లక్ష్మణపురం కాబోతున్నదట. యువతుల వస్త్రధారణ మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. వీధి వ్యాపారుల దగ్గర పండ్లు, కూరగాయలు, మాంసం వగైరా కొనుగోలు చేయొద్దని కర్ణాటకలో పిలుపును కూడా ఇచ్చారు. ‘లవ్ జీహాద్’ వంటి పదజాలం వాడుక పెరిగింది. దేశంలో ఎనభై శాతం జనాభా ఉన్న వర్గానికి కేవలం 15 శాతం మాత్రమే ఉన్న ప్రధాన మైనారిటీని ఒక బూచిగా చూపించవలసిన అవసరం నిజంగా ఉన్నదా? వారిని బూచిగా చూపెడితేనే ఓట్లు రాలతాయా? ఈ దేశ ప్రగతికి ఆ పదిహేను శాతం జనాభా ఆటంకంగా ఉన్నదా?... ఇటువంటి ప్రశ్నలు నిరర్థకమైనవి. వరసగా రెండు ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లభించింది. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ గెలుపు మీద కూడా పెద్దగా సందేహాలు లేవు. తన కోర్ ఐడియాలజీని ఆచరణలో పెట్టేందుకు ఇదే అనువైన సమయమని సంఘ్ పరివార్ భావిస్తున్నదా? అందుకే హిందీ భాషను దేశం మొత్తం మీద రుద్దే ప్రయత్నాలను ప్రారం భించారా? హిందూ రాష్ట్రం దిశగా అడుగులు పడుతున్నాయా? ఫెడరల్ వ్యవస్థ స్థానే యూనిటరీ రాజకీయ వ్యవస్థను నిర్మించే ఆలోచనలు చేస్తున్నారా? రాష్ట్ర్రాల అధికారాలపై వేస్తున్న కత్తెర అందులో భాగమేనా? ఇటువంటి భయ సందేహాలు ప్రతి పక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. సంపూర్ణ స్థాయిలో అధికారం దక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన ఎజెండాను అమలుచేయడానికే ప్రయత్ని స్తుంది. అది రహస్య ఎజెండా అయినా సరే! ఎందుకంటే అదే దాని లక్ష్యం, గమ్యం కనుక! ఇప్పుడు బీజేపీ ఆ పరిస్థితిలో ఉన్నది. అయితే ఈ ఎజెండా అమలుచేయడం వలన మన దేశం బలపడుతుందా? బలహీనపడుతుందా అనేది చర్చించవలసిన అంశం. మతాల పేరుతో, కులాల పేరుతో విడిపోయిన సమాజం కంటే, సమతా ధర్మంపై ఏకోన్ముఖమైన సమాజమే ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. సామాజిక విభజన వల్ల ఇప్పటికే భారతదేశం భారీ మూల్యం చెల్లించింది. గణితం, భౌతికశాస్త్రం, వైద్యం – ఇత్యాది విజ్ఞాన రంగాల్లో ఐరోపా వికసించడానికి వెయ్యేళ్ల ముందుగానే భారతదేశంలో విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగాయి. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కణాదుడు, వరాహమిహిరుడు, ఆచార్య నాగార్జున, సుశ్రుతుడు, చరకుడు మొదలైన వాళ్లంతా గెలీలియో, న్యూటన్, కెప్లర్, మేడమ్ క్యూరీ, డార్విన్, కోపర్నికస్ వగైరాలకు తాతల ముత్తాతల తాతల వంటివారు. కానీ మనది నిచ్చెనమెట్ల సామాజిక విభజన కనుక విజ్ఞానం కింది మెట్లకు చేరలేదు. విభజిత సమాజం కనుక ఏకోన్ముఖమై విదేశీ దాడులను ఎదుర్కొనలేదు. ఫలితంగా పరాధీనమైంది. సమాజం ఒక్కటిగా ఉన్నట్లయితే, విజ్ఞానం అన్ని వర్గాల్లోకి ప్రసరించి ఉన్నట్లయితే – ఐరోపా కంటే వందేళ్లో... అంతకంటే ముందుగానో భారతదేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఒకటి బలంగా ఉన్నది. అదే జరిగి ఉన్నట్లయితే ఈనాడు సకల సంపదలతో తులతూగే అగ్రరాజ్యంగా భారత్ నిలబడి ఉండేది. దేశభక్తి, జాతీయత అనే పదాలు తమ పేటెంట్లుగా భావించే బీజేపీ పెద్దలు గడిచిన చరిత్ర నుంచి పాఠాలు నేర్వాలి. కులాల పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేమన్నారు డాక్టర్ అంబేడ్కర్. విద్యాకుసుమాలు అన్ని కులాల్లో వికసించినప్పుడే పటిష్ఠమెన జాతి నిర్మాణం జరుగుతుంది. మతాల పేరుతో విడిపోయిన దేశం అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధిని విస్మరించే దేశభక్తి అసలు దేశభక్తే కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అతడు బోనెక్కాల్సిందే!
నారాయణ చేసింది కూడా నరమేధమే. జినోసైడ్ కంటే తక్కువ పాపమేమీ కాదు. ఈ నారాయణ నలుగురితో నారాయణ మాత్రం కాదు. పరిచయం అక్కర్లేని పేరు. దయ్యాన్ని దయ్యం అనే అంటాం. ఇంకో రకంగా చెప్పలేము. నారాయణ కూడా... నారాయణే! గడిచిన పాతికేళ్లుగా ఒఖ్ఖటి.. ఒఖ్ఖటి... ఒఖ్ఖటి అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఒకరిద్దరితోపాటు ఈ నారాయణ చేసిన నేరాలపై ఇప్పుడు తెలుగు సమాజంలో ఒక చర్చ నడుస్తున్నది. ఎటువంటి నేరాలవి? రెండు తరాలకు ప్రాతినిధ్యం వహించే లక్షలాదిమంది యువతీ యువకుల మేధోవికాసాన్ని దారుణంగా చిదిమేసిన యుద్ధనేరం. ఉరిమే ఉత్సాహంతో పరుగులు తీయవలసిన ప్రభాత కిరణాలకు సంకెళ్లు వేసిన నేరం. ఆ కిరణాలను బ్రాయిలర్ కోళ్లుగా మార్చిన ఘోరం. కాలేజీ విద్యను కోళ్లఫారాల వ్యాపారంగా ఏమార్చిన వైనం. జైలు గదులకు బడి పేరు పెట్టి బాల్యాన్ని బంధించిన రౌరవకార్యం. నారాయణాదుల కరెన్సీ చదువుల యాగంలో లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సమిధలుగా మారాయి. అమాయక తల్లిదండ్రుల ఆశల్ని నోట్ల కట్టలుగా తర్జుమా చేసుకున్న విద్యా వ్యాపారం నారాయణ చేసిన నేరం. జాతి భవితను పణంగా పెట్టి లాభాలు పిండుకున్న దేశద్రోహం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన నేరాల కంటే ఈ ‘చైనా’జీ కార్పొరేట్ల నేరాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. న్యూరెన్బర్గ్ ప్రత్యేక కోర్టుల కంటే పటిష్ఠమైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఈ యుద్ధ నేరస్థులపై విచారణ జరగాలి. ఎందుకంటే నారాయణాదులు చాలా పవర్ఫుల్. దయ్యాలకంటే పవర్ఫుల్. ఎంతో పవర్ఫుల్ కాకపోతే అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టు మెట్లు ఎక్కించకముందే బెయిల్ ఎట్లా ఖాయమవుతుంది? అంత గట్టి లాయర్లుంటారు నారాయణకు! దరఖాస్తు చేయకుండానే బెయిల్ ఎట్లా వచ్చిందని అదనపు అడ్వొకేట్ జనరల్ నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. నూతన ఆర్థిక విధానాల గాలులు గేట్వే ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించక ముందు విద్యారంగంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పట్నించి ఇంకో లెక్కని అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వీరులు తొడలుగొట్టారు. విద్యారంగం లోనూ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ సమయంలో చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం ఉన్నారు. ప్రైవేటీకరణపై ఆయనకున్న పిచ్చి వ్యామోహానికి మెచ్చి, ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ఆయన దన్నుతో విద్యారంగం మార్పులు కూడా శరవేగంగా వినాశ కరంగా పరుగులు తీశాయి. ఈ మార్పులకు ముందు విద్యారంగంలో ప్రభుత్వానిదే పెద్దవాటా. క్రమక్రమంగా చదువుకునేవారి సంఖ్య పెరుగు తుండడంతో సర్కార్ విద్యాసంస్థల సంఖ్య సరిపోక ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలను కూడా ప్రోత్సహించేవారు. అయితే ఈ సంస్థలేవీ కూడా విద్యార్థులపై పెద్దగా ఆర్థిక భారాన్ని మోపేవి కావు. చదువుతోపాటు ఆటపాటలు, అందుకు తగిన వసతులు, క్రీడా మైదానాలు, సాంస్కృతికోత్సవాలు విద్యార్థులకు అందు బాటులో ఉండేవి. సరస్వతీ విద్యామందిర్లు, క్రిస్టియన్ మిష నరీ స్కూళ్లు విద్యార్థుల చదువుపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేవి. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ప్రభుత్వ సంస్థలకు దీటుగా ప్రైవేట్ సంస్థలు కూడా దోహదపడేవి. డెబ్బయ్యో దశకంలో సీవిఎన్ ధన్ అనే ఆయన గుంటూరులో ఒక కొత్త ట్రెండ్కు ఆద్యుడయ్యారు. ఇంటర్మీ డియట్ చదువును మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల సాధనంగా ఆయన మార్చివేశారు. ఫీజు కొంచెం ఎక్కువ. అందుకని బాగా డబ్బున్నవాళ్లు, రాజకీయ నాయకుల పిల్లలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్లి చదువు కోవడం ప్రారంభమైంది. క్రమంగా ఈ తరహా కాలేజీలు కొన్ని విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొలకెత్తాయి. అయితే మొత్తంగా విద్యావ్యవస్థను తలకిందులు చేసేంత ప్రభావాన్ని మాత్రం అవి చూపెట్టలేదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ శకారంభంతో విద్యారంగం రూపురేఖలు మారి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అండదండలతో ఈ విద్యాసంస్థలు చెలరేగిపోయాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడం కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. విద్యారంగాన్ని ఈ శక్తులు క్యాన్సర్ వ్రణంలా ఆక్రమించుకున్నాయి. ఫలితం వ్యవస్థ విధ్వంసం. కార్పొరేట్ విద్యావ్యవస్థ దుష్ఫలితాలు సమాజంలోని అనేక రంగాల్లో మనం చూడవచ్చు. ఇందులో ఒక ఏడు అంశాలైతే స్పష్టంగా మన అనుభవంలోకి వచ్చాయి. 1. సామాజిక విభజన – రెండు గ్లాసుల పద్ధతి వంటి రెండు క్లాసుల విధానం. 2. భవిష్యత్ తరాల సర్వతోముఖ వికాసానికి స్వస్తి. 3. భాషా, సామాజిక శాస్త్రాలపై అలక్ష్యం. 4. విద్యార్థుల్లో ఒత్తిడి, పలాయనవాదం, ఆత్మహత్యల ధోరణి. 5. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం. 6. నాలెడ్జి సొసైటీ దివాళా. 7. భవిష్యత్ ఉత్తమశ్రేణి రాజకీయ నాయకత్వానికి సమాధి. రెండు గ్లాసుల పద్ధతి మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో హోటళ్లకు, టీ దుకాణాలకు వచ్చే దళితుల కోసం ఒక గ్లాసు, ఇతరుల కోసం మరో గ్లాసు కేటాయించే సాంఘిక దురాచారం అక్కడక్కడా కనిపించేది. అనేక పోరాటాల తర్వాత అది అంతరించింది. అది మాయమైందో లేదో మరో అనాచారానికి కార్పొరేట్ విద్యాసంస్థలు అంటుకట్టాయి. అదే రెండు క్లాసుల వ్యవస్థ. ఒక మెరుగైన సమాజ నిర్మాణానికి కామన్ స్కూలింగ్ను తొలి మెట్టుగా అన్ని నాగరిక దేశాలు భావిస్తున్నాయి. మనదేశంలో మాత్రం కార్పొరేటు విద్యా సంస్థలు రెండు క్లాసుల బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టాయి. ఇది రెండు దశల్లో అమలవుతుంది. కార్పొరేట్ బడుల్లో చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సగటు తల్లిదండ్రులు భావించేలా ఊదరగొట్టిన కారణంగా దిగువ మధ్యతరగతి వారు సైతం తల తాకట్టుపెట్టయినా అక్కడికే పంపించడానికి అలవాటుపడ్డారు. అప్పటికే ప్రభుత్వం వారు పాడుపెట్టిన కాలేజీలు, స్కూళ్లలో నిరుపేదల పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. ఇదొక విభజన. ఇక రెండో విభజన – కార్పొరేట్ సంస్థల్లోనే రెండు క్లాసులు. మంచి ర్యాంకులు రాబట్టవచ్చని ఎంపిక చేసుకున్న ఓ పిడికెడు మందిని ఒక ప్రత్యేక క్లాసులో వేస్తారు. కొంచెం మ్యాథ్స్నూ, కొంచెం సైన్స్నూ రోజూ గ్రైండర్లో వేసి బాగా రుబ్బిన తర్వాత స్పెషల్ క్లాస్ పిల్లల మెదళ్లలోకి గరాటా పెట్టి పోస్తారు. ఇక మిగిలిన సబ్జెక్టుల కోసం పేపర్ లీకేజీ విధానం. ఇందుకు చేయవలసిన ఏర్పాట్ల కోసం నారాయణ వంటి అధిపతుల ఆధ్వర్యంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయట. ఇతర క్లాసుల్లో ఉండే 90 శాతం మంది విద్యార్థులకు గరాటా, లీకేజీ సౌకర్యాలు ఉండవు. చదువు చెప్పడం కూడా అంతంత మాత్రమే! వీరి కోసం వందల సంఖ్యలో ఉన్న డబ్బా ఇంజనీరింగ్ కాలేజీలు ఎదురు చూస్తుం టాయి. విద్యార్థి దశ నుంచే యువతరం ఆలోచనల్లో సామాజిక విభజనకు బీజం వేసి ఈ కార్పొరేట్ కాలేజీలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడు తున్నాయి. ఇక ఈ సంస్థల్లో మనిషి సర్వతోముఖ వికాసానికి ఎటు వంటి అవకాశమూ ఉండదు. ఆటలు పాటలంటే అవేవో బూతుల్లా వినిపిస్తాయిక్కడ! ఈ తరంలోనే పుట్టి పెరిగి, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఒక సానియా మీర్జా (సెయింట్ మేరీస్)ను గానీ, ఒక పీవీ సింధు (సెయింట్ ఆన్స్)ను గానీ, ఒక మిథాలీరాజ్ (కీస్ హైస్కూల్)ను గానీ ఈ కార్పొరేట్ సంస్థలు సృష్టించలేకపోయాయి. ఒక సంగీత విద్వాంసుడిని, ఒక చిత్ర కారుడిని, ఒక కవిని, కళాకారుడిని ఈ సంస్థల నుంచి మనం ఊహించలేము. రోజూ క్రమం తప్పకుండా మ్యాథ్స్, సైన్స్ అనే విటమిన్ ఇంజక్షన్లు పొడిపించుకొని బరువు పెరగడమే ధ్యేయంగా బతికే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తే ఈ సంస్థల లక్ష్యం. ఆ రకంగా యువతరాల సృజనశీలత మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ సంస్థలు దేశద్రోహానికి పాల్పడుతున్నాయి. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషలు, సోషల్ స్టడీస్ – ఇక్కడ నిషేధిత జాబితాలో ఉంటాయి. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హిస్టరీ సబ్జెక్టే అనవసరమని బహిరంగంగా ప్రకటించారు. ఈ సూక్తిని కార్పొరేట్ విద్యా సంస్థలు శిరోధార్యంగా స్వీకరించాయి. అప్పటి నుంచి ఈ సబ్జెక్టుల్లో నూటికి 99 మార్కులు తెప్పించడం కోసం పేపర్ లీకేజీ మార్గాన్ని ఈ సంస్థలు ఎంచుకున్నాయి. దేశ చరిత్రను, సంస్కృతిని, భాషలను మరుగుపరిచే ప్రయత్నం చేయడం జాతీయ పతాకాన్ని అవమానించడంతో సమానం. ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు ఘంటా పథంగా చాటి చెప్పాయి. వీటి నిర్వహణ తీరుతెన్నులు మారాలని నివేదికలు ఇచ్చాయి. ఈ కాలేజీల ధనప్రభావం వల్ల అవన్నీ అటకెక్కాయి. ఆసక్తులన్నింటిని బలవంతంగా అణిచి వేసుకొని, ర్యాంకుల ఒత్తిడిలో నలిగి, విద్యార్థులు జీవితంపై విరక్తి ఏర్పరచుకుంటున్నారు. ఎదిరించి పోరాడలేని అశక్తతను ఈ విద్యాసంస్థల కోళ్ల ఫారం సంస్కృతి నరాల్లోకి ఎక్కిస్తుంది. ఫలితంగా ఆత్మహత్యల బాట పడుతున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క నారాయణ సంస్థల్లోనే 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సామూహిక హత్యలకు ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారో, ఆత్మహత్యలకు పురికొల్పడంపై ఏ కేసులు పెడతారో అవన్నీ ఈ సంస్థల మీద పెట్టనవసరం లేదా? ఆర్థిక సంస్కరణల తొలిదశలో అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అలక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థల వృద్ధికి సహకరించారు. ఫలితంగా వెనుక బడిన పేదవర్గాల ప్రజలు గడిచిన 30 ఏళ్లుగా మెరుగైన విద్యను పొందలేకపోయారు. వెనుకబడిన జాబితాలో మరో రెండు తరాలు కూడా కలిసిపోయాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడమంటే – ఈ దేశ ప్రజల విద్యా హక్కును ఉల్లంఘించడం! మెరుగైన సమాజానికి బాటలు వేసే కామన్ స్కూలింగ్ను అడ్డుకోవడం! కలవారు, లేనివారు అనే రెండు రకాలుగా ఈ జాతిని విడదీయడం! ఇండియా – భారత్లుగా ఈ దేశాన్ని విభజించడం! ఈ దారుణమైన దురాగతాలకు శిక్ష ఎవరికి వేయాలో సమాజం ఆలోచించాలి. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్లలో ఇంతవరకూ ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టలేదు. దేశం గర్వించదగ్గ మేధావి పుట్టలేదు. ఒక అబ్దుల్ కలామ్ను ఆశించలేము. ఒక సీవీ రామన్ను కలగనలేము. ఈ కార్పొరేట్ కాలేజీల తరంలోనే చదువుకొని ప్రపంచస్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల గానీ, సుందర్ పిచాయ్ గానీ ఈ సంస్థల్లో చదవలేదు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సుందర్ పిచాయ్ గవర్నమెంట్ స్కూళ్లలో, ఐఐటీలో చదువుకున్నాడు. కార్పొరేట్ బట్టీయం పద్ధతిలో ప్రతిభ వికసించదు. పువ్వు సహజంగా విచ్చుకునే విధానం ఉండదిక్కడ. మొగ్గ రేకుల్ని బలవంతంగా విప్పి పువ్వుగా చూపించే అనాగరిక పద్ధతి. ఇక్కడ మేధస్సు జనించదూ, జ్వలించదూ. ముప్ఫయ్యేళ్లుగా భారతీయ నాలెడ్జి సొసైటీకి తీరని ద్రోహం చేస్తున్న ఈ విద్యాసంస్థలు దేశద్రోహ నేరానికి ఒడిగట్టాయి. దేశానికి ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకత్వం రాకుండా ఈ విద్యా వ్యవస్థ అడ్డుపడుతున్నది. విలువలతో, ఆదర్శాలతో ఉత్తేజితులైన విద్యార్థులు పూర్వం రోజుల్లో ప్రజా జీవితాలతో మమేకమయ్యేవారు. అటువంటి ఆదర్శాలతోనే నాయకులుగా ఎదిగిన కొందరు రాజకీయాల్లోనూ రాణించారు. వారిలో ఎక్కువమంది రాజకీయ విలువలను కూడా కాపాడారు. గడిచిన ముప్పయ్యేళ్లుగా మెజారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ చట్రంలో, కార్పొరేట్ విద్యా ప్రపంచంలో ఇరుక్కునిపోయారు. వీరికి చరిత్రతో పనిలేదు. సామాజిక శాస్త్రాల అధ్యయనం లేదు. ప్రజలంటే పట్టింపు లేదు. టార్గెట్ – క్యాంపస్ రిక్రూట్మెంట్. మంచి జీతం ప్యాకేజీ. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఫలితంగా బాగా బలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కొడుకులు యువనేతలుగా రంగప్రవేశం చేస్తున్నారు. వాడికి ఎటువంటి విలువలు లేకున్నా సరే యువనేతగా బలవంతంగా దూరిపోతున్నాడు. ఇది ఈ దేశ రాజకీయ భవిష్యత్తు మీద కుట్ర. అడ్డగోలు సంపాదనతో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్న కార్పొరేట్ విద్యా వ్యాపారస్థులను కంట్రోల్ చేయగలమన్న విశ్వాసం సన్నగిల్లే స్థితి ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లాబీదే పెత్తన మంతా! నారాయణ మునిసిపల్ మంత్రిగా ఉంటూ రెవిన్యూ అధికారాలను కూడా చలాయించేవాడు. ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి. మూడు జిల్లాల టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చంతా ఆయనదే! అటువంటప్పుడు ఆ ప్రభుత్వం ఈ లాబీ ఆగడాలను అదుపు చేయగలదని ఎట్లా భావించగలం? నోట్ల కట్టలతో రాజకీయ నాయకత్వాన్ని, అడ్వర్టయిజ్మెంట్ ఎరలతో మీడియాను నోరు మూయిస్తూ బతికేస్తున్న ఈ లాబీకి ఇప్పుడు సరైన దెబ్బ పడింది. నారాయణ సంస్థల పేపర్ లీకేజీని సాక్ష్యాలతో సహా పట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి అభినందనలు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ దొరకవచ్చు. రివిజన్ పిటీషన్ వేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజాకోర్టులో ఇప్పటికే విచారణ మొదలైంది. కూలడం మొదలైన తర్వాత ఇంకెంతో కాలం ఆ కోట నిలబడదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బాబుగారి మూడు ముచ్చట్లు
అదొక యెల్లో ప్రపంచం. కల్లబొల్లి కథాసరిత్సాగరం. ముక్కు మూసుకొని అందులో ఓ మునకేసి చూడాలి. అక్కడ మూడు కాళ్ల కుందేళ్లు మనకు కనబడతాయి. ఎగిరే గుర్రాలు దర్శన మిస్తాయి. ఊళపెట్టే ఏనుగులు, ఘీంకరించే నక్కలూ అక్కడ సంచరిస్తూంటాయి. మైకులూ, పెన్నులూ కదను దొక్కు తాయిచట. ఇక్కడి రచయితలంతా హఠయోగ సాధకులు. నాలు కల్ని నాలుగు మడతలు వేయగల ఖేచరీ విద్యాపారంగతులు. తప్పుడు ప్రచారాలకు తాతపాదులవారైన గోబెల్స్కు అబ్బ వంటి బాబెల్స్ సైనికులు వీరంతా! ఆంధ్రప్రదేశ్ సమాచార వాతావరణంలోకి యెల్లో సిండికేట్ కాలుష్యకారక ఉద్గారాలను వెదజల్లడం కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడది శ్రుతి మించింది. యెల్లో సిండికేట్ అధినాయకుడు అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి క్రమంగా పెరుగుతున్న బొగ్గుపులుసు వాయువుల విడుదల ఇప్పుడు పీక్స్కు చేరింది. ఇంకో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సిండికేట్ అప్రమత్తమవుతున్నది. కెమికల్ వెపన్స్కు సాన బెట్టుకుంటున్నది. యెల్లో కూటమి బాసూ, దాని పొలిటికల్ ఫేసూ అయిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తమ రాజకీయ ఎజెండాకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ముచ్చటగా మూడంశాలు ఎల్లో కూటమి రాజకీయ ఎజెండాలో భాగం కానున్నాయి. ఆ మూడు ముచ్చట్లనూ చంద్రబాబు జనంతో పంచుకున్నారు. ఇందులో ఒకటి తమ ప్రచార శైలికి సంబంధించినది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి తాము ఏ స్థాయిలో తప్పుడు ప్రచారాలకు ఒడిగట్టగలమనే విషయాన్ని తెలియజెప్పడానికి ఒక మచ్చు తునకను విడుదల చేశారు. ఈ జలక్ను ఆయన శ్రీకాకుళం జిల్లాలో వదిలారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని తాను బలంగా కోరుకుంటున్నది ఎందుకనే మనసులోని మాటను ఎంపిక చేసుకున్న కొంతమందితో పంచుకున్నారు. ఇది విశాఖ జిల్లాలో జరిగింది. తప్పుడు ప్రచారాలతో కూడిన మారణాయుధాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఒంటరిగా తాను వైఎస్ జగన్ను ఓడించలేనని బహిరంగంగా అంగీకరించారు. మిగిలిన పార్టీలన్నీ తన వెంట రావాలనీ, తనకు అండగా నిలవాలనీ అభ్యర్థించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఎజెండాలోని మూడంశాల్లో మొదటిది – విషప్రచారం. ఆయన శ్రీకాకుళంలో వదిలిన వాగ్బాణాన్ని చూడండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం వలన ప్రపంచానికి కరోనా సోకిందట! ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు గానీ, ఉద్దండులైన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గానీ తేల్చలేని శాస్త్రీయ సమస్యను చంద్రబాబు చిటికెలో తేల్చి పారేశారు. అయితే ఆ కరోనాను ముందుగా చైనాలోనే ఎందుకు జొప్పించారో, తన రాజకీయ ప్రత్యర్థులపైకి ఎందుకు పంపించ లేదో? వగైరా సందేహాలను మాత్రం చంద్రబాబు నివృత్తి చేయలేదు. వచ్చే రెండేళ్లపాటు ఈ తరహా ప్రచారాన్ని ఊదర గొట్టేందుకు యెల్లో కూటమి సిద్ధమైందని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడాని కంటే ముందుగానే యెల్లో మీడియా దానికి పూర్వ రంగాన్ని ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా మారింది. అందులో భాగంగా అనేక కథనాలను అది ప్రచారంలో పెట్టింది. ద్రవ్యో ల్బణం ఫలితంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితమనే భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది. శ్రీలంక సంక్షోభానికీ, ఆంధ్రప్రదేశ్కూ కలిపి మోకాలూ – బోడిగుండు సిద్ధాంతాన్ని అన్వయించే ప్రయత్నం చేసింది. పెట్రోల్ ధరలు పెరగడంలో కేంద్రం బాధ్యత లేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే వేసింది. ఇలాంటి కథనాలను రోజుకో పది చొప్పున ఎల్లో మీడియా ఎక్కుపెట్టడం ప్రారంభించి చాలా రోజులైంది. దాని కొనసాగింపే – కరోనాకూ, జగన్మోహన్ రెడ్డికీ లంకె పెట్టడం! రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధానికీ, భూగ్రహ ఉష్ణ తాపోన్నతికీ, మండుతున్న ఎండలకూ జగన్ మోహన్రెడ్డి కారణమనే వార్తలు వచ్చినా రావచ్చు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనీ, అప్పు పుట్టడం లేదనీ, నేడో రేపో సర్కార్ మునిగిపోబోతున్నదనీ కథనాలు లేని రోజు యెల్లో మీడియా తాజా చరిత్రలో లేనేలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో యెల్లో మీడియా అచ్చేసిన ఓ కథనాన్ని ఇప్పటికీ చాలామంది గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కార్కు ఖాళీ ఖజానా స్వాగతం చెబుతున్నదనీ, వందకోట్లకు మించి నిల్వలు లేవనీ, జీతాలు చెల్లించడం సైతం కష్టం కానున్నదనీ స్వయంగా యెల్లో మీడియానే రాసింది. కేవలం వందకోట్ల రొక్కంతో ఆదిలోనే ఎదురైన ఆర్థిక మందగమన పరిస్థితులను ఈ ప్రభుత్వం విజయవంతంగా ఎదురీదగలిగిందని సదరు మీడియా ఎప్పుడూ రాయలేదు. ఒకపక్క కరోనాను ఎదుర్కొంటూనే, దేశానికే తలమానికమైన ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేసిన వైనాన్ని గురించి యెల్లో మీడియా చర్చించనేలేదు. కేవలం వందకోట్ల నిధులతోనే నడక ప్రారం భించిన జగన్ ప్రభుత్వం మూడేళ్లు తిరిగేసరికి ఒక లక్షా నలభైవేల కోట్ల నగదును జనం చేతుల్లో పెట్టగలిగిన విజయగాథను ఒక్కసారైనా ప్రస్తావించనే లేదు. ఆ ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం కారణంగా ఆంధ్ర రాష్ట్రం సంక్షో భంలో పడకుండా ఆర్థిక గతిశీలతను నిలబెట్టుకోగలిగిందనీ, జీఎస్డీపీని వృద్ధి చేసుకున్నదనీ, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయనీ ఏనాడూ యెల్లో మీడియా గుర్తించలేదు. వందకోట్ల నగదుతోనే ముందడుగు వేసిన జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికే ఆయువుపట్టు లాంటి ఆర్బీకే వ్యవస్థను రూపుదిద్దిందనీ, ఈ ఘనత ఐక్యరాజ్యసమితి వేదికను ఎక్కబోతున్నదనే సమా చారంపై కూడా యెల్లో మీడియా ముసుగు కప్పే ప్రయత్నం చేసింది. విద్యారంగంలో ప్రారంభమైన విప్లవాత్మక సంస్కర ణలను కూడా అది గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తుందని యెల్లోమీడియా మీద ఒక విమర్శ కూడా ఉండేది. ఇప్పుడైతే అదీ లేదు. చలామణీలో ఉన్న నాణేనికి బదులు నకిలీ నాణేన్ని చూపెట్టడం మొదలుపెట్టింది. ఈ పదేళ్లలో యెల్లో మీడియా సాధించిన అభివృద్ధి అది. నకిలీ నాణెం కథలతోనే వచ్చే ఎన్నికలను చంద్రబాబు ఎదుర్కో బోతున్నట్టు కరోనా ఉపాఖ్యానం ద్వారా ఆయన స్వయంగా వెల్లడించినట్లయింది. ఇక రెండోది తన ఐడియాలజీకి సంబంధించిన ప్రకటన! విశాఖ జిల్లా భీమ్లి నియోజకవర్గంలో ఆయన తన మనసులో మాటను వెల్లడి చేశారు. పూర్వకాలంలో పేదవారి చదువుల పట్ల గ్రామ మోతుబరులు ఎలా స్పందించేవారో ఇప్పటి వయోధికులు కొందరికి గుర్తుండే ఉంటుంది. స్వయంగా చూడనివాళ్లు సినిమాల్లోనో, నాటకాల్లోనో ఇటువంటి దృశ్యా లను చూసే ఉంటారు. నవలల్లో చదివి ఉంటారు. బంగళా చావిట్లో ఒక చెక్క కుర్చీలో మోతుబరి కూర్చొని ఉంటాడు. ఎదురుగా పాలేరు నిలబడి ఉంటాడు. అతడితోపాటు ఆరేడేళ్ల కొడుకు. పాలేరేదో చెబుతాడు మోతుబరితో! పెద్దాయన వెంటనే స్పందించడు. లంక పొగాకు చుట్టను గట్టిగా రెండు దమ్ములు లాగి ఆ పారవశ్యాన్ని కాస్సేపు కళ్లు మూసుకొని అనుభూతి చెందుతాడు. ఆ తర్వాత నెమ్మదిగా పాలేరు వంక చూస్తాడు. ‘ఒరేయ్ అబ్బులూ! పిల్లోడేదో తెలిసీ తెలియక బడికెళ్తానన్నాడే అనుకో... నీ బుద్ధి ఏమైందిరా? వాడిప్పుడు బడికెళ్లి ఉద్యోగాలు చేస్తాడా, ఊళ్లేలుతాడా? ఎటూ పనికి రాకుండా పోతాడు. పనిలో పెట్టావనుకో... నీకూ భారం కొంచెం దిగుద్ది. వాడికీ బతుకు బరువు తెలిసొస్తది. వెళ్లు! రేపట్నించి మన దగ్గరే పనిలో పెట్టు’... సబ్జెక్టును ఆ విధంగా మోతుబరి ముగిస్తాడు. సరిగ్గా ఇటువంటి దృశ్యమే విశాఖ జిల్లాలో కొద్దిగా కాలానుగుణమైన మార్పులతో ఆవిష్కృతమైంది. భీమ్లి నియోజకవర్గం తాళ్లవలస సమీపంలోని ఒక ధాబా దగ్గర చంద్రబాబు కొన్ని పేద కుటుంబాలతో మాటామంతీ నడిపారు. తమవారిగా భావించి ఎంపిక చేసుకున్నవారినే అక్కడికి తీసుకొచ్చారు. బాబుగారు నెమ్మదిగా ప్రారంభించారు. ‘‘ఆయన (వైఎస్ జగన్) ఏదో ‘నాడు–నేడు’ అంటున్నాడు. ఇంగ్లిష్ మీడియం అంటున్నాడు. ఇంగ్లిష్ మీడియం అంటే ఏమైంది! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది. ఇంగ్లిష్ మీడియంలో చదివితే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారైతారు...’’. ఆ మాటల ప్రవాహం అలాగే సాగివుంటే మరిన్ని ఆణిముత్యాలు బయటపడేవి. కానీ, తన వారనుకున్న జనమే అడ్డుతగిలి ‘జై జగన్’ అనే నినాదాలు చేయడంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. జరిగిన సంఘటన విషయాన్ని పక్కన పెడితే ఈ సన్నివేశం చంద్రబాబు భావజాలాన్ని, ఆయన మనసులో మాటను మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఆయన పేద ప్రజల ఎంపవర్మెంట్కు బద్ధవ్యతిరేకి అన్న విషయం నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. ‘నాడు–నేడు’ పేరుతో సర్కారు బళ్లను ఆధునికీకరిస్తే పేద పిల్లలూ, పెద్దవారి పిల్లలూ పక్కపక్కనే కలిసి కూర్చొని చదువుకుంటారు. ఇది ఆయనకు అవాంఛనీయమైన సమానత్వం కాబోలు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే పేదపిల్లలు పెద్ద ఉద్యోగాలకు వెళ్లగలుగుతారు. ఇక్కడుండే నయా మోతుబర్లకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు దొరకరు. పాత కాలపు మోతుబరి మైండ్సెట్కూ, బాబుగారి ప్రవచనాల వెనకనున్న మైండ్సెట్కూ పెద్ద తేడా ఏమీ లేదు. ఈ ఒక్క సంఘటన ఆధారంగా చంద్రబాబు భావజాలంపై నిర్ధారణకు రావడం లేదు. ఇటువంటి అనేక ఉదంతాల అనంతరమే, అనేక ప్రవచనాల అనంతరమే ఆయనను పేద ప్రజల ఎంపవర్మెంట్కు వ్యతిరేకిగా, మహిళా ఎంపవర్ మెంట్కు వ్యతిరేకిగా భావించవలసి వస్తున్నది. ఎస్.సి. కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని కామెంట్ చేయడం వెనుక ఇటువంటి భావజాలమే దాగి ఉన్నది. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అనే పురుషా హంకార సూక్తి వెనుక ఇదే భావజాలం దాగి ఉన్నది. తోకలు కత్తిరిస్తానని నాయీ బ్రాహ్మణులను, మత్స్యకారులను బెదిరిం చడం వెనుక ఉన్నది కూడా ఈ తరహా ఐడియాలజీయే! బీసీ న్యాయవాదులు జడ్జీ పదవులకు అనర్హులంటూ కేంద్రానికి లేఖలు రాయడం వెనకనున్న గూడుపుఠాణీ కూడా ఈ భావజాల ఫలితమే! తన కార్మికవర్గ వ్యతిరేకతనూ, రైతు వ్యతిరేకతనూ ఏమాత్రం దాచుకోకుండా రెండు దశాబ్దాల క్రితమే ఆయన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని అచ్చేసు కున్నారు. ఇక మూడవ ముచ్చట – రాజకీయ పొత్తుల కథ! చంద్ర బాబు భావజాలానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి విరుద్ధం. పేద ప్రజల, మహిళల ఎంపవర్మెంట్కు దోహదకారిగానే కాదు, చోదకశక్తిగా, ఇంజన్గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కేవలం గోబెల్స్ ప్రచారం ద్వారా మాత్రమే ఇటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం సాధ్యం కాదనే సంగతి ఆయనకు అర్థమైంది. సొంతవారనుకుని పిలుచుకున్న వారే ‘జై జగన్’ అనేసరికి తత్వం బోధపడింది. అక్కడి నుంచి కాకినాడకు వెళ్లేసరికి పొత్తుల పాట అందుకున్నారు. ఇంతకాలం తానూ, తన యెల్లో మీడియా ప్రచారం చేసిన ప్రజావ్యతిరేకత అనేది అబద్ధమని చంద్రబాబు పిలుపుతో తేటతెల్లమైంది. ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వం కనుకనే దానిని ఓడించడానికి రాజకీయ పార్టీలు, వ్యక్తులు, శక్తులూ అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిస్తున్నారు. పొత్తులు చంద్రబాబుకు కొత్త కాదు. అవే ఆయన ఆశ, అవే ఆయన శ్వాస! చంద్రగోళం స్వయం ప్రకాశకం కానట్టే చంద్రబాబు కూడా స్వయం ప్రకాశకం కాదు. సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందితేనే చంద్రగోళం ప్రకాశిస్తుంది. అట్లాగే బాబు ప్రకాశం కూడా! ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి కిరణాల వెలుగులో ఒకసారి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోదీ వెలుగుల సాయంతో మరోసారి గెలి చారు. అరువు కిరణాల పరావర్తనం జరగనప్పుడు ఆయన గెలవలేరు. ఇప్పుడున్న జనరంజక సర్కార్ను ఢీకొని గెలవడం కల్ల అని ఇప్పుడాయన అంగీకరించినట్టే! ఈ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నదని కూడా ఆయన అంగీకరించినట్టే! ఊహించినట్టుగానే ఆయన పొత్తుల పిలుపునకు రెండు పార్టీల నుంచి పాజిటివ్ స్పందన లభించింది. ఒకటి బాబుగారి దత్తపుత్రుడిగా అధికార పార్టీ నేతలు పిలుచుకునే పవన్ కల్యాణ్ పార్టీ నుంచి! రెండోది నారాయణ – రామకృష్ణల పార్టీ నుంచి! రాజకీయ పార్టీల పొత్తుల మాట ఎలా ఉన్నా రాష్ట్రంలో సాధికారత కోరుకుంటున్న ప్రజలంతా ఒక గట్టు మీద సమీకృతమవుతున్నారు. ఈ గట్టున పేద ప్రజలు, మహిళల సాధికార సిద్ధాంతం ఉన్నది. అది పదే పదే ప్రభాతభేరీ మోగిస్తున్నది. మరో ప్రపంచపు కంచు నగారాను వినిపిస్తున్నది. ఆ గట్టున నయా పెత్తందార్లుంటారు. వారి ప్రయోజనాలుం టాయి. వారి మీడియా ఉంటుంది. ఆ మీడియాకు మ్యాజిక్ చేయడం తెలుసు. ఇప్పుడందరూ ఏదో ఒక గట్టుకు చేరాల్సిందే! మరో మార్గం లేదు. ఇదీ పోలరైజేషన్. రాజకీయ శక్తుల పునరేకీకరణ కాదు. కావలసింది ప్రజాశక్తుల పునరేకీకరణ! ఆ గట్టునుంటావా నాగన్న... ఈ గట్టుకొస్తావా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
యాగాశ్వం సిద్ధం!
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ట్రిపులార్... ఇప్పుడు కేసీఆర్! ఉత్తరాదిపై దక్షిణాది దండయాత్ర ఇది. పాన్ ఇండియా సౌత్ సినిమాలు ఉత్తరాదిని ఉర్రూతలూగించి బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టాయి. రాజకీయం వంతొచ్చినట్టుంది. కేసీఆర్ ఆయుధపూజ మొదలు పెట్టారు. అశ్వమేధ యాగానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్లో ఇటువంటి ఒక రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇక తారీఖులు చెప్పడమే తరువాయి! యాగం ముగిసిన తర్వాత యాగాశ్వాన్ని ఈశాన్య దిశగా పంపించి జైత్రయాత్ర మొదలుపెట్టడం రివాజట! తెలంగాణకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాలు ఈశాన్య దిక్కున ఉంటాయి. సంకల్పం పెట్టుకోగానే జార్ఖండ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో కేసీఆర్ను కలుసుకోవడం యాదృచ్ఛికమైనా, శకునం కుదిరిందని కూడా భావించవచ్చు. గడచిన కొంత కాలంగా రాష్ట్ర రాష్ట్రాలూ తిరిగి ఒక జవనాశ్వాన్నయితే వెతికి పట్టుకొచ్చారు. దాన్ని యాగాశ్వంగా సిద్ధం చేశారు. ఆ గుర్రం పేరు – ఎజెండా. ఫ్రంట్లూ, టెంట్లతో పనికాదనీ, ప్రజలకు సమ్మతమయ్యే ఒక ఎజెండాను వారి ముందుంచి అటు నుంచి నరుక్కు రావాలనీ కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఫ్రంట్లూ, టెంట్ల కోసం కూడా ఆయన కొంతకాలం ప్రయత్నించారు. అది కుదిరేపని కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి కూడా కేసీఆర్ సిద్ధపడి రాయబారాలు పంపించారని ఇటీవల ఆ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అయితే తమ అ«ధిష్ఠానం ఇందుకు అంగీకరించలేదని కూడా వివరించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించి ముగ్గురు సభ్యులున్న అధిష్ఠాన కుటుంబం వన్ బై టూ గా చీలి పోయిందని వినికిడి. తెలంగాణలో ‘అకేలా ఛలో’ అనేదే రాహుల్ వైఖరట! ప్రస్తుతానికైతే ఆయన మాటే చెల్లుబాటవు తున్నది. ఈ నేపథ్యంలో ఫ్రంట్లూ, టెంట్లకు గుడ్ బై చెబుతూ ఒక ఎజెండా ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు కేసీఆర్ సంకేతాలిస్తున్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, యాంటీ ఫెడరల్, పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్నవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. అనేక పార్టీలు, సంస్థలు కూడా ఉన్నాయి. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆయన వ్యతిరేకతకు ఇవీ కారణాలే కావచ్చు. వేరే కారణాలు కూడా ఉండవచ్చు. ఆ వ్యతిరేకత కూడా ముందు నుంచీ ఒకే స్థాయిలో లేదు. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉన్నారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రదర్శిస్తున్నంత వ్యతిరేకతను అప్పుడా యన ప్రదర్శించలేదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడగల స్థితిలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు లేదు. చిక్కి శల్యావ శిష్టమైన స్థితికి అది చేరుకున్నది. ఆ పార్టీ నాయకత్వ సామర్థ్యంపై పలువురికి నమ్మకం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నది. కనుక ఆ పార్టీతో కలిసే ఎన్నికల్లో పని చేయాలనే అభిప్రాయం బీజేపీ వ్యతిరేకుల్లో ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలవి భిన్నదారులు. ఎవరికి వారే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎవరి దారిలో వారు సన్నాహాలు చేసుకుంటు న్నారు. ముగ్గురిలోనూ కేసీఆర్ ఆలోచిస్తున్న తీరు సంప్రదాయ ఒరవడికి భిన్నంగా, కొంత నూతనంగా కనిపిస్తున్నది. సకల వనరులున్న దేశంలో పేదరికం ఎట్లున్నది? అనే సింగిల్ లైన్ స్టోరీకి స్క్రీన్ప్లే రాసుకొని ఒక సరికొత్త ఎజెండాను ఆయన దేశం ముందుకు తేవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. కలిసి వచ్చేవాళ్లు వస్తారు. లేదంటే ఆయనే అన్యాపదేశంగా చెప్పినట్టు ‘భారత రాష్ట్ర సమితి’ ఉండనే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ‘భారతదేశం పార్టీ’ గురించి ఆలోచించే వారు. 1989 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ఆలోచన అట కెక్కింది. ‘నేషనల్ ఫ్రంట్’ ఛైర్మన్ హోదాతో ఆయన సరిపెట్టు కున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఒక తెలుగువాడి జాతీయ కాంక్ష తెర ముందుకు వచ్చింది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే టార్గెట్ 272 లోక్సభ స్థానాలు. తెలంగాణాలో ఉన్నవే 17. అందులో ఒక సీటు ఒవైసీ కుటుంబం చేతిలో ఉన్నది. ఎంత అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోగలిగినా ఒక డజన్కు అటూ ఇటుగానే గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కాకుండా ఇరవై సీట్లకు మించి గెలవగలిగిన ప్రాంతీయ నాయకులు కూడా దేశంలో ఉన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఈ నెంబర్ దాటే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోదీ ప్రభంజనం లేకపోతే అఖిలేశ్, తేజస్వీ ‘యాదవ’ సోదరులు కూడా ఇరవైని దాటగలరు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కనిపించిన ‘మోదీ వేవ్’ లోక్సభ ఎన్నికల్లో ఉండదని చెప్పడం కష్టం. ఈ నాయకుల్లో మమతా బెనర్జీని మినహాయిస్తే మిగిలిన వారెవ్వరికీ రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లాలనే ఆసక్తి ఉండకపోవచ్చు. కేజ్రీవాల్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేయగలిగితే సరిగ్గా ఇరవై సీట్లవుతాయి. కానీ ఢిల్లీ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు, లోకసభ ఎన్నికల్లో మరోవైపు ఏకపక్షంగా మొగ్గడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒడిషాలో కూడా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వర్కవుట్ కావడం లేదు. చేతిలో పది పదిహేను సీట్లు మాత్రమే పెట్టుకుని కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఈ ఆలోచన ఒక రెండంచుల ఖడ్గ వ్యూహంలా కనిపిస్తున్నది. మొదటి లక్ష్యం – తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్నందువల్ల సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది. దీనిని అధిగమించి గెలవగలిగే ఒక వాతావరణాన్ని సృష్టించగలగాలి. పాత కథలు పక్కన పెట్టి తాజా కథనాలను వినిపించాలి. కొత్త నరేటివ్ కావాలి. కొత్త ఆలోచన జొప్పించాలి. కొత్త పదజాలం వాడాలి. బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టడానికి సంవత్సరం ముందు వరకూ రాష్ట్రంలో ఆమెకు వ్యతిరేక వాతావరణమే కనిపించింది. కానీ ఆమె వ్యూహాత్మక పోరాటం దాన్ని అధిగమించగలిగింది. ఇదే వ్యూహాన్ని కేసీఆర్ ఇప్పటికే అమలుచేయడం ప్రారంభించి నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్లో కొంత కదలిక కనిపిస్తున్నది. వరంగల్లో జరగబోయే రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ బలంపై ఒక అంచనాకు రావచ్చు. రాష్ట్రంలో గ్రామగ్రామాన విస్తరించిన పార్టీ కాబట్టి ఓ రెండు మూడు లక్షల మందిని సమీకరించడం వారికి పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వచ్చే జనం మూడ్ ముఖ్యం. పసిఫిక్ మహా సముద్రంలా ప్రశాంతంగా కూర్చుండిపోయారంటే బలవం తంగా వచ్చిన బాపతు కింద లెక్క. సునామీలను ఎగజిమ్మే హిందూ మహాసముద్రంలా కనిపిస్తే మాత్రం కాంగ్రెస్ సవాల్ను గుర్తించక తప్పదు. ఇంకో రెండు మూడు నెలల్లో తమ అసలైన కార్యాచరణ ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కార్యాచరణ అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాగేసుకోవడమన్నమాట! తద్వారా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేననే అభిప్రా యాన్ని వ్యాప్తి చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నది. కేసీఆర్ కూడా తమ పోరాటాన్ని కాంగ్రెస్ మీద కాకుండా బీజేపీ మీదనే కేంద్రీకరించారు. ఉద్యమకాలంలో వెదజల్లి్లన పదజల్లులు సెంటిమెంట్ రగిలించడానికీ, మొదటి ఎన్నికల్లో గెలవడానికీ ఉపకరించాయి. రెండో ఎన్నికలకు ‘బంగారు తెలంగాణ’ భాషను వాడేశారు. ‘బంగారు తెలంగాణ’ ఇప్పటికే ప్రజల అనుభవంలోకి వచ్చినందువల్ల ఇంకోసారి ఉపయోగపడే అవకాశం లేదు. ఇప్పడు దేశవ్యాప్తంగా మైనారిటీలనూ, వామపక్ష, మధ్యేవాద లౌకిక బుద్ధిజీవులనూ బీజేపీ వ్యతిరేక పదజాలం, భావజాలం ఉత్తేజ పరుస్తున్నది. తెలంగాణలోనూ ఇటువంటి వారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. పదజాలాన్ని సృష్టించడంలోనూ, కమ్యూనికేట్ చేయడంలోనూ కేసీఆర్ శక్తి సామర్థ్యాలు తెలిసినవే. బీజేపీ వ్యతిరేక ఛాంపియన్గా కాంగ్రెస్ కంటే మిన్నగా తానే కనిపిస్తే, ఇటీవలి కాలంగా దూరమవు తున్న ఈ సెక్షన్ల ఓట్లు మళ్లీ తన ఖాతాలో పడవచ్చని టీఆర్ఎస్ భావిస్తుండవచ్చు. ఫలితంగా మూడోసారి గెలవడం, కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ను గద్దెనెక్కించడం జరిగితే తొలి లక్ష్యం పూర్తయినట్టే! ఇక రెండో లక్ష్యం – కేసీఆర్ను జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడం! బీజేపీ విధానాలకూ, పాలనకూ వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోపాటు, తెలంగాణ అభివృద్ధి మోడల్ను దేశవ్యాప్తంగా చాటింపు వేయడం, ఒక కొత్త ఎజెండాను పరిచయం చేయడం ద్వారా, ఉత్తరాది వారికి కేసీఆర్ను చేరువ చేయొచ్చని ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నది. 2014 ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు గుజరాత్ అభివృద్ధి మోడల్ను ఊదరగొట్టడం నరేంద్ర మోదీకి లాభించింది. అప్పుడక్కడ వున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కేసీఆర్ తరఫున పనిచేస్తున్నారు. వ్యూహాల ద్వారా ఎకాయెకిన ఢిల్లీ పగ్గా లను కేసీఆర్ చేపడతాడనే భ్రమలేమీ లేకపోయినా, జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ నాయకుడిగా నిలబడి పోవచ్చు. కాలం కలసివస్తే చక్రధారి కూడా కావచ్చు. రైతు నాయకునిగా పేరున్న చరణ్సింగ్ ప్రధాని అయ్యారు. దళితనేత మాయావతి అతిపెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరాదిన పెద్దసంఖ్యలో ఉన్న ఈ రెండు వర్గాలను ఆకర్షించే దళిత బంధు, రైతు బంధు అనే రెండు బాణాలను ఆయన అమ్ములపొదిలో పెట్టుకొని బయల్దేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ గెలిస్తే ఖాయంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయం రాష్ట్రంలో ఇప్పటికే బలపడిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే అన్ని కీలక వ్యవహారాలనూ ఆయన చక్కబెడుతున్నారు. శుక్రవారం నాడు ‘క్రెడాయ్’ వాళ్లు నిర్వహించిన ఒక రియల్ ఎస్టేట్ కార్య క్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. ఏపీని దృష్టిలో పెట్టుకుని అక్కడ రోడ్లు, కరెంటు పరిస్థితి దారుణంగా ఉన్నదని అక్కడి స్నేహితులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సాధార ణంగా పొరుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీలో, గట్టు పంచా యతీలో ఉంటాయి తప్ప వారి కార్యక్రమాలపై పాలనా తీరుపై విమర్శలు చేసుకోరు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా వుంటే తప్ప! రెండు రాష్ట్రాల్లోని రెండు వేర్వేరు ప్రాతీయ పార్టీలు విధానాలపై గొడవలు పడిన దాఖలాలు లేవు. ఎవరి మెరిట్ వారిది. ఎవరి ప్రాధమ్యాలు వారివి. ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు సామాజిక పెన్షన్లను నెల చివరిదాకా ఇవ్వడం లేదన్న విమర్శ ఉన్నది. ఏపీలో ఒకటో తేదీనాడే 90 శాతం మందికి వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి మరీ ఇస్తున్నారు. ఏప్రిల్లో ఒక రెండు మండలాల్లో టెక్నికల్ కారణాల వల్ల 11వ తేదీ నాడు పెన్షన్లు ఇచ్చారు. దీనికే ఎల్లో మీడియా ఇల్లు పీకి పందిరేసింది. ఎల్లో బ్యాచ్ తన శక్తియుక్తు లన్నింటినీ ఏపీలో ధారపోస్తున్నందు వలన తెలంగాణలో యాక్టివ్గా లేదు. అదే పెద్ద ఊరట. తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో అదేరోజు కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్య తన ప్రసంగంలో యథాలాపంగా దొర్లిందే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని ఆయన ట్వీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. కేటీఆర్ వాఖ్యలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం పండుగ చేసుకున్నంత హడావిడి చేసి జనంలో మరింత పలచ బారి పోయింది. రాబోయే ఎన్నికలపై జాతీయ స్థాయిలో జరుగు తున్న చర్చల్లో సర్వే సంస్థలు గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ తెలుగుదేశం పార్టీ ప్రభావాన్ని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. ఇది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాప రాధం. కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం యథాలాపం అయినా ఇప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో దెబ్బతిన్న రోడ్ల ఫొటోలు సామా జిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితి కేటీఆర్ది. ఏమైనా... తెలంగాణ గడ్డపై నుంచి ప్రారంభం కాబోతున్న అశ్వమేధ యాగానికి జయము జయము జయము! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిజమే, ఓట్లు చీలవు!
కొన్ని రకాల జంతువులు, పక్షులు రాబోయే భూకంపాన్ని ముందుగానే పసిగట్టగలుగుతాయి. వాటికున్న అయస్కాంత శక్తి వల్ల అది సాధ్యమవుతుంది. పసిగట్టిన క్షణాల నుంచి వాటి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయట! ఈ బెటాలియన్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి జాగిలాలు, గబ్బిలాలు. అధికార సౌధపు గోడలకు గబ్బిలాల మాదిరిగా నిరంతరం వేలాడాలని కోరుకునే రాజకీయ పక్షులు కొన్ని ఉంటాయి. రాబోయే రాజకీయ ప్రకంపనల్ని ఈ పక్షులు పసిగట్ట గలుగుతాయి. మూడేళ్ల కిందట వచ్చిన ఒక పెను ప్రకంపన కారణంగా ఈ పక్షుల గూడు చెదిరింది. ఇంకో రెండేళ్లకు అటువంటి ప్రకంపనే మరోసారి తప్పదని వాటి మాగ్నెటిక్ తరంగాలు అలారం బెల్స్ మోగిస్తున్నాయి. పక్షుల్లో విపరీత ప్రవర్తన మొదలైంది. కంపనాన్ని నిరోధించగలిగే మార్గాలపై అన్వేషణ మొదలైంది. కార్యాచరణ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మొన్నటి సూపర్ విక్టరీని మరోసారి నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షులు ఈ సంగతిని ఎప్పుడో పసిగట్టి ఉంటాయి. ఈ రాబోయే పరిణామాన్ని నిరోధించడానికి అవసరమని తాము భావించిన, అందు బాటులో ఉన్న అన్నిరకాల క్షుద్రపూజలను ప్రారంభించాయి. వారి పెంపుడు మీడియా నిర్నిద్ర గాత్రంతో భౌ కొడుతున్నది. మరోపక్క చడీచప్పుడు లేని రాజకీయ కౌటిల్యం చాప కింద ప్రవహిస్తున్నది. బేతాళ మాంత్రికోపాసన మొదలైంది. అధికార పార్టీని ఓడించడానికి సమస్త వ్యక్తులూ, శక్తులూ ఏకం కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ, పవన్ పార్టీ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరూ ఏకమై తనను గెలిపించే చారిత్రక కర్తవ్యాన్ని భుజాల మీద మోయాలని ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం తెర వెనుక తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గంటను మాత్రం తన హితుడైన పవన్ కల్యాణ్ మెడలో వేసి తెర ముందు నిలబెట్టారు. సాలార్జంగ్ మ్యూజియంలోని ప్రాచీన మ్యూజికల్ గడియారంలో గంటకోసారి ఓ మరుగుజ్జు బొమ్మ వచ్చి, గంటలు మోగించి వెళుతుంది. పవన్ కల్యాణ్ పీరియాడికల్గా వచ్చి గంట మోగించి ఓట్లు చీలనివ్వబోమని ప్రకటించి వెళుతున్నారు. ‘ఒక్కొక్క ఓటేసి చందమామా...’ అని పాడుకుంటూ ఓట్లు ఏరుకోవలసిన పరిస్థితి ప్రతిపక్ష శిబిరానికి ఏర్పడింది. ఈ దురవస్థ స్వయంకృతం. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మనుషుల్ని విభజించింది. బలహీనుల్ని ద్వేషించింది. మేడల్నీ, మిద్దెల్నీ ప్రేమించింది. వాడలనూ, గూడేలనూ చిన్న చూపు చూసింది. పంట పొలాలనూ, పారే జలాలనూ కూడా కుల కలుషితం చేశారు. వీచే గాలుల్లో, విచ్చుకునే పువ్వుల్లో విద్వేషపు విషగంధం కలిపారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టడ మేమిట’ని ఈసడించుకున్నారు. బీసీలను జడ్జీలుగా నియమించ రాదంటూ కేంద్రానికి ఉత్తరాలు రాశారు. నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు ఎక్కడైనా ఒకచోట కొంచెం కొసరు వాటా మాత్రం దక్కేది. పేద కుటుంబాల్లోని పిల్లల చదువును అటకెక్కించారు. పేదవాడికి రోగం రాకడ, ప్రాణం పోకడ అన్న చందంగా ప్రజారోగ్య వ్యవస్థను వ్యాపారమయం చేశారు. ఈ మూడేళ్లు ప్రభుత్వ పాలన అందుకు వ్యతిరేక దిశలో సాగింది. కుల మతాలకు అతీతంగా మనుషుల్ని ఐక్యం చేసే ప్రయత్నం జరిగింది. చారిత్రక దురన్యాయం కారణంగా వెనుక బడుతున్న వారికి చేయందించి నడిపించే ప్రయత్నం జరిగింది. డబ్బు లేని కారణంగా చదువుకోలేని నిస్సహాయతను తొలగించ డానికి నడుం కట్టారు. అభివృద్ధి క్రమంలో ఆఖరుమెట్టు పైనున్న వాడు కూడా సమాన స్థాయిలో నిలబడి పోటీ పడగలిగే రోజు కోసం విద్యావ్యవస్థను సమాయత్తం చేస్తున్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. నాణ్యమైన విద్య అందరికీ లభించేలా పాదు చేస్తున్నారు. పది పదిహేనేళ్లపాటు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయగలిగితే నేటి బలహీన వర్గాల ప్రజలు ఏ ప్రత్యేక రక్షణలూ, ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి చేరుకోగలుగుతారు. మనుషుల మధ్య విభజన రేఖలు చెరిగిపోతాయి. ఇంత గొప్ప ఆలోచనతో విద్యా సంస్కరణలను వై.ఎస్. జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి పేదింటి తలుపును కూడా ‘వారి’ ఫ్యామిలీ డాక్టర్ నెలకోసారి తట్టే రోజులు చేరువలో ఉన్నాయి. అందుక వసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవం ఇనుమడించేలా దేశంలో ఎక్కడా లేని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రభుత్వ సాయంతో త్వరలో 30 లక్షల మంది మహిళలు గృహ యజమానులు కాబోతు న్నారు. పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాధికారం ‘అమ్మ ఒడి’ రూపంలో ఆమెకు సంక్రమించింది. చిల్లర ఖర్చులకు కూడా భర్తలపైనో, పిల్లలపైనో ఆధారపడే నడి వయసు మహిళల చేతుల్లో ఇప్పుడు నాలుగు రాళ్లు కనబడుతున్నాయి. వారు మదుపు చేస్తున్నారు. రాబడి కోసం పోరాడుతున్నారు. ఆ కళ్లల్లో ఇప్పుడు సాధికారతా కాంతుల్ని చూడగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సరికొత్త తిరుమంత్రం – సాధికారత. ప్రజా సంక్షేమం అనే భావన ఒక దశను దాటి సాధికారతా సాధన దశలోకి ప్రవేశిస్తున్నది. మనిషి మనిషిగా తన కాళ్లపై తాను బలంగా నిలబడగలిగే స్థితిలోకి చేరు కోవడమే– ఎంపవర్మెంట్, సా«ధికారత సాధించడం! వర్గ పోరాటాలు, కులయుద్ధాల ప్రసక్తి లేకుండా సమసమాజ స్థితికి చేరుకునేందుకు ప్రజా స్వామ్యం పరిచిన బాట సాధికారత. వైఎస్ జగన్ ప్రభుత్వం వివిధ సామాజిక క్షేత్రాల్లో వెదజల్లిన సాధికారతా విత్తనాలు ఇప్పుడు మొలకెత్తు తున్నాయి. మరోపక్క ఏకకాలంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసల్నీ, స్థానిక ప్రజల అభిమానాల్నీ చూరగొన్నాయి. ఈ నేపథ్యమే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్ష శిబిరాన్ని కలవ రపెడుతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి యాభై శాతానికి పైగానే ఓట్లు రాగల క్షేత్రస్థాయి వాస్తవికత ప్రతిపక్షానికి అవగతమైంది. అందుకే తన పాత ద్విముఖ వ్యూహానికి మరింత పదును పెట్టే పనిలో అది నిమగ్నమైంది. వీలైనన్ని పార్టీలను తమ కూటమిలోకి లాగే ప్రయత్నాలను ఒకపక్క చేస్తూనే, మరోపక్కన శరపరంపరగా అధికారపక్షంపైకి నిందారోపణల్ని కురిపిస్తున్నారు. రెండు పత్రికలు, ఐదారు చానళ్లతో కూడిన ఎల్లో మీడియా, దానికి అనుబంధంగా ఒక అక్షౌహిణి సైన్యంతో ఏర్పాటైన ఎల్లో డిజిటల్, ఎల్లో సోషల్ మీడియా కార్ఖానాలు ఇప్పుడు మూడు షిఫ్టులూ పనిచేస్తు న్నాయి. టన్నులకొద్దీ అసత్యాలనూ, వార్తా వ్యర్థాలనూ సొసైటీలోకి వదులుతున్నాయి. ప్రతి వార్తకూ, ప్రతి సంఘట నకూ వక్రీకరణ భాష్యం నిత్యకృత్యమైంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ఆవరించి ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే ఎల్లో మీడియా వేలెత్తి చూపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి మొదటి వారం నుంచే ఎండలు భగ్గుమన్నాయి. గృహ వినియోగం, వాణిజ్య వినియోగం అంచనాలకు మించి పెరిగింది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేసిన ఫలితంగా వినియోగం భారీగా పెరిగింది. బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా చాలా దేశాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. ఫలితంగా బొగ్గు ఆధారిత ధర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు దొరకడమే గగనం. దొరికినా టన్నుకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతున్నది. ఆ ధరలకు కొనుగోలు చేయడమంటే డిస్కమ్లకు ప్యాకప్ చెప్పడమే! ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్ ధరలకు యుద్ధం మరింత ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యుత్ వినియోగ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉన్నదని ఇంధన శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నది. ఇంకో 55 మిలియన్ యూనిట్లు లోటు. పవర్ ఎక్స్ఛేంజీల్లో ఈ మొత్తం లోటు మేరకు కొనుగోలు చేయాలనుకుంటే రోజుకు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రభుత్వం అందుకు సిద్ధపడినా కూడా ఆ మేరకు ఎక్స్ఛేంజిల్లో కూడా లభ్యత లేదు. దొరికినంత మేరకు కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తున్నామని ఇంధన శాఖ అధికారి చెప్పారు. ఈ నెలాఖరు నాటికి వరి కోతలు మొదలవుతాయి కనుక వ్యవసాయ డిమాండ్ పడిపోతుందనీ, వచ్చే నెల మొదటి వారానికల్లా ఈ సంక్షోభం తగ్గిపోతుందనీ చెబుతున్నారు. ఒక ప్రకృతి వైపరీత్యం, ఒక యాక్సిడెంట్ లాగా ముంచు కొచ్చిన సమస్య ఇది. తాత్కాలికమైనది. అభివృద్ధి చెందిన పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లే పవర్ హాలిడే లను ప్రకటించాయి. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో గంటల తరబడి అప్రకటిత కోత అమలవుతున్నది. మెయిన్టెనెన్స్ పేరుతో చెన్నైలోనూ కోతలు విధిస్తున్నారు. సొంత బొగ్గు గనులున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే అడపాదడపా అప్రకటిత కోతలు తప్పడం లేదు. దేశమంతా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను జగన్ తలకు చుట్టేందుకు ఎల్లో సిండికేట్ ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. వైజాగ్లో ఎన్సీసీ అనే సంస్థకు భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేయాలన్నది ఎల్లో మీడియా డిమాండ్. కానీ అమరావతిలో మాత్రం రద్దు చేయకూడదట! ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల ఫలితంగా త్వరలో మరో శ్రీలంక మాదిరిగా కాబోతున్నదని ఎల్లో మీడియా చేస్తున్న బృందగానం వింటూనే ఉన్నాము. బాబు హయాంలో చేసిన అప్పుల గురించి కానీ, ఈ మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆర్థికాభివృద్ధిని గురించి కానీ ఎల్లో మీడియా మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు. 2021– 22లో అది 2,07,771కి పెరిగింది. దీని గురించి మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–2019) జీఎస్డీపీ వృద్ధి రేటు 5.36 శాతం. 2021–22లో అది 11.43 శాతం. దేశంలోనే అత్యధికంగా వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. జీఎస్డీపీ పెరగడ మంటే... ఆర్థిక కార్యక్రమాలు పెరగడం, ఉత్పత్తులు, సేవలు పెరగడం, ద్రవ్య చలామణీ పెరగడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమని అర్థం. గత ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. 52 వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల ఆదాయంగా సమకూరింది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పురోగామి రాష్ట్రంగా ఉన్నదని ఈ గణాంకాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ ఎల్లో సిండికేట్కు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఓడించిన ఆంధ్రప్రదేశ్లో లంకాదహన దృశ్యమే కనిపిస్తున్నది. వారికి కనువిందు చేస్తున్నది. అసత్య ప్రచారాలతో అధికార పార్టీ ఓటింగు బలాన్ని ఎంతో కొంత తగ్గించే తాపత్రయానికి తోడు ప్రతిపక్షం ఓట్లు చీలకుండా, చంద్రబాబు పెట్టబోయే మహాకూటమి జోలెలోనే పడాలన్నది మరో వ్యూహం. ఇక్కడ రాజకీయ నాయకులు మరిచిపోతున్న విషయం ఒకటున్నది. అలయెన్స్లూ, ఐక్య సంఘటనలూ రాజకీయ పార్టీలకే కాదు... ప్రజలకూ ఉంటాయి. ఆ విషయం గతంలో అనేకసార్లు నిరూపణయింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ స్వయంగా ఓటమి పాలై కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఇందిరాగాంధీ ‘కాంగ్రెస్(ఐ)’ పేరుతో చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జాతీయ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. బ్రహ్మా నందరెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు కనుక ‘రెడ్డి కాంగ్రెస్’గా పిలిచేవారు. ముఖ్యమంత్రిగా ‘రెడ్డి కాంగ్రెస్’ నేత వెంగళరావు ఉన్నారు. కాంగ్రెస్ అతిరథ మహారథులంతా ‘రెడ్డి కాంగ్రెస్’లోనే ఉన్నారు. మరికొందరు జనతా పార్టీలోకి వలసపోయారు. ప్రతిపక్ష యోధానుయోధులు, అధికార పక్షం నుంచి వచ్చిన అతిరథులతో కూడిన జనతా పార్టీ బలీయంగా కనపడింది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచార పోరు! ఇందిరా కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు టిక్కెట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా సామాన్య ప్రజలకు చేసిన మేలును వారు మరిచిపోలేదు. ‘గరీబీ హఠావో’ ఉద్యమాన్ని వారు మరిచిపోలేదు. సంపన్నుల సేవలో తరిస్తున్న బ్యాంకుల మెడలు వంచి, వాటిని జాతీయం చేసి సామాన్య ప్రజలకు రుణాలిప్పించిన జ్ఞాపకమూ చెదిరిపోలేదు. ఇందిరమ్మ పార్టీ గుర్తు కూడా కొత్తది. పెద్దగా ప్రచారం చేసే నాధుడు లేడు. అయినా, బలమైన స్థానిక నాయకత్వమున్న రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీదాబిక్కీ జనమంతా ఒక్కటైనారు. తమ ఓట్లను చీలనివ్వలేదు. ఇందిరమ్మ గుర్తును తెలుసుకొని, బ్యాలెట్ పేపర్లో వెతికి పట్టుకొని మరీ ఓట్ల వర్షం కురిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ‘మహా కూటమి’గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఓట్లకు కోతపెట్టిన ‘ప్రజారాజ్యం’ ఒక్కటే విడిగా పోటీ చేసింది. ‘మహాకూటమి’కి ధీటుగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మహత్తర కూటమిగా ఐక్యమై, రాజకీయ కూటమిని మట్టి కరిపించారు. తమకు మేలు చేసే, తమ శ్రేయస్సుకు బాటలు వేసే ప్రభుత్వాల మీద జరిగే కుట్రలనూ, కుయుక్తులనూ జనం గమనిస్తారు. ‘ఓట్లు చీలనివ్వం’ అనే మాట పవన్ కల్యాణ్, చంద్రబాబు చెప్పడం కాదు... ప్రజలే చెబుతారు. సామాజిక వర్గాల సంయుక్త అలయెన్స్ను వారే ప్రకటించుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణ అభ్యుదయ వర్గాలతో కూడిన అఖండమైన ఓటు బ్యాంకును చెదరనివ్వరు! వారి ఓట్లు చీలవు!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈలపాట... సీసపద్యం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇంకో రెండు మూడు రోజులు కొనసాగివుంటే బాగుండేది. ముఖ్యమైన బిల్లులేవో మిగిలిపోయాయని కాదు... తెలుగుదేశం పార్టీ క్రియేటివ్స్ను ఇంకొన్ని చూసి ఉండేవాళ్లం కదా అని! కాగితాలు చించి, స్పీకర్ తల మీద అక్షతల్లా చల్లే కళారూపాన్ని ఒకరోజు ప్రదర్శించారు. ఒకరోజు ఈలలు వేశారు. అందుకోసం కొందరు సభ్యులు విజిల్స్ కొనుక్కుని సభకు వచ్చారు. ఒకరోజు చిడతలు వాయిం చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘చిడతల బాబాయణాన్ని’ ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక బృందం ఉండేది. ‘జయము జయము చంద్రన్న... జయము నీకు చంద్రన్న’ అనే మకుటంతో ఈ బాబాయణ భజన సాగేది. పోల వరంపై ప్రకటన చేసినప్పుడు ముఖ్యమంత్రి ఈ పాత విజు వల్ను సభకు చూపెట్టారు కూడా! సభ్యుల దగ్గర చిడతలు ఎటూ ఉన్నాయి కనుక ఇంకో రోజు ఆగివుంటే సభలో లైవ్గానే చిడతల బాబాయణాన్ని చూసే అవకాశం దక్కేదేమో! స్పీకర్ చెప్పిన లెక్క ప్రకారం 12 రోజులు సమావేశాలు జరిగాయి. 2 లక్షల 56 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యాల మీద తొలిరోజు గవర్నర్ ప్రసంగించారు. ఈ రెండింటి మీద చర్చ జరిగింది. 11 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. గత ప్రభుత్వం పౌరుల గోప్యతను ప్రమాదంలోకి నెట్టి, పెగసస్ అనే స్పైవేర్ను వాడిందనే ఆరోపణలపై చర్చ జరిగింది. ఒక సభా సంఘాన్ని వేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే సందర్భంగా ముఖ్య మంత్రి వచ్చే ఏడాదికి సంబంధించిన వెల్ఫేర్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఇది ప్రజలకు వెల్ఫేర్, ప్రతిపక్షానికి ఫేర్వెల్ అని కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ‘వెల్ఫేర్’ అనే మాటను తిరగేస్తే ‘ఫేర్వెల్’ అనే మాట వస్తుంది. ప్రభుత్వ వెల్ఫేర్ ఎజెండాను వ్యతిరేకిస్తే, ప్రతిపక్షానికి ఫేర్వెల్ తప్పదనే అర్థంలో ముఖ్యమంత్రి కామెంట్ చేసి ఉంటారు. మొత్తం పన్నెండు రోజుల్లో 103 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, తెలుగుదేశం సభ్యులెవరూ కూడా ఈ చర్చల్లో పాల్గొనలేదు. ‘సీసా’ పద్యమే ఏకైక ఎజెండాగా సభలో టీడీపీ వ్యవహారాల్ని నడిపింది. నాటుసారా తాగడం వల్ల జంగారెడ్డి గూడెంలో కొంతమంది చనిపోయారని ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా చేసిన ప్రచారాన్నే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోకి మోసుకొని వచ్చారు. దానిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజూ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం, సభను స్తంభింపజేయడం... ఏకసూత్ర కార్యక్రమంగా పెట్టుకున్నారు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరిస్తున్నారనీ, అసలు చంద్రబాబు హయాం లోనే మద్యం ఏరులై పారిందనీ అధికార పక్షం ఎదురుదాడి చేసింది. ఈ ఎపిసోడ్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మద్యం పాలసీకి సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరిని ముందుగా అవగాహన చేసుకోవాలి. మద్యపాన రహిత సమాజమే తమ పార్టీ విధానమని గతంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఒకే ఉదుటున మద్యనిషేధం అసాధ్యం కనుక, గతంలో జరిగిన అటువంటి ప్రయత్నాలు విఫలమైన అనుభవాలున్న నేప థ్యంలో పార్టీ అధికారంలోకి రాగానే మధ్యేమార్గాన్ని ఎంచు కొన్నది. మద్యపాన ఆసక్తిని నిరుత్సాహపరచడం, అలవాటును క్రమంగా మాన్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అంతకుముందు వీధివీధినా, వాడవాడనా వెలసిన 44 వేల బెల్టు షాపులను ఎత్తివేసింది. షాపులకు అనుబంధంగా ఓపెన్ బార్లుగా నడుస్తున్న పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. షాక్ కొట్టే విధంగా ధరలుండాలనీ, దానివల్ల తాగాలన్న కోరికను అదుపులో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో రేట్లు పెంచారు. షాపు లను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే లాభాపేక్ష వలన మళ్లీ బెల్టు షాపులకు తెరతీస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం ఆ వ్యాపారాన్ని స్వయంగా చేపట్టింది. షాపుల సంఖ్యను కూడా తగ్గించి, అమ్మే వేళల్ని కూడా కుదించింది. కొంతకాలం తర్వాత ధరలు కొంత తగ్గించాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. అలవాటుకు బానిసలైన వారు తొందరగా మానలేకపోతున్నారనీ, పెరిగిన ధరలను భరించలేక నాటు సరుకుకు అలవాటయ్యే అవకాశ ముందనీ కనుక కొంతమేరకు ధరలు తగ్గించాలనీ ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అవుతున్నదని కూడా వార్తలు వచ్చాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ధరలకు తగ్గించింది. మద్యం అక్రమ రవాణానూ, నాటుసారా తయారీనీ, గంజాయి అక్రమ రవాణా వగైరాలనూ పూర్తిగా అరికట్టే ఉద్దేశ్యంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు ఇప్పటికే సత్ఫలితాలనిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాల్లో దండలో దారంలాగా అంతర్లీనంగా ఒక సంకల్పం మనకు కనబడుతున్నది. సంకల్పాన్ని వాస్తవికతనూ బ్యాలెన్స్ చేసుకుంటున్న ఒక లాజిక్ కనబడుతున్నది. ఇక జంగారెడ్డిగూడెం ఘటన విషయానికి వద్దాము. అక్కడ నాటుసారా తాగి నాలుగైదు రోజుల్లో పదహారు మంది చనిపోయారని ముందుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాతనే ఎల్లో మీడియా హడావిడి చేసింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించి వచ్చారు. కల్తీ మద్యంతో జనం చనిపోతున్నారని మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. నిజ నిర్ధారణ కోసం వెళ్లిన ఆర్డీవో విచారణ జరిపి, చనిపోయిన వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం సేవించే అలవాటున్నదని ప్రకటించారు. మిగిలిన వారు వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో చని పోయారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉండే ఒక చిన్న పట్టణం జంగారెడ్డి గూడెం. 2011 లెక్కల ప్రకారం ఈ పట్టణం జనాభా 48,494. ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడం వలన ప్రస్తుతం పట్టణ జనాభా 70 వేలు దాటిందని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు మరణాల రేటు ప్రతి వెయ్యి జనాభాకు 7.3. గడచిన ఐదేళ్లుగా దాదాపు ఇదే నిష్పత్తి కొనసాగుతున్నది. ఈ లెక్కను జంగారెడ్డి గూడెం పట్టణానికి వర్తింపజేస్తే సగటున ఏడాదికి సుమారు 500 మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. అంటే నెలకు నలభైకి పైగా! గడచిన రెండు మూడు మాసాల లెక్కలు చూస్తే ఎన్నడూ ఈ సంఖ్య దాటలేదు. మరి ఈ ‘సారా మరణాలు’ సాధారణ సంఖ్యను ఎందుకు దాటలేదు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సారా ఉద్యమాన్ని వెన్నంటే... ఇంకో ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో ఉన్నప్పుడు వారి వ్యాపారం కోసం నాటు సారా సమాచారాన్ని ఎక్సైజ్ వారికి చేరవేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే వారికి అటువంటి చొరవ లేనందువల్లనే నాటు సారా తయారీ పెరుగు తున్నదని ఈ ప్రచారం సారాంశం. ఇప్పుడు సినిమా అర్థమవు తున్నట్టే కదా? మద్య నియంత్రణ లక్ష్యం నుంచి ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రతిపక్షం తయారు చేసిన గేమ్ ప్లాన్. కొత్త విధానం వల్ల నష్టపోయిన తమ పార్టీ అనుయాయులైన మద్యం వ్యాపారులను రంగంలోకి దించి నడిపిస్తున్న నాటకం. ఈ ప్రచారం వలన ఒత్తిడి పెరిగి ప్రభుత్వం మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలి. వారు పర్మిట్ రూమ్లు, బెల్ట్షాపులు ఓపెన్ చేయాలి. మద్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. తన అనుయాయులు కాసులు దండుకోవాలి. సమావేశాల ముగింపు రోజున వచ్చే ఏడాది కాలానికి గానూ సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ద్రవ్యోల్బణం ఛాయలు ముసురుకుంటున్నట్టు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ సంక్షేమ క్యాలెండర్కు ప్రాధాన్యం ఉన్నది. గడచిన రెండేళ్లపాటు కోవిడ్ విసిరిన సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన ఉపాయం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ (డిబిటీ) కార్యక్రమం. దాదాపు లక్షా ముప్ఫయ్వేల కోట్ల రూపా యల నగదును వివిధ స్కీముల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం జనం చేతిలో పెట్టింది. చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు. కోటి కుటుంబాల తలుపుతట్టిన శ్రీమహాలక్ష్మి గ్రామీణ సంతల దగ్గర్నుంచి పట్టణ మార్కెట్ల వరకు గతిశీలతతో నిలబడేలా దీవించింది. సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడింది. అంతటి ప్రాధాన్యం కలిగిన సంక్షేమ క్యాలెండర్కు ఎల్లో మీడియాలో తగినంత చోటు దొరక్కపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ‘కాగ్’ నివేదిక పేరుతో ఆ మీడియాకు ఓ కొబ్బరికాయ దొరికింది. ఏటా బడ్జెట్ సమా వేశాలప్పుడు ఈ కొబ్బరికాయ పగలాల్సిందే! ఇది రాజ్యాంగ ధర్మం. కాకపోతే పూజనంతా వదిలేసి, కొబ్బరి చిప్పలపైనే ఎల్లో మీడియా మోజు పడటం విశేషం. ప్రభుత్వాల జమాఖర్చుల్ని ఆడిట్ చేయడం ‘కాగ్’ బాధ్యత. అందుకోసం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను అది ఏర్పాటు చేసుకున్నది. వాటి ఆధారంగా అది తన నివేదికను విడుదల చేస్తుంది. ప్రభుత్వాలకు అవసర మయ్యే వెసులుబాటు దారులను అది గుర్తించదు. ప్రభుత్వ వ్యయాల మీద ‘కాగ్’ సాంకేతిక విమర్శలు సర్వసాధారణం. ఒక లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి శాసనసభ అనుమతి పొందలేదన్నది ‘కాగ్’ ప్రధాన విమర్శ. ఈ విషయాల్ని ఎల్లో మీడియా ప్రధాన వార్తగా ఫోకస్ చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపా యలను బడ్జెట్ కేటాయింపు లేకుండా ఖర్చు చేసిందనీ, శాసన సభ అనుమతి తీసుకోవాలనీ పదేపదే సూచించినా కూడా పెడచెవిన పెట్టిందనీ అప్పట్లో ‘కాగ్’ విమర్శించింది. కానీ అప్పుడది ఎల్లో మీడియాలో ప్రాధాన్యతకు నోచుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను నిబంధనల మేరకు ట్రెజరీ కోడ్ ప్రకారం కాకుండా సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చెల్లించారనీ, ఇటువంటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలనీ ‘కాగ్’ సలహా ఇచ్చింది. ఈ పాయింట్ను ఆసరాగా తీసుకొని 41 వేలకోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, ఆ డబ్బును ఎవరు మింగేశారో తేల్చాలనీ గగ్గోలు చేయడం ఒక రకమైన వింత ప్రవర్తనగానే పరిగణించాలి. తెలుగుదేశం అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో కూడా వివిధ పద్దుల కింద కేటాయింపులు చేసిన రూ. 47 వేల కోట్లను ఖర్చు చేయలేదని ‘కాగ్’ అప్పుడు చెప్పింది. మరి ఆ సొమ్మును ఎవరు మింగేసినట్టు! జగన్ ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ పథాన్ని తెలుగుదేశం – ఎల్లో మీడియా కూటమి, ఆ కూటమి తాబేదార్లు తప్పుపడుతున్నారు. అమరావతిని ఏకైక రాజ ధానిగా ప్రకటించడమొక్కటే అభివృద్ధికి కొండగుర్తు అన్నట్టుగా వీరి ప్రచారం కొనసాగుతున్నది. చంద్రబాబు పరిపాలన సామాజిక విధ్వంసానికి ప్రతిరూపంగా రుజువయినప్పటికీ, ఆయనను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేయ డాన్ని ఈ కూటమి మానలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెబుతున్న అభివృద్ధి నిర్వచనాలకూ, చంద్రబాబు విధానాలకూ ఏమాత్రం సాపత్యం ఉండటం లేదు. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘురామరాజన్ మరో ప్రొఫెసర్ రోహిత్ లాంబాతో కలిసి భారత ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని వరస వ్యాసాలను ఇటీవల రాశారు. రెండు రోజుల కిందటే ఒక జాతీయ దినపత్రికలో ‘మైండ్, బాడీ అండ్ గ్రోత్’ పేరుతో ఒక వ్యాసం వచ్చింది. ఇందులో వారు చెప్పిందే మిటంటే – నాణ్యమైన విద్య, నైపుణ్యం (మైండ్), శారీరక ఆరోగ్యం (బాడీ) కలిసి ఆర్థిక వృద్ధికి (గ్రోత్)కు బాటలు వేస్తాయని! అంటే సమస్త ప్రజానీకానికి సమాన స్థాయిలో నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పి, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులో ఉంచినట్లయితే నైపుణ్యం గల మానవ వనరులు తయారవుతాయనీ, అవే దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయనీ వారు స్పష్టంగా చెప్పారు. భారత ఆర్థికాభివృద్ధికి ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, లక్ష్యాన్ని సాధించాలంటే మానవ వనరులే కీలకమని వారు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్టాల్లో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను విధ్వంసం చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు. ఇది దాచేస్తే దాగని సత్యం. నూటికి తొంభైమందికి నాణ్యమైన విద్య దొరక్కపోవడానికీ, వైద్యం అంగడి సరుకుగా మారడానికీ ఆయనే ప్రధాన కారకుడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రక దుర న్యాయాన్ని సరిదిద్దే పనిచేస్తున్నది. కుల మత ప్రాంత, ధనిక – పేద తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అలవడే విద్యా వ్యవస్థకూ, ఆరోగ్య వ్యవస్థకూ బాటలు వేస్తున్నది. ఈ విషయాలన్నీ జనం అనుభవంలోకి ప్రత్యక్షంగా వస్తున్నాయి. అభివృద్ధికి అర్థమేమిటో వారికి అవగతమవుతున్నది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను తెలిసో, తెలియకో సహించిన ప్రజలు ఇప్పుడు సహించేందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఎల్లో మీడియా ఎన్ని కథలు చెప్పినా సరే, వారి ఎమ్మెల్యేలు ఎన్ని ఈల పాటలు పాడినా సరే! ‘ఈలపాట’కు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే రఘురామయ్య గారు కృష్ణుని వేషంలో చెప్పే పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్, తొల్లి గతించె...’! అంటే... ఇప్పుడిక పప్పులు ఉడకవని అర్థం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాజు మరణించినాడు..!
బ్రిటన్లో ఒక సంప్రదాయమున్నది. ఆ దేశపు రాజుగారు చనిపోయినప్పుడు ఒక అధికారిక ప్రకటన చేస్తారు. 'The King is dead, long live the King'. రాజుగారు చనిపోయారు. రాజుగారు చిరకాలం జీవించాలి. రాజ్యం – పరిపాలన అనేవి నిరంతర ప్రక్రియలనీ, రాజు చనిపోయినా మరో రాజు సిద్ధంగా ఉన్నారనేది ఈ ప్రకటన సారాంశం. 1952లో బ్రిటన్ రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్ మరణించారు. అప్పుడు 'The King is dead, long live the Queen' అనే ప్రకటన వెలువడింది. ఆయన వారసురాలుగా ప్రస్తుత మహారాణి రెండో ఎలిజబెత్ అప్పుడు సింహాసనమెక్కారు. ఆమెకు సంక్రమించిన దీర్ఘాయుష్షు వలన అటువంటి అధికార ప్రకటన వినే అవసరం ఇప్పుడున్న రెండు మూడు తరాల వారికి రాలేదు. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ కాంగ్రెస్ అనేవి రెండూ విడదీయలేని అంశాలు. భిన్న సంస్కృతులు, భాషలు, పాలనా విభాగాలుగా విడివడి ఉన్న భారతీయుల్లో జాతీయతను పాదు చేసిన ప్రధాన శక్తి కాంగ్రెస్ పార్టీయే! బ్రిటీష్వాడు ఎత్తుకెళ్లింది నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం మాత్రమే కాదు, దేశపు నవనాడుల నుంచి రక్తాన్ని పిండుకుంటున్నాడని సశాస్త్రీయంగా నిరూపించిన దాదాబాయ్ నౌరోజీ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సిరిసంపదలతో తులతూగిన దేశంలో దరిద్రం తాండవమాడటానికి కారణం బ్రిటీష్ సామ్రాజ్య దోపిడీయేనని చెబుతూ ‘వెల్త్ డ్రెయిన్’ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. అప్పట్లో చదువుకున్న భారతీయులను ఈ వాదన కదిలించి, జాతీయ భావాలను రేకెత్తించింది. భిన్నప్రాంతాల్లోని భారతీయుల్లో సాంస్కృతిక ఏకీభావం కలిగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలగంగాధర తిలక్ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ పునాదుల మీదనే దేశ ప్రజలందరినీ ఒక జాతిగా సమీకరించి, గాంధీజీ స్వరాజ్య సమరం సాగించి గెలిచారు. స్వాతంత్య్రం సిద్ధించేవరకూ కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ గాంధీజీయే! స్వాతంత్య్రం తర్వాత కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్ది ఆర్థిక వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు బాటలుపరిచాయి. ఇంతటి మహత్తర చరిత్ర, ఘనత కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘బ్రెయిన్ డెడ్’ స్థితికి చేరుకున్నదని ఇందుమూలముగా ప్రకటించడమైనది. కాలూ, చేయి కదిపే పరిస్థితి లేదు. అవయవ దానమొక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా తోస్తున్నది. ‘పరోపకారార్థ మిదం శరీరం’ అనే ఆర్యోక్తిని పాటించడం విఖ్యాత కాంగ్రెస్ పార్టీకి విశిష్టమైన ముగింపు అవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్లినిక్ టెస్టులన్నీ కాంగ్రెస్ పార్టీ నిస్తేజాన్ని నిర్ధారించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు ప్రధానమంత్రుల్ని పార్లమెంట్కు గెలిపించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెహ్రూ, ఇందిర, శాస్త్రి, రాజీవ్లు యూపీ నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రధాని పదవిని చేపట్టకపోయినా, అనధికారికంగానే పదేళ్లు ప్రభుత్వ చక్రం తిప్పిన సోనియా గాంధీ కూడా యూపీ నుంచే లోక్సభ సభ్యులయ్యారు. వీళ్లంతా కలిసి సుమారు యాభయ్యేళ్లపాటు ఈ దేశాన్ని పరిపాలించారు. అటువంటి రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితం రెండున్నర శాతం ఓట్లు. రెండు సీట్లు. నెహ్రూ – గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ సర్వశక్తులూ ఒడ్డి, చెమటను ధారపోసి తిరిగితే గిట్టుబాటైన ఓట్లివి. పోటీ చేసిన 97 శాతం సీట్లలో డిపాజిట్ గల్లంతయింది. ఆ గెలిచిన రెండు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలేదు. రాంపూర్ఖాస్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆరాధనా మిశ్రా తండ్రి ప్రమోద్ తివారీ.. ములాయం సింగ్కు మంచి మిత్రుడు. తన స్నేహితుని కుమార్తెను గెలిపించడం కోసం ములాయం సలహాపై అక్కడ ఎస్పీ పోటీ పెట్టలేదు. వీరేంద్ర చౌధరి అనే మరో కాంగ్రెస్వాది గెలిచిన ఫరెందా నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే ఎస్పీ ఒక బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలి, సంజయ్గాంధీ, రాజీవ్గాంధీ, రాహుల్గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేఠీ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ పదింటిలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అమేఠీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అమేఠీ రాజావారు సంజయ్సింగ్ ఒక రేప్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఎస్పీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఉత్తరాఖండ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నెలకొని ఉన్నది. ఒకే సంవత్సరంలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన అప్రతిష్ఠను కూడా ఆ పార్టీ బోనస్గా మూటగట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ప్రతిపక్ష పార్టీ అవలీలగా గెలవాల్సిన సన్నివేశం ఇది. కానీ అధికార పార్టీయే అవలీలగా గెలిచింది. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది. అధికారంలో ఉన్న పంజాబ్లో 33 శాతం జనాభా ఉన్న దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి కూడా కాంగ్రెస్ చేతులెత్తేసింది. అక్కడ బీజేపీ వంటి బలమైన పార్టీ ప్రధాన పోటీదారు కాకపోయినా, శిరోమణి అకాలీదళ్ బలహీనపడినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందలేకపోయింది. అర్థబలం, అంగబలం లేని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ చీపురు కట్టతో కాంగ్రెస్ అతిరథ మహారథులందర్నీ ఊడ్చిపారేసింది. గెలవడానికి అనుకూల పరిస్థితులున్న గోవాలోనూ అది చతికిలపడింది. మణిపూర్లో ప్రధాన పార్టీ స్థాయి నుంచి తోక పార్టీ స్థాయికి దాని పలుకుబడి క్షీణించింది. ఇప్పుడు కేవలం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 36 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో జూనియర్ పార్ట్నర్గా ఆ పార్టీ ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇంత దీన పరిస్థితుల్లో ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించడం అనివార్యమవుతుందనే భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొని ఉన్నది. అదే జరిగితే పండిత్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన మొనగాడుగా నరేంద్ర మోదీ పేరు చరిత్రలో రికార్డవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ మూడుసార్లు అధికారంలోకి తెచ్చినప్పటికీ మధ్యలో ఒక ఓటమి వలన ఆమె హ్యాట్రిక్ మిస్సయ్యింది. ఆమె చనిపోయి సానుభూతి వెల్లువతో మరోసారి పార్టీని గెలిపించింది. అందువల్ల ఆమె ఖాతాలో నాలుగు విజయాలను వేయవచ్చు. వరుస పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని ఒక నిష్క్రియాపరత్వం, పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని ఒక విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. అన్ని రాష్ట్రాల్లోనూ దాని ఉనికి ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం నాలుగు వేలమంది శాసనసభ్యులుంటే ఆ పార్టీ గుర్తుపై గెలిచినవారు ఇప్పటికీ 700 మంది ఉన్నారు. మొత్తం శాసనసభ్యుల్లో ఇది 17.5 శాతం. బీజేపీ తరఫున 1300 (32.5%) మంది ఉన్నారు. యాభై శాతం మంది ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ నిస్తేజమవుతున్న నేపథ్యంలో అది కనుమరుగవడం వల్ల ఏర్పడుతున్న శూన్యాన్ని ఎవరు భర్తీ చేస్తారు? భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యామ్నాయమవుతారు? కాంగ్రెస్ మిగిల్చిన శూన్యాన్ని కేజ్రీలు, బెనర్జీలు పూరించగలరా? కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయమవుతుందా? సాధారణ ఎన్నికలు రెండేళ్ల దూరం మాత్రమే ఉన్న ఈ సమయంలో ఈ రకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మధ్యేవాద పార్టీగా పరిణామం చెందింది. నెహ్రూ, ఇందిరల కాలంలో కొంత లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్గానూ, పీవీ నరసింహారావు కాలం నుంచి కొంత రైట్ ఆఫ్ ది సెంటర్గానూ సందర్భానికి తగినట్టు ఒదిగిపోగల సరళతను ఆ పార్టీ అలవరచుకున్నది. భారతీయ జనతా పార్టీ దాని స్వభావరీత్యా కచ్చితమైన రైటిస్టు పార్టీ. మితవాద, మతవాద పార్టీ. ఈ విధానాలతో విస్తృతస్థాయి మద్దతు కష్టం కనుక వాజపేయి ప్రధానిగా ఉన్నకాలం నుంచి కొంత ఉదారవాద ముసుగును ధరిస్తున్నది. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైట్ ఆఫ్ ది సెంటర్గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని కీలక విషయాల్లో అది ఫక్తు రైటిస్టు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నది. ‘బ్యాక్ టూ ది బేసిక్స్’ను ఆశ్రయిస్తున్నది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత రాజ్యాంగం హామీ పడిన సెక్యులర్, ఫెడరల్ స్వభావాల విషయంలో బీజేపీకి భిన్నాభిప్రాయాలున్నాయి. లౌకికత్వం నుంచి హైందవీకరణ వైపు దాని అడుగులు పడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మితిమీరిన కేంద్రీకరణ వైపు దాని ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్గానో, రైట్ ఆఫ్ ది సెంటర్గానో, సెంట్రిస్టుగానో వ్యవహరించే ఒక గట్టి జాతీయ ప్రత్యామ్నాయం లేకపోతే బీజేపీ తన మౌలిక విధానాలవైపు పయనించే అవకాశం ఉన్నది. వేలాది రకాల ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆరాధనా పద్ధతులు, ఆహార విహారాలు సహజీవనం చేసే మన బహుళ జీవన వ్యవస్థలో ఆ పయనం కల్లోలానికి కారణమవుతుంది. కనక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తప్పనిసరి. అందుకోసం కాంగ్రెస్ ఖాళీని పూరించడం ఒక చారిత్రక అనివార్యత. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ లాంటి వేదిక బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతుందా? అసాధ్యం. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రజలు ఒక బలమైన ప్రభుత్వాన్నే కోరుకుంటారు తప్ప కలగూరగంపను ఆదరించే ప్రసక్తే ఉండదు. పోనీ, కాంగ్రెస్ పార్టీని ముందుపెట్టి దాని వెనక ప్రాంతీయ, లౌకిక పార్టీలు నిలబడితే?... కాంగ్రెస్ నాయకత్వంపై రాయ్బరేలి, అమేఠీ ప్రజలకే నమ్మకం లేదు, ఇక దేశ ప్రజలెట్లా నమ్ముతారు? నెహ్రూ – గాంధీ కుటుంబాన్ని పక్కనపెట్టి మిగిలిన కాంగ్రెస్ను ముందుకు నడిపితే?... మిగిలిన కాంగ్రెస్ రాష్ట్రానికో ప్రాంతీయ పక్షంగా విడిపోయే అవకాశం ఉంటుంది. అందరినీ కలిపి ఉంచే ఉమ్మడి స్ఫూర్తి ఏమీ మిగలదు. మరి కిం కర్తవ్యం? నరేంద్ర మోదీ కత్తికి ఎదురుండదా? చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంటుందా? చరిత్రకు కొన్ని అనివార్య పరిస్థితులను కల్పించే లక్షణమున్నది. అటువంటి పరిస్థితుల్లో అనూహ్యమైన ప్రత్యామ్నాయాలు, పార్టీలు ముందుకు రావచ్చు. మన కళ్ల ముందున్న జనతా పార్టీ అనుభవమే ఇందుకు గొప్ప ఉదాహరణ. దేశంలో ఎమర్జెన్సీ విధించే నాటికి జనతా పార్టీ లేదు. ప్రతిపక్ష నాయకులందర్నీ ఇందిరమ్మ ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఎల్కే అద్వానీ, భైరాన్సింగ్ షెఖావత్, అశోక్ మెహతా, చంద్రశేఖర్, మధు దండావతే, బిజూ పట్నాయక్, పీలూ మోదీ, రాజ్నారాయణ్, చరణ్సింగ్ వగైరా వివిధ పక్షాల నేతలంతా రోహటక్ జైల్లో ఉన్నారు. అదే విధంగా అన్ని జైళ్లలోనూ వివిధ పక్షాల నాయకులు ఏడాది పైగా సహజీవనం చేశారు. వీళ్లంతా మాట్లాడుకోకుండా ఉంటారా? కానీ, వేర్వేరు పార్టీల వాళ్లంతా ఒకే పార్టీగా మారుతారని ఊహించని ఇందిర ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ఎన్నికలను ప్రకటించారు. భారతీయ జనసంఘ్, సంస్థా కాంగ్రెస్ (పాత కాంగ్రెస్), భారతీయ లోక్దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ కలిసి జనతా పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి జగ్జీవన్రామ్, బహుగుణల నాయకత్వంలో చీలిపోయిన సీఎఫ్డీ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఒక ప్రభంజనంలా ఎన్నికల ఫలితాలొచ్చాయి. కేంద్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ‘విజయేందిర’గా, ‘అపర దుర్గ’గా ప్రసిద్ధికెక్కిన మహా నాయకురాలు స్వయంగా రాయ్బరేలీలో ఓడిపోయారు. అధికారంలో ఉన్నవారు నిరంకుశ పాలన వైపు అడుగులు వేసినప్పుడు, రాజ్యాంగబద్ధ పాలన నుంచి పక్కకు తొలగినప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ రూపం తోసుకొస్తుందని చెప్పడానికి జనతా ప్రయోగం ఒక పాఠం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ! జనతా ప్రయోగం విఫలం కాలేదా? మూడేళ్లలోనే ఆ పార్టీ విచ్ఛిన్నం కాలేదా? అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. నిజమే! కానీ అది తన తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చింది. నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. భవిష్యత్తులో ఒక బలీయమైన శక్తిగా ఎదగనున్న భారతీయ జనతా పార్టీకి పురుడు పోసింది. రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పార్టీలను నడపడం ఒక ఆర్ట్! యుద్ధకళ! ప్రపంచ చరిత్రలో అనేకమంది విజేతలు ఈ ఐక్యపోరాటాల నుంచే ఉద్భవించారు. బీజేపీయే అందుకు ఒక ఉదాహరణ. జనసంఘ్ పేరుతో ఉన్నప్పుడు భారత రాజకీయాల్లో అదొక అంటరాని పార్టీ. దాని హిందూత్వ ఎజెండా కారణంగా ఇతర పార్టీల వారు జనసంఘ్తో వేదికను కూడా పంచుకునేవారు కాదు. 1967లో మొదటిసారిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా రామ్మనోహర్ లోహియా చొరవతో చాలా రాష్ట్రాల్లో యునైటెడ్ ఫ్రంట్లు ఏర్పడ్డాయి. వాటిలో జనసంఘ్ కూడా చేరటానికి లోహియా కారకుడయ్యాడు. ఫలితంగా జనసంఘ్ విస్తృతి పెరిగింది. జనతా పార్టీ విచ్ఛిన్నమయ్యే నాటికి అందులో చేరిన మిగిలిన పార్టీలు బలహీనపడ్డాయి. భారతీయ జనతా పార్టీ పేరుతో జనసంఘ్ కొత్త అవతారం ఎత్తింది. ఉమ్మడి పార్టీలోని ఇతర పార్టీల వారు, తటస్థుల చేరికతో బీజేపీ బలపడింది. పార్టీ నాయకత్వం అనుసరించిన సమయానుకూల ఎత్తుగడలు బీజేపీని బలంగా తీర్చిదిద్దాయి. స్వతంత్ర పార్టీ, సంస్థా కాంగ్రెస్, సోషలిస్టు పార్టీ, భారతీయ లోక్దళ్లు గల్లంతయ్యాయి. చైనాలో చాంగ్కైషేక్ నాయకత్వంలో కుమింటాంగ్ పార్టీ ప్రభుత్వానికీ, మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులకూ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆ దేశంపై జపాన్ దురాక్రమణ జరిగింది. జపాన్కు వ్యతిరేకంగా కుమింటాంగ్తో ఐక్య సంఘటనకు మావో సిద్ధపడ్డాడు. జపాన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలోనే మావో ఎత్తుగడల ఫలితంగా అనతికాలంలోనే చైనా కమ్యూనిస్టుల హస్తగతమైంది. తైవాన్కు పారిపోయాడు చాంగ్కైషేక్. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఖాళీని భర్తీ చేయడానికి వివిధ పార్టీలు యునైటెడ్ పార్టీగా లేదా ఫోరమ్గా ఆవిర్భవించే పరిస్థితులు ఏర్పడవని చెప్పలేము. కొన్ని ప్రాంతీయ, లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు ఇందులో తాత్కాలికంగా విలీనం కాబోవనీ చెప్పలేము. అజేయుడైన భీష్మాచార్యుని పడగొట్టడానికి కారణభూతుడైన శిఖండి జన్మ ఎత్తడం కోసం తనను తాను దహనం చేసుకున్న అంబ మాదిరిగా, పునర్జన్మ ఎత్తడం కోసం దహనమయ్యే ఫీనిక్స్ పక్షుల్లా రాజకీయ పక్షాలు సిద్ధపడే రోజులు వస్తాయేమో! ఆ ఐక్య వేదిక ద్వారా లబ్ధి పొంది ఒక బలమైన రాజకీయ శక్తి బీజేపీ మాదిరిగా ఆవిర్భవిస్తుందేమో! ఎదురు చూడాలి. ఇప్పటికైతే ‘రాజు మరణించాడు. రాజు చిరకాలం జీవించాలి’ అని ప్రకటిద్దాం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది కూడా యుద్ధమే... నరమేధమే!
ఇక్కడ జరుగుతున్నది కూడా యుద్ధమే. మరింత భయానకమైనది. కుట్రపూరితమైనది. దురాక్రమణపూరిత యుద్ధం. అన్యాయమైన దాడి. గోబెల్స్ ఇన్వేజన్. రష్యావాళ్ల – టీ–90 ట్యాంకులు కక్కుతున్న మృత్యు కాలుష్యం కంటే ఈ ప్రచార యుద్ధ కాలుష్యం మరింత ప్రమాదకరమైనది. కలష్నికోవ్ రైఫిళ్ల రక్తదాహం కంటే ఇక్కడి అధికార దాహపు కుట్ర మరింత భయంకరమైనది. ఏపీ వేరియంట్ గోబెల్స్ వార్హెడ్ల విలయ విధ్వంసక శక్తి ముందు రష్యన్ వ్యాక్యూమ్ బాంబుల మారణహోమం దిగదుడుపే! యాభయ్యేళ్ల కింద లాటిన్ అమెరికాలో సీఐఏ నడిపిన కుట్ర నాటకం గుర్తుకొస్తున్నది. చిలీ దేశంలో అమెరికా సంపన్నుల ఆస్తులు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సందర్భం. ఆ దేశానికి డాక్టర్ సాల్వెడార్ అలెండీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతనొక సోషలిస్టు. చిలీ జీవనాడుల్ని గుప్పెట్లో పెట్టుకున్న అమెరికన్ల ఆస్తుల్ని జాతీయం చేస్తాడేమోనని అమెరికా శంకించింది. సీఐఏను రంగంలోకి దించింది. డాక్టర్ అలెండీని అంతం చేసే కుట్రను సదరు పంచమాంగదళం విజయవంతంగా పూర్తిచేసింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఒక రాజధాని జూదం నడుస్తున్నది. ఇందులో తాము ఒడ్డిన పందెపు సొమ్మును పదింతలు చేసుకోవాలని పెత్తందార్లు తహతహలాడుతున్నారు. కుట్ర నాటకాన్ని రచించారు. అదింకా ప్రదర్శితమవుతున్నది. ఈ రెండు నాటకాల్లో ఏది ఎక్కువ కళాత్మక విలువలు కలిగి ఉన్నదో తేల్చడానికి ఒక తులనాత్మక అధ్యయనం తప్పనిసరి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దురాక్రమణ యుద్ధం గురించి... ఎవరి మీద ఎవరు జరుపుతున్న దాడి ఇది? రూపంలో అన్నీ రాజకీయ పాత్రలే కనిపిస్తాయి. కానీ, సారంలో సామాజిక శక్తుల సంఘర్షణ ధ్వనిస్తున్నది. అమలులో ఉన్న అన్యాయమైన రాజకీయ, సామాజిక విలువలకు ప్రత్యామ్నా యంగా సరికొత్త విలువలు మొలకెత్తడానికి సిద్ధపడుతున్నాయి. చీకట్లో మగ్గుతున్న సామాజిక శక్తులు వెలుతురు ద్వారాలను తోసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. తమసోమా జ్యోతిర్గమయ మంత్రాన్ని ఆ శక్తులు జపిస్తున్నాయి. పాత విలువల పల్లకీ పెత్తందార్లకు ఈ పరిణామం రుచించలేదు. కత్తులు దూస్తున్నారు. కొత్త విలువల నవజాత శిశువు పాల బుగ్గపై రక్త సంతకాన్ని చెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2019 సంవత్సరం ఒక మూలమలుపు కాలం. మేలిమలుపు కాలం కూడా! అప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొన్ని కీలక జీవన రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతకుముందు రెండున్నర, మూడు దశాబ్దాల కాలం నుంచి విద్యారంగంలో ధనిక – పేద విభజన స్థిరపడిపోయింది. కుల మత ప్రాంత తేడాలు లేకుండా పేదలంటే పేదలే. ధనికులంటే ధనికులే! ఈ నడమంత్రపు రిఫార్మిస్టు కాలంలో ఇంగ్లీషులో చదువుకున్న వారికి దేశదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కూడా ఉద్యోగాలు దొరికాయి. అందుకని ధనవంతుల పిల్లలంతా ప్రైవేట్లో ఇంగ్లీషు చదువు కొనుక్కొని లాభపడ్డారు. ఓమాత్రపు స్థోమత కలిగిన మధ్య తరగతి తల్లిదండ్రులు ధనవంతుల్ని అనుసరించి అప్పుల పాలయ్యారు. కూడుపెట్టని తెలుగు మీడియం చదువుతో, వసతుల్లేని బడుల్లో పేద పిల్లల భవిష్యత్తు బలైపోయింది. ఒక తరానికి తరం మరో రెండు మూడు తరాలపాటు కోలుకోలేని స్థాయి వెనకబాటుతనానికి గురైంది. ఈ అన్యాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం సరిచేసింది. అందరికీ నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ బోధనా విద్యను అందజేసే బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించింది. ఇందులో కుల మత ప్రాంత వివక్ష లేదు. ధనిక, పేద తేడా లేదు. పిల్లలందరినీ ప్రభుత్వం తన ఒడిలోకి చేర్చుకున్నది. కుల మత జాతి అంతస్తు భేదం లేని నవతరం నిర్మాణానికి అంకురార్పణ చేసింది. గడచిన మూడు దశాబ్దాల రిఫార్మిస్టు కాలం ప్రజా వైద్య రంగానికి ఒక పీడ కల. అంతకుముందు ఆధునిక వైద్యం పెద్దగా విస్తరించకపోయినా కనీసం సంప్రదాయ వైద్యమైనా అందరికీ అందుబాటులో ఉండేది. ఊరూరా ఆర్ఎంపీ, పీఎమ్పీ వైద్యులుండేవారు. సాధారణ స్థాయి రుగ్మతలన్నీ ఊళ్లోనే నయమయ్యేవి. కొంచెం పెద్ద జబ్బులకు టౌన్ హాస్పిటళ్లకు వెళ్లినా ఖర్చు అలవికాని భారంగా మాత్రం ఉండేది కాదు. కార్పొరేట్ వైద్యం ప్రవేశించడంతో పరిస్థితులు మారిపోయాయి. గ్రామీణ వైద్యుల్ని కార్పొరేట్ ఏజెంట్లుగా మార్చాయి. చిన్నచిన్న జబ్బులకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద రోగం వచ్చిందంటే ఇల్లూ – వాకిలి అమ్ముకోవడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. ప్రజారోగ్య రంగంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతమైన సంజీవని వంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠం చేస్తున్నారు. ఈ పరిధిలో ఇద్దరు డాక్టర్లుంటారు. ఒక డాక్టర్ ఇల్లిల్లూ తిరుగుతుంటే, ఒక డాక్టర్ వైద్య కేంద్రంలో ఉంటారు. అందరికీ ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉండే వ్యవస్థ ఏర్పడుతున్నది. వైద్యుడు లేని ఊళ్లో ఉండొద్దన్నాడు సుమతీ శతకకారుడు. వైద్యుడు లేని ఊరే లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా ఆస్పత్రు లను కార్పొరేట్కు దీటుగా మార్చుతున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రభుత్వరంగంలోనే అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తగా ప్రభుత్వమే 16 మెడికల్ కాలేజీలనూ, అనుబంధంగా ఆస్పత్రులనూ నిర్మిస్తున్నది. ఏకబిగిన ఇన్ని కాలేజీల నిర్మాణం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. పేదవాడికి రోగం రాకడ... ప్రాణం పోకడ అనే విషాద అధ్యాయానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలకబోతున్నది. ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయరంగం వెన్నెముక. జనాభాలో నూటికి 65 మంది ఈ రంగం మీద జీవిస్తున్నారు. కానీ జీఎస్డీపీలో దాని వాటా 30 శాతం మాత్రమే. అరవై అయిదు శాతం మంది శ్రమశక్తి విలువ 30 శాతం కిమ్మత్తు మాత్రమే చేస్తున్న నిర్హేతుక మార్కెట్ వ్యవస్థ రాజ్యం చేస్తున్నది. రైతు ఉత్పత్తికి న్యాయమైన ధర దక్కకపోవడం, పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం అనే రెండు అంశాలు వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాలు. దీనికి తోడు నూటికి ఎనభై మంది రెండున్నర ఎకరాల కంటే తక్కువ కమతం కలిగిన చిన్న సన్నకారు రైతులు. గడిచిన మూడు దశాబ్దాల కాలం భారతదేశ వ్యవసాయ రంగానికి శాపగ్రస్థ కాలం. లక్షలాది పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్న చేటు కాలం. ఈ పరిస్థితులను కల్పించిన రాజకీయ నాయకత్వం వ్యవసాయం దండగ అనే అభిప్రాయాన్ని వ్యాపింపజేసింది. చిన్న రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, బడా సంస్థలకు కట్టబెట్టాలనే దురుద్దేశంతో సృష్టించిన అభిప్రాయం ఇది. ఈ వాస్తవిక పరిస్థితులను గమనంలోకి తీసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించింది. చిన్నరైతులు స్వయంపోషకంగా ఎదగగలిగే సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నది. ఈ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక విప్లవాత్మక ముందడుగు. ఈ కేంద్రాల వల్ల నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు రైతు గడపలోకే వస్తున్నాయి. సలహాలు, సూచనలు పొలం గట్టు దగ్గరకే వస్తున్నాయి. గడచిన సంవత్సరం పండించిన ధాన్యంలో మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేసిందీ, రైతుకు కుటుంబ అవసరాల కోసం మినహాయించుకున్నదీ పోను మిగిలిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసిందీ ప్రభుత్వమే. వ్యవసాయరంగ సంక్షోభ కారకాలైన రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేసింది. అర్బీకే సెంటర్లు నిలదొక్కుకున్న తర్వాత∙మరిన్ని సత్ఫలితాలు రాబట్టే అవకాశం ఉన్నది. వెనుకబడిన, పేద వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించడానికి దోహదపడే ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సంస్కరణలు ప్రారంభించింది. ఈ సంస్కరణలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగల సామర్థ్యం కలిగినవి. వీటితోపాటు ఈ వర్గాల ప్రజలూ, మహిళలూ సాధికారత శక్తిని సంతరించుకునేటందుకు కూడా ప్రభుత్వం బాటలు వేస్తున్నది. సాధికారతతోనే ఆత్మగౌరవం సిద్ధిస్తుంది. ఆత్మగౌరవంతోనే మనిషికి సార్ధకత సిద్ధిస్తుందని వైఎస్ జగన్ విశ్వాసం. అందు కోసమే అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ మంత్రివర్గంతో సహా అన్నిచోట్లా సింహభాగం పదవులను వెనకబడిన వర్గాలు, స్త్రీలకు కేటాయిస్తున్నారు. పేదవర్గాల ప్రజలు నిలదొక్కుకోవడానికి, సాధికారతను సంతరించుకోవడానికి, ఆత్మగౌరవంతో జీవించ డానికి విప్లవాత్మక పథకాలు రచించిన కారణంగానే జగన్ ప్రభుత్వంపై ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. ఇది కుట్ర పూరిత యుద్ధం. ఇది దుష్ప్రచార యుద్ధం. ఇది తిమ్మిని బమ్మిగా చూపే కనికట్టు యుద్ధం. అత్యాధునిక యుద్ధ మిసైళ్లకు దీటైన గజకర్ణ గోకర్ణ టక్కుటమారాది మాయా మారణాయుధా లను ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్నారు. ఈ యుద్ధం చేస్తున్నది ఎవరు? వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా నష్టపోయే స్వార్థపూరిత శక్తులు. వాటి రాజకీయ రూపమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, దాని అధిపతి చంద్రబాబు నాయ కత్వంలో యుద్ధం చేస్తున్నారు. విద్యారంగం నుంచి ప్రభుత్వం పెట్టుబడులను తగ్గించి పేద ప్రజల చదువును అటకెక్కించిన వారిలో ప్రముఖుడు చంద్రబాబు. ప్రైవేట్ విద్యను అందల మెక్కించి విద్యా వ్యాపారంలో నయా కుబేరుల సృష్టికి కారణ మైన నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వ వైద్యాన్ని శిథిలం చేసి వైద్య వ్యాపారానికి లంగరెత్తిన వారిలో కీలక వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండగని ప్రచారం సృష్టించిన ప్రవక్త ఆయన. సాగు రంగంలో నిత్యం వందలాదిమంది ప్రాణాలు కోల్పో తున్న సమయంలో ప్రైవేట్ రంగ ఫిడేలు వాయించిన అపర నీరో చక్రవర్తి చంద్రబాబు. ప్రపంచ బ్యాంకు జీతగాడుగా ఆయన సాధించిన అపఖ్యాతి నిరుపమానమైనది. బీసీ కులాల్లో పుట్టినవారు న్యాయమూర్తులుగా పనికిరారని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన ఏకైక రాజకీయవేత్త ఈ దేశంలో చంద్రబాబు ఒక్కరే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా ప్రెస్మీట్ లోనే ఈసడించుకున్న మహానాయకుడు కూడా ఈ దేశంలో ఆయన ఒక్కరే! ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని లింగవివక్షను బహిరంగంగా ప్రదర్శించిన పురుషాహంకారం ఆయన సొంతం. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు... ఇలా ఎందరో బలహీనవర్గాల ప్రజలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి ఆయన. పేదలు – మహిళల సాధికారతకు వారి ఆత్మగౌరవానికి చంద్రబాబు బద్ధ వ్యతిరేకి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు లుంటాయా? ప్రజలను కులాలవారీగా విభజించి రాజకీయం చేయడం చంద్రబాబు నైజం. పేదరికమే ప్రాతిపదికగా కులరహితమైన అభివృద్ధి పనులు చేపట్టిన జగన్ ప్రభుత్వం చర్యలను ఆయన ఎట్లా సహిస్తారు? అందుకే ఈ యుద్ధం జరుగుతున్నది. జగన్ ప్రభుత్వ సాధికారతా యజ్ఞం వల్ల నష్టపోయే గుప్పెడుమంది సంపన్నులు వారి సర్వశక్తులనూ ఒడ్డి బాబుకు సహకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక విషప్రచారాన్ని ప్రభుత్వంపై గురిపెట్టి వదులుతున్నారు. ఈ సంక్లిష్ట సన్ని వేశంలో కొన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చే లీకులు, న్యాయస్థానాల తీర్పులను కూడా ఈ శక్తులు ఆయుధాలుగా చేసుకుంటున్నాయి. జనం మదిలో అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తడానికి కారణ మవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలోనూ అనేక కామన్సెన్స్ ప్రశ్నలు, వాటిని సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలపై సందేహ నివృత్తి అవసరం. 1) వైఎస్ వివేకానందరెడ్డి 2010లో షమీమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికో బాబు పుట్టాడు. ఆ బాబుకు తన ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పడం, తన వారసుడిగా ప్రకటిస్తానని కూడా చెప్పడాన్ని మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు (చిన్న బావమరిది) నర్రెడ్డి రాజ శేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నది బహిరంగ రహస్యం. బెంగుళూరు భూసెటిల్మెంట్లో వచ్చే మొత్తంలో రెండో కుటుంబానికి వాటా ఇస్తానని చెప్పిన కొద్దిరోజులకే ఆయన హత్య జరిగింది. సీబీఐ దర్యాప్తులో ఈ కుటుంబ కోణం ఎందుకో మిస్సయ్యింది. 2) వివేకా మరణించిన విషయం 2019 మార్చి 15 ఉదయం మొదట గుర్తించిన వ్యక్తి ఆయన పీఏ కృష్ణారెడ్డి. ఆ విషయాన్ని వెంటనే హైదరాబాద్లో ఉన్న వివేకా భార్య, కుమార్తె, అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు. మృతదేహం వద్ద లభించిన ఉత్తరాన్ని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. ఉత్తరంలో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి కొట్టాడని రాసి ఉంది. ఆ విషయాన్ని వారితో కృష్ణారెడ్డి చెప్పి ఉండాలి కదా! ఉత్తరంలో ఉన్న విషయాల ఆధారంగా వివేకా హత్యకు గురయ్యారని ఆయన కుమార్తె, అల్లుడు గుర్తించి ఉండాలి కదా! ఆ సెల్ఫోన్ను, లేఖను పోలీసులకు స్వాధీనం చేయమని కృష్ణారెడ్డికి వారు చెప్పి ఉండాలి కదా! మరి కృష్ణారెడ్డి ఆ లేఖను గానీ, సెల్ఫోన్ను గానీ పోలీసులకు ఎందుకు స్వాధీనం చేయలేదు? మధ్యాహ్నం సునీత, నర్రెడ్డి వచ్చేంత వరకూ తన దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు? లేఖ విషయం తెలిస్తే ఆయన హత్య విషయం అక్కడికి వచ్చిన వారికీ, పోలీసులకూ తెలిసి ఉండేది. మృతదేహాన్ని ఎవరూ ముట్టుకొని ఉండేవారు కాదు. ఫింగర్ ప్రింట్స్ వంటి ఆధారాలు చెక్కు చెదరకుండా ఉండేవి. 3) వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డి (అల్లుడి అన్న) ఫోన్ చేసి చెప్పడంతో వివేకా అనుచరుడు ఇనాయతుల్లా అక్కడికి వెళ్లి మృతదేహాన్ని ఫోటోలు, వీడియో తీసి ఆయన వాట్సాప్ ద్వారా పంపించారు. అవి చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి అప్పటి టీడీపీ మంత్రి ఆదినారా యణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. గుండెపోటు థియరీని ఎవరు ప్రచారంలో పెట్టినట్టు? పైగా వివేకాకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఆది నారాయణరెడ్డికి ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? 4) సునీత, రాజశేఖరరెడ్డి మధ్యాహ్నానికి పులివెందుల చేరుకున్నారు. కృష్ణారెడ్డి దగ్గరున్న లేఖను, సెల్ఫోన్ను తీసుకున్నారు. అనంతరం సాయంత్రం దాకా తమ దగ్గరే ఎందుకు ఉంచు కున్నారు? పోలీసులకు స్వాధీనం చేసే లోపల ఏయే మెసేజ్లను డిలీట్ చేశారు. వాటిలో కొన్ని మెసేజిలను ‘సిట్’ పోలీసులు టెలికామ్ కంపెనీ ద్వారా తెలుసుకున్నారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా ఒక మహిళ నుంచి మెసేజిలు వచ్చా యని వెల్లడైంది. 5) మృతదేహం దగ్గరున్న రక్తపు మరకలను వివేకా పెద్దబావమరిది శివప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకే తుడి చేశానని నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. రక్తపు మరకలను తుడిచేయాలని శివప్రసాద్రెడ్డి ఎందుకు భావిం చాడు? 6) హత్య తర్వాత చాలారోజుల వరకు వివేకా కుమార్తె సునీత తమ కుటుంబ సభ్యులపై ఎటువంటి ఆరోపణలూ చేయలేదు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలనీ, అవినాశ్ను ఎంపీ చేయాలనీ చివరివరకూ తన తండ్రి పనిచేశారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ఎందుకు మాట మార్చారు? మొదట టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ ఆమె, ఇప్పుడెందుకు వారితో సఖ్యంగా ఉంటున్నారు? టీడీపీ, చంద్రబాబునాయుడు చేస్తున్న వాదననే ఇప్పుడామె ఎందుకు వల్లె వేస్తున్నారు? ప్రస్తుతానికి ఇవన్నీ శేషప్రశ్నలే! ఇక రాజధాని విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేననీ, అసెంబ్లీకి అధికారం లేదనీ చెప్పడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన తీర్పు. అమరావతిని రాజధానిగా నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. దానికి ప్రాతిపదిక తాను నియమించుకున్న నారాయణ కమిటీయే తప్ప కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కాదు. ప్రభుత్వాలు చట్టాలు చేయకుండా ఎలా నిరోధిస్తామని తొలుత పిటిషనర్లను ప్రశ్నించిన ధర్మాసనం తీరా అందుకు భిన్నమైన తీర్పును వెలువరించింది. చేతిలో నాలుగేళ్ల సమయం ఉన్నా రాజధాని ప్రాజెక్టును పట్టాలెక్కించడం బాబు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు దాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయాలనీ, నెల రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తవ్వాలనీ చెప్పడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వెల్లడ వుతున్నాయి. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకూ, రాజధాని ప్రాజెక్టుకూ ముడిపెట్టి సంక్షేమాన్ని స్వప్రయోజనం కోసం చేసే వ్యయమన్న భావన కలిగించడం కూడా ఉచితంగా లేదు. అమలవుతున్న చట్టాలపై విచారణ జరిగే సందర్భంలో ప్రభుత్వాలు వాటిని రద్దుచేస్తున్నట్టు ప్రకటిస్తే పిటిషన్లను మూసివేస్తున్నట్టు ప్రకటించడం న్యాయస్థానాలకు రివాజు. కానీ ఇక్కడెందుకో అలా జరగలేదు. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి నంత మాత్రాన రైతులకు హామీ ఇచ్చినట్టు అక్కడ రాజధాని నిర్మించి తీరాలనడం, భూముల్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించకూడదని అనడం సరికాదు. ఆ ప్రాజెక్టు అమలు చేయదల్చుకోనప్పుడు భూమిని మళ్లీ రైతులకు ఇవ్వమనడం వరకూ సబబు. ఆర్థిక కారణాలతో ప్రాజెక్టులు ఆపవద్దనడం, ఆర్థిక ఇబ్బందులకు సంబంధిం చిన ఆధారాలు ఇవ్వలేదు గనుక రాజధానిని పూర్తి చేసి తీరాలనడం పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడమే! హైకోర్టులు అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నిరుడు ఏప్రిల్లో సుప్రీంకోర్టులోని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్. నాగేశ్వరరావు, రవీంద్ర భట్ల ధర్మాసనం చెప్పింది. కరోనా కట్టడిలో ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఈ తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ, దాని ఆధ్వ ర్యంలో పనిచేసే నానాజాతి సమితి సభ్యులు చేస్తున్న యుద్ధంలో ఇప్పుడీ రెండు కొత్త శస్త్రాలు వాటి చేతికి దొరికాయి. రష్యా వాళ్లయినా అప్పుడప్పుడు తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటిస్తున్నారు గానీ, ఎన్నికలయ్యేంతవరకూ ఈ నానాజాతి సమితి తన యుద్ధాన్ని ఆపేలా లేదు. రాజకీయంగా ఈ యుద్ధం జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వం మీదనే కావచ్చు. కానీ అంతస్సారంలో ఇది ఒక సామాజిక విధ్వంస యుద్ధం. సాధికారత కోసం ఎదురు చూస్తున్న కష్టజీవుల మీద యుద్ధం. యుగయుగాల అణచివేతకు గురైన మహిళల హక్కుల మీద యుద్ధం. సామాజిక న్యాయ పోరాటాల మీద యుద్ధం. పేద వర్గాల ఆకాంక్షల మీద యుద్ధం. పేద లోగిళ్లలో మొగ్గ తొడుగుతున్న ఉన్నత చదువుల లక్ష్యాలను మొగ్గలోనే తుంచేసే అమానుష యుద్ధం. పూమొగ్గలను తుంచి తొక్కేసే మనుషుల్ని ఆ పువ్వులేమని శపిస్తాయో ‘పుష్పవిలాపం’ కావ్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి చెప్పారు. ‘‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో! అందమును హత్యచేసే హంతకుండ, మైలపడిపోయెనోయి! నీ మనుజ జన్మ!’’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మరో ప్రచ్ఛన్న యుద్ధ సైరన్!
దౌత్యనీతిలో భావోద్వేగాలకు తావు లేదంటారు. ఆ రంగం లోని ప్రవక్తలందరిదీ ఇదే మాట. ఈ రహస్యం తెలియకపోవడం వలన మనవాళ్లు చాలామంది ఉక్రెయిన్ యుద్ధంపై ఉద్రేక పడుతూ సోషల్ మీడియాను ఉడుకెత్తిస్తున్నారు. ఈ యుద్ధంపై భారత్ వైఖరి ఎలా ఉండాలన్న దాని గురించి మూడు నాలుగు స్రవంతులుగా చీలిపోయారు. లక్షలాది క్యూసెక్కుల ఆవేశం ఆ స్రవంతుల గుండా ప్రవహిస్తున్నది. కష్టకాలాల్లో మనకు అండగా నిలబడిన దేశం రష్యా. ఇప్పటికీ మన దేశ రక్షణకు ఆలంబన రష్యా. అణుపాటవ పరీక్ష చేసినప్పుడు ఐక్యరాజ్యసమితిలో మనకు వ్యతిరేకంగా ఓటేసిన దేశం ఉక్రెయిన్. కశ్మీర్ అంశంపై కూడా ఆ దేశానిది మనకు వ్యతిరేక వైఖరి. ఈ నేపథ్యంలో మనం స్పష్టమైన వైఖరి తీసుకుని మిత్రునికి అండగా నిలబడాలి కదా... ఇది ఒకటవ భావస్రవంతి! బలహీనునిపై బలవంతుని దౌర్జన్యం అమా నుషం. బలాఢ్యుడైన రష్యావాడు అర్భకుడైన ఉక్రెయిన్వాడిపై జరిపిన దండయాత్రను ఖండించాలనేది రెండో మానవీయ స్రవంతి! రష్యా, చైనాలతో కలిసి భారతదేశం కూడా ఒక కూటమిగా ఏర్పడి అమెరికా సామ్రాజ్యవాదులనూ, వారి ఏజెంట్లయిన ‘నాటో’ కూటమి దేశాలనూ ఆటాడించడానికి ఇదే సరైన అదను – ఇది ‘ఎర్ర’ సముద్రపు సూయెజ్ కాలువ ప్రవాహం! మన చదువుల దగ్గర్నుంచి కొలువుల దాకా, మాట్రిమోనియల్ కాలమ్స్ నుంచి పచ్చడి జాడీల దాకా మన జీవితాలతో ముడిపడిన దేశం అమెరికా. ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించడం మేలన్నది నాలుగవ డాలర్ కెనాల్! ఈ రకమైన జనచైతన్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెప్పలుగా పారుతున్నది. మంచిదే. నూరు పువ్వులు వికసించాలి. వెయ్యి ఆలోచనలు పోటీపడాలి. అధికారికంగా భారతదేశం ఇప్పుడు శరణుజొచ్చిన వ్యూహం – మౌనం. దౌత్యవర్గాలు ఇప్పుడు దీన్ని ‘వ్యూహాత్మక మౌనం’ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎవరీ మాటను కాయిన్ చేశారో తెలియదు కానీ చాలా సందర్భాల్లో భారత్ అవసరాలకు ఈ ‘వ్యూహాత్మక మౌనం’ సరిగ్గా సరిపోతున్నది. ఈ మౌనవ్యూహం మనకు వేదంతో పెట్టిన విద్య. ఇవ్వాళ్టిది కాదు. ఎవరి మోవిపై వాలితే మౌనమే మంత్రమగునో... వారే మునులు. ఆ ముని పరంపర నుంచి అత్యవసర సమయాల్లో ఆశ్రయించడానికి మౌనం, ధ్యానం అనే విద్యలు మనకు సంక్రమించాయి. మహాభారత యుద్ధకాలంలో ఉపఖండంలోని చాలా రాజ్యాలు అటు కౌరవుల పక్కనో, ఇటు పాండవుల పక్కనో చేరి యుద్ధంలో పాల్గొన్నాయి. ఏ పక్కనా చేరకుండా మౌనాన్ని ఆశ్రయించి, తటస్థంగా ఉండిపోయిన రాజ్యాలు కూడా చాలానే ఉన్నాయట! వీటికి ‘విబంధ రాజ్యాలు’ అనే పేరు భారతంలో ఉన్నదట! పండిత జవహర్లాల్ నెహ్రూ అలీనోద్యమాన్ని (Non-Aligned Movement) ప్రారంభించినప్పుడు తెలుగు పత్రికల్లో ఈ ‘విబంధ రాజ్యాల’ చర్చ జరిగిందట. అప్పట్లో ఆంగ్ల భాషలో ఉన్న ఏ కొత్త విషయాన్ని చెప్పవలసి వచ్చినా తెలుగులో అనువదించడానికి తంటాలుపడేవారు. ఇప్పటి మాదిరిగా ఆంగ్ల మాటల మీదనే తెలుగు తీర్థం చల్లి, యథాతథంగా వాడేసుకునే సాహసం అప్పట్లో చేసేవాళ్లు కాదు. ‘నాన్ అలైన్డ్ మూవ్మెంట్’ అనే మాటను ‘అలీనోద్యమం’గా నార్ల వెంకటేశ్వరరావు స్థిర పరిచారు. దీనికి ‘ఆంధ్రపత్రిక’ వారు అంగీకరించలేదు. మహా భారతం స్ఫూర్తితో ‘విబంధ రాజ్య ఉద్యమం’గా వ్యవహరిద్దా మన్నారు. నార్ల శిబిరం ఒప్పుకోలేదు. కాలక్రమంలో ‘ఆంధ్రపత్రిక’ వాదన వీగిపోయింది. ‘అలీనోద్యమం’ అనే మాట నిలబడిపోయింది. ఈ మాట నెహ్రూ గారితో ముడిపడి ఉన్నందువలన, నెహ్రూ ఇంటి మీద వాలిన కాకి కనిపించినా ఇప్పుడు కాల్చివేసే పరిస్థితులున్న కారణంగా– మన ప్రస్తుత వైఖరి అలీనోద్యమ వారసత్వంగా చెప్పే సాహసం ఎవరికీ లేదు. పైగా ఏక ధ్రువ ప్రపంచంలో అలీనమేముంటుంది... విలీనం తప్ప అనే వాదన కూడా ఉన్నది. వ్యూహాత్మక మౌనం కాకుండా ఈ సంక్షోభంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించాలంటే ఏం చేయాలి? ఒకటవ ప్రత్యామ్నాయం – మిత్రధర్మంగా రష్యాను సమర్థించడం! ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేసినట్టు ఇండియా మీద చైనా చేయడానికి వారికి చాలా సాకులున్నాయి. లద్దాఖ్లో గానీ, అరుణాచల్ప్రదేశ్లో గానీ నిర్దిష్టమైన అంగీకృత సరిహద్దులు ఇప్పటికీ లేవు. లద్దాఖ్లో చైనా వాళ్లు మరిన్ని గల్వాన్ ఘర్షణలకు దిగితే రష్యా దండయాత్రను సమర్థించిన నోటితో చైనాకు వ్యతిరేకంగా ఏమని పిలుపునివ్వగలం? రెండో ప్రత్యా మ్నాయంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉక్రెయిన్కు బాసటగా నిలవడం! ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా ఏ కూటమిలోనైనా చేరే స్వేచ్ఛ ఉక్రెయిన్కు ఉన్నదని మనం గట్టిగా వాదిస్తే మనదేశ ప్రజాస్వామ్య పిపాసను లోకం మెచ్చుకోవచ్చు. కానీ రేప్పొద్దున భారత్ వల్ల తన భద్రతకు ముప్పు ఉన్నదని ప్రకటించి నేపాల్ దేశం చైనా సైనిక కూటమిలో చేరి మన కాశీకి, కలకత్తాకు గురిపెట్టి సరిహద్దుల్లో మిసైళ్ళను పేర్చితే? లోకానికి ఫిర్యాదు చేసే అవకాశం భారత్కు మిగులుతుందా? కనుక ఉక్రె యిన్ సంక్షోభంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం సరైనదిగానే భావించాలి. ప్రధానమంత్రిగా మోదీ ఉన్నా, లేక పీలూమోదీ వున్నా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ వ్యక్తిత్వంపైన కూడా చాలా రకాల కథనాలు వస్తున్నాయి. జార్ చక్రవర్తులకున్నంత అహంకారం, అత్యాశ ఉన్నాయనీ, సోవియట్ యూనియన్ పతనం తర్వాత కోల్పోయిన భూభాగాలను మళ్లీ సాధించాలనే విస్తరణ కాంక్ష అతనికున్నదనీ చాలా ప్రచారం జరిగింది. ఉక్రెయిన్పై జరిగిన దాడిని కూడా ఈ కోణంలో నుంచి చూసే వారున్నారు. జరిగిన పరిణామాలను రష్యా వైపు నుంచి కూడా చూస్తేనే సమస్య సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది. 1991లో సోవియట్ యూనియన్ పతనమైంది. రష్యాతోపాటు మరో 14 రిపబ్లిక్లు సోవియట్ యూనియన్లో అంతర్భాగంగా ఉండేవి. ఇవన్నీ స్వతంత్ర దేశాలుగా ప్రకటించు కున్నాయి. వీటిలో కజక్స్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్ఘిజిస్థాన్లు సెంట్రల్ ఆసియా రిపబ్లిక్లు. యూరప్, పశ్చిమాసియా ఖండాలను విభజించే కాకేసస్ పర్వత శ్రేణుల సమీపంలో జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్ రిపబ్లిక్లున్నాయి. రామాయణంలో కైకేయి పుట్టిన కేకయదేశం ఇదేనని మనవాళ్ల నమ్మకం. మిగిలిన ఆరు రిపబ్లిక్లు రష్యాకు పశ్చిమ సరిహద్దుగా పైన బాల్టిక్ తీరం నుంచి కింద బ్లాక్సీ తీరం వరకు విస్తరించి ఉన్నాయి. బాల్టిక్ తీరంలో లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, నల్ల సముద్ర తీరంలో మాల్డోవా, ఉక్రెయిన్, రెండు తీరాల నడుమ మైదాన సరిహద్దుగా బెలారూస్లున్నాయి. పశ్చిమ యూరప్ నుంచి చూస్తే రష్యాకు ఈ ఆరు రిపబ్లిక్లూ ఒక కవచంలాగా ఉంటాయి. వాస్తవానికి ఇది రెండో కవచం. సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు ఈ కవచంపైన ఎనిమిది తూర్పు యూరప్ దేశాలతో కూడిన మరో రక్షణ కవచం ఉండేది. అమెరికా – పశ్చిమ యూరప్ల ‘నాటో’ సైనిక కూటమికి దీటుగా ఈ ఎనిమిది తూర్పు యూరప్ దేశాలతో ‘వార్సా ప్యాక్ట్’ పేరుతో సోవియట్ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నది. తూర్పు జర్మనీ, పోలండ్, చెకోస్లోవేకియా (ఇప్పుడు చెక్, స్లోవేకియా), హంగెరీ, రుమేనియా, యుగోస్లావియా (ఇప్పుడు స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా, కొసావో, మాంటెనిగ్రో), బల్గేరియా, అల్బేనియాలు ఈ ‘వార్సా ఒప్పందం’లో సభ్యదేశాలు. సోవియట్ యూనియన్ పతనానికి ముందూ వెనక ఈ ఎనిమిది దేశాల్లో తిరుగుబాట్లు తలెత్తి, కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. బెర్లిన్ గోడ బద్దలై తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలో విలీనమైంది. మిగిలిన ఏడు దేశాలకు కూడా అమెరికా ఆధిపత్యంలోని ‘నాటో’ కూటమి సభ్యత్వాన్నిచ్చింది. ఈ రకంగా రష్యా బాహ్యకవచం తెగిపడింది. 1990లో పతనా వస్థలో ఉన్న సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి జేమ్స్ బేకర్కు మధ్య చర్చలు జరిగాయి. ‘నాటో’ కూటమిని ఈ ఎనిమిది దేశాలకు విస్తరించినట్లయితే రష్యా భద్రతకు ప్రమాద మని గోర్బచెవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక్క అంగుళం మేరకు’ కూడా ‘నాటో’ కూటమిని తూర్పు వైపునకు విస్తరించ బోమని, కూటమి తరఫున బేకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ నమ్మకద్రోహం జరిగింది. ఆ తర్వాత కాలంలో సోవి యట్లో అంతర్భాగంగా ఉండి విడిపోయిన ఆరు యూరప్ రిపబ్లిక్లపైన కూడా ‘నాటో’ కన్ను పడింది. బాల్టిక్ తీర దేశాలైన లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియాలను ‘నాటో’లో చేర్చు కున్నారు. రష్యా రెండో కవచం సగం తెగింది. మిగిలిన మూడు దేశాల్లో బెలారూస్ రష్యాకు సన్నిహితంగా, మాల్డోవా తటస్థంగా ఉన్నాయి. మిగిలిన ఉక్రెయిన్కూ, కాకేసస్ ప్రాంతంలోని జార్జియాకు ‘నాటో’ సభ్యత్వం ఇవ్వాలని అమెరికా, బ్రిటన్ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికి వ్యతి రేకంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలకు రష్యా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. రష్యా సమస్యను జర్మనీ, ఫ్రాన్స్లు అర్థం చేసు కున్నాయి. కానీ, అమెరికా, బ్రిటన్లు వాటి ప్రయత్నాలను కొనసాగిస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో 2014లో ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులో నల్లసముద్రంలోకి విస్తరించిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. క్రిమియాలో పెద్దసంఖ్యలో ఉన్న రష్యన్ మైనారిటీలను ఉక్రెయిన్ అణచివేస్తున్నదని రష్యా ఆరోపిం చింది. రష్యన్ల అణచివేత ఆరోపణల సంగతెట్లా ఉన్నా ఉక్రెయిన్లోని నల్లసముద్ర తీరం ఒడెసాలోనూ, అజోవ్ సముద్ర తీరంలోనూ సైనిక స్థావరాల ఏర్పాటుకు బ్రిటన్ ఏర్పాట్లు చేసింది. రష్యా నౌకాదళానికి ఇది పూర్తిగా ప్రాణ సంకటం. ఈ మార్గం నుండే మధ్యధరా సముద్రంలోకి రష్యా ప్రవేశించగలిగేది. అందుకే రష్యా వేగంగా స్పందించింది. వెంటనే ‘నాటో’ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ మరోమారు పరుగెత్తింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ – రష్యా సరిహద్దులోని రష్యన్లు గణనీయంగా ఉన్న డాన్బాస్ ప్రాంతంలో డానెట్స్క్, లూహాన్స్క్లను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా ప్రకటించింది. రష్యా నుంచి డాన్బాస్ మీదుగా క్రిమియా వరకు ఒక మైదాన కారిడార్ రష్యా చేతికి ఇప్పుడు దొరికింది. ఈ యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉన్నా, డాన్బాస్ ప్రాంతంపై రష్యా తన ఆధిపత్యాన్ని వదులుకోకపోవచ్చు. ఉక్రెయిన్, రష్యాల వైరం జాతి వైరంగా పరిణమించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే రష్యా ఆధిపత్యంలోని సోవియట్ యూనియన్లో అంతర్భాగంగా ఉన్న 14 రష్యనేతర జాతులు ఏనాడూ వివక్షకు గురయినట్లు ఆరోపణలు రాలేదు. మూడు దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్ను గుప్పెట్లో పెట్టుకొని, దాన్నొక మహత్తర శక్తిగా మలిచిన జోసఫ్ స్టాలిన్... రష్యన్ కాదు. జార్జియన్! స్టాలిన్ తర్వాత దశాబ్దానికి పైగా నాయకత్వం వహించి ప్రచ్ఛన్న యుద్ధ సన్నాహా లతో అమెరికాను వణికించిన నికటా కృశ్చేవ్... రష్యా – ఉక్రెయిన్ సరిహద్దు గ్రామంలో పుట్టినవాడు. రెంటికీ చెందిన వాడు. ఆ తర్వాత పదిహేనేళ్లపాటు రష్యాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులెత్తించిన లియోనిద్ బ్రెజ్నేవ్ స్వయంగా ఉక్రేనియన్. రష్యన్ల కంటే నాన్–రష్యన్లే ఎక్కువ కాలం సోవియట్ వ్యవహారాలను నడిపించారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం బహుశా జెలెన్స్కీ సర్కార్ను కూలదోసి రష్యన్ అనుకూల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంతో ఆగిపోవచ్చు. కానీ ఈ యుద్ధం ఇంతటికే పరిమితం కాదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టి కాపాడడం రష్యాకు సులభమైన పనేమీ కాదు. అఫ్గానిస్తాన్లో ఇటువంటి ప్రయత్నం వల్లనే సోవియట్ యూనియన్ కుప్పకూలిన సంగతి అది మరిచిపోయి ఉంటుందని అనుకోలేము. ఈ మిషన్లో దానికి ఇంకేదో అండ కావాలి. అటువంటి రహస్య అండ లభించిన తర్వాతనే రష్యా అడుగు ముందుకు వేసి ఉండవచ్చు. గ్లోబ్కు లిఖిత రాజ్యాంగం ఉండకపోవచ్చు కానీ, అలిఖితమైన ఆట నియమావళి ఒకటుంది. దాన్నే ‘వరల్డ్ ఆర్డర్’ (World Order) అంటున్నారు. ఆ ప్రపంచ ఆట నియమావళిని అన్ని దేశాలూ అర్థం చేసుకుని మసలుకుంటాయి. ‘సూపర్ పవర్’ అభీష్టం మేరకు ఆట నియమావళి ఉంటుంది. కాలక్రమంలో ‘సూపర్ పవర్’ బలహీనపడుతున్నట్టు కనిపిస్తే ఎదుగుతున్న మరో దేశం దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఆట నియమావళి మారాలని డిమాండ్ చేస్తుంది. త్యుసిడుడీజ్ ట్రాప్ విసురుతుంది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ఈ సూత్రం ప్రకారం... బలహీనపడుతున్న సూపర్ పవర్తో బలపడుతున్న శక్తికి యుద్ధం తప్పదు. చైనా తన చేతికి మట్టి అంటకుండా విసిరిన ట్రాప్లో అమెరికా ఘోరంగా చిక్కుకుంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 1990 నుంచి 2008 వరకు ప్రపంచ ఆట నియమావళి ఏక ధ్రువ ప్రపంచంగా సాగింది. అమెరికా ఆడింది ఆట, పాడింది పాట. సద్దామ్ హుస్సేన్ ధిక్కార స్వరానికి ఉరి వేసి, ఇరాక్ను అతలాకుతలం చేసినా చెల్లింది. కల్నల్ గడాఫీని మట్టుబెట్టినా చెల్లింది. అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించినా నడిచింది. ఆర్థిక వ్యవస్థలతో ఆడుకున్నా అడిగేవాడు లేడు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మందగమనం, అమెరికా బలహీనతల్ని బయటపెట్టింది. అదే సమయానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా చైనా శరవేగంగా ఎదిగింది. అమెరికా స్వరం కొద్దిగా బలహీనపడటం, చైనా గొంతులో దర్పం ధ్వనించడం మొదలైంది. ఈ పధ్నాలుగేళ్లలో చైనా ఆర్థికంగా, మిలటరీ పరంగా మరింత బలపడింది. అమెరికా మరింత బలహీనపడింది. ఇప్పుడు ‘వరల్డ్ ఆర్డర్’ మారాల్సిన అవసరం చైనాకు ఉన్నది. రష్యా వ్యవహారంలో అమెరికా తెలివితక్కువగా వ్యవహరించింది. ఇప్పటికీ అమెరికా, చైనాల తర్వాత మూడో బలమైన సైనిక శక్తి – రష్యా. అటువంటి శక్తి తటస్థంగా ఉండకుండా నంబర్ టూ చెంతకు చేరేలా వేటాడి వెంటాడింది. ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు ప్రయోగించినా రష్యాకు తక్షణం వచ్చే ఇబ్బందేమీ లేదు. ఆర్థిక నిపుణుల అంచనా మేరకు 630 బిలియన్ డాలర్ల విదేశీ మారకం రష్యా దగ్గర ఉన్నది. కొంతకాలం వరకు ఢోకా లేదు. గ్యాస్ కొనుగోలుకు యూరప్ కస్టమర్లు దూరమైతే దాన్ని భర్తీ చేయడానికి చైనా అభయమిచ్చింది. ఈ గ్యాస్ డీల్తో నష్టపోయేది యూరప్ కస్టమర్లే తప్ప రష్యా కాదు. ఇప్పుడు తనకు తెలియకుండానే చైనా డిజైన్లో రష్యా భాగమైంది. ‘నీవే తప్ప నితఃపరం బెరుగ’నన్న రీతిగా ఇప్పుడు రష్యాకు చైనాయే సర్వస్వం. మాజీ సూపర్ పవర్ హోదాతో స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే రష్యాను చైనా క్యాంప్కు తరిమింది అమెరికాయే! దీంతో చైనా మరింత బలపడింది. ఇండో పసిఫిక్లో తనను అడ్డుకునేందుకు ‘క్వాడ్’ కూటమి ఏర్పాటుతో అమెరికా వేసిన ఎత్తుకు యురేషియాలో రష్యా ద్వారా చైనా పైఎత్తు వేసింది. ఇప్పుడు ఉక్రెయిన్లో వినిపిస్తున్న శతఘ్నుల మోత బహుశా మరో ప్రచ్ఛన్న యుద్ధపు సైరన్ కూత కావచ్చు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మంత్రాలమర్రి చెప్పిన బియ్యం కథ!
పూర్వకాలంలో సేవాతత్పరత కలిగిన ఒక సంపన్నుడు ఉండేవాడట. ఆయన గుణగణాలు నచ్చిన ప్రజలు తమ అధినేతగా ఎంపిక చేసుకున్నారట. అదే సమయంలో అదే రాజ్యంలో ఒక పేద యువకుడు తీవ్రమైన ధనాశ, అధికార వ్యామోహంతో రగిలిపోతూ ఉండేవాడు. రాచబాటలో పయనిస్తే వాటిని సంపాదించడం అసాధ్యమని గట్టి నిర్ణయానికి వచ్చాడు. అడ్డదారులు తొక్కనారంభించాడు. తాంత్రిక విద్యల్ని, కనికట్టు శాస్త్రాన్ని నిష్ఠగా అభ్యసించాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే నైపుణ్యం అలవడింది. తన ఇంద్రజాల ప్రదర్శనలతో అధినేత దృష్టిలో పడ్డాడు. కుతాంత్రిక విద్యా రహస్యం తెలియని సదరు అధినేత ఇంద్రజాలికుణ్ణి మెచ్చి తన కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్ళి జరిపించాడు. ఆశబోతు యువకుడు ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తంత్రాంగం మొదలుపెట్టాడు. ఒక మంత్రించిన మర్రి మొక్కను నాటించాడు. ఈ మర్రి చెట్టుకు భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలిగే దివ్యదృష్టి ఉందని చాటింపు వేయించాడు. ప్రజలకు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మంత్రాల మర్రి ఒక ఆకును రాలుస్తుందనీ, ఆకు మీద ఉండే సందేశాన్ని అక్షరాలా పాటిస్తే ప్రజలకు పుణ్యం ప్రాప్తిస్తుందనీ, వచ్చే జన్మలో సుఖ సంతోషాలతో బతుకుతారనీ ప్రచారం చేయించాడు. ప్రజలు నెమ్మదిగా ఆకు కథల్ని నమ్మడం మొదలుపెట్టారు. జనం తన దారిలో పడ్డారన్న గురి కుదరగానే ఒక సంచలన హెచ్చరికతో కూడిన ఆకు రాలింది. అధినేతను తక్షణం గద్దె దింపి ఖైదు చేయాలనీ, లేకపోతే దేశానికి అరిష్టం దాపురిస్తుందనీ రాలిపడ్డ ఆకులో రాసి ఉంది. ఇంద్రజాలం తెలిసిన ఆయన అల్లుడిని గద్దెనెక్కిస్తే ప్రజలు భోగభాగ్యాలతో తులతూగుతారని కూడా సదరు మర్రి ఆకు జోస్యం చెప్పింది. జనం కొంత కలవరపడ్డారు. వెర్రి వెంగళప్ప లయిన అధినేత సంతానం మాత్రం బావగారి వశీకరణ మంత్రానికి దాసోహమన్నారు. వారే ముందుండి తండ్రిని ఖైదు చేయించి, బావను కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రాల మర్రి ఆకు రాతల సాయంతో చాలాకాలంపాటు ఇంద్రజాలికుడు పెత్తనం చలాయించాడు. కొన్నాళ్లకు బండారం బయటపడి జనం బడితె పూజ చేసి దేశ బహిష్కారం చేశారట! వాస్తవాలను పోలిన కథలున్నట్టే కథల్ని పోలిన వాస్తవాలు కూడా ఉంటాయి. వర్తమాన ఆంధ్ర రాజకీయాలకు ఈ కథకు చాలా దగ్గరి పోలికలుంటాయి. మంత్రాల మర్రి కాన్సెప్టుకు అచ్చు గుద్దినట్టు సరిపోయే మీడియా మాత్రం పలు చానెళ్లు, పత్రికలు, సోషల్ విభాగాలతో ఊడలు దిగి విస్తరించి ఉంది. గిట్టనివాళ్లు దీన్ని ‘ఎల్లో మీడియా’ అని విమర్శిస్తుంటారు. కథలోని ఇంద్రజాలికుడి అభీష్టం మేరకు మంత్రాల మర్రి ఆకులు రాల్చినట్టే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈ మంత్రాల మర్రి మీడియా కూడా పనిచేస్తున్నది. మిగిలిన విషయాల్లో పోలికలు ఉన్నాయో లేదో తెలియదు గానీ, ఆ మంత్రాల మర్రి – ఈ మీడియా మంత్రాల మర్రి మధ్య, వాటి స్వామిభక్తి పరాయణతల మధ్య మాత్రం స్పష్టమైన పోలికలున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు మరో కోణంలో ఆకు కథల్ని రాల్చడం ఈ మంత్రాల మర్రి ప్రత్యేకత. దీంతోపాటు చంద్రబాబుకు మరికొన్ని అదనపు సౌలభ్యా లున్నాయి. తన సొంత పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఆయనకు కొందరు అద్దె ‘మైకు టైసన్’లున్నారు. బాబు క్యాంపు నుంచి సిగ్నల్ అందిన వెంటనే బాబు ప్రత్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్గా వ్రాయించి ఇచ్చిన పంచ్ డైలాగ్లను చదివేస్తారు. స్వయంగా చంద్రబాబు లేదా ఆయన పార్టీవారు రోజుకు రెండో మూడో పంచ్లు విసురుతారు. ఆ పంచ్లు పాచిపోయే దాకా మీడియా మంత్రాల మర్రి వాటిని ప్రతిధ్వనింపజేస్తుంది. స్వయంగా మంత్రాలమర్రి ఊడ్చు కొచ్చిన స్వీయరచనలు ఈ పంచ్లకు అదనం. ముప్పేట దాడి వ్యూహంతో ఎల్లో మీడియా రాల్చుతున్న ఆకు కథనాలు వారానికి డజన్ దాటుతున్నాయి. ఆకు కథల్లో ఏముంది? దాని అసలు సంగతేమిటి? అని శోధించి చూసి నప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతాము. సమాచార విప్లవ విస్ఫోటనం తర్వాత కూడా ఈ మంత్రాల మర్రి కథలు ఎలా రాజ్యం చేయగలుగుతున్నాయని కలవరం కలుగుతుంది. తాంత్రిక సేద్యంతో పెరిగి పెద్దదైన ఈ వృక్షం సమాజంలోకి తంత్రాంగాన్నే ప్రాణవాయువుగా విడుదల చేస్తూ, నాగరిక జీవనంలో కాలుష్యానికి కారణమవుతున్నది. ఈ వారం రోజుల్లోనే ఒక డజన్కు పైగా కాలుష్యకారక కథనాలను మంత్రాలమర్రి మీడియా విడుదల చేసింది. అందులో మచ్చుకు ఒక ఆకు కథనాన్ని, దాని అసలు విషయాన్ని పోల్చి చూద్దాం. మతులు పోగొట్టే ఒక మాయా ప్రపంచపు గుట్టుమట్లు కొద్ది కొద్దిగానైనా అర్థమవుతాయి. ఒక ఆకు కథ: కాకినాడ బియ్యం కాకినాడ రేవు నుంచి 2020–21 సంవత్సరంలో 30 లక్షల టన్నుల (గ్రాండ్గా ఉండేందుకు 3 కోట్ల క్వింటాళ్లని రాశారు) బియ్యాన్ని ఎగుమతి చేశారు. రాష్ట్రంలో బియ్యం ధర కేజీ 40 రూపాయలు వుంటే 25 రూపాయల చొప్పునే ఎగుమతి చేశారు. స్థానిక వినియోగదారులను మోసగిస్తూ తక్కువ ధరకే ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైంది! కేవలం రెండే రెండు కారణాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకటి: పేదల సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దారి మళ్లించే స్కామ్ ద్వారా ఎగుమతి చేసి ఉండాలి. రెండు: రైతులకు మద్దతు ధర ఎగవేసి ఉండాలి. ఎందుకంటే 1,900 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తే 25 రూపాయలకు కిలో వర్కవుట్ కాదు. ఆ ధరకు ఎగుమతి చేయాలంటే రైతులకు ధాన్యం ధర మద్దతు కంటే తక్కువగా రూ.1,400 మాత్రమే చెల్లించి ఉండాలి. ఈ రకంగా పండించిన రైతుకూ, వినియోగదారునికీ, సబ్సిడీ బియ్యం అందవలసిన పేదవారికీ అన్యాయం జరిగింది. చదివితే స్క్రీన్ప్లే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మూలకథకూ, స్క్రీన్ప్లేకూ ఎటు వంటి సంబంధం లేకపోవడమే ఇక్కడ విశేషం. అసలు కథ: ఇక్కడ స్క్రీన్ప్లే రచయిత నిర్ధారణ చేసుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలను గాలికొదిలేశారు. 1. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సేకరించారా? 2. ఎన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతి బియ్యం కాకినాడ రేవుకు వస్తుంది? 3. మొత్తం ఎగుమతిలో ఏపీ బియ్యం వాటా ఎంత శాతం? 4. ఇందులో ఏపీ ఎగుమతి దారులు స్వరాష్ట్రం నుంచి సేకరించినదెంత – ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినదెంత? 5. ఏరకమైన లేదా ఎన్నిరకాల బియ్యాన్ని కాకినాడ రేవు ఎగుమతి చేస్తున్నది. 6. అందులో మన రాష్ట్ర ప్రజలు వినియోగించే రకాలు ఉన్నాయా? 7. ఆ సంవత్సరంలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించిన బియ్యం పరిమాణమెంత? 8. మద్దతు ధర కంటే ఎక్కువకు రైస్ మిల్లర్లు సేకరించినదెంత? 9. రైతులే నేరుగా అధిక ధరకు ఇతర రాష్ట్రా లకు పంపించింది ఎంత? కాకినాడ పోర్టులో గానీ, బియ్యం ఎగుమతిదారుల సంఘం దగ్గర గానీ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ దగ్గర గానీ ఈ వివరాలన్నీ దొరుకుతాయి. కానీ, ఆ వివరాల సేకరణ కోసం స్క్రీన్ప్లే రచయిత ప్రయత్నించలేదని ఈ కథనం చూసిన తర్వాత భావించవలసి వస్తున్నది. కాకినాడ నుంచి 2020–21 సంవత్సరం 30 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన మాట వాస్తవం. ఇందులో ఉప్పుడు బియ్యం, నూక బియ్యం కలిపి 80 శాతం వాటా. మార్కెట్లో 40 రూపాయలకు దొరికే బియ్యాన్ని 25 రూపాయలకే ఎలా ఎగుమతి చేసేవారన్న ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది. ఉప్పుడు బియ్యాన్ని, నూక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగ దారులు ఉపయోగించరు. ఇంతకంటే తక్కువ ధరకే బయట రాష్ట్రాల్లో సేకరించి ఎగుమతి చేస్తున్నారు. నూక బియ్యం, ఉప్పుడు బియ్యం పోను కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే పచ్చిబియ్యం మొత్తం కూడా పొడుగు బియ్యమే. పొడుగు బియ్యాన్ని ఆంధ్ర రైతులు పండించరు. కనుక ఎగుమతి చేసిన ఉప్పుడు బియ్యం, నూక బియ్యం, పొడుగు రకం పచ్చి బియ్యాల్లో ఏ రకం కూడా ఆంధ్రప్రదేశ్లో సేకరించినవి కావు. కాకినాడ నుంచి ఎగుమతి చేసే బియ్యం 80 శాతాన్ని ఇతర రాష్ట్రాల ఎగుమతిదారులే చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతిదారులు సేకరించే మిగిలిన 20 శాతం బియ్యంలో తొంభై శాతాన్ని బెంగాల్, ఒడిషా, బిహార్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 2020–21లో కాకినాడ పోర్టు ఎగుమతి చేసిన 30 లక్షల టన్నుల బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతి దారులు సేకరించింది (20 శాతం) 6 లక్షల టన్నులు. ఇందులో ఇతర రాష్ట్రాల్లో సేకరించింది (90 శాతం) 5 లక్షల 40 వేల టన్నులు. ఇక మిగిలింది 60 వేల టన్నులు. అంటే మొత్తం ఎగుమతిలో రెండు శాతం! హతవిధీ! ఈ రెండు శాతం ఎంత పని చేసింది? మంత్రాల మర్రి కథనం ప్రకారం రైతుల గిట్టుబాటు ధరలో క్వింటాల్ 500 రూపాయలను కొల్లగొట్టింది ఈ రెండు శాతమే. వినియోగదారులకు మార్కెట్లో 25 రూపాయలకు కిలో బియ్యం దొరక్కుండా చేసింది ఈ రెండు శాతమే. సబ్సిడీ బియ్యాన్ని అందుకునే నిరు పేదల కడుపు కొట్టింది కూడా ఈ రెండు శాతమేనని ఈ కథనం సారాంశం. ఈ లెక్కలన్నీ బియ్యం ఎగుమతిదారుల సంఘం వారు విడుదల చేసినవే. ఆంధ్రప్రదేశ్ రైతులు 2020–21లో 1 కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించారు. ఇందులో 82 లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించింది. మేలురకం ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లే మద్దతు ధరకంటే ఎక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు కుటుంబ అవసరాల కోసం తమవద్దే ఉంచుకున్నారు. ఇదీ లెక్క. మరి మంత్రాల మర్రిచెట్టు చెప్పిన 30 లక్షల టన్నుల బియ్యం లెక్క ఎక్కడిదో విజ్ఞులు ఆలోచించాలి. ఈ వారం రోజుల్లో మంత్రాల మర్రి రాల్చిన ఆకు కథలన్నీ ఇటువంటి మాయ కథలే. సినిమారంగ సమస్యలపై చర్చించ డానికి కొందరు హీరోలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంపై కూడా చంద్రబాబు అసంగతమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సినీ ప్రముఖులను అవమా నించారని ఈయన ఆవేశం వెళ్లగక్కారు. ఆయన ఆవేశానికి మంత్రాల మర్రి సుడిగాలినిచ్చి ఎగదోసింది. ముఖ్యమంత్రిని గురించి ఆయనను కలిసిన తర్వాత ఆ సినీప్రముఖులు ఏమని చెప్పారనే ఇంగితాన్ని వదిలేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద చినజీయర్ స్వామి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఈ తరహా ప్రచారానికి చెంపపెట్టు లాంటివి. ప్రత్యేక హోదా ఎపిసోడ్ నిజానికి చంద్రబాబు కూటమి సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల ఎజెండా నుంచి రాష్ట్రానికే ప్రత్యేకమైన అంశాలను తొలగించి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు స్వహస్తాలతో ఖననం చేసిన అంశానికి వైఎస్ జగన్ తిరిగి ప్రాణం పోసి నిలబెట్టారని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కానీ మన మంత్రాల మర్రి దీన్ని జగన్ ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయడానికి నానాపాట్లు పడింది. గౌతమ్ సవాంగ్ వ్యవహారం ఇలాంటిదే. చంద్రబాబు హయాంలో ఒక డీజీపీ సగటున 15 నెలలు పనిచేశారు. 30 నెలల తర్వాత సవాంగ్ను మార్చడం మంత్రాల మర్రికి విడ్డూరంగా తోచింది. ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉన్న అశోక్బాబు తన సర్వీస్ రిజిస్టర్ను ట్యాంపర్ చేసి లేని విద్యార్హతలను చేర్చుకున్నారు. నేరం బయటపడడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే మాత్రం అరెస్టు చేస్తారా? ఇది వేధింపు కాదా అని ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. నిజంగానే జగన్ ప్రభుత్వం తన వ్యతిరేకులను వేధిస్తున్నదని మంత్రాల మర్రి చర్చాగోష్ఠులు నడిపింది. ఒక్క వారంలో ఇన్ని వక్రీకరణలకు పాల్పడిన మంత్రాల మర్రి కథల పట్ల జనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కళాకారుడి బతుకుపళ్లెం
మహా కథకుడు ప్రేమ్చంద్ కాశీలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఆ రాబడితో బతకలేక సినిమాలకు రాద్దామని బొంబాయి చేరుకున్నాడు. తన మానవీయ, సామ్యవాద ధోరణులకు తగినట్టుగా ఒక సినిమాలో జీతం ఇవ్వని యజమానిపై కార్మికులు తిరగబడాలని రాశాడు. తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు. తిరిగి కాశీకి చేరుకుంటే సొంత ప్రెస్ కార్మికులు జీతం కోసం సమ్మె చేశారు. పైగా సమ్మె చేయమని మీరే రాశారు కదా అన్నారు. ప్రేమ్చంద్కు అనారోగ్యం. క్షయ. జీవితాంతం నానా బాధలు పడ్డాడు. ఇంత గొప్ప కథకుడివి, నీ కష్టం ఏమిటి అని ప్రభుత్వం అడిగి ఉంటే ఆయన బతుకు మరోలా ఉండేది. తెలుగువారు గర్వించదగ్గ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి పాఠకులను, కళాభిమానులను నమ్ముకుని ఫుల్టైమ్ రైటర్గా ఉన్నాడు. ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివితే రచయితగా ఎన్ని సన్మానాలు పొందాడో బతకడానికి అన్నే అవస్థలు పడ్డాడని అర్థమవుతుంది. చివరి రోజుల్లో ఆయన ఒక ధనవంతునికి లేఖ రాస్తూ ‘నేను పోయాక నా భార్యకైనా సహాయం అందేలా చూడండి’ అని ప్రాథేయపడటం కనిపిస్తుంది. నాజర్ బుర్రకథ చెబుతున్నాడంటే పల్లెల్లో టికెట్ షో కోసం కట్టిన అడ్డు తడికెలు జనం ధాటికి తెగి పడేవి. పల్నాటి వీరగాథను శౌర్యంతో పాడిన ఈ గాయకుడు చివరి రోజుల్లో శౌర్యంగా బతక లేక పోయాడు. సరైన ఇల్లు లేదు. అనారోగ్యం బాధించింది. ప్రభుత్వంలో పెద్దలందరికీ ఆయన తెలిసినా సరైన సమయంలో సహాయం అందలేదు. తమిళవాడైనా తెలుగు నేర్చుకుని తెనాలిలో ఉంటూ కథలు, నవలలు రాసిన శారద (నటరాజన్) హోటళ్లలో సర్వర్గా పని చేస్తూ దారుణమైన పేదరికంలో మరణించడం మనకే చెల్లింది. మద్రాసులో 1970ల కాలంలో జీతం చాలక కనిపించిన ప్రతివాణ్ణీ ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడిగిన ప్రఖ్యాత తెలుగు కవిని చూసి, ఏడవలేక నవ్వి ముళ్లపూడి వెంకటరమణ ‘అప్పారావు’ పాత్రను సృష్టించాడని అంటారు. ఆ అప్పారావు ‘ఓ ఫైవ్ ఉందా’ అని అడగనివాడు లేడు. ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్. ఒక కాలంలో ఫైవ్ రూపీస్ కోసం అల్లల్లాడిన కళాకారులు ఉన్నారు. నేడు ఓ ఫైవ్ థౌజండ్ కోసం చూసే వారూ ఉన్నారు. ‘కళ జమీందార్లకు మాత్రమే ఉండాల్సిన జబ్బు’ అనేవాడు కార్టూనిస్టు మోహన్. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి శ్రీమంతులు, రాజా రవివర్మ వంటి మహరాజులు కళను అభిమానించి సాధన చేశారంటే వాళ్లకు తిండికి ఢోకా లేకపోవడం ఒక కారణం. కాని కళ పట్ల ఉన్మత్తతతో దాని కోసమే జీవితాన్ని వెచ్చించాలని అనుకుంటే ప్రతిపూటా భోజనం వచ్చి ‘నా చంగతేంటి?’ అని అడక్క మానదు. భార్య, సంతానం, సంసారం... వీరు కూడా! కళలో రాణించాలి, సంసారాన్ని పోషించాలి అనేది అనాదిగా ఈ దేశంలో కళాకారులు ఎదుర్కొంటున్న విషమ పరీక్ష. ‘పథేర్ పాంచాలి’ నవలలో 1910 నాటి కరువు రోజుల్లో ఆ తండ్రి పల్లెటూళ్లోని భార్యను, కొడుకును, కూతురిని ఆకలికి వదిలి, వారి కోసం నాలుగు అన్నం ముద్దలు వెతకడానికి కవిగా, నాటక రచయితగా రాణించడానికి పట్నం వెళతాడు. కాని అతను రాడు. అతని కూతురు దుర్గ సరైన తిండి, వైద్యం లేక మరణిస్తే ఆ దయ నీయమైన మరణం పాఠకుణ్ణి వదలదు. కళకు ఈ దేశంలో పేదరికం అనే వదలని నీడ ఉంటుంది. ఆశ్రయం పొంది కళ రాణించింది చాల్నాళ్లు. రాజాశ్రయం, జమీందార్ల ప్రాపకం సంపాదించిన కళాకారులు తిండి నిశ్చింతతో బతికారు. అలా ఆశ్రయం పొంద నిరాకరించినవారు, పొందలేక పోయిన వారు ఎన్నో బాధలు పడ్డారు. నిజమైన కళాకారులు ‘జీ హుజూర్’ కొలువుకూ, జీతం రాళ్ల ఉద్యోగాలకు ఒదగరు. గొప్ప ప్రతిభ కలిగి, తమ కళతో సమాజానికి ఉల్లాసము, చైతన్యము, పరివర్తన ఇవ్వగలిగిన కళాకారులు ఎందరో నేడు కళను ‘వీలున్న సమయాల్లో’ సాధన చేస్తూ మిగిలిన సమయమంతా బతుకు తండ్లాటలో గడపవలసి వస్తున్నదన్నది వాస్తవం. కెనడా వంటి దేశాలలో ‘నేనొక నవల రాస్తాను’ అని దరఖాస్తు చేసుకుంటే పని చేసే సంస్థ పూర్తి శాలరీతో ఏడాది నుంచి రెండేళ్ల కాలం సెలవు మంజూరు చేసే వీలుందట. నవలాకారుడు గార్షియా మార్క్వెజ్ తన భార్యతో ‘ఒక రెండేళ్లు ఇంటిని నెట్టుకు రాగలవా? పైసా ఇవ్వలేను. నవల రాసుకుంటాను’ అనంటే ఆమె ‘సరే’ అంది. ఆమె ఇల్లు చూసుకోవడం వల్ల మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అనే క్లాసిక్ రాశాడు. నిజానికి ఆ రెండేళ్లు ఇంటిని నెట్టుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది! కళాకారులు పరోక్ష శాసనకర్తలు. వారు సమాజానికి నైతిక పాలననూ, సాంస్కతిక విలువలనూ కల్పిస్తారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అచ్చు వేయగలదు. కాని కళాకారులే ఏది మంచో, ఏది చెడో జనులకు కళాత్మక పద్ధతిలో హదయాలకు ఎక్కేలా చేస్తారు. అందుకే కళాకారుల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కూడా! తెలంగాణ ప్రభుత్వం పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యకు నివాసం, ఉపాధికి కోటి రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన అంశం. ఇలా సమాజానికి ఉపయోగపడే, సీరియస్ కళాసాధనలో ఉండే సహాయం అందితే గొప్ప కళాసృష్టి చేయదలిచే కళాకారులకు మరింత నిర్మాణాత్మక పద్ధతిలో ప్రభుత్వ మద్దతు అందే ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కళాకారుల జీవన సమర్థనకు అవసరమైన ప్రయత్నాలు మొదలెట్టాలి. నకిలీ, కృత్రిమ, విశృంఖల, హానికారక వినోద కళల నుంచి దేశ ప్రజలను కాపాడాలన్నా, ప్రాదేశిక సంస్కృతిని నిలబెట్టుకోవాలన్నా ముందు కళాకారులను బతికించుకోవాలి. కళ బతుకు గాక కళాకారుని ఊపిరి యందు! -
సరస్వతీ నమస్తుభ్యం!
కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు. ఆక్స్ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా! ‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది. తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి. పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది. పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అంకెలపై లంకెబిందె కథలు!
నిజం నిద్ర లేచేసరికి అబద్ధం దేశాన్ని చుట్టేస్తుందంటారు. మసాలా వేసి వండిన వంటకం కనుక అబద్ధపు ఘుమఘుమలు తొందరగా వ్యాపిస్తాయని ఈ సామెత ఉద్దేశం. అటువంటి అబద్ధాలు వ్యవస్థీకృత రూపం దాల్చితే? సమస్త వనరుల్ని తమ గుప్పెట పెట్టుకున్న శక్తిమంతులే ఆ వ్యవస్థ వెనుక నిర్దేశకులుగా నిలబడితే ఏమవుతుంది? – అబద్ధాలు సూపర్సోనిక్ రెక్కల్ని తొడుక్కుంటాయి. నిజాల తరంగదైర్ఘ్యాలు నిస్సహాయపు ముద్ర దాల్చవలసి ఉంటుంది. ఒకానొక చారిత్రక దుర్ముహూర్తంలో పాతికేళ్లకు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థీకృత అబద్ధాలకు విత్తనం పడింది. రాజకీయ వ్యవస్థలో వెన్నుపోటు అనే వినూత్న పద్ధతిలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ శక్తికి అసత్య ప్రచారాలను ఆక్సిజన్ మాదిరిగా ఎక్కించవలసి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాదారుల్లోంచి ఆ రాజకీయ శక్తి ‘క్రోనీ క్యాపిటలిజా’న్ని ప్రోది చేసింది. ఇంతింతై చెట్టంతైన ‘క్రోనీ కేపిటలిజమ్’ ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని పార్శ్వాల్లోనూ తన ఊడలను దించడం ప్రారంభించింది. ఫలితంగా ఆ రాజకీయ శక్తి చుట్టూ డబ్బూ, పలుకుబడి కలిగిన ఒక ముఠా వలయం మాదిరిగా అల్లుకున్నది. సకల వనరులతోపాటు ఈ ముఠా చేతిలో ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి. ఈ కార్ఖానాలు పందిని తయారుచేసి నందిగా బ్రాండింగ్ చేయగలవు. వినియోగదారుడు నమ్మి తీరవలసిందే! తనకు లాభసాటిగా ఉన్న రాజకీయ–ఆర్థిక–సామాజిక పొందికలో ఏ చిన్న మార్పునూ ఈ క్రోనీ ముఠా సహించలేదు. వారి కర్మఫలాన రెండున్నరయేళ్ల క్రితం రాజకీయ పొందికలో ఒక మార్పు జరిగింది. ఫాదర్ ఆఫ్ ఆంధ్రా క్రోనీ క్యాపిటలిజమ్ అధికారానికి దూరమయ్యాడు. అధికారంలోకి వచ్చిన రాజకీయ శక్తి సామాజిక–ఆర్థిక పొందికలోనూ మార్పులు చేయడం ప్రారంభించింది. నిర్భాగ్యులనూ, నిస్సహాయులనూ సాధికారం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాలను క్రోనీ ముఠా ప్రాణాంతకంగా పరిగణించింది. దీనికి చెక్ చెప్పడానికి తమ చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయ ఉత్పత్తి కర్మాగారాలను మూడు షిప్టుల్లో నడపడం ప్రారంభించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన.. జరుగుతున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగి ఉండలేదు. ఈ ప్రచారానికి పునాదిరాళ్లు అబద్ధాలే. నందిని పందిగా, పందిని నందిగా జనం మదిలో ముద్రించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇందుకోసం అన్నిరకాల మార్కెటింగ్ టెక్నిక్లనూ రంగంలోకి దించారు. ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కొంత కాలంపాటు కష్టపడ్డారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా తిప్పికొట్టారు. దాంతో అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని శక్తులనూ ఏకం చేయడానికి ప్రయత్నించారు. పార్టీలను ఏకం చేయగలిగారు కానీ ప్రజలను ఒప్పించ లేకపోయారు. ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం క్వారీల్లో చొరబడి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన ఆనాటి గాయాలు సలపడంతో తోక ముడిచారు. వరసగా ఓ అరడజన్ ప్రచారాలు బోల్తాకొట్టిన తర్వాత అప్పులు – అభివృద్ధి, పెట్టుబడులు అనే అంశాలతో కూడిన ఒక మెగా క్యాంపెయిన్ను ప్రారంభించారు. మల్టీస్టారర్ షోగా దీన్ని మలిచారు. కొత్త ప్రభుత్వం వేలకోట్లు అప్పులు చేసిందనీ, ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనీ, దివాళా పరిస్థితి ఏర్పడింది కనుక ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనీ డిమాండ్ చేసేదాకా ఈ ప్రచారాన్ని నడుపుతున్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి జాడే రాష్ట్రంలో కన్పించడం లేదని ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా–అనే చతురంగ బలాలను యుద్ధప్రాతిపదికపై నడిపిస్తున్నారు. ఈ దుమారంలో కొట్టుకొనిపోకుండా నిజా నిజాలను నిష్పాక్షికంగా దర్శించవలసిన అవసరం ఉన్నది. నిజాలకు నిలువుటద్దాల వంటి అంకెలన్నీ మనకు అందు బాటులోనే ఉన్నాయి. అవును. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేసిన మాట నిజం. కరోనా కాలంలో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ది ఆరో స్థానం. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది. ఇంతకుముందున్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసి, మరో 60 వేల కోట్ల బకాయిల భారాన్ని తలపై మోపి, ఏటా 20 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన వారసత్వాన్ని ఏపీ కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. కరోనా కాలంలో ఏపీ కంటే అధికంగా అప్పులు చేసిన ఐదు రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి ‘ఘనమైన’ వారసత్వ సంపద లేదు. చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఖర్చు పెట్టిన పద్దులేమిటి? చేసిన అభివృద్ధి ఎంత? సంక్షేమం మాటేమిటి? అనే విషయాలను పరిశీలించాలి. అంతకు ముందు ఏపీ పరిణా మాలపై నిపుణులైన ఆర్థికవేత్తలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పీఆర్ఎస్ ఇండియా అనే ఒక ప్రముఖ ఇండిపెండెంట్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో పేదవర్గాలను ఆదుకోవడానికి ఏ రాష్ట్రం ఎంతమేరకు బడ్జెట్ కేటాయింపులు చేసిందనే అంశాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. జాబితాలో 13.1 శాతం బడ్జెట్ కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. 7.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 4.8 శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ చేసింది. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి కూడా ఏపీ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నదని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం బడ్జెట్లో మూలధన వ్యయంగా (Capital expenditure) 35 వేల కోట్లు కేటాయిస్తే రెండేళ్లు తిరిగేసరికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పద్దును 45 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది ఆర్బీఐ లెక్క. ఉద్యోగుల జీతభత్యాల కింద చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ. 32 వేల కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్లలో ఆ పద్దును వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లకు పెంచిందని ఆర్బీఐ వెల్లడించింది. సమ్మిళిత అభివృద్ధి(inclusive growth)లో ఆంధ్రప్రదేశ్ది దేశంలో తొలిస్థానమని ‘ఇండియా టుడే’ సర్వే (2021) తేల్చి చెప్పింది. 2003 సంవత్సరం నుంచి ప్రతియేటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్వయంగా కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటు విప్లవాత్మకమైన ఆలోచనగా ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా ఏఐఎల్ డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్ – సీఓఓ పంకజ్ శర్మ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. గతంలో ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం రాష్ట్రమంతటా మార్మోగితే, ఇప్పుడు ‘జగన్ వచ్చాడు..అభివృద్ధి తెచ్చాడు’ అనే నినాదం వినిపిస్తోందని వ్యాఖ్యా నించారు. కొత్త కంపెనీలు శంకుస్థాపన సమయంలో విస్తరణ కార్యక్రమాలను వివరంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి గుర్తు. ఇక్కడ ఫ్యాక్టరీని నడపలేక కియా మోటార్స్ కంపెనీ వెళ్లిపోతున్నదని మనవాళ్లు ఎంత ప్రచారం చేసినా, ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సెంచురీ ప్లైవుడ్స్ తన పెట్టుబడిని నాలుగింతలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏటీజీ టైర్స్ కూడా తన పెట్టుబడిని రెండింతలకు పెంచింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెద్ద సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని చాలామంది గుర్తించారు. ‘నాడు – నేడు’ కార్యక్రమంతోపాటు కొత్త వైద్యశాలల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం, కొత్త సూపర్ స్పెషాలిటీల నిర్మాణం, వైఎస్ఆర్ విలేజి క్లినిక్స్ కోసం ప్రభుత్వం సుమారుగా రూ. 32 వేల కోట్లు కేటాయించింది. సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. ‘ఆరోగ్యశ్రీ’ కింద బడ్జెట్లో రెండువేల కోట్ల కేటాయింపు, 1,088 కొత్త అంబు లెన్స్ల ప్రారంభం... పైన చెప్పిన ఖర్చుకు అదనం. ఫలితంగా వైద్యరంగం వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నది. పేద – ధనిక, సామాజిక హోదా వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి గడపకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ వెళ్లే లక్ష్యం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల సంఖ్యలో 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపించింది. రెండేళ్ల కిందటి దాకా సుదూరంగా వుండే గిరిజన గూడేల్లోని మహిళలు కాన్పుకు వెళ్లాలంటే డోలీలే శరణ్యం. భగవంతునిపైనే భారం. ఇప్పుడు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా 104 వాహనం ఆమె ఇంటి ముందు ఆగి, మందులిస్తున్నది. కాన్పు సమయంలో అదే వాహనంలో తీసుకెళ్లి కాన్పు తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు. గిరిజన జీవితాలలో 104 అంబు లెన్స్ పెనుమార్పును తెచ్చింది. విద్యారంగంలో ‘నాడు–నేడు’కు 16 వేల కోట్ల రూపా యలు కేటాయించారు. ఇప్పటికే తొలిదశ పూర్తయింది. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం విద్య ప్రతి విద్యార్థికీ ధనిక–పేద తేడా లేకుండా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండేళ్లలో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. వారు ఏటా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వగైరాల కోసం చేసే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు మిగిలిపోయాయి. ఈ సొమ్మును వారు మెరుగైన జీవితం కోసం ఉపయోగించుకోగలుగుతారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకురూ. 3,600 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త హార్బర్లలో 10 వేల మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభిస్తుందని అంచనా ఉన్నది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పదివేల కోట్ల అదనపు ఆదాయం ప్రతియేటా మత్స్యకారులకు లభిస్తుంది. గుజరాత్ సముద్ర తీరాల్లో పొట్టకూటి కోసం శ్రమదోపిడీకి గురయ్యే పరిస్థితి నుంచి మత్స్యకారులు సగర్వంగా నిలబడే స్థితికి చేరుకుంటారు. 31 లక్షల కుటుంబాలకు నిలువనీడ కల్పించే బృహత్తర కార్యక్రమం వైఎస్సార్ – జగనన్న కాలనీల ఏర్పాటు. ఏకబిగిన ఇన్ని ఇళ్లను నిర్మించిన కార్యక్రమం దేశ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం యాభైవేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మహాయజ్ఞంలో మహిళా సాధికారత అనే సామాజిక న్యాయ సూత్రం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇళ్లన్నీ పూర్తయి అక్కడ కాలనీ జీవితం మొదలైన తర్వాత వాటి విలువ అథమపక్షం రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ ఒక్క పథకంలో మూడు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించి మహిళల చేతిలో జగన్ ప్రభుత్వం ఉంచబోతున్నది. ప్రభుత్వరంగంలో విస్తారంగా ఆస్తుల కల్పన జరుగు తున్నది. రూ. 4,200 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణం, 2,300 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం, 416 కోట్లతో బల్క్ మిల్క్ యూనిట్ భవనాల నిర్మాణం, 690 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 13 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, భావన పాడు ఓడరేవుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 13,885 కొత్త ఎంఎస్ఎంఇ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. మరో 42 వేల కోట్ల పెట్టుబడులతో 72 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 96 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రభుత్వరంగ యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ రెండున్నరేళ్ల పరిపాలనా కాలంలో, అందులో రెండేళ్ల సమ యాన్ని 30 వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని, ఇంకెన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని కోవిడ్ మహమ్మారి మింగేసిన కాలంలో స్థూలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, అప్పులు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవి. ఉద్యోగాల కల్పన పెరిగింది, పనిదినాల కల్పన పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తున్నది. ఆర్బీకేల ఏర్పాటు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రెండున్నరేళ్లలో సాధించిన సమ్మిళిత అభివృద్ధితో మరే రెండున్నరేళ్ల కాలం కూడా పోటీపడలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంకెలు అబద్ధం చెప్పవు! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాగ్రత్త పడాల్సిందే!
అనుకున్నంతా అయింది. నవంబర్ 24న దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెల తిరిగేసరికల్లా 90కి పైగా దేశాలకు విస్తరించింది. మునుపటి డెల్టా వేరియంట్ కన్నా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ వేగంతో విస్తరిస్తూ, ఒకటిన్నర–రెండు రోజుల్లో కేసులు రెట్టింపయ్యే సత్తా ఉన్న ఒమిక్రాన్ అమెరికా సహా అనేక దేశాలను వణికిస్తోంది. బ్రిటన్లో రోజువారీ కేసులు లక్షకు చేరుకున్నాయి. పలు ఐరోపా దేశాలు మళ్ళీ షరతులు పెట్టాయి. నెదర్లాండ్స్, తాజాగా చైనాలో కోటీ 30 లక్షల మందికి ఆవాసమైన షియాన్ లాక్డౌన్ పెట్టాయి. ‘చరిత్రలో మిగతా వైరస్లన్నిటి కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. త్వరలోనే ప్రపంచంలో ప్రతి దేశంలో అది ఉంటుంది. రాబోయే మూడు నెలలు ప్రపంచానికి గడ్డుకాలం’ –ప్రసిద్ధ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ మంగళవారం చేసిన ఈ భవిష్యత్ అంచనా ట్వీట్ అలసత్వం వహిస్తున్న అందరికీ మరో మేలుకొలుపు. ఒమిక్రాన్ పూర్తి తీరుతెన్నులు, దానిపై ప్రస్తుత టీకాల సామర్థ్యం లాంటివి ఇప్పటికీ కచ్చితంగా తేలలేదు. టీకా రెండు డోసులూ వేసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ బెడద తప్పట్లేదన్న డేటా మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనిశ్చితి మధ్యనే వివిధ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ నలుగురూ కూడి చేసుకొనే వేడుకలను వాయిదా వేసుకోవాలన్నది ఆరోగ్య సంస్థ తాజా విజ్ఞప్తి. మన దేశంలో పండుగలకు తోడు పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గోవా సహా అయిదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలు, ర్యాలీలు ఇప్పుడే భయం పుట్టిస్తున్నాయి. భారత్లో మూడో వేవ్ తప్పదనీ, ఫిబ్రవరికి అది పతాక స్థాయికి చేరుతుందనీ, రోజుకు 1.5 నుంచి 1.8 లక్షల కేసుల వరకు రావచ్చనీ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ సారథ్యంలోని ‘నేషనల్ కోవిడ్19 సూపర్ మోడల్ కమిటీ’ అంచనా. ఈ పరిస్థితుల్లో కర్ణాటక, తాజాగా ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు సమావేశాలు, సామూహిక ఉత్సవాలపై షరతుల మొదలు నిషేధం దాకా చర్యలు మొదలుపెట్టాయి. ఒమిక్రాన్ కేసుల్లో భారత్ ఇప్పటికే 250 మార్కు దాటేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణలు ఈ కొత్త వేరియంట్ కేసుల్లో ముందు వరుసలో ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి వచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తిగా అనుమతించాలనుకొన్నా, భారత్ సహా దాదాపు 25 దేశాలు వెనక్కి తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూలు, షరతులతో కూడిన అనుమతులు, కంటైన్మెంట్ జోన్లు పెట్టాలంటూ కేంద్రం మంగళవారం పారాహుషార్ సందేశం పంపిన విషయం మర్చిపోలేం. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఒమిక్రాన్తో కోవిడ్ వ్యాపిస్తున్నా, మునుపటిలా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కాకపోవడం ఉన్నంతలో ఊరట. అలాగని అశ్రద్ధ చేయలేం. ఒకేసారి వందలు, వేల సంఖ్యలో కరోనా బారినపడ్డ వారు ఆసుపత్రి పాలైతే, పరిస్థితి ఏమిటన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతం భారత్లో సీనియర్ సిటిజన్ల సంఖ్య 13.8 కోట్లు. వారిలో సగం మందికి కరోనా తీవ్రంగా వచ్చినా, పరిస్థితి అతలాకుతలమవుతుంది. కరోనా దెబ్బతో రెండేళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు పౌర ఆరోగ్య వసతులు కొంత మెరుగైనమాట నిజమే కానీ, పడకల మొదలు ఆక్సిజన్ దాకా ఎందరికి సరిపోతాయన్నది చెప్పలేం. ప్రపంచానికి కరోనా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి దాకా పని ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా డస్సిపోయిన వైద్య సిబ్బందికి అది మరింత భారమయ్యే ప్రమాదమూ ఉంది. మరోపక్క ప్రస్తుతం కరోనాపై అత్యంత ప్రభావశీలమైన యాంటీబాడీ కాక్టైల్ చికిత్సకయ్యే రూ. 60 వేల ఖర్చు సామాన్యులు భరించడమూ కష్టమే. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు రోగ నిరోధకశక్తిని పెంచే బూస్టర్ డోస్గా మూడో డోస్ మార్గం పట్టాయి. ఇజ్రాయెల్ ఏకంగా 4 డోసుల విధానం వైపు నడుస్తోంది. త్వరలో ఆ పద్ధతిని ఆచరణలో పెడితే, నాలుగు డోసుల పద్ధతి అనుసరిస్తున్న తొలి ప్రపంచ దేశం ఇజ్రాయెలే అవుతుంది. మామూలుగా టీకా వల్ల కలిగే ఇమ్యూనిటీ మూడు నెలల మొదలు ఏడాది లోపల తగ్గిపోతుందని నిపుణుల మాట. అందుకే, భారత్లో సైతం నిర్ణీత రెండు డోసులే కాకుండా మూడోదీ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ బెడదతో కనీసం ఫ్రంట్లైన్ వర్కర్లకూ, ఇతర అనారోగ్యాలున్న వారికైనా ముందుగా ఈ బూస్టర్ డోస్ వేయాలనే వాదన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటికైతే బూస్టర్ డోస్లు, పిల్లలకు టీకాలకు సర్కార్ సుముఖంగా లేదు. మామూలు జలుబు వైరస్ నుంచి ఒమిక్రాన్ తన జన్యుద్రవ్యాన్ని తీసుకుందని ఎన్ఫెరెన్స్ సంస్థ అధ్యయనం. అలాగే, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒమిక్రాన్ చివరకు కోవిడ్ వ్యాధిగా కాక, సాధారణ కోవిడ్ ఫ్లూలా తయారవుతుందని ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ వైద్యుడు ప్రవీణ్ హిసారియా అంచనా. అదే నిజమైతే, ప్రపంచం నెత్తిన పాలు పోసినట్టే! ఆధునిక భారతావనిలో క్రికెట్, మతం, రాజకీయాలు మూడూ అతి పెద్ద విశ్వాసాలనుకుంటే, చివరి రెండింటితో ఉత్సవాలు, ఊరేగింపుల పుణ్యమా అని కరోనా వ్యాప్తి ఉదంతాలు గత రెండేళ్ళలో అనేకం. టీకాలు వేసుకోవడం, భౌతిక దూరం–మాస్కు ధారణ లాంటి కోవిడ్ జాగ్రత్తలతో కూడిన ప్రవర్తన– ఈ రెండే ఎన్ని వేరియం ట్లొచ్చినా శ్రీరామరక్ష అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటలే తారకమంత్రం. -
నిరుపేదల ఆశాకిరణం
విజయం ఊహించినదే అయినా, అనూహ్య మెజారిటీతో గెలుపు దక్కితే ఉండే ఉత్సాహం వేరు. చిలీ దేశపు రాజధాని శాంటియాగో వీధుల్లో ఆదివారం నాటి జనసందోహం, సంబరాలే అందుకు నిదర్శనం. చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా యువ నేత గ్యాబ్రియెల్ బోరిక్ భారీ విజయంతో ఆ దక్షిణ అమెరికా దేశంలో నవ శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ప్రపంచంలోనే అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో ఒకటైన ఈ లాటిన్ అమెరికా దేశంలో మాజీ విద్యార్థి నేత∙35 ఏళ్ళ బోరిక్ ‘సంక్షేమ రాజ్య’ వాగ్దానంతో అధిక సంఖ్యాకుల మనసు దోచారు. చిలీ కమ్యూనిస్టు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల సంకీర్ణ అభ్యర్థిగా ఈ వామపక్ష వాది బరిలో నిలిచారు, గెలిచారు. ఓటర్లు రెండు వర్గాలుగా కేంద్రీకృతమైన వేళ, మితవాద ప్రత్యర్థి 55 ఏళ్ళ జోస్ ఆంటోనియో కస్ట్పై యువ బోరిక్ భారీ విజయం లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్ష వాదానికి మరింత బలం చేకూర్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది వివిధ లాటిన్ అమెరికన్ దేశాల్లో జరిగిన 5 అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు ఇది నాలుగో గెలుపు. ఆ రకంగానూ తాజా చిలీ ఎన్నికలు ప్రత్యేకమే. నవంబర్ 21న జరిగిన మొదటి రౌండ్ ఎన్నికలలో సంప్రదాయవాద కస్ట్కు కాస్తంత ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్ 19 ఆదివారం నాటి తుది రౌండ్లో విశేష జనాదరణతో బోరిక్ తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. చివరకు పోల్ అయిన ఓట్లలో 44.1 శాతం కస్ట్కు వస్తే, ఏకంగా 55.9 శాతం ఓట్లతో బోరిక్ నెగ్గారు. అలా 1973 నాటి కుట్రలో ఆత్మహత్యకు పాల్పడిన చిలీ అధినేత అలెండి తర్వాత అత్యంత ఉదారవాద అధ్యక్షుడయ్యారు. స్వలింగ సంపర్కుల వివాహాలు, గర్భనిరోధం, గర్భస్రావం లాంటి వాటికి కస్ట్ వ్యతిరేకి. ఒక దశలో మహిళా వ్యవహారాల శాఖను సైతం రద్దు చేస్తానని, ఆనక వెనక్కి తగ్గిన చరిత్ర ఆయనది. తద్విరుద్ధంగా బోరిక్ ఉదారవాది. యువకులు, పట్టణ ప్రాంత ఓటర్లు ఆయనకు జై కొట్టింది అందుకే. చివరి రౌండ్లో గ్రామీణ ఓటర్లూ ఆయన వైపే మొగ్గడంతో భారీ గెలుపు సాధ్యమైంది. ఓటేయడం స్వచ్ఛందమైన 2012 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా 56 శాతం పోలింగ్ నమోదైంది. అధిక భాగం లాటిన్ అమెరికా దేశాల్లో రాజకీయాలు, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ – రెండూ అస్థిరమే. కానీ, చిలీ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంతో, నియంత జనరల్ పినోఛెట్ సైనిక పాలనలో పెట్టిన పాత కాలపు నిరంకుశ రాజ్యాంగానికే కట్టుబడింది. సామాజిక వ్యయం, సబ్సిడీల లాంటి ఊసే లేకుండా లాభసాటి వ్యాపార వాతావరణంతో సంపన్న వర్గాల స్వర్గమైంది. చివరకు 2019 అక్టోబర్ 18న మెట్రో టికెట్ రేట్లపై పన్నులు పెంచడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అలా మొదలై, చిలీలో అనేక నెలలుగా సాగుతున్న నిరసనలు ఆధునిక విప్లవానికి ప్రతీకలు. వెరసి, పాత రాజ్యాంగానికి పాతరేసి, సమాజంలోని విభిన్నతనూ, దశాబ్దాలుగా దూరం పెట్టబడిన అణగారిన వర్గాలనూ ప్రతిబింబించే కొత్త రాజ్యాంగం దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఏడాది జూలైలో ‘చిలీ రాజ్యాంగ సభా కూటమి’ ఏర్పాటు అందులో ఓ మైలురాయి. తాజాగా దేశాధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బోరిక్ విజయం ప్రజలు కోరుకుంటున్న మార్పుకు పడ్డ రాజముద్ర. చరిత్ర చూస్తే, అలెండి తర్వాత 1973లో వచ్చిన నియంత పినోఛెట్ ప్రభుత్వ నిరంకుశ పాలన ప్రసిద్ధం. ఆపైన 1990లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలొచ్చినా, లాభం లేకపోయింది. రాగి ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా ముందుండే రెండు కోట్ల జనాభా చిలీలో ధనిక, పేద తేడాలు పెచ్చరిల్లాయి. ఆ తేడా పోగొట్టి, పేదల అనుకూల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని వామపక్ష సంకీర్ణ అభ్యర్థిగా బోరిక్ ప్రచారం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఆరాధించే కోటీశ్వరుడు కస్ట్ను బహుళ జాతి సంస్థలు, మీడియా, అమెరికా బలపరిచాయి. కానీ, రైతులు, కార్మిక సంఘాలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు కలసికట్టుగా బోరిక్ వెంట నిలిచి, ప్రత్యర్థిని ఓడించాయి. కానీ, రెండేళ్ళ క్రితం జనాన్ని వీధుల్లోకి రప్పించిన అనేక అంతర్లీన సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, మితిమీరిన విశ్వవిద్యాలయ ఫీజులు, నూటికి 80 మందికి నెలవారీ కనీస వేతనం (418 డాలర్ల) కన్నా తక్కువ పింఛను – ఇలా ఎన్నో. ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డ రాగి ఎగుమతులకు కొత్త రాజ్యాంగం పెట్టే కఠిన పర్యావరణ నిబంధనలతో ఇబ్బంది తలెత్తవచ్చు. కరోనా దెబ్బతో ఇప్పటికే కుటుంబాలు కుదేలయ్యాయి. వార్షిక ద్రవ్యోల్బణం ఏడేళ్ళ గరిష్ఠానికి చేరింది. అయితే, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉంటూనే, దేశంలో సాంఘిక హక్కులను విస్తరిస్తామన్నది బోరిక్ మాట. అందుకే, వచ్చే మార్చిలో ఆయన పాలన చేపట్టాక, శ్రామిక వర్గాలకు తోడ్పడే మార్పులు వస్తాయని జనం భావిస్తున్నారు. వాగ్దాన పాలనకై యువతరం నుంచి ఒత్తిడీ తప్పదు. ఈ సమస్యలు అటుంచితే, మొత్తం మీద లాటిన్ అమెరికాలో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఆ ప్రాంత ప్రజాస్వామ్యాలు రాజీ లేని భావాలతో ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. పెరూ, నికరాగ్వా, హోండూరస్, ఇప్పుడు చిలీ – నాలుగింటా వామపక్ష అభ్యర్థులే అధ్యక్షులయ్యారు. వచ్చే మేలో కొలంబియాలో, అక్టోబర్లో బ్రెజిల్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ లెఫ్ట్దే విజయమని సర్వేల అంచనా. వామపక్ష భావజాలానికి అక్కడి ప్రజల్లో సానుకూలత పెరుగుతున్నట్టు అర్థమవుతోంది. వెరసి, చిలీ సహా లాటిన్ అమెరికా ప్రాంతమంతా ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే, ప్రగతిశీల ‘నూతన సహస్రాబ్ది వామపక్షవాద’ విజృంభణను వీక్షిస్తోంది. సాదరంగా స్వాగతిస్తోంది. -
చలిపులితో పోరాటం!
దేశమంతా గజగజ వణుకుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా డిసెంబర్ నాటికే చలి పులి చేతికి చిక్కి, జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తత్ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధానిని చలి గాలి బలంగా తాకింది. ఢిల్లీలో ఈ సీజన్లోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత (3.1 డిగ్రీలు) సోమవారం నమోదైంది. కొద్దిరోజులుగా శ్రీనగర్లో వరుసగా రెండు రాత్రుళ్ళు మైనస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయింది. రాజస్థాన్లోని చురూలో ఏకంగా మైనస్ 0.5 డిగ్రీలకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు చలితో గడగడలాడుతున్నాయి. శీతల, అతి శీతల గాలుల గుప్పెట్లో ఉత్తర భారతావని ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు బాధలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము – కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ – బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు ఇప్పటికే తీవ్రమైన చలి గాలుల్లో చిక్కుకున్నాయి. మార్గశిర, పుష్య మాసాల హేమంత ఋతువులో శీతల పవనాలు, హిమ శీకరాలు సాధారణమే. కానీ, ప్రకృతి కోపించినట్లు ఇంతలేసి చలి మాత్రం ఇటీవలి అసాధారణం. 1991 నుంచి 2019 మధ్య మూడు దశాబ్దాల్లో శీతల గాలులు విజృంభిస్తున్నాయనీ, గత రెండు దశాబ్దాల్లో 4,712 మంది చనిపోయారనీ అధికారిక లెక్క. మానవ తప్పిదాల వల్ల ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతకాలంలో చలి – మూడూ దుర్భరస్థాయికి ఎగబాకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకర పరిణామం. ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులు వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధి, పర్యావరణం, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షాత్తూ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఆ మాట చెప్పింది. వర్ధమాన దేశాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో కొండ ప్రాంతాలు, వాటిని ఆనుకొన్న మైదానాలతో 17 రాష్ట్రాలలో ‘ప్రధానమైన శీతల గాలుల జోన్’ విస్తరించి ఉంది. దాదాపు 90.90 కోట్ల జనాభా ఈ జోన్లోనే జీవిస్తోంది. వీరిని బాధిస్తున్న శీతల గాలులపై ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకొనేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్డీఎంఏ) ఈ ఏప్రిల్లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎవరు, ఎంత వరకు ఆచరణలో పెట్టారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. కనిష్ఠ ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తగ్గినా, పర్వత ప్రాంతాల్లో సున్నా డిగ్రీల కన్నా తగ్గినా అది ‘శీతల గాలి’ పరిస్థితి అని భారతీయ వాతావరణ శాఖ లెక్క. మరోలా చెప్పాలంటే, సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గితే – కోల్డ్ వేవ్. 6.4 డిగ్రీలకు మించి తగ్గితే, తీవ్రమైన కోల్డ్ వేవ్. దేశంలో అనేక చోట్ల ఇప్పుడీ పరిస్థితే ఉంది. తలదాచుకొనే గూడు, ఒంటి నిండా వస్త్రాలు లేని అధిక శాతం మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్య సంస్థలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబాలు పడకలు ఖాళీ లేక, చలిలో రోడ్డు మీద తాత్కాలిక గుడారాలు వేసుకొని, కాలక్షేపం చేస్తున్న దయనీయ దృశ్యాలు జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ళుగా ప్రతి ఏటా దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు ఈసారీ షరా మామూలు కావడం విషాదం. ప్రభుత్వాలు, పాలకుల పాత్ర ఇక్కడే కీలకం. తలదాచుకొనేందుకు నీడ లేని నిర్భాగ్యులను ఎముకలు కొరికే చలికి వదిలేయడం ఏ రకంగా చూసినా ధర్మం కాదు. నిజానికి, నిరాశ్రయులకు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని షెల్టర్లున్నది దేశ రాజధానిలోనే! ఈసారి కూడా నిరాశ్రయులను చలి కోరల నుంచి కాపాడేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నవంబర్లోనే యాక్షన్ ప్లాన్ను ప్రకటించింది. మొన్న నవంబర్ 7 నుంచి వచ్చే మార్చి 15 వరకు ఆ ప్లాన్ను అమలులో పెడతామంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 206 షెల్టర్లలో 7092 మందికి ఆశ్రయమిచ్చే అవకాశం ఉంది. కొత్తగా మరో 2 వేల మందికి, 250 తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ సంకల్పించింది. చాపలు, దుప్పట్లు, లాకర్లు, కాలకృత్యాలకు వసతులు – అన్నీ కల్పిస్తా మన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లున్నట్టు జాతీయ మానవ హక్కుల సంఘం సహా అనేక ఎన్జీఓల పరిశీలనలో వెల్లడైంది. నిరాశ్రయుల సంఖ్యకు తగ్గట్టు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా దయనీయావస్థలో ఉన్నాయి. అవసరార్థులకు సమీప షెల్టర్ల సమాచారం చెప్పే పరిస్థితి లేదు. తెలిసి వెళ్ళినా, రాత్రి 8 గంటల వేళకే జనంతో నిండిపోతున్నాయి. చాలామందికి జాగా లేని దుఃస్థితి. దాదాపుగా దేశంలోని ప్రతి నగరంలోనూ నిర్భాగ్యులకు ఎదురవుతున్నది ఇలాంటి నిర్లక్ష్యమే! అసలు ఇలాంటి అభాగ్యులకు నిలువ నీడ కల్పించడానికి ‘జాతీయ పట్టణప్రాంత జీవనోపాధి ప్రణాళిక – పట్టణప్రాంత నిరాశ్రయులకు ఆవాసం’ పేరిట ఓ జాతీయ ప్రణాళిక ఉంది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరాశ్రయుల కోసం గౌరవప్రదమైన, శాశ్వత షెల్టర్లను నిర్మించడం చట్టప్రకారం విధాయకం. కానీ, స్థానిక, రాష్ట్ర సర్కార్లు ఏ మేరకు చొరవ చూపుతున్నాయి? ఇప్పటికైనా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు కాగితంపై ఉన్న కేంద్రీయ విధానాన్నీ, కోర్టు మార్గదర్శకాలనూ తు.చ. తప్పక కార్యాచరణలో పెట్టాలి. అప్పుడే ఈ చలి పులి పంజా విసురు నుంచి నిర్భాగ్యులు తప్పించుకోగలుగుతారు. -
పెత్తందారీ పొలికేక
అన్నిభాషల్లో కూడా కొన్ని పదాలకు ఒక క్యారెక్టర్ స్థిర పడిపోయి ఉంటుంది. కొన్ని పదాల్లో హీరోయిజం కన బడుతుంది. కొన్ని పదాలు విలనిజాన్ని ప్రదర్శిస్తాయి. మరికొన్ని మాటల్లో శక్తిమంతుడైన ఒక సాఫ్ట్ విలన్ కనిపిస్తాడు. ఇంగ్లీష్ మాట ‘హెజెమొనీ’ (Hegemony) దీనికి మంచి ఉదాహరణ. తెలుగులో దీనికి సమానార్థకంగా ‘ఆధిపత్యం’ అనే మాటను ఉపయోగిస్తున్నాం. ఆధిపత్యం శ్రుతిమించినపుడు కొండొకచో... పెత్తందారీతనం అనే మాటను కూడా ఆశ్రయిస్తున్నాం. అనేక దేశాలున్న ప్రపంచంలో కొన్ని దేశాల ఆధిపత్యం, భిన్న వర్గాలతో కూడిన సమాజంలో ఒకటి, రెండు వర్గాల ఆధిపత్యం సమ్మతమేనా? అటువంటి సమ్మతి స్వచ్ఛందంగా వస్తుందా? లేక కండబలంతో, కత్తులు కటార్లతో, తుపాకీ తూటాలతో సాధిస్తారా? ఆదియందు కండబలంతోనే ఆధిపత్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ కాలక్రమంలో బుద్ధిబలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని తొలుత గుర్తించి సిద్ధాంతీకరించిన వ్యక్తి ఇటాలియన్ తత్త్వవేత్త ఆంటోనియో గ్రామ్సీ. యథేచ్ఛగా కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నప్పటికీ పశ్చిమ యూరప్ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం స్థిరపడి పోవడానికి కారణాలను ఆయన అన్వేషించారు. ఆధిపత్య వర్గాలు ప్రవేశపెట్టిన నీతినియమాలు, సాంఘిక కట్టుబాట్లు, కథలూ, సామెతలు, సంప్రదాయాలన్నీ కలిసి ఒక ఆధిపత్య భావజాలం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. మనదేశంలో కర్మ సిద్ధాంతం ఈ భావజాలాన్ని బలంగా నిలబెట్టింది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యంలో ఎంత మహిళా విద్వేషం దాగి ఉన్నప్పటికీ చలామణి కావడానికి కారణం ఆధిపత్య భావజాల ప్రభావమే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యం సామాజిక ఉన్మాదంలోంచి దూసుకొచ్చింది. సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలం కారణంగా ఇటువంటి అమానుష వ్యాఖ్యానాలన్నీ నిర్లజ్జగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందు కొచ్చిన కమ్యూనిస్టు, సోషలిస్టులు కూడా ఈ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య భావజాలం వల్ల అణచివేతకు గురవుతున్న వర్గాలు, ప్రాంతాల్లో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఈ చైతన్యం అస్తిత్వ పోరాటాల రూపాన్ని, సాధికారత సాధన ఉద్యమాల రూపాన్ని తీసుకుంటున్నది. ఈ పరిణామాన్ని మనం ప్రపంచమంతటా చూడగలుగుతున్నాం. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిణామానికి అతీతం కాదు. తెలుగువారి ఆధునిక చరిత్రను రెండున్నర కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గ ప్రయోజనం, దాని భావజాలం చాలాకాలంగా ప్రభావితం చేస్తున్నది. పత్రికలు, పుస్తకాల ప్రచురణ, సినిమాలతో మొదలైన సాంస్కృతిక ఆధిపత్యం మొత్తం మీడియాను గుప్పెట్లోకి తీసుకునే దాకా నిరాటంకంగా సాగిపోయింది, సాగుతూనే ఉన్నది. ఆ రెండున్నర జిల్లాల తెలుగు యాసనే వారు ప్రామాణిక భాషగా స్థిరపరిచారు. మిగిలిన ఇరవై జిల్లాల వారు అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సమస్త గ్రంథాలు, పత్రికల ప్రచురణ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది. సినిమాల్లో, నవలల్లో... పనివాళ్లకూ, కమెడియన్లకూ మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఉండేది. వారితో మాట్లాడించి రెండున్నర జిల్లాల నాయికానాయకులు పడిపడి నవ్వేవారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, హైదరాబాద్ పాతబస్తీలో, విశాఖ షిప్యార్డ్ సమీపంలో ఉండే దుర్మార్గులు, దుష్టులైన విలన్లకు రెండున్నర జిల్లాల కథానాయకులు తాట తీసే సన్నివేశాలను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక వర్గపు ఆధిపత్య భావజాలం తెలుగునాట గజ్జెకట్టి నర్తించిన వైనాన్ని మొత్తంగా రాస్తే రామాయణ మంత! చెబితే భారతమంత!! అస్తిత్వ పోరాటాల యుగం ఇది. అణచివేతకు గురైనవారు సాధికారత శంఖం పూరిస్తున్న కాలం ఇది. ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మొదలైన అస్తిత్వ పోరాటానికి రాజకీయ వేదిక తోడవటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం 1953–56 మధ్యకాలం నాటిది. ఈ సమయంలో రాష్ట్రానికి కర్నూలు రాజధాని. హైకోర్టు గుంటూరులో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు అన్ని ప్రాంతాల నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ‘విశాలాంధ్ర’ అనే ఉమ్మడి ప్రయోజనం కోసం 1956లో రాజధాని హోదాను కర్నూలు త్యాగం చేసింది. ఇప్పుడు విశాలాంధ్ర రద్దయిన నేపథ్యంలో పూర్వపు ఆంధ్రరాష్ట్రం పునరుత్థానమైంది. తాను గతంలో త్యాగం చేసిన హోదాను ఇప్పుడు కర్నూలు డిమాండ్ చేస్తే తప్పెట్లా అవుతుంది? ఆధిపత్య భావజాలం ఇప్పుడు అమరావతి రూపంతో అస్తిత్వ పోరాటాలకు, సాధికారత ఉద్యమాలకు ఒక సవాల్ను విసురుతున్నది. న్యాయబద్ధంగా పూర్వపు రాజధాని హోదా దక్కవలసిన కర్నూలుకు న్యాయరాజధాని హోదాను కూడా ఇవ్వడానికి వీలులేదని వాదిస్తున్నది. ఎందుకు వీల్లేదో హేతుబద్ధంగా వివరించడానికి అది నిరాకరిస్తున్నది. రాయలసీమ ప్రాంత అస్తిత్వ గౌరవాన్నీ, ఆత్మగౌరవ ఆకాంక్షనూ అది తృణీకరిస్తున్నది. రాజధాని మొత్తం ఒకేచోట... అదీ అమరావతిలోనే ఉండాలనే వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఆధిపత్య భావజాలం రాష్ట్రంలోని అన్ని జెండాలనూ ఏకం చేసింది. ఆధిపత్య వర్గాలకు జెండాలు ఎన్ని ఉన్నా ఎజెండా ఒక్కటేనని నిన్నటి తిరుపతి సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. కమ్యూనిస్టు నారాయణుడు, కాషాయ లక్ష్మీనారాయణుడూ చేతులు కలిపి భుజం, భుజం కలిపి నిలబడిన దృశ్యం భేష్. ఈ రాష్ట్రంలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సాధికారత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది కష్టజీవుల కళ్లలో ఈ దృశ్యం ముద్రితమైంది. వారిక తుది నిర్ణయం తీసుకుంటారు. చిరకాలంగా మన మెదళ్లను ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్న కారణంగా, తన ప్రచార–ప్రసార సాధనాల ద్వారా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా రాజధాని విషయంలో తటస్థ మేధావుల ‘సమ్మతి’ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసే కార్యక్రమాన్ని ఆధిపత్య వర్గాలు చేపట్టాయి. ‘మ్యాన్యుఫ్యాక్చరింగ్ కన్సెంట్– ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మాస్ మీడియా’ పేరుతో సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ ఒక పుస్తకాన్నే రాశారు. ఇక్కడ మాస్ మీడియా ఉండేది... ఆధిపత్య వర్గం చేతుల్లోనే. తమకు అనుకూలమైన విధంగా ప్రజాభిప్రాయాన్ని మాస్ మీడియా ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారో చోమ్స్కీ ఈ పుస్తకంలో వివరించారు. ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసే మన మీడియా చోమ్స్కీ చెప్పిన పద్ధతులకు మరిన్ని ‘మెరుగులు’ దిద్ది, అధిక ‘ఉత్పత్తి’ని ఇప్పటికే సాధించింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి కదా! మూడు చోట్ల ఎందుకు? ఒక్కచోటనే ఉంచి ఒక మహానగరాన్ని నిర్మించి నట్లయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా? చంద్రబాబుకు హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్నది కదా? ఆ అనుభవంతో ఇక్కడా అటువంటి నగరాన్ని నిర్మించలేరా? ఇటువంటి అభిప్రాయాలను ఉత్పత్తి చేసి ప్రజల మెదళ్ళలో జొప్పించడానికి ఆధిపత్య వర్గాలు శాయశక్తులా ప్రయ త్నిస్తున్నాయి. తటస్థులూ, బుద్ధిజీవులు, ఉద్యోగ–వ్యాపార, మధ్యతరగతి ప్రజలందరూ ఇక్కడొక రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి. మొదటిది కర్నూలులో న్యాయరాజధాని సంగతి. ఇది అస్తిత్వ పోరాటాల యుగమని ముందుగానే చెప్పుకున్నాం. వెనకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతం తరఫున కర్నూలు పోటీలో నిలబడింది. గతంలో రాజధానిని త్యాగం చేసిన అనుభవంతో అర్హతల రీత్యా మొదటిస్థానంలో నిలబడి ఉన్నది. అటువంటి నగరానికి న్యాయ రాజధానినైనా కేటాయించకపోతే ఆ ప్రాంతంలో అసంతృప్తి రేకెత్తకుండా ఉంటుందా? ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించకుండా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన సంగతిని విస్మరించడం సరైనదేనా? కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసినట్లయితే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటో సహేతుకంగా ఎవరైనా చెప్పగలరా? హైకోర్టును ఏర్పాటు చేయవచ్చును గానీ, న్యాయ రాజధానిగా చెప్పడానికి వీల్లేదని బీజేపీ మరొక వింత వాదన లేవదీసింది. అలా అనడం ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా? ఇక రెండో విషయం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు గురించి! ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అస్తిత్వ సమస్య వెన్నాడుతున్నది. తరతరాలుగా వివక్షకు గురవుతన్నామన్న ఆవేదన ఈ ప్రాంతానికి ఉన్నది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు కలిసి జీవించే కాస్మోపాలిటన్ నగరం. అమరావతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు కావాలని వచ్చేవారిని కులం అడిగే సంప్రదాయం ఇక్కడ లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అక్కున చేర్చుకునే స్వభావం. కొంత రాజకీయ సంకల్పం తోడైతే చాలు, తూర్పుతీరంలో ఒక మహానగరంగా అవతరించడానికి అనేక భౌగోళిక అనుకూలతలు ఉన్న నగరం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కొంత ఫోకస్ పెడితే రెండు మూడేళ్ళలోనే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆలంబనగా నిలబడగల అభివృద్ధి ఇంజన్గా విశాఖ అవతరించగలదు. విశాఖతో పోలిస్తే ఆర్థికంగా అందుబాటులోకి రాగల అవకాశాలు అమరావతిలో మృగ్యం. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదన్న నానుడిని గమనంలో ఉంచుకోవాలి. హైదరాబాద్ నగరానికి పునాది వేసినప్పుడు ఖులీ ఖుతుబ్షా, అల్లాను వేడుకున్నాడు. నీళ్లలో చేపల్ని కలిపినట్టు నగరం జన సమ్మర్దంతో నిండేలా చూసే భారాన్ని ఆయన అల్లా దయకే వదిలేశారు. భవనాలు నిర్మించినంత మాత్రాన జరిగేది ఏముండదనీ, జనం నివసించాలంటే అక్కడ ఉపాధి అవకాశాలు లభించే, ఆర్థిక కార్యక్రమాలు పెరగాలనే విచక్షణ గలవాడు కనుకనే ఖులీ... అల్లాను ప్రార్థించాడు. మలేషియాలో కొత్త రాజధానిగా పుత్రజయను నిర్మించినప్పటికీ ఆర్థిక భారాన్ని మోస్తున్నది ఇప్పటికీ కౌలాలంపూరే! హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే అరడజన్ దాకా ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అస్తిత్వ సమస్యను పరిష్కరించడానికీ, ఆర్థిక చోదకశక్తిని తయారుచేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత మూడు రాజధానులు అత్యావశ్యకం. హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టుగా చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక బోగస్ ప్రచారం. హైదరాబాద్ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేయడం కూడా ఆధిపత్య వర్గాలు ‘ఉత్పత్తి’ చేసిన అభిప్రాయమే. హైదరాబాద్ వయసు 430 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచీ ఇది రాజధాని నగరమే. ప్రపంచంలోనే విలువైన వజ్రాలకూ, మేలి ముత్యాలకూ కేరాఫ్ అడ్రస్. కోహినూర్, జాకబ్ వజ్రాలను సానబట్టిన నగరం. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినవాడు – హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే డజన్కు పైగా భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు వెలసిన నగరం. మరో డజన్ రక్షణ, పరిశోధనా సంస్థలకు ఆవాసం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల కూడలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది కూడా వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో! ఔటర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, నిర్మాణం వైఎస్సార్ హయంలోనే జరిగాయి. అలైన్మెంట్ ఖరారు సమయంలోనే కదా ఎల్లోమీడియా మొఘల్ రాజశేఖర్ రెడ్డిపై కత్తి కట్టింది?. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్రోడ్డునూ, ఎయిర్పోర్టునూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జనాన్ని పిచ్చివాళ్ళను చేయగల సామర్థ్యం ఆధిపత్య భావజాలానికి ఉన్నదని వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే వారు అమరావతి రూపంలో ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇతర ప్రాంతాల అస్తిత్వ ఆకాంక్షలను అవహేళన చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిరుపేదలకు, సామాన్యులకు, అమరావతిలో నివాసయోగ్యత లేదని న్యాయస్థానం దాకా వెళ్ళి అడ్డు కున్నారు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల జెండాలన్నింటినీ ఏకం చేసి సామాన్య ప్రజల మీద వారి ఆకాంక్షల మీద యుద్ధాన్ని ప్రకటించారు. పెత్తందార్లంతా ఒక్కటై తిరుపతిలో పొలికేక పెట్టారు. సామాన్య ప్రజల సాధికార పోరాటశక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక సామాన్య మహిళ కణ్ణగి శపిస్తేనే మదురై నగరం దగ్ధమైందని ప్రాచీన తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ మనకు బోధిస్తున్నది. అరడజన్ జెండాలు చూసి మురిసిపోతే భంగపాటు తప్పదు. అటువైపు ఐదుకోట్ల జనం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిశీధిలో ఓ దీపం!
‘మన ప్రజాస్వామ్యం మేడిపండు– మన దరిద్రం రాచ పుండు’ అన్నాడొక కవి... ఇప్పుడు కాదు, మూడు నాలుగు దశాబ్దాల కిందట! కాలం గడిచేకొద్దీ మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని మనం గట్టిగా నమ్ముతున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతుంటాము. ప్రజాస్వామ్య వ్యవస్థలపై రేటింగ్స్ ప్రకటించే కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రం క్రమం తప్పకుండా మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బలు కొడుతున్నాయి. ఐరోపా సంస్థ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్లు ప్రకటించే డెమోక్రసీ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్కు 53వ స్థానం దక్కింది. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ అనే సంస్థ 23 దేశాలను మాత్రమే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలుగా గుర్తించింది. అందులో మనకు స్థానం దొరకలేదు. పాక్షిక స్వేచ్ఛ కలిగిన 52 దేశాల జాబితాలో మాత్రం చోటు దక్కింది. పౌరులందరి హక్కులకూ గట్టి రక్షణ లభించడం, సమస్త భౌతిక బౌద్ధిక వనరులన్నీ సమానంగా అందుబాటులో ఉండడం వంటి అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య వ్యవస్థల పరిణతిని లెక్కిస్తారు. ఈ లెక్కలతో కొలుచుకుంటే చాలు. మనకు ఏ అంతర్జాతీయ సంస్థల రేటింగ్స్తో అవసరం లేదు. మన ప్రజాస్వామ్యం మేడిపండుగా మారిందని చెప్పడానికి మన దైనందిన జీవితానుభవాలు చాలు. ఎందుకిలా జరుగు తున్నది? పరిణతితో వికసించవలసిన ప్రజాస్వామ్యం పరిమిత ప్రజాస్వామ్యంగా ఎందుకు ముడుచుకొని పోతున్నది? ప్రపం చంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనకు ఉన్నప్పటికీ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో కూడిన అధికార విభజన అమలులో ఉన్న ప్పటికీ ఎందుకు పురోగమించలేకపోతున్నామనేది చర్చనీయాం శంగా మారింది. రాజకీయ పార్టీల్లో ఏర్పడుతున్న సైద్ధాంతిక శూన్యత కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుడుకు ఒక ప్రధాన కారణంగా రాజనీతి శాస్త్ర నిపుణులు పరిగణిస్తున్నారు. ఏరకమైన సామా జిక పరివర్తనను తాము కోరుకుంటున్నామో ఒక స్పష్టమైన అవగాహన, ఆ స్థితికి చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ కలిగి ఉండడమే రాజకీయ పార్టీ సిద్ధాంతంగా, దాని తాత్విక భూమికగా పరిగణించవచ్చును. ఆదిలో అన్ని రాజకీయ పార్టీ లకూ తమదైన ఒక తాత్వికత ఉండేది. సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థగా, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నది. మొదట్లో ఈ దిశగా కొన్ని అడుగులు వేసిన ఆ పార్టీ క్రమంగా దారితప్పిన వైనం మన కళ్లముందున్నది. అధికారం నిలుపు కోవడానికి ఆ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలను ఆశ్రయిం చింది. ఆ బ్యాంకులో ప్రవేశం దొరకని వర్గాలను దూరం చేసు కున్నది. ఫలితంగా అధికారానికి దూరమైంది. ఉత్తరాదిలో దాని పతనానికి ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆరెస్సెస్ భావజాలమేనన్నది బహిరంగ రహస్యం. మతం సెంటిమెంట్తో ఓట్లు తెచ్చుకోవాలి గనుక ఆరెస్సెస్ ఎజెండాలోని హిందూత్వ జెండాను మాత్రం వెలిసిపోకుండా బీజేపీ కాపాడుకుంటున్నది. కానీ ఆర్థిక రంగంలోని చాలా అంశాల్లో ‘నాగపూర్’ భావజాలానికి భిన్నమైన వైఖరినే బీజేపీ తీసుకుంటున్నది. రాజకీయ అవసరాల కోసం పొత్తులు – ఎత్తుల్లో కూడా బీజేపీ చాలా స్వేచ్ఛను తీసుకుంటున్నది. ఈ రెండు జాతీయ పార్టీలే కాదు, దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు వాటి సైద్ధాంతిక నిబద్ధత నుంచి పక్కకు తప్పుకు న్నాయి. రామ్మనోహర్ లోహియా సోషలిస్టు వారసత్వంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ– ములాయంసింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్వాదీ పార్టీ. కానీ, ఈనాటికీ ఆ పార్టీ దళిత వర్గాల ప్రజల దరికి చేరలేకపోయింది. సోషలిస్టు – వామపక్ష భావజాల ప్రభా వంతో ఎన్టీరామారావు తన తెలుగుదేశం పార్టీ విధానాలను తయారు చేసుకున్నారు. ఆయన దగ్గర్నుంచి పార్టీని దొంగి లించిన ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీని పూర్తిగా తలకిందు లుగా నిలబెట్టారు. పేదవర్గాల సంక్షేమ ప్రణాళికను తిరగరాసి, సంపన్న వర్గాలకు కమీషన్ ఏజెంట్గా పనిచేసే పార్టీగా తయారుచేశారు. ఈ పార్టీలన్నీ ఓట్ల కోసం ఉపయోగితా వాదాన్ని (utilitarianism) ఆశ్రయించాయి. ఎన్నికల ప్రణాళి కల్ని చెక్బుక్ మేనిఫెస్టోలుగా మార్చివేశాయి. సైద్ధాంతిక నిబద్ధత లేని రాజకీయాలకు సహజంగానే ప్రజా స్వామ్యం పట్ల నిబద్ధత ఉండదు. ప్రజల పట్ల బాధ్యత ఉండదు. ఫలితంగా రాజకీయ రంగం నుంచి ప్రజా సేవకులు అదృశ్యమై వ్యాపారులు ప్రవేశించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని భారత రాజ్యవ్యవస్థ తూచా తప్ప కుండా స్వీకరించి ఉన్నట్లయితే దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. అన్నార్తులు, అభాగ్యులు, దిక్కుమొక్కు లేని జనమంతా ఒక్కో సాధికారిక బాణమయ్యేవారు. శతకోటి నరనారీ నిపుణ జన సందోహంతో మన దేశం అగ్రరాజ్య హోదాను సవాల్ చేయగలిగి ఉండేది. అంబేడ్కర్ అందిం చిన అమూల్య అవకాశాన్ని ఈ దేశం జారవిడిచింది. రాజ్యాం గాన్ని అమలుచేయడంలో మూడు ప్రభుత్వ ఎస్టేట్లూ పాక్షి కంగా విఫలమయ్యాయి. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియా పరిస్థితి ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా ప్రపంచ డెమోక్రసీ ఇండెక్స్ల దగ్గర నుంచి హంగర్ ఇండెక్స్ల దాకా భారత్ పరిస్థితి అవమానకరంగా దిగజారి పోయింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ ‘ప్రవేశిక’ (preamble)లో రాజ్యాంగ లక్ష్యాలను స్థూలంగా ప్రవచించారు. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమకూర్చడానికి, ఆలోచనా భావ ప్రకటనా విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను సమకూర్చడానికి, అవకాశాల్లో హోదాల్లో సమానత్వం సాధించడానికి, వ్యక్తుల గౌరవ మర్యాదలకు హామీపడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపజేయడానికి, దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్గా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామని ఈ ‘ప్రవేశిక’లో పేర్కొన్నారు. దేశ లౌకికత్వం మీద ఈనాటికీ నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సామ్యవాదానికి విడాకులు ఇచ్చేశాము. ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ ర్యాంకుల్ని చూస్తూనే ఉన్నాము. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ లభించడం లేదన్నది నిర్వివాదమైన అంశం. ఈ డెబ్బయ్యేళ్లలో దేశంలో ఆర్థిక – రాజకీయ – సామాజిక అసమానతలు మరింత పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం. మొన్న పదో తేదీనాడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని పాటించారు. మన దేశంలో కూడా వేలాది కార్యక్రమాలు జరిగాయి. విజయవాడలో జరిగిన అటువంటి ఒక సభకు తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జై భీమ్’ సినిమా కారణంగా జస్టిస్ చంద్రూ ఇప్పుడు దేశ ప్రజలందరికీ సుపరి చితులయ్యారు. ఓటీటీ ప్లాట్ఫామ్పై అఖండ విజయం సాధిం చిన చిత్రమిది. జస్టిస్ చంద్రూ నిజజీవిత కథలో ఒక చిన్నభాగం ఈ చిత్రం ఇతివృత్తం. చదువుకునే రోజుల్లోనూ, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే రోజుల్లోనూ పౌరహక్కుల రక్షణ కోసం గళం విప్పిన నేపథ్యం ఆయనది. సీపీఎం, దాని అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి కష్టజీవుల పక్షాన ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరుపేదలనూ, నీడలేని వారినీ భారత రాజ్యాంగ నీడలో నిలబెట్టడానికి ఒక న్యాయవాదిగా ఆయన అవిరళమైన కృషి చేశారు. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రయోజనాలను ఈ దేశ ప్రజలు గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే వారిని ‘ఎంపవర్’ చేయవచ్చుననే ఆలోచన ఆయనకు ఉన్నట్టు ఈ సినిమా ద్వారా అర్థమవుతున్నది. సినిమాకు ‘జై భీమ్’ అనే టైటిల్ పెట్టడంలో చంద్రూ పాత్ర ఉన్నదో లేదో తెలియదు కానీ, ఆ టైటిల్ వెనుక అంతరార్థం మాత్రం అదే. జై భీమ్ అనేది ఇప్పుడొక జనన్ని నాదం. ఒక రణన్నినాదం. తరతరాల వంచనకూ, మోసానికీ, దోపిడీకీ గురైన ప్రజానీకం చేసిన పలవరింతే జై భీమ్. జై భీమ్ ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని నిస్సహాయ ప్రజలకు కవచంగా ఉపయోగించినవాడు జస్టిస్ చంద్రూ. ఆయన వాదించిన అనే కానేక కేసుల్లో ఒకటి మాత్రమే ‘జై భీమ్’ సినిమా. భారత రాజ్యాంగ రచన చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మరణే – జై భీమ్. ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఆవరించిన సైద్ధాం తిక శూన్యతకు ప్రత్యామ్నాయం జనసాధికారత సిద్ధాంతం. సైద్ధాంతిక నిశీధిలో ఒక దీపం సాధికారత. ఈ సాధికారత సాధన కోసం తన జీవితకాలాన్ని జస్టిస్ చంద్రూ వెచ్చించారు. రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేట్టు చూసినట్లయితే అది బలహీనవర్గాల అభ్యున్నతికి ఒక సంజీ వనిలా తోడ్పడుతుందని ‘జై భీమ్’ సినిమా ఇచ్చిన సందేశం. జస్టిస్ చంద్రూ జీవిత పాఠం కూడా! ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రారంభమైన బలహీనవర్గాలు – మహిళల ఎంపవర్మెంట్ కార్యక్రమాలు కూడా ఇప్పుడిప్పుడే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం రకరకాల వ్యూహాలతో ఈ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం. రాజధాని ప్రాంతంలో దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించింది. దీన్ని అడ్డు కోవడానికి తెలుగుదేశం పార్టీ శతవిధాలా పోరాడింది. పేదలకు అక్కడ ఇళ్లు కేటాయించినట్లయితే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) ఏర్పడుతుందని వాదించింది. రాజధానిలో సంపన్నులే తప్ప పేదలు నివసించకూడదట. ఇటు వంటి అహంభావ వైఖరి దాని వర్గస్వభావాన్ని బయట పెట్టింది. ఈ పేదవర్గాల వ్యతిరేక పార్టీ చేపట్టిన కృత్రిమ రైతు ఉద్యమంలో మన కామ్రేడ్స్కు తెలంగాణ, తేభాగ, పున్నప్ర– వాయిలార్ రైతు ఉద్యమాలు కనిపించడం ఆశ్చర్యకరం. వారికి లాల్ సలామ్! డబ్బున్నవారి పిల్లలతో సమానంగా నాణ్యమైన ఉచిత విద్యను, అంతర్జాతీయ పోటీల్లో నిలబడగల నైపుణ్య విద్యను అందరికీ అందజేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టి ప్రారంభించింది. ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అందరికీ ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం క్యూబా తరహా వైద్య విప్లవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ‘అమ్మ ఒడి’ ఒక అద్భుతం. ఈ పథకం వల్ల పిల్లలను ఒక బాధ్యతగా బడికి పంపించడం మాత్రమే కాదు, పిల్లల చదువుసంధ్యలను వారి భవిష్యత్తును నిర్ణయించే సాధికార శక్తిగా అమ్మ అవతరించింది. ఇటువంటి పథకాలను చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ల తరహా తాయిలాలతో పోల్చేవారి అజ్ఞానాన్ని క్షమిద్దాం. రాజ్యాంగ విహితమైన ఈ తరహా కార్యక్రమాలను దేశమంతటా చేపట్టిననాడు ‘బిలియన్ ఎంపవర్డ్ మిసైళ్ల’తో ఈ దేశం గర్జిస్తుంది. గర్విస్తుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇదిగో అభివృద్ధి చిరునామా!
ఇండియన్ యూనియన్లోని అన్ని రాష్ట్రాల సామాజిక – ఆర్థిక స్థితిగతులపై ‘ఇండియా టుడే’ మీడియా సంస్థ గత పద్దెనిమిదేళ్లుగా సర్వే చేస్తున్నది. ఏడెనిమిది అంశాలపై ఈ సర్వే ఉంటుంది. వివిధ రంగాల నిష్ణాతులతో కూడిన బృందం తుది ఫలితాలను నిర్ధారిస్తుంది. ఈ సంవత్సరానికి గాను తాజాగా వెలువరించిన ఫలితాల్లో ‘సమ్మిళిత అభివృద్ధి’ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్కు తొలిస్థానం లభించింది. సమ్మిళిత అభివృద్ధి అంటే ఏమిటి?... సమాజంలోని అన్ని వర్గాలు, సమూహాలకు ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందడం. పేదలకు కూడా విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉండటం. అవకాశాల్లో సమానత్వం. వెనుకబాటు తనానికి గురైన వారిని గుర్తించి వారిని సాధికార శక్తులుగా తీర్చిదిద్దడానికి వారి విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం. పర్యావరణ హితమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడం. అవకాశాల్లో, అధికారాల్లో స్త్రీ పురుష సమానత్వం. ప్రజలకు చేరువగా ఉండే సుపరిపాలన. సమ్మిళిత అభివృద్ధిలో ఇవన్నీ కీలకాంశాలు. వరల్డ్ సోషల్ ఫోరం, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ వేదికలు నిజమైన అభివృద్ధిని ఈ కోణం నుంచే చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రబోధిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ కూడా సమ్మిళిత అభివృద్ధిని అందుకోవడానికి ఉద్దేశించినవే. సమ్మిళిత అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధి ఒక భాగం మాత్రమే! ఏడంతస్తుల మేడలు ఒకవైపూ, పెరుగుతున్న మురికివాడలు ఒకవైపా? ఇదేమి న్యాయమని తరతరాల నుంచి తాత్వికులు, రచయితలు, సామ్యవాదులు ప్రశ్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రశ్నలకు పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే లభించిన ఒక సమాధానం సమ్మిళిత అభివృద్ధి. ఇది ఆర్థికాభివృద్ధి కంటే బహుముఖీనమైనది. విశాలమైనది. మానవీయమైనది. సంపద సృష్టి ఆర్థికాభివృద్ధికి తార్కాణం. సంపదను సృష్టించడంతోపాటు దాని పంపిణీ, ఫలితంగా ఏర్పడే సర్వతోముఖ సమాజ వికాసాన్ని ‘సమ్మిళిత అభివృద్ధి’ (Inclusive development) అంటాము. ఇటువంటి ఆదర్శప్రాయమైన అభివృద్ధి పథంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఓ నాలుగడుగులు ముందుకు వేసిందని ‘ఇండియా టుడే’ సర్వే ధ్రువీకరించింది. ఈ ధ్రువీకరణకోసం పరిశీలించిన అంశాలను కూడా ఆ మీడియా సంస్థ ప్రకటించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంటగ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ విస్తృతి, సార్వత్రిక ఆరోగ్య ధీమా, ప్రజా పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బడికి వెళ్తున్న పిల్లల శాతం, శాచ్యురేషన్ పద్ధతిలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాల ఆధారంగా సమ్మిళిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది. నిజానికి ‘ఇండియా టుడే’ ఎంచుకున్న పరిశీలనాంశాల పరిధిని దాటి మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ఆర్బీకే సెంటర్ల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణలో చిట్టచివరి దశకు చేరుకున్నట్టయింది. కడగొట్టున నిలబడిన పౌరునితో సర్కార్ కరచాలనం చేసినట్టయింది. వికేంద్రీకరణతోపాటు ప్రవేశపెట్టిన పారదర్శకత కూడా ముఖ్యమైన అంశం. ఏ రాజకీయ నాయకుని తోడు లేకుండా, ఏ పైరవీ లేకుండా, పైసా ఖర్చు కాకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి తన అర్హతలకు తగిన పథకంలో లబ్ధి కోసం పౌరుడు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత కాలపరిమితిలోగా ఆ దరఖాస్తు పరిష్కారం కావాలి. ఈ రకమైన పారదర్శకత, వికేంద్రీకరణలే సుపరిపాలనకు (good governance) కొండగుర్తులు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఆర్థిక సంవత్సరం. ఈ మూడేళ్ల బడ్జెట్లలో సామాజిక వ్యయంతోపాటు అభివృద్ధి వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ఘంటాపథంగా వెల్లడించింది. మొదటి బడ్జెట్లో ఒకలక్షా ఆరువేల కోట్లున్న అభివృద్ధి వ్యయం రెండేళ్లు తిరిగేసరికి 1 లక్షా 58 వేల కోట్లకు పెరిగిందని రిజర్వు బ్యాంకు విశ్లేషించింది. సోషల్ సెక్టార్పై చేసిన వ్యయం 78 వేల కోట్ల నుండి 1 లక్షా 13 వేల కోట్లకు పెరిగింది. గత మూడేళ్లుగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దులు పెరిగాయి. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు భారీగా పెరిగింది. చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–19) ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు రూ. 32,743 కోట్లు. వర్తమాన సంవత్సరం (2021–22)లో ఆ పద్దు రూ. 50,662 కోట్లకు చేరింది. మూడేళ్లలో 55 శాతం పెరుగుదల. ఈ మూడేళ్ల బడ్జెట్ పద్దుల్ని పరిశీలిస్తే మిగతా వ్యయాల కంటే అభివృద్ధి వ్యయమే ఎక్కువగా పెరిగింది. ఇవన్నీ రిజర్వు బ్యాంకు విశ్లేషణలో తేలిన లెక్కలు. నిపుణులు నిగ్గుతేల్చిన వాస్తవాలు ఇట్లా వుంటే – ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష కూటమి (టీడీపీ, మీడియా, ఇతర పార్టీల్లోని కోవర్టులు, స్లీపర్ సెల్స్ కలిపి) ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా తీసిందని, అభివృద్ధి జాడే లేదని, వచ్చిన ఆదాయాన్ని పప్పు బెల్లాలకు ఖర్చు చేస్తున్నారనీ, పరిపాలన స్తంభించిపోయిందనీ, ఈ కూటమి యుద్ధప్రాతిపదికపై ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారోధృతి ఏ స్థాయిలో వుందంటే, కొందరు తటస్థులుగా చెప్పుకునే వాళ్లు, మేధావులమనుకునేవాళ్లు, కూడా ఏమో నిజమే కామోసు అనుకునేంతగా! సుపరిపాలన దిశగా, సమ్మిళిత అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ అడుగులు పడుతున్నాయన్న ‘ఇండియా టుడే’ సర్వేకూ, రాష్ట్రంలో అభివృద్ధి వ్యయమే ఎక్కువుందనీ–ఉద్యోగుల జీతభత్యాల వ్యయం కూడా మూడేళ్లలో 55 శాతం పెరిగిందనీ రిజర్వు బ్యాంకు చేసిన విశ్లేషణకూ ఈ ప్రచారం పూర్తి విరుద్ధం. నిపుణుల అంచనాలకు భిన్నమైన గణాంకాలు ఎక్కడి నుంచి తెచ్చారని తటస్థులనుకునేవాళ్లు ప్రతిపక్ష కూటమిని ప్రశ్నించాలి. అలా కాకుండా వారి తప్పుడు ప్రచారంలో కొట్టుకొనిపోవడం బాధాకరం. అప్పులు వాస్తవం. ఆర్థిక ఇబ్బందులు వాస్తవం. అవి వారసత్వ సంపదగా ఈ ప్రభుత్వానికి సంక్రమించాయన్నది కూడా నిఖార్సయిన నిజం. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా 55 శాతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ఒక్క నగరం వాటా 75 శాతం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఈ ఆదాయ గండి పడింది. ఈ గండికి పరిహారాన్ని సమకూర్చడంలో నాటి అధికార ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత స్వయంగా చంద్రబాబే. తిలాపాపంలో తలా పిడికెడు పాత్ర ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ఎన్డీఏ సర్కార్కు అమ్మేసుకుని ఆంధ్రప్రదేశ్కు మరో భారీ గండిని తవ్వింది మళ్లీ స్వయంగా చంద్రబాబే! ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదనీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనీ ఆనాడు ఆయన సుభాషితాలు కూడా చెప్పారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రే నీళ్లొదులుకోవడంతో అది ‘గతం గతః’ పద్దులో పడిపోయింది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉపయోగించుకునే వెసులుబాటును కూడా చేజేతులా చంద్రబాబే వదిలేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో దొంగవేలు దూర్చి అడ్డంగా దొరికిపోయి, కేసుల భయంతో రాత్రికి రాత్రే బిస్తరు సర్దేశారు. ఐదేళ్ల పదవీకాలంలో ఉమ్మడి రాష్ట్రం చేసిన అప్పులను మించి చేశారు. అయినా బడ్జెట్ పద్దుల్లో అభివృద్ధి వ్యయానికి అగ్రాసనం దక్కలేదు. అప్పు చేసిన డబ్బులతో అధికారికంగా ఓట్ల కొనుగోలుకు కూడా ప్రయత్నించారు. అప్పుడు చేసిన అప్పులకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన వారసత్వ బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడింది. ఈ అప్పుల భారం మళ్లీ అప్పులకు దారి తీసింది. రాజధాని పేరుతో ఐదేళ్ల పుణ్యకాలాన్ని పూర్తిగా వ్యాపార లావాదేవీల కోసం హారతి కర్పూరం చేశారు. ఒక్క శాతం పనిని కూడా పూర్తి చేయలేదు. అసలు అమరావతి రాజధాని ప్రకటనే ఏకపక్షం. వ్యాపార ప్రేరేపితం. నిపుణుల అభిప్రాయాలకు విరుద్ధం. ప్రాంతీయ అసమానతలను తొలగించడం, ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించి నెరవేర్చడం కూడా సమ్మిళిత అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలే. రాయలసీమ వెనకబాటుతనానికి నెట్టబడిన ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రాజధాని హోదాను త్యాగం చేసిన ప్రాంతం. ఉత్తరాంధ్ర అలక్ష్యానికి గురైన ప్రాంతం. ఆధునిక తెలుగు సంగీత సాహిత్య సంస్కృతులకు తొలి భిక్ష వేసిన ప్రాంతం. ఈ ప్రాంతాల గుండె చప్పుళ్లను చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేసింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే... న్యాయ రాజధానిగా కర్నూలును, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. ఈ పని 2014లోనే చేసి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు అన్నివిధాలా కలిసి వచ్చేది. సమయం, డబ్బు వృథా కాకుండా వుండేవి. ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన కాస్మొపాలిటన్ నగరం. సహజసిద్ధ రేవు పట్టణం. కలకత్తా, చెన్నైలను మించి అంతర్జాతీయ సముద్ర వర్తకాన్ని శాసించగల సత్తా వున్న నగరం. దేశంలోని సహజ సంపదలో సగానికి పైగా నిక్షిప్తమై ఉన్న ఒడిషా, ఛత్తీస్గడ్, జార్ఖండ్లకు అందుబాటులో ఉన్న నగరం. రాజధాని హోదాను సమకూర్చి మౌలిక వసతులను జోడించినట్లయితే ఈ ఏడేళ్లలో ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి ఉండేది. ఇప్పుడు కూడా మూడు రాజధానులను అడ్డుకుంటూ చంద్రబాబు తన చారిత్రక తప్పిదాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా అడ్డుపడుతున్నారు. రావణాసురుడు జటాయువు రెక్కల్ని తెగనరికినట్టు చంద్రబాబు రాష్ట్ర ఆదాయ వనరుల్ని ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ఈ శాపాలతోపాటు ప్రపంచాన్నే శాపగ్రస్థం చేసిన కోవిడ్ మహమ్మారి వేటును కూడా కాచుకోవలసి వచ్చింది. రెండున్నరేళ్ల పాలనాకాలంలో రమారమి రెండేళ్లుగా కోవిడ్ ముప్పు తరుముతూనే వస్తున్నది. అన్ని రాష్ట్రాలు దేశాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అప్పోసప్పో చేసి ఈ రెండేళ్లలో లక్షా పదహారువేల కోట్ల రూపాయలను పేద వర్గాలకు నగదు బదిలీ చేయకపోయి ఉన్నట్లయితే ఏమి జరిగేది? పేద వర్గాలు అనాధలయ్యేవారు. కొనుగోలు శక్తి నశించి ఉండేది. వ్యాపారాలు దివాళా తీసేవి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్థులు కూడా ఉపాధి కోల్పోయేవారు. ఆర్థిక చక్రం విరిగిపోయి ఉండేది. ఈ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్రాన్ని పెను సంక్షోభం నుంచి కాపాడింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయి జవసత్వాలను కూడదీసుకుంటున్నది. ఇదీ జరిగింది. జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్రం దివాళా తీసిందని! ఈ దివాళాకోరు ప్రచారానికి చెంపపెట్టు ‘ఇండియా టుడే’ సర్వే. సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులను ఈ సర్వే శాటిలైట్ కెమెరాలు గుర్తించాయి. అవును... చుట్టూ చీకటి ఆవరించి ఉన్నది. భయం లేదు. చేతిలో అభివృద్ధి దీపం ఉన్నది. ఎగుడు దిగుడు దారి ముందున్నది. పరవాలేదు. దీపకాంతిలో గమ్యం కనిపిస్తున్నది. జాగ్రత్తగా అడుగులు వేస్తే చాలు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మోదీ జీ – కామ్రేడ్ షీ
చైనాలో ఏం జరిగినా ఇప్పుడు ప్రపంచానికి వార్తే. అది కోవిడ్ గురించైనా, కుంగ్ ఫూ గురించైనా! అగ్రరాజ్యమైన అమెరికాను ఎదిరించగల స్థితిలో ఉన్న ఏకైక దేశం చైనా. అటువంటి దేశంలో కీలకమైన రాజకీయ–ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ అంతర్జాతీయ సమాజం ఓ కన్నేయకుండా, ఓ చెవి పారేయ కుండా ఎలా ఉంటుంది? ఇండియా మాత్రం అస్సలు ఉండ లేదు. ఆక్రమించుకున్న టిబెట్ పీఠభూమి పుణ్యమా అని చైనాకు భారతదేశంతో మూడున్నర వేల కిలోమీటర్ల సరిహద్దు ఏర్ప డింది. ఈ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కూడా పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఒక పెద్ద యుద్ధం జరిగింది. భారత్కు భారీ నష్టం జరిగింది. చాలాసార్లు ఘర్షణలు జరిగాయి. ఆ వైపునా, ఈ వైపునా ఎక్కుపెట్టిన తుపాకులు, వాటి ట్రిగ్గర్ల మీద జవాన్ల వేళ్లూ దివారాత్రములు ‘సావధాన్’గానే ఉంటున్నాయి. అందు వల్ల చైనా పరిణామాలపై భారత్ ఆసక్తి ఒక సహజ పరిణామం. భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఏది సమవుజ్జీ అంటే చైనా పేరే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే జనాభాలో చైనాది ఫస్ట్ ర్యాంక్, మనది సెకండ్ ర్యాంక్. చరిత్ర, సంస్కృతి, నాగరికతల్లో కూడా రెండూ సమవుజ్జీలే. అవిచ్ఛిన్నతలో భారత్ కన్నా చైనా చరిత్ర ఎక్కువ అందుబాటులో ఉన్నప్పటికీ, బౌద్ధం మన దేశాన్ని గురుపీఠంపై కూర్చోబెట్టింది. పారిశ్రామిక విప్లవానికి పూర్వం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది ఒకటో స్థానం. భారత్ది రెండో స్థానం. ప్రస్తుత ఆర్థిక పరిస్థి తుల్లో మాత్రం చైనా కొంచెం ఎక్కువ సమవుజ్జీ. మనం బాగా తక్కువ సమవుజ్జీ. అయినా సరే, చైనా ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇళ్లను ముంచెత్తుతున్నప్పుడు, వారి టెలికామ్ విడి భాగాలు మన హస్త భూషణాలుగా మారినప్పుడు, వారి కంప్యూ టర్ హార్డ్వేర్ మన ఆఫీసుల్ని ఆక్రమించినప్పుడు, వారి ప్లాస్టిక్ టాయ్స్, క్రాకర్స్ మన మార్కెట్లను పరిపాలిస్తున్నప్పుడు చైనా వార్తలు మన వార్తలు ఎందుకు కాకుండా పోవు? ఇంతకూ చైనాలో ఏం జరుగుతున్నది? షీ జిన్పింగ్ మరో ఐదేళ్లు ఆ దేశాధ్యక్షుడిగా కొనసాగడానికి రంగం సిద్ధమయింది. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్లీనరీ సమావేశం ఈ వారం జరిగింది. ఆ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి సరిగ్గా వందేళ్లు. ఈ సందర్భంగా వందేళ్ల పార్టీ చరిత్రలోని కీలక సందర్భాలపై పార్టీ ప్లీనరీ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో చైనా కమ్యూనిస్టు పార్టీ శిఖరాగ్రాలయిన మావో, డెంగ్ల సరసన షీని నిలబెట్టారు. చరిత్రను మలుపుతిప్పిన వారిలో మావో, డెంగ్ల తర్వాత జిన్పింగ్దీ అంతటి ప్రధాన పాత్రగా తీర్మానం ప్రస్తుతించింది. వచ్చే సంవత్సరం జరగనున్న పార్టీ జాతీయ మహాసభల్లో మూడోసారి వరుసగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా షీ జిన్పింగ్ ఎన్నికయ్యేందుకు ఈ తీర్మానం రంగం సిద్ధం చేసిందని పరిశీల కుల అభిప్రాయం. ఫలితంగా మూడోసారి దేశాధ్యక్షుడిగా, పీపుల్స్ ఆర్మీ సర్వసేనానిగా ఆయనే కొనసాగనున్నారు. వచ్చే సంవత్సరం మొదలయ్యే మూడో దఫా పదవీకాలం 2027తో ముగుస్తుంది. కానీ ఆయన తనను తాను జీవితకాలపు నేతగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. షీ జిన్పింగ్కు మరో దఫా అధికారం దక్కినందువల్ల, ఆయన జీవిత కాలపు అధ్యక్షుడైనందువల్ల ప్రపంచానికి ఏమిటి సంబంధం? రష్యాలో పుతిన్ కూడా అదే వరుసలో ముందే ఉన్నాడు కదా! కానీ, జిన్పింగ్ భవిష్యత్తు ఇన్నింగ్స్కు చాలా ప్రాధాన్యం ఉన్నది. గత నలభయ్యేళ్లుగా చైనాను ఒక బలీయ మైన ఆర్థిక వ్యవస్థగా మార్చిన విధానాలను ఆయన సవరిస్తు న్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కార్పొరేట్ కుబేరులపై కొరడా ఝళిపిస్తున్నారు. జాక్ మా తలపెట్టిన 37 బిలియన్ డాలర్ల (రూపాయల్లో 2 లక్షల 60 వేల కోట్లు) అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను అడ్డుకున్నారు. అలీబాబా వంటి టెక్ కంపెనీల దూకుడుకు కళ్లెం వేసే కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ప్రైవేట్ రంగంపై ఆంక్షలు విధిస్తూ పబ్లిక్ రంగానికి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు. నలభయ్యేళ్ల సంస్కరణల ఫలితంగా దేశంలో పెద్ద సంఖ్యలో మధ్యతరగతి వర్గం ఆవిర్భవించినప్పటికీ కొంత మంది మాత్రం అపర కుబేరులుగా అవతరించారనీ, ఈ అసమాన పంపిణీ కమ్యూనిస్టు మూలసూత్రాలకు విరుద్ధమని షీ భావిస్తున్నారట. కనుక ‘ఉమ్మడి సౌభాగ్యం’ అనే కొత్త నినాదంతో సంపద పంపిణీలో అసమానతల్ని తగ్గించాలని ఆయన ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయన దూకు డుగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), సూపర్పవర్గా ఎదగాలన్న ‘చైనా డ్రీమ్’ సాఫల్యానికి చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్–చైనా దేశాల మధ్య చరిత్ర, జనాభా వంటి విషయాల్లోనే కాదు... ప్రస్తుత రెండు దేశాల అధినేతల మధ్య కూడా పలు సారూప్యతలున్నాయనే అభిప్రాయం ఉన్నది. చైనా చరిత్రను మలుపుతిప్పిన ముగ్గురిలో ఒకడిగా షీ జిన్పింగ్ను చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. ఎటువంటి అధికారిక గుర్తింపులేకపోయినా భారతదేశ పాల కుల్లో నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి బలమైన ముద్రవేసిన ప్రధానిగా మోదీని పరిగణించవచ్చు. ఆయన పరిపాలనా ఫలి తాలపై భిన్నాభిప్రాయాలుండవచ్చు గానీ, టాప్ త్రీ పాపులర్ ప్రధానుల్లో ఒకరని అంగీకరించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. షీ, మోదీల బాల్యం కూడా కష్టాలతో కూడుకున్నదే. తన బాల్యం ఛాయ్వాలాగా గడిచిందని సాక్షాత్తూ మోదీయే పలు మార్లు చెప్పుకున్నారు. సాంస్కృతిక విప్లవ కాలంలో షీ జిన్ పింగ్ తండ్రి మీద కమ్యూనిస్టు పార్టీ ద్రోహి అనే ముద్రను వేసింది. జైల్లో పెట్టింది. పదిహేనేళ్ల వయసున్న షీని గ్రామాలకు తరలించారు. బలవంతంగా వ్యవసాయ పనుల్లో పెట్టారు. ఒక కొండగుహలో తలదాచుకునేవాడు. ఇద్దరూ కార్యకర్తల బలంతో పనిచేసే సంస్థల్లోనే రాజకీయ శిక్షణ పొందారు. మోదీ ఆరె స్సెస్లో, షీ కమ్యూనిస్టు పార్టీలో జీవితాన్ని ఆరంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మోదీ జాతీయనేతగా అవతరించడానికి ఉపకరించింది. గుజరాత్ మోడల్ అభివృద్ధి అనే ప్రచారం బీజేపికి ఉపకరించింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే జిజీంగ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా షీ పనిచేశారు. అవినీతిపై ఆయన చేసిన యుద్ధానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అవినీతి మరకలేని మిస్టర్ క్లీన్గా షీ పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు నేతలకూ జాతీయవాదం ఒక స్ఫూర్తి. మోదీ ఆరెస్సెస్ ప్రచారకర్తగా పనిచేసినప్పుడు సాంస్కృతిక జాతీయ వాదంతో మమేకమయ్యాడు. అడ్వాణీ రథయాత్ర నిర్వాహ కుడిగా వెన్నంటి ఉన్నప్పుడు మతపరమైన జాతీయవాదం ఆయన్ను నడిపించింది. వాజ్పేయ్ ప్రధానిగా ఉన్న సమ యంలో ఆయన ఆర్థిక జాతీయవాదాన్ని పార్టీ కార్యదర్శి హోదాలో మోదీ ప్రచారం చేసేవారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్ను మత జాతీయవాదంతో ప్రారంభించి ఆర్థిక జాతీయవాదంతో ముగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన వెంటనే షీ ‘చైనా డ్రీమ్’ అనే పదబంధాన్ని ప్రయో గించారు. చైనా ప్రజలకు తమది చాలా గొప్ప దేశమని, తమ జాతి (హన్జాతి) చాలా గొప్పదనీ వందలయేళ్ల నుంచి ఒక గట్టి నమ్మకం. ఐరోపా వలస పాలకులు ఈ నమ్మకం మీద గట్టిదెబ్బ తీశారు. అవమానభారంతో చైనా ప్రజలు రగిలిపోయారు. వారిలో దెబ్బతిన్న జాతీయవాదాన్ని రగిలించడం ద్వారానే మావో జెడాంగ్ చైనా కమ్యూనిస్టు విప్లవాన్ని విజయ తీరాలకు చేర్చగలిగాడు. డెంగ్ ఆర్థిక సంస్కరణల తర్వాత మూలనపడ్డ కమ్యూనిస్టు మూలసూత్రాల శూన్యాన్ని జాతీయ వాద భావజాలమే భర్తీచేసింది. అదే జాతీయవాద భావ జాలాన్ని, ‘చైనా డ్రీమ్’ అనే పదబంధంతో ఒక శక్తిమంతమైన క్షిపణిగా షీ తయారుచేశాడు. దేశీయ ఆర్థికాభివృద్ధి వ్యూహంలో మాత్రం పూర్తి భిన్న ధ్రువాలుగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. తనకు రాజకీయ అక్షరాభ్యాసం చేయించిన ఆరెస్సెస్ ఆర్థిక విధానాలను కూడా పట్టించుకోకుండా ప్రైవేటీకరణ వైపు మోదీ పరుగు తీస్తున్నారు. తన తండ్రి మద్దతు ఇచ్చిన డెంగ్ సంస్కరణలను షీ తిరగ దోడుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడి విషయంలో మోదీ ఎంచు కున్నవి ఎక్కే మెట్లు, షీ ఎంచుకున్నవి దిగే మెట్లు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ప్రైవేటీకరించే కార్యక్రమం మోదీ హయాంలో వేగం పుంజుకున్నది. బిజినెస్ చేయడమనేది ప్రభుత్వ బిజినెస్ కాదని ప్రధాని స్పష్టంగా చెప్పారు. ఈ ఫిబ్ర వరిలో జరిగిన ఒక సెమినార్లో మాట్లాడుతూ సుమారు వంద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ను ప్రైవేటీకరించి రెండున్నర లక్షల కోట్లను సమీకరించదలిచామని ప్రధాని తెలిపారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే టాటాల గూటికి చేరిపోయింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం కార్మిక చట్టాలను సరళతరం చేశారు. వ్యవ సాయ రంగం నుంచి పెద్ద సంఖ్యలో రైతులను బయటకు మళ్లించడం ద్వారా పెట్టుబడిదారులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుం దనీ, అందుకోసమే వ్యవసాయ చట్టాలను ముందుకు తెచ్చారనీ ఒక అభిప్రాయం ఏర్పడింది. జిన్పింగ్ మాత్రం బ్యాక్ టు సోష లిజమ్ అంటున్నారు. షీ మూడో దఫా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. మోదీ హ్యాట్రిక్ ఇంకో రెండున్నరేళ్లకు తేలుతుంది. ఇప్పటివరకైతే మోదీని సవాల్ చేసే ప్రత్యామ్నాయ నాయకుడు ఇంతవరకూ వెలుగు చూడలేదు. మోదీ కూడా మూడోసారి గెలిస్తే రెండు దేశాల మధ్య, రెండు వ్యవస్థల మధ్య అసలైన యుద్ధం మొదలవుతుంది. చైనాను ఒక బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన డెంగ్ బాట నుంచి పక్కకు జరగడం దుష్పరిణామాలకు దారి తీస్తుందా? అలా జరిగితే పెట్టుబడే జగద్విజేత అనుకోవాలి. ఆ పెట్టుబడి భారత్లో కూడా అద్భుతాలు చేయబోతున్నదని ఆశించాలి. షీ జిన్పింగ్ విజయం సాధిస్తే సోషలిజం అజేయ మనే కమ్యూనిస్టుల నమ్మకం సజీవంగా ఉంటుంది. భారత దేశానికి ఓ గుణపాఠం లభిస్తుంది. -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అమరావతి (ప్రైవేట్ లిమిటెడ్) కథలు!
‘‘విపణివీథి–తపోవనం/చాకిరేవు–శాసనసభ/సానికొంప– సాధుమఠం/మూత్రశాల–యాత్రాస్థలి/ఎచటైతేం? ఎచటైతేం? పోటీపడి కాటులాడ ఎచటైతేం?’’. ప్రజాకవి కాళోజీ రాసిన ఒక కవితలోని పంక్తులివి. ఆయన రాసిన వ్యంగ్యాన్ని టీడీపీ వాళ్లు ఆదర్శంగా మలుచుకున్నట్టున్నారు. గుడి, బడి, అసెంబ్లీ, గంజాయి... సందర్భం ఏదైనా కాట్లాడటమే ఎజెండాగా ఎంచు కున్నట్టున్నారు. అధికారం చేజారి మనోధృతి జావగారిన వేళ రచ్చబాట ఒక్కటే గత్యంతరమన్న ధోరణి ఆ పార్టీ కార్య క్రమాల్లో కనిపిస్తున్నది. ఎక్కడో ఒక ఆకతాయి గుడిమీద రాళ్లు విసిరితే, ఒక దగు ల్బాజీ విగ్రహాలు చోరీచేస్తే, గుడి బయట ఉన్న రథానికి ఎవడో ఒక దుండగీడు నిప్పుపెడితే ఆ పార్టీ పండుగ చేసుకున్నది. ప్రభుత్వానికి లంకె పెట్టి ప్రచారాన్ని మోగించింది. ఈ దెబ్బతో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కలలుగన్నది. తన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఇంతకంటే ఎక్కువ జరిగాయన్న సంగతి పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ, ఆ పార్టీ లెక్క చేయలేదు. దేవాలయ భూములను, సత్రం భూములను ఆ పార్టీ నేతలే ఫలహారంలా ఆరగించిన దృష్టాంతాలను దాచి పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా పూనుకొని బుల్డోజర్లను రంగంలోకి దించి ఒక్క విజయవాడలోనే 30 గుళ్లను నేలమట్టం చేసిన రికార్డు ఆ పార్టీదే. కానీ ఇప్పుడు రాద్ధాంతం కావాలి. రచ్చ జరగాలి. కాట్లాడుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలమీద ప్రచారం జరగనీయరాదు. ఇదే దాని సంకల్పం. అందుకు బీజేపీ, జన సేనలు యథాశక్తి సహకరించాయి. సహకరిస్తున్నాయి. గంజాయి ఎపిసోడ్ అటువంటిదే. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి దొంగ రవాణా పెద్దయెత్తున సాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం 2017లోనే రాష్ట్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అప్పట్లోనే జాతీయ దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అక్రమ రవాణా, లిక్కర్ మాఫియా, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం మోపడానికి ఎస్ఈబీ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గంజాయి కోసమే ఒక ప్రత్యేక బెటాలియన్ను కేటా యించింది. దీంతో దొంగ రవాణాకు అడుగడుగునా కళ్లేలు పడుతున్నాయి. ఈ వార్తలను ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ గంజాయి రవాణాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ లంకించుకున్నది – దొంగే... ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! మహిళల రక్షణకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టనన్ని కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ‘దిశ’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దోషులకు సత్వరమే శిక్షలు పడేలా ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోదం లభించవలసి ఉన్నది. ‘దిశ’ యాప్ యువతులకు ఒక రక్షా బంధనంలా మారింది. 85 లక్షలమంది ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధి కారులకే రక్షణ లేని దుర్భర పరిస్థితిని ఈ రాష్ట్రం వీక్షించింది. శాసన సభ్యులే దుశ్శాసన పాత్రను పోషించిన దారుణాలను గమ నించింది. అప్పటి ప్రభుత్వ నేతలు రమ్య హత్యకేసు సంద ర్భంలో గురువిందలుగా మారిన గమ్మత్తయిన దృశ్యాన్ని కూడా రాష్ట్రం అవలోకించింది. మంచీ–చెడూ విచక్షణ లేదు. పాపపుణ్యాల బేరీజు లేదు. ప్రతి సందర్భం రచ్చ కోసమే! పోట్లగిత్తల్లా కాలు దువ్వడమే! బండబూతుల దండోపాయమే! తరతరాలుగా వెనకబాటు తనానికి గురై నిలువ నీడ కోసం పరితపిస్తున్న అభాగ్యులు లక్షల సంఖ్యలో మిగిలి ఉండడమే ఒక దారుణం. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫల్యతను శంకించవలసిన తరుణం. అటువంటి వారికి, అందులోనూ ఆడవారి పేరు మీద 30 లక్షల ఇళ్లు కట్టించే మహాయజ్ఞాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించింది. కేటాయింపులు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటున్నది. ఈ ప్రయత్నాన్ని తొలి నుంచీ అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెగ తంటాలు పడింది. దొంగ పేర్లతో కోర్టుకెక్కింది. వ్యాజ్యం నడిపింది. ఆడవాళ్ల పేరు మీద పట్టాలు ఇవ్వడం తప్పట! యుగ యుగాల అణచివేతకూ, అస్వతంత్రతకూ బలైన మహిళా లోకాన్ని సాధికారితం చేయకుండా ఏ రకంగా ఉద్ధరిస్తారో చెప్పవలసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉన్నది. రైతులకు భరోసా భద్రత కల్పించి వెన్నుదన్నుగా నిలపడం కోసం ఏర్పాటుచేసిన ఆర్బీకేలపై ఇప్పటివరకు ఒక్క మంచి మాట లేదు. విద్యా, వైద్య రంగాలను సమూల క్షాళన గావిస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై అభినందన లేదు. పోనీ దోషా లుంటే ఎత్తిచూపిందీ లేదు. ఎటువంటి జన శ్రేయోదాయక పనిని చేపట్టినా డైవర్షన్ స్కీమ్ను ఆశ్రయించడమే విపక్షం పనిగా పెట్టుకున్నది. దుష్ప్రచారమే ఆ డైవర్షన్. గోబెల్స్ సిద్ధాంత స్ఫూర్తితో ఒక రాద్ధాంతమే ఆ డైవర్షన్ స్కీమ్. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ వారు ఒక యాత్రను ప్రారంభించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ అని దానికి నామకరణం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ యాత్రలో పాల్గొంటున్నారనీ, తమకు న్యాయం చేయాలని ఏడుకొండల వాడిని వేడుకోవడానికి వెళ్తున్నారనీ ప్రక టించారు. అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఎవరైనా సరే తమ హక్కుల కోసం జరిపే పోరాటాన్ని అభినందించవల సిందే. సానుభూతి చూపవలసిందే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కనీస ధర్మం. రాజధాని కోసం తాము భూములిచ్చామనీ, ఈ ప్రభుత్వం మూడు రాజధానులను తెర మీదకు తీసుకొచ్చి నందువలన తమకు అన్యాయం జరిగిందని ఈ ఆందోళన కారులు చెబుతున్నారు. ఇందులో నిజానిజా లేమిటి? రాజధాని భూసమీకరణ కోసం చంద్ర బాబు హయాంలో జరిగిందేమిటి? తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల దగ్గర్నుంచి 34,281 ఎకరాల భూమిని రాజ ధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం సమీకరించింది. భూమినిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లే–అవుట్లలో ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. రైతులిచ్చిన భూమిని అభివృద్ధిచేసి, సుమారు 130 కంపెనీలకు 1293 ఎకరాల భూమిని ఇచ్చేశారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1691 ఎకరాలను కేటాయించారు. కొంత భాగాన్ని స్వాధీనం చేయడమూ జరిగింది. రైతులకు మాత్రం కాగితాలే దక్కాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనే లేదు. భూ యజమానులకు వారి వాటాను దఖలుపరచకుం డానే వారి భూముల్లో వ్యాపారాన్ని ప్రారంభించడం ఏ చట్టం ప్రకారం, ఏ న్యాయం ప్రకారం, ఏ నైతిక సూత్రాల ప్రకారం సమ్మతమవుతుంది? పాదయాత్రగా బయల్దేరిన రైతు సోదరు లారా.. ఈ ప్రశ్నను మీరు చంద్రబాబుకు సంధించి ఉండవలసింది. రాజధాని ప్రాంతంపై బహిరంగ ప్రకటన రాకముందే భూ సమీకరణ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే ప్రదేశాల్లో చంద్రబాబు అనుయాయులూ, బినామీలూ వేల ఎకరాలు కొనుగోలు చేశారు. ముందుగా లీక్ చేయడం వల్లనే వీరు కొనుగోళ్లు చేయ గలిగారు. రైతులిచ్చిన భూముల్లో రాజధాని ఏర్పడినట్లయితే ఈ ముఠా కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల వెల లక్ష కోట్లకు చేరి ఉండేది. సొమ్ము రైతులది, సోకు బినామీ వినా యకులది. ‘హెరిటేజ్ ఫుడ్స్’ పేరుతో కొనుగోలు చేసిన భూము లతోపాటు ఈ లక్ష కోట్ల ముఠాలో తెలుగుదేశం ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. భూసమీకరణ ప్రాంతంలో ఉండ వలసిన లింగమనేని రమేశ్ భూమి ఉన్నపళాన జారిపోయింది. కరకట్ట మీద ఉన్న ఆయన గెస్ట్హౌస్ చంద్రబాబు సొంతమైంది. ఈ వ్యవహారం మీకు అధర్మమని తోచలేదా రాజధాని ప్రాంత సోదరులారా? రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న 2,200 ఎకరాల అసైన్డ్ భూములను తెలుగుదేశం నేతలు లాక్కున్నారు. ‘ప్రభుత్వం తీసుకుంటే మీకు పరిహారం ఇవ్వరు. మేము పది లక్షల దాకా ఇస్తామ’ని మభ్యపెట్టారు. వారి చేతుల్లో పప్పు బెల్లాలు పెట్టి లాక్కున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు చట్ట విరుద్ధం. అయినా బాబు ప్రభుత్వం ఆమోదించింది. కొనుగోలు చేసిన నాయకులకు పూలింగ్ ప్యాకేజీ ప్రకటించారు. పాపం ఆ దళిత రైతులు మీ భూములు దున్నినవారే. మీ పంట చేలను చెమట చుక్కలతో తడిపినవారే. వారికి జరిగిన అన్యాయం మీ మనసును కదిలించలేదా? ఇక సింగపూర్ యవ్వారం సంగతి. అక్కడున్న రెండు ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించారు. వారితో ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికోసం 1691 ఎకరాలను ఈ కంపెనీలకు కట్టబెట్టారు. ఉచితంగానే సుమా!. ఆ భూమిని అభివృద్ధి చేయడానికి 5500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే వారికి ఇవ్వాలి. రైతుల భూమిలో, ప్రభుత్వ సొమ్ముతో వారు అభివృద్ధి చేస్తారు. అలా చేసినందుకు మొత్తం భూమిలో 250 ఎకరాలను సదరు కంపెనీలకు కట్నంగా ఇస్తారు. రాజధాని కోర్ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన రైతుల భూమి 250 ఎకరాలు వారి సొంతం. అధమపక్షం ఎకరా 10 కోట్లు వేసుకున్నా 2500 కోట్లు. ఇక మిగిలిన 1450 ఎకరాల్లో ఆ కంపెనీలు వ్యాపారం చేస్తాయి. వచ్చే ఆదాయంలో అమరా వతి అభివృద్ధి సంస్థకు మూడు దశల్లో కలిపి 450 కోట్లు ఇస్తారు. అధమపక్షం పదికోట్లేసుకున్నా 1450 ఎకరాలకు 14,500 కోట్లు, అందులో ప్రభుత్వ సంస్థకు 450 కోట్లు. పోను సింగపూర్ సంస్థ లకు మిగిలేది 14000 కోట్లు ప్లస్ 2500 కోట్లు. మొత్తం 16,500 కోట్లు. ఇది కనీస పక్షం లెక్క. ఇది ద్విగుణం, త్రిగుణం... అంతకుమించి కూడా అవ్వొచ్చు. ఎవరీ సింగపూర్ కంపెనీ వారు? ఎవరి తాతగారి బంధువులు? ఇన్ని వేలకోట్ల ప్రజా ధనాన్ని వారికి ఎందుకు కట్టబెట్టడానికి ప్రయత్నించి నట్టు? ఇందులో సింహభాగం సొమ్ము సింగపూర్లో చేరవలసిన వారి అకౌంట్కు చేరుతుందని కనిపెట్టడానికి కామన్సెన్స్ చాలదా? ఆందోళనకారులు ఈతరహా ఒప్పందాన్ని ఎప్పుడైనా ప్రశ్నిం చారా? రాజధాని వ్యవహారంలో ఆయనకు మద్ద తునిస్తున్న పార్టీలైనా ప్రశ్నించాయా? అధికారంలో ఉన్నవారు ప్రజాదరణ పొందలేకపోతే దిగి పోవలసి రావడం సహజం. కానీ చంద్రబాబుకు మాత్రం కోల్పోయిన అధికారం ఒక తొణికిన స్వప్నం. ఒక చేజారిన స్వర్గం. ఎందుకంటే, అదే అమరావతి మహిమ. ఈ ప్రాజెక్టులో ప్రజాశ్రేయస్సు కంటే ఆయన సౌభాగ్యమే ఎక్కువ. ఇది ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్గా, ప్రపంచంలో అతిపెద్ద స్కామ్గా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తొణికిన స్వప్నాన్ని, చేజారిన స్వర్గాన్ని మళ్లీ అందుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన రెండంచెల వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఒకటి– వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్య క్రమాలపై చర్చ జరగకుండా వ్యతిరేక ప్రచారాన్ని నిరంతరంగా నిర్వహించడం. రెండు– వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదు ర్కోవడానికి ఎన్ని శక్తులను ఏకం చేయవలసి ఉంటుందనే అంశంపై ట్రయల్స్ వేయడం. మొదటి అంచెను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల నుంచే ప్రారంభించారు. ఇప్పుడది అదుపుతప్పి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. రెండో వ్యూహంపై బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఒక ప్రయోగం చేశారు. ముందుగా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్టీ అభ్యర్థే రంగంలో ఉండేలా పావులు కదిపారు. జనసేన అధికా రికంగా బీజేపీ మిత్రపక్షమే కనుక దాని మద్దతు లభించింది. టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా నిలబడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చు కున్న తెలుగుదేశం నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్లు టీడీపీ ఓట్లు బీజేపీకి పడేలా చక్రం తిప్పారు. ఈ ప్రయోగం కొంతమేరకైనా ఫలించి ఉన్నట్లయితే చంద్రబాబులో ఆశలు చిగురించేవి. ఇంత చేసినా బద్వేల్లో ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీకి దక్కడానికి తెరవెనుక చంద్రబాబు మంత్రాంగం చేశారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబు తున్నారు. అటువంటి గట్టి ప్రయత్నం ఏదీ లేకపోతే గత ఎన్ని కల్లో 30 శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకటిన్నర శాతానికి పడిపోవడం అసంభవమని వారి వాదన. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసమే చంద్రబాబు ఈ పని చేసిపెట్టారని చెబుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రెండంచెల వ్యూహానికి బీజేపీ తోడ్పాటు కావాలి. సాధారణ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు లభించాయి. స్థానిక ఎన్నికల నాటికి 70 శాతం దాటాయి. బద్వేల్లో 76 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఓటు బ్యాంకు 50 శాతం కంటే తగ్గాలి. అందుకోసం దుష్ప్రచారం. అది అఖండ జ్యోతిలా ఆరకుండా మండుతూనే ఉన్నది. ఇరవై ఐదు శాతానికి పడి పోయిన తన ఓటు బ్యాంకు యాభై శాతం దాటాలి. ఎలా? అందుకే ఈ ట్రయల్ రన్స్. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పొలిటికల్ CO2
స్కాట్లాండ్ పేరు చెప్పగానే ఎక్కువమందికి టక్కున గుర్తుకొచ్చేది స్కాచ్ మద్యం. చాలా తక్కువమందికి ఈరోజు గ్లాస్గో అనే పట్టణం పేరు గుర్తుకొస్తుంది. పుడమి తల్లి పది కాలాల పాటు పచ్చగా బతకాలని కోరుకునేవాళ్లు, అందుకోసం ఉడతాభక్తి సాయమందించేందుకు సిద్ధపడేవాళ్లు ఆ తక్కువ మందిలో ఉంటారు. మానవుడు చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశ పడేవాళ్లు, విశ్వాంతరాళమంతటా విస్తరించాలని కలలు గనే వాళ్లూ ఆ తక్కువమందిలో ఉంటారు. ఆ గ్లాస్గో పట్టణంలో ఈరోజు వాతావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్) ప్రారంభమవుతున్నది. పారిశ్రామిక విప్లవం తర్వాత కర్బన ఉద్గారాలను విచ్చల విడిగా ప్రకృతిలోకి వెదజల్లుతున్నందు వలన భూమాత ఉష్ణోగ్రమవుతున్నది. ఈ పరిణామం ఇంకా కొంతకాలం కొనసాగితే ఒక మహావిలయానికి మన కువలయం బలికావచ్చును. మరో పది పన్నెండు తరాల తర్వాత మనుష్యజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదాన్ని నివారించవచ్చన్న మేలుకొలుపే ‘కాప్’ సదస్సుకు ప్రాతిపదిక. ప్రమాదం అంచుకు భూగోళాన్ని నెట్టిన పాపం మాత్రం సంపన్న దేశాలదే! ఆ దేశాల్లోని బడా సంపన్నులదే! సంపద సృష్టి అనే అందమైన పేరుతో వీరు సాగించిన ప్రకృతి వేట వికృతరూపం దాల్చిన ఫలితమే – ఈ భూతాపం. జనబాహుళ్యంలో ఒక జానపద కథ ప్రచారంలో ఉన్నది. ఒక పాత్రలో తైలాన్ని తీసుకొని ఒక బాలిక వీధిగుండా వెళు తున్నదట. ఇంతలో ఆ పాత్ర జారిపడి తైలమంతా భూమిలోకి ఇంకిపోతుంది. ఇంటికి వెళితే తల్లి దండిస్తుందని ఆ బాలిక విలపిస్తున్నదట. అటుగా వెళ్తున్న కర్ణుడికి ఈ దృశ్యం కనిపించింది. ఆ బాలికను ఊరడించడంకోసం తైలం ఒలికిన ప్రదేశంలోని మట్టిని పిడికిట్లోకి తీసుకొని గట్టిగా పిండి, మళ్లీ ఆ పాత్రలో తైలం నింపాడట. అప్పుడు భూదేవి ఆగ్రహించింది. ‘ఓయీ కర్ణా! నాలో ఇంకిన చమురును పిండి నా శరీరాన్ని కష్టపెట్టావు. నీ జీవితంలోని కీలక యుద్ధ సమయంలో నీ రథచక్రం కూడా నాలో దిగబడిపోతుంది. అదే నీ చావుకు కారణమవుతుంద’ని శపించింది. పిడికెడు మట్టిని పిండితేనే అప్పుడు భూదేవి శపించింది. ఇప్పుడు భూగర్భంలోకి చొరబడి శిలాజాలను మండించి చమురు వాయువులను పిండుకుంటున్నప్పుడు, తివిరి ఇసు మున తైలమును తీస్తున్నప్పుడు, అడవుల్ని, కొండల్ని కరెన్సీ లోకి మారకం చేస్తున్నప్పుడు శపించకుండా ఉంటుందా? పలు మార్లు శపించి ఉంటుంది. ఆ శాపాలకు విమోచన మార్గాలను అన్వేషించడమే ఇప్పుడు జరుగుతున్న ‘కాప్’ సదస్సు పని! దేశాలనూ – వాటి విదేశాంగ విధానాలనూ, ప్రభుత్వా లనూ – వాటి ప్రాధాన్యాలనూ బడా సంపన్నులే నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ ‘కాప్’ సదస్సు ఏమైనా సాధిస్తుందా లేక కాకి గోలగా మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా లేక పోలేదు. మీడియాతో సహా అనేక వ్యవస్థల మీద ‘మిగులు ధనం’ పట్టు బిగిస్తున్నది. ఫలితంగానే పర్యావరణం వంటి ప్రాణప్రదమైన అంశాల మీద జన చేతన జ్వలించడం లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి సంపాదించిన డబ్బు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా దిగజారుతున్న క్రమం మన కళ్లముందున్నది. వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆయనకు ఒంటి మీద ఒక ముతక ఖద్దరు లాల్చీ, పంచె, భుజం మీద ముతక కండువా, చేతిలో గుడ్డ సంచీ, అందులో కొన్ని కాగితాలు. అంతే! ఆయనలో ఏ మార్పూ రాలేదు. పైసా ఖర్చు పెట్టకున్నా జనం ఆయనకు ఓట్లే శారు. గెలిపించారు. మొదటి నాలుగు ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉప్పల మల్సూర్ గెలిచారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలను పార్టీకే ఇచ్చేవారు. తన కనీస అవసరాలకోసం పార్టీ ఇచ్చే డబ్బుతోనే గడిపేవారు. (అప్పట్లో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలందరికీ ఈ నియమం ఉండేది). ఇరవయ్యేళ్ల తర్వాత ఉదర పోషణార్థం ఆయన చేతనైనంతకాలం చెప్పులు కుట్టు కుంటూ గడిపారు. ఓట్లకోసం ఆయనగానీ, ఆయన పార్టీగానీ ఏనాడూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టింది లేదు. మొదటి ఐదారు శాసనసభలకు సంబంధించి ఇటువంటి ఉదాహరణలు ఎన్న యినా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పర్యటన కోసం బయల్దేరాడంటే అదొక ధనబీభత్స దృశ్యమే. అదుపు తప్పిన మదపుటేనుగు రోడ్డు మీద పడ్డట్టే! ప్రస్తుత లోక్సభకు ఎన్నికైన 533 మంది సభ్యుల్లో 475 మంది కోటీశ్వరులు. ఇది వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నిర్ధారించిన సంఖ్య. 88 శాతం మంది కోటీశ్వరులతో నిండి వున్న మన పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదా లేక ధనస్వామ్యా నికా? తేల్చవలసి ఉన్నది. సంఘసేవకులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు చట్టసభల్లో పలచబడుతున్నారు. వ్యాపారులు చిక్కబడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ.. ఎక్కడైనా వ్యాపారులూ, కాంట్రాక్టర్లదే హవా! ఎందుకంటే వాళ్లు ఓట్లను కొనుగోలు చేయగలుగుతారు. అందుకని రాజకీయ పార్టీలు వారిని చేరదీస్తున్నాయి. వారి కరెన్సీ నోట్ల కట్టల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి కర్బన ఉద్గా రాలు వెలువడుతున్నాయి. బొగ్గు పులుసు వాయువు (ఛిౌ2) దట్టంగా అలుముకుంటూ రాజకీయ వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తున్నది. క్రీస్తుశకం 1498లో వాస్కోడిగామా అనే ఐరోపా యాత్రికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత సరిగ్గా ఐదొందల యేళ్లకు తెలుగు నేలపై ఓటు సాధనకు నోటు మార్గాన్ని 1996లో చంద్రబాబు కనిపెట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో వాతావరణ మార్పులు మొదలయ్యాయి. క్రమేణా పేద పార్టీలు దివాళా తీశాయి. అందులో కొన్ని ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తూ అద్దె మైకులుగా రూపాంతరం చెందాయి. సంఘసేవకులు సన్యాసం పుచ్చుకున్నారు. మేధావులు, వృత్తి నిపుణులు రాజకీయాలకు దూరమయ్యారు. 1996లో దర్శి, పాతపట్నం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. అప్ప టికి ఏడాది క్రితమే అంతఃపుర కుట్ర ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తన స్థానాన్ని పదిలపరుచుకోవడా నికి ఈ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఒక్కో ఓటుకు ఐదొందల రూపాయలు పంచారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు ఎక్కడో ఒకచోట వందో, యాభయ్యో.. అదీ, నిరుపేద వర్గాలకు ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం సామ్యవాద పద్ధతిలో ధనిక – బీద తేడా లేకుండా అందరి ఓట్లనూ అధిక ధరలకు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. 1998లో అత్తిలి స్థానానికి ఉపఎన్నిక జరి గింది. సాధారణ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. అయినా చంద్రబాబు తేలిగ్గా తీసుకోలేదు. ఓటుకు వెయ్యి పంచారని వార్తలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దండు శివరామరాజే ఆ ఖర్చును చూసి జడుసు కున్నారట! మొదటిసారిగా ఓటుకు నాలుగంకెల ధర 1998లో పలికింది. ఆ తర్వాత ఇరవై మూడేళ్లకు ఇప్పుడు ఐదంకెల మార్కును తాకినట్టు వార్తలు వస్తున్నాయి. సెన్సెక్స్ నాలు గంకెలు దాటిన రోజునుంచి లెక్కిస్తే ఐదంకెలు తాకడానికి పదహారేళ్లు పట్టింది. హుజూరాబాద్ నుంచి వస్తున్న వార్తలు నిజమైతే వోటెక్స్కు ఈ సమయం ఇరవైమూడేళ్ళు పట్టినట్టు! ఇంచుమించుగా సెన్సెక్స్కు ధీటుగా ఉన్నట్టే! హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ ఓటర్లకు ఒక్కొక్కరికి పదివేలు పంచిందని ప్రచారం జరిగింది. మొదటిదఫా ఆరువేలు, రెండోదఫా నాలుగువేల చొప్పున పంచారట. ఆ పంపకం కూడా చాలా కళాత్మకంగా ఉన్నట్టు కొందరు కొనియాడుతున్నారు. మొదటిరౌండ్ పంపకాన్ని ఒకానొక నడిజామురేయి దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూ ర్తంలో ప్రారంభించి వెలుగురేకలు పరచుకొనే సుప్రభాత వేళకల్లా పూర్తిచేశారట. అంటే ముచ్చటగా మూడు గంటల్లో గరిష్ఠ స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నాలుగైదు మాసాలపాటు ప్రచార కార్యక్రమాన్ని సాగదీసినందువల్ల రెండు ప్రధాన పార్టీలకు ఖర్చు భారీ మొత్తంలోనే అయినట్లు అంచనా లొస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హుజూరా బాద్ ఖర్చు బహుశా రికార్డు సృష్టించవచ్చు. మూడోపార్టీగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభిం చింది. ఎన్నికల ఖర్చుపై కూడా పెద్దగా ధ్యాసపెట్టినట్టు కనబడలేదు. కౌంటింగ్ జరిగితే తప్ప హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ఏమిటో అర్థం కాదు. హుజూరాబాద్ ఎన్నిక ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు మారినట్టు? ఇంత పెద్ద ధనప్రవాహం ఎందుకు అవసర మైనట్టు? ఒకవేళ ఈటల రాజేందర్ పట్ల జనంలో సానుభూతి ఉన్నమాటే వాస్తవమైతే ఎన్ని డబ్బులు గుమ్మరించినా ఓడిం చడం సాధ్యం కాదు. సానుభూతి అనేది లేకపోతే – ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయి. పైగా మొన్న ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆ పథకాలన్నింటినీ మరోసారి గుర్తుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన ప్రసంగాన్ని వినే ఏర్పాట్లను కూడా చేశారు. ‘దళితబంధు’ పేరుతో ఒక విప్ల వాత్మక కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభిం చారు. ఇంతచేసినా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు చెమటలు పట్టినట్టు? ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ తర్వాత అంతటి దిట్టగా పేరున్న హరీశ్రావు సారథ్యంలో ఒక పెద్ద సైనిక పటాలాన్ని అక్కడ ఎందుకు మోహరింపజేసినట్టు? ఓటు ధరలు ఆకాశాన్నంటుకున్నట్టు వార్తలెందుకు షికారు చేసినట్టు? మరో ఆసక్తికరమైన అంశమేమంటే అధికార పార్టీకి ధీటుగా ఈటల రాజేందర్ కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చగలగడం! బీజేపీ సమకూర్చిందా? లేక సొంత వనరులా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ సొంత వనరులే అయితే షాకింగ్ న్యూసే! ఏపీలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక హుజూరాబాద్తో పోలిస్తే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయింది. వరుస ఓటము లతో కుదేలైన ప్రధాన ప్రతిపక్షం సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ముందుగానే తప్పుకున్నది. కానీ లోపాయకారిగా బీజేపీకి అను కూలంగా పనిచేసినట్టు సాక్ష్యాధారాలతో వెల్లడైంది. మెజారిటీ పోలింగ్ స్టేషన్లలో టీడీపీవారే బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారట. కాంగ్రెస్ పార్టీ పోటీ కేవలం సంకేతప్రాయమే. గెలుపు ఎవరిదో ముందే తెలిసినందువల్ల ఏ పార్టీ అభ్యర్థి కూడా పెద్దగా ఖర్చు చేసినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ వారు పార్టీ తరఫున ఖర్చు చేయలేదు. కానీ, అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా నిరోధించగలిగారా? ఓట్ల కొనుగోలు వ్యూహాలకు చెక్ చెప్పకపోతే ప్రజా స్వామ్యానికి అర్థంలేదు. రాజకీయ వ్యవస్థలో ధనస్వామ్యం ముప్పు తొలగాలంటే కచ్చితంగా ఒక ఉద్యమం కావాలి. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాధనాన్ని అడ్డ గోలుగా దోచేసి భోంచేస్తున్నారన్న అభిప్రాయం జన సామా న్యంలో ఏర్పడింది. అందుకే ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని దబాయించి మరీ అడుగుతున్నారు. హుజురాబాద్లో కనిపించిన దృశ్యాలవే! గ్లాస్గో సదస్సు ప్రేరణతోనైనా సరే రాజకీయ కాలుష్యంపై పోరాడేందుకు ఒక ప్రజాస్వామిక ఉద్యమ బీజం పడాలని కోరుకుందాము. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
IND vs PAK: ఆటా? మతవిద్వేషపు సయ్యాటా?
ఓటమి... ఎప్పుడూ అంత సులభంగా మింగుడుపడని అనుభవమే! అదీ... పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గుమనే దాయాది దేశం చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం మరీ దారుణమైన అనుభవం. పాకిస్తాన్ జట్టుతో ఆదివారం రాత్రి దుబాయ్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఎదురైన ఘోర పరాభవం అలాంటిదే. అది భారత జట్టుకూ, వీరాభిమానులకూ కొన్నేళ్ళపాటు వెంటాడే ఓ పీడకల. కానీ, ఆ పరాభవభారం కన్నా మించిన అవమానం భారత బౌలర్ మహమ్మద్ షమీకి ఎదురైంది. మ్యాచ్లో 3.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి, ఒక్క పాకిస్తాన్ వికెట్ను కూడా పడగొట్టలేకపోయిన ఈ పేస్ బౌలర్ను ‘‘ద్రోహి’’ అంటూ సోషల్ మీడియాలో సోమవారం జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. 31 ఏళ్ళ షమీ జాతీయతనూ, దేశభక్తినీ శంకిస్తూ, ఇన్స్టాగ్రామ్ ఖాతా సహా అనేక వేదికల్లో వచ్చిన వందల కొద్దీ విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ ఆటగాడి మనస్సును ఇక జీవితాంతం వెంటాడనున్నాయి. భారత, పాక్ క్రికెట్ జట్ల పోరాటం ఎప్పుడూ ఆసక్తికరమే కానీ, కొందరు దానికి మతం రంగు పులమడం తీవ్ర ప్రమాదకరం. ఒక మతంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశానికి ద్రోహులే అనేంత బరి తెగింపు దేశభక్తి... ఆటను కూడా మతంతో ముడిపెడుతున్న కుహనా జాతీయవాద మూర్ఖత్వం... ఈ దేశ సామాజిక చట్రానికి చేస్తున్న లోతైన గాయం మానడం కష్టం. షమీని ఏకంగా భారత జట్టులో నుంచే తొలగించాలంటూ వెల్లువెత్తిన వాదనను క్రికెటర్లు, క్రీడాభిమానులు, రాజకీయ నేతలు ఖండించారు. అతనికి నైతికంగా అండగా నిలిచారు. అదే ఉన్నంతలో ఊరట. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా షమీ కొన్నేళ్ళుగా భారత జట్టులో అంతర్భాగం. 54 టెస్టుల్లో 195 వికెట్లు, 79 వన్డే మ్యాచ్లలో 148 వికెట్లు, 12 అంతర్జాతీయ టీ20లలో 12 వికెట్లు పడగొట్టిన అనుభవం, సామర్థ్యం ఈ పేస్ బౌలర్వి. అలాంటి నిబద్ధత కలిగిన ఆటగాడి వ్యక్తిత్వాన్ని ఒక్క మ్యాచ్ ఆధారంగా కించపరుస్తూ, అదీ మతానికి ముడిపెడుతూ మాట్లాడడం ఏ రకంగా సమంజసం? ఏ రకమైన సంస్కారం? ఆట అంటేనే నైపుణ్యం. ఆ రోజు మైదానంలో ఎవరు బాగా ఆడితే, వారిదే గెలుపు. కొన్నిసార్లు అద్భుతంగా ఆడడం, మరికొన్నిసార్లు ఆశించినట్టు రాణించలేకపోవడం ఎవరికైనా సహజం. కానీ, దాన్ని దేశభక్తికి గీటురాయిగా పరిగణిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కొందరు విషం చిమ్మిన ఈ ఆన్లైన్ విద్వేషం దిగ్భ్రాంతికరం. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ‘మేమూ ఓడిన సందర్భాలున్నాయి. మమ్మల్నెవరూ పాకిస్తాన్కు వెళ్ళిపొమ్మనలేదు’ అన్నారు. కొన్నేళ్ళలో దేశంలో అసహనం పెరుగుతోందనడానికి అది ప్రతీక. ఆ మాటకొస్తే, 2015లో అడిలైడ్లో జరిగిన భారత–పాక్ వరల్డ్కప్ వన్డేలో 35 పరుగులకే 4 వికెట్లు తీసి, భారత్కు 76 పరుగుల తేడాతో విజయం దక్కేలా చేసిన బౌలర్ షమీ. భారత్ను గెలిపించినప్పుడు అతని మతం గుర్తు రాలేదా? అంతెందుకు! భారత ఆటగాడిగా, సారథిగా గతంలో అనేక విజయాలందించిన అజరుద్దీన్ది ఏ మతం? పాక్పై గెలుపు తెచ్చిన వికెట్ కీపర్లు సయ్యద్ కిర్మాణీ, సాబా కరీమ్ సహా అనేకులు ఎవరు? హాకీలో మనకు పతకాలు, ప్రతిష్ఠ తెచ్చిన జాఫర్ ఇక్బాల్ను దూరం పెడదామా? జన్మతః పాక్ మూలాలు ఉన్నాయని సినీరత్నాలు రాజ్కపూర్, దిలీప్ కుమార్లను పగవాళ్ళంటామా? పాకిస్తాన్కే పోయి ఉండాల్సింది అందామా? ఈ మూర్ఖత్వంలో అబ్దుల్ కలామ్ లాంటి మహనీయులకీ మతం మకిలిని అంటగడదామా? అసలు ఫలానా మతమంటే పాకిస్తానీలేనా? ఎంత శోచనీయం! మన హైదరాబాద్ నుంచి పాక్ వలసవెళ్ళిన కుటుంబానికి చెందిన యాసిఫ్ ఇక్బాల్ సారథ్యంలో 1980లలో పాక్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించింది. భారత గడ్డ మీది బంధుమిత్రుల్ని చూసి ఇక్బాల్ ఆనందిస్తే, భారత్ చేతిలో పాక్ ఓటమికి అతనే కారణమంటూ అతణ్ణి పాక్లోకి రానివ్వబోమన్న ఘటనలూ చూశాం. తటస్థ క్రికెట్ వేదిక షార్జా లాంటివి అవతరించడమూ గమనించాం. ‘దేశమును ప్రేమించుమన్నా’ అంటే పొరుగువారిని ద్వేషించుమన్నా అని అర్థం కాదు. ఓ పాకిస్తానీ మంత్రి సైతం తమ జట్టు తాజా గెలుపు మత విజయమంటూ ప్రమాదకర వ్యాఖ్యలు చేశారు. ఆ భావన ఎవరు కలిగించినా అది ముమ్మూటికీ తప్పే. 29 ఏళ్ళ నిరీక్షణ ఫలించి, 12 వరుస ఓటముల తర్వాత 13వ సారి ఓ ప్రపంచ కప్ మ్యాచ్లో, ఏకంగా 8 మంది తొలి టీ20 వరల్డ్కప్ ఆటగాళ్ళతో సమష్టి కృషి వల్ల పాక్ జట్టు గెలిచింది. దేశాల మధ్య విద్వేషాలకు భిన్నంగా భారత కెప్టెన్ కోహ్లీ, మార్గదర్శకుడు ధోనీ క్రీడాస్ఫూర్తితో అభినందించడం, సంభాషించడం గమనార్హం. నిజానికి, బంగ్లాదేశ్ లాంటి కూనల చేతిలోనూ భారత జట్టు ఓడినప్పుడు రాని ఉక్రోషం, బయటపడని విద్వేషం, మత్సరం పాక్ చేతిలో ఓడినప్పుడే మనకు ఎందుకొస్తోంది? దీనిలో ఆటకు మించి దాగిన రాజకీయ, సాంస్కృతిక భావోద్వేగాలేమిటి? క్రీడను సైతం కురుక్షేత్రంగా భావించేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంలో ప్రజలు, పాలకుల నుంచి మీడియా దాకా ఎవరి పాపం ఎంత? ఇవన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలు. ఒక మతంలో పుట్టిన పాపానికి ఈ దేశంలో అన్నిటికీ శీలపరీక్షకు నిలబెడుతూ, అగ్నిపునీతులుగా నిరూపించుకోవాలనడం అన్యాయం. అది సోదర భారతీయుణ్ణి అవమానించడమే కాదు, అనుక్షణం అనుమానించడం! అవమానాన్ని అయినా భరించవచ్చేమో కానీ, నిత్యం అనుమానాన్ని భరించడం కష్టమే! ఈ మతవిద్వేష క్రీడ శతాబ్దాల సహజీవనానికి పేరుపడ్డ మన సామరస్య సామాజిక వ్యవస్థకు తీరని ప్రమాదమే!! -
వేడి పెంచే లాబీ క్రీ(నీ)డలా?
వాతావరణ మార్పులకు కారణమౌతున్న భూతాపోన్నతి నియంత్రించే లక్ష్యసాధనలో బాధ్యత కలిగిన దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు మళ్లే మార్పు లక్ష్యించిన స్థాయిలో లేదు. పైగా శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగం పెరిగి, పరిస్థితి విషమిస్తోంది. మూన్నాలుగు రోజులుగా శిలాజ ఇంధన ఉత్పత్తిపై భారత్లో జరుగుతున్న పరిణామాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఇంధనాల వల్లే కర్భన ఉద్గారాలు పెరిగి, భూమి అసాధారణంగా వేడెక్కుతోంది. శతాబ్ది అంతానికి 2 డిగ్రీల సెల్సియస్ను మించి భూతాపోన్నతి పెరక్కుండా నిలువరించటంలో వీటి నియంత్రణే కీలకం. 2030 నాటికి 1.5 డిగ్రీల మించి పెరుగనీయవద్దన్నది లక్ష్యం. ఇప్పటికే 1.1 డిగ్రీల పెరిగింది. ఈ విషయంలో ‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలే ఫలితమిచ్చేలా లేవని, వాటిని సవరించి మరింత కటువుగా కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరముందని వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ‘అంతర్ ప్రభుత్వాల వేదిక’ (ఐపీసీసీ) నివేదించింది. వాస్తవంలో, గడువు లోపల పాత లక్ష్యాలు సాధించడం కూడా ఇపుడు దుస్సాధ్యంగా కనిపిస్తోంది. ‘దేశీయంగా ఖరారైన మా కట్టుబాట్లివి’ (ఎన్డీసీ) అని, ఎవరికి వారిచ్చిన హామీలు సాధించే శ్రద్ద కూడా ఆయా ముఖ్య దేశాల్లో లోపించింది! ఒప్పందం ప్రకారం జరగాల్సిన కార్యప్రణాళిక రచనలో, వేగంగా అమలు పరచడంలో భారత్తో పాటు శిలాజ ఇంధనాల ఉత్పత్తి–వినియోగం అధికంగా ఉన్న దేశాలు విఫలమైనట్టు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమపు(యుఎన్ఈపీ) తాజా నివేదిక చెప్పింది. కీలకాంశాలు బయటకొచ్చిన తర్వాత గురు వారం అధికారికంగానే వెల్లడైన నివేదిక విషయాలు పర్యావరణ హితైషులకు ఆందోళన కలిగి స్తున్నాయి. 75 శాతం ప్రపంచ శిలాజ ఇంధనాల్ని ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఇండొనేషియా, ఖజకిస్తాన్, మెక్సికో, నార్వే, రష్యా, సౌధీ అరేబియా, యుఏఈ, యుకె, అమెరికాలే ఉత్పత్తి చేస్తాయి. ‘హామీ ఇచ్చినట్టు తగ్గించక పోగా... వారి ఇంధన–ఉత్పత్తి ప్రణాళికల సరళి చూస్తుంటే... 2030 నాటికి 110 శాతం, 2040 నాటికి 190 శాతం అధికంగా శిలాజ ఇంధ నాల్ని ఉత్పత్తి చేసే పరిస్థితిని అంచనా వేస్తున్నాం’ అని నివేదిక చెప్పింది. భాగస్వాముల సదస్సు (కాప్–26) వచ్చే వారమే గ్లాస్గో (స్కాట్లాండ్)లో మొదలుకానున్న తరుణంలో ఇది చికాకు కలిగించేదే! భారత్లో పరిణామాలూ ఏమంత బాగోలేవు! ఇటీవలి బొగ్గు సంక్షోభం, విద్యుత్తు ఇతర పారిశ్రామిక అవసరాలకు బొగ్గు పెంచుకునే చర్యలు–సన్నాహాల్ని చూస్తూనే ఉన్నాం. ‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా బొగ్గు తవ్వకాల్ని పెంచే మౌలిక సదుపాయాల కోసం కేంద్రం యాబై వేల కోట్లు వెచ్చించనుంది. 2019–2024 మధ్య బొగ్గు ఉత్పత్తిని సుమారు 60 శాతం (730 నుంచి 1,149 టన్నులకు) పెంచే ప్రణాళికలు అమలవుతున్నాయి. భూసేకరణ అవాంతరాల్ని తొలగించే వ్యూహమూ ఇందులో భాగమే! ఇదే కాలానికి.. చమురు, సహజవాయు ఉత్పత్తి 40 శాతం పెంచా లన్నది లక్ష్యమట. లైసెన్సుల సరళీకరణ, గుర్తించిన వనరు నిక్షేపాలను సంపదగా మార్చడం, సహజవాయు రవాణా సంస్కరణల ద్వారా భారీ లక్ష్యాలు సాధించాలని యోచన! ఉత్పత్తి మౌలిక రంగంలోనో, పన్ను రాయితీల్లోనో పన్నెండు వేల కోట్లు వెచ్చించాలన్నది నిర్ణయం. పెట్రో ఉత్పత్తి పెంచి, ధరల్ని హేతుబద్దం చేయాలని ‘పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)’ను భారత్ కోరింది. మరోవైపు ప్రపంచ చమురు కంపెనీల సీఈవోలతో మన ప్రధాని మోదీ సమావేశమై... దేశీయంగా చమురు, సహజవాయు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రణాళికలివ్వాలని కోరారు. చమురు దిగుమతుల భారం, విదేశీమారకం తరుగుదల తమకు కష్టంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన చమురు అవసరాల్లో 85 శాతం, సహజవాయు అవసరాల్లో 55 శాతం దిగుమతే! కనుక దేశీయ ఉత్పత్తిపై దృష్టి. ఈ పరిణామాలన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగాన్ని పెంచేవే! కానీ, పారిస్లో మన నిర్దిష్ట హామీ (ఎన్డీసీ) ఏమిటి? 2005 బెంచి మార్కుగా, 2030 నాటికి 33–35 శాతం ఉద్గారాలను, ఆ మేర శిలాజ ఇంధన వాడకాన్నీ తగ్గిస్తామని ఒప్పందంపై సంతకం చేశాం. ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతున్న కాప్–26 వేదిక నుంచి రేపేమని సమాధానమిస్తారు? మొన్న కేరళ, నిన్న ఉత్తరాఖండ్, నేడు సిక్కిం.... ఇలా అసాధారణ వర్షాల వల్ల భారీగా ప్రాణ– సంపద నష్టాల అరిష్టాలు కళ్లజూస్తూ కూడా ప్రభుత్వాలు నిద్రవీడటం లేదు. పెరిగే చమురు ధరలకు తోడు, మోయలేని కేంద్ర–రాష్ట్ర పన్ను భారంతో పౌరులు కుంగిపోతున్నారు. కార్పొరేట్ లాబీలు బలంగా పనిచేస్తున్నందునే పునర్వినియోగ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడకంలోకి రావట్లేద నేది విమర్శ. కాప్–26 సదస్సుకు రోజుల ముందు ఐపీసీసీ, యుఎన్ఈపీ వంటి నివేదికల్లోని కీలక సమాచారం బయటకు రావడంపైనా అనుమానాలున్నాయి. ఇంధనాల వినియోగ మార్పు లక్ష్య సాధన వాయిదా కోసం, ఉద్గార నియంత్రణ కాఠిన్యాల్లో సడలింపు కోసం ఒక బలమైన లాబీ యూఎన్పై ఒత్తిడి తెస్తున్నట్టు పర్యావరణవేత్తలు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఇంతటి విప త్కర పరిస్థితుల్లోనూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు పరిస్తే, వారి లాబీయింగ్ ఒత్తిళ్లకు లొంగితే... ఆ పాపానికి నిష్కృతి లేదు, మన ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, ఈ పృథ్వికిక రక్షణ లేదు! -
ఇది ప్రకృతి పొలికేక
ప్రకృతి కోపిస్తోంది. ఆకాశానికి హఠాత్తుగా చిల్లులు పడ్డాయనిపిస్తోంది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలు విరిగిపడుతున్నాయి. ఆనకట్టలు గేట్లెత్తేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణనష్టం. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్, కేరళల్లో పరిస్థితి ఇదే! అనేక ఆలయాలు, తీర్థయాత్రా స్థలాలతో ‘దేవభూమి’గా పేరుపడ్డది– ఉత్తరాఖండ్. నిత్యం పర్యాటకులతో ‘దేవతల సొంత గడ్డ’గా పేరొందింది–కేరళ. రెండు రాష్ట్రాల్లో తాజా ఉత్పాతాలు చూస్తుంటే దేవతగా కొలుచుకొనే ప్రకృతి మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పదలుచుకుందని అనిపిస్తోంది. అభివృద్ధి పేరిట సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, కర్బన ఉద్గారాలతో పర్యావరణ హాని, ఫలితంగా అనూహ్య వాతావరణ మార్పులు– అన్నీ మన తప్పును ఎత్తిచూపుతున్నాయి. చార్ధామ్, శబరిమల యాత్రలకు బ్రేకులేస్తూ, హెచ్చరిస్తున్నాయి. మానవాళి పాపానికి ప్రకృతి శాపం అనిపిస్తున్నాయి. వర్షాకాలం దాదాపు ముగిసినా, అనేక ప్రాంతాలను ఇప్పటికీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం మారిపోతోంది. గత నెలాఖరుకే వెళ్ళిపోవాల్సిన నైరుతి ఋతుపవనాలు ఇంకా ఉన్నాయి. ఈ నెల మొదటే రావాల్సిన ఈశాన్య ఋతుపవనాలు ఇంకా రానేలేదు. ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్లలో ఇటీవల దంచికొట్టిన వర్షాలే అందుకు ఉదాహరణ. అక్టోబర్ 18న 24 గంటల్లో అనేక దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత (87.9 మి.మీ) వర్షం ఢిల్లీలో కురవడం గమనార్హం. 1956 తర్వాత (అప్పట్లో 111 మి.మీ) ఢిల్లీలో ఒక్క రోజులో ఇంత వర్షం ఇదే ప్రథమం. ఒడిశాలోని బాలాసోర్, తమిళనాట కోయంబత్తూరుల్లోనూ ఈ వారం ఇలాంటి పరిస్థితే. సాధారణంగా మన దేశంలో పడమటి కనుమలు, ఈశాన్య, మధ్య భారతావనిలో అధికంగా వర్షాలు కురుస్తాయి. కానీ కొన్నేళ్ళుగా అతి తక్కువ సమయంలో అధిక వర్షపాతం, ఆకస్మిక భారీ వర్షాలు తరచూ సంభవిస్తున్నాయి. కేరళ సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడే తీరు మారింది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ నెల 12 నుంచి ముంచెత్తుతున్న వాన, మెరుపు వరదల్లో కేరళలో 42 మంది, పర్వతప్రాంత ఉత్తరాఖండ్లో 52 మంది బలయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం. సాధారణంగా అక్టోబర్ 1 – 19 మధ్య కేరళలో 192.7 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల కాలమైన అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంతా కలిపినా సగటున 491.6 మి.మీ. వర్షమే కురవడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఈ 19 రోజుల్లోనే 453.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, మామూలు కన్నా 135 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్న మాట. మూడు నెలల సీజన్ మొత్తంలో కురవాల్సినదానిలో 90 శాతం ఈ కొద్దిరోజుల్లో ఇప్పటికే కురిసేసింది. దీన్నిబట్టి వర్ష తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ కుండపోత ఇంతటితో ఆగేలా లేదు. రాగల రోజుల్లో పడమటి కనుమల్లో, తూర్పు కొండల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవట. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 11 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ఇచ్చారు. ప్రభుత్వం అప్రమత్తమై, కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న తూర్పు కొండల్లో జనావాసాలను ఖాళీ చేయిస్తోంది. ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతటి వరదతో 2018లో కేరళలో కనీసం 400 మంది చనిపోయారు. పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అది ఇప్పటికీ మర్చిపోలేని విషాదం. వర్షజల ప్రవాహానికి 44 నదులున్నా, 2019లోనూ వరదలొచ్చిన చరిత్ర ఆ రాష్ట్రానిది. ఇక, ఈ జూలైలోనే ఉత్తరాదినీ, పశ్చిమ భారత తీరప్రాంతాలనూ వరదలు వణికించాయి. తరచూ ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో సొంత వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. నదీ పరివాహకాల్లో, పర్వతప్రాంతాల్లో నివాసం కేరళ, ఉత్తరాఖండ్ లాంటి చోట్ల ఎక్కువ. కేరళ ‘రూమ్ ఫర్ రివర్’ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించింది. వరద ముప్పున్న ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వరద నీటిని నిర్వహించే ఈ తరహా ప్రాజెక్టును నెదర్లాండ్స్ అమలు చేస్తోంది. 2019 మేలో ఆ దేశాన్ని సందర్శించిన కేరళ సీఎం అదే ఫక్కీలో చర్యలు చేపడతామన్నారు. ఆ ప్రాజెక్టునూ, ‘రీబిల్డ్ కేరళ’నూ అమలు చేయడంలో సర్కారు విఫలమైందని ప్రతిపక్షాల ఆరోపణ. వర్షాలు, వరదలు దేశానికి కొత్త కాదు. కానీ, ఇంత తరచుగా రావడం వెనుక మానవ తప్పిదాలు అనేకం. హిమాలయాల నుంచి పడమటి కనుమల దాకా ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే అసలు సమస్య. పర్యావరణ సంక్షోభంపై శాస్త్రీయసాక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ప్రకృతికి హానికరంగా కొండలు, గుట్టల తవ్వకాలు, అడవుల నరికివేత, ఇష్టారాజ్యంగా రోడ్లు, జలవిద్యుత్కేంద్రాలు సహా అనేక నిర్మాణాలు పాలకుల తప్పులే. పడమటి కనుమల పరిరక్షణకు 2011లో మాధవ్ గాడ్గిల్ నివేదిక చేసిన సూచనల్ని పక్కన పడేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుల మీదుగా లక్షా 30 వేల చదరపు కి.మీ.ల ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్ సిఫార్సు చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఒప్పుకోలేదు. తర్వాత 2013లో కె. కస్తూరి రంగన్ మునుపటి సిఫార్సుల తీవ్రతను తగ్గించి ఇచ్చిన సూచనలకూ అదే గతి. పర్యావరణ ఉత్పాతాలను నివారించాలంటే కొన్ని నిర్బంధాలు తప్పవని ప్రజలను చైతన్యపరచ లేదు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జనం డిమాండ్లకు తలొగ్గారు. కేరళ లాంటి రాష్ట్రాలు దానికి ఇప్పుడు చెల్లిస్తున్న భారీ మూల్యమే ప్రస్తుత దుఃస్థితి. దేశంలో తాజా వరద బీభత్సం మరోసారి ప్రకృతి పెట్టిన పొలికేక. ఇప్పటికైనా పెనునిద్దర వదలకపోతే మనకే నష్టం! -
మైనారిటీలపై మత విద్వేషాగ్ని
అనవసరంగా మతాన్ని లాగి, మనుషుల్ని రెచ్చగొడితే ఏమవుతుంది? బంగ్లాదేశ్లో అల్పసంఖ్యా కులపై జరుగుతున్న హింసాకాండలా ఉంటుంది. పవిత్ర ఇస్లామ్ మతగ్రంథాన్ని మరో మతం దేవుడి పాదాల వద్ద దుర్గాపూజ పందిళ్ళలో పెట్టారనే పుకారు ఆ దేశంలో ఆరని చిచ్చు రేపింది. వారం క్రితం అక్టోబర్ 13న ఈ పుకార్లతో బంగ్లాదేశ్లోని కుమిల్లా జిల్లాలో మతఘర్షణలు మొదలయ్యాయి. వంగభూమిలో దుర్గాపూజ వేళ ఈ ఘర్షణలు అనేక జిల్లాలకు, రాజధాని ఢాకాకూ పాకాయి. పదికి పైగా ఆలయాలు, 50కి పైగా విగ్రహాలు, అల్పసంఖ్యాకులకు చెందిన వందలాది ఇళ్ళు, దుకాణాలు విధ్వంసానికి, లూఠీకి గురయ్యాయి. పోలీసులు సహా పదుల మంది గాయపడ్డారు. పలువురు మరణించారు. సోషల్ మీడియా గాలివార్త ఇంతటి అనర్థం తేవడం అత్యంత విషాదం. ప్రాంతాలు, దేశాలకు అతీతంగా దక్షిణాసియాలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సహా అనేకచోట్ల అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా పెరుగుతున్న హింస, విధ్వంసాలకు ఇది తాజా తార్కాణం. ఐక్యరాజ్యసమితి (ఐరాస), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా అంతర్జాతీయ వేదికలు బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను ఖండించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువులపై దాడులకు పాల్పడినవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఆ దేశ హోమ్ మంత్రిని తాజాగా ఆదేశించారు. గడచిన గురువారమే ఆమె తొలి ప్రకటన చేస్తూ, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆమె హెచ్చరించినా, హింసను అరికట్టడానికి బలగాలను దింపినా సరే, బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి రాకపోగా, విధ్వంసం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం విడ్డూరం. కార్యక్షేత్రంలో పోలీసులు తగినంతలేరనీ, సమర్థంగా పనిచేయలేదనీ, నేతలు చూసీచూడనట్టున్నారనీ వార్త. అసలీ విధ్వంసం మునుపెన్నడో పథకం వేసుకొని, బెంగాలీ హిందువుల పెద్ద పండుగ దసరా వేళ చేశారనీ కథనం. ఇదే సందుగా ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి’ అనే ప్రముఖ సంస్థ తాలూకు వాళ్ళమని నమ్మేలా చేస్తూ, అజ్ఞాత వ్యక్తులు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ‘బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్’ అనే దొంగపేరుతో, అనేక పాత దాడుల ఫోటోలు, వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తున్నారు. సందట్లో సడేమియాగా దీన్ని అందిపుచ్చుకొని, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈ హింసాకాండను అస్త్రంగా వాడుకోవాలని హిందూత్వపార్టీలు ప్రయత్నిస్తుండడం శోచనీయం. బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం సైతం మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత ఛాందసవాదాన్ని నూరిపోస్తున్న మదరసాల పుణ్యమా అని ఆ దేశం ఇప్పుడు ‘జిహాదిస్తాన్’గా మారిపోయిందని రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆరోపించారు. పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఈ దాడుల వెనుక ఉందని వినిపిస్తోంది. ఖలీదా జియా సారథ్యంలోని ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ సంకీర్ణ ప్రభుత్వంలో 2001 –06 మధ్య ఆ సంస్థ కూడా భాగం. దేశంలో కనీసం 10 శాతం మందిపై పట్టున్న ఈ బృందం అధికారంలోకి రాలేకున్నా, హింసనైతే ప్రేరేపించగలదు. జమాత్కు కళ్ళెం వేయడం కోసం షేక్ హసీనా ప్రభుత్వం మరో ఇస్లామిస్టు బృందం ‘హెఫాజతే ఇస్లామ్’ (హిమ్)తో దోస్తీ కట్టింది. దాని ఒత్తిడి మేరకే 2017లో సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహం తొలగించారు. మదరసా డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీగా గుర్తించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన వేళ నిరసనలు, హిందువులపై హింసాకాండకూ ‘హిమ్’ కారణమట. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ సర్కార్ తప్పు తెలుసుకొనేసరికే ఆలస్యమైంది. వెరసి, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే వికృత రాజకీయక్రీడ భారత్ నుంచి బంగ్లాదేశ్ దాకా అనేకచోట్లకు పాకింది. జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదుల తూటాలకు హిందువులు, సిక్కులు... అఫ్గాన్లో మసీదులపై దాడులతో పదుల కొద్దీ షియాలు... బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులు! సమయం, సందర్భం, కారణం, కారకులు వేరైనా–ప్రతీచోటా అల్పసంఖ్యాక మతస్థులే లక్ష్యం. దక్షిణాసియాలో మైనారిటీలు అభద్రతలో మునిగిపోయారు. ఉపఖండంలోని ప్రతి దేశం ఇప్పుడొక మతావేశ భూమిగా మారుతోంది. కాశ్మీర్లోనూ, బంగ్లాదేశ్లోనూ ఛాందసవాద బృందాలకు మద్దతుగా నిలిచి, మతం ఆసరాగా విద్వేషాన్ని రగిలించాలన్న పాకిస్తాన్ ప్రయత్నం జగద్విదితం. అందుకే, మతపరంగా సజాతీయతను రుద్ది, రాజకీయ ఆధిపత్యం సాధించాలనుకొనే శక్తులను కనిపెట్టి ఉండాలి. గతంలో ఉత్తర భారతమంతటా గో సంరక్షణ పేరిట ముస్లిమ్ల ఊచకోత జరిగిన ఘట్టాలూ చూశాం. ఇప్పుడు కశ్మీర్లో పండిట్లతో పాటు వలస కార్మికుల ఉసురు తీస్తున్న ఉగ్రమూకల్ని చూస్తున్నాం. సాటిమనిషిని బతకనివ్వని ఛాందసం సిందూరమైతేనేం, హరితవర్ణ బంగారమైతేనేం! 2013 – 16 మధ్య కాలంలో బంగ్లాదేశ్లో జరిగిన దారుణమైన ఇస్లామిస్ట్ హింసాకాండను హసీనా మర్చిపోరాదు. దశాబ్దాలుగా హిందువుల సంఖ్య క్షీణించడంపైనా, మానవహక్కుల సంఘం లెక్కల్లో హిందువులపై 3700 పైగా జరిగిన దాడులపైనా ఆమె తక్షణం దృష్టి పెట్టాలి. తీవ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపితేనే, నేటి స్వర్ణోత్సవ స్వతంత్ర బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతికి సార్థకత. భారత్ భద్రతకు సానుకూలత. తాజాగా ఢాకా విశ్వవిద్యాలయం బయట నిరసనకారుల చేతిలో ప్రముఖంగా కనిపించిన బ్యానర్లో మాట – ‘దేశంలోని మైనారిటీల భద్రతను కాపాడాలి’. అవును... అది బంగ్లాదేశ్ అయినా, భారత్ అయినా, అఫ్గాన్ అయినా ముందు చేయాల్సింది అదే! -
షేడ్స్ ఆఫ్ రెడ్!
మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్ టీచర్ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే. వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం ఎన్ఐటీ)లో ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్లో సీటు దొరికేది. ఆర్ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో! ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు. సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలంగాణ నుంచి బెంగాల్ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది. ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్ఫామ్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట. అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు. ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్స్టార్ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది. జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్కు ఎర్రరంగు పులమాలని రాహుల్ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు. ప్రభుత్వ వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్బీకేల ప్రజంటేషన్ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు. సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది! ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది. మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్ మాఫియాతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్ నారాయణ ‘కోరస్’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్స్టార్స్గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తాలిబాన్ – 2.0
ఆసియా ఖండానికి అఫ్గానిస్తాన్ ఒక పెద్ద జంక్షన్ వంటిది. ఈ దేశానికి సముద్రతీరం లేదు. చుట్టూ భూభాగమే. ఉత్తర దిక్కున ఉన్న ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజకిస్తాన్లు సెంట్రల్ ఆసియా దేశాలు. ఐరోపా ఖండానికి ప్రవేశ ద్వారాలు. ఈశాన్య భాగాన చైనాతోనూ ఓ యాభై కిలోమీటర్ల సరిహద్దు బంధం ఈ దేశానికి ఉన్నది. చైనాకు పక్కలో బల్లెంలా మారిన విగర్ ముస్లిం తీవ్రవాదుల సొంత రాష్ట్రం షింజియాంగ్ అఫ్గానిస్తాన్కు చైనా సరిహద్దు. షింజియాంగ్, టిబెట్లను దాటితే తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాన్ని తాకవచ్చు. పడమటి సరిహద్దు ఇరాన్ గుండా ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాలను చేరుకోవచ్చు. పర్షియన్ గల్ఫ్ దాటితే చేరువలోనే అరేబియా ద్వీపకల్పం. తూర్పు నుంచి దక్షిణ సరిహద్దు వరకు విస్తరించిన పాకిస్తాన్ భూభాగం ద్వారా ఇండియా సహా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలు దగ్గర అవుతాయి. ప్రపంచంలో అతిఎత్తయిన నాలుగు పర్వత శ్రేణుల్లో మూడు అఫ్గాన్ భూభాగాన్ని తాకుతాయి. మరొకటి కూతవేటు దూరంలో ఉండే హిమాలయ పర్వతశ్రేణి. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్–బాల్టిస్తాన్ కూడా తూర్పు అఫ్గాన్కు సరిహద్దు ప్రాంతమే. భారత అధికారిక మ్యాప్ ప్రకారం మన దేశానికి కూడా అది సరిహద్దే. హిమాలయ శ్రేణులు ఇక్కడ ప్రారంభమై టిబెట్–భారత్ సరిహద్దుగా తూర్పువైపునకు వ్యాపించాయి. కారాకోరం శ్రేణులు అఫ్గాన్కు ఈశాన్యంలో తజకిస్తాన్ సరిహద్దుల్లో ప్రారంభమవుతాయి. హిందూకుష్ పర్వతాలు ఈ దేశాన్ని ఉత్తర – దక్షిణాలుగా విడదీస్తే పామిర్ కనుమలు ఉత్తర సరిహద్దుగా ఆవరించి ఉన్నాయి. చరిత్ర ప్రసిద్ధమైన చైనా సిల్క్ రోడ్డు ఈ కనుమల నుంచే ఐరోపాను కలుపుతుంది. ఆసియా జంక్షన్ మాత్రమే కాదు... అపారమైన సహజ నిక్షేపాలకు అఫ్గానిస్తాన్ ఆలవాలం కూడా! పర్వత ప్రాంతం కావడం వల్ల ప్రజలు సహజంగానే దృఢకాయులు, స్వతంత్ర పిపాసులు. అనేక గిరిజన తెగల నిలయం ఈ దేశం. ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఈ తెగల కామన్ ఎజెండా – ఇస్లామ్ ఒక్కటే. పదికి పైగా ప్రధాన తెగలున్నాయి. వీటిలో సగం మంగోల్, సెంట్రల్ ఏసియా తెగలు. ప్రధానమైన తెగ పష్తూన్. దేశ జనాభాలో వీరి సంఖ్య 42 శాతం. ఈ తెగ ప్రజలు ప్రధానంగా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో పాక్ సరిహద్దు భూభాగంలో ఉంటారు. వాయవ్య పాకిస్తాన్ పఠాన్లదీ, వీరిదీ ఒకే జాతి. తాలిబాన్ పుట్టింది ఈ తెగ నుంచే! కాబూల్ మళ్లీ తాలిబాన్ల వశమైందన్న వార్త వెలువడిన తర్వాత వారికి వ్యతిరేకంగా తుపాకులుపేల్చిన రాష్ట్రం పంజ్షీర్. ఈ ప్రజలది తజిక్ తెగ. పంజ్షీర్ అంటే ఐదు సింహాలని అర్థమట. (ఈ మాటలో పాంచ్, షేర్ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి). ఈ ఐదు సింహాల లోయ... సింహం లాంటి ఒక యోధుడికి కూడా జన్మనిచ్చింది. అతని పేరు అహ్మద్షా మసూద్. ఇంజనీరింగ్ చదివిన మసూద్ సోవియట్ యూనియన్ దురాక్రమణకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టాడు. సోవియట్ సైన్యాన్ని గడగడలాడించిన గెరిల్లా కమాండర్గా పేరుపొందాడు. సోవియట్ ఉపసంహరణ అనంతరం ఏర్పడిన ముజాహిదీన్ల ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశాడు. 1996లో కాబూల్ తాలిబాన్ల వశమైన తర్వాత వారి ఛాందస మత వైఖరితో మసూద్ విభేదించాడు. తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టాడు. సెంట్రల్ ఏసియా తెగలను సమీకరించి, నార్తెర్న్ అలయెన్స్ను స్థాపించాడు. తాలిబాన్ల కాలంలో పదిశాతం అఫ్గాన్ భూభాగాన్ని మసూద్ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తాలిబాన్ల తోబుట్టువైన అల్ఖాయిదా కుట్రపూరితంగా ఆత్మాహుతి దళాలను ప్రయోగించి మసూద్ను చంపించింది. మసూద్ హత్య జరిగిన రెండు రోజులకే న్యూయార్క్పై సెప్టెంబర్ 11 దాడి జరిగింది. ఫలితంగా ‘నాటో’ సేనలు రంగప్రవేశం చేసి, మసూద్ సైన్యం సహకారంతోనే తాలిబాన్లను తరిమివేశాయి. ఇప్పుడు మళ్లీ పంజ్షీర్ లోయ నుంచే తాలిబాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు గంటలు మోగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగవలసిందే. ఇంకా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడలేదు. అధ్యక్షుడు ఎవరవుతారో స్పష్టత రాలేదు. ముల్లా ఉమర్తో కలిసి తాలిబాన్ను స్థాపించిన వారిలో ఒకడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. శనివారం నాడే ఆయన కాబూల్కు చేరుకున్నారు. వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ప్రారంభించారు. తాలిబాన్లు, జీహాదీలకే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతి పక్షాలను కలుపుకొని ఒక విశాల వేదికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బరాదర్ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. పష్తూన్ పెత్తనం కాకుండా అన్ని తెగల మధ్య సమభావం సాధించే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. బరాదర్ (ఇంగ్లిష్ బ్రదర్కు పష్తూన్ అర్థం) సోదర భావాన్ని తాలిబాన్ తీవ్రవాద శక్తులు, స్థానిక జీహాదీలు ఏమేరకు ఆమోదిస్తారో చూడాలి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రయత్నాలు ఫలిస్తే పంజ్షీర్ లోయ సమర శంఖారావం చేయకపోవచ్చు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలుండవనీ, మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చుననీ ఒకపక్క తాలిబాన్ అధికార ప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోపక్క అక్కడక్కడా కొన్ని దుందుడుకు శక్తులు ఆగడాలకు దిగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అగ్ర నాయకత్వంలో సామరస్యపూర్వక ధోరణి సమ్మిళిత ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు భావన నిజమే అయితే, అది క్షేత్రస్థాయికి ఇంకడానికి కొంత సమయం పట్టవచ్చు. పాత అలవాట్లు, ఆలోచనా ధోరణి మారడానికి నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి రావచ్చు. ఈలోగానే పాశ్చాత్య మీడియా గగ్గోలు మాత్రం తారస్థాయికి చేరింది. తాలిబాన్లు అనే రాక్షసులు కోరలూ, కొమ్ములూ మొలిపించుకొని పేగులు మెడలో వేసుకొని నడివీధుల్లో భీకర నాట్యం చేస్తున్నారనే ధోరణిలో మీడియా ప్రొజెక్షన్ జరుగుతున్నది. తాలిబాన్లకూ, అఫ్గానిస్తాన్కూ సంబంధం లేని వీడియోలు సోషల్ మీడియాలో కలవరం కలగజేస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించినందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మీద దుమ్మెత్తిపోసే నెటిజన్లకూ కొదవ లేదు. అసలు ఈ బైడెన్ అనే వ్యక్తి ఎవరు? అమెరికాకు ఉన్న హక్కేమిటి? అఫ్గానిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలతో వారికి పనేమిటి? అనే ప్రశ్నలు ప్రధాన స్రవంతి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ చూద్దామన్నా కనిపించడం లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ భూప్రపంచంలోని ప్రతి దేశానికీ దాని పరిధిలో సార్వభౌమాధికార హక్కు ఉన్నది. అమెరికా భూభాగంపై అమెరికాకు ఎంత సార్వభౌమాధికారం ఉన్నదో భూటాన్ భూభాగంపై ఆ దేశానికి అంతే అధికారం ఉన్నది. దేశం చిన్నదయినా, పెద్దదయినా న్యాయం ఒకటే. ఏ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఆ దేశవాసులే తీర్పరులు. సొంత దేశ వ్యవహారాలను సరిదిద్దుకునే నేర్పు, చొరవ అఫ్గానిస్తాన్ ప్రజలకు ఉన్నాయి. శతాబ్దాల తరబడి ఇది రుజువవుతూనే ఉన్నది. మనకు తెలిసిన రెండు సహస్రాబ్దుల చరిత్రలో ఎన్నడూ ఏ సూపర్ పవర్కూ అఫ్గానిస్తాన్ పూర్తిగా తలవంచలేదు. పర్షియన్ చక్రవర్తి డరియస్ కూడా ఈ దేశాన్ని పూర్తిగా పాదాక్రాంతం చేసుకోలేకపోయాడు. డరియస్ను ఓడించిన అలెగ్జాండర్ ద గ్రేట్కు కూడా పూర్ణ అఫ్గాన్ దక్కలేదు. వలసవాద యుగంలో గ్రేట్ బ్రిటన్ ఎన్ని యుద్ధాలు చేసినా సంపూర్ణ ఆధిపత్యం సాధించలేకపోయింది. అయినా అఫ్గానిస్తాన్ క్షేత్ర ప్రాధాన్యత, దాని సహజ నిక్షేపాల సంపద సూపర్ పవర్స్ను ఊరిస్తూనే వస్తున్నది. చరిత్రలో జగద్విజేతలయినవారూ, కావాలనుకున్నవారూ దానిపై కన్నేస్తూనే ఉన్నారు. తన కీలుబొమ్మయిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడే మిషతో సోవియట్ యూనియన్ 1979లో అఫ్గానిస్తాన్పై దురాక్రమణ యుద్ధాన్ని ప్రారంభించింది. లక్షలాది మంది సైన్యాన్ని మోహరించింది. పదేళ్లు యుద్ధం చేసింది. ఆరోజుల్లో పదిహేను బిలియన్ల రూబుళ్లను ఖర్చు చేసింది. ఇరవై వేలమంది రష్యన్లు చనిపోయారు. ఇరవై లక్షలమంది అఫ్గాన్ పౌరులు చనిపోయారు. ముప్ఫై ఐదు లక్షలమంది శరణార్థులయ్యారు. అయినా పదేళ్ల తర్వాత రష్యా తోకముడవక తప్పలేదు. ఆ యుద్ధ భారాన్ని పరాజయ భారాన్ని మోయలేక సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలింది. సోవియట్లో అంతర్భాగంగా ఉన్న 14 రిపబ్లిక్లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. పది తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కుప్పకూలాయి. బెర్లిన్ గోడ బద్దలైంది. అదీ అఫ్గాన్ దెబ్బ. బిన్ లాడెన్ను వేటాడే వంకతో అమెరికా ‘నాటో’ సపరివారంగా 2001లో అఫ్గాన్లో ప్రవేశించింది. ఇరవయ్యేళ్లు అక్కడ తిష్ఠ వేసింది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు అక్కడ ఖర్చుపెట్టవలసి వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతకు రెట్టింపు ఉండొచ్చని అనధికార అంచనా. వేలాదిమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. జరిగిన నష్టంపై పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇంకో ఇరవయ్యేళ్లున్నా మనం చేయగలిగిందేమీ లేదని బైడెన్ ప్రకటించవలసి వచ్చింది. రష్యా, అమెరికాలు వరసగా చేతులు కాల్చుకున్నాయి. ఇక చైనా వంతు. తాలిబాన్లకు అత్యంత నమ్మకమైన మిత్రుడు పాకిస్తాన్. పాకిస్తాన్తో చైనాకు విశ్వసనీయమైన మైత్రీబంధం ఉన్నది. తాలిబాన్లు దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించగలిగినట్లయితే పాక్ ప్రోద్బలంతో చైనా మిత్రబృందంలో అఫ్గానిస్తాన్ చేరవచ్చు. వాణిజ్యపరంగా కూడా చైనా ఉపయోగపడుతుంది. సెంట్రల్ ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాల్లో ప్రభావం చూపగలిగే విధంగా చైనా–రష్యా–పాకిస్తాన్ – అఫ్గానిస్తాన్ – ఇరాన్ కూటమి ఉండాలని చైనా ఆశిస్తున్నది. మరి భారత్ సంగతేమిటి? ఇరవయ్యేళ్ల కిందటి తరహా తాలిబాన్ 1.0 ప్రభుత్వం మనకు ప్రమాదకరం. తాలిబాన్ 2.0లో గుణాత్మకమైన మార్పు వస్తే స్వాగతించవలసిందే. మన విదేశాంగ విధానం అమెరికా – చైనా సంబంధాల కోణంలో ఉండకూడదు. దాన్ని భారత్ అవసరాల దృష్ట్యానే నిర్ధారించుకోవాలి. అఫ్గాన్తో భారత్కు ప్రాచీన సాంస్కృతిక బంధమే కాకుండా తాజాగా ఆర్థిక సంబంధాలు కూడా బలపడ్డాయి. కౌరవ మాత గాంధారిది కాందహార్ అని మనవాళ్లు చెబుతున్నారు. గాంధారమే కాందహార్గా రూపాంతరం చెందిందనే వాదన ఉన్నది. గాంధార దేశమనే మాటకు సుగంధాలు వెదజల్లే ప్రదేశమని అర్థమట. తాలిబాన్ 2.0లో నిజంగానే నిఖిల జగతి ఆశిస్తున్న మార్పు ఉంటుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పష్తూన్ భాషలో తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. తాలిబాన్ అంటే విద్యార్థుల సమూహం లేదా సంఘం అని అర్థం. అఫ్గానిస్తాన్లో సోవియట్ దురాక్రమణ తర్వాత దక్షిణ ప్రాంతంలోని పష్తూన్ తెగ ప్రజలు లక్షల సంఖ్యలో పాకిస్తాన్కు శరణార్థులుగా వెళ్లిపోయారు. వారి పిల్లలకోసం అఫ్గాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మదర్సాలను తెరిచింది. అంతర్జాతీయంగా ఇస్లామిక్ తీవ్రవాదం ప్రబలుతున్న సమయం అది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తీవ్రవాదులను ఉత్పత్తి చేస్తున్న సమయం. మదర్సాలలో చదివే ఒక తరం అఫ్గాన్ విద్యార్థులను అతి ఛాందసవాదులుగా మార్చి ముల్లా ఉమర్ నేతృత్వంలో ఒక మిలిటరీ సమూహంగా తీర్చిదిద్దారు. సోవియట్ల నిష్క్రమణ తర్వాత ఏర్పడిన అంతర్యుద్ధ పరిస్థితుల్లో తాలిబాన్ బలపడింది. దేశంలో 40 శాతానికి పైగా ఉన్న పష్తూన్ల పూర్తి మద్దతు వీరికి లభించింది. ఫలితంగా 1996లో అధికారంలోకి వచ్చారు. ఇస్లామిక్ చట్టం పేరుతో వీరు అమలుచేసిన సాంఘిక విధానాలు, శిక్షలను ప్రపంచమంతా ఖండించింది. మహిళలను అక్షరాలా వంటింటి బానిసలుగా మార్చివేశారు. ఒసామా బిన్ లాడెన్ వంటి తీవ్రవాదులకు దేశాన్ని డెన్గా మార్చారు. అందుకే తాలిబాన్లంటే ప్రజలకు బెదురు. ఇరవయ్యేళ్లలో ప్రపంచ పరిణామాలు చాలా జరిగాయి. ఇప్పుడు తాలిబాన్ నేతలు విద్యార్థులు కాదు. సంస్థ పేరుకే విద్యార్థి సంఘం. విద్యార్థులు ఎవరూ ఇందులో లేరు. ఇరవయ్యేళ్లూ అదొక సైన్యంగా పనిచేసింది. ఇప్పుడు రాజకీయ పార్టీగా పరివర్తన చెందే క్రమంలో ఉన్నది. అన్ని రాజకీయ స్రవంతులనూ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలు ఉన్నట్టు బహిరంగంగానే తాలిబాన్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచం హర్షిస్తుంది. తాలిబాన్ 1.0 మాదిరిగా వ్యవహరించే భౌతిక పరిస్థితులు ఇప్పుడు లేవు. మహిళలు బాగా చదువుకున్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు. జనసామాన్యం అభివృద్ధిని కోరుకుంటున్నది. స్వేచ్ఛనూ, స్వాతంత్య్రాన్ని, అభ్యుదయాన్ని వారు కోరుకుంటున్నారు. ఈ మార్పును తాలిబాన్లు గుర్తించకుండా గతంలో మాదిరిగానే ప్రవర్తిస్తే బుద్ధిచెప్పే సాహసం అఫ్గాన్ ప్రజలకు ఉన్నది. ఈ రెండు రోజుల్లోనే అది వెల్లడైంది. అవసరమైతే మరోసారి సమరశంఖం పూరించడానికి పంజ్షీర్లు సిద్ధంగా ఉన్నవి. దేశాల స్వాతంత్య్రాన్ని, జాతుల స్వయం నిర్ణయాధికారాన్నీ గుర్తించి, గౌరవించడం ప్రజాస్వామిక శక్తుల కనీస ధర్మం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
శైశవగీతి!
ఇదొక మహా చౌర్యం. అతి పెద్ద లూటీ. మనకు తెలిసిన మన చరిత్రలో ఇంత పెద్ద దోపిడీ ఎప్పుడూ జరగలేదు. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్లమంది బాలలు ఏడాదిపాటు బడి చదువుకు దూరమయ్యారట. మన దేశంలో అయితే పదహారు నెలలు గడిచింది. ఇంకా బడులు తెరుచు కోలేదు. బడి అంటే కేవలం చదువే కాదు. బడి అంటే బాల వికాసం. బడి అంటే చైతన్యం. బడి అంటే బాలమిత్ర. నాగరిక సంఘ జీవనానికి పునాది వేసేది బడి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడైనా సరే, మనిషై పుట్టినప్పుడు బడికి వెళ్లకుండా ఉండలేదు. శ్రీరామావతారం దాల్చినప్పుడు కుల గురువు వశిష్టుని వద్దకు వెళ్లి, సకల విద్యలూ అభ్యసించాడు. శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు సాందీపుని గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. మనిషి నిండు నూరేళ్ల జీవితంలో బడికాలం పదేళ్లు మాత్రమే. విలువైన పదేళ్ల కాలంలోంచి ఒక యేడు జారి పోయింది. ఎనభై కోట్ల సంవత్సరాల అతివిలువైన బాల్యాన్ని ఎవరో మింగేశారు. కరోనా ఒక మహావిపత్తు, ఒక మహమ్మారి. మన చేతుల్లో ఏమీ లేదు. ఔను. మార్కెట్లూ, మాల్స్ మన చేతుల్లో ఉన్నాయి. అవి కిటకిటలాడవచ్చును. పండుగలూ, పబ్బాలూ మన చేతు ల్లోనే ఉన్నాయి. అప్పుడు కోవిడ్ రూల్స్ను ఉల్లంఘిం చవచ్చును. గుళ్లూ, గోపురాలు, ప్రార్థనాలయాలు మన చేతు ల్లోనే ఉన్నాయి. అవి తెరుచుకోవచ్చు. తొక్కిసలాట కూడా జరుపుకోవచ్చు. రాజకీయ సభలు ‘లక్ష’ణంగా జరుపుకోవ చ్చును. తాను బీఎస్పీలో చేరబోయే నల్లగొండ సభ లక్షకు తగ్గేదే లేదని ప్రవీణ్కుమార్ ప్రకటించవచ్చును. కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే ఇంద్రవెల్లి సభకు ‘లెక్క పెరిగినా ఫరవాలేదు కానీ లక్షకు తగ్గకుండా చూసుకో షేర్ఖాన్’ అంటూ రేవంత్రెడ్డి సవాలు చేయవచ్చును. ముఖ్యమంత్రి సభలు జనంతో పోటెత్తవచ్చును. ఎన్నికల ప్రచారాలతో నిత్యం వేలాదిమంది దూలాడావచ్చును. ధూమ్ ధామ్ చేయవచ్చును. అన్నీ జరిగిపోతున్నాయి. అంతా నార్మల్గానే వుంది. సూర్యుడు, చంద్రుడు, బీట్ కానిస్టేబుల్తో సహా ఎవరి డ్యూటీ వాళ్లు చేస్తూనే ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు మరి బడి ఎందుకు లేక పాయే కరోనా? ఎందుకంటే... భయం! దేశవ్యాప్తంగా పాలక శ్రేణుల్లో భయం. పాఠశాల విద్యపై మనం వేసిన శీతకన్ను బయట పడుతుందన్న భయం. మనం చూపిన నిర్లక్ష్యం కరోనా అద్దంలో బద్దలౌతుందన్న భయం. టాయిలెట్లు లేని, మంచినీరు దొరకని పరిశుభ్రత లేని బళ్లు తెరిస్తే కరోనా గుళ్లు తెరిచినట్లే అవు తుందన్న భయం. టీచర్లకూ, విద్యార్థులకూ వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని అమలుచేయలేమన్న భయం. నిత్యం విద్యార్థులకు పరీక్షలు చేస్తూ ప్రాంగణాలను శానిటైజ్ చేస్తూ బడులు నడప లేమన్న భయం. షట్టర్ మడిగెల్లో చింతపండు వ్యాపారం మాదిరిగా నడుపుకోవడానికి తాము అనుమతిచ్చిన ప్రైవేట్ స్కూళ్లలో కరోనా విస్ఫోటనం కావచ్చునన్న భయం. ఈ భయా లతో ఇంకెంతకాలం బాలల హక్కులను ఉల్లంఘిస్తారు? ఇంకెన్ని కోట్ల సంవత్సరాల బాల్యాన్ని హరిస్తారు? బడికెళ్లి చదువుకోవడం బాలలకు చట్టబద్ధమైన హక్కు. బాలలకు ఇంకెన్నో సహజమైన హక్కులున్నాయి. ఇప్పటికే అవి అంతరించిపోతున్నాయి. వారిని మనం సూర్యకాంతిలో తిరగ నివ్వడం లేదు. చంద్రుని వెన్నెల్లో ఆడుకోనివ్వడంలేదు. కోతి కొమ్మచ్చి లేదు, బావుల్లో చెరువుల్లో ఈత సాహసం లేదు. చేలల్లో చెలకల్లో చెప్పుల్లేకుండా తిరగడం తెలియదు. అరికాళ్లను పల్లేరుకాయలు గిచ్చడం తెలియదు. బొంతపురుగు గిలిగింత పెట్టడం తెలియదు. నీరెండ వెలుతురులో నీరెండిన ఏటి ఇసుకలో ఆడుకోవడం తెలియదు. కదిలిపోయే మబ్బుల నీడలు ఇసుక మీద బొమ్మలు బొమ్మలుగా మారుతుంటే విప్పార్చి చూసిన అనుభవం ఉండదు. అవి ఆకాశంలో సీతమ్మవారు వేస్తున్న ముగ్గుల ప్రతిబింబాలే సుమా అనుకునే సృజనాత్మక ఆలోచన తట్టదు. ఇవన్నీ లేత వయసు అనుభవించవలసిన సహజ హక్కులు. వీటిని మనం నిషిద్ధ జాబితాలో చేర్పించాము. చట్టబద్ధంగా కల్పించిన హక్కులను కూడా బాలలకు ఇంకెంత కాలం దూరం చేస్తారు? వర్చువల్ పేరుతో, దూరవిద్య పేరుతో, ఆన్లైన్ పేరుతో ప్రవేశపెట్టిన విద్యాపద్ధతులన్నీ విఫలమయ్యాయి. ఈ విధానా నికి ఉపాధ్యాయులే సన్నద్ధం కాలేదు. అనువైన సాంకేతిక వ్యవస్థ ఏర్పడలేదు. పేద విద్యార్థులు మరొకసారి వంచనకు గురయ్యారు. పేద, గ్రామీణ విద్యార్థులకు–పట్టణ, ధనిక విద్యా ర్థులకు మధ్యన అంతరం మరింత పెరిగింది. ఇంట్లో కంప్యూ టర్లు వై–ఫై సౌకర్యాలున్న విద్యార్థులకు కూడా పాఠాలు అంతంతమాత్రంగానే అర్థమయ్యాయి. పిల్లల చదువులకోసం తపించిపోయే మధ్యతరగతి తల్లిదండ్రులతో అప్పులు చేసి మొబైల్ ఫోన్లు కొనిపించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులైతే సిగ్నల్కోసం ఫోన్లు పట్టుకొని చెట్లెక్కడం, గుట్ట లెక్కడం వంటి చిత్రాలను పత్రికల్లో చూస్తున్నాము. ఫోన్ కూడా దొరకని విద్యార్థుల్లో చాలామంది చదువుకు చాప చుట్టేశారు. వీరిలో ఎందరు డ్రాపౌట్లుగా తేలుతారో చూడవలసి ఉన్నది. ఆన్లైన్ పాఠాల సంగతేమో గానీ మొబైల్ ఫోన్ ఒక వ్యసనంగా విద్యార్థుల్లో తయారైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. మొబైల్ ఫోన్లలో పాఠ్యేతర అంశాలపై పిల్లలు ఆసక్తిని పెంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ విద్యపై ‘సాక్షి’ నెట్వర్క్ చేసిన సర్వేలో కూడా ఈ సంగతి వెల్లడైంది. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను ఎలా అర్థం చేసుకుంటు న్నారు? బడులను వెంటనే తెరవాలని కోరుకుంటున్నారా అనే అంశాలను తెలుసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 500 మంది విద్యార్థులతో, వారి తల్లిదండ్రుల్లో ఒక రితో, వారి క్లాస్ టీచర్తో కూడా ‘సాక్షి’ బృందం మాట్లాడింది. మొత్తంగా 1,500 మంది అభిప్రాయాలను క్రోడీ కరించారు. స్కూళ్ల మూసివేత వలన విద్యార్థులు ఒంటరితనాన్ని ఫీలవుతున్నారని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో 80 శాతం తల్లిదండ్రులు చెప్పారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదం డ్రుల్లో కూడా ఈ అభిప్రాయం 70 శాతం మందిలో ఉన్నది. విద్యార్థి మానసిక ధోరణి, ప్రవర్తనలో కూడా మార్పులు కన బడుతున్నాయని దాదాపు ఇదే నిష్పత్తిలో తల్లిదండ్రులు సమా ధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 40 శాతం మంది మాత్రమే ఆన్లైన్ పాఠాలను విన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 70 శాతం మంది హాజరయ్యామని చెప్పారు. రెండు తరగతుల విద్యార్థులు కూడా ఆ పాఠాలు తమకు అర్థం కాలేదనే చెప్పారు. 80 శాతం మంది ప్రభుత్వ విద్యార్థులు, 70 శాతం మంది ప్రైవేట్ విద్యార్థులు కూడా పాఠాలు అర్థం కాలేదని చెప్పారు. ఉపాధ్యాయులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారు. సగానికంటే ఎక్కువమంది విద్యార్థులకు పాఠాలు అర్థమైనట్టే తమకు తోచిందని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని మిస్సవు తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడం ఒక దుర్వ్యసనంగా తయారైందని 60 శాతం ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, 50 శాతం మంది ప్రైవేట్ విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇద్దరూ ఉద్యోగం చేసే తల్లి దండ్రులపై ఈ పరిణామం బాగానే ప్రభావం చూపింది. ఇంటివద్ద ఉండే పిల్లల్ని కనిపెట్టుకోవడానికి ప్రైవేట్ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది ఎవరో ఒకరు పనికిపోవడం మానేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇది ఇరవై శాతంగా ఉన్నది. ప్రైవేట్ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది మొబైల్ లేదా కంప్యూటర్ కొనడానికి అప్పు చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి ఇది 30 శాతం. స్కూళ్లను వెంటనే తెరవాలా వద్దా అనే కీలకమైన అంశంపై మాత్రం దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల వ్యత్యాసం కన్పించలేదు. 86 శాతం తల్లిదండ్రులు, 82 శాతం విద్యార్థులు, 80 శాతం టీచర్లు వెంటనే తెరవాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల నాన్చివేత ధోరణికీ, ప్రజాభిప్రాయానికీ మధ్యన స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి థర్డ్వేవ్ బూచిని ముందుకు తెస్తున్నారు. ఆ తర్వాత ఫోర్త్ వేవ్ కూడా రాదన్న గ్యారంటీ ఏమున్నది? వేవ్లను ఎదుర్కొంటూనే స్కూళ్లను తెరవడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. దశాబ్దాలపాటు యుద్ధాల్లో మునిగితేలినప్పుడు కూడా వియత్నాం, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో జీవన వ్యాపారాలు ఆగలేదు. బడులు మూసివేయలేదు. ఇప్పుడు మన దేశంలో మాత్రం సమస్త వ్యాపారాలకూ, బార్లకు, షికార్లకు గేట్లెత్తి విద్యా రంగం గేట్లను మాత్రమే మూసివేయడం సమర్థనీయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విద్యాలయాలు తెరుచుకోవచ్చు నని సలహా ఇచ్చింది. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విప్లవా త్మక సంస్కరణలు దేశానికిప్పుడు ఆదర్శం. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. మరో ఐదారు రాష్ట్రాలు కూడా ఈ నెలలో అదే బాటను అనుసరించబోతున్నాయి. విద్యారంగం రూపంలోనూ, సారంలోనూ (form and content) పూర్తి స్థాయి ప్రక్షాళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. శిథిలా వస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలను కల్పించడానికి దాదాపు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మూడో వంతు స్కూళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఏ బిడ్డ కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదని కొన్ని గొప్ప పథకాలను ఆయన అమలు చేస్తున్నారు. ‘అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక’ వంటి వరాల ఫలితంగా ఏ తల్లికీ బిడ్డ చదువు భారం కాని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానానికి (ఎన్ఈపీ) అనుగుణంగానే సృజనాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాన్ని రూపొందించారు. ప్రతి తరగతిలో మాతృభాష తెలుగును ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రకటించారు. ప్రపంచస్థాయి పోటీల్లో నిలబడటం కోసం కింది స్థాయి నుంచే ఇంగ్లిష్ను బోధనా భాషగా అమలు చేయబో తున్నారు. 16 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం కోసం ఒక అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. అందులో పొందుపరచిన ‘కరిక్యులమ్’ ప్లాన్ను పరిశీలిస్తే మన పాఠశాల విద్యావ్యవస్థ మీద మళ్లీ విశ్వాసం కలుగుతున్నది. ఆటపాటలకు, సృజనాత్మకతకు ఈ సిలబస్లో చోటు కల్పించారు. పర్యావరణం ఒక ప్రాధాన్యాంశంగా ఉంటుంది. ఆరోగ్యం, కెరీర్లపై పాఠాలుంటాయి. గుమస్తాల తయారీకి బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానాన్ని చాలా కాలం అనుసరించాము. తర్వాత కాలంలో కార్పొరేట్ సంస్థల అవసరాల కోసమే ఇంజనీరింగ్ విద్యను సవరించుకున్నాము. ఫలితంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు పుట్టాల్సిన చోట బీపీఓల్లో పనిచేస్తే ఇంజనీర్లు పుట్టుకొచ్చారు. ఇప్పటికైనా దిద్దు బాటుకు ఉపక్రమిద్దాం. రూపాన్నీ, సారాన్నీ సంస్కరించుకొని ప్రారంభించుకోబోతున్న పాఠశాలలను స్వాగతిద్దాము. పిల్లల గురించి ‘శైశవ గీతి’లో శ్రీశ్రీ చెప్పిన పంక్తుల్ని గుర్తుకు తెచ్చు కుందాము. ‘‘మీదే మీదే సమస్త విశ్వం! మీరే లోకపు భాగ్య విధాతలు! మీ హాసంలో మెరుగులు తీరును... వచ్చేనాళ్ల విభా ప్రభాతములు!’’ ఈ ప్రపంచాన్ని పెద్దలు మనకిచ్చారు. మనం పిల్లలకిచ్చేయాలి. ఇచ్చేద్దాం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కోటి నాగళ్ల నోము
ఈ దేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఎంతోమంది రాజులు మారిపోయారు. రాజ్యాధికారాలు ఎన్నోసార్లు చేతులు మారాయి. కానీ, స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మటుకు శతాబ్దాల పర్యంతం చెక్కుచెదరకుండా అలాగే నిలబడి పోయింది. బ్రిటిష్ వలసపాలన మొదలైన తర్వాత మాత్రమే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు ఒక్కొక్కటే తెగి పోవడం ప్రారంభమైంది. భారతదేశ చారిత్రక పరిణామాలపై కమ్యూనిస్టు ప్రవక్త కారల్మార్క్స్ అవగాహన కూడా ఇదే. మార్క్స్ భారతదేశం గురించి రాసింది తక్కువే. కానీ చేసిన అధ్యయనం చాలా విస్తృతమైనది. ‘భారత్లో బ్రిటిష్ పాలన భవిష్యత్ పరిణామాలు’ అనే వ్యాసంలో ఆయన అధ్యయనం, అవగాహన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాకపోతే ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కులచట్రంలో బిగు సుకుపోయిందనీ, ఈ కులం అనేది దేశ అభివృద్ధికి గుదిబండగా మారిందని మార్క్స్ అభిప్రాయపడ్డారు. మేధోశ్రమ, శారీరక శ్రమల ఆధారంగా కులవిభజన జరిగింది. శారీరక శ్రమకు మేధోశ్రమ తోడ్పాటు లభించలేదు. ఫలితంగా ఉత్పాదకతలో సాంకేతిక అభివృద్ధి జరగలేదు. కులవ్యవస్థతో కుంటుతున్నప్ప టికీ, సాంకేతిక పరిజ్ఞానం కొరవడినప్పటికీ భారతదేశ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అద్భుతాలనే సృష్టించింది. బ్రిటిష్ ఆర్థికవేత్త ఆంగస్ మాడిసన్ లెక్కల ప్రకారం పదిహేడో శతాబ్ది నాటికే ప్రపంచ జీడీపీలో భారతదేశం వాటా 23 శాతం. ఈ దేశంలో బ్రిటిష్ వారి పాలన ప్రారంభం కాకముందటి లెక్క ఇది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీలో మన వాటా 7 శాతం మాత్రమే. బ్రిటీష్ వాళ్లు మనదేశం నుంచి ఎంత సంపదను లూటీ చేశారనే అంశంపై ఆర్థికవేత్తలు కొందరు లెక్కలు కట్టి ప్రస్తుత కరెన్సీ విలువల ప్రకారం 45 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లుగా తేల్చారు. అంటే 45 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయి లెక్కల్లోకి మారిస్తే సుమారు 3,300 లక్షల కోట్ల రూపాయలు! ఈ సంపదంతా మన స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సృష్టి. శ్రామిక ప్రజలు తమ కరాల బిగువు, నరాల సత్తువతో కురిపించిన వరాల వర్షమే ఇదంతా! ఈ అవగాహన ఉన్నందువల్లనే మహాత్మాగాంధీ ‘గ్రామ స్వరాజ్’ను స్వతంత్ర భారత్కు అభివృద్ధి మోడల్గా సూచిం చారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కులనిర్మూలన అంశాన్ని ఎజెండా పైకి తెచ్చారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయ కత్వం ఈ రెండు కీలక విషయాలనూ పక్కన పెట్టింది. భారత దేశ పరిణామాల విశ్లేషణలో కారల్మార్క్స్ ఈ రెండంశాలనూ ప్రధానంగా ప్రస్తావించారు. కానీ, ఈ దేశంలోని కమ్యూనిస్టులు వాటిని పెడచెవిన పెట్టి మూల్యం చెల్లించుకున్నారు. స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది వ్యవసాయం. ఇప్పటికీ అత్యధిక ప్రజానీకాన్ని అక్కున చేర్చుకొని ఆశ్రయ మిస్తున్న రంగం ఇదే. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన పాల కులు ఈ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఫలితంగా ఒక దశలో దేశానికి సరిపోయే తిండి గింజల్ని పండించలేని స్థితిలోకి మన వ్యవసాయరంగం దిగజారింది. అప్పుడు కళ్లు తెరిచి ‘గ్రీన్ రివల్యూషన్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టడం, రసాయనిక ఎరువుల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించడం – ఈ ‘గ్రీన్ రివల్యూషన్’ సాధిం చిన ఘనతలు. ఫలితంగా ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవమే. ఉత్పత్తి వ్యయం ఆ నిష్పత్తిని మించి పెరిగిందన్నది ఒక చేదు నిజం. ప్రజారోగ్యం అటకెక్కిందన్నది మరింత నిష్ఠుర సత్యం. ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం దారుణమైన అవమానాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. మార్కెట్ ధరలు దైవాధీనం. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి రైతును వెక్కిరించాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అందుకు కారణం అప్పుడు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు. ఆర్థిక సంస్కరణ ల్లోని అమానుష పార్శా్వనికి ఒక లోగో మాదిరిగా ఆయన ఫొటో స్థిరపడిపోయింది. ప్రపంచబ్యాంకు జీతగాడు అనే బిరుదు కూడా దొరికింది. బోరు మోటార్లకు కరెంట్ బిల్లు చెల్లించకపోతే ఇంటి తలుపుల్ని పెకిలించి తీసుకొనిపోయేవారు. పరువు పోయిందని రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. పరువు పోకూడదని రైతు మహిళలు పుస్తెలమ్మి మరీ కరెంట్ బిల్లులు కట్టేవారు. పాలుతాగే వయసు బిడ్డలున్న తల్లుల పరిస్థితి హృద యవిదారకంగా మారింది. కడుపునిండా తిండిలేక బిడ్డకు స్తన్యమివ్వలేని దైన్యం వారిది. కల్లుసీసాకు పాలపీకను పెట్టి బిడ్డ చేతికిచ్చేవారు. కల్లు మత్తులో బిడ్డ నిద్రపోతుందని, ఆ నిద్రలో ఆకలి మరిచిపోతుందని ఒక ఆశ. ఈ పరిస్థితులను వివ రిస్తూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే పాట జాతీయ ఆర్తనాద గీతమైంది. ‘కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను / కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను / పెద్దబాడిసె మొద్దుబారినది / సాలెల మగ్గం సడుగులిరిగినవి / చేతివృత్తులా చేతులిరిగి పాయే నా పల్లెల్లోనా / అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనా బాయే ఈ దేశంలోనా..’ అంటూ సాగే ఆ పాట నాటి పరిస్థితులకు అద్దం పట్టింది. ‘వ్యవసాయం దండగ’ అన్నది ఆనాడు చంద్రబాబు నినాదం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘వ్యవసాయాన్ని పండుగ’ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అప్పటివరకున్న అప్పులు మాఫీ అయ్యాయి. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వ డానికి జలయజ్ఞం ప్రారంభమైంది. రైతు లోకంలో మళ్లీ ఆశలు మొలకెత్తాయి. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం పాలైన తర్వాత ఉద్యమ స్ఫూర్తి, వేగం కొరవడినప్పటికీ ఆ పథకాలైతే అరకొరగానైనా కొనసాగాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రా ల్లోని పల్లెలు కొత్త చిగురులు తొడుక్కుంటున్న దృశ్యాలు కన్పి స్తున్నాయి. తెలంగాణలో రైతుబంధు, మిషన్ కాకతీయ, కాళే శ్వరం ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు రైతు గుండెల్లో విశ్వా సాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పల్లె ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఫలితంగా మహాత్ముని ఆశయమైన ‘గ్రామ స్వరాజ్’ను అమలు చేసినట్లయింది. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, బీమా నిధులు ఠంచనుగా చెప్పిన సమయానికి అందుతున్నాయి. పల్లెలు జన సందడితో కళకళలాడుతున్నాయి. పరిపాలనంతా పల్లెలోంచే సాగుతున్నది. సచివాలయంతోపాటు మరో కొత్త ల్యాండ్ మార్క్ అడ్రస్ – ‘రైతు భరోసా కేంద్రం’ (ఆర్బీకే). ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి దార్శనికతకు మరో మచ్చుతునక ఆర్బీకే సెంటర్. ఇదొక విప్లవాత్మక ఆలోచన. మరో ఒకటి, రెండేళ్లలోనే ఆ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఈ కేంద్రాలు తేజోమయం చేయబోతున్నాయి. వ్యవసాయం సంక్షో భంలో కూరుకొనిపోవడానికి ప్రధాన కారణమేమిటి? పెట్టుబడి వ్యయం పెరగడం, పెరిగిన ధరలకు కూడా నాణ్యమైన ఇన్ పుట్స్కు బదులు నకిలీవి దొరకడం ఒక ప్రధాన కారణం. పండించిన పంటకు లాభసాటి ధర దొరకకపోవడం, ఎక్కువ సార్లు గిట్టుబాటు ధర కూడా లభించకపోవడం మరో ప్రధాన కారణం. ఈ రెండు ప్రధాన కారణాలను ఆర్బీకే సెంటర్ల ద్వారా పరిహరించే కార్యక్రమం మొదలైంది. ఈ సంవత్సరం కోటి టన్నుల ధాన్యాన్ని ఈ సెంటర్ల ద్వారా కొనుగోలుచేసి రైతులకు డబ్బులు కూడా చెల్లించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సబ్సిడీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. నాన్–సబ్సిడీ వాణిజ్య పంటల విత్తనాలు ఇందుకు అదనం. ఆర్బీకే సెంటర్లో ఏర్పాటుచేసిన కియోస్క్లో ఆర్డర్ చేసిన ఇరవై నాలుగ్గంటల్లోనే సీడ్ టెస్టింగ్ కిట్లతో నాణ్యతను పరిశీలించి మరీ రైతుకు అందజేస్తున్నారు. విత్తనాల్లో నాణ్యతే కాకుండా మార్కెట్ ధరకంటే తక్కువకు లభిస్తున్నాయనీ, రోజూ మండల కేంద్రానికి వెళ్లి ఎదురుచూసే వ్యయప్రయాసలు ఇప్పుడు లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులకోసం దుకాణాల ముందు చెప్పుల్ని క్యూలో విడిచిపెట్టే రోజులు ఇక గత చరిత్ర. నాణ్యమైన విత్తనాల లభ్యత నుంచి పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు అండగా నిలబడుతున్న ఆర్బీకేలకు ఈ మధ్యనే ప్రతిష్ఠాత్మకమైన ‘స్కోచ్’ ఆవార్డు కూడా లభించింది. గ్రామస్థాయిలోనే ఎరువులు, విత్తనాలను రైతులకు అంద జేస్తున్న ఆంధ్రప్రదేశ్ను అన్నిరాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవా లని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించింది. ధాన్యం కొను గోళ్లకు, ఎరువులు–విత్తనాల సరఫరాకు మాత్రమే ఆర్బీకేలు పరిమితం కావు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఈ కేంద్రాలు బహుళార్థ సాధక కేంద్రాలు కానున్నాయి. సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను అద్దెపై అందుబాటులో ఉంచేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లలో సేవలందించడానికి ఒక అగ్రి కల్చరల్ అసిస్టెంట్ ఉంటారు. ఆ వూళ్లో సాగయ్యే భూవిస్తీ ర్ణాన్ని బట్టి పంటల వైవిధ్యాన్ని బట్టి కొన్ని గ్రామాల్లో ఒకరికంటే ఎక్కువ గానే ఈ అసిస్టెంట్లు ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా ‘ఈ–క్రాపింగ్’లో తలమునకలై ఉంటూ కూడా, ఎరువులు, విత్త నాల సరఫరాలో ఇబ్బంది లేకుండా వీరు వ్యవహరిస్తున్నారు. ‘ఈ–క్రాపింగ్’ అనేది రైతుకు సౌకర్యవంతమైన కార్యక్రమం. ఇందులో నమోదైన వారికి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. ఏ కారణం వల్లనైనా పంట నష్టం జరిగినా ఇన్ పుట్ సబ్సిడీ, బీమా పరిహారం లభిస్తాయి. పంటను అమ్ము కోవడం కూడా సులభం. కౌలు రైతులకైతే ‘ఈ–క్రాపింగ్’ ఓ వరం. భూయజమాని సంతకం పెట్టకపోయినా ఈ సౌకర్యా లన్నీ కౌలు రైతుకు దక్కుతాయి. భూయజమాని సంతకం పెట్టినట్టయితే రైతు భరోసా కూడా లభిస్తుంది. రైతు భరోసా కేంద్రం ప్రతి పల్లెలోనూ ఏర్పాటవడం రైతులకు గొప్ప సదుపాయం. నేరుగా కేంద్రానికే వెళ్లి రైతులు పంటల గురించి, ప్రభుత్వ పథకాల గురించి వాకబు చేసే అవకాశం దొరికింది. వ్యవసాయ శాఖ యంత్రాంగం కూడా గ్రామంలో ఉన్న అసిస్టెంట్ల ద్వారా రైతులకు సలహాలు, సూచ నలూ పక్కాగా అందజేయడానికి మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో భూకమతాలు సుమారు 80 లక్షల మేరకు ఉంటాయి. పూర్తిగా వ్యవసాయంపైనే కేంద్రీకరించే రైతుల సంఖ్య కోటీ ఇరవై లక్షల దాకా ఉండొచ్చు. పది లక్షల కమతాలను స్వయంగా మహిళలే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సగటు కమతం విస్తీర్ణం ఒకటిన్నర ఎకరం మాత్రమే! ఈ చిన్న కమతంలోనే రైతు కుటుంబం తిండి, బట్ట, ఇతర ఖర్చులను వెళ్లదీయాలి. అందుకు అనుకూలమైన సేద్యపు నమూనాలను వ్యవసాయ శాఖ రూపొందించవలసి ఉన్నది. సమీకృత వ్యవసాయానికి (integrated farming) రైతులను సిద్ధం చేయాలనే ఆలోచన వున్నట్టు చెబుతున్నారు. కుటుంబానికి సరిపడా తిండిగింజలతోపాటు కొంతభాగం వాణిజ్య పంటను వేస్తూ, అనుబంధంగా కోళ్ల పెంపకం లేదా పాడి, లేదా చేపల పెంపకం చేపట్టి రోజువారీ ఆదాయం పొందేవిధంగా చేసే వ్యవసాయాన్ని ‘సమీకృత వ్యవసాయం’ అంటారు. చాలామంది ఆదర్శ రైతులు ఇప్పటికే ఇందులో ప్రయోగాలు చేసి రాణిస్తున్నారు. హైడెన్సిటీతో చేసే సాగు పద్ధతులూ, ఏడాది పొడుగునా ఏదో ఒక పంట తీసే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పంటలు పండించడమే కాదు పంట దిగుబడిని ప్రయాస లేకుండా అమ్ముకోవాలి. మన దేశ వ్యవసాయరంగంలోకి అవసరమైన మేరకు పనిముట్లు, యంత్రాలు ప్రవేశించలేదు. చిన్న కమతాలున్న రైతులు కూలీల సహాయం లేకుండానే పనులు పూర్తిచేసుకునే సామగ్రి తయా రీపై దృష్టిపెట్టాలి. బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, చాప్కట్టర్ వంటి వాటి వినియోగంలో శారీరక బలం కూడా అవస రమవు తున్నది. వీటిని మహిళా రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని రీడిజైన్ చేయాలి. ఈ అన్ని వ్యవహారాల్లోనూ ఆర్బీకేలు క్రియా శీలక పాత్రను పోషించవలసి ఉన్నది. చిన్న కమతం రైతు కూడా సేద్యంలో లాభాన్ని కళ్లచూడాలన్నదే ముఖ్యమంత్రి అంతరం గమని వ్యవసాయాధికారులు చెబు తున్నారు. అది సాఫల్యమైన నాడు వ్యవసాయ లాభాలపైన ఇతర వృత్తులూ, వ్యాపారాలు ప్రవర్ధమానమై పల్లెవెలుగులీనుతుంది. ఒక తరం గడిచేసరికి రైతు కుటుంబాల్లోని అనేకమంది వారసులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. వారి అభీష్టం మేరకు నచ్చిన వృత్తుల్లో స్థిరపడతారు. వ్యవసాయంపై ఒత్తిడి తగ్గుతుంది. కమతాల పరిమాణం పెరుగుతుంది. వచ్చే తరం రైతు విద్యాధికుడు. అతడు సాధారణ రైతు కాదు. ఒక రైతు శాస్త్రవేత్త. అననుకూల పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు సాధించగల ఇజ్రాయెల్ రైతులకు దీటైనవాడు. ఒక డాక్టర్లా, ఒక లాయర్లా, ఒక ఇంజనీర్లా, ఒక ప్రభుత్వ అధికారిలాగా అతనికి సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. పలుకుబడి ఉంటుంది. రాబోయే తరం రైతు సంపన్నుడు. ఎంపవర్డ్ ఫార్మర్. రైతును రాజును చేసే యుగ ప్రయాణానికి రాకెట్ ఇంధనం – ‘రైతు భరోసా కేంద్రం’! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బడి గంటలు మోగేవేళ...
చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసమెట్టిది? చరిత్ర అధ్యయనంలో ఈ కోణం చాలా ముఖ్యం. నాగరికత నడిచి వచ్చిన బాటలో గుర్తుపెట్టుకోదగిన మైలురాళ్లు ఎన్నో ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. మననం చేసుకోదగిన మలుపులెన్నో ఆ బాటలో ఉంటాయి. వాటిని మదిలో పెట్టుకోవాలి. ఆ మైలురాయిని దాటిన తర్వాత, ఆ మలుపు తిరిగిన తర్వాత జీవన చిత్రం మెరిసిందా? వెలిసిందా? అనేది అంతకంటే ముఖ్యం. సరిగ్గా ముప్పయ్యేళ్ల కిందట భారతదేశ చరిత్ర ఒక కీలక మలుపును తీసుకున్నది. ప్రగతి గమనంలో గడిచిన వెయ్యేళ్ల ప్రయాణం కంటే ఈ ముప్పయ్యేళ్ల ప్రయాణమే ఎక్కువ. అంతటి ఝంఝామారుతవేగాన్ని ప్రసవించిన మలుపు పేరు ఆర్థిక సంస్కరణలు. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ల జోడీ ఈ పురుడు పోసింది. 1991 జూలై 24న మొదలుపెట్టి వంద రోజుల్లోనే కీలకమైన అనేక ఆర్థిక నిర్ణయాలను అప్పటి మైనారిటీ ప్రభుత్వం తీసుకున్నది. ‘‘ఈ భూ ప్రపంచంలోని సమస్త శక్తులూ, సైన్యాలకంటే, కాలాను గుణమైన ఒక ఆలోచన (ఐడియా) గొప్పదని’’ మన్మోహన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఉద్ఘాటించారు. ఫ్రెంచి కవి విక్టర్ హ్యూగోను ఉటంకిస్తూ ఈ మంత్ర వాక్యాన్ని పఠించి భారత ఆర్థిక వ్యవస్థ కిటికీ తలుపుల్ని ఆయన తెరిపించారు. ఫలితాలేమి టన్నది అనుభవైకవేద్యమే. విజేతలే చరిత్రను లిఖిస్తారు. లేదా విజేతల తరఫుననే చరిత్రకారులు రాస్తారు. పీవీ నరసింహారావు – మన్మోహన్ల జోడీకి ఐదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక సంస్కరణలు అమలుచేసే అవకాశం దొరికింది. కనుక ఈ ఆలోచన కూడా వారి ఖాతాలోనే పడింది. కానీ, అంతకంటే ఏడాది ముందుగానే అప్పటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్సింగ్ సూచన మేరకు నాటి పీఎమ్ఓలో సలహాదారుగా ఉన్న మాంటెక్సింగ్ అహ్లూవాలియా ఎమ్–డాక్యుమెంట్ పేరుతో ఆర్థిక సంస్కరణల ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. 1990లో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఈ డాక్యుమెంట్ అచ్చయింది కూడా! ఆర్థిక సంస్కరణలతోపాటు సామాజిక సంస్కరణల గురించి కూడా వీపీ సింగ్ ఆలోచించారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే మండల్ సిఫారసుల్ని ముందుకు తెచ్చారు. ఇది అప్పటి కులీన మేధావి వర్గానికి నచ్చలేదు. ఫలితంగా ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆర్థిక సంస్కరణలకు మాత్రమే పరిమితమై ఉంటే, బహుశా విశ్వనాథ్ ప్రతాప్సింగ్ ప్రధాని పదవిలో కొనసాగి ఉండేవారేమో. సంస్కరణల ఫలితంగా సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. అదే నిష్పత్తిలో అసమానతలు కూడా పెరిగాయి. సంస్క రణల సత్ఫలితాలను ఆదిలోనే అందిపుచ్చుకొని కొత్త సహస్రాబ్ది లోకి ముందడుగు వేసిన వర్గాలు మున్ముందుకు దూసుకొని పోయాయి. వెనుకబడిన వారు అక్కడే ఉండిపోయారు. పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న మధ్యతరగతి వారిలో కొందరు తొలి రోజుల్లోని షేర్ మార్కెట్ బూమ్ను క్యాష్ చేసుకోగలిగారు. పట్టణ శివార్లలో భూములున్నవారికి కోళ్లఫారాల వ్యాపారం కన్నా కాలేజీల వ్యాపారం లాభసాటిగా కన్పించింది. కనిపించ డమే కాదు కాసులు కురిపించింది. ఇలా రకరకాలుగా పోగేసు కున్నవారికి మరో జాక్పాట్ తగిలింది. అదే రియల్ ఎస్టేట్ బూమ్. పట్టణీకరణ కార్యక్రమం సిరిగలవాడి పట్టాభిషేకోత్స వంగా మారింది. మిరుమిట్లు గొలిపే నయా సంపన్న వర్గాలతో ఇండియా వెలిగిపోవడం మొదలైంది. కొత్త వ్యాపార సంస్కృ తిలో పాత విలువలు కొట్టుకొని పోయాయి. ఈ క్రమంలోనే విద్య కూడా అంగడి సరుకైంది. ఈ దేశంలోని అత్యధిక ప్రజానీకానికి సొంతంగా భూములు లేవు. ఏ బూమ్లూ వారికి అందలేదు. వీరిలో సహజంగానే దళితులూ, గిరిజనులూ ఉన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజల్లో అత్యధికులు ఉన్నారు. అగ్ర కులాల్లోనూ మెజా రిటీగా ఉండే పేదలందరూ ఉన్నారు. ఈ పేదల కులం బతు కులు బాగుపడకపోగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో ఉచితంగా లభించిన విద్య ఇప్పుడు అందని ద్రాక్షగా మారింది. విద్యారంగ మైదానంలో ప్రైవేటీకరణ రేసుగుర్రంలా పరుగులు తీసింది. ఈ గుర్రప్పందేల్లో నంబర్వన్ జాకీగా చంద్రబాబు ఘనకీర్తిని సాధించారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసు కోకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆయన గద్దెనెక్కిన ఎనిమిదేళ్లకు 2003లో తీసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 95.5 శాతం ప్రైవేట్ కాలేజీలే! దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్య ధికం. ఈ సంస్థలను స్థాపించినవారు విద్యావేత్తలూ, వదా న్యులు కాదు. డబ్బు సంపాదనకు చిట్ఫండ్ అయితేనేమీ, చింతపండు అయితేనేమీ అనుకునేవాళ్లు! కోళ్లఫారమైతేనేమీ, కాలేజీ అయితేనేమీ అనుకునేవాళ్లు!! వీరి కబంధ హస్తాల్లోకి విద్యా రంగం వెళ్లిపోయింది. ఉన్నత విద్యను ప్రైవేట్ దోపిడీకి ఎరవేసిన ప్రభుత్వాలు పాఠశాల విద్యను కూడా గాలికొదిలేశాయి. ఫలితంగా అక్కడా ప్రైవేట్ స్కూళ్ల ఆధిపత్యమే ఏర్పడింది. కనీసం మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించకుండా ప్రభుత్వ స్కూళ్లను శిథిలం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారికే ఉద్యో గాలు లభించే అవకాశాలున్న మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇంగ్లిష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూళ్లలో చదివించడానికే పేద తల్లిదండ్రులు సైతం మొగ్గుచూపారు. పిల్లల భవిష్యత్కోసం తల్లిదండ్రులు పడే తపనను అవకాశంగా మలుచుకొని ఎక్కువ భాగం ప్రైవేట్ పాఠశాలలు దోపిడీ కార్యక్రమాన్ని చేపట్టాయి. వడ్డీ మీద చక్రవడ్డీ చందంగా, మోయలేని స్కూలు ఫీజులతో పాటు, పుస్తకాలకూ, నోటు బుక్కులకూ, బ్యాగుకూ, బ్యాడ్జీకీ, బూట్లకూ, బెల్టుకూ, యూనిఫామ్కూ ఇష్టారీతిన ధరలు నిర్ణ యించి వసూలు చేయడం మొదలుపెట్టాయి. పిల్లల పాఠశాల చదువులకోసమే తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. అన్నిరకాల ఫీజుల్ని ముక్కు పిండి వసూలుచేసే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యా బోధనలో మాత్రం ప్రమాణాలను పాటించడంలేదు. ఎక్కువ భాగం స్కూళ్లలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే లేరు. సుశిక్షితు లైన, అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ రంగంలోనే ఉన్నారు. కానీ, ఇంగ్లిష్ మీడియం లేని కారణంగా, కనీస వసతులు లేని కారణంగా ఏటేటా ఈ స్కూళ్లలో విద్యార్థుల చేరిక పడిపోతూ వచ్చింది. ఈరకంగా మన ప్రాథమిక విద్య ఉభయ భ్రష్టత్వంగా తయారైంది. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ముఖ్య మంత్రిగా ఉండగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గెలిచే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వంద కోట్లు ఇస్తానని ప్రకటించారు. జపాన్కు చెందిన ఒక నోబెల్ గ్రహీతతో విద్యార్థుల సమక్షంలో మాట్లాడుతూ ఆ పురస్కారం సాధించటానికి అడ్డదారులు ఏమైనా ఉంటే మా విద్యార్థులకు చెప్పండని అడిగారు. అదీ విద్యారంగంమీద చంద్రబాబు అభిప్రాయం, అవగాహన. ఇప్పుడు మళ్లీ ఒకసారి విక్టర్ హ్యూగోను తలపునకు తెచ్చుకుందాం. విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన సాకారం దిద్దుకుంటున్నది. ఈ భూమండలం మీది సమస్త శక్తులు ఏకమైనా ఇక దాన్ని అడ్డుకోలేవు. రెండేళ్ల కిందట ఆంధ్ర ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షుభితమైన విద్యారంగంపైన దృష్టి నిలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటైన, కొన్ని విషయాల్లో మెరుగైన వసతులను కల్పించే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పదిహేను వేలకు పైగా స్కూళ్లలో ఈ కార్య క్రమం పూర్తయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఆ స్కూళ్లను చూసి విద్యార్థులు మురిసిపోతున్నారు, బడి ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు ఫొటోలు తెప్పించుకొని ‘ఔనా... ఇది మన ఊరి బడేనా’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను బడికి పంపేలా అమ్మను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రకటించింది. బిడ్డను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుంది. బిడ్డను బడికి పంపే మోటి వేటర్ అమ్మే కానుంది. వీటికితోడు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి మరీ ‘జగనన్న విద్యా కానుక’ను ఎంపిక చేస్తున్నారు. ఈ కానుకలో స్కూల్ యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, బూట్లు, పుస్తకాలు, నోట్ బుక్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ విద్యార్థులకు ఉచితం. ఉన్నత విద్యను చదివే పిల్లలకోసం ‘జగనన్న వసతి దీవెన’, ‘జగనన్న విద్యా దీవెన’ పథకాలను అందరికీ వర్తించేలా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం ఆరు లక్షల మంది చేరారు. ఆగస్టులో ప్రారంభం కానున్న అడ్మిషన్లతో ఈ సంవత్సరం మరింత ఎక్కువమంది చేరే అవకాశాలున్నాయి. తల్లిదండ్రులకెటువంటి భారం లేకుండా పిల్లలందర్నీ బడికి చేర్చడం ఒక భాగం. ఈ కర్తవ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రెండవ భాగం వారికి నాణ్యమైన విద్యను అందజేయడం. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో వారు ఉన్నత ప్రమాణాలతో నిలబడేలా చేయడం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు మేధోమథనం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానాన్ని కవచంగా వాడుకుంటూ మరింత మెరుగైన శాస్త్రీయమైన విద్యావిధానాన్ని ముందుకు తెచ్చింది. ఈ కొత్త ప్రతిపాదనల వెనుక ఒక తాత్విక భూమిక ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల అత్యు న్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను కులమత వర్గ ప్రాంతాలకతీతంగా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచ డమే దాని ఫిలాసఫీ. అసర్, ఎన్ఏఎస్ వంటి పరిశోధనల్ని అధ్యయనం చేసి, వాటి సారాంశాన్ని కూడా క్రోడీకరించి పునాది విద్యను (ఫౌండేషన్ కోర్సు) పటిష్ఠం చేయాలన్న నిర్ణయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నది. ఎలిమెంటరీ స్థాయి పిల్లల్లో చతుర్విధ ప్రక్రియల (కూడిక, తీసివేత, గుణకారం, భాగ హారం) ప్రావీణ్యం ఉంటేనే పునాది బలంగా ఉన్నట్టు లెక్క. మన పిల్లల్లో అవి లోపించాయని, అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫౌండేషన్ కోర్సుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీ కరించినట్టు కనిపిస్తున్నది. కొత్త విధానంలో ఆరు రకాల స్కూల్స్ను ప్రతిపాదిస్తున్నారు. అంగన్వాడీలను మిళితం చేస్తూ ఫౌండేషన్ కోర్సును ప్రతిపాదించడం గొప్ప నిర్ణయం. మూడు నుంచి ఆరేళ్ల మధ్యవయసు పిల్లల్లో అప్పుడే మేధోవికాసం మొద లవుతుందనీ, ఆ దశలో పడే పునాది బలంగా ఉంటుందనే శాస్త్రీయ అధ్యయనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసు కొని ఉండవచ్చు. ఆగస్టు 16వ తేదీన కొత్త పాలసీని వివరంగా ప్రభుత్వం ప్రకటించబోతున్నది. అదేరోజున పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ముస్తాబైన మూడో వంతు స్కూళ్లను ఆరోజే ప్రజలకు అంకితం చేస్తారు. మరో మూడో వంతు స్కూళ్ల రూపు మార్చే కార్యక్రమాన్ని అప్పుడే ప్రారంభిస్తారు. విద్యార్థు లకు విద్యా కానుకల కిట్లను కూడా అందజేస్తారు. భారతదేశ విద్యారంగ చరిత్రలో ఆగస్టు 16 ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రిజర్వు చేసుకోబోతున్నది. సార్వజనీనమైన, మానవీయమైన, శాస్త్రీయమైన ప్రాథమిక విద్యకు శంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అభ్యుదయవాదులు, మేధావులు, ప్రజ లను ప్రేమించేవాళ్లందరూ సంఘటితమై ఈ యజ్ఞానికి అండగా నిలబడాలి. రాజకీయ మారీచుల కుట్రలను భగ్నం చేయాలి. ఆ రోజున బడిగంటలు మోగేవేళకు... గుడిగంటలు కూడా మోగించి ఆశీర్వదించండి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దీపనిర్వాణ గంధం
‘‘పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్ర వాక్యమును వినలేరు’’ అని పెద్దలు చెబుతారు. ఒక వ్యక్తి కాల ధర్మం చెందడానికి కొంతకాలం ముందునుంచే చూపు మంద గిస్తుంది కనుక అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు. వినికిడి శక్తిని కోల్పోతారు కనుక మిత్ర వాక్యమును వినలేడు. నాసికా పటిమ కూడా తగ్గుతుంది కాబట్టి దీపం ఆరిపోయేటప్పటి వాసనను పసిగట్టలేడు. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో ఈ పరిణా మాలకు లోనుకావడం సహజం. కానీ ఆ వయసు రాకముందే ఉద్దేశపూర్వకంగా నిజానిజాలను కనడానికి, హితోక్తులను విన డానికి నిరాకరించే వారికి సైతం పోగాలము దాపురిస్తుందని కూడా అర్థం తీసుకోవాలి. ఈ హితవచనం వ్యక్తులకే కాదు వ్యవస్థలక్కూడా వర్తిస్తుంది. చిన్నయసూరి ‘పంచతంత్రం’లోని పైవాక్య సారాంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిద్ర పట్టనీయడం లేదు. వారి నాసికలకు దీప నిర్వాణ గంధం సోకుతున్నది. పార్టీ ఎక్కువకాలం బతికే అవకాశం లేదన్న అభిప్రాయం కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల స్థాయి వరకు బలపడుతున్నది. ఆమధ్య తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సందర్భంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో వైరల్ అయింది. ‘పార్టీ లేదు... బొక్కా లేద’ంటూ నిస్పృహతో ఆయన మాట్లాడారు. ఇప్పుడయితే ఆ పార్టీలో అడుగుకో అచ్చెన్న. ఈమధ్యనే ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి గారి పార్టీయే గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఓ గుంటూరు నాయకుడు తన సన్నిహితులతో ఈమధ్య తన ఆవేదన పంచుకున్నారట. ‘ఈ పార్టీ పని అయిపోయినట్టే. కరోనా కాలం ముగిసేంతవరకు విశ్రాంతి తీసుకుందాం. ఆ తరువాత ఎంట్రీ దొరికితే వైసీపీ, లేకపోతే బీజేపీ. ఇదే మన తక్షణ కర్తవ్యమ’న్నట్టుగా చెప్పుకొచ్చారట. తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ నాయకురాలు శోభా హైమవతి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తెలుగు మహిళ ఉమ్మడి రాష్ట్రం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ బాటలో ఇంకా చాలామందే ఉన్నారు గానీ ఫిరాయింపులకు వైసీపీ గేట్లు తెరవకపోవడం వల్లనే ఆగిపోయారనే అభిప్రాయం వుంది. ఈమధ్య కృష్ణా నదీ జలాల వినియోగంపై తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పొరుగు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య వివాదాలుండేవి. ఇప్పుడు కృష్ణానదే సరిహద్దుగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో ‘తలాపునే పారుతోంది గోదావరి’ అని పాడే వారు... అయినా ఆ నీళ్లు తమ గొంతు తడపడం లేదనే అర్థంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణ అంతటా గలగలా పారుతున్నాయి. కృష్ణా బేసిన్ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. చీలిక తర్వాత కొత్త రాష్ట్రంలోని అత్యధిక భౌగోళిక ప్రాంతానికి ‘తలాపునే పారుతోంది కృష్ణానది’. ఆ నీళ్లు తమ గొంతు తడపాలనీ, పెన్నా బేసిన్ను సైతం చీల్చుకుంటూ వెళ్లి బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలనే సెంటిమెంట్ రేకెత్తడం సహజం. హేతుబద్ధమైన పరిష్కారంతో రెండు రాష్ట్రాల వివాదాలకు చెక్ పెట్టడం అసాధ్యమేమీ కాదు. ఇక్కడ ఆలోచించవలసినది తెలుగుదేశం పార్టీకి దాపురించిన పోగాలం గురించే. నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఒక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఒక్క తాటిపైకి రావడాన్ని మనం ఇంతకాలంగా చూస్తూ వచ్చాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని తామూ వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు శాసనసభ్యులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల సన్నిహితులు, పార్టీ నాయకులూ వారిని నిలదీశారట. ‘మాకే పాపం తెలియదు, రాయించి పంపిన లేఖపై మాచేత బల వంతంగా సంతకాలు పెట్టించా’రని ఎమ్మెల్యేలు వాపోయారట. ఆత్మహత్యా సదృశ్యమైన ఈ ‘బ్రిలియంట్ ఐడియా’ ఎవరిదని ఆరా తీసినప్పుడు వినిపించిన పేరు చినబాబు. ఇప్పుడా చినబాబే తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారి కూర్చున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయక శ్రేణుల్లో దాదాపుగా అందరూ లోకేశ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రెండు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించడమే గాక, అపరిమితమైన అధికారాన్ని చలాయించి, అధికార యంత్రాంగాన్ని కనుసైగలతో శాసించి, రాజధాని ప్రాంతంలో ఏరికోరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని కూడా ఓటమిపాలు కావడాన్ని నాయకులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇంతటి అసమర్థ నాయకుడిని నెత్తిన పెట్టుకొని వైసీపీతో ఎట్లా పోరాడగలమని వారు సరాసరి అధినేతనే ప్రశ్నిస్తున్నారట. అధినేత మాత్రం తన వారసుడికే పార్టీ పగ్గాలను సైతం అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఆయన కలలు ఫలించి మొన్నటి ఎన్నికల్లో గెలిచి వుంటే ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్బాబు చేతిలో పెట్టి ఉండేవారట. ఓటమి వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కామన్న భావన సీనియర్ నేతల మాటల్లో ధ్వనిస్తున్నది. సీనియర్లకు బాబు మనసు తెలుసు గనుకనే ఇటీవల జరుగుతున్న సభల్లో కొంతమంది చేత జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. లోకేశ్ నాయకత్వంపై తమ నిరసనను కొందరు నేతలు ఆరకంగా వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఈ పరిణామాలన్నీ ముదరక ముందే లోకేశ్కు మరింత క్రియాశీలక పాత్రను అప్పగించాలని బాబుపై ఒత్తిడి పెరుగుతున్నది. చంద్రబాబు తెరచాటుకే పరిమితమై లోకేశ్ను తెరముందు నిలబెట్టాలని ఆయన తరఫు లాబీయిస్టుల ప్రతి పాదన. ఇటువంటి ఆలోచనల్ని సీనియర్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వారిని సంతృప్తిపరచడానికి కీలక నిర్ణయాలన్నీ ఇకమీదట తానే తీసుకుంటానని బాబు వారికి మాటిచ్చారట. దాదాపు ఇదే సమయంలో లోకేశ్బాబు తన సతీమణితో కలిసి వేరే ఇంట్లోకి మారిపోయారట. జూబ్లీహిల్స్లోని తమ పాత నివాసగృహం స్థానంలో కొత్తది మరింత విస్తరించి, చినబాబు అభిరుచి మేరకు ఐదారేళ్ల కిందనే విలాసవంతంగా నిర్మించారు. తల్లిదండ్రులతో కలిసి లోకేశ్ దంపతులు అక్కడే ఉండేవారు. ఇప్పుడాయన కొండాపూర్లో ఆరేడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్హౌస్లోకి మారిపోయారట. ఐటీ హబ్కు కేంద్రస్థానంగా ఉన్న కొండాపూర్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ స్థలాన్ని లోకేశ్కు ఆయన నాయనమ్మ కీర్తిశేషులు అమ్మణ్ణమ్మ గారు బహూకరించారట. తన రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆర్జించిన ఆదాయంతోనే అమ్మణ్ణమ్మ గారు మనవడికి ఇంత పెద్ద బహుమతిని ఇవ్వడం విశేషమే. ఇప్పుడు లోకేశ్ దంపతులు అక్కడే ఉంటున్నారని టీడీపీ శ్రేణుల ద్వారా తెలుస్తున్న సమాచారం. కొడుకూ - కోడలూ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలనీ, వేరే కాపురం పెట్టగూడదనీ రూలేమీ లేదు. అది తప్పుపట్ట వలసిన విషయం కూడా కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఇది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ల మాటకు చంద్రబాబు కొంత మేరకైనా చెవి ఒగ్గడం చినబాబుకు నచ్చలేదని ప్రచారం జరుగు తున్నది. కొత్త ఇంట్లో కొంతకాలంపాటు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించినట్టు కనిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బర్త్డే సందర్భంగా ట్విట్టర్ వేదికపై లోకేశ్ ఆమెను అభినందించారు. ‘‘నిరంతరం ప్రజాసమస్యలపై గొంతెత్తుతూ, ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సాయం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఇంకా మరికొన్ని ప్రశంసలను ఆయన కురిపించారు. ఎవరికైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే గతంలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇన్ని ప్రశంసలతో కూడిన ట్వీట్ను లోకేశ్ చేశారా లేదా అన్నదే సందేహం. నాయకత్వ సమస్యతోపాటు మనుగడ సమస్య కూడా తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నది. ఇప్పుడు ఆ పార్టీ రంగు, రుచి, వాసన కోల్పోయింది. అంటే పార్టీని మృత్యుకళ ఆవహించింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలేమిటి? లక్ష్యాలే మిటి? ఐడియాలజీ ఏమిటి? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సహస్రాబ్ది ఆరంభం నుంచీ సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యత పెరిగింది. దేశంలో, రాష్ట్రాల్లో అధికారం లోకి వచ్చిన ప్రతి పార్టీ తరతమ భేదాలతో సంక్షేమ కార్య క్రమాలను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఐడియాలజీ అనేది కొంత సంక్లిష్టంగా మారినప్ప టికీ, ఆయా పార్టీల దీర్ఘకాలిక వ్యూహాలు, లక్ష్యాలను బట్టి, వివిధ అంశాలపై వాటి విధానాలను బట్టి ఆయా పార్టీల సైద్ధాంతికతను అంచనా వేయవచ్చు. కాంగ్రెస్ పార్టీది పద మూడు దశాబ్దాల చరిత్ర. చారిత్రక సందర్భాలను బట్టి దాని లక్ష్యాలు మారుతూ వచ్చాయి. లాహోర్ కాంగ్రెస్లో ‘పూర్ణ స్వరాజ్’, ఆవడి సభలో సోషలిస్టు తరహా సమాజం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు... ఇలా ఎన్ని మార్పులకు లోనైనా ఆ పార్టీ ప్రవాహంలో అంతర్వాహినిగా దాని లౌకిక స్వభావం కొనసాగుతూనే వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెరిచిన పుస్తకం. హిందూ సమాజ ఔన్నత్యమే లక్ష్యమైన పునా దులపై నిర్మితమైన కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ అది. సోషలిస్టు సమాజ స్థాపనే కమ్యూనిస్టు పార్టీల ఆశయం. ద్రవిడ సంస్కృతీ సమాజ ఔన్నత్యాలే డీఎంకేల సిద్ధాంతం. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్కు సమగ్రాభివృద్ధితో కూడిన బంగారు తెలంగాణ లక్ష్యం. అన్నివర్గాల సంక్షేమం, బలహీనవర్గాలు - మహిళల సాధికారత, హ్యూమన్ డెవలప్మెంట్ అనే అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ కనిపిస్తున్నది. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏమని చెప్పాలి? ఏమీ చెప్పలేని స్థితికి చంద్ర బాబు నాయకత్వంలో ఆ పార్టీ దిగజారింది. ఒక రాజకీయ పార్టీ స్వభావాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు దాని జెండా తెలుగుజాతి ఆత్మగౌరవం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎజెండా జన సంక్షేమం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధానం తలకిందులైంది. అదే సమయంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బలపడుతున్న కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, క్రోనీ క్యాపిటలిజానికి విత్తనాలు చల్లుతూ ఆయన కాలం గడిపారు. సంక్షేమం అటకెక్కింది. రాజకీయాల్లోకి ధన ప్రభావాన్ని జొప్పించి, నీతిమంతులను దూరం పెట్టారు. ఒకరకమైన దళారీ రాజకీయ వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మరింత సంకుచితంగా ఆయన మారిపోయారు. తానూ, తన కుటుంబం, తాను పోషించిన బినామీ కోటరి ప్రయోజనాలే పరమావధిగా ఐదేళ్లూ పాలించారు. ‘కోటరీకి కరెన్సీ - ప్రజలకు గ్రాఫిక్స్’గా గడిచాయా రోజులు. ఇందులో ఆశయాలనూ, సిద్ధాంతాలను ఎక్కడ వెదకాలి! మేనిఫెస్టోను అమలుచేయలేదు కనుక దానిని విశ్లేషించలేము. చివరి రోజుల్లో ఓట్ల కొను గోలుకు అధికారికంగా డబ్బులు పంచారు కనుక సంక్షేమంగా చెప్పలేము. అందుకే ఆ పార్టీ రంగూ, రుచీ, వాసన కోల్పోయింది. రాజకీయ పార్టీ లక్షణాలు మరుగునపడి ఒక సమూహంగా మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడది దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించే స్థితిలో లేదు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేకపోతున్నది. మిత్ర వాక్యమును వినలేకున్నది. మన పూర్వీకులు చెప్పినట్టు పోగాలము దాపురించిన లక్షణాలు గోచరించుచున్నవి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇదో ‘అనుభూతి’ బాణం!
మంత్రివర్గాల్లో మార్పులు, చేర్పులు సాధారణం. మొన్నటి కేంద్ర మంత్రివర్గ మార్పుచేర్పులు మాత్రం అసాధారణం. గడిచిన డెబ్బయ్యేళ్ల చరిత్రలో ఇంతటి భారీస్థాయి పునర్వ్య వస్థీకరణ దేశంలో ఎప్పుడూ జరగలేదు. పన్నెండుమందిని తొల గించి 36 మందిని కొత్తగా తీసుకున్నారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి 78కి చేరింది. యూపీఏ-2ను జంబో కేబినెట్గా బీజేపీ వాళ్లు ఆనాడు వెక్కిరించారు. ఇప్పుడు వారి మంత్రి మండలిలో అంతకంటే ఒక నెంబర్ పెరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ‘పరిమిత ప్రభుత్వం-విస్తృత పరిపాలన’ తమ లక్ష్యమని చెప్పే వారు. అందుకు తగినట్టుగానే 2014లో తొలి కేబినెట్ కూర్పును తనతో సహా 46 మందితోనే సరిపెట్టారు. నిబంధనల ప్రకారం మంత్రిమండలి సంఖ్య 81 దాకా ఉండవచ్చు. కనుక ఇప్పటి ఈ జంబో కేబినెట్ను తప్పుపట్టవలసిన అవసరం ఏమీలేదు. కానీ ‘పరిమిత ప్రభుత్వం’ అనే సంకల్పం పరిధులు ఎందుకు విస్తరించవలసి వచ్చిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లేదా దాని నాయకత్వంలోని కూటమి మరోసారి గెలిచి ఢిల్లీ గద్దెనెక్కితే ఆ పార్టీ సుదీర్ఘ పరిపాలనా ప్రస్థానానికి వీలు చిక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నామమాత్రావశిష్టంగా తయారైంది. మరో ఓటమిని నిభాయించుకోలేదు. పూర్తిగా శిథిలమైపోతుంది. ఆ శిథిలాల మీద మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి సమయం పడుతుంది. ఈలోపల గట్టిగా కుదురుకుంటే, ఏక బిగిన ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రికార్డును తిరగ రాయవచ్చన్న ఆశ బీజేపీ నాయకత్వాన్ని సలుపుతున్నది. ఇంకోసారి గెలిస్తే నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ విజయాలనందించిన నాయకుడిగా మోదీ మెడలో ఓ వీరతాడు పడుతుంది. ఇందిరమ్మ నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మూడు విజయాలనందించారు. కానీ వరుసగా కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఒక అపురూప సన్నివేశపు అంచున నిలబడి ఉన్నారని భావించాలి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారా? కాషాయ యుగపు పాంచజన్యం పూరిస్తారా? ఈ లక్ష్యసాధనకు గల అవకాశా లేమిటి? అడ్డంకులేమిటి? అనే విషయాలపై మేధోమథనం జరి గిన తర్వాతనే జంబో కేబినెట్ రంగప్రవేశం చేసిందనే అభి ప్రాయం కలుగుతున్నది. రాజకీయంగా చూస్తే ఇప్పటికీ మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. రెండేళ్ల కిందటితో పోలిస్తే రేటింగ్ కొంత తగ్గినప్పటికీ మోదీయే అగ్ర స్థానంలో కొనసాగుతున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆయ నకు దరిదాపుల్లో కూడా మరో నాయకుడు లేడు. అయితే పరిపాలనాపరంగా ఆయన ప్రభుత్వానికి పడుతున్న మార్కు లెన్ని?. ప్రజల ఆర్థిక - ఆయురారోగ్య పరిస్థితులెట్లా వున్నాయి? రక్షణ-విదేశాంగ విధానాలు దేశ ప్రతిష్ట ఇనుమడించేవిధంగా ఉన్నాయా? ఉద్యోగ ఉపాధి రంగాలు యువతరంగాలతో జత గూడుతున్నాయా? వ్యవసాయం, పరిశ్రమలూ లాభదాయకం గానే ఉన్నాయా? ... ఇత్యాది అంశాలపై అలుముకునే ప్రజాభి ప్రాయమే మోదీ పాలనపై రేపటి తీర్పునకు కీలకం. ప్రజాభిప్రాయం ఎట్లా ఏర్పడుతుంది? ఒకటి ప్రత్యక్ష అనుభవం, రెండోది పరోక్షంగా కలిగే అనుభూతి. కరోనా పీక్ టైమ్లో ఇంటిల్లిపాదికీ సోకిందనుకోండి. ఒకరికో ఇద్దరికో సీరి యస్ అయింది. ఆస్పత్రిలో బెడ్ ఆలస్యంగా దొరికింది. ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు. ఒకరు చనిపోయారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆ కుటుంబ సభ్యులు అనుభవపూర్వకంగా చెబు తారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సరిగ్గా పనిచేయ లేదు. ఇటువంటి అలక్ష్యాన్ని మోదీ అస్సలు సహించరు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ను పీకిపారేశారు. ఇది అనుభూతి. అనుభవం వ్యక్తిగతం. ఇది కూడిక లెక్కలతో పెరుగుతుంది. అనుభూతి సామూహికం. ఇది హెచ్చవేతలతో పెరుగుతుంది. కనుక చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాల (experiences ) కంటే సామూహిక అనుభూతి (perception)ది పైచేయి అవు తుంది. ‘హర్ దర్ద్కో ఏకీ దవా (సర్వరోగనివారిణి) జిందా తిలి స్మాత్’ అనే మాటను పూర్వకాలం నుంచీ వింటున్నాము. ఆ మందును ఎప్పుడూ వాడకపోయినా, ఆ నినాదాన్నయితే నమ్ముతాము. అదీ అనుభూతి. మోదీ సర్కార్ పాలనలో ప్రజల వ్యక్తిగత దైనందిన జీవితానుభవాలు ఎట్లా ఉన్నా... సామూహి కంగా ఒక పాజిటివ్ అనుభూతిని ఉత్పత్తి చేయడం సంఘ్ పరివార్ మేథోవర్గం ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ కార్యక్రమంలో తొలిదశ మొన్న జంబో కేబినెట్ ఏర్పాటుతో పూర్తవుతుంది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్, డాక్టర్ హర్ష వర్ధన్, సదానందగౌడ వంటి సీనియర్లు ఉండటం కొంత ఆశ్చ ర్యాన్ని కలిగించింది. కీలక శాఖల్లోని వైఫల్యాలకు కొందరు వ్యక్తులను బాధ్యులుగా చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంగా ఈ చర్య ఉన్నదనే అభిప్రాయం విన బడుతున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన వారిలో రాజ్నాథ్, నఖ్వీ ఇద్దరే మిగిలారు. ఇది వాజ్పేయి నీడ కూడా లేని అచ్చమైన మోదీ కేబినెట్. వైఫల్యాలను కడిగేసుకోవడంతోపాటు సామాజిక మార్పు సంకేతాలను కూడా ఈ పునర్వ్యవస్థీకరణ బలంగా ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలిరోజుల్లో ‘జనసంఘ్’గా ఉన్న ప్పుడు దానిపై బ్రాహ్మణ్-బనియా (వైశ్య) ముద్ర ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీలో విలీనం కావడం, అందులో చేరిన నానాజాతి సభ్యుల్లోని తటస్థ వర్గాలను తన గూటికి ఆకర్షించి బీజేపీ పేరుతో పునరుత్థానమవడం వెనుక వాజ్పేయి, అడ్వాణీల వ్యూహరచనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ వ్యూహం ఆరెస్సెస్ ఆలోచన కూడా కావచ్చు. అనంతర కాలంలో రామ మందిర ఉద్యమం ద్వారా ఉత్తరాదిలోని వెనుకబడిన వర్గాలనూ, గిరిజనులను పెద్దఎత్తున బీజేపీ సమీకరించుకోగలిగింది. పార్టీ సామాజిక పొందికను విస్తృతం చేసే పనిని మోదీ మరింత వేగవంతం చేశారు. ప్రధానితో సహా 78 మంది సభ్యులున్న మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంఖ్య 52. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఎక్కువమంది బలహీనవర్గాల ప్రతినిధులున్న కేంద్ర మంత్రి వర్గం ఇదే కావచ్చు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయా వర్గాల పాజిటివ్ అనుభూతిని మోదీ ప్రభుత్వం ఆశిస్తున్నదని చెప్ప వచ్చు. కేంద్ర మంత్రిమండళ్లలో సహాయ మంత్రుల పాత్ర నామమాత్రం. అధికారాన్ని చలాయించే కేబినెట్ మంత్రులు ఇప్పుడు ప్రధానితో కలిపి 31 మంది ఉన్నారు. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కలిపితే 11 మంది. ఇరవైమంది హిందూ అగ్రవర్ణాల వారు. వారిలో ఆరుగురు బ్రాహ్మణులు. ఐదుగురు రాజ్పుత్లు. ఇద్దరు బనియాలు, ఇద్దరు పాటీదార్లు (పటేల్), ఒకరు రెడ్డి. ఒకరు భూమిహార్, ఒకరు మల్హోత్రా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కేబినెట్ కూర్పును ఖరారు చేసినట్టు స్పష్టంగా కనిపి స్తున్నది. ఉత్తరప్రదేశ్, గుజరాత్లకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎక్కువ లోక్సభ సీట్లున్న యూపీ నుంచి ఏడుగురిని కొత్తగా తీసుకున్నారు. వీరిలో ఎక్కు వమంది యాదవేతర బీసీలు. ఇక్కడ బీజేపీకి ప్రధాన పోటీ దారు అఖిలేశ్ సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాది పార్టీ. ఈ పార్టీ నుంచి నాన్-యాదవ్ బీసీలను దూరం చేయడం ద్వారా యాదవ-ముస్లిం వర్గాలకే సమాజ్వాది పార్టీని పరి మితం చేసే లక్ష్యం ఈ వ్యూహంలో కనిపిస్తున్నది. యాదవుల తర్వాత ప్రధాన బీసీ కులమైన కుర్మీ వర్గానికి చెందిన అనుప్రియా పటేల్ (అప్నాదళ్)కు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవీయోగం పట్టింది. ఉత్తరాఖండ్పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఐదు ఎంపీ సీట్లున్న చిన్న రాష్ట్రం అది. ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి బీజేపీ గెలవడం ఆనవాయితీ. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గుజరాత్ గెలుపు పట్ల బీజేపీలో పెద్దగా అనుమానాల్లేవు. ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకునే జనం ఓట్లేస్తారని ఆ పార్టీ విశ్వాసం. అయినా ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్రంలో బలీయమైన సామాజిక వర్గంగా ఉన్న పాటీదార్ల (పటేళ్లు)కు రెండు కేబినెట్ బెర్తులు కేటాయించారు. పంజాబ్ను అంతగా పట్టించుకోలేదు. రైతుల ఆందోళన తర్వాత పంజాబ్ మీద బీజేపీ పూర్తిగా ఆశలు వదులుకున్నది. పంజాబ్ నుంచి ఒక్క జాట్ సిక్కుకూ స్థానం దొరకని మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి ఇదే. ఈ రాష్ట్రానికి చెందిన హర్దీప్సింగ్ పూరీ అనే ఖత్రీ కులానికి చెందిన సిక్కు కేబినెట్లో ఉన్నారు. రాష్ట్రంలో జాట్ సిక్కుల జనాభా 30 శాతం దాకా ఉంటుంది. దళితుల జనాభా మరో 30 శాతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కూ, లెఫ్ట్, బీఎస్పీలతో కూడిన అకాలీదళ్ కూటమికీ మధ్యనే ప్రధానంగా పోటీ జరగబోతున్నది. పటియాలా రాజవంశస్థు డైన కెప్టెన్ అమరీందర్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయం ఉన్నది. యువకులు, విద్యావంతుల అనుభూతిని కూడా ప్రభా వితం చేసే అంశాలకు కేబినెట్ పొందికలో వీలు కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58కి తగ్గింది. రాజకీయ రంగంలో ఇది యూత్ కిందే లెక్క. అట్లాగే మాజీ ఐఏఎస్ అధికారులకు, టెక్నోక్రాట్లకు, డాక్టర్లకు, లాయర్లకు అవకాశం లభించింది. అశ్వినీ కుమార్ వైష్ణవ్ మాజీ ఐఏఎస్ అధికారి. ఆయనకిప్పుడు కేబినెట్ హోదా వచ్చింది. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ చేశారు. కాన్పూర్ ఐఐటీలో ఎమ్టెక్ చేశారు. అక్కడ ఆయన స్పెషలైజేషన్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్ షిప్ మీద. ఆయనకిప్పుడు రైల్వే శాఖ లభించడం వెనుక లక్ష్యం సుస్పష్టమే. భారతీయ రైల్వేలు ఇక పీపీపీ పట్టాలెక్కబోతు న్నాయి. మరో ఐఏఎస్ అధికారి రాజ్కుమార్సింగ్కు ప్రమోషన్ లభించి కేబినెట్ మంత్రయ్యారు. బీజేపీ ప్రజా పునాదులను విస్తృతం చేసిన అడ్వాణీ రథయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్ కుమార్సింగ్ బిహార్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న లాలూయాదవ్ జిల్లా కలెక్టర్కూ, ఎస్పీకి చెప్ప కుండా రాజ్కుమార్కు అదనపు మేజిస్ట్రేట్ హోదా కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలిచ్చి ఈయన ద్వారానే అడ్వాణీని అరెస్ట్ చేయిం చారని చెబుతారు. అడ్వాణీని అరెస్ట్ చేసిన అధికారి అదే బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి కావడం విధివిలాసమేమో! కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఎమ్టెక్ పట్టా పొందారు. ఆయనకిప్పుడు ఐటీ సహాయమంత్రి పదవి లభించింది. బీపీఎల్ టెలికామ్ కంపెనీని ఈయనే స్థాపించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాన్ని ఈయన పర్యవేక్షించనున్నారు. మంత్రిమండలిలో మహి ళల సంఖ్య కూడా 11కు పెరిగింది. అందుబాటులో ఉన్న వివ రాల మేరకు ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. మంత్రిమండలి కూర్పులోని సానుకూలాంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధిపొందాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పైపూతల వల్ల లోతైన గాయాలు (ఉంటే) ఏమేరకు మాను తాయో చూడాలి. కీలక మంత్రులను తప్పించినంత మాత్రాన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలగడం సాధ్యమేనా? ఈ అంశం మీద ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎమ్మెల్యే, యువ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘‘ఖరాబీ ఇంజిన్ మే హై, ఔర్ బద్లే డిబ్బే జారహే హై’’. సమస్య ఇంజన్లో ఉంటే డబ్బాలను మారుస్తున్నారట. ఈ రైలు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటే మాత్రం జిగ్నేష్ చేసిన కామెంట్ తప్పవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఒక స్వప్నం... ముగ్గురు మొనగాళ్లు
‘‘ఈ శిశిరం వాకిట ఒంటరిగా నిలబడి ఎన్నెన్నో మనోహర దృశ్యాలను చూస్తున్నాను. ఈ శిశిరంలో ఒంటరిగానే ఎన్నెన్నో వసంత స్వప్నాలను కంటున్నాను’’. చైనాలో విప్లవానికి నాయ కత్వం వహించి కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మావో జెడాంగ్ గొప్ప తాత్వికుడు, వ్యూహకర్త, నాయకుడు మాత్రమే కాదు.. గొప్ప కవి, రచయిత, స్వాప్నికుడు కూడా! చదువు పూర్తయిన తర్వాత పెకింగ్ (బీజింగ్) విశ్వవిద్యాల యంలో కొంతకాలం లైబ్రరీ అసిస్టెంట్గా మావో పనిచేస్తాడు. అక్కడ తన బాస్గా ఉన్న జెన్డుషీ ప్రభావంతో కమ్యూనిస్టుగా మారతాడు. అక్కడి నుంచి తిరిగి తన సొంత రాష్ట్రం హునాన్కు వచ్చినప్పుడు సియాంగ్ నదిలోని ఆరెంజ్ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ కదలాడిన మనోభావాలతో రాసిన కవిత ఇది. ఇందులో ఆయన కల మెదులుతుంది. ఆ కలలో ఆకాశం కింద స్వేచ్ఛ కోసం పరితపించే లక్షలాది జీవులు కనబడతాయి. కవితలోని భావాలకు రెక్కలు తొడిగి మావో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి ఇప్పుడు వందేళ్ల వయసు. మొన్ననే ఘనంగా శతవార్షికోత్సవం జరిగింది. చైనా కమ్యూ నిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు, మిలటరీ కమిషన్ చైర్మన్గా ఉన్న షీ జిన్పింగ్ ఏం మాట్లాడుతాడోనని ప్రపంచం ఎదురు చూసింది. ఎందుకంటే, చైనా ఇప్పుడు అల్లాటప్పా దేశం కాదు. అగ్రరాజ్య హోదా కోసం అమెరికాను సవాల్ చేసే స్థితికి ఎదిగిన దేశం. అనేక అభివృద్ధిరంగాల్లో అది ఇప్పటికే అమెరి కాను దాటేసింది. కమ్యూనిస్టు చైనాకు నాయకత్వం వహించిన ఐదు తరాల నాయకశ్రేణుల్లో మావో, డెంగ్ల తర్వాత అంతటి అధికారాన్ని చలాయిస్తున్న మూడో వ్యక్తి షీ. అందువల్ల ఆయన చెప్పే మాటలకు ప్రపంచ ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా పదేళ్ల కిందట చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ప్రధాన కార్యదర్శి పదవిని షీ జిన్పింగ్ చేపట్టాడు. చైనా స్వప్నాన్ని (చైనా డ్రీమ్) సాకారం చేయడమే తన లక్ష్యమని బాధ్యతలు స్వీకరించగానే షీ ప్రకటించాడు. చైనా జాతీయ పునరుజ్జీవనమే చైనా స్వప్నంగా ఆయన ప్రకటించుకున్నారు. అందులో భాగంగా రెండు ‘శతాబ్ది’ లక్ష్యా లను పెట్టుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు నిండే నాటికి (2021) చైనా సమాజం అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించామని మొన్నటి శతవార్షిక సభలో షీ ప్రకటించాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి శతాబ్ది కాలం నిండే నాటికి (2049) చైనాను అగ్రరాజ్యంగా, ఆధునిక సోషలిస్టు దేశంగా రూపుదిద్దడం రెండవ లక్ష్యం. ఈ దిశగా తమ ప్రయాణం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. చైనా డ్రీమ్ అనే నినాదాన్ని షీ జిన్పింగ్ బాగా ప్రచారం లోకి తెచ్చారు. కానీ ఈ డ్రీమ్కు నూటా యాభయ్యేళ్ల చరిత్ర ఉన్నది. చైనాకు రమారమి నాలుగు వేల సంవత్సరాల చారిత్రక వార సత్వ సంపద ఉన్నది. ఈ విశ్వం మొత్తానికి చైనా కేంద్రస్థానంలో ఉన్నదని పూర్వపు రోజుల్లో చైనా ప్రజలు గట్టిగా నమ్మేవారు. మిగిలిన రాజ్యాలన్నీ ఉపగ్రహాల వంటివని అభిప్రాయపడే వారు. రోమన్ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి రెండువేల ఏళ్లకు పూర్వమే చైనాలో చిన్ వంశస్తులు మొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యూరప్లో పారిశ్రామిక విప్లవం ప్రభవించి వలస రాజ్యాలు ఏర్పడేంతవరకు ప్రపంచంలో సంపన్న దేశంగా చైనా కొనసాగింది. చరిత్ర క్రమంలో వివిధ దేశాల జీడీపీని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఆంగస్ మాడిసన్ అంచనా ప్రకారం 16–17 శతాబ్దాల నడుమ ప్రపంచ దేశాల ఉమ్మడి జీడీపీలో 33 శాతం వాటా ఒక్క చైనాదే. వేలయేళ్ల కిందటనే అంతర్జాతీయ వర్తకం కోసం గోబీ ఎడారులు, టిబెట్ పీఠభూములు, సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా యూరప్ ఖండం వరకు సిల్కు రోడ్డును చైనా వేసుకున్నదని చరిత్ర చెబుతున్నది. ఈ కారణాల రీత్యా ఆనాటి చైనా ప్రజలకుండే గర్వం నిర్హేతుకమైనది కాదని తేలుతున్నది. చైనా ప్రజల గర్వాన్ని, ఆత్మగౌరవాన్ని యూరప్ వలస పాలకులు దెబ్బతీశారు. చైనాను పరిపాలించిన చివరి రాజ వంశం పేరు చింగ్. వీరు హన్ జాతీయులు కాదు. మంచూ తెగ వారు. చైనాలో హన్ జాతీయుల జనాభా చాలా ఎక్కువ. ఇండియాలో హిందువుల జనాభా శాతం కంటే కూడా ఎక్కువ. కానీ, చింగ్ వంశీయుల పాలనలోనే చైనా సరిహద్దులు బాగా విస్తరించాయి. పందొమ్మిదో శతాబ్దపు తొలిరోజుల్లో చైనాలోని ఉన్నతాధికారులకు బ్రిటిష్ వలస పాలకులు నల్లమందును అలవాటు చేశారు. ఇది క్రమంగా జనంలోకి పాకింది. నల్ల మందు అక్రమ రవాణాను అరికట్టడానికి చింగ్ పాలకులు చర్యలు చేపట్టారు. ఆగ్రహించిన బ్రిటిష్వారు చైనాతో యుద్ధా నికి దిగారు. తర్వాత కాలంలో ఫ్రాన్స్ కూడా బ్రిటన్కు జత కలిసింది. చైనా మీద రెండుసార్లు యుద్ధాలు (ఓపియమ్ వార్స్) చేశారు. చింగ్ రాజవంశ నైతిక బలాన్ని దెబ్బతీశారు. ఎనిమిది యూరప్ దేశాలు కలిసి చైనాపై ‘బాక్సర్’ యుద్ధాలు చేశాయి. మంచూరియా ప్రాంతాన్ని జపాన్ ఆక్రమించింది. చైనాపై అవమానకరమైన షరతులు విధించారు. చైనా సమాజంలోని విద్యావంతులు, ఉన్నత వర్గాల ప్రజలు కుమిలిపోయారు. తమ దేశం పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలని కలలుగన్నారు. ‘చైనా డ్రీమ్’ అప్పుడే మొద లైంది. చైనాలో జాతీయోద్యమం ప్రారంభమైంది. మంచూ జాతీయులైన చింగ్ రాజవంశంపై తిరుగుబాటు ప్రారంభ మైంది. సన్యట్సేన్ నాయకత్వంలో కుమిటాంగ్ పార్టీ జాతీయ వాదులతో కలిసి రాజరికాన్ని కూలదోసింది. జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలోనే ఓ పదిహేడేళ్ల యువ కుడు తన పొడవాటి జుట్టును కత్తిరించి నిరసన వ్యక్తం చేశాడు. చింగ్ రాజుల ఏలుబడిలో పురుషులు కూడా జుట్టును పెంచు కోవాలి. ఈ శాసనాన్ని ఆ యువకుడు ధిక్కరించాడు. అతడి పేరు మావో జెడాంగ్. చైనాడ్రీమ్ను సాకారం చేయడానికి వేట అక్కడే మొదలైంది. మావో జెడాంగ్ ఓ రైతుబిడ్డ. పెద్ద ఆకతాయి. కుదురుగా ఉండే రకం కాదు. పదమూడేళ్లు నిండేసరికి అతికష్టంగా ఐదో క్లాసు ముగించాడు. ఇక లాభం లేదని వాళ్ల నాన్న పొలం పనిలో పెట్టాడు. అక్కడా కుదురుకోలేదు. హునాన్ ముఖ్యపట్టణమైన చాంగ్షా మిడిల్ స్కూల్లో చేర్చారు. అక్కడ ఏడాదిలో నాలుగు స్కూళ్లు మారాడు. కానీ లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. ఆ వయసులోనే ఆడమ్ స్మిత్, మాంటెస్క్యూ, డార్విన్, జాన్ స్టూవర్ట్మిల్, రూసో, స్పెన్సర్ల క్లాసిక్స్ను చది వేశాడు. ఈ లైబ్రరీ పిచ్చితో పెకింగ్ యూనివర్సిటీ లైబ్రరీలో గుమాస్తాగిరి ఉద్యోగంలో చేరాడు. అక్కడ జెన్డూషీ పరిచయం మావోను కమ్యూనిస్టుగా మార్చింది. చైనాలో పేరుకు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, దేశమంతటా అరాచకం రాజ్యమేలింది. వార్ లార్డ్ల ఆధిపత్యం కింద దేశం ముక్కచెక్కలుగా చీలిపోయింది. ఈ దశలో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో విజేతలందరూ పారిస్లోని వెర్సయిల్ రాజప్రాసాదంలో (versailles treaty) వాటాలకోసం సమావేశమయ్యారు. ఇక్కడా చైనాకు అవమా నమే ఎదురైంది. జపాన్కు పెద్దమొత్తంలో నష్టపరి హారం చెల్లిం చాలని చైనాను ఆదేశించారు. చైనా హృదయం మళ్లీ గాయ పడింది. ఈ సమయంలోనే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సొంతరాష్ట్రం హునాన్లో పార్టీ పనిని మావో ప్రారం భిస్తాడు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాల ప్రకారం పట్టణాల్లోని కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహించాలి. కానీ చైనాలో అది కుదిరేపని కాదని మావో భావించారు. పెద్దసంఖ్యలో ఉన్న రైతులను సమీకరించి తిరుగుబాటు చేయాలని భావించాడు. మావో అంతరంగంలో కమ్యూనిస్టు ఎంత బలంగా ఉన్నాడో... జాతీయవాది కూడా అంతే బలంగా ఉండేవాడు. గతించిన చైనా వైభవాన్ని గురించి కథలు కథలుగా రైతులకు చెప్పేవాడు. వారిని సమీకరించి చింకాంగ్ కొండల్లో స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. చైనా డ్రీమ్ మావోను నిరంతరం వెన్నాడుతూనే ఉండేది. ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని’ ప్రకటించాడు. ఈ వాక్యం అనంతరకాలంలో డజన్లకొద్ది దేశాల్లో చేగువెరా సహా లక్షలాదిమంది యువకుల చేత తుపాకీ పట్టిం చింది. స్త్రీల సమస్యల గురించి ఆలోచిస్తూ ఆకాశం కేసి చూసి ‘మహిళలు ఆకాశంలో సగభాగం’ అన్నాడు. ఈనాటికీ మహిళా ఉద్యమాల రణన్నినాదం ఇదే. యుద్ధ వ్యూహాలతో రాటుదేలిన మావో చైనా కమ్యూనిస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగాడు. చరిత్ర ప్రసిద్ధిచెందిన లాంగ్ మార్చ్ వ్యూహకర్త ఆయనే, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన నాయకత్వంలోనే చైనా విప్లవం విజయవంతమై 1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. రాజవంశాల పరిపాల నలో నామమాత్రపు అధికారం మాత్రమే ఉన్న టిబెట్, షింజి యాంగ్, మంగోల్ ప్రాంతాలను పూర్తిగా చైనా అధీనంలోకి తెచ్చుకున్నారు. భౌగోళిక– రాజకీయ సుస్థిరత ఏర్పడింది. చైనా డ్రీమ్లో మొదటిభాగం ముగిసింది. ఇంకా రెండు భాగాలు న్నాయి. ఒకటి: ఆర్థికాభివృద్ధిని సాధించడం; రెండు: అగ్ర రాజ్యంగా వెలుగొందడం. ఈ లక్ష్యాలను కూడా వేగంగా సాధిం చాలన్న తొందరలో మావో చేసిన తప్పులకు చైనా భారీ మూల్యం చెల్లించింది. వ్యవసాయ– పారిశ్రామిక ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచడం కోసం ప్రారంభించిన గొప్ప ముందడుగు (great leap forward) ఉద్యమం విఫలమైంది. లక్షలాదిమంది ఆకలి చావులకు బలయ్యారు. దీన్ని కప్పిపుచ్చు కోవడానికే మావో సాంస్కృతిక విప్లవం (Cultural revolution)ను ప్రారంభించారని విమర్శకుల అభిప్రాయం. మావో వైఫల్యాలను ప్రశ్నించిన వారందరూ ఈ కాలంలో శిక్షలకు గురయ్యారు. చైనా డ్రీమ్లో రెండో లక్ష్యాన్ని చేరకుం డానే మావో కన్నుమూశారు. డెంగ్ సియావో పింగ్ కూడా రైతుబిడ్డే. ఫ్రాన్స్లో చదువు కున్నాడు. అక్కడే కమ్యూనిజానికి ఆకర్షితుడయ్యాడు. మావోతో కలిసి లాంగ్ మార్చ్లో పాల్గొన్నాడు. చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున క్రియాశీల పాత్ర పోషించాడు. టిబెట్ను ‘దారికి తెచ్చే’ బాధ్యతను ఈయనే నిర్వహించాడు. కల్చరల్ రివల్యూషన్ కాలంలో మావో జెడాంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. కానీ జౌఎన్లై చలవతో మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కించు కున్నాడు. మావో మరణానంతరం పార్టీ మీద, ప్రభుత్వం మీద డెంగ్ పట్టు బిగించగలిగాడు. మావో వారసుడుగా వచ్చిన హువాగువాఫెంగ్ను డమ్మీ చేసి అధికార చక్రాన్ని డెంగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆధునీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే జంటలక్ష్యాలను పెట్టుకున్నాడు. సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారంభించాడు. చౌకగా లభించే మానవ వనరులను ఉప యోగించుకుని ప్రపంచపు వస్తూత్పత్తి కర్మాగారంగా చైనాను మార్చేశాడు. ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ పెట్టుబడు లకు తలుపులు తెరిచాడు. ఆర్థిక విధానాల్లో ఎంత సరళంగా ఉదారంగా ఉన్నాడో రాజకీయ వ్యవహారాల్లో అంత కఠినంగా ఉన్నాడు. సోవియట్ శిబిరం కుప్పకూలిన రోజుల్లోనే చైనాలో తియనాన్మెన్ స్క్వేర్ ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళన కారుల్ని డెంగ్ రక్తపుటేరుల్లో ముంచాడన్న విమర్శలున్నాయి. విమర్శలెట్లా వున్నా చైనా డ్రీమ్లోని రెండో లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని డెంగ్ జమానా నెరవేర్చింది. కీలకమైన ఏ పదవినీ చేపట్ట కుండానే డెంగ్ డీఫ్యాక్టో సార్వభౌముడిగా పరిపాలన నడిపిం చాడు. ఆయన చనిపోయిన పన్నెండేళ్ల వరకు చైనా అదే బాటలో నడిచింది. అప్పుడొచ్చాడు అసలు సిసలైన మావో వారసుడు. షీ జిన్పింగ్ పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలో! కానీ సాంస్కృతిక విప్లవకాలంలో ఈ కుటుంబం అష్టకష్టాల పాలైంది. తండ్రిని జైల్లో పెట్టారు. తల్లిని విద్రోహి భార్యగా ప్రకటించి పరేడ్ చేయించారు. సోదరులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. అయినా, కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కోసం పదిసార్లు ప్రయ త్నించి చివరకు సఫలమయ్యాడు. షీ రివల్యూ షనరీ కాదు. ఒక టెక్నోక్రాట్. కెమికల్ ఇంజనీ రింగ్ చదివాడు. పార్టీలో కిందిస్థాయి నుంచి పనిచేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. మావో కాలంలో తన కుటుంబం తీవ్ర కడగండ్ల పాలైనప్పటికీ తాను మాత్రం మావో శిష్యుడిననే షీ ప్రకటించుకున్నాడు. చైనా డ్రీమ్లో చివరి లక్ష్యసాధన కోసం అడుగులు వేస్తున్నాడు. చైనా పూర్వ రాజులు సిల్కు రోడ్డును భూమి మీద వేస్తే షీ భూమితోపాటు సముద్రం మీద కూడా వేశాడు. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో అమెరి కాకు వణుకు పుట్టిస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు నూరేళ్ల వయసు వచ్చేలోగా చైనాను అగ్రరాజ్యంగా నిలబెట్టే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ చైనా ఆ గమ్యాన్ని చేరు కుంటే భారత్ పరిస్థితి ఏమిటని మన పాలకులు, రాజకీయ వేత్తలు ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ధర్మోరక్షతి రక్షితః
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. కోటానుకోట్ల యేళ్లు గడిచినా అది నిర్దేశిత కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నది. కించిత్ గర్వమో, క్రోధమో, మోహమో ఆవహించి తన కక్ష్యను మార్చుకుంటే ఏమవుతుంది? రాశి చక్రం గతి తప్పుతుంది. దివారాత్రములు అంతర్ధానమవుతాయి. అండపిండ బ్రహ్మాండం అల్లకల్లోలమవుతుంది. మానవ పిపీలికం మటుమాయమవుతుంది. ఎన్ని యుగాలు గడిచినా, మరెన్ని మన్వంతరాలు కరిగిపోయినా అఖిలాండం మారలేదు. అంతరిక్షం మారలేదు. నక్షత్రాలు వాటి లక్ష్మణ రేఖల్ని దాటడం లేదు. గ్రహాలు వాటి ధర్మాన్ని మీరడం లేదు. భూలోకాన్ని ఆశ్ర యించిన ప్రకృతిశక్తులూ వాటి ధర్మాన్ని తప్పడం లేదు. నదులు పల్లానికే పారుతున్నాయి. గిరులు తరుల్ని మోస్తూనే ఉన్నాయి. ఎండావానా గాలీ వెన్నెల వాటి నియమం ప్రకారమే వచ్చి పోతున్నాయి. పులి శాకాహారం ముట్టలేదు. ఏనుగు మాంసా హారిగా మారితే రోజుకు ఎన్ని పీనుగులు కావాలో? మానవుని సాంఘిక జీవితాన్ని కట్టుబాట్లలో ఉంచడానికి రకరకాల రాజ్యవ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నింటిలోకి అత్యున్నతమైనది, మానవీయమైనది, తాత్విక భూమిక కలిగినది ప్రజాస్వామ్యవ్యవస్థ. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజల నుంచే అధికారం ప్రభవిస్తుంది. అందులోనూ లిఖిత రాజ్యాంగం, చెక్స్ అండ్ బ్యాలెన్స్లతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ మరింత శ్రేష్టమైనదని మేధావుల నిశ్చితాభిప్రాయం. అటువంటి సర్వశ్రేష్టతమ రాజ్యాంగ వ్యవస్థను మనకు ప్రసాదించిన అంబేడ్కర్ తదాది జాతియోధులు మనకు ప్రాతఃస్మరణీయులు. ప్రజలే రాజ్యాంగ నిర్మాతలని స్వయాన మన రాజ్యాంగమే ఘంటాపథంగా ప్రకటించింది. రాజ్యాంగ పీఠిక (preamble) మొట్టమొదటి వాక్యం ఈ దేశా ధికారం ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుని చేతిలో ఉన్నదని సందేహాతీతంగా చాటి చెప్పింది. ‘భారత ప్రజలమైన మేము, మా దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటున్నామని’ మొదటి వాక్యం ప్రకటించింది. ఎందుకు ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలు రాసు కోవలసి వచ్చిందో కూడా తర్వాతి పంక్తుల్లో పీఠిక చెప్పింది. ‘ఈ దేశంలోని పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని, అంతస్తులోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడం కోసం; వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నామని పీఠిక ప్రకటించింది. భారత రాజ్యాంగానికి ఈ పీఠిక ఆత్మ వంటిదని పలువురు న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు వివిధ సందర్భాల్లో ఉద్ఘాటించారు. చట్టసభలు చేసే శాసన నిర్మాణాలు కానీ, చేపట్టే రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (basic structure) దెబ్బ తీయకూడదని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దాని లక్ష్యాలకు నాలుగు వాక్యాల పీఠిక సూక్ష్మదర్శిని వంటిది. ఈ పీఠికలో పేర్కొన్నట్టు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని చేకూర్చడానికి, ఆలోచనా భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్య్రాన్ని సమకూర్చ డానికి, వారి వ్యక్తిత్వ గౌరవాన్ని (Dignity) ఇనుమడింప జేయ డానికి చేపట్టే ప్రతి చర్యా రాజ్యాంగ విహితమే. ఇందుకు విరు ద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ విద్రోహమవుతుంది. ఇటు చట్టసభలకూ, కార్యనిర్వాహక వర్గానికైనా, అటు న్యాయస్థానా లకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మన రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికారాలను పంపిణీ చేసింది. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభలతో (రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీ, కౌన్సిల్) కూడిన శాసన వ్యవస్థ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ (రాష్ట్రాల్లో గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అసెంబ్లీ)తో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులతో కూడిన న్యాయవ్యవస్థ కలిసి భారత రాజ్యాధికార వ్యవస్థ తయా రైంది. ఇందులో ఎవరి విధులూ, అధికారాలు వాళ్లకు న్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తున్నంతవరకూ మన ప్రజా స్వామ్యం ఆదర్శవంతంగా ఉన్నట్టు లెక్క. పరిధులు మీరి ప్రవ ర్తిస్తే మనుగడ ఉండదని ప్రకృతి సూత్రాలు మనకు బోధిస్తు న్నాయి. ఈ మూడు వ్యవస్థల్లో దేని ప్రత్యేకత దానిదే. రాజ్యాంగం తనకు తానే చెప్పుకున్నట్టు అది జనేచ్ఛ (general will))లోంచి జనించింది. ఐదేళ్లకోమారు జరిగే జనేచ్ఛ వెల్లడి ద్వారా పార్లమెంట్, శాసనసభలు ఏర్పడుతున్నాయి. కనుక రాజ్యాంగంతో చట్టసభలది రక్తసంబంధం. కార్యనిర్వాహక వర్గం చట్టసభల్లో భాగంగా ఉంటూ, వీటికి బాధ్యత వహిస్తూ అధికార చక్రాన్ని తిప్పుతుంది. కనుక రాజ్యాంగంతో దానిదీ రక్తసంబంధమే. న్యాయవ్యవస్థ మాత్రం జనేచ్ఛ ద్వారా ఏర్పడేది కాదు. కానీ, ప్రాథమిక జనేచ్ఛకు ప్రతిరూపమైన రాజ్యాం గానికి కాపలాదారుగా నిలబడినందు వలన దీనిది రక్షణ బంధం. జనేచ్ఛ అనే మాటను 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త రూసో ప్రయోగించాడు. పౌరుల స్వాతంత్య్రానికి, రాజ్యాధికారానికి మధ్యన వైరుధ్యం ఏమీ లేదని రూసో వాదన. ఎందుకంటే జనేచ్ఛలోంచి ఏర్పడేవే చట్టాలు. ఆ చట్టాలను అమ లుచేయడం స్వాతంత్య్రానికి భంగమెట్లా అవుతుందనేది రూసో ప్రశ్న. ఈ పద్దెనిమిదో శతాబ్దపు వ్యవహారం మనకు అప్రస్తుతమే అయినప్పటికీ, ఇందులో మనకో ముక్తాయింపు దొరుకుతుంది. అదేమిటంటే, మనకున్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు సూత్ర ప్రాయంగా సమానమే అయినప్పటికీ చట్టసభలకు బాధ్యత వహించే కార్యనిర్వాహక వర్గం కొంచెం ఎక్కువ సమానం. కార్యనిర్వాహక వర్గానికి ఉన్న విస్తృతాధికారాల దృష్ట్యా భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి కనుక, అలా జరగకుండా ఉండేందుకని న్యాయ వ్యవస్థకు కొన్ని అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగం నిబంధనలకు భిన్నంగా చేసే చట్టాలను కొట్టివేసే అధికారం, రాజ్యాంగానికి భాష్యం చెప్పే విశేషాధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ అధికారాలను ఉపయోగించుకొని ఎన్నో ప్రజోపయోగకర తీర్పులను ఇచ్చిన ఘనత ఈ దేశ న్యాయ వ్యవస్థకు ఉన్నది. నల్లచట్టాల నుంచి ప్రజలను రక్షించడంలో, పౌరహక్కులను నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ఎన్నదగిన పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ కాలం నుంచి రెండున్నర మూడు దశాబ్దాల పాటు ప్రజానుకూల ప్రగతిశీల దృక్పథంతో న్యాయవ్యవస్థ క్రియాశీల (Judicial activism) పాత్రను పోషించింది. ఇప్పుడు కూడా న్యాయవ్యవస్థలో క్రియాశీలత కని పిస్తూనే ఉన్నది. కాకపోతే, అందులో ప్రజానుకూలత, ప్రగతి శీలత ఏమేరకు ఉన్నాయనేదానిపై భిన్నాభిప్రాయాలు వెలువ డుతున్నాయి. జేఏజీ గ్రిఫిత్ అనే బ్రిటీష్ న్యాయశాస్త్ర కోవి దుడు 1977లో ‘పాలిటిక్స్ ఆఫ్ జ్యుడీషియరీ’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా న్యాయశాస్త్ర వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. బ్రిటన్లో న్యాయవ్యవస్థ తటస్థత అనేది ఒక బ్రహ్మపదార్థమనీ, కేవలం భ్రమ మాత్రమేనని ఆయన ఆ పుస్తకంలో నిరూపించారు. అదే కాలంలో ఇండి యాలో న్యాయవ్యవస్థను క్రియాశీలం చేసిన ఆద్యుల్లో ఒకరైన జస్టిస్ కృష్ణయ్యర్ ఇదేరకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. మనదేశ న్యాయవ్యవస్థలో అత్యధికులు ధనికవర్గ పక్షపాతులని ఆయన ఆక్షేపించారు. రాజకీయ అభిప్రాయాలను కలిగి వుండటం తప్పుకాదు కానీ, వాటిని దాచిపెట్టి తాము తట స్థులమని చెప్పుకోవడమే పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడే వారు. ఇదంతా ఈ దేశంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై రాజకీ యాలు నడిపిన కాలం సంగతి. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే న్యాయవ్యవస్థలో కూడా రాజకీయాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే వ్యవస్థ క్షీరనీర న్యాయాన్ని పాటించినంతవరకూ ప్రమాదం లేదు. వర్తమాన న్యాయవ్యవస్థ క్రియాశీలత (Judicial activism) గతంకంటే భిన్నమైనది. కార్యనిర్వాహక వ్యవస్థ పౌరహక్కుల మీద, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద దాడి చేయకుండా నిరోధించడం నాటి క్రియాశీలత లక్ష్యం. అదొక రక్షణాత్మక వైఖరి. ప్రస్తుత క్రియాశీలత కార్యనిర్వాహక వర్గం అధికార పరిధిల్లోకి ప్రవేశిస్తున్నదని పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను కూడా తామే తీసు కుంటామని ఇటీవల న్యాయవ్యవస్థ పలుమార్లు ప్రకటించడం జరిగింది. కార్యనిర్వాహకవర్గం పాత్రను కూడా న్యాయవ్యవస్థ పోషించడం మొదలుపెడితే ప్రజాభిప్రాయానికి ఇక విలువే ముంటుందో, ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. న్యాయంగా ఉండటం మాత్రమే కాదు న్యాయంగా ఉన్నట్టు కనిపించాలి కూడా అంటారు. వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోగూడదనే అర్థంలో అలా అంటారు. ఒకే రకమైన కేసులో రెండు భిన్నమైన తీర్పులు చూడండి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. పరీక్షల ద్వారా వారి మెరిట్ను నిర్ధా రించి చూపకపోతే భవిష్యత్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థు లకు సీట్లు లభించవన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నది. కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబిం చింది. రెండు రాష్ట్రాల మీద సుప్రీంకోర్టులోనే పిటీషన్లు పడ్డాయి. ఏపీ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పరుష వ్యాఖ్యలు చేసింది. పిల్లలెవరైనా కోవిడ్ వల్ల చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించింది. కేరళ కేసులో అదే బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలే మని అంతక్రితం చెప్పింది. విషయం ఒక్కటే. భిన్నమైన వ్యాఖ్యానాలు. ఇందులో సామాన్యులకు అర్థం కాని ధర్మ సూక్ష్మాలు, సాంకేతిక అంశాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. కానీ జనంలోకి ఏ సందేశం వెళ్లిందో గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలనే తీసుకుందాము. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గత యేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారం పదిరోజులు గడిస్తే ఎన్నికలు పూర్తయ్యేవి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. ఆయన ఎందుకలా చేశారనేది మరో పిట్టకథ. ఎన్నికల వ్యవ హారం అనేక న్యాయ మలుపులు తిరిగి ఎట్టకేలకు మొన్న ఏప్రి ల్లో జరిగాయి. ఫలితాలు ప్రకటించవలసి ఉన్నది. మళ్లీ కథ కోర్టుకెక్కింది. జరిగిన ఎన్నికలను రద్దుచేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పనిలో పనిగా ఈ తీర్పుతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. వాటిపై ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్లో ఆమె అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. పౌరులకు దక్కవలసిన రాజకీయన్యాయం ఏడాదిన్నర కాలంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా బలహీనవర్గాల ప్రజలకు 30 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఆ ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నది. రాజ కీయ ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏడాది పైగా ఒక గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోగలిగారు. ఇప్పటికీ 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయే వుంది. మహిళా సాధికారతను మరో అంతస్తుపైకి చేర్చే మహత్తర కార్యక్రమం ఇది. రాజ్యాంగ పీఠిక అభిలషించినట్టు వ్యక్తిగత గౌరవాన్ని (dignity ఇనుమడిం పజేసే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్న రఘురామరాజు అనే ఆర్థిక నేరస్తుడు కేసు వేస్తే ప్రజోపయోగకరమైన అమూల్ కార్యక్రమం ఆగిపోవలసిన అవ సరం ఉన్నదా?. సదరు రఘురామరాజుకు సరస్వతి పవర్పై పిటిషన్ వేయడానికి ఉన్న అర్హతలేమిటి?. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ పాలనను జనానికి చేరువ చేయడం నేరమా?. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆ హక్కు లేదా?. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రిపై గత ప్రభుత్వం వివిధ పోలీస్ స్టేషన్లలో రాజకీయ కేసులు పెట్టింది. ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోవడంతో మేజిస్ట్రేట్లు కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటువంటి కేసులు దేశంలోని రాజకీయ నాయ కులందరిపైనా దాఖలవుతాయి. తర్వాత వాటిని ఉపసంహరిం చుకోడమూ రివాజే. గత ప్రభుత్వ పెద్దలు అనేకమందిపై ఇటు వంటి కేసులు నమోదయ్యాయి. వాటి ఉపసంహరణ కూడా జరిగింది. కానీ ప్రస్తుత సీఎంపై ఉపసంహరించిన కేసులన్నిం టినీ క్రోడీకరించి విచారణ జరుపుతామని హైకోర్టు సుమోటో ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇవి కొన్ని ఉదా హరణలు మాత్రమే. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం సాఫీగా పని చేయకుండా రాజకీయ ప్రత్యర్థులు న్యాయవ్యవస్థ భుజాలపై తుపాకీని మోపి కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం?. అదనులో వానలు కురవాలనీ, శీతాకాలం కోత పెడుతున్న ప్పుడు ఎండలు కాయాలనీ కోరుకుంటాము. ప్రకృతి మనల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించాలని కోరుకోవడం తప్పు కాదు. ధర్మాన్ని మనం కాపాడితేనే కదా... ధర్మం మనల్ని కాపాడేది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సింహాలు... గ్రామసింహాలు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చాలారోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఈ శుక్రవారం నాడు వర్కర్స్ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొరియన్ ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలను కాపాడేటందుకు అవసరమైతే అమెరికాతో సయోధ్యకైనా, సమరానికైనాసిద్ధమేనని ప్రకటించారట. ఇందులో వింత ఏముంది? ఆయన స్వభావమే అంత. కయ్యా నికి ఎన్నడూ వెనకాడని స్వభావం. ఆయన మాటల్లో వింతేదీ లేదు కానీ, ఆయన ఆకారంలో మాత్రం ఉందట. కిమ్ జోంగ్ ఉన్ కొంచెం సన్నబడ్డారు. అదీ న్యూస్. ఈ ‘కిమ్’ పురుషుని పేరు వినగానే మదిలో ఒక 140 కేజీల భారీ ఆకారం మెదులుతుంది. నెత్తిమీద తట్ట బోర్లించినట్టుగా ఉండే డిప్ప కటింగ్ హెయిర్ స్టయిల్. ఫ్యాషన్లకు వ్యతిరేకంగా ఆయన ఈ తరహా కటింగ్ను చేయించుకున్నారట. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిది లేటెస్ట్ ఫ్యాషన్గా మారింది. బుగ్గలు ఆయన స్పెషల్ ఫీచర్. రెండు దవడల్లో రెండు ఫుట్బాళ్లను ఇరికించినట్టు గుండ్రంగా ఉంటాయి. రేడియో స్వర్ణయుగం గుర్తున్నవారికి మర్ఫీ బేబీ ఫొటో గుర్తుంటుంది. ఆ పాలబుగ్గలు గుర్తుంటాయి. కిమ్ ముప్ఫయ్యేడేళ్ల మర్ఫీ బేబీ. అంతర్జాతీయ సమాజాన్నీ, మీడియాను ప్రభావితం చేయడం కోసం అడపాదడపా రకరకాల ‘మేకోవర్’లను ఆశ్రయించడం కిమ్కు అలవాటే. ఒక్కోసారి సూపర్మ్యాన్ ఇమేజ్ కోసం గుర్రమెక్కి దౌడు తీస్తాడు. అప్పుడు రెండు చేతుల్తో కోటు జేబుల్లోంచి పిస్తోళ్లను తీసుకొని స్వారీ చేస్తూనే కాల్పులు జరిపే కౌబాయ్ హీరోగా కనిపిస్తాడు. పార్టీ సమా వేశాల్లో పెద్ద తరహాగా కన్పించడం కోసం చేతిలో కాగితాలు పట్టుకొని కళ్లకు సులోచనాలను ధరిస్తాడు. ‘కిమ్’ పురుషుని గుర్రపు స్వారీ దృశ్యాల మీద అమెరికా, యూరప్ మీడియాల్లో పెద్ద చర్చే జరిగింది. ఉత్తర కొరియా – చైనా సరిహద్దులో ఉండే మౌంట్ పేక్టూ అంటే కొరియన్లకు పవిత్రభావం. హిందువులకు మౌంట్ కైలాస్ మాదిరిగా (కాక పోతే అది ఇండియాలో లేదు). తమ ‘కిమ్’ వంశ ప్రతిష్టను మౌంట్ పేక్టూతో పోల్చి చెప్పడం కిమ్ జోంగ్ ఉన్కు అత్యంత సంతోషకరమైన విషయం. గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ ‘కిమ్’ పురుషులే ఉత్తర కొరియాను పాలిస్తున్నారు కనుక వారి వంశ ప్రతిష్టను అంగీకరించక తప్పదు. కిమ్ జోంగ్ ఉన్కు స్వయానా తాతపాదుల వారైన కిమ్ ఇల్ సంగ్ దేశంలో వ్యక్తిపూజను వ్యవ స్థీకృతం చేశారు. ఆయన తనకు తాను ‘గ్రేట్ కామ్రేడ్’ అనే బిరు దును కూడా ఇచ్చుకున్నారు. తాతగారి స్వార్జితమైన వంశ ‘ప్రతిష్ట’ను తండ్రిగారు భద్రంగా కాపాడి కిమ్ జోంగ్ చేతిలో పదేళ్ల క్రితం పెట్టారు. అప్పటినుంచి పేక్టూ శిఖరంతో సమాన మైన తమ వంశ గౌరవాన్ని ఈయన కూడా నిలబెట్టు కొస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మంచు ముసుగువేసుకున్న మౌంట్ పేక్టూ వెండి కొండలా వెలిగిపోతుంటుంది. దారికి రెండుపక్కలా ఉన్న చెట్లన్నీ మంచు తెరలు కప్పుకొని వినయంగా నిలబడి ఉంటాయి. మధ్యలోంచి తెల్లని జవనాశ్వంపై గోధుమ రంగు కోటు ధరించిన కిమ్ వస్తుంటాడు. తనను తాను అత్యంత శక్తిమంతుడిగా లోకానికి చాటుకోవడానికి కిమ్ చేపట్టిన ఇమేజ్ మేకోవర్గా ఈ దృశ్యాలను పాశ్చాత్య మీడియా విశ్లేషించింది. ఇప్పుడు కిమ్ కొంచెం సన్నబడ్డాడు. కారణమేమిటి? ఇదో రక మైన మేకోవరా? లేక మాయరోగమా? పరిశోధనలు జరుగు తున్నాయి. అపజయాలు వరుసగా ఎదురవుతున్నప్పుడు, లేదా కొత్త విజయాలను సాధించాలనుకున్నప్పుడు, తమ వేషభాషల్లో కొత్త ఇమేజ్ని తెచ్చిపెట్టగల మేకోవర్లను ఇప్పుడు చాలామంది ఆశ్ర యిస్తున్నారు. ఇందులో రకరకాల సెలెబ్రిటీలు, రాజకీయ నాయ కులు ముఖ్యులు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫెషనల్ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఇమేజ్ మేకోవర్ అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అంశమని ఈ రంగంలోని నిపుణులు చెబు తున్నారు. సదరు సెలెబ్రిటీ శక్తి సామర్థ్యాలకూ, సహజ స్వభావా నికి పూర్తి విరుద్ధమైన ఇమేజ్ను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ సెలెబ్రిటీలు అభాసుపాలు కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈమధ్య ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం వేసిన కిల్ బిల్ పాండే అనే ఒక నిస్పృహకు గురైన పోలీసాఫీసర్ పాత్ర గుర్తు కొస్తున్నది. బ్రహ్మానందం పాపులర్ కమెడియన్. కానీ, ఆ పాత్రేమో కనిపించిన అక్రమార్కులందరినీ విచక్షణారహితంగా కాల్చిపారేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రేక్షకులకు ఒడ లంతా గగుర్పాటు రావాలి. కానీ పగలబడి నవ్వుతారు. అది సినిమా కనుక, దర్శకుడు ఆశించిన హాస్య ప్రయోజనం నెర వేరింది. నిజ జీవితంలో ఇటువంటి మేకోవర్ జరిపితే ఎట్లా ఉంటుంది? జాతీయ టీవీ చానళ్లలో కిమ్ తాజా వార్త ప్రసారమైన శుక్రవారం నాడే కొన్ని తెలుగు ‘బ్రాండెడ్’ చానళ్లలో ఒక పర్యటన వార్త పదేపదే ప్రసారమైంది. కర్నూలు జిల్లాలో రెండు ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. చనిపోయిన వ్యక్తులు తమ పార్టీకి సంబంధించిన వారని చెబుతూ, ఆ పార్టీ అధ్యక్షుని కుమారుడు లోకేశ్ నాయుడు పరా మర్శకు వెళ్లారు. అంతవరకు తప్పులేదు. కానీ ఈ సందర్భంగా లోకేశ్ నాయు డితో పాటు ఆ బ్రాండెడ్ మీడియా బృందం వేసిన వీరంగం చూస్తుంటే పూర్వపు రోజుల్లో గ్రామాల్లో ప్రదర్శించే యక్షగానం గుర్తుకొచ్చింది. ‘రాజు వెడలె రవితేజము లలరగా... కుడి ఎడ మల డాల్ కత్తులు మెరవగా’ అన్నట్టుగా బ్రాండెడ్ చానళ్లు ఈ పరామర్శ కార్యక్రమాన్ని ప్రసారం చేశాయి. ఒక్క హార్మోనియం, మద్దెల దరువే తక్కువ. లోకేశ్ నాయుడు అనగానే తెలుగు ప్రజల మనసుల్లో నాటు కొని పోయిన ముద్ర ఒకటుంది. బొద్దుగా ఉంటాడు. ముద్ద ముద్దగా మాట్లాడతాడు. సంభాషణలో విపరీతంగా తప్పులు దొర్లుతాయి. చాలా సందర్భాల్లో తాను చెప్పదలచుకున్న విష యాన్ని వ్యతిరేకార్థంలో చెబుతుంటాడు. ఆహార ప్రియుడు, నడుము చుట్టుకొలత సాధారణం కంటే ఎక్కువ. ఇత్యాది కార ణాల వలన సోషల్ మీడియాలో ఆయనకు పప్పు అనే పేరు స్థిరపడిపోయింది. ఎవరు పెట్టారో తెలియదుకానీ బాగా వైరల్ అయింది. ఒక దశలో గూగుల్లో పప్పు అని వెతికితే ఈయన బొమ్మ వచ్చేదట. నిజానికి పప్పు అనేది కించపడాల్సిన మాటేమీ కాదు, పైగా మంచి పోషకాహారం కూడా. కానీ, ఎందుకో వారికి ఈ మాట నచ్చేది కాదు. పప్పు అని సెర్చ్ చేస్తే తమ బొమ్మ రాకుండా గూగుల్తో లాబీయింగ్ చేసుకున్నారు. లోకేశ్ నాయుడి ఇమేజ్ మార్చడానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు. దొడ్డిదారిన చట్టసభలోకి తీసుకొచ్చి మంత్రిని చేశారు. రెండు కీలకమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారు. పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ ముఖ్యులందరూ లోకేశ్ను సంప్రదించే విధమైన ఏర్పాటు చేశారు. అతన్నొక సూపర్ మ్యాన్గా చిత్రీక రించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఫలితం సాధించలేకపోయారు. లోకేశ్ నాయుడు ఒక ముఖ్యమంత్రికి ఏకైక కుమారుడు, మరో పాపులర్ ముఖ్యమంత్రి, సినీరంగ చక్రవర్తిగా వెలిగిన ఒక శిఖరప్రాయునికి మనవడు. కావలసి నంత ఆర్థిక, అంగబలం ఉన్నది. పైగా, ఎమ్మెల్యేగా గెలవడానికి అనేక ప్రాంతాల్లో సర్వేల మీద సర్వేలు చేసుకొని ఏరికోరి మంగళగిరిని ఎంపిక చేసుకున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేపై గెలవలేక చతికిలబడ్డారు. కనుక లోకేశ్ నాయుడికి ఏర్పడిన ఇమేజ్ ఆయన స్వయంగా సంపాదించుకున్న కష్టార్జితమే తప్ప ఎవరో ఆపాదించింది కాదని రూఢీ అయింది. లోకేశ్ నాయుడు ఈ మధ్యకాలంలో కొంత సన్నబడ్డారు. కిమ్ జోంగ్ ఉన్, లోకేశ్నాయుడు ఒకే కాలంలో సన్నబడడం జస్ట్ కాకతాళీయమే. ఇద్దరికీ ఏమాత్రం పోలిక లేదు. లోకేశ్ నాయుడు తండ్రిగారి మాదిరిగా కొద్దిగా గడ్డం కూడా పెంచారు. ఇదంతా ఏదో రొటీన్గా జరిగిన వ్యవహారం కాదు, మేకోవర్ శిక్షణలో ఉన్నారనే సంగతి కర్నూలు పర్యటనతో వెల్లడైంది. అక్కడాయన ఆవేశంతో ఊగిపోయారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసే తెలుగు సినిమా డైలాగులు వినిపించారు. ఎట్లా మాట్లాడాలనే దానిపై తర్ఫీదైతే తీసుకున్నట్టున్నారు, కానీ తడబాట్లు మాత్రం తప్పలేదు. ముఖ్యమంత్రిపై ఏకవచనం ఉపయోగిస్తూ అసభ్యంగా దూషించారు. హత్యలకు బదులు తీర్చుకునే బాధ్యతను తానే తీసుకుంటానని చూపుడు వేలు విన్యాసంతో హెచ్చ రించారు. మేనమామ బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి వంటి వారెవరో స్క్రిప్టు రాసి ఉండవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 29 మంది ప్రాణాలు బలితీసుకున్న పుష్కరాల షూటింగ్ దర్శకుడు ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయోగించిన పదజాలాన్నంతా ఇక్కడ ఉటంకించడం సభ్యత కాదు. చివరగా నేను సింహం లాంటోణ్ణి, ఊరుకోబోనని ప్రకటించారు. అదేదో సినిమాలో హీరో అంటాడు– ‘ఒరేయ్ నేను సింహంలాంటోణ్ణి, అది గడ్డం గీసు కోదు. నేను గీసుకుంటా అంతే తేడా.’ ఇక్కడ ఆ తేడా కూడా లేదు. ఈయన కూడా గీసుకోవడం లేదు. కిల్బిల్ పాండే పాత్రను నిజజీవితంలో ప్రవేశపెడితే ఏమవుద్ది? శ్రీకృష్ణ పాత్రధారి భుజం మీద గదను పెట్టి, భీముడి వేషధారి చేతికి పిల్లనగ్రోవినిస్తే ఏం బాగుంటుంది?. పప్పు ఇమేజ్కి నిప్పు డైలాగులు ఎట్లా నప్పుతాయి? స్క్రిప్టు రాసే వాడికయినా జ్ఞానం ఉండాలి కదా? అతడి కారణంగా లోకేశ్ నాయుడి కర్నూలు యాత్ర రసాభాసగా మారింది. అధికారపక్షం ఎదురుదాడితో కుమ్మేసింది. గ్రామాల్లోకి వచ్చి తానో సింహాన్ని అనడం ఏమిటని ప్రశ్నించింది. గ్రామ సింహాలకు వేరే అర్థం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ‘బాబూ... చిట్టీ, ఏమన్నావ్ బాబూ’ అనే శ్రీలక్ష్మి డైలాగ్, ‘ఒరేయ్ చిట్టినాయుడు... చచ్చి నోడా’ అనే సురేఖవాణి డైలాగ్ వైరల్గా మారాయి. ఇమేజ్ మేకోవర్కు పోతే డ్యామేజ్ మేకోవర్ ఎదురైంది. ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షంగా పోరాడేటందుకు రాచ బాట ఉండగా ఈ సందుగొందుల మార్గాన్ని బాబు వారసుడు ఎన్నుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఎత్తి చూపవచ్చు. నారాయణ, చైతన్యలుండగా సర్కారు బడుల మీద ఇంత డబ్బు ఎందుకు తగలేస్తున్నారని నిలదీయవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రులుండగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజాధనాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారని అడగవచ్చు. హెరిటేజ్ ఉండగా అమూల్ను ఎందుకు తీసుకువచ్చారని ఎండగట్టవచ్చు. అమ్మ ఒడి పేరుతో అంతంత డబ్బును ఎందుకు తగలేస్తున్నారని గదమాయించవచ్చు. అధికారంలోకి వచ్చీరాగానే లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయదలుచు కున్నారని ఎలుగెత్తి నిలదీయవచ్చు. ఇటువంటి ఎన్నో అవకాశా లను ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ఈ అడ్డదారు లెందుకు?. ఎందుకంటే అందుకో కారణం ఉందట. కర్నూలు రసాభాసకు స్క్రిప్టు రైటర్ కారణం కాదనీ, అధి నాయకత్వమే కార్యక్రమాన్ని ఆ విధంగా డిజైన్ చేయించిందని ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. టీడీపీ అధి నాయకత్వం రెండంచెల కార్యక్రమాన్ని చేపట్టిందట. 1) చంద్రబాబు వారసుడైన లోకేశ్నాయుడు ఇమేజిని క్రమంగా మార్చడం. 2) ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాల నుంచి ప్రజల మనస్సులను దారిమళ్లించడం. ఈ కార్యక్రమానికి పబ్లిక్ మైండ్ డైవర్షన్ ప్రోగ్రామ్ (íపీఎమ్డీపీ) అనే ముద్దుపేరును పెట్టుకున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల మీదనే జనం మనసు లగ్నమైతే అది పాలక పార్టీకే ప్లస్ అవుతుందని తెలుగుదేశం నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అందువల్ల కులం, మతం, ప్రాంతం, ఫ్యాక్షన్ల ఆధారంగా వైషమ్యాలను రెచ్చగొట్టడం, న్యాయస్థానాల్లో పిటీషన్ల ద్వారా అభ్యుదయ కార్యక్రమాలను అడ్డుకోవడం అనే ఎత్తుగడను చేపట్టింది. అందులో భాగంగానే లోకేశ్ నాయుడి కర్నూలు పర్యటన. అయితే జనం టీడీపీ అనుకున్నంత అమాయకులు కారు కనుక ఈ పర్యటన సత్ఫలితాలనివ్వలేకపోయింది. నేను సింహం లాంటోణ్ణి అని చెప్పుకునే వారికి ఆ సింహా నికి ఉన్నపాటి ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. తనకంటే ఎంతో బలహీనమైన జంతువును వేటాడేటప్పుడు కూడా సింహం మీసం దువ్వదు. తొడలు కొట్టదు. చాటు మాటున నక్కి నక్కి ఉంటుంది. ఆ జంతువు దూరాన్ని, దాని వేగాన్ని గమనిస్తుంది. ఏ కోణంలో దాడి చేయాలో నిర్ధారించుకున్న తర్వాతనే లంఘిస్తుంది. అలాంటిది ఒక బలమైన ప్రభు త్వంలో ఒక బలహీనమైన నాయకుడు రంధ్రాన్వేషణ చేయాల నుకున్నప్పుడు ఎంత శ్రద్ధా, సహనం ఉండాలి? ఎంత ఓర్పుతో వేచి చూడాలి? అందుకు ఐదేళ్లు కావచ్చు, పదేళ్లు కావచ్చు. ఇరవ య్యేళ్లు కూడా పట్టవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాంగ్రెస్ను ‘కౌలు’కిచ్చారా?
పూర్వం యయాతి అనే ఒక మహారాజు ఉండేవారు. కౌరవ– పాండవులకు పూర్వీకుడు. ఈయన తండ్రిగారి పేరు నహు షుడు. చతుస్సముద్రవలయతాఖండ భూమండలాన్ని ఈ నహు షుడు పరిపాలించాడని మహాభారతం మనకు చెబుతుంది. అటువంటి తండ్రికి వారసుడు కనుక యయాతి కూడా గొప్ప వాడే. శక్తిమంతుడైన రాజుకు సుఖభోగాలకు కొదవేముంటుంది? అతిలోక రూపలావణ్యవతులైన దేవయాని, శర్మిష్ట అనే ఇద్దరు భార్యలున్నారు. వారివలన ఐదుగురు పుత్రులు జన్మించారు. హాయిగా సాగుతున్న యయాతి జీవన నౌక హఠాత్తుగా నడిసంద్రాన మునిగిపోయేటంత ప్రమాదం వచ్చిపడింది. నడి వయసు కూడా దాటని యయాతికి తక్షణమే వార్ధక్యం ప్రాప్తిం చాలని శుక్రాచార్యులవారు శపిస్తారు. యవ్వనోత్తేజ వాంఛ లింకా తీరకముందే అకాల వార్ధక్యమేమిటని యయాతి దుఃఖి స్తాడు. తరుణోపాయం చెప్పమని శుక్రాచార్యుని వేడుకుం టాడు. దానవ గురువైన శుక్రుడు యయాతికి పిల్లనిచ్చిన మామ. పెద్దరాణి దేవయానికి తండ్రి. హద్దులు దాటిన యయాతి భోగలాలసను భరించలేక శపించాడే గానీ, అల్లుడు కాళ్లమీద పడేసరికి కరిగిపోయాడు. అతడికి శాపవిమోచన మార్గం ఉపదేశిస్తాడు. నీ కుమారుల్లో ఎవరైనా, అతడి యవ్వ నాన్ని నీకు అరువుగా ఇచ్చి నీ వార్ధక్యాన్ని వారు మోసేందుకు అంగీకరిస్తే, కావలసినంత కాలం యవ్వనాన్ని అనుభవించే అవ కాశం ఇస్తున్నానని వెసులుబాటును ప్రకటించాడు. పెద్దకొడు కులు నలుగురూ యవ్వన దానానికి అంగీకరించరు. చిన్న వాడైన పూరుడు అంగీకరించి తన వయసును తండ్రికి ధారపోసి తండ్రి వయసును స్వీకరిస్తాడు. కొత్త వయసుతో కొంతకాలం హల్చల్ చేసిన అనంతరం జీవితంపై వైరాగ్యం పుట్టి పూరుడి వయసును అతనికే ఇచ్చి రాజ్యాన్ని కూడా అప్పగించి తన వార్ధక్యాన్ని యయాతి స్వీకరిస్తాడు. దేశంలో ఎమర్జెన్సీ కాలం ముగిసిన వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇందిరమ్మతో సహా హేమాహేమీలంతా ఓడిపోయారు. ఎమర్జెన్సీ తప్పిదాలకు బాధ్యతను ఇందిరమ్మపై మోపుతూ అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకు లందరూ ఇందిరమ్మ వర్గాన్ని పక్కకునెట్టి తమదే అసలైన కాంగ్రెస్ అంటూ రెడ్డి కాంగ్రెస్గా అవతరించారు. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ పేరుతో పార్టీ చలామణి అయింది. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావు కూడా రెడ్డి కాంగ్రెస్లోనే ఉండిపోయారు. రాష్ట్రంలో పేరున్న నాయకులందరూ రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల తరఫున పోటీకి మోహరించారు. ఏదో ఒక పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకుం దామనుకుని దరఖాస్తులు పడేసిన వారందరికీ ఇందిరా కాంగ్రెస్ టికెట్లు లభించాయి. అగ్నిపర్వతం లోలోపల జ్వలిస్తున్న లావాను రాజకీయవేత్తలు గుర్తించలేదు. కూలినాలి సామాన్య జనం గుండెల్లో మొలకెత్తిన ఇందిరమ్మ సానుభూతి ప్రభంజ నమై హోరెత్తింది. నియోజకవర్గాల్లో ఆమె విసిరేసిన గడ్డిపోచ లన్నీ గెలిచాయి. అలా గెలిచిన వారిలో చంద్రబాబు నాయుడు ఒకరు. హోరుగాలికి ఎదురు నిలబడి రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచిన పిడికెడుమందిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. ఒకే వయసువారు, ఒకే ప్రాంతం వారు, పైగా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఒక స్నేహబృందంగా ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. అంజయ్య కేబినెట్లో చంద్రబాబుకు మంత్రి పదవి లభించడానికి వైఎస్ సహాయపడ్డారని క్లాస్ ఆఫ్ ’78 బ్యాచ్ రాజకీయ నాయకులు చెప్పేవారు. యువకుడు, మంత్రి పదవిలో ఉన్నాడు, ఒకే సామాజికవర్గంవాడు కనుక ఆయనకు పిల్లనిస్తే బాగుంటుందని కొందరు ఎన్టీ రామారావు వద్దకు రాయబారం నడిపారు. ఎన్టీఆర్ సరేనని కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఏడాది గడిచేసరికి, రాజకీయాల్లోకి రావాలన్న అభిలాష ఎన్టీఆర్కు కలిగింది. తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. మామ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం చంద్రబాబుకు కలుగలేదు. అటు వంటి పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి మనసొప్పలేదు. పార్టీ ఆదేశిస్తే మామగారిపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన వల్ల కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడి మళ్లీ మంత్రి పదవి తనకు లభిస్తుందని బాబు స్కెచ్ వేశారు. కథ అడ్డం తిరిగింది. తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు అత్తవారింటికి చేరుకున్నారు. కాళ్ల దగ్గర కొచ్చిన అల్లుడిని ఎన్టీఆర్ కనికరించారు. అక్కున చేర్చు కున్నారు. తరువాతి కథ తెరిచిన పుస్తకమే. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎల్లో మీడియా సహకారంతో, వ్యవస్థలను నియంత్రించగల యాజమాన్య పద్ధ తులతో, అవకాశవాద పొత్తులతో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు, రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చివరి ఐదేళ్ల తర్వాత ఓడిపోవడం ఆయనకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించింది. రాజధాని నిర్మాణం పేరుతో లభిం చిన ఒక అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని తన కుటుం బాన్ని ప్రపంచ మెగా రిచ్ జాబితాలో చేర్చాలనుకున్నారు. ఆ ఆశ చేజారిపోయింది. తన కుమారుడిని సీఎం గద్దెపై కూర్చో బెట్టాలనుకున్నారు. అది కలగానే మిగిలిపోయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవగలమనే పరిస్థితులు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే కనిపించడం లేదు. కోరికలు నెరవేరకుండానే చనిపోయినవాళ్లు దయ్యాలవుతా రని జనసామాన్యంలో ఒక ప్రచారముండేది. ఆ ప్రచారాన్ని నమ్మడానికి మనకు ఏ ఆధారమూ లేదు. కానీ పదవిలో ఉండగా వ్యక్తిగత లబ్ధికోసం పెద్ద టార్గెట్లు పెట్టుకొని అవి నెరవేరకుం డానే దిగిపోవలసి వస్తే మాత్రం వాళ్ల మెదళ్లలో తప్పనిసరిగా దయ్యాలు దూరతాయి. కొత్తకొత్త వింతైన ఆలోచనలు చేస్తాయి. అలా చెప్పడానికి ఇప్పుడు ఆధారాలు ఒక్కొక్కటే దొరుకుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదని అనుభవసారాన్ని రంగరించిన ఆరో ఇంద్రియం గట్టిగా చెబుతున్నది. ‘అయితే పక్క రాష్ట్రంలో ప్రయత్నిద్దాం. ఏదోఒక రాయి తగలకపోతుందా?... మెదళ్లలో దూరిన దయ్యం లాజిక్. ‘అదెట్లా సాధ్యం. మనదేమన్నా జాతీయ పార్టీనా? పైగా మనం అసెంబ్లీకి పోటీ చేయడం అస్సలు కుదరదు’ ... కామన్ సెన్స్ వాదన. దయ్యం కూడా వాదించడం మొదలుపెట్టింది. ‘ఎందుకు కుదరదు? అది గతంలో మనం పాలించిన రాష్ట్రమే. మనకెన్నో లింకులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. బినామీ ఆస్తుల్లో చాలా భాగం అక్కడే ఉన్నాయి. రాజధాని అటకెక్కిన తర్వాత ఇక్కడ మిగిలిందేముంది మనకు?.. అక్కడ మన పార్టీ లేచే పరిస్థితి లేకపోతే జాతీయ హోదాగల ప్రతిపక్షం ఉండనే ఉన్నది. ఆక్సిజన్ దొరక్క అలమటిస్తున్నది. మనం కాస్త ప్రాణవాయు వును పంపిస్తే చాలు ఆ పార్టీ అధిష్ఠానం తెలంగాణ యూనిట్ను మనకు కౌలుకు ఇస్తుంది. మనం దున్నేసుకోవచ్చు. యయాతి యవ్వనాన్ని అద్దెకు తీసుకోగాలేనిది, మనం ఒక పార్టీని అద్దెకు తీసుకోలేమా?’ తీర్పు కూడా దయ్యం వాదనకు అనుకూలం గానే వచ్చింది. ముఖ్య నేతకు ‘జ్ఞానోదయం’ కాగానే మెదళ్లలోని దయ్యం మొదళ్లతో సహా మాయమై వచ్చిన చోటుకి వెళ్లిపోయింది. ఒక శుభముహూర్తాన, చల్లని శీతాకాలంలో, క్యాలెండర్ ప్రకారం గడిచిన సంవత్సరం చివరి రోజుల్లో పార్టీ అధ్యక్షుల వారు ఒక ప్రత్యేక విమానంలో ఎగురుకుంటూ వెళ్లి ఢిల్లీలో వాలిపోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అత్యంత రహస్యంగా ఈ పర్యటన జరిగింది. ఢిల్లీలో ఆయన ముగ్గురు వ్యక్తులను కలుసు కున్నారని సమాచారం. మన టాపిక్కు ఒక వ్యక్తి ప్రస్తావనే చాలు. ఆ ఒక్కడు రాహుల్గాంధీ. గడిచిన పుష్కరకాలంగా రాహుల్ గాంధీతో, ఆయన బృందంతో చంద్రబాబుకు బాగా సఖ్యత ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేయించిన ఎపిసోడ్ మొత్తం టెన్ జనపథ్తో సమన్వయం చేసుకుని బాబు పనిచేశారు. కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా ఆదుకుని కాంగ్రెస్ పార్టీకి ఆత్మీయు డుగా మారిపోయారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. తెలంగాణ ఎన్నికల్లోనైతే ఏకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని పనిచేశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మొత్తం చంద్రబాబే భరించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తన మీద ఓటుకు కోట్లు కేసు పెట్టి అప్రతిష్ట పాల్జేసిన కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలన్న కసితో చంద్రబాబు కాంగ్రెస్ కోసం పనిచేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నం దుకు అంతే కసితో జనం కాంగ్రెస్ పార్టీని ఓడించారు. కథ దుఃఖాంతమైంది. అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రాతిపదికన రాహుల్–బాబుల మధ్య ఒక అంగీకారం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంగీకారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్తో తలపడేందుకు అవసరమయ్యే ‘జవ సత్వాలను’ కాంగ్రెస్ పార్టీకి సమకూర్చడానికి చంద్రబాబు సహ కరిస్తారు. అయితే తెలుగుదేశం–కాంగ్రెస్ల మధ్య బహిరం గంగా పొత్తేమీ ఉండదు. బహిరంగ మైత్రి కూడా ఉండదు. పార్టీ అధ్యక్షుడి పేరును చంద్రబాబు సూచిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అతడే ముఖ్యమంత్రి అవుతాడు. రాహుల్ సమక్షంలో రేవంత్రెడ్డి పేరును చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్లో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జీవన్రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, మధు యాష్కీ వంటి ముఖ్యనేతలకు నచ్చచెప్పవలసిన అవసరం ఉన్న దృష్ట్యా కొంత సమయం కావాలని అడిగినట్లు వినికిడి. ప్రస్తుతం అందు తున్న వివరాలను బట్టి ఈ బుజ్జగింపుల కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. రేవంత్ నాయకత్వంపై కార్యకర్తల స్థాయి ఫీడ్ బ్యాక్ను కూడా రాహుల్ తెప్పించుకున్నారట. బయటిపార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అప్పుడే కీలక నాయకత్వం అప్పగించడం పట్ల పాతతరం, వృద్ధతరం నాయకత్వంలో వ్యతిరేకత వ్యక్తమైం దట. రేవంత్రెడ్డి దూకుడు వైఖరి, వాగ్ధాటి, అందుబాటులో ఉండే లక్షణం మొదలైన కారణాల వల్ల యువతరంలో మాత్రం సమ్మతి వ్యక్తమైందని గాంధీభవన్ వర్గాల భోగట్టా. ఇందులో నిజానిజాలు ఎట్లా వున్నా రేవంత్రెడ్డి పేరును నేడో రేపో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప నష్టం లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నదట. చంద్రబాబు సొంత ప్రయోజనాలు ఏమైనా ఉండవచ్చు. తమకు మాత్రం పైసా ఖర్చుండదు. పార్టీ అధ్యక్షునిగా ఆయన ఏ పేరు సూచించినా అతడు కాంగ్రెస్వాడే. పొరపాటున గెలిస్తే... అదంత సులువు కాదు... అయినా వాదనకోసం... గెలిస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్నా అతడు కాంగ్రెస్ వాడే కనుక తమకొచ్చే నష్టం ఏమీలేదని పెద్దల ఆలోచనగా వుందని విశ్వసనీయంగా తెలుస్తున్న భోగట్టా. ఇక్కడ చంద్రబాబు త్రిపాత్రాభినయం గురించి చెప్పు కోవాలి. ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆయన ‘లీజు’కు తీసుకుంటున్నారు. దానికి ఆర్థిక వనరులు సమకూర్చి కేసీఆర్తో యుద్ధానికి సన్నద్ధం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మరోపక్కన కేసీఆర్తో శత్రుత్వం ఏర్పడకుండా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి, బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి నిష్క్రమించారు. అదే జిల్లాకు చెందిన సీనియర్ బీసీ నేత తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్వయంగా చంద్ర బాబు ఆదేశం మేరకే టీఆర్ఎస్లో చేరారని తెలుస్తున్నది. మరో తెలుగుదేశం మాజీ సహచరుడైన ఎర్రబెల్లి దయాకర్రావు ఈ వ్యవహారంలో సంధానకర్తగా వ్యవహరించారు. ఇంకా కొంత మంది వట్టిపోయిన నాయకులు తెలంగాణ టీడీపీలో మిగిలి వున్నారు. వారిలో కొందరిని టీఆర్ఎస్లో చేర్పించేందుకు వరుసలో నిలబెట్టి ఉంచారట. ఈ చేర్పింపుల కార్యక్రమం ద్వారా తాను టీఆర్ఎస్కు శ్రేయోభిలాషిననే సంకేతాలను చంద్ర బాబు పంపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ యుద్ధ సన్నాహాల్లో ఉన్నది. ఈ సమయంలో ఇక్కడ కాంగ్రెస్కు సహకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మొన్నటి మహానాడులో టీడీపీ ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించింది. ఇప్పటికే పలువురు తెలుగుదేశం నాయకులు, బాబు సన్నిహితులు బీజేపీ వేషాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చెప్పండి... సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీ రామారావు చతురుడా?... రాజకీయాల్లో త్రిపాత్రాభి నయం చేస్తున్న చంద్రబాబు చతురుడా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సుయోధన – శిశుపాలీయం!
సందర్భం... ఇంద్రప్రస్థంలో ధర్మరాజు రాజసూయం. ఉత్స వాన్ని ఘనంగా చేయాలన్న సంకల్పంతో దేశంలో ఉన్న రాజు లందర్నీ పిలుస్తారు. ఛేది దేశానికి రాజుగా ఉన్నాడు కాబట్టి శిశుపాలుడికి కూడా ఆహ్వానమందుతుంది. ఇతగాడికి శ్రీకృష్ణు డంటే అస్సలు పడదు. అప్పటికే పలుమార్లు కృష్ణపరమాత్మను దూషించి ఉన్నాడు. విషయం తెలిసిన కృష్ణుడు సహనం పాటిస్తాడు. శిశుపాలుని తల్లి కృష్ణుడికి బంధువు. ఆమె ప్రార్ధన మేరకు శిశుపాలుని నూరు తప్పుల్ని క్షమించాలనుకుంటాడు. రాజసూయంలో అగ్రపూజను అందుకుంటున్న శ్రీకృష్ణుని చూడ గానే శిశుపాలుడు మళ్లీ రెచ్చిపోతాడు. తిట్ల దండకాన్ని పఠిం చడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో నూరు తప్పుల లక్ష్మణ రేఖను శిశుపాలుడు దాటేస్తాడు. హద్దు దాటగానే శ్రీకృష్ణుడు నాటి యుగధర్మం ప్రకారం అతడిని శిక్షిస్తాడు. సుదర్శన చక్రం శిశుపాలుని శిరస్సును ఖండిస్తుంది. అక్కడున్న రాజులందరూ శ్రీకృష్ణుని చర్యను జయజయధ్వానాలతో ఆమోదిస్తారు. దేశం లోని ప్రజలందరూ హర్షం ప్రకటిస్తారు. శ్రీకృష్ణుడంటే పడనివాడు ఆరోజుల్లో శిశుపాలుడు ఒక్కడే కాదు. చాలామంది ఉన్నారు. ఆయన పాండవ పక్షపాతి కనుక దుర్యోధనాది కౌరవులందరికీ కృష్ణుడంటే కన్నెర్రే. కానీ, వారె వరూ శిశుపాలుని శిరచ్ఛేదాన్ని ఖండించలేదు. ఎందుకంటే ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా వున్నది. హద్దుమీరిన ఉన్మాదిని శిక్షించడం ధర్మసమ్మతం. నాటి దుర్యోధనాదులకు ప్రజాభిప్రాయాన్ని, ధర్మసమ్మతినీ ప్రభావితం చేయగల టెక్ని క్కులు తెలియవు. నేటి దుర్యోధనులకు ఈ విద్యలు తెలుసు. ఇందులో ఆరితేరిన శాస్త్రపారంగతుడెవరో తెలుగు ప్రజలందరికీ తెలుసు. రాజకీయ నాయకులు కొందరు మీడియా దన్నుతో తమకు అనుకూలమైన రీతిలో ప్రజాభిప్రాయాన్ని మలచుకోగలుగు తున్న వైనాన్ని నోమ్ చామ్స్కీ అనే అమెరికన్ మేధావి బయట పెట్టారు. దీనికి ఆయన ‘ప్రజాసమ్మతిని తయారుచేసుకోవడం (manufacturing of consent)’ అనే పేరు పెట్టారు. ఇందు కోసం వార్తావ్యాఖ్యానాలను జనంలోకి చేరవేసే క్రమంలో రక రకాల రంగురంగుల ఫిల్టర్ల ద్వారా వడబోస్తారు. ఈ వడబోత వార్తలు (filter news) పెత్తందారి వర్గానికి అవసరమైన పద్ధతిలో ప్రజాసమ్మతిని రూపొందిస్తాయి. నాటి అమెరికా రాజ కీయ వ్యవస్థలో నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ముప్పయ్యేళ్ల కింద టనే నోమ్ చామ్స్కీ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. హిట్లర్–గోబెల్స్ల కాలంలో జర్మనీలో పురుడుపోసుకున్న ఫిల్టర్ న్యూస్కు అమెరికన్లు 2జీ వెర్షన్ తయారుచేశారు. మన తెలుగువాడైన రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు 3జీ వెర్షన్ను కనిపెట్టడమే కాకుండా 4జీ, 5జీ పేటెంట్లు కూడా కొల్ల గొట్టి ఘనయశస్సును ఆర్జించారు. ఈ ఫిల్టర్ న్యూసే ఆయన పాలిటి ఆక్సిజన్. ఎందుకంటే, ఆయన అక్రమ మార్గంలో అధి కారంలోకి ప్రవేశించారు. పార్టీని కబ్జా చేశారు. ఇవి రెగ్యులరైజ్ చేసుకోవాలంటే తనకు అనుకూలమైన ఫిల్టర్ న్యూస్ అవసరం. అందువల్ల మీడియాపై నియంత్రణ కావాలి. సినిమా రంగంపై ఆధిపత్యం వహిస్తున్న రెండున్నర కోస్తా జిల్లాల పెత్తందారీ వర్గం చేతిలోనే మీడియా కూడా కేంద్రీకృతమైంది. ఎంతో సహ జంగా, సునాయాసంగా ఈ వర్గంతో చంద్రబాబుకు స్నేహం కుదిరింది. ‘మనసున మనసై–బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’ అన్నాడో కవి. బాబుకూ, మీడియా మొఘల్స్కు ఆ రకమైన కెమిస్ట్రీ కుదిరింది. అక్రమ పద్ధతుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని చెరబట్టింది ఏ పవిత్రాశయం కోసమో, ప్రజా సంక్షేమం కోసమో కాదు. కేవలం స్వార్థంకోసం. ఎన్టీ రామారావు తీసుకున్న ప్రజారంజక నిర్ణయా లను తిరగదోడిన నాడే ఈ విషయం బోధపడింది. అప్పుడ ప్పుడే మొలకెత్తిన దేశీయ కార్పొరేట్ శక్తులకు దళారీగా, ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా పనిలో కుదరడంతోనే ఆయన పవిత్రా శయం ఏమిటో జనానికి రూఢీ అయింది. రాజకీయ జీవిత లక్ష్యం స్వార్థం, ఎంచుకున్న మార్గం అక్రమం కనుక, ఆయన పొలిటికల్ కెరీర్ ఆసాంతం ‘ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు’ అవసర మవుతాయి. ఆయనకు ఆ గ్రహింపు వుంది. ఫిల్టర్ న్యూస్ ప్రసారం చేసే మీడియా ఎలాగూ వున్నది. అదొక్కటే సరిపోదు. అందుకని రాజ్యసంబంధమైన సమస్త ఉపాంగాల్లో, రాజ్యాంగ వ్యవస్థల్లో తనవారిని జొప్పించే కార్యక్రమాన్ని పాతికేళ్ల కిందనే ప్రారంభించారు. అలా ‘జొప్పితు’లైనవారు ఊడలు దిగిన వట వృక్షాలుగా ఎదిగేందుకు తనవంతు లాబీయింగ్ను విసుగు లేకుండా నడిపించారు. భూమిపైగానీ, ఆకాశంలో గానీ, నీటిలో గానీ, ఎటువంటి ఆయుధం చేతగానీ, మనిషి చేతిలోగానీ, మృగం చేతిలో గానీ తనకు చావులేని విధంగా వరాలు పొందిన హిరణ్యకశపుడి మాదిరిగా చంద్రబాబు తన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏ వ్యవస్థ నుంచీ తనకు ముప్పు రాకుండా ఓ వ్యూహాన్ని అమలు చేసుకున్నాడు. కానీ, సోషల్ మీడియా విస్ఫోటనంతో ఈ ఏర్పాట్లన్నీ జనానికి తెలిసి పోతున్నాయి. చంద్రబాబుగారి సినిమాలు ఇప్పుడు అంత బాగా ఆడటం లేదు. ఏ సినిమా ముగింపు ఏమిటో సోషల్ మీడియాలో ముందుగానే వచ్చేస్తున్నది. ఆయనకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధమున్న ఏవార్తయినా సరే ఏ పత్రికలో ఎలా వస్తుందో, ఏ చానెల్లో ఎలా ప్రసారమవుతుందో ముందుగానే చెప్పేస్తు న్నారు. ఆయన మీద ఎక్కడైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అక్క డ్నించి ఏరకమైన తీర్పు వెలువడుతుందో ముందుగానే జోస్యం చెబుతున్నారు. తన సంబంధ బాంధవ్యాల బండారం అంతా బట్టబయలు వ్యవహారంగా మారింది. ఏదో ఒక సిగ్గుబిళ్ల తక్షణం కావాలి. ఎలా? ఆలోచించగా చించగా, ఎల్లో సిండికేట్గా లబ్ధప్రతిష్టులైన బాబు కోటరీ సభ్యులకు ఒక ఉపాయం తట్టింది. పచ్చ కండువా వేయనివాడు, అధికార పార్టీలో బతికి చెడి, బజారుకెక్కినవాడు, సిగ్గుపడకుండా ఇచ్చిన ‘కాంట్రాక్టు పని’ చేసేవాడు ఒకరో ఇద్దరో కావాలి. తొలుత ఇటీవల చనిపోయిన ఉత్తరాంధ్ర నాయ కుడిని వాడుకున్నారు. ఆయనకు దిగ్గజ విశ్లేషకుడు అనే బిరుదు నిచ్చి తమక్కావలసినవి చెప్పించుకునేవారు. ఆయనతోపాటు రాజు కాని రాజు తరాజుగారొకరు సిండికేట్కు దొరికారు. తరాజుగారు వాడే భాష, సంజ్ఞాపూర్వక హావభావాలు చూస్తే సిగ్గుబిళ్ల కూడా సిగ్గుపడవలసిందే. శిశుపాలుడే గనక ఇప్పుడు బతికి ఉన్నట్లయితే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రెండు చానెళ్లవారు ఈ రాజుగారికి ప్రతిరోజూ ఓ గంటో అరగంటో ప్రత్యేక సమయాన్ని ప్రైమ్టైమ్లో కేటాయించేవారు. పండితులు ప్రవచనాలు చెప్పినంత శ్రద్ధగా ఈయన బూతు వాచకం చదివేవారు. వాచకంతోపాటు ఆంగికాన్ని కూడా జత కలిపేవారు. ఇంతకూ వీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. పేరుకు పార్లమెంట్ సభ్యుడే అయినా, ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఎన్నాళ్లయిందో తెలియదు. ఎవరికీ అధికార ప్రతి నిధీ కాదు. పైగా గొప్ప వ్యక్తిత్వంగలవాడా అంటే అదీ కాదు, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి అప్రతిష్ట మూట కట్టుకున్నవాడు. ఎందుకని ఈ రాజుగారి పంచాంగ పఠన కార్య క్రమానికి ఆ న్యూస్ ఛానెళ్లు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్టు?. ఎందుకంటే, ఎల్లోసిండికేట్ తయారుచేసిన స్క్రిప్టు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార పార్టీ పెద్దల మీద, చివరికి ముఖ్య మంత్రి మీద కూడా నిందాపూర్వకంగా మాట్లాడతాడు కనుక. నెలల తరబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరకు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యానాలకు కూడా రాజుగారు దిగజారిపోయారు. కులాలను, మతాలను, ప్రముఖ వ్యక్తులను కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారు. ఎంతో నిష్టతో సదరు ఛానళ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫిర్యాదులందుకున్న మీదట పోలీసులు ఎంపీ మీదా, ఆ ఛానళ్ల మీద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఐపీసీ 124 ఏ అనే సెక్షన్ కూడా ఉన్నది. ‘మాటల ద్వారా గానీ, సైగల ద్వారా గానీ విద్వేషాలను, ఎన్నికైన ప్రభుత్వంపై వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే వారు ఈ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. ఎంపీ రోజువారీ టీవీ కార్యక్రమాలకు సరిగ్గా సరిపోయేవిధంగా ఉన్నందువల్ల బహుశా పోలీసులు ఈ సెక్షన్ను పెట్టి ఉండవచ్చు. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టమే. కాదనేవారెవరూ లేరు. కానీ ఇప్పటికీ ఇండియన్ పీనల్ కోడ్లో భాగంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోనే రెండేళ్ల కిందటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో ఇరవైకి పైగా ఈ (రాజద్రోహం) కేసులను పెట్టించారని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రి ఒకరు వివరాలతో సహా బయటపెట్టారు. ఎవరి మీద ఆయన ఈ కేసులు పెట్టించారో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం ఐదు కోట్లు ఆఫర్ చేస్తూ రెడ్హ్యాండెడ్గా ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయిన అనంతరం ఉక్రో షంతో ఈ కేసులను పెట్టించారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మె ల్యేగా ఎన్నికైన గిడ్డి ఈశ్వరిని కూడా రాజద్రోహం కేసుతో బెది రించి, డబ్బులు ఆశచూపి, తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా సొంత ప్రయోజనాలకోసం రాజద్రోహం కేసును ఉపయోగిం చుకున్న నేపథ్యం చంద్రబాబు పార్టీకి ఉన్నది. ఇప్పుడు ఎంపీ ప్రవర్తనపై ఏపీ పోలీసులు మోపిన కేసుపై జాతీయ స్థాయిలో ప్రచారానికి టీడీపీ తెరతీసింది. జాతీయ మీడియాకూ, కొందరు మేధావులకు తమకు అవసరమైన మేరకు మాత్రమే అర్ధ సమాచారాన్ని ఇచ్చి మోసగిస్తున్నది. సదరు ఎంపీ సైతం అరెస్ట్ దగ్గర నుంచి బెయిల్ వరకు ప్రద ర్శించిన నాటకీయతను ప్రజలంతా గమనించారు. బెయిల్ను మంజూరుచేస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ కేసును గురించి మాట్లాడవద్దని ఎంపీని ఆదేశించింది. అందుకు విరుద్ధంగా పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సాటి ఎంపీ లకు లేఖలు రాస్తూ వాటిని మీడియాలో వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకుంటూ కోర్టు ధిక్కారానికి ఆయన పాల్పడుతున్నారు. పోలీసులు సాధారణ నేరస్తులపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానేసి ఏళ్లు గడుస్తున్నది. అలాంటిది పార్లమెంట్ సభ్యుడిపై ప్రయోగించారంటే ఎవరైనా నమ్ముతారా? అందులోనూ ఢిల్లీలో తరచుగా పెద్దపెద్ద పార్టీలు ఇస్తూ వాటికి కేంద్ర మంత్రులను కూడా పిలుచుకునే హైప్రొఫైల్ ఎంపీపై ఏ పోలీసైనా చేయి చేసుకుంటాడా? పోనీ, కాలో, కర్రో చేసుకోగలరా? ఈ కేసును ఎల్లో సిండికేట్ సుప్రీంకోర్టు దాకా లాగింది. ఈ చట్టంపై భాష్యం చెప్పవలసిన సమయం వచ్చిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తాము ఆ పని చేయదలచు కున్నట్టు చెబుతూ కేసును వాయిదా వేసింది. సంతోషించవల సిన విషయం. బ్రిటీష్ కాలం నాటి వలసపాలన చట్టాన్ని ఆసాంతం రద్దుచేసినా స్వాగతించవలసిందే. కాలం చెల్లిన చట్టాలను రద్దుచేస్తామని చెప్పిన ఎన్డీఏ ఇంతవరకూ ఎందుకో వాటి జోలికి పోలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటూనే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు సమాజంలోని కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టకుండా ఉండేలా ఎటువంటి శిక్షలు విధించాలో కూడా మార్గదర్శన చేయవలసిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కులకు భంగం వాటిల్లుతున్నదనీ, పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తున్నదని ఒక విష ప్రచారాన్ని జాతీయస్థాయిలో నిర్వహించడానికి ఎల్లో సిండికేట్ ఒక పథ కాన్ని రచించింది. ఆ పథకాన్ని అమలుచేయడానికి ఎంపిక చేసు కున్న సందర్భం చూడండి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతిభావంతంగా వ్యవహరించిందని ప్రశంస లనందుకున్న సందర్భం. సుస్థిర అభివృద్ధి పయనంలో అగ్ర శ్రేణిలో నిలబడిందని నీతిఆయోగ్ నిర్ధారించిన సమయం. ప్రపంచంలోని ఏ దేశంలో ఎప్పుడు ఎరుగని విధంగా పేద ప్రజలకు 30 లక్షల ఆహ్లాదకరమైన గృహాలను ఆరోగ్యకరమైన పరిసరాలతో నిర్మించి ఇవ్వడానికి ముహూర్తం పెట్టుకున్న సమయం. ఇప్పుడున్న మార్కెట్ అంచనాల ప్రకారం ఇళ్ల నిర్మాణం, కాలనీల్లో మౌలిక వసతుల పరికల్పన పూర్తయిన తర్వాత ఒక్కో ఇల్లు సుమారు 15 లక్షల రూపాయల విలువ చేస్తుంది. మొత్తం 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదింటి ఆడబిడ్డలకు నాలు గున్నర లక్షల కోట్ల విలువైన ఆస్తిని పసుపుకుంకుమల కింద అందజేసిన వారవుతారు. ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రారంభమైన విప్లవాత్మక సంస్కరణలకు పెను సామాజిక విప్లవానికి బాటలు వేసే గృహనిర్మాణం తోడు కాబో తున్నది. పర్యవసానాలు తెలుసు కనుకే, ప్రతిపక్ష నేత ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై మాయతెరలు కప్పి జాతీయ స్థాయిలో ఇంద్రజాల ప్రదర్శనకు పూనుకున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కారు చీకటి... కాకి లెక్కలు!
అయ్యో... sad news, RIP. ఈ మెసేజ్ టైప్ చేయవలసిన అవసరం రాని ఒకరోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము. పరిచయస్తుడు, ప్రాణ స్నేహితుడు, సహోద్యోగి, సహాధ్యాయి, పొరిగింటి మనిషి, ఎప్పుడో మనకు సాయం చేసిన వ్యక్తి, రోజూ వీధిలో కనిపించే మనిషి, మన బంధువు... ఇలా ఎవరో ఒకరు లేదా ఇద్దరు ప్రతి రోజూ కలవరపాటుకు గురిచేస్తున్నారు. గుండె దిటవు చేసు కోవాలని మన నాయకులు ఉద్బోధిస్తున్నారు. కరోనాపై తాము చేస్తున్న యుద్ధం తాలూకు జమాఖర్చులను చెప్పుకొస్తున్నారు. ఈ యుద్ధంలో గెలిచి తీరుతాం భయపడకండని భరోసా ఇస్తు న్నారు. బతుకు మీద తీపి కదా!. ధైర్యమనే దీపం ఎవరు వెలి గించినా ఎంతో ఊరట కలుగుతుంది. నిరంతరం నీళ్లు పారవలసిన జీవనది గంగలో నిర్జీవ నరా వతారాలు ఎందుకు ప్రవహిస్తున్నాయి?. ప్రశ్నించాలని మన మనసులో ఉంటుంది. జనం మనస్సులను చదివే నాయకత్వం మనకుంది. అడక్కుండానే సంజాయిషీలు ఇచ్చుకున్నారు. ఆ శవాలది తమ రాష్ట్రం కాదని రెండు రాష్ట్రాల నేతలు ముల్కీ రూల్స్ చెప్పుకొచ్చారు. గంగ పుట్టిన గంగోత్రి ఈ దేశంలోనే ఉన్నది కనుక, జాతీయ నాయకత్వం దాటవేయలేక పోయింది. అవి భారతీయుల భౌతికకాయాలే. హిందూ శ్రాద్ధ సంస్కారం గంగలో కలిసిపోయింది. శ్మశాన వాటికల్లో రెట్టింపు శవాలు దహనమవుతున్నాయి. వంతుకోసం మరిన్ని శవాలు క్యూలైన్లలో వేచి ఉంటున్నాయి. బహుశా... బతికి ఉన్నప్పుడు ఆస్పత్రిలో బెడ్డు కోసం, ఆ పిదప ఆక్సిజన్ సిలిండర్కోసం వేచి ఉన్న అనుభవం ఇప్పుడు అక్కర కొస్తున్నది. భౌతికదూరం పాటిస్తూ వరుసక్రమంలో దహనం కోసం శవాలు వేచి ఉంటున్నాయి. శవాలు కాలుతున్న కమురు వాసన క్రమంగా అలుముకుంటున్నది. దీప నిర్వాణ గంధం పరివ్యాపితమవుతున్నది. నాసికలకు మరో వాసన తెలియడం లేదు. వాతావరణంలో ఆమ్లజని మందగిస్తున్నది. ఆ స్థానాన్ని ఆందోళన ఆక్రమిస్తున్నది. పోలీసు అకృత్యానికి బలైపోతూ ‘ఐ కాంట్ బ్రీత్’ అన్న జార్జి ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అమెరికాను కుదిపేశాయి. ఆ మాటల ప్రతిధ్వనులతో అమెరికా అధ్యక్ష పీఠమే కదిలి పోయింది. ఇప్పుడు అదే మాట మన ఊరూవాడా ఇంటింటా ప్రతిరోజూ వినపడుతున్నది. ఇటువంటి ఎన్నో వార్తలు, వాస్తవాలు భీతిగొలుపుతు న్నాయి. సాంత్వన కోసం ప్రభుత్వం వైపు చూడక తప్పని పరి స్థితి. ప్రభుత్వ పెద్దలు నిజాలు చెబితే బాగుండునని మనసు కోరుకుంటున్నది. వారు చెప్పే లెక్కల్లో చాలా తప్పులున్నాయని ఇంగితజ్ఞాన పదార్ధం మాటిమాటికీ నస పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత మీద దట్టమైన అనుమానపు చీకట్లు అల్లుకున్నాయి. భారత ప్రధానమంత్రి మీద ఈ దేశ ప్రజలకు చాలా గౌరవం. అనాలోచితమైన నోట్ల రద్దు నిర్ణయంతో జన జీవితాలను అతలాకుతలం చేసినప్పటికీ, ఆ గౌరవభావం వల్లనే ఆయన్ను మళ్లీ ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ గౌరవం చెక్కుచెదరకుండా ఉండేటందుకు ఆయన తన ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు. అద్భుతమైన ఒక నేత కళాకారుడు వెండి జరీతో శ్రద్ధగా నేసినట్టు మెరిసిపోయే ఆయన గడ్డాన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఆయన మూర్తి టీవీలో కని పించినా సరే రాజర్షి విశ్వామిత్రుని సందర్శన భాగ్యం కలిగి నంత తృప్తి మిగులుతుంది. కరోనా మొదటి తరంగం మందగించగానే, జనవరిలో ప్రధానమంత్రి విజయఢంకాను మోగించారు. కరోనాపై భారత్ విజయం సాధించిందని ప్రకటించారు. భారతదేశం పెద్దఎత్తున వ్యాక్సిన్లను తయారుచేయబోతున్నదనీ, ప్రపంచ దేశాలను కూడా మా వ్యాక్సిన్లతో ఆదుకుంటామని తన ఔదార్యాన్ని కూడా చాటుకున్నారు. అదే నెలలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం కూడా కరోనాపై విజయానికి మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసినట్టు గుర్తు. సరిగ్గా నెల గడిచేసరికి కరోనా రెండో తరంగం ఒక సునామీగా రూపు దిద్దుకోవడం ప్రారంభమైంది. ఈ సునామీ గురించిన ముందస్తు వాతావరణ హెచ్చరిక ప్రధానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ఉన్నదని కూడా ఇటీవల సీసీ ఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ప్రకటించారు. ముందుగా తెలిసినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి సన్నాహా లనూ చేయలేదని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదనీ ఇప్పుడు కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్నది. పైపెచ్చు, ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో గెలవడంకోసం ఈ సునామీని విస్మరిం చారనీ, వచ్చేయేడు జరిగే యూపీ ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం కుంభమేళాను అనుమతించారనీ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికారపక్షం దగ్గర సమా ధానం లేకుండా పోయింది. ఈ రెండు సందర్భాలు సెకండ్ వేవ్కు కావల్సినంత ఆజ్యం పోశాయి. ఈ పూర్వరంగ తప్పిదాలన్నింటినీ వదిలేసినా, ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారిన సార్వత్రిక వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లోపిం చింది. చిత్రవిచిత్రమైన నిర్ణయాలు, విధానాల మార్పులు ప్రజ లను గందరగోళ పరుస్తున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజ నాలకే ప్రభుత్వం ప్రాధాన్య మిస్తున్నదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచీ నేటివరకూ యూని వర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. శిశు మరణాలను నియంత్రించడం కోసం డెబ్బయ్యేళ్లుగా కేంద్రం అమలుచేస్తున్న ఈ సార్వత్రిక టీకా కార్యక్రమం ఘనవిజయం సాధించిన అనుభవం మన ముందున్నది. ఈ విధానం ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వరంగ సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్లను కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తుంది. కేంద్రం భారీ స్థాయిలో కొనుగోలు చేయడం, మరో కొనుగోలుదారుడు రంగంలో లేకపోవడం వల్ల వ్యాక్సిన్ ధరలపై బేరమాడే శక్తి కేంద్రానికే ఉంటుంది. ధరలపై అదుపు ఉంటుంది. ఇప్పుడు ఈ సంప్రదాయ విధానాన్ని వదిలేయడం ద్వారా కేంద్రం తన రాజ్యాంగ విహితమైన బాధ్యత నుంచి తప్పుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలను అమ్మకందార్ల మార్కెట్ (sellers market)కు అప్పగించడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ‘బార్ అండ్ బెంచ్’ అనే లీగల్ వెబ్సైట్కు రాసిన వ్యాసంలో వాదించారు. రాజ్యాం గంలోని 7వ షెడ్యూల్ మూడో జాబితా నిర్దేశం ప్రకారం రాష్ట్రాల మధ్య అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయవలసి ఉంటుంది. కేంద్రం ఏప్రిల్లో ప్రకటించిన విధానం ప్రకారం దేశంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న రెండే రెండు సంస్థలు, సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు 50 శాతం వ్యాక్సిన్లను 150 రూపా యల చొప్పున కేంద్రానికి అమ్మాలి. మిగిలిన యాభై శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ ధరకు కంపె నీలు అమ్ముకోవచ్చు. వ్యాక్సిన్ల సత్వర సేకరణకోసం రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతుంది. మరోపక్కన ప్రైవేట్ సంస్థలతో పోటీపడాలి. ఇక్కడ బేరమాడే శక్తి అమ్మకందారుకే (కంపెనీలు) ఉంటుంది. ఈ విధానం ప్రాథ మిక హక్కుల్లో భాగమైన ఆర్టికల్ 14, 21లకు విరుద్ధమని ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు సంస్థలూ ఇప్పుడు కేంద్రానికి ఒక్కో వ్యాక్సిన్ను 150 రూపాయల చొప్పున అమ్ముతున్నాయి. ఉత్పత్తి చేసిన అన్ని వ్యాక్సిన్లనూ 150 చొప్పున అమ్మినా కూడా తాము లాభా ల్లోనే ఉంటామని సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి అదార్ పూనా వాలా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పుకున్నారు. అటు వంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సీరమ్ (కోవిషీల్డ్) 300 రూపా యలకూ, భారత్ బయోటెక్ (కోవాగ్జిన్) 400 రూపాయలకూ అమ్మడమేమిటి? ప్రైవేట్ ఆస్పత్రులకూ, సంస్థలకు 600, 750 చొప్పున అమ్మడమేమిటి? ఇందుకు కేంద్ర ప్రభుత్వం తందానా అంటూ తలాడించడమేమిటి? ఇందులో ఉన్న మర్మమేమిటో ఈ దేశ ప్రజలు తెలుసుకోగోరడం తప్పెలా అవుతుంది? అసలు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్రకటించిన వ్యాక్సిన్ పాలసీని ఎందుకు మార్చినట్టు?. ఈ విధానం ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు తీసుకునే ‘అర్హులందరికీ’ ఉచితం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునే వారు రూ.250 చెల్లించాలి. ఈ ‘అర్హుల’ జాబితాలో వైద్యసిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్, తొలిదశలో 60 యేళ్లు దాటినవారు, తర్వాత 45–60 మధ్యవయసు వారూ ఉన్నారు. ఈ విధానాన్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద, ప్రజల మీద భారం పడేవిధంగా కొత్త పాలసీని తీసుకురావడానికి గల కారణాలేమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ఇక్కడ అతిముఖ్యమైన అంశం... వేగంగా వ్యాక్సిన్లు ప్రజ లందరికీ అందుబాటులోకి తెచ్చేవిధంగా ఉత్పత్తిని పెంచడం. భారతదేశంలో ప్రస్తుతానికైతే ఉత్పత్తి చేస్తున్న సంస్థలు సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ మాత్రమే. ఈ రెండూ కలిసి నెలకు ఏడుకోట్ల వ్యాక్సిన్ల చొప్పున ఉత్పత్తి చేస్తున్నాయి. కనీసం 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేస్తేగానీ భారత్ సామూహిక రోగనిరోధక శక్తి (Herd immunity) సంతరించుకునే దశకు చేరుకోదు. నెలకు ఏడు కోట్ల చొప్పున ఏనాటికి 200 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమయ్యేను? ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇప్పుడు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ టెక్నాలజీని భారత ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు అభివృద్ధి చేసిన విష యాన్ని గుర్తుచేశారు. ఆ టెక్నాలజీని మరికొన్ని సంస్థలకు బదిలీ చేస్తే తప్ప అవసరమైన మేరకు వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసుకో లేమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్య మున్న మరికొన్ని భారతీయ సంస్థలకు టెక్నాలజీని బదిలీ చేయాలని ప్రధానికి ఆయన సూచించారు. భారత ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన విజ్ఞానంపై ప్రైవేట్ సంస్థకు గుత్తాధి పత్యమేమిటో, ఇందులో ప్రజలు తెలుసుకోగూడని చిదంబర రహస్యమేమిటో కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. విజ్ఞానం దేశా నిది, వ్యాపారం ప్రైవేటుది. ఏమిటో ఈ వైచిత్రి. వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖకు దేశవ్యాప్తంగా మద్దతు రావడంతో, కప్పదాటుగానైనా కేంద్రం స్పందించక తప్పలేదు. నిజానికి ఈ కీలకమైన అంశంపై కేంద్రంలోని రాజకీయ నాయ కత్వం స్పందించాలి. అలా స్పందించకుండా నీతిఆయోగ్లో వైద్య–ఆరోగ్య వ్యవహారాలు చూసే వీకే పాల్తో మాట్లాడిం చారు. ఆయన అనేక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్ జగన్ రాసిన లేఖ విషయం ప్రస్తావించకుండా, సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందనీ, అయితే ఆ వ్యాక్సిన్ ఉత్పత్తికి బీఎస్ఎల్–3 సామర్థ్యం ఉన్న కంపెనీలు ఉండాలనీ చెబుతూ రెండు వాక్యాల్లో ఈ అంశాన్ని ముగించారు. అదే రోజున డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి కాబోతున్నదంటూ ఒక కాకి లెక్కను మీడియా ముందుంచి అది ప్రముఖంగా ప్రచారమయ్యేట్టు జాగ్రత్తపడ్డారు. అవసరమైనంత వ్యాక్సిన్ ఉత్పత్తి కాబోతున్నది కనుక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయ వలసిన అవసరం లేదనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కవి హృద యంగా మనం భావించాలి. ఈమేరకు కేంద్రం ప్రకటించిన ఉత్పత్తుల్లో చాలావరకు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ ప్రస్తుతం నెలకు ఆరుకోట్ల డోసులు. దీన్ని ఆగస్టు నాటికి పదికోట్లకు పెంచుతా మని, ఆ తర్వాతి నెలల్లో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి చేస్తామనీ ఆ సంస్థ చెబుతున్నది. ఈ లెక్కన డిసెంబర్ నాటికి 50 కోట్ల డోసులు దాటదు. కానీ, ప్రభుత్వ ప్రతినిధి కోవిషీల్డ్ 75 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భారత బయో టెక్ సంస్థకు ప్రస్తుతం కోటి నుంచి కోటిన్నర వరకు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి అందించిన సమాచారం ప్రకారం ఈ సంస్థ సామర్థ్యం జూలైలో 3.3 కోట్లకూ, ఆగస్టులో 7.8 కోట్లకు పెరగాలి. ఈ ప్రకారం ఆగస్టు–డిసెంబర్ మధ్య ఐదు నెలల కాలంలో 39 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి భారత్ బయోటెక్ ఖాతాలో 55 కోట్ల డోసులు వేశారు. మీడియా సమావేశంలో కేంద్ర ప్రతినిధి సన్నాయి నొక్కుల లెక్క ప్రకారం బీఎస్ఎల్–3 సామర్ధ్యం ఉన్న ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుముట్టే 12 వరకు ఉన్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశం మొత్తంలో ఇంకా ఎక్కువే ఉంటాయి. మనదైన విజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు బదిలీ చేసి పెద్దఎత్తున ఉత్పత్తి చేసే రాచబాటను వదిలేసి, ఈ ఊహాజనిత దారులను ఎందుకు వెతుక్కుంటు న్నారో మనకు అర్థం కాదు. ఒకపక్క మహమ్మారిని ఎదుర్కో వడానికి పేటెంట్ హక్కులను సడలించాలని, విజ్ఞానాన్ని అందరికీ పంచాలని ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం నడుస్తున్నది. ఈ డిమాండ్ను అధికారికంగా చేసిన వంద దేశాల్లో భారత్ ప్రముఖమైనది. అంతర్జాతీయ విధానానికి– దేశీయ విధానానికి మధ్యన ఈ వైరుధ్యమెందుకు? జాతీయ విజ్ఞానాన్ని జాతి ప్రజలకు అంకితం చేయకుండా అడ్డు పడు తున్న ఆ మాయదారి రోగమేమిటో ప్రజలకు తెలియ జెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏపీ వేరియంట్: ఎ రియల్ విలన్!
యుద్ధ సందర్భం. భారతీయులమైన మనం మన రాజ్యాంగ నిర్మాతలెవరూ ఊహించని ఒక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొం టున్నాము. ఒకానొక భయానక వాతావరణం జనం మస్తిష్కా లను స్వాధీనం చేసుకుంటున్న సందర్భం. ఈ పరిస్థితి తలెత్తడా నికి చాలా కారణాలు ఉండవచ్చును. అవి మానవ కల్పిత కార ణాలు కూడా కావచ్చును. పాలకుల వైఫల్యాలూ కారణం కావ చ్చును. జనం నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా నిందించవచ్చును. మనల్ని ఇన్ని ఇక్కట్లపాల్జేస్తున్న దుస్థితి కారణాలపై ఆరా తీసే సమయం ఒకటి త్వరలో వస్తుంది. అప్పుడు ఈ పాపాన్ని ఎవరె వరికి ఎంత చొప్పున పంచి ఇవ్వాలో జనం లెక్క తేలుస్తారు. ప్రస్తుత తక్షణ కర్తవ్యం మాత్రం యుద్ధంలో గెలవడమే. శత్రు దేశాలతో యుద్ధాలు తలెత్తినప్పుడు జాతియావత్తు ఒక్కటై నిలవడం మనకు కొత్తకాదు. ఇప్పుడు కనిపించని శత్రువుతో మొత్తం ప్రపంచమే యుద్ధం చేస్తున్నది. ఈ ప్రపంచయుద్ధంలో పీకల్లోతు మునిగివున్న టార్గెట్ నంబర్వన్ మన దేశమే. మనం మరింత ఐక్యంగా నిలబడాలి. ఇదొక చారిత్రక అవసరం. కోవిడ్పై జరుగుతున్న యుద్ధ వ్యూహాలను సమీక్షించడానికి రెండు రోజుల క్రితం భారత ప్రధానమంత్రి కొందరు ముఖ్య మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. వీరిలో జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రితో సంభాషణ తర్వాత ట్విట్టర్లో సోరెన్ తన కామెంట్ పెట్టారు. ‘ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో ఆయన మన్కీ బాత్ తప్ప పెద్ద విషయమేమీ లేదంటూ’ వెటకారం ధ్వనించేలా ఆ కామెంట్ ఉన్నది. దీనిపై ట్విట్టర్ వేదికగా చాలామంది ప్రము ఖులు తమ అసహనాన్ని, అసమ్మతినీ వ్యక్తపరిచారు. వీరిలో అధికార పార్టీ ముఖ్యులు సహజంగానే ఉంటారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు కూడా సోరెన్ వైఖరిని ఖండించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ట్విట్టర్ వేదికగానే ఆయన సోరెన్కు బదులిచ్చారు. ‘ప్రియమైన సోరెన్, మీరంటే నాకెంతో గౌరవం ఉన్నది. కానీ, ఒక సోదరుడిగా చెబు తున్నా... మన మధ్యన ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు గాక, వాటినిప్పుడు ప్రదర్శించడం భావ్యం కాదు. అది మన జాతిని బలహీనపరుస్తుంద’ని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు రాజకీయవేత్తలను మినహాయిస్తే వైఎస్ జగన్ స్పందనపై నెటి జన్ల నుంచి పెద్దఎత్తున సానుకూలత వ్యక్తమైంది. సోరెన్ వ్యాఖ్యలను తప్పుపట్టినప్పటికీ, కేంద్రం తీరుపై వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏ ఫిర్యాదు లేదని చెప్పడానికి ఎటు వంటి ఆధారమూ లేదు. తమకు నెలకు కోటి డోసుల చొప్పున వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని పలుమార్లు అడిగారు. స్వయాన ముఖ్యమంత్రే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారు. రోజుకు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగలిగే యంత్రాంగం తమకు ఉన్నదని ఒకరోజు ప్రదర్శించి మరీ చూపెట్టారు. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారికి రెండు డోసుల చొప్పున ఇవ్వడానికి 6 కోట్ల 96 లక్షల డోసులు రాష్ట్రానికి కావాలి. కానీ ఇప్పటివరకూ కేంద్రం అందజేసింది కేవలం 73 లక్షల డోసులు. నాలుగు నెలల కాలంలో మొత్తం జనాభాకూ టీకాలు వేయగల వ్యవస్థాగత సామర్ధ్యం ఉన్నప్పటికీ, వాటి కేటాయింపూ, నియంత్రణాధి కారం కేంద్రం చేతిలో ఉన్న కారణంగా నిస్సహాయంగా ఉండి పోవలసి వస్తున్నదనే ఆవేదన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్ల విష యంలోనూ అవసరానికీ, సరఫరాకు మధ్యన వందశాతం తేడా ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతూ సంక్షో భాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ యుద్ధం జరుగుతున్న వేళ జాతి ఐక్యత విచ్ఛిన్నం కాకూడదనే వైఖరినే వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసు కున్నారు. ఈ వైఖరి దేశ ప్రజలకు ఒక కొత్త సందేశాన్ని అంద జేసింది. సంక్షోభ సమయాల్లోనే మనిషి అసలు స్వభావం బయట పడుతుందంటారు. విభేదాలు పక్కనబెట్టి జాతి యావత్తూ ఐక్యంగా నిలబడాలన్న రాజనీతిజ్ఞతను వైఎస్ జగన్ వ్యక్తపరిస్తే, ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వైఖరి ఆయన రాజకీయ ప్రత్యర్థి నుంచి వ్యక్తమైంది. కోవిడ్పై పోరాటం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై నిత్యం నిందారోపణలు చేస్తూ ఫక్తు స్వార్థ రాజ కీయవేత్త స్వభావాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఎల్లో మీడియా సహకారంతో ఆయన, ఆయన పార్టీ చేపట్టిన తప్పుడు ప్రచారం అన్నిరకాల సభ్యతా ప్రమాణాలను దాటిపోయింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తే బాగుండును, రాష్ట్రం అల్లకల్లోల మైతే బాగుండును, ఈ ప్రభుత్వం పడిపోతే, చంద్రబాబును ఏ అదృశ్యశక్తో అధికారంలో కూర్చోబెడితే బాగుండును... అనే ధోరణిలో ఆ పార్టీ ఆలోచన సాగుతున్నది. ఈ అభిప్రాయాలను వాళ్లేమీ దాచుకోలేదు. స్వయానా చంద్రబాబు, ఆయన ప్రతినిధులూ మీడియా సమావేశాల్లో వెళ్లగక్కిన అవాకులే ఇవన్నీ. ఏపీ వేరియంట్ పేరుతో ఒక ప్రమాదకరమైన వైరస్ మ్యూటెంట్ కర్నూలులో కనిపించిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైనదనీ, పదిహేను రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందనీ చంద్రబాబు నిరాధారపూరితమైన తప్పుడు ప్రచారాన్ని లేవదీశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలం గాణ ప్రజలు మా రాష్ట్రాలకొస్తే 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని పక్కరాష్ట్రాలు ప్రకటించాయి. చంద్రబాబు ప్రచా రాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలతో సహా పలువురు వైద్యనిపుణులు ఖండించారు. తనను అధికారానికి దూరం చేసిన ప్రజల మీద ఆయన కక్షబూనారేమోననిపిస్తున్నది. లేకపోతే జనంలో కల్లోలా నికి దారితీసే ఇటువంటి ప్రచారాన్ని ఇంత బాధ్యతారాహి త్యంతో ఎలా చేపట్టగలుగుతారు? తనకు దక్కని యువతి మరొకడికి దక్కకూడదంటూ యాసిడ్ చల్లే ప్రేమోన్మాదానికి, ఈ దుష్ప్రచారానికి తేడా ఏమైనా ఉన్నదా? మా నాయకుడికి ఒక వారం రోజులు అధికారం ఇచ్చి చూడండి అంటూ ఆ పార్టీ ప్రతి నిధులు మీడియా సమావేశాల్లో దేబిరించేందుకు దారితీసిన నిస్పృహకు కారణాలేమిటి? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభానికి దారితీసిన చారిత్రక పరిణామాల్లోనే ఈ స్వార్థ రాజకీయ శక్తుల కేరాఫ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. వాటి నేటి నిస్పృహకు కారణాలూ కనిపిస్తాయి. బ్రిటీష్వాళ్లు మన ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పిచేసిన కారణంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆరోగ్య రంగానికి మన దేశం పెద్దగా కేటాయింపులు చేయలేకపోయింది. జీడీపీలో ఒక్కశాతం మాత్రమే ఖర్చుపెట్టేవాళ్లు (ప్రభుత్వ వ్యయం ఇప్పుడు కూడా అంతే). అయినప్పటికీ పరిమిత సంఖ్యలోనైనా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవి. అందులో డాక్టర్, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేవాళ్లు. అత్యవసర మందులు లభ్యమ య్యేవి. ప్రతి గ్రామంలోనూ ఒకరో ఇద్దరో సంప్రదాయ వైద్యులు ఉండేవాళ్లు. ఊళ్లో ఎవరికి ఏ జబ్బు ఉందో, ఏ వైద్యం అవసరమో వీరికి తెలిసేది. జాతీయోద్యమం, సేవాభావాలతో ప్రభావితులైన కొత్తతరం డాక్టర్లు క్రమంగా చిన్నపట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులను నెలకొల్పారు. గ్రామీణ సంప్రదాయ వైద్యులు ఆర్ఎంపీలుగా, పీఎంపీలుగా రూపాంతరం చెందారు. వారికి పట్టణాల్లోని డాక్టర్లు కనీస వైద్యరీతులపై ఆధునిక శిక్షణ ఇచ్చేవారు. వైద్యునికి–రోగికీ మధ్యన ప్రత్యక్ష సంబంధం కొన సాగింది. వైద్యం ప్రజలకు తలకు మించిన భారంగా పరిణమిం చలేదు. ముప్పయ్యేళ్ల కింద దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారం భమయ్యేంతవరకూ ఈ పరిస్థితి కొనసాగింది. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరగడం మొదలైంది. పెరుగుతున్న సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం మొదలైంది. విద్య, వైద్యం సహా సమస్త జీవన రంగాలు వ్యాపార చట్రంలో బిగుసుకొని పోయాయి. కార్పొరేటీకరణ పొందిన వైద్యం పల్లెల్లో కనుమరు గైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాడుబెట్టారు. డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు పేషెం ట్లను తీసుకొని వచ్చే కమీషన్ ఏజెంట్లుగా ఆర్ఎంపీలను, పీఎంపీలను మార్చివేశారు. సంప్రదాయ వైద్యం అప్పటికే అంత రించిపోయింది. దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా పట్టణాల్లోని పెద్దాసుపత్రికి వెళ్లితీరాల్సిన దిక్కుమాలిన పరిస్థితి నెలకొన్నది. రోగం వస్తే అప్పులపాలు కావడం తప్ప మరో దారి లేని రోజులు ఆరోగ్యశ్రీ వచ్చేవరకూ కొనసాగాయి. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు హాలాహలం పుట్టినట్టే, ఆర్థిక సంస్క రణల ఫలితంగా సంపదతోపాటు స్వార్థం కూడా వృద్ధి చెందింది. నయా సంపన్నవర్గాలు సంపదను కేంద్రీకృతం చేసు కోవడానికి పోటీపడ్డారు. వీరికి అండగా ఒక నయా రాజకీయ నాయకత్వం పుట్టింది. కొత్త సంపన్నవర్గాలకు ఊడిగం చేయడం ఈ సరికొత్త రాజకీయ నాయకత్వం ప్రథమ కర్తవ్యం. ఈ నాయకుల సేవలకు మెచ్చి ప్రపంచ సంపన్నవర్గాలు వీరికి సంస్కరణల చాంపియన్లుగా బిరుదులిచ్చాయి. ఈ చాంపి యన్లలో అగ్రస్థానం అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుది. ప్రభుత్వరంగంలో కొత్త వైద్యకళాశాలలు రాకుండా, హాస్పిటల్లు తెరవకుండా, వైద్యులను భర్తీ చేయ కుండా, ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండా ప్రభుత్వ వైద్యరంగాన్ని పాడెపైకి చేర్చిన ఘనత, కార్పొరేట్ వైద్యసేవలో తరించిన కీర్తి ఆయనది. ఇప్పుడు మహమ్మారి విరుచుకుపడిన వేళ ప్రభుత్వ వైద్యరంగం చిగురుటాకులా వణికిపోవడానికి ఈ రాష్ట్రంలో ప్రధాన కారకుడు ఆయనే. ప్రభుత్వ వైద్యరంగం బలంగా ఉన్నట్లయితే ఇంతటి దారుణమైన పరిణామాలు సంభ వించేవి కావని ఇప్పుడు అందరూ చెబుతున్న మాట. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బహుశా ఒక వారం కూడా గడవకపోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని పునరుజ్జీవింపజేసే ఆలోచన లతో ‘నాడు–నేడు’ పేరుతో ఒక విజన్ను వాళ్లతో ఆయన పంచు కున్నారు. అప్పటికింకా కరోనా ఊసు మనం వినలేదు. కానీ వైద్యం ప్రజలకు సంక్రమించవలసిన ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ అందుకోసం ఒక బృహత్తరమైన అభివృద్ధి ప్రణాళికను ఆయన తయారుచేసుకున్నారు. ప్రభుత్వరంగంలో 16 కొత్త మెడికల్ కాలేజీలను ప్రకటించారు. హుటాహుటిన 12 వేల మంది కొత్త వైద్యసిబ్బందిని నియమించారు. కోవిడ్ను ఎదు ర్కొనేందుకు చేసిన నియామకాలు అదనం. 108, 104 సేవల కోసం మండలానికి రెండు అంబులెన్స్లను కొత్తగా ప్రవేశ పెట్టారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ క్లినిక్ ఉండే ఏర్పాటు చేశారు. మారుమూల పల్లెలోని ప్రతి కుటుంబం, ఆ కుటుంబం లోని ప్రతి సభ్యుడూ నిరంతరం వైద్యపర్యవేక్షణలో ఉండే విధమైన ‘ఫ్యామిలీ డాక్టర్’ వ్యవస్థ ఏర్పాటు తన తుది లక్ష్యమని అధికారులతో ముఖ్యమంత్రి తరచూ చెప్పుకొస్తున్నారు. ఈ సంక్షోభం దాపురించకపోయినట్లయితే ఈ దారిలో మరిన్ని అడు గులు వేసి ఉండేవారు. ఇప్పటికే ఏర్పాటయిన వ్యవస్థ కారణం గానే ఒకేరోజున 6 లక్షలమందికి రాష్ట్ర ప్రభుత్వం టీకాలు ఇప్పిం చగలిగింది. ఇప్పుడు కోవిడ్ సంక్షోభాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ప్రతిరోగికీ ఉచిత వైద్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఆర్థిక సంస్క రణల తర్వాత మూడు దశాబ్దాల కాలంలో సగం రోజులు చంద్రబాబే అధికారంలో ఉన్నాడన్నది వాస్తవం. ఆయన హయాం లోనే ప్రభుత్వ వైద్యరంగం శిథిలమైందన్నది నిఖార్సైన నిజం. భర్తకు జబ్బుచేస్తే భార్య పుస్తెలు, భార్యకు జబ్బు చేస్తే భర్త కిడ్నీలు అమ్ముకొని ఆస్పత్రుల బిల్లులు కట్టిన దౌర్భాగ్యపు రోజులను ఆయన కాలంలోనే చూశామన్నది ఒక కఠిన వాస్తవం. కొనఊపిరితో ఉన్న ప్రభుత్వ వైద్య రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసింద న్నది దాచేస్తే దాగని సత్యం. నిప్పులాంటి ఈ నిజాల మీద ఎందుకు నివురుగప్పుతున్నారు? ఎందుకంటే, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక వేరి యంట్. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కొత్త రూపం. నయా సంపన్నవర్గాల ప్రయోజనాల కోసమే మ్యూటేట్ అయిన వేరియంట్. ఈ రాజకీయ వేరియంట్కు స్వార్థమే పరమార్థం. రాజధాని పేరుతో ప్రారంభించిన తమ ట్రెజర్ హంట్ ఆగి పోయిందన్న నిస్పృహతో ఆ వేరియంట్ అల్లాడుతున్నది. అరా చకంగా ప్రవర్తిస్తున్నది. ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఈ ఏపీ వేరియంటే ఇప్పుడు నిజమైన విలన్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పావలా గారడీ!
తెలుగుదేశం పార్టీ కథ మౌసలపర్వంలోకి ప్రవేశించింది. ఈ పర్వానికి ముగింపు మునగడం మాత్రమే! ఆ మునక ఎలా ఉండాలన్నదే ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాద్ధాంతం. తాను కోరుకున్న ముహూర్తానికే తనువు చాలించిన భీష్మాచార్యుని మాదిరిగా పార్టీ ముగింపు ఉండాలని అధినేత అభిమతంగా పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఎవరు కోరుకున్న విధంగా ఉండాలి? అధినేత అండ్ ఫ్యామిలీ కోరుకున్న విధంగానా? పార్టీ నాయకశ్రేణి కోరుకునే విధంగానా?. పార్టీని బేషరతుగా కేంద్ర పార్టీకి అద్దెకివ్వడాని కైనా, టోకున అమ్మివేయడానికైనా సిద్ధంగానే ఉన్నట్టు రూలింగ్ ఫ్యామిలీ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని అందజేసింది. అద్దె ప్రసక్తి లేదనీ, పూర్తి స్వాధీనానికే తాము మొగ్గు చూపుతున్నామని ఢిల్లీ నుంచి కబురందిందట. అది కూడా మహాభాగ్యమే. కాకపోతే మావి రెండు విన్నపాలు మన్నించాలని ఇటువైపు నుంచి కూడా ఓ మహజరు వెళ్లిందట. ఫ్యామిలీ హెడ్డు తన శరీరానికంటిన అవినీతి పంకిలాన్ని కడిగేసుకునేందుకు అనుమతినివ్వాలి. ఎటు వంటి కేసులూ పెట్టకూడదు. హెడ్డుగారబ్బాయికున్న శక్తి సామ ర్థ్యాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక మంచి పదవిని కట్టబెట్టాలి. ప్రస్తుతానికి కథ ఈ మజిలీలో ఉందట. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ‘అంతేగా... అంతేగా..’ అంటారనుకున్న పార్టీ నాయకులు ‘అదెట్లా... అదెట్లా..’ అనడం మొదలుపెట్టా రట. అధినేతలో ఇది కలవరాన్ని కలిగిస్తున్నది. ఈ టోకు బేరం మీద ప్రధానంగా రెండు రకాల ఆలోచనా స్రవంతులు పార్టీలో ఉన్నాయి. మొదటి వర్గం టోకు బేరానికి ఓకే. కాకపోతే ఆ బేరంలో తమకూ ప్రమేయం ఉండాలి. పునరా వాసం పథకం తమకూ గొప్పగా వర్తించాలి. ఈరకమైన ధోర ణిని ‘అచ్చి’బాబు ఆలోచనా విధానంగా పార్టీలో పిలుచుకుం టున్నారు. మరోవర్గం వారు పార్టీని స్వతంత్రంగా ఉంచాల్సిందేనని గొణగడం మొదలుపెట్టారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారిని మళ్లీ తీసుకొద్దామనీ, అవసర మైతే వారికి నాయకత్వం అప్పగిద్దామని కూడా వీరు ప్రబోధి స్తున్నారు. ఈరకమైన భావధారను ‘బుచ్చి’బాబు ఆలోచనా విధానంగా చెప్పుకుంటున్నారు. ఈ రెండువర్గాలే కాకుండా, ఇంకొందరు గజపతులూ, అశ్వపతులూ, నరపతులూ తదితరు లున్నారు. వీరంతా నిర్లిప్త మానసిక స్థితిలోకి జారుకుంటు న్నారు. బహుశా వీరంతా రాజకీయాలకు దూరం కావచ్చు. పార్టీ నాయకుల్లో చాలామంది ఇప్పుడు బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. మొన్నటి ప్రాదేశిక ఎన్నిక లను బహిష్కరించాలని అధినేత ఇచ్చిన పిలుపును నాయ కులూ, కార్యకర్తల్లో తొంభై శాతం మంది బేఖాతర్ చేశారు. మొన్న తిరుపతిలో బయటపడ్డ అచ్చెన్నాయుడు వీడియోలు ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితులకు అద్దం పట్టాయి. పార్టీ రాష్ట్ర శాఖకు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా విలీనాలు, పొత్తుల వ్యవ హారాలన్నీ తండ్రీకొడుకులే చూసుకుంటున్నారన్న దుగ్ధ అచ్చెన్న మనసులో ఉన్నదని చెబుతారు. అసంతృప్తిని ఆయన దాచుకోలే కపోతున్నారు. పార్టీ లేదు, బొక్కా లేదు.. పదిహేడో తారీఖు తర్వాత అసలు మిగలదని ఆయన కామెంట్ చేశారు. చిన బాబును ఉద్దేశించి ‘అతను బాగుంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుం దని’ కూడా అచ్చెన్న మాట్లాడటం పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. మరో సీనియర్మోస్ట్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి కూడా ఇటీవల గొంతు విప్పారు. పార్టీలోకి కొత్త నాయ కత్వాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ను కూడా తీసుకొస్తామని చెప్పారు. జూనియర్ పేరు చెబితే చినబాబు ఉడుక్కుంటారట. ఆయన దగ్గరకు వెళ్లి జూని యర్ వేస్ట్, మీరే గ్రేట్ అంటే చాలట. ఏ పనైనా జరిగిపోతుందని పార్టీలో బహిరంగంగానే చెప్పుకుం టారు. కొంతమందైతే మాయాబజార్ సినిమాలోని శకుని మామ టెక్నిక్ను కూడా ఉపయోగిస్తారట. శకుని మామ లక్ష్మణ కుమారుని (దుర్యోధనుని కొడుకు) దగ్గరకు వెళ్తాడు. ‘నేనూ, మీ నాన్న, పెద్దలందరం కలసి నీకు పెళ్లి చేయాలని నిశ్చయిం చాము. వధువు బలరాముని కుమార్తె శశిరేఖ’ అని చెప్పాడు. ‘ఛీఛీ... నేను చేసుకోను’ పొమ్మంటాడు లక్ష్మణ కుమారుడు. ‘అయితే గొప్ప చిక్కేనే... ఆ కన్యను అభిమన్యుడు వలచాడట’ శకుని మామ చిట్కాను ప్రయోగిస్తాడు. వెంటనే లక్ష్మణ కుమా రుని మూడ్ మారుతుంది. ‘అభిమన్యుడెవరు వలచడానికి, నేనే శశిరేఖను పెళ్లి చేసుకుంటా’నంటాడు. ఇదీ శకుని మామ టెక్నిక్. తెలుగుదేశం పార్టీ కనీసం ఇప్పుడున్న స్థితిలోనైనా ఇంకెంతోకాలం మనజాలదని ఆ పార్టీలోని సాధారణ సభ్యుని దగ్గర నుంచి అధినేత స్థాయి వరకు అందరికీ తెలుసు. ఆ పార్టీ కథకు ఎప్పుడు ముగింపు పలుకుతారు? ఎలా పలుకుతారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే విషయం. ముగింపు పలకడానికి ముందుగా తన పార్టీ రాష్ట్రంలో ఇంకా బలంగానే ఉన్నదనీ, పార్టీ నాయకులూ, కార్యకర్తలూ ఏకతాటిపై నిలబడి ఉన్నారనే అభి ప్రాయాన్ని టేకోవర్ చేయబోయే పార్టీకి కలిగించాలని అధినేత తాపత్రయపడుతున్నారు. కానీ, అసంతృప్తులు, అలకలు, లుక లుకలూ, ధిక్కారాలు రోజురోజుకూ ఎక్కువ కావడం ఆయనకు కలవరాన్ని కలిగిస్తున్నది. బేరం కుదిరేవరకైనా ఈ పార్టీని ఐక్యంగా ఉంచగలనా లేదా అన్న సంశయం పీడిస్తున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు పడ్డాయి. ఎన్నికల సమయాన ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఒకటి రెండు శాతం ఓట్లు తగ్గినా, ఇప్పటికీ రాష్ట్రంలో తనకు 40 శాతం ఓటర్ల బలముందని ఆయన చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల తన పార్టీ అసలు బలం బయటపడిపోతుందని ఆయన చాలా ఆందోళనకు గురయ్యారు. అందువల్లనే అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని నానాయాగీ చేశారు. పార్టీ గుర్తులేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు నలభై శాతం గ్రామాలు గెలిచామని ఆదరా బాదరా ప్రెస్మీట్లు పెట్టి తండ్రీకొడుకులిద్దరూ ప్రకటించుకు న్నారు. వాస్తవానికి ఆ పార్టీ మద్దతుదార్లు 16 శాతం గ్రామాల్లోనే గెలిచారు. మొత్తం ఓట్లలో 26 శాతం వాటా మాత్రమే దక్కింది. అధికారికంగా పార్టీ రహిత ఎన్నికలు కనుక దబాయింపులతో మీడియా సహకారంతో పరువు దక్కించుకునే ప్రయత్నం చేశారు. పల్లెటూళ్లతో పోల్చితే పట్టణాల్లో తనకు మద్దతు ఎక్కు వుంటుందని అధినేత ఆశపెట్టుకున్నారు. కానీ మునిసిపల్ ఎన్ని కల్లో ఆయనకు 30 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ అవ మానకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి మునిసిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే పాటను అందుకున్నారు. సొంత మీడియా వంతపాడింది. ఇదెంత అసహ్యకరమైన ఆరో పణంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఇంత ప్రశాంత వాతావరణంలో ఎప్పుడూ జరగలేదు. ఇందుకు పోలీసు రికార్డులే సాక్ష్యం. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మునిసి పల్ ఫలితాల కంటే దారుణంగా ఉండబోతున్నాయన్న గ్రహింపుతో వాటిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, బ్యాలెట్ పేపర్లలో ఆ పార్టీ గుర్తులున్నాయి. అభ్యర్థులు రంగంలోనే ఉన్నారు. ప్రచారాన్ని కూడా చేసుకున్నారు. తిరుపతి లోక్సభ స్థానం ఉపఎన్నికలోనూ అదే తీరును అధినేత ప్రదర్శించారు. ఇక్కడ గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు సంపాదించాలని సర్వశక్తులూ కేంద్రీకరించారు. ‘ఈ గడ్డమీద పుట్టాను. ఈ నేల నాది ఈ గాలి నాది ఈ నీరు తాగి పెరిగాను’ అంటూ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేశారు. పోలింగ్కు ఒక వారం ముందు స్వయంగా ఒక సర్వేను చేయించుకున్నా రట. సర్వే ఫలితాన్ని చూసి పితాసుతులు హతాశులయ్యారట. అక్షరాల ఇరవై రెండు శాతం ఓట్లు మాత్రమే తిరుపతిలో రాబో తున్నాయని ఆయన జరిపించుకున్న సర్వే తేటతెల్లం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిన విశ్వసనీయ భోగట్టా. ఆరోజు నుంచి అధినేత స్వరం అపస్వరాలు మాత్రమే పలకడం మొదలుపెట్టింది. తన మీద రాళ్ల దాడి జరిగిందని అర్ధరాత్రి దాకా ఒక నాటకాన్ని నడిపించారు. అది పండలేదు. పత్తర్ కా గోష్ ఉడకలేదు. కనీసం 25 శాతం ఓట్ల యినా ఈ ఉపఎన్నికలో చూపించకపోతే పార్టీ మెషినరీని తుక్కు కింద కొంటారు తప్ప కంపెనీ లెక్కన ఎవరు కొంటారు? పార్టీకి లభించబోయే ఓట్లను 25 శాతం దాటించడానికి ఆరోజు నుంచి ఆయన నానాతంటాలు పడుతున్నారని వినికిడి. ఈ పూర్వరంగ మంతా తెలిసినవాడు కనుకనే అచ్చెన్న 17వ తేదీ తర్వాత పార్టీ ఖేల్ ఖతమ్ అన్న ధోరణిలో మాట్లాడారు. తమ నాయకుడికి ప్పుడు కావల్సింది గెలుపు కాదు. కేవలం పావలా పర్సెంటేజీ ఓట్లు! నౌ హి ఈజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఏ పావలా!. కానీ, ఆయన ఆ పావలా విలువ తెలిసిన నాయకుడు. పావలాతో రాజకీయ బేరసారాలు చేయవచ్చు. పొత్తులు కుదుర్చుకోవచ్చు. మిత్రులను సంపాదించుకోవచ్చునని నిరూపించినవాడు. ఇప్పు డదే పావలా పర్సెంటేజీతో పార్టీకి మంచి బేరం తెచ్చే ప్రయ త్నంలో ఉన్నారు. ఆ పర్సెంటేజీ వోట్ల కోసం ఆయన చేయ వలసిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇందుకోసం మూడో కూటమి లోని రహస్య మిత్రులతో మాట్లాడుకున్నారని కూడా వినికిడి. కూటమి అభ్యర్థికి 10 శాతం ఓట్లు కూడా దక్కకపోతే ఇలాంటి దేదో జరిగినట్టు అనుమానించాల్సి వస్తుందని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయినా అనుమానం ఒకపక్క పీడిస్తూనే ఉన్నట్టుంది. తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు పోలవుతున్నా యనీ, వేరే ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలించారనీ అనుంగు మీడియాలో హోరెత్తించారు. అందుకు సాక్ష్యంగా ఓ కల్యాణ మండపం ముందు ఆగిఉన్న టూరిస్టు బస్సును చూపె ట్టారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో టూరిస్టు బస్సు కనిపించడం కూడా వింతేనా? తిరుపతిలో ఏకపక్షంగా వైసీపీకి ఓట్లు పడతా యని తన సర్వేలోనే వెల్లడైనందున, ఈ ఎన్నికకు మసిపూసే ఉద్దేశంతోనే ఎల్లో సిండికేట్ సాకారంతో ఓ పథకం ప్రకారం పోలింగ్ రోజున కథ నడిపినట్టు కనిపిస్తూనే ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదికాలాల పాటు ప్రకాశించవల సిన రాజకీయ పార్టీ నలభయ్యేళ్లు నిండకముందే బలికావలసి వచ్చే పరిస్థితి అత్యంత దురదృష్టకరం. అధినేతగా వున్న వ్యక్తి తన స్వప్రయోజనాలకోసం పార్టీని బలిచేయడం సులభమైన విషయమైతే కావచ్చు. కానీ, పార్టీని స్థాపించడం, దానిని ప్రజా క్షేత్రంలో నిలబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా నాయకత్వ ఆకర్షణ శక్తి, వ్యూహ చాతుర్యాల మీద ఆధారపడే ప్రాంతీయ పార్టీల విషయంలో వాటి నిర్వహణ కత్తిమీద సాము లాంటిది. పార్టీ నాయకుని జనాకర్షణ శక్తి, వాగ్ధాటి, వ్యక్తిత్వా లతోపాటు చారిత్రక సందర్భం కూడా కలిసిరావాలి. ఎన్టీ రామారావుకు అటువంటి సందర్భం కూడా కలిసివచ్చింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికార పీఠాన్ని ఎక్కిం చగలిగారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలకు మరింత చేరు వగా తీసుకునిపోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజ లందరూ పాల్గొనగలిగే అవకాశాలను కల్పించడం ప్రజా ప్రభుత్వాల కర్తవ్యం. సామాజిక–ఆర్థిక అంతరాలు విపరీతంగా వున్న భారతదేశం లాంటి దేశాల్లో ఈ కర్తవ్య నిర్వహణే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలోనే పయనించాయి. కొన్ని నెమ్మదిగా, కొన్ని కొంత వేగంగా కదిలాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం వేగంగానే కదిలింది. అప్పటివరకూ అధికార పీఠాలకు దూరంగా వున్న కొన్ని వర్గాలను ఆయన చేరువ చేయగలిగారు. ప్రభుత్వాధికారులంటే ప్రజల్లో ఉండే భయాన్ని పోగొట్టి అధి కార వికేంద్రీకరణను ప్రారంభించగలిగారు. ప్రజల ఆకలి దప్పులు తీర్చడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రజా పునాదిని ఆయన నిర్మించ గలిగారు. వెన్నుపోటు దెబ్బతిని పదవీచ్యుతుడయ్యేనాటికి తెలు గుదేశం పార్టీకి సుమారు 45 శాతం ఓటు బ్యాంకును ఎన్టీఆర్ స్థిరపరిచారు. ఎన్టీఆర్ను గద్దె దింపి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధినేత పయనం ఎన్టీఆర్ ప్రయాణానికి పూర్తి అపసవ్యదిశలో సాగింది. ఆస్తులు–అంతస్తులు పెంచుకోవడానికీ, అధికారం లోకి రావడానికి ఆయన అనైతిక పద్ధతులను అనుసరించారు. వచ్చిన అంతస్తును, అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ, పెంచు కోవడానికీ ఆయన అవాంఛనీయమైన విధానాలను అవలం బించారు. సొంత ప్రయోజనాలకోసం రాజ్యాంగ వ్యవస్థలను వినియోగించుకోవడానికి మ్యానిపులేషన్ మార్గాన్ని ఎంచు కున్నారు. ఫలితంగా ఎంత విషాదకర పరిణామాలు సంభ వించాయో వర్తమాన చరిత్ర గమనించింది. అధికార పీఠాలకు సాధారణ ప్రజలను దూరం చేశారు. ఓట్ల కొనుగోలులో ఆంధ్ర ప్రదేశ్ జాతీయ రికార్డులను బద్దలు కొట్టి అపఖ్యాతి మూట గట్టుకోవడం పూర్తిగా ఈ నాయకుని ఘనతే. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న తర్వాత జనబలం లేని ఆయన ఎన్నికలను ఎదుర్కోవడం కోసం కళ్లు చెదిరే ఎన్నికల ఖర్చుకు తెరతీశారు. అప్పటినుంచే సంఘసేవకులు, నైతిక నియమాలకు కట్టు బడేవారు రాజకీయాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు డబ్బున్న వాళ్లకే పరిమిత మయ్యాయి. పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన మూడు దశాబ్దాల దూరం జరిగింది. ఆయన వైఖరి ఫలితంగా పార్టీకి ప్రజలు వేగంగా దూరమయ్యారు. ఒకటి రెండు సందర్భాల్లో జాతీయ పరిణా మాలను గమనించి అవకాశవాద పొత్తులతో అర్థిమెటిక్ విజ యాలను సాధించినా అసలు బలం సన్న గిల్లుతూనే వస్తున్నది. ఇప్పుడు తన బలాన్ని 25 శాతం దగ్గర నిలబెట్టి లాభసాటి బేరం చేయడం కోసం ఆఖరి పోరాటం చేస్తున్నారు. పార్టీలోని నాయకశ్రేణులూ, కార్యకర్తలూ ఈ వ్యవహారా లన్నీ గమనిస్తున్నారు. కొద్ది రోజుల్లో పార్టీ అంతర్గత పరిణా మాలు వేగం పుంజుకోవచ్చు. ఒక సూపర్హిట్ తెలుగు సినిమా గుర్తుకొస్తున్నది. దేవలోకంలో స్విమ్మింగ్ పూల్ లేని కారణంగా ఇంద్రుని కూతురు శ్రీదేవి భూలోకానికి వస్తుంది. స్విమ్మింగ్ తర్వాత అంగుళీయకాన్ని (ఉంగరాన్ని) మరిచిపోయి వెళ్లి పోతుంది. సదరు అంగుళీయకం చిరంజీవికి దొరుకుతుంది. ఆమె దేవకన్య కనుక, పోయిన ఉంగరం ఎవరి దగ్గరుందో తెలుసుకుంటుంది. ‘ఈ మానవునితో అచ్చికబుచ్చికలాడి, మచ్చిక చేసుకుని అంగుళీయకమును గ్రహించవలె’నని నిశ్చ యించుకుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత పరిస్థితి కూడా అదే. అలకలతో ఉన్న పార్టీ నాయకులతో ‘అచ్చి’క ‘బుచ్చి’కలాడి అచ్చెన్న–బుచ్చెన్న ఐడియాలజీస్తో సమ న్వయం చేసుకుంటే తప్ప తాను కోరుకున్న అంగుళీయకం దొర కదు. దాని ఖరీదు పావలా పర్సెంట్. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com