world test championship
-
టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలుఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.వరుసగా రెండుసార్లు ఫైనల్కు.. ఈసారి మాత్రంముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్వాష్కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్కు చేరుకోలేకపోయింది.ఈ మెగా ఈవెంట్ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.ఆసీస్ వర్సెస్ ప్రొటిస్ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.సుమారు రూ.45 కోట్లు నష్టంఅయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.చదవండి: కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ శర్మనే..! -
‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా
జొహన్నెస్బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్లో మొదలుకానుంది. జూన్లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్ఏటి20’ టోర్నీకి కమిషనర్గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతామని చెప్పాడు. గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. -
ఆస్ట్రేలియా ఆధిపత్యం.. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్ర
శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. తద్వారా పద్నాలుగేళ్ల తర్వాత లంక గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలుపును నమోదు చేసింది. అంతేకాదు.. మరో అరుదైన ఘనతనూ తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్లో ఇప్పటికే ఆసీస్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.స్మిత్ కెప్టెన్సీలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడింది. గాలె వేదికగా జరిగిన ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.స్మిత్ కెప్టెన్సీలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. లంకను 257 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ స్మిత్(131)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(156) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 414 పరుగులు చేసింది.ఆ తర్వాత శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ బృందం కేవలం ఒక వికెట్ కోల్పోయి కథ ముగించింది. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్రకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియాకు ఇది 33వ విజయం. తద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా 2019లో డబ్ల్యూటీసీ మొదలుకాగా.. ఇప్పటి వరకు 53 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా 33 విజయాలు సాధించి.. పదకొండు మ్యాచ్లలో ఓడిపోయింది. తొమ్మిది మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. 65 మ్యాచ్లు పూర్తి చేసుకున్న స్టోక్స్ బృందం 32 మ్యాచ్లలో గెలిచి.. 25 మ్యాచ్లలో ఓడింది. ఎనిమిది మ్యాచ్లు డ్రా చేసుకుంది.మూడో స్థానంలో టీమిండియాఇక డబ్ల్యూటీసీ తొలి రెండు సీజన్లలో ఫైనల్కు చేరగలిగిన టీమిండియా మూడో స్థానంలో ఉంది. 56 మ్యాచ్లకు గానూ 31 గెలిచి.. 19 ఓడి.. రెండు డ్రా చేసుకుంది. కాగా డబ్ల్యూటీసీ అరంగేట్ర విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో సీజన్లో ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక తాజా ఎడిషన్లో టైటిల్ కోసం ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. లంకతో సిరీస్కు ముందే డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్ జట్టు చివరకు 67.54 విజయాల శాతంతో రెండో స్థానం దక్కించుకుంది. రెండేళ్ల వ్యవధిలో 19 టెస్టు మ్యాచ్లు ఆడిన ఆసీస్ 13 విజయాలు, 4 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా 69.44 విజయాల శాతంతో పట్టిక ‘టాప్’ ప్లేస్ దక్కించుకుంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. గత రెండు పర్యాయాలు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు 50.00 విజయాల శాతంతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైంది. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.బవుమా అలాంటి వాడు కాదు‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.గెలుపు మాదేనని భావిస్తున్నాఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్గా గ్రేమ్ స్మిత్కు అరుదైన ఘనత ఉంది.ఆసీస్పై స్మిత్కు ఘనమైన రికార్డుస్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: BCCI: గంభీర్పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగిన ఐదో టెస్ట్లో కమిన్స్ ఈ ఫీట్ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్లో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్లో 9 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్లో ఆసీస్ స్పీడ్స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భారత్ మిస్
టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్(WTC Final) ఆశలు ఆడియాశలు అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్లో భారత్ ఫైనల్కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది.ఆ తర్వాత సైకిల్(2021-23)లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్లో 19 మ్యాచ్లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హతసాధించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్లు ఆడిన ఆసీస్.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్ -
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్.. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించిం భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా బోలాండ్ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్ల సిరీస్లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. -
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్(India) ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 1-2 వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్లో యశస్వి జైశ్వాల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్లలోనూ జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే..డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ బెర్త్ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి పడిపోయింది.మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుత సైకిల్లో భారత్కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా మూడు మ్యాచ్లు ఆడనుంది. భారత్తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కంగారులు తలపడనున్నారు. అయితే భారత్కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టుల సిరీస్లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్కు ఫైనల్కు చేరే అవకాశముంటుంది. లేదా రెండు మ్యాచ్ల 0-0 డ్రాగా ముగిసిన భారత్కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్ -
చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచలనం విజయం సాధించిన ప్రోటీస్.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది.ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్ బౌలర్ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధనలో ప్రోటీస్ 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రబాడ, మార్కో జానెసన్ విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో స్పెషలిస్టు బ్యాటర్ అవతరమెత్తిన రబాడ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రబాడ అరుదైన ఘనత..విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్బర్గ్లో ఇంగ్లండ్పై పదో వికెట్కు బ్యాటింగ్కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్ -
సన్నగిల్లుతున్న భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు
భారత్, ఆస్ట్రేలియా ఆ మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట నువ్వా నేనా అన్నట్టు సాగింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక దశలో కేవలం పదకొండు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ ని ఆధిపత్యాన్ని అందించాడు. లంచ్ విరామం తర్వాత బుమ్రా చెలరేగిపోయి మొదట ఆస్ట్రేలియా తరుఫున ఈ సిరీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన ట్రావిస్ హెడ్ ని ఒక పరుగుకే పెవిలియన్ పట్టించాడు.దీంతో బుమ్రా తన టెస్ట్ కెరీర్ లో రెండు వికెట్ల రికార్డు ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా అతి తక్కువ సగటుతో ఈ రికార్డు ని నెలకొల్పడం విశేషం. బుమ్రా 20.29 సగటు తో కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మాల్కం మార్షల్ 20.94 సగటు తో నెలకొల్పిన రెకార్డ్ ని అధిగమించి ఈ రికార్డ్ ని సాధించడం గమనార్హం. బుమ్రా నాలుగు బంతుల వ్యవధిలో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్షల్ ని డకౌట్ చేసాడు. బుమ్రా తన తర్వాత ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీని రెండు పరుగులకు అవుట్ చేసాడు. ఈ దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది.మూడు క్యాచ్ లు జారవిడిచిన జైస్వాల్ అయితే భారత్ యువ బ్యాట్స్మన్ యశస్వీ జైస్వాల్ ఈ దశలో రెండు కీలకమైన క్యాచ్ లు జారవిడవడం తో ఆస్ట్రేలియా కి అదృష్టం కలిసి వచ్చింది. ఇందులో అత్యంత కీలకమైన మార్నస్ లబుషేన్ క్యాచ్ కూడా ఉండడం గమనార్హం. అప్పటికి ఇంకా తన ఖత కూడా తెరవని లబుషేన్ ఆ తర్వాత ఏకంగా 70 పరుగులు సాధించి ఆస్ట్రేలియా తరఫున ఈ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ సాధించడమే గాక కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఏడో వికెట్ కి 59 పరుగులు జోడించడం విశేషం. జైస్వాల్ ఆ తరువాత స్పిన్నర్ అజయ్ జడేజా బౌలింగ్ లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ని కూడా జారవిడిచాడు. ఈ మూడు క్యాచ్ లు భారత్ విజయావకాశాలను దెబ్బతీసాయనడంలో సందేహం లేదు. జైస్వాల్ క్యాచ్ లను జారవిడవడం పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు.అప్పటికి భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో పట్టు బిగించే పరిస్థితి లో ఉంది. అయితే లబుషేన్, కమిన్స్ లు అవుటైన అనంతరం నాథన్ లియాన్ (41 నాటౌట్) మరియు స్కాట్ బోలాండ్ (10 పరుగులతో నాటౌట్) చివరి వికెట్ కి మరో 55 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు.దీనితో ఆస్ట్రేలియా ఆధిక్యం ౩౩౩ పరుగులకి చేరుకొంది. ఆట చివరి రోజున ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడం భారత్ బ్యాట్స్మెన్ కి అంత సులువు కాకపోవచ్చు. అసలే తడబడుతున్న భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ చివరి రోజున ఎలా రాణిస్తారో చూడాలి.గత వారం బ్రిస్బేన్లో జరిగిన డ్రా తర్వాత భారత్ యొక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల శాతం 57.29 నుండి 55.88 కి పడిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో మూడవ స్థానంలో ఉంది.ఆదివారం సెంచూరియన్లో పాకిస్థాన్ను ఓడించి దక్షిణాఫ్రికా (63.67) లార్డ్స్లో వచ్చే ఏడాది లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తమ బెర్త్ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (58.89) మరియు దక్షిణాఫ్రికా (63.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టెస్టుల్లో గెలవని పక్షంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు తక్కువనే చెప్పాలి. -
పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 11 మ్యాచ్లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది.బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs IND: మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు! -
ఆసీస్తో మ్యాచ్: టీమిండియాకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మెల్బోర్న్లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. -
పాక్తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్లో అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కార్బిన్ బాష్కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్టౌన్ వేదికలు. పాకిస్తాన్తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్ను గనుక 2-0తో క్లీన్స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై! -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించిన టీమిండియాకు రెండో టెస్టులో మాత్రం బిగ్ షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా చేధించింది.బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచింది. వీరితోపాటు తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్ సైతం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఇక ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. భారత్ విన్నింగ్ శాతం 57.2తో ఏకంగా మూడో స్ధానానికి పడిపోయింది.దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా(60.71 విన్నింగ్ పర్సంటేజీ) టాప్ ప్లేస్కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా(59.26 విన్నింగ్ పర్సంటేజీ) రెండో స్ధానానికి ఎగబాకింది.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?కాగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్తో మిగిలిన మూడు టెస్టులు చాలా కీలకం. ఈ మూడు మ్యాచ్లలో భారత్ విజయం సాధిస్తే 4-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.అయితే వరుస మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిందేనే చెప్పుకోవాలి. డబ్ల్యూటీసీ 2023- 25 సైకిల్లో భారత్కు ఇదే చివరి సిరీస్ కాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంకా సిరీస్లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా శ్రీలంకతో, సఫారీలు పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడనునున్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేయనున్నాయి.👉బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-1తో సొంతం చేసుకున్నా కానీ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించదు. ఒకవేళ అలా జరగాలంటే రెండు మ్యాచ్ల సిరీస్లో దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ 2-0 తేడాతో ఓడించాలి. ప్రోటీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. శ్రీలంకతో రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ దిశగా సఫారీలు దూసుకుపోతున్నారు. కాబట్టి స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించడం పాక్కు అంత ఈజీ కాదు.👉ఒకవేళ ఆసీస్తో సిరీస్ను భారత్ 3-2తో గెలిస్తే.. అప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో కనీసం ఒక మ్యాచ్లో విజయం లేదా డ్రా చేసినా చాలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతోంది.చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం -
WTC: ఇవేం లెక్కలు.. ఇవేం శిక్షలు: ఐసీసీపై బెన్ స్టోక్స్ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీరుపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శలు గుప్పించాడు. ఓవర్ రేటు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే అర్థం స్ఫురించేలా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య కివీస్ జట్టుపై గెలుపుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ ఆతిథ్య కివీస్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.పెనాల్టీ వేసిన ఐసీసీఅయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు నమోదైందన్న కారణంగా ఐసీసీ ఇంగ్లండ్- న్యూజిలాండ్లకు పెనాల్టీ వేసింది. డబ్ల్యూటీసీ పాయింట్లలో మూడు పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ స్పందిస్తూ.. ‘చాలా మంచిది ఐసీసీ... మరో పది గంటల ఆట మిగిలి ఉండగానే టెస్టు ముగిసింది’... అని సెటైర్ వేశాడు.స్టోక్స్కు ఆగ్రహానికి కారణం?ఇదిలా ఉంటే.. 2021–23 డబ్ల్యూటీసీ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ ఇదే కారణంగా ఏకంగా 22 పాయింట్లు కోల్పోయింది. గత ఏడాది యాషెస్ సిరీస్ ఫలితం తర్వాత ఇంగ్లండ్ ఖాతాలో 28 పాయింట్లు చేరగా... పెనాల్టీ రూపంలోనే 19 పాయింట్లు పోయాయి! సహజంగానే ఇది స్టోక్స్కు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఓవర్ రేట్ శిక్షలు అనేవే అత్యంత గందరగోళంగా ఉన్నాయని అతడు అన్నాడు.గతంలోనూ తాను ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని స్టోక్స్ గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ముందే ముగిసిపోయినా... ఓవర్ రేట్ శిక్షలు వేయడం ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘రెండు జట్ల కోణంలో ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే టెస్టు మ్యాచ్ చాలా ముందుగానే ముగిసింది. మ్యాచ్లో ఫలితం కూడా వచ్చింది. అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వేస్తున్న పెనాల్టీలు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయి.ఉపఖండంలో ఇలాంటి సమస్య రాదుప్రపంచంలో మనం ఎక్కడ క్రికెట్ ఆడుతున్నామనేది కూడా ముఖ్యం. ఉపఖండంలో జరిగే మ్యాచ్లలో ఎప్పుడూ ఈ సమస్య రాదు. ఎందుకంటే అక్కడ స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌల్ చేస్తారు. మైదానంలో బౌలర్తో మళ్లీ మళ్లీ మాట్లాడటంతో పాటు ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ మార్పులు, వ్యూహాల్లో మార్పులు వంటి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ఒక కెప్టెన్గా నేను ఇదే పని చేస్తాను. ఇవన్నీ పట్టించుకోకుండా తొందరపెడితే ఎలా?.. మేం అక్కడ ఉన్నది మ్యాచ్ ఆడటానికి అనే విషయం మరచిపోవద్దు. చాలా మంది ఆటగాళ్లది ఇదే అభిప్రాయం. ఐసీసీ ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నుంచి స్పందన రాలేదుఏడాది క్రితం కూడా నేను దీనిపై మాట్లాడాను. కానీ ఐసీసీ నుంచి స్పందన రాలేదు. అందుకే అప్పటి నుంచి ఓవర్ రేట్ పెనాల్టీ షీట్లపై సంతకం పెట్టలేదు. కానీ ఐసీసీ జరిమానా విధించి పాయింట్లతో కోత ఎలాగూ విధిస్తుంది’ అని స్టోక్స్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించాడు. చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్తో అడిలైడ్లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్తో సిరీస్లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
'డబ్ల్యూటీసీ ఫైనల్పై ఆశలు వద్దు.. ఆసీస్ను భారత్ ఓడించలేదు'
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆసీస్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు."భారత్ డబ్యూటీసీ ఫైనల్కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్లలో విజయం మనదే. కివీస్పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్లో జరుగుతున్న ఆఖరి టెస్ట్లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్తో బెంగుళూరు టెస్ట్లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్గా ఇంగ్లండ్లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్తో సిరీస్లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
గంభీర్కు బీసీసీఐ షాక్!.. సొంతగడ్డపైనే ఇంతటి ఘోర అవమానం.. ఇకపై..
దూకుడుకు మారుపేరు.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆటగాడు.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త.. ఇలాంటి వ్యక్తి హెడ్కోచ్గా వస్తే జట్టు విజయపథంలో నడవడం ఖాయం.. గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా నియమితుడు కాగానే అతడి అభిమానులతో పాటు విశ్లేషకులూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇవి.అందుకు తగ్గట్టుగానే శ్రీలంక పర్యటనలో భాగంగా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్ను.. 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దీంతో హెడ్కోచ్గా గంభీర్కు శుభారంభం లభించింది. కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుతో ఉన్నా వన్డే సిరీస్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్లో భారత్ ఓటమిని చవిచూసింది.సొంతగడ్డపై ఘోర అవమానంఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో, టీ20 సిరీస్ను 3-0తో భారత్ క్లీన్స్వీప్ చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ.. న్యూజిలాండ్ రూపంలో ఎదురైన కఠిన సవాలును గౌతీ అధిగమించలేకపోయాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా సొంతగడ్డపై టీమిండియా కివీస్తో టెస్టుల్లో 0-3తో వైట్వాష్కు గురైంది.ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!న్యూజిలాండ్తో బెంగళూరు టెస్టులో పిచ్ను తప్పుగా అంచనావేసి తొలుత బ్యాటింగ్ చేయడం, పుణెలో స్పిన్ పిచ్ రూపొందించి బొక్కబోర్లా పడటం.. ముంబై టెస్టులోనూ గెలిచే మ్యాచ్ను చేజార్చుకోవడం..కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గంభీర్పై విమర్శల కారణమైంది. ఇక కివీస్ చేతిలో ఈ ఘోర ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ అవకాశాలనూ దెబ్బతీసింది.గంభీర్ చేసిన తప్పులు ఇవేఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గనుక జట్టు ప్రదర్శన ఇలాగే సాగితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్పై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయం. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని రోహిత్ ఎంత చెబుతున్నా... మేనేజ్మెంట్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ప్రధాన ప్లేయర్లే తడబడుతున్న సమయంలో సిరాజ్ను నైట్ వాచ్మన్గా పంపిన మేనేజ్మెంట్... మిడిలార్డర్లో అనుభవమున్న ‘లోకల్ బాయ్’ సర్ఫరాజ్ ఖాన్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దింపింది.ఆ విషయంలో ద్రవిడ్ పర్ఫెక్ట్ఇవే కాకుండా గతంలో ద్రవిడ్ ప్రాక్టీస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేవాడని పలువురు ప్లేయర్లు అభిప్రాయపడగా... గంభీర్లో ఆ తీవ్రత లోపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు హెడ్ కోచ్ గంభీర్లకు అగ్ని పరీక్షగా నిలువనుంది.రెక్కలు కత్తిరించేందుకు సిద్ధం!ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. గంభీర్ ‘ అధికారాల రెక్కలు’ కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై అతడిని సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్లకు లేని వెసలుబాటును బీసీసీఐ గౌతం గంభీర్కు కల్పించింది.నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోచ్లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. కానీ.. ఆస్ట్రేలియా పర్యటనకు పంపే జట్టు విషయంలో ఈ రూల్ను మినహాయించారు. హెడ్కోచ్ను మీటింగ్కు అనుమతించారు’’ అని పేర్కొన్నాయి. అయితే, స్వదేశంలోనే గంభీర్ అంచనాలు తప్పి.. ఘోర అవమానం ఎదురైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
2027 వరకు హెడ్ కోచ్గా అతడే.. సీఏ ప్రకటన
ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్గా ఆండ్రూ మెక్డొనాల్డ్కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్డొనాల్డే హెడ్ కోచ్గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్డొనాల్డ్కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్మెక్డొనాల్డ్ కోచింగ్లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.అందుకే పొడిగించాంఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్డొనాల్డ్పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్గా మెక్డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. జట్టు నిలకడైన విజయాల్లో మెక్డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. చదవండి: IPL 2025: రిషభ్ పంత్ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్లోనూ క్లీన్స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్లో భారత్పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్స్వీప్గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పేస్ పిచ్ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్పై కూడా తడబడింది. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్లో ముందుండి ఇన్నింగ్స్ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్లో ఉండగా... శుబ్మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్పైనే కాకుండా బ్యాటింగ్లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
Ind vs NZ: కివీస్తో మూడో టెస్టు.. ప్లాన్ ఛేంజ్.. ‘పిచ్’ మారింది!?
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఘోర పరాభవం పాలైన టీమిండియా.. ఆఖరి మ్యాచ్లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరోవైపు పిచ్ విషయంలోనూ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాంఖడే వికెట్ తొలిరోజు బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించేలా రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భారత్కు ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్తో ఒకటి, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిస్తేనే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం కాదు. కాబట్టి న్యూజిలాండ్తో సొంతగడ్డపై మిగిలిన మ్యాచ్ గెలిస్తేనే.. ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టగలదు.తొలిరోజు వారికే అనుకూలం!అందుకే ఏ రకంగా చూసినా న్యూజిలాండ్తో ఆడబోయే మూడో టెస్టు భారత్కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాంఖడేలో స్పోర్టింగ్ ట్రాక్ తయారుచేయించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం పిచ్ మీద కాస్త పచ్చిక ఉంది. తొలిరోజు బ్యాటింగ్కు అనుకూలించేలా కనిపిస్తోంది. రెండో రోజు నుంచి బంతి కాస్త టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా బెంగళూరు, పుణె టెస్టులో పిచ్ స్పిన్ బౌలింగ్కు బాగా అనుకూలించింది. ముఖ్యంగా రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా పదమూడు వికెట్లు కూల్చి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ తమ స్పిన్తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 113 పరుగుల తేడాతో ఓడి సిరీస్ను చేజార్చుకుంది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఆఖరి టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన పరువు నిలుస్తుంది. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్లు వేసింది. పుణే వేదికగా కివీస్తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్కు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. -
ఇలా అయితే కష్టమే!
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి! –సాక్షి క్రీడావిభాగం -
WTC: ఫైనల్ రేసులోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా.. డేంజర్లో టీమిండియా?
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులోకి సౌతాఫ్రికా దూసుకువచ్చింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో గెలుపొందడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. తద్వారా టీమిండియా- ఆస్ట్రేలియా జట్లకు సవాల్ విసిరే స్థితిలో నిలిచింది.టాప్-2లో టీమిండియా, ఆసీస్డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో భారత జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి ఎనిమిదింట గెలిచి, మూడు మ్యాచ్లు ఓడిపోయింది. అంతేకాదు.. ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 98 పాయింట్లు, 68.06 విజయాల శాతంతో ప్రస్తుతం టాప్లో కొనసాగుతోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సైతం రోహిత్ సేన మాదిరే.. 12 మ్యాచ్లు ఆడి 8 గెలిచి, మూడు ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది.అయితే, వివిధ మ్యాచ్లలో స్లో ఓవర్ రేటు తదితర కారణాల వల్ల ఆస్ట్రేలియా పాయింట్లలో కోత పడటంతో ప్రస్తుతం ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 62.50. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా ,ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. శ్రీలంక తొమ్మిదింట ఐదు విజయాలు, నాలుగు ఓటములతో మూడో స్థానం(60 పాయింట్లు, విజయాల శాతం 55.56)లో ఉంది.ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్న ప్రొటిస్ అయితే, ఇటీవలి బెంగళూరు టెస్టులో భారత్పై విజయంతో న్యూజిలాండ్ నాలుగోస్థానానికి చేరుకోగా.. తాజాగా సౌతాఫ్రికా కివీస్ జట్టును వెనక్కి నెట్టింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తానూ ఉన్నానంటూ ముందుకు వచ్చింది.PC: ICCమిగిలినవి గెలిస్తేరెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 40 పాయింట్లు(ఏడింట మూడు గెలుపు, మూడు ఓటమి, ఒకటి డ్రా) ఉన్నాయి. విజయాల శాతం 47.62. ఈ సీజన్లో సౌతాఫ్రికాకు ఇంకా ఐదు టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటిలో గెలిచిందంటే కచ్చితంగా టాప్-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్ల ఫలితాల ఆధారంగా నాలుగు గెలిచినా రేసులో ఉండగలుగుతుంది.డేంజర్లో టీమిండియాకాబట్టి టీమిండియా తమ అగ్రస్థానానికి ముప్పు రాకుండా చూసుకోవాలంటే కివీస్తో మిగిలిన రెండు టెస్టుల్లో తప్పక గెలవడంతో పాటు ఆస్ట్రేలియా సిరీస్లో కనీసం రెండు టెస్టుల్లో విజయం సాధించాలి. ఇక సౌతాఫ్రికా తదుపరి బంగ్లాదేశ్తో ఒక టెస్టు ఆడటంతో పాటు శ్రీలంకతో రెండు, పాకిస్తాన్తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇక పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు చేరతాయన్న విషయం తెలిసిందే. 2019-21, 2021-23 సీజన్లలో భారత్ ఫైనల్ చేరినా.. ఆయా ఎడిషన్లలో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకున్నాయి. చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జరిగిన తొలి టెస్టులో భారత్కు ఊహించని పరాభావం ఎదురైంది. టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా దూకుడుకు కివీస్ బ్రేక్లు వేసింది. మొదటి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక బెంగళూరు టెస్టు అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఓటమితో పాయింట్ల టేబుల్లో టీమిండియా స్థానం విషయంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. భారత్ 98 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. కానీ ఈ ఓటమితో భారత్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు ఈ చారిత్రత్మక విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి నాలుగో ప్లేస్కు చేరుకుంది. ఈ క్రమంలో 44.40 విజయ శాతంతో ఇంగ్లండ్(43.06)ను కివీస్ వెనక్కి నెట్టింది. అయితే పాయింట్ల పరంగా కివీస్(48) కంటే ఇంగ్లండ్(93) మెరుగ్గానే ఉంది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.భారత్ ఫైనల్ చేరాలంటే?డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్కు టీమిండియా చేరాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్ధానాల్లో నిలిస్తే చాలు. ఈ ఓటమి భారత్పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత సైకిల్లో టీమిండియా ఇంకా ఏడు మ్యాచ్లు ఆడనుంది. అందులో కనీసం మూడు విజయాలు సాధిస్తే చాలు భారత్ ఫైనల్కు ఆర్హత సాధిస్తుంది. అయితే ఈ సిరీస్ తర్వాత భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో కంగారులతో రోహిత్ సేన తలపడనుంది. అయితే ఆసీస్ గడ్డపై కమ్మిన్స్ సేనను ఓడించడం అంత ఈజీ కాదు. కాబట్టి కివీస్తో జరగబోయే రెండు టెస్టులు కూడా భారత్కు కీలకమని చెప్పుకోవాలి. న్యూజిలాండ్-భారత్ మధ్య రెండో టెస్టు పుణే వేదికగా అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ ప్లేయర్ -
కెప్టెన్గా అదొక్కటే నేను గెలవలేదు.. ఈసారి: కమిన్స్
ప్యాట్ కమిన్స్.. ఈ ఫాస్ట్బౌలర్ 2021లో ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 టైటిల్ గెలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023ట్రోఫీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ఫుల్ సారథిగా తనదైన ముద్ర వేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 రూపంలో కమిన్స్కు కఠిన సవాలు ఎదురుకాబోతోంది. ఆసీస్కు ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో .. టీమిండియాతో జరిగే ఈ టెస్టు సిరీస్ కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కెప్టెన్గా అదొక్కటే నేను గెలవలేదుతాజాగా ఓ ఈవెంట్కు హాజరైన కమిన్స్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నేను ఇప్పటి వరకు సాధించాలనుకుని.. సాధించలేకపోయింది ఏదైనా ఉందీ అంటే.. అది టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడమే. కెప్టెన్గా నేను ఇప్పటి వరకు భారత్ను టెస్టు సిరీస్లో ఓడించనేలేదు. అయితే, మా జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఆ అదృష్టం దక్కింది.సారథిగా మారిన తర్వాత నాలో పెద్దగా మార్పులేమీ రాలేదు. నేను నాలాగే ఉంటూ జట్టును విజయపథంలో ముందుకు నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’’ అని తెలిపాడు. నాడు లీడింగ్ వికెట్ టేకర్గాతన కెప్టెన్సీ కెరీర్లో టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం ముఖ్యమైనదని కమిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా కమిన్స్ 2017లో తొలిసారిగా టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు ఆసీస్ ఓడిపోయింది. అయితే, 2022-21లో భారత్తో నాలుగు టెస్టులాడిన ఈ పేసర్.. 21 వికెట్లతో సత్తా చాటాడు.డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రంఇక డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్లో కమిన్స్ బృందం.. టీమిండియాను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ ఈ రెండు జట్లే తుదిపోరుకు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, రెండింటిలో ఏది ముందు ఫైనల్ చేరుతుందోనన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్తో ఆడనున్న మూడు టెస్టుల్లో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది.టీమిండియాదే ఆధిపత్యంఅలా అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఫలితంతో సంబంధం ఉండదు. ఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య నవంబరు నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్లో గెలిచి.. టైటిల్ను నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఆస్ట్రేలియా తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేయాలని ఉవ్విళ్లూరుతోంది.ఇక గత నాలుగు సందర్భాల్లోనూ ఆసీస్ను ఓడించి భారత్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన అక్టోబరు 16 నుంచి కివీస్తో సిరీస్తో బిజీ కానుండగా.. కమిన్స్ బృందం నవంబరు 4 నుంచి పాకిస్తాన్తో వన్డే సిరీస్ ఆడనుంది.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి... -
PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్లు ఆడిన రూట్ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్ లబూషేన్ ఉన్నాడు. లబూషేన్ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్కే దక్కుతుంది.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..రూట్-5005లబూషేన్-3904స్టీవ్ స్మిత్-3486బెన్ స్టోక్స్-3101బాబర్ ఆజమ్-2755ఎడిషన్ల వారీగా రూట్ చేసిన పరుగులు..2019-21లో 1660 పరుగులు2021-23లో 1915 పరుగులు2023-25లో 1490 పరుగులురూట్ ఖాతాలో మరో రికార్డు..తాజా ఇన్నింగ్స్తో రూట్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఐదోసారి క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్.. బ్రియాన్ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్ల్లో) చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్లో ఆమెర్ జమాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్గా సచిన్ -
టీమిండియా స్టార్లంతా రెండు వారాలు ఆటకు దూరం
టీమిండియా స్టార్ క్రికెటర్లు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడిన జట్టు మొత్తానికి దాదాపు పదిహేను రోజుల విరామం లభించనుంది. బంగ్లాపై కాన్పూర్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ తరంగాలు శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.ముంబైలో రోహిత్ శర్మ.. లండన్కు వెళ్లిపోయిన కోహ్లిరోహిత్ ఇప్పటికే ముంబైకి చేరుకోగా.. కోహ్లి లండన్కు పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా సీనియర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుబ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన జట్టులో దాదాపు అంతా కొత్త వాళ్లకే చోటు దక్కింది.CAPTAIN ROHIT IS BACK IN MUMBAI...!!!! 🔥- Hitman in his Lamborghini, heading back home after a great Test series victory. pic.twitter.com/1wKCxrzcm9— Johns. (@CricCrazyJohns) October 2, 2024Virat Kohli On His Way To London After Departing From Delhi.✈️🖤#ViratKohli #London @imVkohli pic.twitter.com/x2XlRLeQtF— virat_kohli_18_club (@KohliSensation) October 2, 2024 టెస్టుల్లో బంగ్లాదేశ్ వైట్వాష్ అనంతరం శ్రీలంక పర్యటనకు టీ20 జట్టుకూ జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తదితరులు దూరం కాగా.. వన్డే సిరీస్తో రోహిత్, కోహ్లి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ నేపథ్యంలో బుమ్రా కూడా తిరిగి వచ్చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. టీ20 సిరీస్ మొదలయ్యేది అప్పుడేఈ క్రమంలో అక్టోబరు 6, 9, 12వ తేదీల్లో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారు కాగా.. టెస్టు సిరీస్ ఆడిన సీనియర్లకే కాకుండా జట్టు మొత్తానికి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అక్టోబరు 16 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుండటమే ఇందుకు కారణం. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో గనుక గెలిస్తే రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. అందుకే ఈ కీలకమైన సిరీస్కు ముందు బోర్డు ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఇక కివీస్తో మూడు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. డబ్ల్యూటీసీ తాజా సీజన్లో ఆఖరుగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. నవంబరు 22 నుంచి ఇరు జట్ల మధ్య బీజీటీ మొదలుకానుంది.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడిన జట్టుప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.బెంచ్: కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాళ్, ధృవ్ జురెల్.చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ -
WTC: ఆస్ట్రేలియా కంటే ముందుగా ఫైనల్ చేరాలంటే?!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్కు టీమిండియా మరింత చేరువైంది. బంగ్లాదేశ్తో కాన్పూర్ టెస్టులో దూకుడైన బ్యాటింగ్తో ఫలితాన్ని తేల్చి డ్రా గండం నుంచి గట్టెక్కింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది.కాగా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో టీమిండియా ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడింది. ఇందులో ఎనిమిది గెలిచి.. రెండు ఓడిపోగా.. ఒకటి డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో రోహిత్ సేన విజయాల శాతాన్ని 74.24గా నమోదు చేసి.. 98 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్లో కొనసాగుతోంది. ఇక పన్నెండింట 8 విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే!కాబట్టి ఫైనల్ పోరులో ఈ రెండు జట్లే పోటీపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా కంటే ముందు టీమిండియానే తుదిపోరుకు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. రోహిత్ సేన ఇంకో మూడు మ్యాచ్లలో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా తుదిపోటీకి అర్హత సాధిస్తుంది.కాగా భారత జట్టు తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనుంది. సొంతగడ్డపై భారత జట్టుకు తిరుగులేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా అయితే ముందుగానే బెర్తు ఖరారుప్రస్తుత ఫామ్ను బట్టి కివీస్ను వైట్వాష్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక చేతిలో తాజా టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ ఓడిపోయి చతికిలపడటమే ఇందుకు కారణం. ఒకవేళ అంచనాలు నిజమై టీమిండియా కివీస్ జట్టును 3-0తో క్లీన్స్వీప్ చేసిందంటే ఫైనల్ బెర్తు ఖరారైనట్లే!ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో ఆడనున్న ఐదు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా పెద్దగా తేడా ఉండదు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక మూడో స్థానం(9 మ్యాచ్లలో ఐదు గెలుపు, నాలుగు ఓటమి)లో ఉండగా.. ఇంగ్లండ్(పదహారు మ్యాచ్లో 8 గెలుపు, ఏడు ఓటమి, ఒక డ్రా)నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు.. టీమిండియా చేతిలో పరాజయంతో బంగ్లాదేశ్ ఐదు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.ఈసారైనా టైటిల్ గెలవాలనికాగా 2019 నుంచి ప్రతి రెండేళ్లకొకసారి డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆరంభ ఎడిషన్లో టీమిండియా- న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. కేన్ విలియమ్సన్ ట్రోఫీని ముద్దాడింది. ఇక 2021-23 సీజన్లో ఆస్ట్రేలియాతో పాటు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫైనల్ ఆ గండాన్ని అధిగమిస్తుందో.. లేదంటే హ్యాట్రిక్ ఫైనలిస్టుగా మాత్రమే మిగిలిపోతుందో చూడాలి.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టుసెప్టెంబరు 27- అక్టోబరు 1: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగులకు ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుచదవండి: Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ 2⃣-0⃣A memorable Test Victory 🙌#TeamIndia win the 2nd Test by 7 wickets and win the series 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kxvsWxlNVw— BCCI (@BCCI) October 1, 2024 -
WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో ఇంత వరకు ఏ బౌలర్కూ సాధ్యం కాని ఘనత నమోదు చేశాడు. కాగా సొంతగడ్డపై భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచంలోనే తొలి బౌలర్గా అశ్విన్ రికార్డుఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్లో అశూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్లో రెండో టెస్టు సందర్భంగా అశూ సెంచరీ(113) చేయడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో షకీబ్ అల్ హసన్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా సీజన్లో ఆడిన తొలి పది మ్యాచ్లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు.డబ్ల్యూటీసీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వికెట్స్ బౌలర్ అశూ2019-21 సీజన్- 14 మ్యాచ్లలో 71 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 7/1452021-23 సీజన్- 13 మ్యాచ్లలో 61 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 6/912023-25 సీజన్- 10* మ్యాచ్లలోనే 50* వికెట్లు()-అత్యుత్తమ గణాంకాలు 7/71.ధనాధన్ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్లో 26/2(11) ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్ను అశూ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్ హక్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్ దీప్ షాద్మన్ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి..బజ్బాల్ క్రికెట్తో గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
WTC- Ind vs Ban: ఆట రద్దు.. టీమిండియాకు కష్టమేనా?
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కాన్పూర్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తొలుత తెలిపింది. అయితే, భోజన విరామ సమయం వరకూ వరణుడు కరుణించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రీన్ పార్క్స్టేడియంలో ఆట ఆరంభమవుతుందని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ.. అవుట్ఫీల్డ్ మొత్తం తడిగా ఉండటంతో శనివారం ఆటను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొమ్మిదేళ్లలో తొలిసారికాగా గత తొమ్మిదేళ్లలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ మొత్తంలో ఒక రోజు ఆట ఇలా రద్దు కావడం ఇదే తొలిసారి. బెంగళూరులో 2015లో సౌతాఫ్రికాతో టెస్టులో సైతం ఇలాగే జరిగింది. నాడు మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇదిలా ఉంటే.. ఒకవేళ కాన్పూర్ టెస్టు కూడా ఫలితం తేలకుండా ముగిసిపోతే టీమిండియాకు కాస్త ఇబ్బందే.న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలోనే ఉంది. అయితే, బంగ్లాదేశ్తో సొంతగడ్డపై సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేస్తే గనుక ఫైనల్ మార్గం మరింత సుగమమయ్యేది. ఎందుకంటే.. మిగిలిన ఎనిమిదింటిలో మూడు మ్యాచ్లు గెలిస్తే ఫైనల్ బెర్తు దాదాపుగా ఖరారవుతుంది. అయితే, ఆ ఎనిమిది టెస్టుల్లో టీమిండియాకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. అంతా వరణుడి దయ!సొంతగడ్డపై కివీస్తో మూడు టెస్టులు ఆడిన అనంతరం.. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. వీటిలో నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ సేనకు ఇదేమీ అంత కష్టం కాకపోయినా.. బంగ్లాదేశ్తో మ్యాచ్ డ్రా కాకుండా ఉంటే.. పని సులువవుతుంది. ఈ మ్యాచ్ సజావుగా సాగి.. టీమిండియా గెలిస్తే సరి. లేదంటే.. ఎంతో కొంత తలనొప్పి మాత్రం తప్పదు. అంతా వరణుడి దయ!చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
టాప్లో టీమిండియా.. ఆరో స్థానానికి పడిపోయిన బంగ్లాదేశ్
చెన్నై టెస్ట్లో భారత్ బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది. తాజా గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ 2023-25లో గెలుపు శాతాన్ని 71.67కి చేర్చుకుని వరుసగా మూడో ఎడిషన్ ఫైనల్ దిశగా దూసుకెళ్తుంది.ఈ గెలుపు తర్వాత భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య 9.17 గెలుపు శాతం వ్యత్యాసంగా ఉంది. ప్రస్తుతం ఆసీస్ గెలుపు శాతం 62.50గా ఉంది. భారత్ ముందున్న టెస్ట్ సీజన్లో (9 మ్యాచ్ల్లో) మరో నాలుగు విజయాలు సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. భారత్.. తదుపరి బంగ్లాదేశ్తో ఒకటి.. ఆతర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.బంగ్లాదేశ్ విషయానికొస్తే.. పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో ఓడించిన బంగ్లాదేశ్, ఆతర్వాత గణనీయంగా పాయింట్లు పెంచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్ చేతిలో తాజా ఓటమితో బంగ్లా 6.54 గెలుపు శాతాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ విజయాల శాతం 39.29గా ఉంది. తాజా స్టాండింగ్స్లో భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి.కాగా, భారత్ సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్తో రెండో టెస్ట్ మ్యాచ్లో తలపడుతుంది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
Ind vs Ban: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోర్ దిశగా భారత్
India vs Bangladesh, 1st Test Chennai Day 1 Updates: టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ముగిసిన తొలి రోజు ఆట..చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.క్రీజులో అశ్విన్(102), జడేజా(86) ఆజేయంగా ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత టాపార్డర్ ప్లేయర్లు విఫలమైనప్పటకి వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్బుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్ రానా, మెహదీ హసన్ మీరజ్ తలా రెండు వికెట్లు సాధించారు.సెంచరీతో చెలరేగిన అశ్విన్.. చెపాక్ టెస్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో అశ్విన్ 10 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అశ్విన్కు ఇది ఆరో టెస్టు సెంచరీ. 80 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్తో పాటు జడేజా 86 పరుగులతో ఉన్నాడు.రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ.. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆర్ధశతకం సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా.. అశ్విన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అశ్విన్ దూకుడుగా ఆడితే, జడేజా కాస్త ఆచిచూచి తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 69 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. క్రీజులో జడేజాతో పాటు(51), అశ్విన్(78) పరుగులతో ఉన్నాడు.అశ్విన్ హాఫ్ సెంచరీ..సొంతమైదానంలో టీమిండియా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. 54 పరుగులతో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా(35) పరుగులతో క్రీజులో ఉన్నాడు.52 ఓవర్లకు టీమిండియా స్కోర్: 197/652 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో సరిగ్గా 34 పరుగులతో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా(15) పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీ బ్రేక్కు భారత్ స్కోర్: 176/6టీ విరామానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(21), రవీంద్ర జడేజా(7) పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్ అవుట్42.2: మెహదీ హసన్ మిరాజ్బౌలింగ్లో జకీర్కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్(16) అవుటయ్యాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 145/6 (42.4) ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా41.4: హాఫ్ సెంచరీ వీరుడు జైస్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నహీద్ రాణా బౌలింగ్లో షాద్మాన్ ఇస్లాంనకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ 56 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 144/5 (42). రాహుల్ 16 పరుగులతో ఆడుతున్నాడు.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ34.2: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో సింగిల్ తీసి జైస్వాల్ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ విలువైన అర్ధ శతకం బాది సత్తా చాటాడు. టీమిండియా స్కోరు: 132-4(35). రాహుల్ 10, జైస్వాల్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.28వ ఓవర్: సెంచరీ కొట్టిన టీమిండియా.. స్కోరు 103-4.జైస్వాల్ 43, రాహుల్ ఒక పరుగుతో ఆడుతున్నారు.96 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్25.3: రిషభ్పంత్ (39) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ఖాతాలో నాలుగో వికెట్ జమైంది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 37 పరుగులతో ఆడుతున్నాడు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 88/3 (23)34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను జైస్వాల్, పంత్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి యశస్వి జైస్వాల్ 37, రిషభ్ పంత్ 33 పరుగులతో ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 57-3జైస్వాల్ 26, పంత్ 13 పరుగులతో ఆడుతున్నారు.హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న టీమిండియాఓపెనర్ జైస్వాల్ నిలకడగా ఆడుతూ.. రిషభ్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. 14వ ఓవర్ ముగిసే సరికి జైస్వాల్ 41 బంతుల్లో 24, పంత్ 11 బంతుల్లో 8 పరుగులు చేశారు. టీమిండియా స్కోరు: 50-3.9.2: కోహ్లి అవుట్బంగ్లా పేసర్ హసన్ మహ్మూద్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే రోహిత్, గిల్ వికెట్లు పడగొట్టిన అతడు.. కోహ్లి రూపంలో మరో కీలక బ్యాటర్ను అవుట్ చేశాడు.కాగా మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా స్కోరు: 34/3 (9.3). రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 17 పరుగులతో ఆడుతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా7.3: హసన్ మహ్మూద్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత రోహిత్ శర్మ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్న అతడు.. గిల్ను పెవిలియన్కు పంపాడు. మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న ఈ వన్డౌన్ బ్యాటర్ డకౌట్గా వెనుదిరగగా.. భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 29/2 (8). జైస్వాల్ 17 పరుగులతో ఆడుతున్నాడు. ఆరంభంలోనే బిగ్ వికెట్ డౌన్5.1: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ(6) రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. బంగ్లా యువ పేసర్ హసన్ మహ్మూద్ బౌలింగ్లో షాంటోకు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 14/1. యశస్వి జైస్వాల్ 7, గిల్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత స్టార్ స్పిన్నర్కు నో చాన్స్ కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. భారత్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్లో తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.టాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే కూడా మొదట బౌలింగ్ చేసే వాళ్లమని పేర్కొన్నాడు. ప్రతి టెస్టు మ్యాచ్ కీలకమేనని.. సవాళ్లను అధిగమించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇక తాము ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.బంగ్లాదేశ్ సైతంకాగా స్పిన్ విభాగంలో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు చోటు దక్కగా.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు మొండిచేయి ఎదురైంది. ఇక సీమర్లలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ స్థానం సంపాదించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ సైతం ముగ్గురు సీమర్లు.. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు తుదిజట్టులో చోటిచ్చింది. చెపాక్లోని ఎర్రమట్టి పిచ్పై ఈ మ్యాచ్ జరుగనుండటంతో ఇరుజట్లు ఇలా ఫాస్ట్బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.చదవండి: వన్డే క్రికెట్లో పెను సంచలనం -
SL vs NZ: శతక్కొట్టిన కమిందు.. లంక తొలి ప్లేయర్గా..
న్యూజిలాండ్తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ కుదేలైన తరుణంలో చిక్కుల్లో పడిన జట్టును తన సెంచరీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో శ్రీలంకను మెరుగైన స్థితిలో నిలిపాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా న్యూజిలాండ్ రెండు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది.టాపార్డర్ను పడేసిన కివీస్ పేసర్లుఈ క్రమంలో గాలే వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, స్పిన్కు అనుకూలించే పిచ్పై తొలుత న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడం విశేషం. కివీస్ యువ ఫాస్ట్బౌలర్ ఒ రూర్కీ దిముత్ కరుణరత్నె(2)ను పెవిలియన్కు పంపి తొలి వికెట్ తీశాడు.అనంతరం మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక(27)ను కూడా రూర్కీ అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్(30)ను కివీస్ కెప్టెన్ వెనక్కిపంపాడు. ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్తో కలిసి కమిందు మెండిస్ లంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్కోరు 106-4 వద్ద ఉన్న వేళ ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కు 72 పరుగులు జతచేశారు.కమిందు- కుశాల్ జోడీ సెంచరీ భాగస్వామ్యంఅయితే, రూర్కీ మరోసారి ప్రభావం చూపాడు. మాథ్యూస్ను 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ కమిందుకు తోడయ్యాడు. ఈ క్రమంలో కమిందు సెంచరీ పూర్తి చేసుకోగా.. కుశాల్ కేవలం 68 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. కమిందుతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ కుశాల్ను అవుట్చేసి.. ఈ జోడీని విడదీయడంతో లంక ఇన్నింగ్స్ నెమ్మదించింది.మరోవైపు.. స్పిన్నర్ అజాజ్ పటేల్ కమిందు మెండిస్ను పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. రమేశ్ మెండిస్ 14, ప్రభాత్ జయసూర్య 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.కమిందు మెండిస్ సరికొత్త చరిత్రకివీస్తో తొలి టెస్టులో 173 బంతుల్లో కమిందు మెండిస్ 114 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు ఉన్నాయి. కాగా కమిందుకు ఇది టెస్టుల్లో సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఓవరాల్గా నాలుగోది.ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా టెస్టుల్లో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్లలో కమిందు ఈ ఘనత సాధించగా.. మైకేల్ వాండార్ట్(21 మ్యాచ్లలో), ధనంజయ డి సిల్వ(23మ్యాచ్లలో) అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తరుణంలో కమిందు మరో రికార్డు సాధించాడు.మరో అరుదైన ఘనతవరుసగా ఏడు టెస్టు మ్యాచ్లలో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కమిందు కంటే ముందు పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ కమిందు మెండిస్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ టెస్టులో శతకంతో అలరించాడు.చదవండి: Ind vs Ban: తుదిజట్టులో వారికి చోటు లేదు.. కారణం చెప్పిన గంభీర్ View this post on Instagram A post shared by Sri Lanka Cricket (@officialslc)A century at home, no less in your hometown, always special🙌🏽 #SLvNZ 🎥 SLC pic.twitter.com/eqwnFMPutm— Estelle Vasudevan (@Estelle_Vasude1) September 18, 2024 -
రూట్కు పొంచి ఉన్న గండం.. అరుదైన రికార్డుకు ఎసరు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే పేరిట ఆ రికార్డుఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్కు ఇప్పుడు అవకాశం వచ్చింది. జైస్వాల్ 132 రన్స్ చేస్తే..ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడుఅంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్గా ఈ సైకిల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్లో ఉంది. బంగ్లాదేశ్తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.డబ్ల్యూటీసీ వీరుడిగాఅనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్.. అశ్విన్ ముందు ప్రపంచ రికార్డు
త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు పడగొడితే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. లియోన్ డబ్ల్యూటీసీలో 43 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్.. 35 మ్యాచ్ల్లో 174 వికెట్లు తీసి మూడో హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో (42 మ్యాచ్ల్లో 175 వికెట్లు) ఉన్నాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ 26 వికెట్లు సాధిస్తే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మార్కును తాకిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్లో అశ్విన్ 14 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు సాధించిన టెస్ట్ బౌలర్ల జాబితాలో లియోన్తో సమానంగా ఏడో స్థానంలో నిలుస్తాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) టాప్-6లో ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (516) ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.కాగా, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ చెన్నై వేదికగా.. రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా (సెప్టెంబర్ 27 నుంచి) జరుగనున్నాయి. టెస్ట్ సిరీస్ అనంతరం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ -
నాలుగో స్థానానికి ఎగబాకిన బంగ్లాదేశ్.. టాప్లో టీమిండియా
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారీగా పాయింట్ల శాతాన్ని మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఓటమితో పాక్ పాయింట్ల శాతాన్ని మరింత దిగజార్చుకుని ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇటీవలే శ్రీలంకపై రెండో టెస్ట్లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా ఆరులో, శ్రీలంక ఏడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించిన వెస్టిండీస్ చిట్టచివరి స్థానమైన తొమ్మిదో స్థానంలో నిలిచింది. INDIA AT THE TOP IN WTC 🇮🇳- Pakistan 8th in the table.....!!!! pic.twitter.com/O4WQAIuuzg— Johns. (@CricCrazyJohns) September 3, 2024కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. బంగ్లాదేశ్కు పాక్లో ఇది తొలి సిరీస్ విజయం. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. తొలి ఎడిషన్ అయిన 2021లో సౌథాంప్టన్, రెండో ఎడిషన్ అయిన 2023లో ఓవర్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో టీమిండియా ఫైనల్స్కు చేరుకోగా.. తొలి ఎడిషన్లో న్యూజిలాండ్ చేతిలో, రెండో ఎడిషన్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా అతి సమీపంలో రెండో స్థానంలో ఉంది. అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ ఎడిషన్ ఫైనల్లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఉంది. -
టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లండ్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇంగ్లండ్కు 29వది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు. భారత్, ఆస్ట్రేలియా సంయుక్తంగా 28 విజయాలు సాధించాయి. తాజాగా ఇంగ్లండ్.. టీమిండియా, ఆస్ట్రేలియా పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ డబ్ల్యూటీసీలో 29 విజయాలు సాధించేందుకు 58 మ్యాచ్లు తీసుకోగా.. భారత్, ఆస్ట్రేలియా చెరి 46 మ్యాచ్ల్లోనే 28 విజయాలు సాధించాయి. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ (15), సౌతాఫ్రికా (15), పాకిస్తాన్ (10), శ్రీలంక (9), వెస్టిండీస్ (8), బంగ్లాదేశ్ (3) ఉన్నాయి.లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 427, రెండో ఇన్నింగ్స్లో 251 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 196, రెండో ఇన్నింగ్స్లో 292 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేయగా.. గస్ అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిశాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. రెండో ఇన్నింగ్స్లో చండీమల్ (58) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అట్కిన్సన్ బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో రెండు, సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. -
WTC: పాకిస్తాన్కు భారీ షాకులిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తుకాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.బంగ్లాకు సైతం ఎదురుదెబ్బఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.టాప్లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.PC: insidesportపాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టిన రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ పలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో భారీ సెంచరీతో (171 నాటౌట్) విరుచుకుపడిన రిజ్వాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు భారత వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2022లో పంత్ ఇంగ్లండ్పై 146 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్లో సెంచరీ అనంతరం రిజ్వాన్.. పంత్ పేరిట ఉండిన మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. పంత్ డబ్ల్యూటీసీలో 1575 పరుగులు చేయగా.. రిజ్వాన్ 1658 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. రిజ్వాన్ పాటు సౌద్ షకీల్ (141) సెంచరీ చేయడంతో పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 12, జకీర్ హసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 421 పరుగులు వెనుకపడి ఉంది. -
ఐదో స్థానానికి ఎగబాకిన సౌతాఫ్రికా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. వెస్టిండీస్తో తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా తమ విజయాల శాతాన్ని మెరుగుపర్చుకుంది. ఈ సీజన్లో (2023-25) సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా చేతిలో తాజా ఓటమితో వెస్టిండీస్ చివరి స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగా.. పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.సౌతాఫ్రికా, విండీస్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయగా.. విండీస్ 222 పరుగులకే చాపచుట్టేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
గంభీర్ ప్లాన్: బౌలింగ్ కోచ్గా అతడే ఎందుకంటే?!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. టీమిండియా మాజీలను కాదనిఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.అతడి నైపుణ్యాల గురించి గంభీర్కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.వచ్చే ఏడాది ఇంగ్లండ్తోనూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.మూడు దేశాలకు కోచ్గా... మోర్కెల్కు గంభీర్కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్రఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది. -
Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్సెట్తో ఆడకూడదు!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాడు బసిత్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లోనూ బంగ్లా కంటే పాక్ ఎంతో మెరుగ్గా ఉందని.. ఒక్క వరణుడు తప్ప పర్యాటక జట్టును ఓటమిని నుంచి ఎవరూ తప్పించలేరని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంటామని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 21న రావల్పిండి వేదికగా ఇరు జట్ల మద్య తొలి టెస్టు ఆరంభం కానుండగా.. ఆగష్టు 30 నుంచి రెండో టెస్టుకు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్లో అడుగుపెట్టింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ను ఆ వరణుడే కాపాడాలి. వర్షం పడలేదంటే వారి ఓటమి ఖాయమే!... అసలు మా జట్టుకు వారితో అసలు పోటీ, పోలికే లేదు. బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టును ఓడించిన ఉత్సాహంలో పాక్ జట్టు ఉంది’’ అంటూ పాక్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. పాక్ టెస్టు జట్టు కొత్త కోచ్ జాసన్ గిల్లెస్పి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పిని పాకిస్తాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు మావాళ్లు ఆస్ట్రేలియన్ మైండ్సెట్తో ఆడతారో లేదో చూడాలి. ఒకవేళ గిల్లెస్పి ఇదే చేయాలని భావిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్పై గెలిస్తే తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా..!
వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో.. సౌతాఫ్రికా ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.Here’s the updated World Test Championship (WTC) points table following the draw in the first Test between the West Indies and South Africa in Port of Spain. pic.twitter.com/tpVGXbhAZd— CricTracker (@Cricketracker) August 12, 2024ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 233, రెండో ఇన్నింగ్స్లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ టెస్టు క్రికెట్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్ ద్వారా అతడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.కాగా ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ 2023- 25 ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆసీస్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ టూర్ ద్వారా సిరీస్ ద్వారా మాక్సీని తిరిగి టెస్టుల్లో ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే టీ20 ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చిన బోర్డు.. టెస్టులకు సన్నద్ధం కావాలని ఆదేశించిందని ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. రెడ్బాల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడినా మాక్సీపై మేనేజ్మెంట్కు నమ్మకం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.ఇక మాక్సీతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా టీమిండియాతో సిరీస్లో భాగంగా 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గ్లెన్ మాక్స్వెల్.ఇప్పటి వరకు కేవలం ఏడు టెస్టులు ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఓ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. అదే విధంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరిసారిగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో ఆడిన మాక్సీ.. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో 2022లో శ్రీలంక టూర్కు ఎంపికైన మాక్సీ.. టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో వార్విక్షైర్ తరఫున ఆడిన మాక్స్వెల్ 81 పరుగులతో రాణించాడు.ఈ నేపథ్యంలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని ఆడించాలని బోర్డు భావించగా.. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా మాక్సీ టెస్టు కెరీర్ గొప్పగా లేకపోయినా.. శ్రీలంకలో స్పిన్నర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ బోర్డు అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. -
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్కు పూర్తి స్థాయి కెపె్టన్గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మనే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ సారథిగా తనను తప్పించడంతో బ్యాటింగ్పైన దృష్టి పెట్టిన హిట్మ్యాన్... వరల్డ్కప్ నాటికి పూర్తి ఫామ్లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 156 పరుగులు చేశాడు హిట్మ్యాన్. తాజాగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో తనదైన షాట్లతో అలరించి ముంబై విజయంలో తానూ భాగమయ్యాడు. From @Jaspritbumrah93's brilliance to that dominating chase! 👌 👌 A quick recap to sum up @mipaltan's 2️⃣nd win on the bounce at Wankhede Stadium 🎥 🔽 #TATAIPL | #MIvRCB pic.twitter.com/A8sroBjcm0 — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఇదిలా ఉంటే.. 36 రోహిత్ శర్మకు వయసు పైబడుతున్న దృష్ట్యా అతడిని టీమిండియా సారథిగానూ తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బలంగా వినిపిస్తుండగా.. టెస్టులకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్ను చేస్తే బాగుంంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచకప్-2024లోనూ రోహిత్ శర్మనే టీమిండియాను ముందుకు నడిపిస్తాడని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిటెర్మెంట్పై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఇప్పటి వరకు నేను రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించనేలేదు. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చెప్పలేం కదా! ఇప్పటికీ నేను బాగానే ఆడుతున్నాను. మరికొన్నేళ్ల పాటు ఆడగలననే అనుకుంటున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వరల్డ్కప్ గెలవాలనుకుంటున్నాను. ఇంకా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ కూడా ముందు ఉంది. టీమిండియా గెలుస్తుందనే అనుకుంటున్నా’’ అని ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఆలోచన లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: T20 WC: సెలక్టర్లూ.. అతడిపై ఓ కన్నేసి ఉంచండి: టీమిండియా దిగ్గజం 2027 world cup is locked my man gives signal 😭❤️#RohitSharma𓃵 pic.twitter.com/Aqs2T1xJcz — Rameshh (@RameshSuriyaa__) April 12, 2024 ఈ క్రమంలో జూన్ 5 ఐర్లాండ్తో మ్యాచ్తో టీమిండియా ఈ మెగా టోర్నీలో తన ప్రయాణం ఆరంభించనుంది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్కప్-2023 ఆడిన భారత జట్టు ఒక్క ఈవెంట్లోనూ చాంపియన్గా నిలవలేకపోయింది. కాగా రోహిత్ శర్మ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 2027 వరల్డ్కప్ వరకు కూడా హిట్మ్యానే కెప్టెన్గా ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Ind vs Aus 2024: పెర్త్లో తొలి టెస్టు!
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్లో మొదలయ్యే ఈ సిరీస్లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్లో... మూడో టెస్టు బ్రిస్బేన్లో... నాలుగో టెస్టు మెల్బోర్న్లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్లో జరిగే రెండో టెస్టు డే–నైట్గా జరుగుతుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది. -
WTC 2023-25: ఆసీస్కు 4.. టీమిండియాకు 5
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెండో టెస్ట్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. డబ్యూటీసీ ఫైనల్స్ రేసులో మొత్తం తొమ్మిది జట్లు ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరడం దాదాపుగా ఖరారైపోయింది. Australia jumps to the second spot in the World Test Championship 2023-25 points table after their victory against New Zealand in the second Test. pic.twitter.com/9xN3aCeAb9 — CricTracker (@Cricketracker) March 11, 2024 ప్రస్తుత సైకిల్లో ఆస్ట్రేలియా ఏడులో నాలుగు, భారత్ పదిలో ఐదు మ్యాచ్లు గెలిస్తే ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగతా జట్లలో సౌతాఫ్రికా ఎనిమిదిలో ఏడు.. న్యూజిలాండ్ ఎనిమిదిలో ఆరు.. పాకిస్తాన్ తొమ్మిదిలో ఏడు.. వెస్టిండీస్ తొమ్మిదిలో ఏడు.. ఇంగ్లండ్ 12కు 12.. బంగ్లాదేశ్ పదిలో ఏడు... శ్రీలంక 11లో ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే డబ్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. మిగతా జట్లతో పోలిస్తే.. భారత్, ఆసీస్లకు ఫైనల్కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆసీస్ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో ఐదు భారత్తో (స్వదేశంలో).. రెండు శ్రీలంకతో షెడ్యూలై ఉన్నాయి. Current cutoff for wtc final Probably india and austrailia will play final #WTC25 pic.twitter.com/vqRGjIUHxp — ICT FAN💙💙(MODI'S FAMILY) (@SAHURAGHAV26) March 11, 2024 భారత్.. రెండు బంగ్లాదేశ్తో (స్వదేశంలో).. మూడు న్యూజిలాండ్తో (స్వదేశంలో).. ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా సగం మ్యాచ్లు గెలిచినా టీమిండియా సునాయాసంగా ఫైనల్కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. వెస్టిండీస్తో రెండు, బంగ్లాదేశ్తో రెండు, శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు (స్వదేశంలో) మ్యాచ్లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్.. శ్రీలంకతో రెండు, భారత్తో మూడు, ఇంగ్లండ్తో మూడు (స్వదేశంలో) పాకిస్తాన్.. బంగ్లాదేశ్తో రెండు (స్వదేశంలో), ఇంగ్లండ్తో మూడు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, వెస్టిండీస్తో రెండు వెస్టిండీస్.. ఇంగ్లండ్తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), బంగ్లాదేశ్తో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు ఇంగ్లండ్.. వెస్టిండీస్తో మూడు (స్వదేశంలో), శ్రీలంకతో మూడు (స్వదేశంలో), పాకిస్తాన్తో మూడు, న్యూజిలాండ్తో మూడు బంగ్లాదేశ్.. శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్తో రెండు, భారత్తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), వెస్టిండీస్తో రెండు శ్రీలంక.. బంగ్లాదేశ్తో రెండు, ఇంగ్లండ్తో రెండు, న్యూజిలాండ్తో రెండు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో రెండు (స్వదేశంలో) -
న్యూజిలాండ్పై సూపర్ విక్టరీ.. రెండో స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.51గా ఉంది. ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్లో ఆసీస్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత బంగ్లాదేశ్ (50 శాతం విజయాలు), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యారీ (98 నాటౌట్), పాట్ కమిన్స్ (32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 162, సెకెండ్ ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
శతక్కొట్టిన రోహిత్.. డబ్ల్యూటీసీ చరిత్రలో ఒకే ఒక మొనగాడు!
Rohit Sharma trumps Babar Azam, levels Steve Smith: ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. ధర్మశాల మ్యాచ్లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️ Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm — JioCinema (@JioCinema) March 8, 2024 కాగా రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 48వ సెంచరీ కావడం విశేషం. సొంతగడ్డపై ఇంగ్లండ్పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మొదలైన నామమాత్రపు ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఐదు(5/72.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51), రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దెబ్బకు 218 పరుగులకే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా తొలిరోజే బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ అర్ధ శతకాలు బాది శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ కూడా రాణించాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ శతకం పూర్తి చేసుకోగా.. శుబ్మన్ గిల్ సైతం సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 264/1 స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ కంటే ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒకే ఒక భారత ఆటగాడు.. బాబర్ ఆజంను వెనక్కినెట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీల వీరులు జో రూట్(ఇంగ్లండ్)- 13 మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)- 11 కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 10 రోహిత్ శర్మ(ఇండియా)- 9 బాబర్ ఆజం(పాకిస్తాన్)- 8 చదవండి: #Mohammed Shami: మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ? -
హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్మ్యాన్.. తాజాగా బ్యాటింగ్లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా.. ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్మ్యాన్ 32 ఇన్నింగ్స్ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియా నెంబర్ వన్..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్ధానానికి చేరుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి పాలవ్వడం భారత జట్టుకు కలిసొచ్చింది. దీంతో మూడో స్ధానంలో భారత్.. 64.58 విజయ శాతంతో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించగా.. రెండు మ్యాచ్ల్లో ఓటమి, ఒక మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఇక ప్రస్తుత పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60.0 శాతం), ఆస్ట్రేలియా(59.09 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి స్ధానాల్లో బంగ్లాదేశ్ (50 శాతం) విజయాలతో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్తాన్ జట్టు 36.66 శాతంతో ఐదో స్టానంలో నిలిచింది. అయితే ఇంగ్లండ్తో జరగనున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. తమ అగ్ర పీఠంలో మరి కొన్ని రోజులు కొనసాగించే ఛాన్స్ ఉంది. చదవండి: #Shreyas Iyer: దేశం కోసం శ్రేయస్ అయ్యర్ త్యాగం.. బీసీసీఐ తప్పు చేసిందా? -
మరింత మెరుగుపడిన టీమిండియా.. దారుణంగా మారిన ఇంగ్లండ్ పరిస్థితి
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భారత క్రికెట్ జట్టు పరిస్థితి మరింత మెరుగుపడింది. రాంచీ టెస్ట్లో ఇంగ్లండ్పై విక్టరీతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని పదిలం చేసుకుని, ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ గెలుపుతో టీమిండియా విజయాల శాతం 64.58కు చేరింది. 75 శాతం విజయాలతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు భారత్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ జట్టు విజయాల శాతం 19.44 శాతానికి పడిపోయి చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్రేట్ కారణంగా ఆ జట్టు అదనంగా 19 పాయింట్లను కోల్పోయింది. డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, భారత్ల తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు వరుసగా ఉన్నాయి. ప్రస్తుత సైకిల్ ముగిసే లోపు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టెస్ట్ ఛాంపియప్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులతో మెరిసిన దృవ్ జురెల్.. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ రాణించి (39 నాటౌట్) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్కు జతగా శుభ్మన్ గిల్ (52 నాటౌట్) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 (రూట్ 122 నాటౌట్, జడేజా 4/67) భారత్ తొలి ఇన్నింగ్స్ 307 (దృవ్ జురెల్ 90, షోయబ్ బషీర్ 5/119) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 (జాక్ క్రాలే 60, అశ్విన్ 5/51) భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5 (రోహిత్ శర్మ 55, షోయబ్ బషీర్ 3/79) 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
దూసుకుపోతున్న రవీంద్ర జడేజా
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాఇటీవలికాలంలో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్ట్లో ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. అనంతరం బంతితో విజృంభించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. సెకెండ్ ఇన్నింగ్స్లో విశ్వరూపం ప్రదర్శించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 122 పరుగులకే కుప్పకూలి 434 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ మిస్ అయిన జడేజా తొలి మ్యాచ్లోనూ సత్తా చాటాడు. ఆ మ్యాచ్లోనూ అతను ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టిన జడేజా.. బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో 87, సెకెండ్ ఇన్నింగ్స్లో 2 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా రాటుదేలిన జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన జడేజా బ్యాటింగ్లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు (ఇంగ్లండ్తో మూడో టెస్ట్) 5 మ్యాచ్లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. వైజాగ్ టెస్ట్లో ఇంగ్లండ్పై విజయంతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో భారత్ పూర్వస్థితికి చేరింది. ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియా రెండో స్థానంలోనే ఉండింది. అయితే ఆ మ్యాచ్లో ఓటమితో రోహిత్ సేన రెండో స్థానం నుంచి ఐదో ప్లేస్కు పడిపోయింది. తాజా విజయంతో భారత్ తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఆస్ట్రేలియా (55 శాతం విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ (52.77) , సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), ఇంగ్లండ్ (25), శ్రీలంక వరుసగా రెండు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణమైన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్ను ఓడించిన విషయం తెలిసిందే. మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ స్కోర్ వివరాలు.. భారత్: 396 & 255 ఇంగ్లండ్: 253 & 292 -
ఇంగ్లండ్ చేతిలో పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని ఎదుర్కొని బాధలో ఉన్న టీమిండియాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం విడుదల చేసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి ఒక డ్రా, రెండు పరాజయాలు, రెండు విజయాలు నమోదు చేసింది. ఈ సైకిల్లో టీమిండియా విజయాల శాతం 43.33 శాతంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆరు మ్యాచ్ల్లో మూడింట విజయాలు, రెండింట్లో అపజయాలు, ఓ మ్యాచ్ డ్రా చేసుకుని 29.16 విజయాల శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, టెస్ట్ క్రికెట్లో నిన్న రెండు ఊహించని ఫలితాలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలిగి కూడా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు కాగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చిన్న జట్టైన వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్ విండీస్ చేతిలో ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సంచలన విజయంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో బోణీ కొట్టిన విండీస్ ఏడో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో ప్లేస్లో పాకిస్తాన్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్: 246 & 420 భారత్: 436 & 202 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం -
IND vs ENG 1st Test: అశ్విన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్గా
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అదే విధంగా ఓవరాల్గా డబ్ల్యూటీసీ హిస్టరీలో ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న మూడో బౌలర్గా అశూ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో బెన్ డకెట్ను ఔట్ చేసి భారత్కు తొలి వికెట్ను అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్లో అశ్విన్- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్(501) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వారిద్దరి ఆల్టైమ్ రికార్డు బద్దలైంది. చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో -
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు ఆస్ట్రేలియా.. మరి భారత్?
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 56.25 శాతం పాయింట్లతో కంగారూ జట్టు.. నాలుగో స్ధానం నుంచి టాప్ ప్లేస్కు ఎగబాకింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. ఐదింట విజయం, ఓ మ్యాచ్ను డ్రాగా ముగించింది. కాగా ఇప్పటివరకు టాప్ ప్లేస్లో ఉన్న భారత్( 54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు తొలి స్ధానానికి చేరుకుంది. అయితే భారత్ టాప్ ప్లేస్ను 24 గంటల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక భారత్ తర్వాతి స్ధానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్(50.0), బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
సంచలన విజయం.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రత్మక విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్కు ఎగబాకింది. అదే విధంగా ఈ మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. ఇక సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో న్యూజిలాండ్(50.0), ఆస్ట్రేలియా(50.0),బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోన్నాయి. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. భారత్కు బిగ్ షాక్! టాప్ ప్లేస్ అవుట్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన భారత్.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమిండియా తొలిస్దానంలో ఉండేది. కానీ ఈ ఓటమితో ఇప్పుడు భారత్ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్కు చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో వరుసగా పాకిస్తాన్(61.11),న్యూజిలాండ్(50.0) జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్ధానంలో ఉంది. కాగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. తమ స్ధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. చదవండి: IND Vs SA 2nd Test: గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. -
ఆసీస్ చేతిలో చిత్తైన పాక్.. అగ్రస్థానానికి టీమిండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఆసీస్తో జరిగిన తొలి టెస్ట్లో ఘోరంగా ఓడటంతో ఇప్పటివరకు టాప్లో ఉండిన పాక్ రెండో స్థానానికి పడిపోయింది. పాక్పై భారీ విజయంతో ఆసీస్ 2023-25 సైకిల్లో బోణీ కొట్టింది. ఈ సైకిల్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన ఆసీస్ కేవలం ఒకే మ్యాచ్లో గెలిచి, 41.67 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. భారత్.. ఈ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో విజయం సాధించి, 66.67 పాయింట్ల శాతంతో 16 పాయింట్లు కలిగి టాప్లో నిలిచింది. ఆసీస్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయిన పాక్ 2 మ్యాచ్ల్లో ఓ విజయంతో 66.67 పాయింట్ల శాతం కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్, పాక్ల తర్వాత న్యూజిలాండ్ (50 పాయింట్ల శాతం), బంగ్లాదేశ్ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్ (16.67), ఇంగ్లండ్ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 164, మిచెల్ మార్ష్ 90 పరుగులతో చెలరేగగా.. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. పాక్ తొలి ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్లో కివీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
చివరి టెస్టులో విజయం.. ఆసీస్తో సమానంగా ఇంగ్లండ్
యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టును గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో ఉన్న డిపెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు, ఇంగ్లండ్కు సమాన పాయింట్లు ఉండడం విశేషం. ఈ రెండు జట్లు 43.33 పర్సంటేజీ పాయింట్స్(PTC)తో 26 పాయింట్లు(ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా) కలిగి ఉన్నాయి. పెనాల్టీ కింద ఇరుజట్లకు రెండు పాయింట్లు కోత పడడంతో వారి పాయింట్స్లో వ్యత్యాసం లేకుండా పోయింది. ఇక తొలి రెండు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇటీవలే లంకపై టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన పాకిస్తాన్ 100 పర్సంటైల్తో 24 పాయింట్లతో(రెండు మ్యాచ్ల్లో రెండు గెలుపు) తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా 66.67 పర్సంటైల్తో 16 పాయింట్లతో(రెండు మ్యాచ్ల్లో ఒక గెలుపు, ఒక డ్రా) రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఇక వన్డే వరల్డ్కప్ ముగిసే వరకు ఏ జట్లకు టెస్టు సిరీస్లు లేవు. వరల్డ్కప్ ముగిశాకా టీమిండియా డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది. అటు పాకిస్తాన్ ఆస్ట్రేలియా గడ్డపై డిసెంబర్-జనవరిలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ల ఫలితాల అనంతరం పాయింట్స్ టేబుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. చదవండి: WI Vs IND 3rd ODI: టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా, సిరీస్ గెలిచేనా? Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు' -
Ind vs WI: వరణుడి దెబ్బ! ఇది ముంబైనా లేదంటే.. రోహిత్ శర్మ ట్వీట్ వైరల్
West Indies vs India, 2nd Test: కాస్త కష్టపడితే చాలు గెలుపు ఖాయమనుకున్న తరుణంలో వాన దేవుడు టీమిండియా ఆశలపై నీళ్లు కుమ్మరించిన విషయం తెలిసిందే. కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్కు అంతరాయం కలిగించి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో తొలి సిరీస్నే క్లీన్స్వీప్ చేయాలన్న రోహిత్ సేనకు నిరాశ మిగిల్చాడు. తద్వారా కీలక డబ్ల్యూటీసీ పాయింట్లను కూడా కోల్పోయేలా చేశాడు. విజయం పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తే.. కాగా వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన విషయం విదితమే. డొమినికాలో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లోనూ గెలిచి విజయం పరిపూర్ణం చేసుకోవాలని భావించింది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో విండీస్ను కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో బజ్బాల్ను మించిన ఆటతో ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టు ముందు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐదో రోజు ఆటలో విజయానికి టీమిండియా 8 వికెట్ల దూరంలో ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. వరణుడి దెబ్బ ఎడతెరిపి లేని వాన కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే కథ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగియగా.. భారత్కు నాలుగు పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించిన నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. రోహిత్ శర్మ ట్వీట్ వైరల్ సహచర ఆటగాళ్లతో కలిసి ఆకాశంకేసి చూస్తున్న ఫొటోను పంచుకున్న రోహిత్.. ‘‘ఇది ముంబైనా లేదంటే ట్రినిడాడా?’’ అంటూ ఎమోజీలు జతచేసి ఆశ్చర్యం ప్రదర్శించాడు. కాగా దేశ వాణిజ్య రాజధానిలో వానలు దంచికొడుతున్న వేళ ఈ ముంబై బ్యాటర్ ఈ మేరకు చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా వెస్టిండీస్తో తొలి టెస్టులో సెంచరీ(103)తో మెరిసిన రోహిత్.. రెండో టెస్టులో వరుస అర్ధ శతకాల(80, 57)తో ఆకట్టుకున్నాడు. చదవండి: ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే.. 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే Mumbai ya Trinidad 🤔🌧️ pic.twitter.com/jOPINPXW4a — Rohit Sharma (@ImRo45) July 25, 2023 -
Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్దే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ గెలుపు ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు! కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ‘డ్రా’ కావడంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు కోల్పోయింది. క్వీన్స్ పార్క్ ఓవల్లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్ను 1–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్లో 12 పాయింట్లు సాధించిన టీమిండియా ఖాతాలో ఈ ‘డ్రా’ కారణంగా 4 పాయింట్లే చేరాయి. అంతకు ముందు నాలుగో రోజు 365 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (28), చందర్పాల్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రోజు ఆట సాగితే మిగిలిన ఎనిమిది వికెట్లు తీయడం భారత్కు కష్టం కాకపోయేది. కానీ వానతో లెక్క మారిపోయింది. నాలుగో రోజు చివరి సెషన్లో భారత్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఈ సెషన్లో ఆడిన 9 ఓవర్లలోనే టీమిండియా 63 పరుగులు చేసింది. రోచ్ ఓవర్లో ఇషాన్ ‘సింగిల్ హ్యాండ్’తో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లోనే కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బంతి తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి విండీస్కు 365 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ ఛేదనలో విండీస్కు సరైన ఆరంభం లభించలేదు. బ్రాత్వైట్ పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచగా, చందర్పాల్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. ఒకదశలో అతను 50 బంతుల్లో 3 పరుగులే చేశాడు. అశి్వన్ ఈ జోడీని విడదీసి భారత్కు తొలి వికెట్ అందించాడు. స్వీప్ చేయబోయిన బ్రాత్వైట్ ఫైన్లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. అశి్వన్ తన తర్వాతి ఓవర్లోనే మెకన్జీ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చందర్పాల్, బ్లాక్వుడ్ (20 నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 438; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 255; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) సిల్వ (బి) వారికాన్ 38; రోహిత్ (సి) జోసెఫ్ (బి) గాబ్రియెల్ 57; గిల్ (నాటౌట్) 29; ఇషాన్ కిషన్ (నాటౌట్) 52; ఎక్స్ట్రాలు 5; మొత్తం (24 ఓవర్లలో 2 వికెట్లకు) 181 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–98, 2–202. బౌలింగ్: రోచ్ 4–0–46–0, జోసెఫ్ 4–0–37–0, హోల్డర్ 4–0–26–0, గాబ్రియెల్ 6–0–33–1, వారికాన్ 6–0–36–1. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్వైట్ (సి) ఉనాద్కట్ (బి) అశి్వన్ 28; చందర్పాల్ (నాటౌట్) 24; మెకెన్జీ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; బ్లాక్వుడ్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 4; మొత్తం (32 ఓవర్లలో 2 వికెట్లకు) 76. వికెట్ల పతనం: 1–38, 2–44. బౌలింగ్: సిరాజ్ 8–2–24–0, ముకేశ్ 5–4–5–0, ఉనాద్కట్ 3–2–1–0, అశ్విన్ 11–2–33–2, జడేజా 5–1–10–0. -
WTC Points Table: అగ్రస్థానంలో టీమిండియా.. పాక్ కూడా మనవెంటే!
ICC World Test Championship- 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ తొలి మ్యాచ్లోనే టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. వెస్టిండీస్తో డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కరేబియన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.. అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైశ్వాల్ 171 పరుగులతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాపర్ ఈ నేపథ్యంలో భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. జూలై 12న మొదలై మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఈ విజయం ద్వారా 12 పాయింట్లు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం ఆక్రమించింది. అయితే, దాయాది జట్టు కూడా రోహిత్ సేనను అనుసరించడం విశేషం. పాక్ కూడా మనవెంటే కాగా పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలిచింది. జూలై 16న మొదలై ఐదురోజుల పాటు సాగిన మ్యాచ్లో ఆతిథ్య లంకను చిత్తు చేసింది. కాగా పాక్కు కూడా తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో ఇదే తొలి మ్యాఛ్ కావడం విశేషం. దీంతో.. 12 పాయింట్లతో టీమిండియాతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో భాగంగా.. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన చాంపియన్ ఆస్ట్రేలియా.. రెండింట గెలిచి.. ఒక మ్యాచ్లో ఓడింది. చాంపియన్ ఎక్కడంటే ఈ క్రమంలో 22 పాయింట్లు(61.11శాతం) సాధించి మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 10 పాయింట్ల(పెనాల్టీ పడటం వల్ల రెండు పాయింట్లు మైనస్)తో నాలుగోస్థానంలో ఉంది. మిగతా జట్లలో శ్రీలంక, వెస్టిండీస్ ఒక్కో ఓటమితో టాప్ 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మిగతా వాటిలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఇంకా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు గురువారం మొదలుకాగా.. జూలై 24 నుంచి శ్రీలంక- పాక్ రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! -
Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే!
Ind Vs WI Test Series- New Test Jersey: దాదాపు నెలరోజుల విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలో దిగనుంది. బుధవారం నుంచి వెస్టిండీస్తో మొదలుకానున్న టెస్టు సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ విండీస్తో ఆడనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్11 ఇటీవలే బీసీసీఐతో జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విండీస్తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు డ్రీమ్11 లోగోతో కూడిన జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. తెలుపు రంగు టీషర్ట్పై ఎరుపు రంగులో ఉన్న డ్రీమ్11 లోగో, భుజాలపై నీలి రంగు గీతలతో టెస్టు జెర్సీ కొత్తగా కనిపిస్తోంది. అయితే, చాలా మంది టీమిండియా అభిమానులకు కొత్త జెర్సీలు నచ్చలేదు. క్రికెటర్ల ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో మిశ్రమ స్పందన వస్తోంది. ఛీ.. మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? కొంతమంది కొత్త జెర్సీ బాగానే ఉందని పేర్కొంటుండగా.. మరికొంత మంది మాత్రం.. ‘‘ఛీ మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? నాకైతే వాంతికొచ్చేలా ఉంది. డ్రీమ్11 లోగో మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాత జెర్సీలే చూడటానికి బాగుండేవి’’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య వరుస సిరీస్లకు తెరలేవనుంది. ఇక ఆగష్టు 13న జరిగే ఆఖరి టీ20తో భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగియనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆఖరిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడింది. ఇంగ్లండ్లో జరిగిన ఈ ఈవెంట్లో 209 పరుగుల భారీ తేడాతో ఓడి అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో తాజా డబ్ల్యూటీసీ సైకిల్ ఆరంభ సిరీస్లో సత్తా చాటి తిరిగి గాడిలో పడాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో డొమినికాలో జరుగనున్న తొలి టెస్టు కోసం అన్ని రకాలుగా సిద్ధమైంది. కాగా డ్రీమ్11 మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రధాన స్పాన్సర్గా కొనసాగనున్న విషయం తెలిసిందే. చదవండి: బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్ Team India in the headshot session with the new jersey. pic.twitter.com/4l13eieL6R — Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2023 -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్తో మ్యాచ్లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్లు; మూడు స్వదేశం.. మూడు విదేశం
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండుసార్లు రన్నరప్గా నిలిచిన భారత జట్టు కోసం 2023–25 డబ్ల్యూటీసీ సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో భారత్ 6 టెస్టు సిరీస్లు ఆడనుంది. ఇందులో 3 స్వదేశంలో, 3 విదేశాల్లో ఉంటాయి. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనతో భారత్ ఈ పోరును మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. అనంతరం సొంతగడ్డపై వరుసగా 3 సిరీస్లు ఆడుతుంది. ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో, బంగ్లాదేశ్తో, ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో తలపడుతుంది. చివరగా ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆ్రస్టేలియాకు వెళుతుంది. ఈ సిరీస్లలో ప్రదర్శన ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ అర్హత సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరం. రెండేళ్లు, నాలుగేళ్లు ముందుగా... 2025 జూన్లో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ తలపడుతుంది. దీనికి సంబంధించిన వేదికలను ఈసీబీ అప్పుడే ప్రకటించడం విశేషం. లార్డ్స్, ఓవల్, ఎడ్జ్బాస్టన్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానాల్లో ఇరు జట్లు ఐదు టెస్టులు ఆడతాయి. 2029లో కూడా భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. -
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు
-
అప్పగించేశారు.. డబ్ల్యూటీసీ విజేతగా ఆసీస్
ఐదో రోజు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లి, రహానే కలిసి కమాల్ చూపిస్తారనుకున్న భారత అభిమానులకు అసలు పరిస్థితి కొద్ది సేపటికే అర్థమైంది. ఒక వికెట్ పడగానే మిగతా వారంతా అనుసరించేశారు. కోలుకునే అవకాశమే లేకుండా మ్యాచ్ను అప్పగించేశారు. వరుసగా రెండోసారి టీమిండియా ఫైనల్ చేరిన ఆనందం అక్కడికే పరిమితం కాగా, ఆస్ట్రేలియా తొలిసారి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. గతంలో భారత్తో టెస్టుల్లో చేసిన పొరపాట్లను ఆ్రస్టేలియా ఈసారి చేయలేదు. మరో ‘గాబా’కు అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు తొలి బంతి నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లను కదలనీయకుండా చేసిన కంగారూలు ఒత్తిడి పెంచి వరుస వికెట్లు తీశారు. వన్డే, టి20 ప్రపంచకప్ల తర్వాత సాంప్రదాయ క్రికెట్లో వరల్డ్ కప్లాంటి చాంపియన్షిప్ను అందుకొని కంగారూలు శిఖరాన నిలిచారు. లండన్: రెండో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ను ఆ్రస్టేలియా సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసింది. చివరి రోజు హోరాహోరీగా సాగుతుందనుకున్న ఆట భారత్ పేలవ బ్యాటింగ్తో ఏకపక్షంగా ముగిసింది. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 164/3తో ఆట కొనసాగించిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (78 బంతుల్లో 49; 7 ఫోర్లు), అజింక్య రహానే (108 బంతుల్లో 46; 7 ఫోర్లు) తమ జోరును చివరి రోజు కొనసాగించలేకపోయారు. లయన్కు 4 వికెట్లు దక్కాయి. ట్రవిస్ హెడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. విజేత ఆ్రస్టేలియా జట్టుకు గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 19 లక్షలు), రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 59 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 23.3 ఓవర్లు... 70 పరుగులు... 7 వికెట్లు... చివరి రోజు భారత జట్టు ప్రదర్శన ఇది. శనివారం ఆఖరి గంటలో ప్రదర్శించిన పట్టుదల గానీ, దూకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకరి వెనుక ఒకరు వరుస కట్టడంతో లంచ్లోపే ఓటమి ఖాయమైంది. తొలి 6 ఓవర్ల పాటు కోహ్లి, రహానే గట్టిగా నిలబడ్డారు. అయితే బోలండ్ వేసిన తర్వాతి ఓవర్ ఆటను మలుపు తిప్పింది. స్లిప్లో స్మిత్ చక్కటి క్యాచ్కు కోహ్లి వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే జడేజా (0) కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చెత్త బౌలింగ్ వేసిన స్టార్క్ అసలు సమయంలో తన విలువను చూపించాడు. అతని బంతిని ఆడలేక రహానే కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ వేగంగా ఓటమి దిశగా పయనించింది. తొలి ఇన్నింగ్స్లో ఆదుకున్న శార్దుల్ (0) ఈసారి నిలవలేకపోగా, ఉమేశ్ యాదవ్ (1) అతడిని అనుసరించాడు. కొద్దిసేపు పోరాడిన శ్రీకర్ భరత్ (41 బంతుల్లో 23; 2 ఫోర్లు)ను వెనక్కి పంపిన లయన్, తన తర్వాతి ఓవర్లో సిరాజ్ (1)ను అవుట్ చేసి భారత్ ఆట ముగించాడు. 1 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్లను గెలిచిన తొలి జట్టుగా ఆ్రస్టేలియా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా జట్టు ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) వన్డే వరల్డ్కప్ను... రెండుసార్లు (2006, 2009) చాంపియన్స్ ట్రోఫీని... ఒకసారి (2021) టి20 వరల్డ్కప్ను.. ఒకసారి (2023) ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ను సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 270/8 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లయన్ 43; గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; కోహ్లి (సి) స్మిత్ (బి) బోలండ్ 49; రహానే (సి) క్యారీ (బి) స్టార్క్ 46; జడేజా (సి) క్యారీ (బి) బోలండ్ 0; భరత్ (సి అండ్ బి) లయన్ 23; శార్దుల్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఉమేశ్ (సి) క్యారీ (బి) స్టార్క్ 1; షమీ (నాటౌట్) 13; సిరాజ్ (సి) బోలండ్ (బి) లయన్ 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (63.3 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93, 4–179, 5–179, 6–212, 7–213, 8–220, 9–224, 10–234. బౌలింగ్: కమిన్స్ 13–1–55–1, బోలండ్ 16–2–46–3, స్టార్క్ 14–1–77–2, గ్రీన్ 5–0–13–0, లయన్ 15.3–2–41–4. -
టాస్ నుంచి ఓటమి వరకు...
‘వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ గెలవనంత మాత్రాన మా జట్టు గత రెండేళ్లలో సాధించిన విజయాల విలువ తగ్గదు. మా టీమ్ ఎన్నో గొప్ప విజయాలు అందుకుంది’... డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభానికి ముందు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్య ఇది. అంకెల్లో చూస్తే అది వాస్తవమే అయినా, ఒక మెగా ఈవెంట్కు ముందు ఈ తరహా నెగెటివ్ వ్యాఖ్యలు కోచ్ నుంచి రావడం ఎవరికీ నచ్చలేదు. ఓడిపోవడానికి ముందే దాని కోసం సాకులు వెతుకుతున్నట్లుగా ఉందని దీనిపై చాలా మంది క్రికెట్ అభిమానులు విమర్శించారు. చివరకు మ్యాచ్ ఫలితం అలాగే వచ్చింది. ♦ ఆటగాడిగా దిగ్గజ స్థాయి ఉన్న ద్రవిడ్ కోచ్గా అండర్–19, ఇండియా ‘ఎ’ టీమ్ల తరఫున మాత్రం గొప్ప ఫలితాలు రాబట్టాడు. అయితే సీనియర్ టీమ్ కోచ్గా ద్రవిడ్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదనేది వాస్తవం. టీమ్ మేనేజ్మెంట్లో ప్రధాన భాగమైన ద్రవిడ్ తొలి రోజే పిచ్పై అంచనా తప్పడం భారత్ను దెబ్బ తీసిందనేది వాస్తవం. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని తెలిసినా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పు. ఇంగ్లండ్లో వాతావరణం గంటగంటకూ మారుతుందని ద్రవిడ్కు బాగా తెలుసు. మన పేసర్లపై నమ్మకం ఉండటమే కాదు... మబ్బులు కమ్మిన వేళ మనం బ్యాటింగ్ తీసుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతే జట్టు కుప్పకూలిపోతుందనే భయం కూడా ద్రవిడ్ మనసులో ఉండవచ్చు. గంట తర్వాత అంతా మారిపోయింది. హెడ్, స్మిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆ భాగస్వామ్యంతోనే భారత్ వెనకడుగు వేసింది. తొలిరోజు ఆసీస్ 327/3 వద్ద ముగించడంతోనే మన ఓటమికి పునాది పడింది. భారత్ సన్నాహాలు బాగా లేవనే వాస్తవాన్ని మాత్రం అతను టెస్టు ముగిసిన తర్వాత అంగీకరించాడు. ‘ఒక కోచ్గా మాకు ప్రాక్టీస్కు లభించిన సమయంతో సంతృప్తిగా లేను. అయితే అది నా చేతుల్లో లేదు. షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. నాకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఆడాలి’ అని ద్రవిడ్ చెప్పాడు. ♦ అగ్రశ్రేణి బౌలర్ అశ్విన్ను తప్పించడం కూడా చర్చనీయాంశం. అతను భారత్లో మాత్రమే బాగా ఆడగలడనేది కూడా అపోహ మాత్రమే. మ్యాచ్కు ముందు అశ్విన్ ప్రత్యేకతపై మాట్లాడిన సచిన్ టెండూల్కర్ మ్యాచ్ తర్వాత అదే అభిప్రాయం వ్యక్తం చేయడం అతని విలువను చూపిస్తుంది. ‘గొప్ప బౌలర్లకు పిచ్తో పని లేదు. టరి్నంగ్ లేని చోట కూడా ఫలితాలు సాధించే అశ్విన్ను ఎందుకు ఆడించలేదో నాకూ అర్థం కాలేదు’ అని సచిన్ చెప్పాడు. ఆసీస్పై మెరుగైన రికార్డు, ఆ జట్టులో టాప్–6లో నలుగురు ఎడంచేతి వాటం కావడంతో కచ్చితంగా అతను ప్రభావం చూపించగలిగే వాడనేది వాస్తవం. ఆల్రౌండర్, గత ఓవల్ టెస్టులో ప్రదర్శన ఆధారంగా శార్దుల్కు చోటు ఖాయం కాగా... ఉమేశ్ యాదవ్కు బదులు అశ్విన్ను ఆడించి ఉండే బాగుండేది. ఉమేశ్ ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలం కాగా... చివరి ఇన్నింగ్స్లో లయన్ చూపించిన ప్రభావం అశ్విన్ను గుర్తు చేసింది. ♦ మ్యాచ్లో మన ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన అజింక్య రహానేకే ఎక్కువ మార్కులు పడతాయి. రెండు ఇన్నింగ్స్లలోనూ అతను ప్రభావం చూపించగలిగాడు. ఇక శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్లో జట్టును ఆదుకున్నా... రెండో ఇన్నింగ్స్లో ఇద్దరూ విఫలమయ్యారు. బౌలర్లుగా వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. షమీ, సిరాజ్ మాత్రమే చాలావరకు తమ స్థాయిలో గట్టిగా ప్రయత్నించారు. అయితే ఎన్ని విశ్లేషణలు చేసినా... టాప్–4 బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బ తీసిందనేది వాస్తవం. తొలి ఇన్నింగ్స్లోనూ ఈ నలుగురు విఫలం కాగా, రెండో ఇన్నింగ్స్లో కీలక సమయాల్లో రోహిత్, పుజారా చెత్త షాట్లు ఆడి ఛేదనను కఠినంగా మార్చేశారు. లయన్ తొలి ఓవర్లోనే స్వీప్ షాట్కు ప్రయత్నించి రోహిత్ చేసిన సాహసం. చాలా రోజులుగా కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన పుజారా అనుభవం ఇక్కడ పనికొస్తుందని భావించగా, అది అర్ధ సత్యమే. పుజారా చేసిన పరుగులన్నీ కౌంటీలో పేలవమైన బౌలర్లు ఉండే ద్వితీయ శ్రేణి మ్యాచుల్లోనే! ఐపీఎల్ ఆడని ఒకే ఒక ఆటగాడు పుజారా ఐపీఎల్ తరహా షాట్కు ప్రయత్నించి అవుట్ కావడం ఆశ్చర్యకరం. ‘కోహ్లి చెత్త షాట్ ఆడాడు. అది ఎందుకు ఆడాడో అతడినే అడగాలి. గెలవాలంటే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని అతను చెబుతుంటాడు. ఇలాంటి షాట్తో అది సాధ్యమా’ అని గావస్కర్ విమర్శించడం విశేషం. ♦ బుమ్రా, పంత్ లేని లోటు కనిపించిందనేది వాస్తవమే అయినా... ఓటమికి అది మాత్రం కారణం కాదు. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ బ్యాటింగ్పై చాలా మంది విమర్శలు చేస్తున్నా ఆ మాటలకు విలువ లేదు. తన అసలు బాధ్యత వికెట్ కీపింగ్లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టాప్–6 పరుగులు చేయకుండా 7వ నంబర్ ఆటగాడిని ప్రశ్నించడం అర్థరహితం. రెండేళ్ల క్రితం కూడా న్యూజిలాండ్తో ఫైనల్లో భారత్ ఇదే టాప్–5తో ఆడింది. నాడూ రెండు ఇన్నింగ్స్లోలనూ బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఓడింది. ఇప్పుడూ అదే పునరావృతమైంది. ♦ మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు సిరీస్లు, ఇటీవల భారత గడ్డపై మరో సిరీస్ కలిపి వరుసగా 3 సిరీస్లలో టీమిండియా చేతిలో ఓడిన ఆ్రస్టేలియా ఈ మ్యాచ్కు మాత్రం బాగా సన్నద్ధమై వచ్చింది. ఐపీఎల్ ఆడిన వార్నర్, గ్రీన్ మినహా అంతా చాలా రోజులుగా కఠోర సాధన చేశారు. అది ఓవల్లో కనిపించింది. రెండేళ్ల క్రితం ఓవర్రేట్ జరిమానాగా పాయింట్ల కోతతో ఫైనల్ అవకాశాలు కోల్పోయిన కంగారూలు ఈ సారి తుది పోరుకు అర్హత సాధించడంతో పాటు తమ పూర్తి సత్తాను చాటి విజేతగా నిలిచారు. –సాక్షి క్రీడా విభాగం -
వంద శాతం విజయం మాదే: షమీ
-
మరో 280 పరుగులు...
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల ఛేదన 418... సాధించి 20 ఏళ్లయింది... ఓవల్ మైదానంలో అయితే 263 పరుగులే, అదీ 1902లో వచ్చింది. ఈ రెండింటితో పోలిస్తే ప్రస్తుత లక్ష్యం 444 పరుగులు చాలా ఎక్కువ... అయితే పాత లెక్కల ప్రతికూలతలకంటే పట్టుదలతో కూడిన ప్రదర్శన ఫలితాన్ని ఇవ్వవచ్చు! వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను గెలుచుకునేందుకు భారత్ను విజయం ఊరిస్తోంది. పరుగు తేడాతో రోహిత్, పుజారా వెనుదిరిగినప్పుడు సందేహం ఉన్నా... కోహ్లి, రహానే కలిసి ఆశలు రేపారు. వీరిద్దరి ఆటతో పాటు పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తున్న తీరు చూస్తే చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. అయితే మరో వికెట్ ఆసీస్కు దారులు తెరిచే అవకాశమూ ఉంది. టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలిచేందుకు భారత్, ఆ్రస్టేలియా మధ్య ఆఖరి రోజు ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు),రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్తో ఇప్పటికే అభేద్యంగా 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు విజయం కోసం భారత్కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్కు 7 వికెట్లు అవసరం. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. క్యారీ జోరు... ఆ్రస్టేలియా భారత్కు భారీ లక్ష్యాన్ని విధించగలగడంలో కీపర్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు)దే కీలకపాత్ర. శనివారం ఆసీస్ 40.3 ఓవర్లు ఆడి మరో 147 పరుగులు జత చేసింది. వాటిలో క్యారీ, మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్కు 20 ఓవర్లలో 93 పరుగులు జోడించడం విశేషం. ఓవర్ నైట్ బ్యాటర్లు లబుషేన్ (41; 4 ఫోర్లు), గ్రీన్ (25; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా, క్యారీ మాత్రం బౌండరీలతో చకచకా పరుగులు రాబట్టాడు. 82 బంతుల్లో క్యారీ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు స్టార్క్ను అవుట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, తాను అవుట్ కాగానే కమిన్స్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. రోహిత్ రాణించినా... ఛేదనను ఓపెనర్లు రోహిత్, గిల్ (19 బంతుల్లో 18; 2 ఫోర్లు) దూకుడుగానే ఆరంభించారు. దాంతో 7 ఓవర్లలోనే స్కోరు 41 పరుగులకు చేరింది. ఈ దశలో గ్రీన్ పట్టిన వివాదాస్పద క్యాచ్తో గిల్ నిష్క్రమించాడు. గ్రీన్ క్యాచ్ అందుకుంటున్నప్పుడు బంతి నేలకు తగిలినట్లుగా కనిపించింది. టీవీ రీప్లేలోనూ సందేహాస్పదంగానే ఉన్నా అంపైర్ చివరకు అవుట్గా ప్రకటించడంతో గిల్ నిష్క్రమించక తప్పలేదు. టీ విరామం తర్వాతా రోహిత్ ధాటి కొనసాగింది. అయితే లయన్ తొలి ఓవర్లో అనవసరపు స్వీప్ షాట్కు ప్రయత్నించి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఐదు బంతులకే పుజారా (47 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా అవుట్ కావడంతో భారత్ కుప్పకూలుతుందేమో అనిపించింది. కానీ కోహ్లి, రహానే తమ అపార అనుభవంతో జట్టును ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా క్రీజులో నిలబడటంతో పాటు వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లు కూడా పూర్తిగా నియంత్రణ కోల్పోయి బంతులు వేశారు. ఆట చివర్లో మరో వికెట్ తీయలేక కంగారూ శిబిరంలో తీవ్ర అసహనం కనిపించింది. భారత్ ఈ ఇన్నింగ్స్లో 4.10 రన్రేట్తో పరుగులు సాధించడం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (సి) పుజారా (బి) ఉమేశ్ 41; స్మిత్ (సి) శార్దుల్ (బి) జడేజా 34; హెడ్ (సి అండ్ బి) జడేజా 18; గ్రీన్ (బి) జడేజా 25; క్యారీ (నాటౌట్) 66; స్టార్క్ (సి) కోహ్లి (బి) షమీ 41; కమిన్స్ (సి) (సబ్) అక్షర్ (బి) షమీ 5; ఎక్స్ట్రాలు 26; మొత్తం (84.3 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 270. వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111, 5–124, 6–167, 7–260, 8–270. బౌలింగ్: షమీ 16.3–6–39–2, మొహమ్మద్ సిరాజ్ 20–2–80–1, శార్దుల్ ఠాకూర్ 8–1–21–0, ఉమేశ్ యాదవ్ 17–1–54–2, రవీంద్ర జడేజా 23–4–58–3. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీ) (బి) లయన్ 43; శుబ్మన్ గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 44; అజింక్య రహానే (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 12; మొత్తం (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93. బౌలింగ్: కమిన్స్ 9–0–42–1, బోలండ్ 11–1–38–1, మిచెల్ స్టార్క్ 7–0–45–0, గ్రీన్ 2–0–6–0, నాథన్ లయన్ 11–1–32–1. -
అంతరం తగ్గించినా... ఆసీస్దే పైచేయి!
మూడో రోజు ఆటలో మన బ్యాటింగ్ కుప్పకూలిపోలేదు. ఎదురుదాడికి దిగిన రహానే, శార్దుల్ భాగస్వామ్యం జట్టును కాస్త మెరుగైన స్థితికి చేర్చింది. ఆపై మన బౌలర్లు పట్టుదలగా ఆడి ఆసీస్ను నిలువరించగలిగారు. అయినా సరే పూర్తిగా మనదే రోజని చెప్పలేం! తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. పిచ్ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కీలకదశకు చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్ (118 బంతుల్లో 41 బ్యాటింగ్; 4 ఫోర్లు), గ్రీన్ (7 బ్యాటింగ్) క్రీజ్లో ఉండగా... స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 34; 3 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 151/5తో తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (129 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్), శార్దుల్ ఠాకూర్ (109 బంతుల్లో 51; 6 ఫోర్లు) ఏడో వికెట్కు 109 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నారు. శతక భాగస్వామ్యం... మూడో రోజు రెండో బంతికే భరత్ (5)ను బోలండ్ బౌల్డ్ చేయడంతో ఆసీస్కు శుభారంభం లభించింది. పరిస్థితి చూస్తే భారత్ 200 పరుగులైనా చేయగలుగుతుందా అనిపించింది. అయితే రహానే, శార్దుల్ శతక భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. కమిన్స్ బౌలింగ్లో వరుసగా 4, 6 కొట్టి రహానే 92 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్లో ఆసీస్ పేలవ బౌలింగ్తో భారత బ్యాటర్ల ఆధిక్యం కొన సాగింది. 22 ఓవర్లలోనే ఏకంగా 4.95 రన్రేట్తో జట్టు 109 పరుగులు సాధించడం విశేషం. అయితే లంచ్ తర్వాత ఆట ఆసీస్వైపు మొగ్గింది. గ్రీన్ అద్భుత క్యాచ్కు రహానే వెనుదిరగ్గా, ఉమేశ్ (5) అనుసరించాడు. 108 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన శార్దుల్ను ఎట్టకేలకు కమిన్స్ అవుట్ చేయగా, షమీ (13) వికెట్ తీసి స్టార్క్ భారత ఇన్నింగ్స్ ముగించాడు. లంచ్ తర్వాత 9.4 ఓవర్లలోనే ఆసీస్ మిగిలిన 4 వికెట్లు పడగొట్టగలిగింది. ఆకట్టుకున్న జడేజా... చేతిలో భారీ ఆధిక్యం ఉన్నా ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని నిలువరించారు. వార్నర్ (1), ఖ్వాజా (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... లబుషేన్, స్మిత్ పరిస్థితిని చక్కదిద్దారు. లబుషేన్ ఎక్కువ భాగం డిఫెన్స్కే కట్టుబడ గా, స్మిత్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ధాటి గా ఆడే క్రమంలో స్మిత్ ఆడిన చెత్త షాట్ ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. జడేజా బౌలింగ్లో అనూ హ్యంగా గాల్లోకి బంతి లేపి స్మిత్ క్యాచ్ ఇవ్వగా, హెడ్ (18) కూడా విఫలమయ్యాడు. బౌండరీ వద్ద ఉమేశ్ క్యాచ్ వదిలేసినా... తర్వాతి బంతికే జడేజాకు అతను రిటర్న్ క్యాచ్ అందించాడు. అయితే లబుషేన్, గ్రీన్ మరో 7.3 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. శార్దుల్ సూపర్... రెండేళ్ల క్రితం ఓవల్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ అర్ధసెంచరీ చేసిన శార్దుల్ ఈసారీ అదే ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అనేక సార్లు బంతి అతని శరీరాన్ని బలంగా తాకినా పట్టుదలగా నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది. ‘సున్నా’ వద్ద అతను ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ను ఖ్వాజా వదిలేయగా, 8 పరుగుల వద్ద సునాయాస క్యాచ్ను గ్రీన్ నేలపాలు చేశాడు. 36 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయినా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. రహానే 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యారీ, వార్నర్ సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేశారు. ఈ ఇన్నింగ్స్లో రహానే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్ ఇన్నింగ్స్ చివర్లో సిరాజ్ ఎల్బీ కోసం గ్రీన్ అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. సిరాజ్ వెంటనే రివ్యూ కోరినా... అదేమీ పట్టించుకోకుండా ఆసీస్ ఆటగాళ్లంతా ఆలౌట్ అనుకొని మైదానం వీడారు. వార్నర్, ఖాజా ప్యాడ్లు కట్టుకునేందుకు సన్నద్ధమయ్యారు. అయితే రీప్లేలో బంతి బ్యాట్కు తగిలినట్లు తేలింది. దాంతో వారంతా వెనక్కి వచ్చారు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కమిన్స్ 15; గిల్ (బి) బోలండ్ 13; పుజారా (బి) గ్రీన్ 14; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 14; రహానే (సి) గ్రీన్ (బి) కమిన్స్ 89; జడేజా (సి) స్మిత్ (బి) లయన్ 48; భరత్ (బి) బోలండ్ 5; శార్దుల్ (సి) క్యారీ (బి) గ్రీన్ 51; ఉమేశ్ (బి) కమిన్స్ 5; షమీ (సి) క్యారీ (బి) స్టార్క్ 13; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 29; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 296. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–50, 4–71, 5–142, 6–152, 7–261, 8–271, 9–294, 10–296. బౌలింగ్: స్టార్క్ 13.4–0–71–2, కమిన్స్ 20–2–83–3, బోలండ్ 20–6–59–2, గ్రీన్ 12–1–44–2, లయన్ 4–0–19–1. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (బ్యాటింగ్) 41; స్మిత్ (సి) శార్దుల్ (బి) జడేజా 34; హెడ్ (సి అండ్ బి) జడేజా 18; గ్రీన్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 9; మొత్తం (44 ఓవర్లలో 4 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111. బౌలింగ్: షమీ 10–4–17–0, సిరాజ్ 12–2–41–1, శార్దుల్ 6–1– 13–0, ఉమేశ్ 7–1–21–1, జడేజా 9–3–25–2. -
భారత్ ఎదురీత!
15, 13, 14, 14... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత టాప్–4 బ్యాటర్ల స్కోర్లు ఇవి! కొండంత స్కోరు ఎదురుగా కనిపిస్తుండగా మన ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో రెండో రోజు కూడా ఆ్రస్టేలియాదే పైచేయి అయింది. మన బౌలర్ల ఆట కాస్త మెరుగుపడటంతో ప్రత్యర్థిని తొందరగానే ఆలౌట్ చేయగలిగిన టీమిండియా ఆనందం కొద్ది సేపటికే ఆవిరైంది. కంగారూ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాటర్లను కట్టి పడేశారు. జడేజా, రహానే కీలక భాగస్వామ్యంతో ఆదుకోకపోయుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సగం బ్యాటర్లు ఇప్పటికే పెవిలియన్ చేరగా, మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), భరత్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఐదుగురు ఆసీస్ బౌలర్లూ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 327/3తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా 469 పరుగులకు ఆలౌ టైంది. హెడ్ (174 బంతుల్లో 163; 25 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (268 బంతుల్లో 121; 19 ఫోర్లు) నాలుగో వికెట్కు 285 పరుగులు జోడించారు. బౌలర్ల జోరు... రెండో రోజును ఆస్ట్రేలియా ధాటిగా ఆరంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ 229 బంతుల్లో కెరీర్లో 31వ సెంచరీ పూర్తి చేసుకోగా, హెడ్ కూడా కొద్ది సేపటికే 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తమ జోరు కొనసాగించిన హెడ్, స్మిత్ మొదటి 6 ఓవర్లలోనే 34 పరుగులు జోడించారు. దాంతో స్కోరు 361/3కి చేరింది. ఈ స్థితిలో భారత బౌలర్లు ఆసీస్ను నిలవరించగలిగారు. హెడ్ను అవుట్ చేసి భారీ భాగస్వామ్యాన్ని సిరాజ్ విడదీయగా, గ్రీన్ (6) విఫలమయ్యాడు. అప్పటి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ కూడా శార్దుల్ బౌలింగ్లో దూరంగా వెళుతున్న బంతిని స్టంప్స్పైకి ఆడుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లూ చేతులెత్తేసినా... అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన బ్యాటింగ్ కారణంగా ఆసీస్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. ఆ్రస్టేలియా 108 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోగా... సిరాజ్ టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు 36.3 ఓవర్లు ఆడిన ఆసీస్ 142 పరుగులు సాధించింది. టపటపా... భారత జట్టుకు ఓపెనర్ల నుంచి ఆశించిన ఆరంభం లభించలేదు. ఒకేస్కోరు వద్ద రోహిత్ (15), గిల్ (13) అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కమిన్స్ అద్భుత బంతితో రోహిత్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, బోలండ్ వేసిన బంతిని ఆడకుండా వదిలేసి గిల్ వెనుదిరిగాడు. ఆదుకుంటారనుకున్న పుజారా (14), కోహ్లి (14) కూడా విఫలమయ్యారు. పుజారా కూడా బంతిని వదిలేసి బౌల్డ్ కాగా, స్టార్క్ బౌన్సర్కు కోహ్లి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో జడేజా, రహానే కలిసి జట్టును ఆదుకున్నారు. రహానే క్రీజ్లో నిలదొక్కునేందుకు పట్టుదల కనబర్చగా, జడేజా దూకుడుతో పరుగులు వేగంగా వచ్చాయి. 17 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా... అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఐదో వికెట్కు 71 పరుగులు జోడించిన అనంతరం జడేజాను లయన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వికెట్ పడకుండా రహానే, భరత్ మరో 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దుల్ 43; ఖ్వాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమీ 26; స్మిత్ (బి) శార్దుల్ 121; హెడ్ (సి) భరత్ (బి) సిరాజ్ 163; గ్రీన్ (సి) గిల్ (బి) షమీ 6; క్యారీ (ఎల్బీ) (బి) జడేజా 48; స్టార్క్ (రనౌట్) 5; కమిన్స్ (సి) రహానే (బి) సిరాజ్ 9; లయన్ (బి) సిరాజ్ 9; బోలండ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 38; మొత్తం (121.3 ఓవర్లలో ఆలౌట్) 469. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76, 4–361, 5–376, 6–387, 7–402, 8–453, 9–468, 10–469. బౌలింగ్: షమీ 29–4–122–2, సిరాజ్ 28.3–4–108–4, ఉమేశ్ 23–5–77–0, శార్దుల్ 23–4–83–2, జడేజా 18–2–56–1. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కమిన్స్ 15; గిల్ (బి) బోలండ్ 13; పుజారా (బి) గ్రీన్ 14; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 14; రహానే (బ్యాటింగ్) 29; జడేజా (సి) స్మిత్ (బి) లయన్ 48; భరత్ (బ్యాటింగ్) 5; ఎక్స్ట్రాలు 13; మొత్తం (38 ఓవర్లలో 5 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–50, 4–71, 5–142. బౌలింగ్: స్టార్క్ 9–0–52– 1, కమిన్స్ 9–2–36–1, బోలండ్ 11–4–29–1, గ్రీన్ 7–1–22–1, లయన్ 2–0–4–1. -
తొలి రోజే ‘తల’పోటు...
పిచ్పై తేమ, కాస్త పచ్చిక, ఆకాశం మేఘావృతం... అన్నీ పేస్ బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులే. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. ఈ స్థితిలో ఏ కెప్టెనైనా ఏం చేస్తాడో అతను కూడా అదే చేస్తూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో షమీ, సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ఫీల్డింగ్ ఎంచుకున్న నిర్ణయం సరైందనిపించింది... ఒక గంట గడిచింది. వాతావరణం అంతా మారిపోయింది... పిచ్ ఒక్కసారిగా బ్యాటర్ల పక్షాన చేరింది... హెడ్, స్మిత్ దీనిని అద్భుతంగా వాడుకున్నారు. సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశారు. మెరుపు వేగంతో ఆడిన హెడ్ సెంచరీతో చెలరేగగా, స్మిత్ శతకానికి చేరువయ్యాడు. చివరి సెషన్లోనైతే మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి... డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో తొలి రోజు పూర్తిగా ఆ్రస్టేలియాదే. రెండో రోజు వారిని నిలువరించలేకపోతే భారత్ ఈ టెస్టుపై ఆశలు కోల్పోవాల్సిందే! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. భారత్తో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (156 బంతుల్లో 146 బ్యాటింగ్; 22 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 బ్యాటింగ్; 14 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. భారత తుది జట్టులో అశ్విన్కు స్థానం దక్కకపోగా, కీపర్గా భరత్కే చోటు లభించింది. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించగా, ఇరు జట్ల క్రికెటర్లు నల్లబ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. రాణించిన వార్నర్... పేసర్లు షమీ, సిరాజ్ పదునైన బంతులతో ఆసీస్ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మొదటి మూడు ఓవర్లు మెయిడిన్ కాగా, తర్వాతి ఓవర్లో ఫలితం దక్కింది. సిరాజ్ బంతిని ఆడలేక ఉస్మాన్ ఖ్వాజా (10 బంతుల్లో 0) కీపర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి గంటలో 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 29 పరుగులే చేసింది. చెరో 2 ఓవర్లు వేసిన షమీ, సిరాజ్ వేసిన అనేక బంతులు వార్నర్ (60 బంతుల్లో 43; 8 ఫోర్లు), లబుషేన్ (62 బంతుల్లో 26; 3 ఫోర్లు) శరీరానికి తాకాయి. అయితే ఇద్దరు బ్యాటర్లు పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ను నడిపించారు. ఉమేశ్ ఓవర్లో నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించిన వార్నర్ ఆ తర్వాతా దానిని కొనసాగించాడు. ఆసీస్ పటిష్ట స్థితికి చేరుతున్న దశలో శార్దుల్ భారత్కు కీలక వికెట్ అందించాడు. లంచ్ సమయానికి కాస్త ముందు లెగ్సైడ్ వెళుతున్న బంతిని వార్నర్ వెంటాడగా భరత్ అద్భుతంగా అందుకున్నాడు. వార్నర్, లబుషేన్ రెండో వికెట్కు 69 పరుగులు జోడించారు. విరామం తర్వాత షమీ చక్కటి బంతితో లబుషేన్ ను బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారీ భాగస్వామ్యం... ఐదు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా ఆనందాన్ని తర్వాతి భాగస్వామ్యం పూర్తిగా దెబ్బ కొట్టింది. స్మిత్, హెడ్ కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లోనే 6 ఫోర్లతో దూకుడు చూపించిన హెడ్ 60 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రెండో సెషన్లో భారత్కు వికెట్ దక్కలేదు. చివరి సెషన్లోనూ ఈ జంట మరింత పట్టుదలగా ఆడింది. 144 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే హెడ్ 106 బంతుల్లోనే కెరీర్లో ఆరో శతకాన్ని అందుకున్నాడు. ఇదే ఊపులో భాగస్వామ్యం 200 పరుగులు దాటగా, భారత బృందం బేలగా చూస్తుండిపోయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దుల్ 43; ఖ్వాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమీ 26; స్మిత్ (బ్యాటింగ్) 95; హెడ్ (బ్యాటింగ్) 146; ఎక్స్ట్రాలు 17; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76. బౌలింగ్: షమీ 20–3–77–1, సిరాజ్ 19–4– 67–1, ఉమేశ్ 14–4–54–0, శార్దుల్ 18–2– 75–1, జడేజా 14–0–48–0. -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆందోళనకారుల ముప్పు.. ఐసీసీ కీలక నిర్ణయం
లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ బుధవారం(జూన్7) నుంచి ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్లో ప్రస్తుతం ఇంధన సంస్ధలకు వ్యతిరేకంగా నిరసనలు జరగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఓవల్ పిచ్ ను ధ్వంసం చేస్తామని కూడా ఆందోళనకారులు హెచ్చరించారు. దీంతో ఐసీసీ ముందస్తు జాగ్రత్తగా ఓవల్లో రెండు మ్యాచ్లు తయారు చేసింది. ఈ ప్రత్నమాయ పిచ్లను తయారు చేయించడానికి ఐసీసీ తమ ప్లేయింగ్ కండిషన్స్ లోని సెక్షన్ 6.4ను 6.4ని కూడా సవరించింది. ఒకవేళ మ్యాచ్ జరిగే పిచ్ దెబ్బతింటే అప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత మరో పిచ్ను వాడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా టీమిండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు పాట్ కమిన్స్, రోహిత్ శర్మల అనుమతి కూడా తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు కెప్టెన్లు రెండో పిచ్పై ఆడేందుకు అంగీకరిస్తే అప్పుడు మ్యాచ్ కొనసాగుతుంది, లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నిరసనకారులు నుంచి ఈ మ్యాచ్కు ముప్పు పొంచి ఉండడంతో స్టేడియం వద్ద భారీ భద్రతను ఐసీసీ ఏర్పాటు చేసింది. చదవండి: WTC Final 2023: హాజల్వుడ్ స్థానంలో బోలండ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! -
WTC Final 2023: హాజల్వుడ్ స్థానంలో బోలండ్.. ఆసీస్ తుది జట్టు ఇదే!
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్దమైంది. బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్టంగా ఉన్న ఆసీస్.. భారత జట్టు ఎలాగైనా ఓడించి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్ హాజల్వుడ్ గాయం కారణంగా దూరం కావడం ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ ఫైనల్ మ్యాచ్ బుధవారం(జూన్ 7) నుంచి జూన్ 11వరకు జరగనుంది. హాజల్వుడ్ స్థానంలో బోలండ్... ఇక భారత్తో పోలిస్తే ఆ్రస్టేలియాకు తమ తుది జట్టు విషయంలో పూర్తి స్పష్టత ఉంది. వార్నర్ పునరాగమనంతో హ్యాండ్స్కోంబ్ను తప్పించగా, గాయ పడిన హాజల్వుడ్ స్థానంలో మరో పేసర్ బోలండ్కు స్థానం దక్కింది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో పాటు కామెరాన్ గ్రీన్ రూపంలో మరో మీడియం పేసర్ అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్ ఆడిన వార్నర్, గ్రీన్ మినహా మిగతావారంతా టెస్టు స్పెష లిస్ట్లుగా ఈ మ్యాచ్ కోసం ఆసీస్ గడ్డపై పూర్తి స్థాయి లో సిద్ధమయ్యారు. ఓవల్ పరిస్థితులు తమ దేశంలోలాగే ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్) స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్ చదవండి: Odisha Train Accident: రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత? -
ప్లీజ్.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్ తుది అంకానికి చేరుకుంది. బుధవారం(జూన్ 7) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ఈ సైకిల్ ముగియనుంది. ఇక లండన్ వేదికగా జరగన్న తుదిపోరులో భారత్- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాని స్వాన్ అన్నాడు. ఓవల్ మైదానంలో జూన్ ఆరంభంలో మ్యాచ్ జరగుతుంది కాబట్టి పిచ్ చాలా ఫ్లాట్గా ఉందని, పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో స్వా్న్ మాట్లాడుతూ.. ఓవల్ పిచ్పై గ్రాస్ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓవల్ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్ల మాదిరిగానే ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్లను తీసుకువస్తే బాగుంటుంది. ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్ డిఫెండ్ చేసుకోవడానికి భారీ స్కోర్ సాధించాలి. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్ క్లాస్ టీమ్స్. కానీ ఒక ఇంగ్లీష్ మ్యాన్గా ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే చూడాలని ఉంది. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్ బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఆసీస్కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని పేర్కొన్నాడు. చదవండి: WTC Final 2023: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్కు అవకాశం దక్కేనా? మరి అశ్విన్! -
WTC ఫైనల్ కు కౌంట్ డౌన్ షురూ
-
WTC Final 2023:‘టెస్టు’ కిరీటం కోసం...
సరిగ్గా రెండేళ్ల క్రితం... భారత జట్టు తొలి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్ చేరింది. 2019–21 మధ్య 12 టెస్టుల్లో విజయాలు సాధించి అద్భుత ఫామ్తో తుది పోరుకు అర్హత సాధించింది. అయితే అసలు సమరంలో చతికిలపడి రన్నరప్గా సంతృప్తి చెందింది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు న్యూజిలాండ్కంటే ఒక మ్యాచ్ ఎక్కువే గెలిచినా... స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు పాయింట్లు కోల్పోయి దురదృష్టవశాత్తూ ఫైనల్ అవకాశాలు చేజార్చుకొని తీవ్ర నిరాశకు గురైంది. ఇప్పుడు ఇరు జట్లకు తొలిసారి చాంపియన్గా నిలిచేందుకు మరో అవకాశం వచ్చింది. ఇటీవలే ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్లో తలపడిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా అన్నట్లు మరో టెస్టు వచ్చేసింది. తటస్థ వేదికలో జరిగే హోరాహోరీ పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరం. లండన్: రోహిత్, కోహ్లి, అశ్విన్... భారత ప్రపంచకప్ విజయాల్లో భాగస్వాములు... స్మిత్, వార్నర్, స్టార్క్ కూడా అదే తరహాలో ఆసీస్ విశ్వ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులు... వీరంతా పరిమిత ఓవర్ల టోరీ్నలో మాత్రమే కాకుండా టెస్టుల్లోనూ వరల్డ్ చాంపియన్గా నిలవాలని కోరుకుంటున్న సీనియర్ ఆటగాళ్లు... పుజారా, రహానే, లయన్, ఖ్వాజా తమ టెస్టు టీమ్ల తరఫున చిరస్మరణీయ ప్రదర్శనలు చేసినా ఇంకా విశ్వ విజేత టీమ్ సభ్యులు అనిపించుకోని ఆటగాళ్లు... కెరీర్లో కనీసం 50కి పైగా టెస్టులు ఆడి, 33 ఏళ్లు దాటిన వీరందరికి టెస్టు క్రికెట్లో అత్యుత్తమ వేదికపై సత్తా చాటేందుకు చివరి అవకాశం. గత రెండేళ్లుగా ప్రపంచ టెస్టు క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించిన రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. గత ఫైనల్ సౌతాంప్టన్లో జరగ్గా, ఈసారి ఓవల్ మైదానం తుది పోరుకు వేదికైంది. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్ దక్కుతుంది. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. కెపె్టన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్లకు ఇది 50వ టెస్టు కావడం విశేషం. ఫైనల్ ‘డ్రా’ అయితే... వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేత జట్టుకు వెండి గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 20 లక్షలు), రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 60 లక్షలు) ప్రైజ్మనీగా లభిస్తాయి. ఒకవేళ ఫైనల్ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా, భరత్/ఇషాన్కిషన్, అశ్విన్/శార్దుల్, షమీ, సిరాజ్, ఉమేశ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖ్వాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లయన్, బోలండ్. పిచ్, వాతావరణం సాధారణగా పిచ్పై మంచి బౌన్స్ ఉంటుంది. అది పేసర్లకు అనుకూలం కాగా, మంచి షాట్లకు కూడా అవకాశం ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువ. నిలదొక్కుకుంటే బ్యాటర్లు చక్కగా పరుగులు రాబట్టవచ్చు. అయితే జూన్ నెలలో తొలిసారి టెస్టు జరుగుతుండటంతో ఎవరికీ పిచ్పై పూర్తి స్పష్టత లేదు. వర్షం ఇబ్బంది కలిగించకపోవచ్చు. రిజర్వ్ డే కూడా ఉంది. 14 ఓవల్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడిపోయింది. 7 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. 38 ఓవల్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడింది. 7 మ్యాచ్ల్లో నెగ్గింది. 17 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 14 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించింది. 106 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవరాల్గా 106 టెస్టులు జరిగాయి. 44 టెస్టుల్లో ఆ్రస్టేలియా... 32 టెస్టుల్లో భారత్ గెలుపొందాయి. ఒక టెస్టు ‘టై’గా ముగియగా... 29 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. -
WTC ఫైనల్ ఎవరి బలం ఎంత ?
-
మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు, ఒక వేళ ఓడినా: ద్రవిడ్
భారత్- ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు కౌంట్డౌన్ ప్రారంభంమైంది. బుధవారం(జూన్7) నుంచి లండన్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగనుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. "వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను ఎలాగైనా గెలవాలనే ఒత్తిడి మాపై లేదు. ఒక వేళ ఓడినా ఇటీవల టెస్టుల్లో సాధించిన విజయాల విలువ తగ్గదు. గత రెండేళ్లుగా కష్టపడ్డారు కాబట్టి ముగింపుగా ఐసీసీ ట్రోఫీ గెలిస్తే సంతోషిస్తామని... అయితే ఆడిన ప్రతీ చోటా తమదైన ముద్ర వేయడం టీమిండియా సాధించిన ఘనతేనని" పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. సబ్స్టిట్యూట్స్: సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం -
డబ్ల్యూటీసీ ఫైనల్.. వికెట్ కీపర్గా భరత్! కిషన్కు నోఛాన్స్
జూన్ 7 నుంచి లండన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా ఈ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచులో గెలిచి వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే లండన్కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. తన ఎంపిక చేసిన జట్టుతో ఆడితే భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని గవాస్కర్ థీమా వ్యక్తం చేశాడు. అందరూ ఊహించిన విధంగానే గవాస్కర్ తన జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాడు. లిటిల్మాస్టర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్లో ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్య రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్గా కిషన్ను కాదని భరత్ వైపే సన్నీ మొగ్గుచూపాడు. భరత్కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్కు అతడు అవకాశమిచ్చాడు. చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లకు గవాస్కర్ ఛాన్స్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు సునీల్ గవాస్కర్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం -
ఆ విజయం తర్వాత ఆసీస్ మమ్మల్ని చూసి భయపడుతోంది: కోహ్లి
ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్లో విజయం సాధించడంతో కంగారూ జట్టు కూడా టీమిండియాను చూసి భయపడుతుందని కోహ్లి తెలిపాడు. కాగా 2018-19 ఆసీస్ టూర్లో కోహ్లి కెప్టెన్సీలో టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లినే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి స్వదేశానికి రావడంతో రహానే టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. "టెస్టు క్రికెట్ తొలి రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారింది. అప్పటి నుంచి మమ్మల్ని ఆసీస్ జట్టు తేలికగా తీసుకోవడం లేదు. వారి గడ్డపై కూడా మేము గట్టి పోటీని ఇచాం. అలా అని ఆసీస్ను మేము కూడా తేలికగా తీసుకోం" అని కోహ్లి పేర్కొన్నాడు.అదే విధంగా ఓవల్ మైదానం గురించి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే చాంపియన్గా నిలుస్తుంది అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. చదవండి: WTC Final 2023: అశ్విన్ వర్సెస్ ఉమేశ్ యాదవ్.. రోహిత్కు కఠిన పరీక్ష! -
అశ్విన్ వర్సెస్ ఉమేశ్ యాదవ్.. రోహిత్కు కఠిన పరీక్ష!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్ వేదికగా జూన్ 7 నుంచి జరగనున్న ఈ ఫైనల్ పోరులో భారత-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోన్నాయి. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ భారత జట్టులో ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఈ క్రమంలో తుది జట్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఆర్ధం కాక భారత జట్టు మెనెజ్మెంట్ తలలు పట్టుకుటుంది. వీరిద్దరికీ గతంలో ఇంగ్లండ్ పరిస్ధితుల్లో ఆడిన అనుభవం లేదు. దీంతో కొంతమంది పవర్ హిట్టింగ్ చేసే సత్తా ఉన్న కిషన్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్న భరత్కు ఛాన్స్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. అయితే కిషన్కు నెట్ ప్రాక్టీస్లో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఒక వేళ జట్టు సెలక్షన్కు కిషన్ అందుబాటులో ఉంటే.. ప్లేయింగ్ ఎలెవన్లో వీరిద్దరిలో ఎవరికీ చోటుదక్కుతుందో మరి వేచి చూడాలి. మరోవైపు ఓవల్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తే.. అశ్విన్ బెంచ్కు పరిమితం అవ్వక తప్పదు. ఎందుకంటే ఫ్రెంట్లైన్ పేసర్లగా మహ్మద్ షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్కు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే భారత జట్టు మెన్జెంట్ మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరో ఆదనపు పేసర్ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే కచ్చితంగా ఉమేశ్ యాదవ్కు ఛాన్స్ ఇవ్వాలి. ఈ క్రమంలో అశ్విన్ బయట కూర్చోవాల్సిందే. మరి టీం మెనెజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 7 నుంచి లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్లో గాయపడ్డాడు. ప్రాక్టీస్లో భాగంగా నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్ తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనలేదు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత ప్లేయింగ్ ఎలెవన్లో వికెట్ కీపర్గా కిషన్, శ్రీకర్ భరత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కొంతమంది భరత్కు తుది జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది కిషన్కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా జట్టు సెలక్షన్కు కిషన్ అందుబాటులో లేకపోతే.. భరత్కు చోటు ఖాయమైనట్లే. కాగా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా గాయల కారంగా దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: Wrestlers Protest: రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. క్లారిటీ ఇదిగో! -
డబ్ల్యూటీసీ ఫైనల్.. వికెట్ కీపర్గా భరత్కు నో ఛాన్స్! అతడి వైపే మొగ్గు
ఓవల్ వేదికగా వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ను ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. అయితే తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫస్ట్ డౌన్లో వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, సెకెండ్ డౌన్లో విరాట్ కోహ్లిని ఫించ్ ఎంపిక చేశాడు. ఐదు ఆరు స్థానాల్లో వరుసగా రహానే, ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా తన జట్టులో ఇద్దరు స్పినర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే.. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్థూల్ ఠాకూర్కు ఫించ్ చోటిచ్చాడు. అయితే ఫించ్ తన జట్టులో వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను కాకుండా ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం గమనార్హం. అదే విధంగా పేసర్ ఉమేష్ యాదవ్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఫించ్ ఎంపిక చేసిన భారత తుది జట్టు: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: ENG vs IRE: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా! -
అదే దూకుడు కొనసాగిస్తా.. టెస్టా, టీ20 మ్యాచ్ అన్నది ఆలోచించను: రహానే
పోర్ట్స్మౌత్: ఇటీవల ఐపీఎల్లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ కనబరుస్తానని సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అన్నాడు. కొన్నాళ్ల విరామం తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో తలమునకలైన అతను మాట్లాడుతూ ‘18, 19 నెలల అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాను. గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందని అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియా తరఫున తాజాగా ఆటను ఆరంభిస్తా. మైదానంలో నేనేం చేయగలనో అదే చేస్తాను’ అని రహానే తెలిపాడు. చెన్నై సూపర్కింగ్స్కు ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదించానన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చక్కగా బ్యాటింగ్ చేశానని, అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్లోనూ రాణించానని చెప్పుకొచ్చాడు. ‘ఇప్పుడు కూడా అదే మైండ్సెట్తో ఆడతాను. ఇది టెస్టా... టి20 మ్యాచా అన్నది ఆలోచించను. నా సహజశైలిలో నేను బ్యాటింగ్ చేస్తాను’ అని రహానే అన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా పటిష్టంగా ఉందన్నాడు. చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్ -
ఫైనల్లో టీమిండియా గెలిస్తే.. ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర!
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత జట్టు.. అదే జోరును డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కొనసాగించి వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని భావిస్తోంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే... ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంటుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందితే.. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టీమిండియా ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్కప్లో ఛాంపియన్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకోగా.. అనంతరం ధోని సారధ్యంలో 2007 టీ20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచినా కూడా అదే రికార్డును లిఖిస్తుంది. ఆస్ట్రేలియా కూడా ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లో ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకుంది. WTC ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. సబ్స్టిట్యూట్స్: సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్. WTC ఫైనల్కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా. -
50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీస్ను భయపెడుతున్న చెత్త రికార్డు
లండన్లోని ఓవల్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్తో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. పటిష్ట భారత జట్టును ఎదుర్కొనేందుకు కమ్మిన్స్ సారధ్యంలోని ఆసీస్ వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్కు గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రొఫీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఒక విషయం మాత్రం ఆసీస్ జట్టును తెగ కలవరపెడుతోంది. ఇంగ్లండ్లో ఆస్ట్రేలియా జట్టుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. తమ టెస్టు క్రికెట్ చరిత్రలో లార్డ్స్, హెడ్డింగ్లీ, ట్రెంట్ బ్రిడ్జ్, ఎడ్జ్బాస్టన్లలో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా.. ఓవల్ మైదానంలో మాత్రం తమ మార్క్ను చూపించడంలో విఫలమైంది. 1880 నుంచి ఓవల్ మైదానంలో 38 టెస్టు మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా కేవలం ఏడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఓవల్లో ఆసీస్ జట్టు విజయ శాతం కేవలం 18.42 మాత్రమే. ఇంగ్లండ్ స్టేడియాల్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప విజయ శాతం కావడం గమనార్హం. 🔜 #WTC23 pic.twitter.com/P5v8UcLHQ3 — Cricket Australia (@CricketAus) June 2, 2023 ఇక ఈ మైదానంలో ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే ప్రఖ్యాత లార్డ్స్లో మాత్రంలో ఆసీస్ జట్టుకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. లార్డ్స్లో 29 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా.. 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లార్డ్స్లో ఆసీస్ విజయ శాతం 43.59గా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక విజయ శాతం కావడం గమనార్హం. రెండు రోజుల ముందు మాత్రమే.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఓవల్ మైదానంలోకి ఇరు జట్లకు రెండు రోజుల ముందు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కాబట్టి కమ్మిన్స్ అండ్ కో కెంట్ అవుట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఓవల్ పిచ్ మాత్రం పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇరు జట్లు కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
చాలా హాస్యాస్పదంగా ఉంది.. ఆస్ట్రేలియా బోర్డుపై విరుచుకుపడిన వార్నర్
బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. అయితే ఆ సమయంలో కెప్టెన్గా ఉన్న స్టీవ్ స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో అతడు మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్పై గతేడాది నవంబర్లో రివ్యూ పిటిషన్ను వార్నర్ దాఖలు చేశాడు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో తన రివ్యూ పిటిషన్ను వార్నర్ ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి కీలక వాఖ్యలు చేశాడు. "నా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని భావిస్తుంటే.. వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో నాయకత్వలోపం సృష్టంగా కన్పిస్తోంది. ఇదే విషయంపై నేను టెస్టు మ్యాచ్లు ఆడే సమయంలో పదే పదే ఫోన్ కాల్స్ వచ్చేవి. నేను లాయర్లతో మాట్లాడడేవాడిని. అది నా ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇదంతా నాకు ఆగౌరవంగా అనిపించింది. అందుకే గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నా. ఈ కథ అంతా గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ ఈ విషయంపై మాత్రం నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా" అని సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ పేర్కొన్నాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే?
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి భారత జట్టు సిద్దమైంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్ సేన.. వరుస ప్రాక్టీస్ సెషన్స్లో బీజీబీజీగా గడుపుతోంది. పటిష్ట ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కూడా తమ సన్నహాకాలను ప్రారంభించింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం. WTC Final poster by Hotstar. pic.twitter.com/yps91HHJsO — Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? డబ్ల్యూటీసీ ఫైనల్ లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. ఇండియాలో ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు వర్షం అంతరాయం కలిగిస్తే? డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఐదో రోజుల్లో వర్షం పడి మ్యాచ్కు అంతరాయం కలిగితే ఆ రోజు ఆటను రిజర్వ్ డే రోజు కొనసాగిస్తారు. జూన్12ను రిజర్వ్ డేగా ఐసీసీ నిర్ణయించింది. డ్రాగా ముగిస్తే విజేత ఎవరంటే? ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత్-ఆస్ట్రేలియా జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు. ప్రైజ్మనీ ఎంతంటే? డబ్ల్యూటీసీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 13.22 కోట్లు ప్రైజ్మనీని అందజేస్తున్నారు. రన్నరప్కు 6.61 కోట్లు దక్కనుంది. Indian bowling unit is ready for WTC final. pic.twitter.com/g1hsfEIL9E — Johns. (@CricCrazyJohns) June 2, 2023 చదవండి: Womens Asia Cup 2023: ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్తో మ్యాచ్ ఎప్పుడంటే? -
వరల్డ్కప్కు ముందు టీమిండియాకు మరో గుడ్ న్యూస్.. అతడు కూడా వచ్చేస్తున్నాడు!
వన్డే ప్రపంచకప్-2023కు ముందు భారత జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహల్.. మరో రెండు వారాల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన పునరవాసాన్ని(శిక్షణ) ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్కు సారధ్యం వహించిన రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. అనంతరం లండన్లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ తర్వాత రాహుల్ తన భార్య అతియా శెట్టితో కలిసి ఊతకర్రల సాయంలో లండన్ వీధుల్లో నడుస్తూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ప్రస్తుతం రాహుల్ క్రచెస్(ఊతకర్రలు) లేకుండా నడవడం ప్రారంభించినట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం.. ఇక గాయం కారణంగా రాహల్ ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. అదే విధంగా ఆసియాకప్-2023కు కూడా రాహుల్ దూరమైనట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు పూర్తిఫిట్నెస్ సాధించాడనికి మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కేఎల్ మళ్లీ వన్డే వరల్డ్కప్తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ఈ మెగా టోర్నీతోనే రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. వీరిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రపంచకప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు సమయం ఆసన్నమైంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ జట్టుకు విరాట్ కోహ్లి, ఛెతేశ్వర్ పుజారా నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకోవడానికి ఇరుజట్లు లండన్లో తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి. "ఆస్ట్రేలియా జట్టు విరాట్ కోహ్లి గురించి ప్రణాళికలు రచిస్తోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విరాట్తో పాటు పుజారా కోసం కూడా వారు చర్చించుకుంటారు. కోహ్లి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు గత కొన్ని రోజులుగా టీ20 క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. అంతకుముందు వన్డే, టెస్టుల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి ఇంగ్లండ్ గడ్డపై కూడా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. కాబట్టి కోహ్లి పట్ల ఆసీస్ చాలా జాగ్రత్త వహించాలి. ఇక పుజారా గత కొన్ని రోజులుగా ఇంగ్లండ్లో కౌంటీలు ఆడుతున్నాడు. అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డాడు. గతంలో కూడా కోహ్లి, పుజారా ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. పుజారాను వీలైనంత వేగంగా పెవిలియన్కు పంపితే ఆసీస్కు మంచింది. అతడు ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే ఔట్ చేయడం చాలా కష్టమని" ది ఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IRE: ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్ -
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్!
టీమిండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్ అందింది. ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. హాజిల్వుడ్ కాలి మడమ గాయంతో గత కొంతకాలంగా భాదపడతున్నాడు. ఈ క్రమంలో పూర్తిఫిట్నెస్ సాధించకపోయనప్పటికీ ఐపీఎల్-2023లో ఆర్సీబీ తరపున ఆడేందుకు భారత్కు వచ్చాడు. అయితే కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన హాజిల్వుడ్ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్-2023 మధ్యలోనే తన స్వదేశానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి.. నెట్స్లో తీవ్రంగా చమటోడ్చుతున్నాడు. ఇక తన ఫిట్నెస్పై హాజిల్వుడ్ తాజాగా స్పందించాడు. "నేను ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం వరకు ప్రతీ సెషన్లో ప్రాక్టీస్ చేయడమే నా పని. టెస్టు క్రికెట్కు టీ20 క్రికెట్ పూర్తి భిన్నం. టీ20ల్లో మన బౌలింగ్లో చాలా వేరియషన్స్ చూపించాలి. వైడ్ యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ వేయడానికి చాలా కష్టపడాలి. ఈ క్రమంలో బౌలర్లకు తమ గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని" ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాజిల్వుడ్ పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? -
ఐపీఎల్ ఫైనల్ వాయిదా.. ఆ ముగ్గురి ప్రయాణం మరింత ఆలస్యం
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే రెండు బ్యాచ్లగా లండన్కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో మునిగి తేలుతోంది. అయితే మూడో బ్యాచ్గా లండన్కు వెళ్లాల్సిన శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.. అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ ఇప్పుడు కాస్త ఆలస్యంగా పయనం కానున్నారు. ఎందుకంటే ఐపీఎల్-2023ల ఫైనల్ రిజర్వ్డేకు వాయిదా పడడంతో వీరి ప్రయాణం ఆలస్యం కానుంది. గిల్, షమీ, భరత్ గుజరాత్ జట్టులో భాగం కాగా.. జడేజా, రహానే సీఎస్కే తరపున ఆడుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముగిసిన వెంటనే వీరు ఐదుగురు సోమవారం లేదా మంగళవారం ఇంగ్లండ్కు బయలుదేరాల్సింది. కానీ ఇప్పుడు ఫైనల్ సోమవారం జరగనుండడంతో గిల్, షమీ ,జడేజా, రహానే, భరత్ మంగళవారం లేదా బుధవారం ఇంగ్లండ్కు పయనం కానున్నారు. కాగా వీరిముగ్గురు కాస్త ముందుగా ఇంగ్లండ్కు చేరివుంటే అక్కడి పరిస్ధితులను అలవాటు పడేందుకు వీలుగా ఉండేది. కానీ వీరి ప్రయాణం ఆలస్యం కావడంతో.. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అయితే గిల్, షమీ ,జడేజా త్రయం మాత్రం భారత జట్టులో చాలా కీలకం. కాగా జాన్7 నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ -
డబ్ల్యూటీసీ ఫైనల్.. అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే! వార్నర్, అశ్విన్కు నో ఛాన్స్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇకడబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇరు జట్లనుంచి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజాలకు పాంటింగ్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫస్ట్డౌన్లో ఆసీస్ టాప్ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్కు చోటిచ్చాడు. ఇక సెకెండ్ డౌన్లో విరాట్ కోహ్లి ఛాన్స్ దక్కింది. అదే విధంగా వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. తన జట్టులో వికెట్ కీపరగా అలెక్స్ కారీకు ప్లేస్ దక్కింది. బౌలర్ల కోటాలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, మహ్మద్ షమీకు అవకాశం దక్కింది. అయితే ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కకపోవడం కావడం గమనార్హం. ఇక తన ఎంచుకున్న ఈ ఉమ్మడి జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్గా పాంటింగ్ ఎంచుకున్నాడు. రికీ పాంటింగ్ ఎంచుకున్న కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మహ్మద్ షమీ చదవండి: ODI WC 2023: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్, వేదికలు.. వివరాల వెల్లడి ఆరోజే: జై షా కీలక ప్రకటన -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్
ఆస్ట్రేలియాతో వరల్డ్టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్-2023లో రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్.. తమ జట్టు ఆఖరి మ్యాచ్కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్కు అందుబాటులో లేడని రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు అశ్విన్ అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. కానీ అశ్విన్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి లండన్లో అడుగుపెట్టాడు. లండన్కు చేరుకున్న అశూ తన ప్రాక్టీస్ను కూడా మొదలపెట్టేశాడు. అక్షర్పటేల్, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్తో కలిసి ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాడు. ఇక జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే అశ్విన్, కోహ్లి, అక్షర్పటేల్, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్లో కూడిన ఓ బ్యాచ్ లండన్ చేరుకోగా.. షమీ, శ్రీకర్ భరత్, శుబ్మన్ గిల్, రోహిత్, కిషన్, రహానే, జడేజా మరో మూడు రోజుల్లో లండన్కు పయనం కానున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: అతడు టీమిండియాకు దొరికిన అణిముత్యం.. మా నాన్న ఫేవరేట్ ప్లేయర్ కూడా: ఏబీడీ -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్!
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. తాజాగా ఈ మెగా ఫైనల్కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ కంటికి గాయమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫియర్-2లో కిషన్ గాయపడ్డాడు. 17వ ఓవర్ ప్రారంభానికి ముందు అనుకోకుండా పేసర్ క్రిస్ జోర్డాన్ ఇషాన్ కిషన్ను ఢీకొట్టాడు. అతడి మోచేయి కిషన్ ఎడమ కన్నుకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో కన్నుపై చెయివేసుకుని మైదానం వీడడాడు. అనంతరం కిషన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి స్థానంలో కంకషన్ సబ్స్ట్యూట్గా విష్ణు వినోద్ వచ్చాడు. ఇక ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం కాగా.. తాజాగా కిషన్ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. కాగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో కిషన్ను ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. చదవండి: IPL 2023 QF 2 MI VS GT: గిల్ ప్రపంచ క్రికెట్ను ఏలుతాడు.. నేను ఆధారపడేది రషీద్పైనే: హార్ధిక్ పాండ్యా -
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. లండన్లో కోహ్లి
రెండునెలల పాటు ఐపీఎల్తో పూర్తి బిజీగా గడిపిన విరాట్ కోహ్లి ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా బ్యాచ్లుగా ఇంగ్లండ్కు చేరుకుంటుంది. ఇప్పటికే పుజారా అక్కడికి వెళ్లి తన ప్రాక్టీస్ ఆరంభించగా.. డబ్ల్యూటీసీ టెస్టులో ఆడనున్న మిగతా టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్లుగా విడిపోయి ఇంగ్లండ్లో అడుగుపెట్టారు. జూన్ 7న ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. కాగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం ఎలాగైనా ఆసీస్ను ఓడించి డబ్ల్యూటీసీ ఛాంపియన్గా అవతరించాలని చూస్తోంది. తాజాగా కోహ్లి ఇవాళ(మే 26) ఉదయం సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ షేర్ చేశాడు. లండన్ మార్నింగ్స్ అంటూ క్యాప్షన్ జత చేసిన కోహ్లి లవ్ ఎమోజీతోపాటు సూర్యుడి ఎమోజీని కూడా జత చేశాడు. లండన్లో వాతావరణం ఎంతో బాగుంది తొలిరోజు ఆహ్లదకరంగా మొదలైంది అంటూ తెలిపాడు. కాగా గురువారం కోహ్లిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వారి సంఖ్య 250 మిలియన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లి తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేశాడు. 14 మ్యాచ్లాడిన కోహ్లి 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు వరుస సెంచరీలు ఉండగా.. ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇదే ఫామ్ను చూపించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్లోనూ కోహ్లి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టులో కోహ్లి 364 బంతుల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది. ఈ సిరీస్లో కోహ్లి నాలుగు మ్యాచ్లు కలిపి 297 పరుగులు చేశాడు. చదవండి: చెపాక్లో ఇదే చివరిసారి అనుకున్నారేమో..! -
ఇంగ్లండ్కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ (జూన్ 7-11 వరకు లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్) కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్కు బయల్దేరింది. ఈ బృందంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్టాండ్ బై ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్దీప్, పుల్కిత్ నారంగ్లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఉండి, ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమించిన జట్లలోని కీలక సభ్యులు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్లు రేపు (మే 24) లండన్కు బయల్దేరతారని క్రిక్బజ్ తెలిపింది. ఇంగ్లండ్లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ఫస్ట్ బ్యాచ్ రెండు వారాల ముందుగానే లండన్కు బయల్దేరింది. మిగతా భారత బృందం దశల వారీగా ఇంగ్లండ్కు వెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక (మే 31 లోపు) ఇంగ్లండ్కు బయల్దేరతారని సమాచారం. పుజారా అక్కడే.. టీమిండియా స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో పాల్గొనేందుకు అతను చాలా రోజుల కిందటే అక్కడికి వెళ్లాడు. ఆ టోర్నీలో పుజారా ససెక్స్ టీమ్కు సారధ్యం వహిస్తున్నాడు. ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ ఫిట్.. ఐపీఎల్ 2023 సందర్భంగా గాయాల బారిన పడిన ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఫిట్గా ఉన్నారని సమాచారం. వీరు కూడా కోహ్లి అండ్ కో తో పాటు లండన్ ఫ్లయిట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చదవండి: IPL 2023: ఆర్సీబీ వైఫల్యాలకు కారణం ఎవరంటారు..? -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021-23కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మే 22) అధికారికంగా ప్రకటించింది. హాజిల్వుడ్.. ఈ మ్యాచ్తోపాటు ఆ తర్వాత జరిగే యాషెస్ సిరీస్కు సైతం సిద్ధంగా ఉంటాడని పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానాంలో జరుగనుండగా.. 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ జూన్ 16 నుంచి జులై 31 వరకు జరుగనుంది. కాగా, ఈ సీజన్లో 3 మ్యాచ్ల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన హాజిల్వుడ్.. కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతను పూర్తి ఫిట్గా ఉండివుంటే ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండేది. ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఆ జట్టు ఆఖరి మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు.. ఈ సీజన్లో ఇదొక్కటే ఆర్సీబీ నిష్క్రమణకు కారణం కాదు. కోహ్లి, డుప్లెసిస్, అప్పుడప్పుడు సిరాజ్ మినహా ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమైంది. దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు ఆర్సీబీ పరాజయాలకు మూల కారకులని చెప్పవచ్చు. ఏదిఏమైనా ఈ ఏడాది కూడా ఆర్సీబీ కప్ లేకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన గ్రూప్ స్టేజీ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంతో ముంబై ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..! -
ఇంగ్లండ్కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఎదురై, ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించి గంటలు కూడా గడవకముందే ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ విమానం ఎక్కనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ (జూన్ 7-11 వరకు లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్) కోసం కింగ్ కోహ్లి రెండు వారాల ముందే ఇంగ్లండ్కు వెళ్లనున్నాడు. రేపు (మే 23) విరాట్ కోహ్లితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్కు బయల్దేరతారని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు వెల్లడించారు. ఇంగ్లండ్లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు వీరు ముందుగా అక్కడికి వెళ్లనున్నట్లు ఆయన తెలిపాడు. వీరితో పాటు రిజర్వ్ ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్ దీప్, అనికేత్ చౌదరి, యార్రా పృథ్వీ రాజ్ కూడా లండన్ ఫ్టయిట్ ఎక్కుతారని తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన మిగతా భారత జట్టు సభ్యులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక ఇంగ్లండ్కు బయల్దేరతారని సమాచారం. పుజారా అక్కడే.. టీమిండియా స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో పాల్గొనేందుకు అతను చాలా రోజుల కిందటే అక్కడికి వెళ్లాడు. ఆ టోర్నీలో పుజారా ససెక్స్ టీమ్కు సారధ్యం వహిస్తున్నాడు. ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ ఫిట్.. ఐపీఎల్ 2023 సందర్భంగా గాయాల బారిన పడిన ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఫిట్గా ఉన్నారని సమాచారం. వీరు కూడా కోహ్లి అండ్ కో తో పాటు లండన్ ఫ్లయిట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..! -
డబ్ల్యూటీసీ ఫైనల్పై పాంటింగ్ జోస్యం.. విజేత ఎవరంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు సమయం దగ్గరపడుతోంది. లండన్ వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారనే ఆంశంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేరాడు. భారత్ కంటే ఆసీస్కే విజయం సాధించే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్ జోస్యం చెప్పాడు. లండన్లోని ఓవల్ మైదానం పరిస్థితులు ఆస్ట్రేలియా తరహాలోనే ఉంటాయని పాంటింగ్ తెలిపాడు. "ఓవల్ పిచ్ ఆస్ట్రేలియా వికెట్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆసీస్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే మ్యాచ్ భారత్లో జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధించేది. ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టంన. అదే ఆస్ట్రేలియాలో జరిగితే ఆసీస్ ఫేవరెట్ అని చెబుతాను. ఈ ఫైనల్ ఇంగ్లండ్లో జరుగుతుంది కాబట్టి రెండు జట్లు కూడా తీవ్రంగా పోటీపడతాయి. 1990వ దశకం చివరలో లేదా 2000వ దశకం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు విదేశీ గడ్డపై భారత్ అద్భుతుంగా ఆడుతోంది. వారి బ్యాటింగ్ స్కిల్స్ కూడా మెరుగయ్యాయి. గత 10-15 ఏళ్లలో భారత క్రికెట్ మంచి ఫాస్ట్బౌలర్లను తయారు చేసింది. వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు" ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: అతడే మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని అనుకున్నా.. మేం షాక్లో ఉన్నాం: శాంసన్ -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు మరో బిగ్షాక్!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఈ గాయాల జాబితాలోకి భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ కూడా చేరాడు. అశ్విన్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన రాజస్తాన్ ఆఖరి లీగ్ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సమయంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. అశ్విన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే ఆఖరి నిమిషంలో తమ జట్టులో మార్పు చేశామని శాంసన్ వెల్లడించాడు. ఇక ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం కాగా.. తాజాగా అశ్విన్ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. మూడు బ్యాచ్లుగా ఇంగ్లండ్కు పయనం కానున్న టీమిండియా
ఐపీఎల్-2023 ముగిసిన వెంటనే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్కు పయనం కానున్న సంగతి తెలిసిందే. జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టును మూడు బ్యాచ్లుగా ఇంగ్లండ్కు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ను నిర్వహించే విధంగా బీసీసీఐ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ పూర్తి అయిన వెంటనే మొదట బ్యాచ్ ఇంగ్లండ్కు పయనం కానున్నట్లు క్రిక్బజ్ రిపోర్ట్ తమ నివేదికలో పేర్కొంది. ఈ బ్యాచ్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించని జట్లలో భాగమైన భారత ఆటగాళ్లు ఉండనున్నట్లు క్రిక్బజ్ తెలిపింది. మొదటి బ్యాచ్ మే 23 న ఇంగ్లండ్కు బయలు దేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఫైనల్కు అర్హత సాధించని జట్లలో ఉండే ఆటగాళ్లు రెండో బ్యాచ్గా ఇంగ్లండ్కు పయనం కానున్నారు. ఆఖరిగా మే 28న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే మూడో బ్యాచ్గా ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మొదటి బ్యాచ్లో చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, అశ్విన్ ఉండే అవకాశం ఉంది. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్ -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే!
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత మీ, నా మదిలో ఓ ప్రశ్న మెదలడం ఖాయం కదా! అదేంటంటే.. సర్రే ఓవల్లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టును ఫైనల్ చేసేటపుడు భువీని పరిగణనలోకి తీసుకుంటారా? ఇంగ్లండ్లో వేసవి తొలి అర్ధ భాగంలో ఆడే మ్యాచ్లలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే స్వింగ్ రాబట్టాల్సిందే. ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సగం సగమే అనిపిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి భువనేశ్వర్ కుమార్ను జట్టుకు ఎంపిక చేస్తారా? చేస్తే బాగుండు. కానీ అలా జరుగకపోవచ్చు.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 5 వికెట్లతో చెలరేగిన భువీ! స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆకాశ్.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని నిట్టూర్చాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు. టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (0), శుబ్మన్ గిల్(101), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8), టెయిలెండర్లు నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ(0) వికెట్లు కూల్చాడు. 4 ఓవర్ల బౌలింగ్లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే! ఈ మ్యాచ్లో రైజర్స్ ఓడినప్పటికీ భువీ ప్రదర్శన మాత్రం సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. భువీని కొనియాడుతూనే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడికి ఆడే అవకాశం వస్తే బాగుండని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పిచ్లపై భువీ లాంటి స్వింగ్ మాస్టర్ అద్భుతాలు చేయగలడని పేర్కొన్నాడు. అయితే, సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7- 11 వరకు ఇంగ్లండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో బీసీసీఐ భువీకి చోటివ్వని సంగతి తెలిసిందే. చదవండి: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్! తుది జట్టులో.. A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చెప్పాల్సిందే! అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే! బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు. క్లియర్గా కనిపించినా ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్కన్క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది. నాటి మ్యాచ్లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్లో సామ్ కరన్ బౌలింగ్లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు. అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి రూల్ను రద్దు చేయాల్సిందే! దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. చదవండి: కేకేఆర్కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. శార్దూల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్. సీఎస్కేతో మ్యాచ్లో ఇలా ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జడ్డూను కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్రౌండర్’ శార్దూల్ ఠాకూర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! -
సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను..
Virat Kohli- Mohammed Siraj: ‘‘విరాట్ భయ్యా రాత్రి 11 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆరోజు సెంచరీ చేశానా.. లేదంటే సున్నా స్కోరుకే పరిమితమయ్యానా అన్న విషయంతో భయ్యాకు సంబంధం ఉండదు. ముందు రోజు ఎలా ఉన్నా మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కల్లా ఎంతో ఉత్సాహంగా పలకరిస్తాడు. యథావిథిగా జిమ్లో కలుస్తాడు కోహ్లి భయ్యా సెట్ చేసిన ఫిట్నెస్ ప్రమాణాలు వేరే లెవల్ అంతే! క్రికెటర్గా ఇంత సాధించినప్పటికీ.. ఆయన అస్సలు రిలాక్స్ కాడు. మరింత మెరుగ్గా ముందుకు సాగాలనే ఎల్లవేళలా తాపత్రయపడుతుంటాడు. భయ్యాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’’ అంటూ టీమిండియా స్టార్ పేసర్, ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆర్సీబీకి మారిన తర్వాతే టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ భయ్యా తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. కాగా సన్రైజర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ సిరాజ్.. ఆర్సీబీకి మారిన తర్వాత అతడి దశ తిరిగింది. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన సిరాజ్ 2017లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2019లో వన్డేల్లో, 2020లో టెస్టుల్లో అడుగుపెట్టిన అతడు ప్రస్తుతం టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. నా పెద్దన్న టీమిండియా క్రికెటర్గా సిరాజ్ ఈస్థాయికి ఎదగడంలో కోహ్లిది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఇక తనను ఇంతగా ప్రోత్సహించిన కోహ్లిని పెద్దన్నగా భావించే సిరాజ్ మియా బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో ఆటగాడిగా కోహ్లి పరుగుల దాహం తీరనిదంటూ ప్రశంసలు కురిపించాడు. ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి జిమ్లో నిరంతరం శ్రమిస్తాడని.. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడని చెప్పుకొచ్చాడు. కాగా సిరాజ్ టెస్టు అరంగేట్రం చేసే సమయానికి అతడి తండ్రి కన్నుమూసిన విషయం విదితమే. టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్కు తండ్రి మరణించాడనే పిడుగులాంటి వార్త తెలిసింది. అయినప్పటికీ, తండ్రి కలను నెరవేర్చాలనే సంకల్పంతో బాధను దిగమింగుకుని.. ఆసీస్ గడ్డపై అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అప్పుడు ఏడ్చేశాను ‘‘జాతీయ గీతం ఆలపించేటపుడు నేను ఏడ్చేశాను. నా టెస్టు అరంగేట్రం అద్బుతంగా జరిగింది. టెస్టు క్రికెట్ ఆడితేనే ఆటగాడిగా నీకు గౌరవం దక్కుతుందని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఒకవేళ ఆయన బతికి ఉంటే.. తన కలను నెరవేర్చినందుకు నన్ను చూసి గర్వపడేవారు. ఆయన భౌతికంగా మాకు దూరమైనా.. ఆయన దీవెనలు నాకెప్పుడూ ఉంటాయి’’ అని సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లి, సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నారు. వీరిద్దరు జూన్లో జరుగబోయే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టుకు ఎంపికయ్యారు. చదవండి: WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్గా అతడే! ద్రవిడ్తో కలిసి వాళ్లంతా.. లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! -
WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్గా అతడే! ద్రవిడ్తో కలిసి వాళ్లంతా..
WTC Final 2023: సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా మేటి జట్లు టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. రహానే వచ్చేశాడు ఇంగ్లండ్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7-11 మధ్య ఈ మెగా ఫైట్కు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, వైస్ కెప్టెన్గా మాత్రం ఇంత వరకు ఎవరి పేరును ఖరారు చేయలేదు. ఐపీఎల్-2023లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. పుజారాలలో ఎవరో ఒకరిని రోహిత్ డిప్యూటీని చేస్తారంటూ చర్చించుకుంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్గా కొనసాగుతాడు. అధికారిక ప్రకటన అప్పుడే అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇంతవరకు పుజారా నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఐసీసీకి ఫైనల్ జట్టు గురించి వివరాలు సమర్పించే సమయం(మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్గా మెన్షన్ చేయనున్నారు. ససెక్స్ కెప్టెన్గా ఛతేశ్వర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఫామ్లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం’’ అని పేర్కొన్నారు. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా పుజారా పేరు ఖరారు కానుందని తెలిపారు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా వైస్ కెప్టెన్గా వ్యవహరించిన పుజారా.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా అద్బుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు సెంచరీలతో వరుసగా 115, 35, 18, 13, 151, 136 & 77 పరుగులతో సూపర్ ఫామ్ కనబరిచిన పుజారా.. ససెక్స్లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్కు సహచర ఆటగాడిగా ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ సందర్భంగా ఎప్పటిలానే ప్రత్యర్థులుగా మారనున్నారు. కాగా మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్కు చేరుకోనుండగా.. పుజారా కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న.. శార్దూల్ ఠాకూర్(కేకేఆర్), ఉమేశ్ యాదవ్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తదితరులు ద్రవిడ్ కలిసి మే 23నే లండన్కు పయనం కానున్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు -
దేశంలో టెస్ట్లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ప్లేయర్గా ముద్రపడిన ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్ను డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసినందుకు గాను భారత క్రికెట్ అభిమానులు సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్కు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. సెలెక్టర్లకు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలని లేనట్లుంది, అందుకే టీ20 ఆడుకునే వాడిని జట్టులో చేర్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ ఇషాన్ను తుది జట్టులోకి (డబ్ల్యూటీసీ ఫైనల్) తీసుకుంటే, చాలాకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోతుందని అంటున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇషాన్ గణాంకాలు (48 మ్యాచ్ల్లో 38 సగటున 2985 పరుగులు) చూసే ఈ ఎంపిక చేశారా.. లేక ఎవరైనా రెకమెండ్ చేస్తే జట్టులోకి తీసుకున్నారా అంటూ సెలెక్టర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కంటే వెయ్యి రెట్టు మెరుగైన గణాంకాలు కలిగి, దేశవాలీ టోర్నీల్లో పరుగుల పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ (37 మ్యాచ్ల్లో 79.65 సగటున 3505 పరుగులు) కానీ, టెస్ట్ ఫార్మాట్కు అతికినట్లు సరిపోయి, ప్రస్తుతం (ఐపీఎల్ 2023) సూపర్ ఫామ్లో ఉన్న అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్ సాహా కానీ సెలెక్టర్లకు కనపడలేదా అని నిలదీస్తున్నారు. సర్ఫరాజ్కు అనుభవం లేదని వదిలేస్తే, సాహా గత రంజీ ట్రోఫీ ప్రదర్శననైనా (7 ఇన్నింగ్స్ల్లో 52.16 సగటున 313 పరుగులు) పరిగణలోకి తీసుకొని ఉండాల్సిందని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఇంగ్లండ్లోని పరిస్థితులకు ఇషాన్ కంటే సాహా బెటర్గా సూటవుతాడని, ఇషాన్ను ఎంపిక చేసి సెలెక్టర్లు పెద్ద తప్పే చేశారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో టెస్ట్ ఫార్మాట్కు సూటయ్యే ఆటగాళ్లే లేరని స్టాండ్ బై ప్లేయర్గా సూర్యకుమార్ను, వరల్డ్ గ్రేట్ ఆల్రౌండర్ లార్డ్ శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేశారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: రుత్రాజ్ గైక్వాడ్కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో! -
కిషన్ కంటే అతడు చాలా బెటర్.. ఎందుకు సెలక్ట్ చేశారో అర్ధం కావడం లేదు!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు భారత జట్టులో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే కిషన్ ఎంపికపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సెలక్టర్లు నిర్ణయాన్ని సమర్థిస్తుంటే,మరి కొంత మంది తప్పుబడుతున్నారు. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ టామ్ మూడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇషాన్ కిషన్కు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని మూడీ తెలిపాడు. కిషన్ను కాకుండా అనుభవజ్ఞుడైన వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చే ఉంటే బాగుండేది అని మూడీ అన్నారు. "రాహుల్ స్థానంలో కిషన్ ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదు. కిషన్ కంటే వృద్ధిమాన్ సాహా చాలా బెటర్. సాహాకు 15 ఏళ్ల అనుభవం ఉంది. అటువంటి ఆటగాడిని డబ్ల్యూటీసీ ఫైనల్కు తీసుకువెళ్లాల్సింది. ఇంగ్లండ్ పిచ్లకు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ వంటి పరిస్థితుల్లో కిషన్ ఆడటానికి చాలా ఇబ్బంది పడతాడు. విదేశీ గడ్డపై పెద్దగా ఆడిన అనుభం కూడా అతడికి లేదు. అదే విధంగా సాహా జట్టులో ఉంటే ఏడు లేదా ఎనిమిదో స్థానంలో నైనా బ్యాటింగ్కు వచ్చి ఆడగలడు. కానీ కిషన్ మాత్రం టాపర్డర్లో మాత్రమే ఆడగలడు. అటువంటి అప్పుడు కిషన్ ఎంపిక చేసి ఏమి లాభం" అని ఈఎస్ప్పీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ మూడీ పేర్కొన్నాడు. చదవండి: PBKS VS KKR: పంజాబ్ ఓడినా, అర్షదీప్ గెలిచాడు..! -
రుత్రాజ్ గైక్వాడ్కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో!
ఐపీఎల్-2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ బంపరాఫర్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టులో స్టాండ్బై ప్లేయర్గా రుత్రాజ్ గైక్వాడ్ను భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడితో పాటు పేసర్ ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్కు స్టాండ్బై జాబితాలో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా డబ్ల్యూటీసీ తుదిపోరులో లండన్ వేదకగా జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే. సూపర్ ఫామ్లో రుతు ఇక రుత్రాజ్ గైక్వాడ్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో సీఎస్కే ప్రాతినిధ్యం వహిస్తున్న రుత్రాజ్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన అతడు 384 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు స్టాండ్బైగా ఉన్న రుత్రాజ్.. ప్రధాన జట్టులో ఏ ఆటగాడైనా దూరమైతే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్కు అతడి స్థానంలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేను సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే సూర్య తన ఫామ్ను తిరిగి పొందడంతో స్టాండ్బై ప్లేయర్గా సెలక్టర్లు ఎంపికచేశారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ పర్వాలేదనపిస్తున్నాడు. ముఖేష్ కుమార్ బిహర్కు చెందిన పేసర్ ముఖేష్ కుమార్ గత కొన్ని సిరీస్లకు భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రావటం లేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన పేసర్లు ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్నారు. ఐపీఎల్-2023లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరూ మోకాలి గాయంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్కు అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ముఖేష్ కుమార్ను స్టాండ్బై ప్లేయర్గా సెలక్టర్లు ఎంపికచేశారు. చదవండి: #WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
-
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..!
లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్లు)పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. గుజరాత్ అభిమానులు ఈ వెటరన్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలో భారత ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టులో చోటు కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐసీసీ ట్రోఫీ (డబ్ల్యూటీసీ) సాధించాలంటే టీమిండియాకు సాహా సేవలు చాలా అవసరమని అంటున్నారు. వయసు (38) సాకుగా చూపి సాహాను విస్మరించొద్దని అంటున్నారు. ఎలాగూ కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి, అతని స్థానంలో సాహాను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన రెగ్యులర్ వికెట్కీపర్ కేఎస్ భరత్తో పోలిస్తే సాహా చాలా బెటరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాహా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిస్తే టీమిండియాకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ఫార్మాట్కు తగ్గట్లుగా సాహా తన ఆటతీరును మార్చుకుంటాడని, అతనిలో టాలెంట్ను భారత సెలెక్టర్లు ఇకనైనా గుర్తించాలని అంటున్నారు. ఐపీఎల్లో అతను చేసిన సెంచరీని, దేశవాలీ క్రికెట్లో చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని (20 బంతుల్లో 4 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 102) గుర్తించుకోవాలని కోరుతున్నారు. రహానే లాగే సాహా ఇన్నింగ్స్ను కూడా పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్లో సాహాతో పాటు శుభ్మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగడంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్ను దూకుడుగానే ప్రారంభించింది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రెచ్చిపోయి ఆడారు. అయితే 9వ ఓవర్లో మేయర్స్ ఔట్ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుకోలేదు. డికాక్ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. చదవండి: IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం -
IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్
IPL 2023- LSG- KL Rahul: భారత క్రికెటర్, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023తో పాటు వచ్చే నెలలో లండన్లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నుంచి కూడా రాహుల్ తప్పుకున్నాడు. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత ఈ విషయాన్ని స్వయంగా అతనే నిర్ధారించాడు. సోమవారం లక్నోలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. ‘భారత జట్టుకు అందుబాటులో లేకపోవడం చాలా నిరాశగా ఉంది. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత. నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. 2021లో కేకేఆర్కు ఆడిన కరుణ్ నాయర్ (PC: IPL) రీప్లేస్మెంట్ అతడే వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తా. బాధగా ఉన్నా ఆటకు దూరం కావడం తప్పడం లేదు’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఐపీఎల్కు దూరమైన రాహుల్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కర్నాటక బ్యాటర్ కరుణ్ నాయర్ను జట్టులోకి తీసుకుంది. రూ. 50 లక్షల ధరకు అతడిని తీసుకుంది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్... రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆయా జట్ల తరఫున మొత్తంగా 76 మ్యాచ్లు ఆడిన నాయర్ 1496 పరుగులు చేశాడు. చదవండి: ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..! క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్ను పెళ్లాడతాను..! -
టీమిండియాకు బిగ్ షాక్
అనుకున్నదే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు (జూన్ 7 నుంచి) కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. అతి త్వరలో తాను తొడ భాగంలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు రాహుల్ ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగాల్సి వస్తున్నందుకు నిరాశ వ్యక్తం చేశాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరేందుకు తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తానని తెలిపాడు. కాగా, కొద్ది రోజుల ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు, డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడు జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం కారణంగా అధికారికంగా ఐపీఎల్-2023 నుంచి వైదొలిగాడు. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రాహుల్, ఉనద్కత్లు గాయాల కారణంగా ఒకేసారి వైదొలగడంతో లక్నో సూపర్ జెయింట్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఒకవేళ ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి కూడా కోలుకోకపోతే అది టీమిండియాకు కూడా భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది. గాయాల కారణంగా ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు (డబ్ల్యూటీసీ ఫైనల్) దూరం కాగా.. తాజాగా రాహుల్ కూడా గాయం కారణంగా వైదొలగడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్, అదే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఉనద్కత్ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ (ఔట్), పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్. -
WTC Final: టీమిండియా టీ20 స్టార్కు బంపరాఫర్!
ICC World Test Championship 2023 Final: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ ఆడే జట్టులో అతడికి స్టాండ్బైగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1గా కొనసాగుతున్న సూర్య.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలో విఫలం నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొట్టమొదటి సారి బరిలో దిగిన సూర్య పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రెండో మ్యాచ్ నుంచి అతడిని పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు ఎంపిక సమయంలో సూర్య పేరును పరిగణనలోకి తీసుకోలేదు. రాహుల్కు గాయం అదే సమయంలో వెటరన్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్.. ఐపీఎల్-2023లో అదరగొడుతున్న అజింక్య రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా మెగా మ్యాచ్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. యూకే వీసా రెడీ చేసుకో! ఈ నేపథ్యంలో సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. సూర్యను స్టాండ్బైగా ఎంపిక చేసి లండన్ పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘ఇంతవరకు ఈ విషయంపై అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అయితే, సూర్యను యూకే వీసా సిద్ధంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పారు’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఐపీఎల్తో తిరిగి ఫామ్లోకి కాగా స్వదేశంలో టెస్టుల్లో విఫలమైన సూర్య.. వన్డే సిరీస్లోనూ వరుసగా డకౌట్ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్-2023 ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన సూర్య.. ప్రస్తుతం మూడు అర్ధ శతకాలతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. లండన్లోని ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు జూన్ 12ను రిజర్వ్ డేగా ఫిక్స్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం.. -
అదరగొట్టిన టీం ఇండియా... మనమే నెంబర్ 1
-
బిగ్షాక్.. ఐపీఎల్కు కేఎల్ రాహుల్ దూరం!
లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు బిగ్షాక్ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీలైన్ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ.. మైదానంలో కుప్పకూలాడు. దీంతో తొడ కండరానికి గాయం కావడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు వచ్చి స్ట్రెచర్పై రాహుల్ను తీసుకెళ్లారు. అయితే లక్నో బ్యాటింగ్ సమయంలో ఆఖర్లో వచ్చిన రాహుల్ పరిగెత్తడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పీటీఐ సమాచారం మేరకు.. ''కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో జట్టుతో ఉన్నప్పటికి సీఎస్కేతో మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ పూర్తవ్వగానే జట్టును వీడనున్న రాహుల్ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో వైద్యులు స్కానింగ్ నిర్వహించనున్నారు. రిపోర్ట్స్ ద్వారా వచ్చే ఫలితంపై కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. ''ఒకవేళ రాహుల్ గాయంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడు. ఐపీఎల్ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేది కూడా అనుమానమే.కాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్లో గాయపడిన లక్నో బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు.'' అని పేర్కొంది. లక్నోకు ఎదురుదెబ్బే? ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన లక్నో ప్రస్తుతం ఓటములతో సతమతమవుతోంది. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు ఉనాద్కట్ దూరమవ్వడం లక్నోకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం లక్నోకు స్టాండిన్ కెప్టెన్గా ఉన్న కృనాల్ పాండ్యా.. కేఎల్ రాహుల్ దూరమైతే మిగతా మ్యాచ్ల్లోనే అతనే జట్టును నడిపించనున్నాడు. రాహుల్ దూరమైతే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం ఎవరికి? ఇక జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. గాయంతో కేఎల్ రాహుల్ దూరమైతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ దూరమైతే.. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, హనుమ విహారిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొన్నారు. We didn't win on the night, but one man won hearts everywhere. 💙 KL, we love you. Get well soon, skip! 🫶 pic.twitter.com/1x896mj9dF — Lucknow Super Giants (@LucknowIPL) May 2, 2023 చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?' -
బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్కు చుక్కలే!
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో షమీ నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ ఐపీఎల్ కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అందులోనూ పవర్ప్లేలోనే షమీ తన కోటా పూర్తి చేయడంతో నాలుగు వికెట్లు తీసుకోవడం మరో విశేషం. షమీ తన ఫామ్ను ఇలాగే కంటిన్యూ చూస్తే ఐపీఎల్ తర్వాత జరగనున్న డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్కు కష్టాలు తప్పేలా లేవు, ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా పేస్ దళాన్ని షమీనే నడిపించాల్సి ఉంది. గాయంతో బుమ్రా దూరం కావడంతో.. షమీ పెద్దన్న పాత్ర పోషించనున్నాడు. అంతవరకు షమీ గాయపడకుండా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఆసీస్కు చుక్కలే. జూన్ ఏడు నుంచి 11వరకు ఇంగ్లండ్లోని ఓవల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇక ఐపీఎల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇషాంత్ శర్మ( 5/12, వర్సెస్ కొచ్చిన్ టస్కర్స్, 2012) ఉన్నాడు. రెండో స్థానంలో షమీ(4/7, వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్,2023), మూడో స్థానంలో ధవల్ కులకర్ణి (4/8 -వర్సెస్ ఆర్సీబీ, 2016), నాలుగో స్థానంలో అజిత్ చండిలా (4/9 వర్సెస్ పుణే వారియర్స్, 2012) ఉన్నారు. 🤯🤯🤯 - It's all happening in #GTvDC A double-quick blow for @DelhiCapitals in the first two overs 👀 #GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/IFmx34UvLQ — JioCinema (@JioCinema) May 2, 2023 చదవండి: ఐదు మ్యాచ్ల్లో మూడుసార్లు.. ఇలాంటి ప్లేయర్ అవసరమా? -
టీమిండియా బౌలర్కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్సీబీతో మ్యాచ్లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది. అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్సైట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. See you back on the field soon @JDUnadkat Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN — IndianPremierLeague (@IPL) May 1, 2023 చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్కు ఫైనల్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ దూరం.. ఇప్పుడు మరో కీలక పేసర్ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. ఉమేశ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో కోల్కతా నైటరైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఉమేష్ యాదవ్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్కు ఉమేష్ దూరమయ్యాడు. అతడు ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఉమేష్ ఫిట్నెస్ సాధించకపోతే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి:Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్రౌండర్కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్! -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు భారత టెస్ట్ జట్టు సభ్యుడు, నయా వాల్ చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న పుజారా.. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు బాది ఆసీస్ బౌలర్లు తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా తొలి ఇన్నింగ్స్లో 238 పరుగులు ఎదుర్కొని 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. అంతకుముందు డర్హమ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లోనూ (115) పుజారా సెంచరీతో కదంతొక్కాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2, 2023లో ప్రస్తుతం పుజారా లీడింగ్ రన్ స్కోరర్గా (5 ఇన్నింగ్స్ల్లో 332) కొనసాగుతున్నాడు. తాజా శతకంతో పుజారా ఓ మైలురాయిని అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి (58 సెంచరీలు) ఎగబాకాడు. ఈ క్రమంలో అతను వసీం జాఫర్ (57)ను ఓవర్టేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ చెరి 81 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత రాహుల్ ద్రవిడ్ 68 సెంచరీలతో రెండో ప్లేస్లో.. విజయ్ హజారే మూడో స్థానంలో నిలిచారు. కాగా, లండన్లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పుజారా కీలక సభ్యుడు. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు (24 మ్యాచ్ల్లో 50.82 సగటున 203 పరుగులు) కలిగిన పుజారా.. ఇదివరకే తాను చాలాసార్లు సత్తా చాటిన ఓవల్ మైదానంలో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ససెక్స్ తొలి ఇన్నింగ్స్- 455/5 డిక్లేర్ గ్లోసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్-198/9 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి) -
టీమిండియా ఓపెనర్గా గిల్ వద్దు.. అతడే సరైనోడు!
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కోసం ఇంగ్లండ్కు పయనం కానుంది. లండన్ ఓవల్ వేదికగా జూన్7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ కంటే కేఎల్రాహుల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మైఖల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని ఆఖరి రెండు టెస్టులకు జట్టును తప్పించారు. ఈ క్రమంలో రాహుల్కు ఇక టెస్టు భవిష్యత్తు కష్టమనేని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ సెలక్టర్లు రాహుల్పై మరోసారి నమ్మకం ఉంచారు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో రాహుల్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మైఖల్ వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. "శుబ్మన్ గిల్ అద్భుతమైన యంగ్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంగ్లండ్ వంటి పరిస్ధితుల్లో గిల్ కంటే రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. గిల్ బ్యాటింగ్ టెక్నిక్లో నేను కొన్ని లోపాలను గమనించాను. అందుకే గిల్ కంటే రాహుల్ బెటర్ అని భావిస్తున్నాను. కాగా ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే. కాబట్టి పాత చరిత్రను చూడకుండా రాహల్కు అవకాశం ఇవ్వండి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలంటే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగడం ముఖ్యం. కావలంటే వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో మార్పులు చేయవచ్చు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023 PBKS Vs LSG: హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్ -
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికైన రహానే...!
-
టీమిండియా ఆల్రౌండర్కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానే అవకాశం దక్కింది. దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్తో పాటు అదనపు పేసర్గా శార్దూల్ ఉండనున్నాడు. అదే విధంగా ప్లేయింగ్ ఎల్వన్లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్ వికెట్ హాల్తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్గా భారత్ తరపున 8 టెస్టు మ్యాచ్లు ఆడిన శార్ధూల్.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్కు చుక్కదరైంది. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు -
డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు
లండన్లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించిన సెలెక్టర్లు.. ఒక్క అనూహ్య మార్పు చేశారు. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఐపీఎల్-2023లో ఇరగదీస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు మరో అవకాశం ఇచ్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ -
సర్జరీ సక్సెస్... టీమిండియాకు గుడ్న్యూస్! మెగా టోర్నీకి అందుబాటులోకి!
Shreyas Iyer - Back Surgery: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సర్జరీ విజయవంతమైంది. వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన అతడు చికిత్స కోసం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం శ్రేయస్కు సర్జరీ జరిగినట్లు సమాచారం. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ తొలి మ్యాచ్కు దూరమైన అయ్యర్ రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. కానీ.. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మూడో మ్యాచ్ మధ్యలోనే జట్టు నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సిరీస్కు పూర్తిగా దూరమైన అయ్యర్ ఐపీఎల్-2023 సీజన్కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో సర్జరీ కోసం లండన్ వెళ్లిన అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో వెల్లడించింది. కాగా అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అయ్యర్ దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే, అక్టోబరులో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఈ 28 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్ అయ్యర్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా ఉన్నాడు. అతడి గైర్హాజరీలో నితీశ్ రాణా ప్రస్తుతం కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రాణా నేతృత్వంలో కేకేఆర్ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అయ్యర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్! చెన్నైతో మ్యాచ్.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్కు నో ఛాన్స్ -
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆసీస్ జట్టు ప్రకటన! అతడికి మరో ఛాన్స్
లండన్ వేదికగా జాన్ 7నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు యాషెస్ సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్కు ఈ జట్టులో చోటు దక్కింది. గత కొంత కాలంగా వీరిందరూ టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్నారు. అదే విధంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆసీస్ సెలక్టర్లు మరోసారి అవకాశమిచ్చారు. వార్నర్కు ఉన్న అనుభవం దృష్ట్యా సెలక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. ఇక తన తల్లి మరణం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమైన ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రానున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టును మే మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ చదవండి: IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! -
5 ఏళ్ళ తరువాత భారత పర్యటనకు ఆఫ్గనిస్తాన్...!
-
సూర్యకుమార్కు నో ఛాన్స్.. రహానేకు బంపరాఫర్!
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అద్భుత ఫామ్లో రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రహానే దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 61 పరుగులతో అదరగొట్టిన రహానే.. రాజస్తాన్తో మ్యాచ్లో కూడా 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే రహానే మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపునివ్వాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో విదేశీ పిచ్లపై అనుభవం ఉన్న రహానే వైపు మెగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రంజీల్లో దుమ్మురేపిన రహానే.. అదే విధంగా రంజీ సీజన్ 2022-23లో రహానే అదరగొట్టాడు. 7 మ్యాచ్లు ఆడిన రహానే 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, డబుల్ సెంచరీ ఉన్నాయి. ఇక రహానే చివరగా భారత్ తరుపున గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. చదవండి: IPL 2023: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే! మామూలుగా ఉండదు! -
కెప్టెన్గా అదుర్స్.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హోవ్ వేదికగా డర్హామ్తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్లో బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజరా టాప్ స్కోరర్గా నిలవగా.. ఓలివర్ కార్టర్(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
డబ్ల్యూటీసీ ఫైనల్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు
టీమిండియా వెటరన్ ఆటగాడు, ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ 2023-24 గాను ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో హనుమ విహారికి చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు కష్టమని అంతా భావించారు. కానీ విహారి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసే ఇంకా దారులు మూసుకుపోలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు భారత జట్టులో హనుమ విహారికి చోటు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు వెన్ను గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో విహారి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా విహారీ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో విహారి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి మళ్లీ పిలుపునివ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా తరుపున ఎన్నో విరోచిత ఇన్నింగ్స్లు ఈ ఆంధ్రా కెప్టెన్ ఆడాడు. లండన్ వంటి స్వింగ్ పిచ్లపై అద్భుతంగా ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. "శ్రేయస్ అయ్యర్ మా జట్టులో చాలా కీలమైన ఆటగాడు. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా వంటి పిచ్లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్లో ఆడిన అనుభవం కూడా అయ్యర్కు ఉంది. అతడి స్థానాన్ని మరో అనుభవజ్ఞుడైన ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాము. మా సెలక్టర్లు హనుమ విహారి పేరును పరిశీలిస్తున్నారు. మే మొదటి వారంలో జరగనున్న సెలక్షన్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకుంటారని" పేర్కొన్నారు. కాగా విహారి చివరగా భారత్ తరపున గతేడాది ఇంగ్లండ్పై ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ -
ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం! వరల్డ్కప్ టోర్నీకి కూడా
Shreyas Iyer- KKR- WTC Final: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ టోర్నీ మొత్తానికి, జూన్లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూరమయ్యాడు. అయ్యర్ వెన్ను గాయానికి శస్త్ర చికిత్స విదేశంలో జరగనుందని... అతను కోలుకోవడానికి కనీసం ఐదారు నెలలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి కూడా అయ్యర్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేమని బీసీసీఐ వర్గాలు వివరించాయి. టెస్టు సిరీస్లో విఫలం కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023 సిరీస్కు ముందు గాయపడ్డ శ్రేయస్... రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అయితే, మూడో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో మళ్లీ జట్టు (ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 42)కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సర్జరీ చేయించుకునే క్రమంలో విదేశాలకు వెళ్లనున్న అయ్యర్ ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. కనీసం ఐదు నెలల పాటు విశ్రాంతి అవసరమైన తరుణంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. అదే విధంగా మరికొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం అనుకుంటే వరల్డ్కప్- 2023 టోర్నీకి కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇక శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్రైడర్స్ అతడి స్థానంలో నితీశ్ రాణాకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా ఏడు పరుగుల తేడాతో ఓడి పరాజయంతో సీజన్ను ఆరంభించింది. అయ్యర్కు తోడు స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, మరో బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ సైతం తమ దేశం తరఫున సిరీస్ ఆడేందుకు జట్టుకు దూరమైన నేపథ్యంలో కేకేఆర్కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. చదవండి: గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. కేన్మామ స్థానంలో లంక ఆల్రౌండర్