Akkineni Nageshwar Rao
-
అక్కినేని కుటుంబం మూలస్తంభాన్ని కోల్పోయింది: నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Akkineni Nagarjuna) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నాగ్ కుటుంబంతోనే ఉన్నారు. తన తండ్రి అభిమానులను నాగార్జున ఎంతో ప్రత్యేకంగా చూస్తారని తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అభిమాని మరణ వార్తను తెలుసుకున్న నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు సంతాపం తెలిపారు.మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను బాగా కలచివేసింది. ఆయన మా నాన్నగారికి వీరాభిమాని. నాన్న నుంచే మాకు మరింత దగ్గరయ్యారు. అక్కినేని కుటుంబానికి మూలస్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు.' అని కోరుకుంటున్నాను. యద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలుకు చెందిన వ్యక్తి. నాగేశ్వరరావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారని సమాచారం. వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా అయ్యప్పరెడ్డి ఉండే వారు. అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెబుతుంటారు.Deeply saddened by the passing of Yeddhula Ayyappa Reddy garu, he was ardent fan of my father, ANR garu and pillar of strength for the Akkineni family.His love and affection to us can never be forgotten 🙏My deepest condolences to his family, and may God give them the strength… pic.twitter.com/6i2k3ycNUt— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2025 -
మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. మీకు ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు వెల్లడించారు. ఇది నా తండ్రి ఏఎన్నార్ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను మీరు గుర్తించడం మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున ట్వీట్ చేశారు.పార్లమెంట్ హౌస్లో అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రధానిని కలిసి ఫోటో దిగారు. నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా నరేంద్ర మోదీని కలిశారు. కాగా.. ఇటీవల మన్ కీ బాత్లో తెలుగువారి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. Profoundly thankful to Hon'ble Prime Minister @narendramodi ji for today's meeting at Parliament House. It was an honor to present 'Akkineni Ka Virat Vyaktitva' by Padma Bhushan awardee Dr. Yarlagadda Lakshmi Prasad, a tribute to my father ANR garu's cinematic heritage. Your… pic.twitter.com/4y5y1C1eRY— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 7, 2025 -
అన్నపూర్ణ స్టాఫ్ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్ఆర్గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
వీడియో: అన్నపూర్ణ స్టూడియోని చూశారా.. ఎంత అద్భుతంగా ఉందో..
చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్కి తీసుకురావడానికి నాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వర్ రావు తీవ్రంగా శ్రమించారు. కొండలు, గుట్టలు ఉన్న అడవి ప్రాంతాన్ని కొని స్టూడియోని నెలకొల్పాడు. అదే అన్నపూర్ణ స్టూడియో. ఈ స్టూడియో నెలకొల్పి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కినేని తనయుడు, హీరో నాగార్జున ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశాడు.రోడ్లే లేని ప్రాంతంహైదరాబాద్లో సినీ పరిశ్రమ స్థాపించేందుకు.. ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు నాగేశ్వర రావు ముందుకువచ్చారు. 1976లో అప్పటి ప్రభుత్వం అక్కినేనికి 22 ఎకరాల భూమికి తక్కువ ధరకు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్కినేని నాగేశ్వర రావు అతి కష్టపడి స్టూడియో నిర్మించారు. దానికి తన భార్య పేరు మీద 'అన్నపూర్ణ స్టూడియో' అని పెట్టారు. ఆ స్టూడియో నిర్మించే సమయంలో అక్కడికి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా సరిగా లేదట. కొండలు,గుట్టలు ఉన్న ప్రాంతం కొని ఏం చేస్తాడని అంతా ఏఎన్నార్ని హేళన చేశారట. కానీ అక్కినేని మాత్రం పట్టుపట్టి మరీ స్టూడియోని నిర్మించారట. తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ స్టూడియోకి తన భార్య పేరే పెట్టాలనుకున్నాడట. అందుకే ఆ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియో అని నామకరణం చేశారు. ‘అమ్మ అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన విజయం వెనుక అమ్మగారు ఉన్నారని ఎప్పుడూ నమ్మేవాడు. అందుకే ఆమె పేరును స్టూడియోకి పెట్టి.. ప్రాణంగా చూసుకున్నాడు. ఎక్కువ సమయం ఆ స్టూడియోలోనే గడిపేవారు. అందుకే అన్నపూర్ణ స్టూడికి వచ్చినప్పుడల్లా..అమ్మానాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు.సంక్రాంతి ఆనవాయితీఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోని మరింత డెవలప్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నారు. వందలాది మంది టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు, డైరెక్టర్లకు ఉపాధి పొందుతున్నారు. 1976 సంక్రాంతికి ఈ స్టూడియో స్థాపించారట. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి ఏఎన్నార్ తన సతీమణితో అక్కడికి వచ్చి.. అక్కడి ఎంప్లాస్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవాడట. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తుందట. ‘అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికీ ఇంత చక్కగా రన్ అవుతుందంటే కారణం ఇక్కడి ఉద్యోగులు. వారు ఎంప్లాస్ కారు అన్నపూర్ణ ఫ్యామిలీ. వారంతా ఈ స్టూడియో కోసం చాలా కష్టపడతారు. నాన్నగారి మొదలుపెట్టన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. సంక్రాంతి పండక్కి మేమంతా ఇక్కడి ఎంప్లాస్తో కలిసి టిఫిన్ చేస్తాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు నాగార్జున. -
'రాబోయే తరాలకు ఆదర్శం'.. ప్రధానికి నాగార్జున కృతజ్ఞతలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్లో అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడంపై నాగ్ స్పందించారు. మా నాన్న శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని నాగార్జున పోస్ట్ చేశారు. ఈ గుర్తింపు మా కుటుంబంతో పాటు సినీ ప్రపంచానికి దక్కుతుందన్నారు. ఆయన సినీ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.కాగా.. ఏడాది ఏఎన్నాఆర్ శతజయంతి ఉత్సావాలను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అవార్డ్ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుకలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని శతజయంతి ఉత్సావాల సందర్భంగా చివరిసారి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను కూడా ప్రదర్శించారు.ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుశ్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.Thank you, Hon’ble Prime Minister shri @narendramodi ji, for honoring my father, ANR Garu, on his centenary year alongside such iconic legends. 🙏His vision and contributions to Indian cinema continue to inspire generations, and this recognition means the world to our family and… https://t.co/PK0kah9gHT pic.twitter.com/Yh5QSYm4cA— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 29, 2024 -
ఆయన వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు.ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మన్ కీ బాత్లో మన తెలుగు సినీ దిగ్గజం నాగేశ్వరరావును ప్రశంసించండంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన ‘బుల్లోడు’..ఆల్టైమ్ రికార్డు
‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని–హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్గా తొలుత అనుకున్నది జయలలితను. ఈమెతో నిర్మాతల సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ‘దసరా బుల్లోడు’లో నటించడానికి జయలలిత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్తో ‘శ్రీకృష్ణ విజయము’, ఎమ్జీఆర్తో మరో సినిమాలో నటిస్తున్నారు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్నార్ ‘దసరా బుల్లోడు’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా అనుకున్నారట.ఏఎన్నార్ కంటే వాణిశ్రీకి డబుల్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు అక్కినేని పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీకి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట. అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు. అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే... ‘దసరా బుల్లోడు’ హిట్తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్గా మారి పోయారు. ఆ తర్వాత ‘ప్రేమ్నగర్’ లాంటి ఆల్టైమ్ బెస్ట్ రావడానికి దసరాబుల్లోడే పునాది వేసింది. దీంతో అక్కినేని–వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే పేరొచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలొచ్చాయంటే‘దసరాబుల్లోడు’ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.12 రోజుల రీ షూట్హీరా లాల్ డ్యాన్స్ డైరక్షన్లో ‘పచ్చగడ్డి కోసేటి...’ సాంగ్ షూటింగ్తో షూటింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏదీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు. ఏ గడప దగ్గర నించున్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే. కేవీ మహదేవన్ మ్యూజిక్ ఓ వైపు... ఆత్రేయ సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి. ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ ఇలా అన్ని పాటలూ బంపర్ హిట్. అప్పట్లో ‘దసరా బుల్లోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు.హీరోగా సూపర్ హిట్ కెరీర్ని చూసి, ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దూసుకెళుతున్న జగపతిబాబు తండ్రే ‘దసరా బుల్లోడు’ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే. జగపతిబాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు. అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్. ‘దసరా బుల్లోడు’తోనే వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదనరావు ఆస్థాన దర్శకుడు. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారట వీబీ. ఆయనకూ వీలు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారట. కానీ స్టేజ్ ఆర్టిస్ట్గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మంచి అనుభవమున్న వీబీనే డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్నార్ ప్రొత్సహించడంతో వీబీ దర్శకత్వం చేయక తప్పలేదు. అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. తర్వాత వివిధ కారణాలవల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టుకున్నారు వీబీ రాజేంద్రప్రసాద్. – దాచేపల్లి సురేష్కుమార్ -
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
ఎన్ని తరాలు చూసినా కొత్తగా అనిపించే కల్ట్ క్లాసిక్ 'గుండమ్మ కథ'
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.గుండమ్మగా ఆమే కరెక్ట్సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.గార్డెన్స్లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.ఇద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.ఫొటోలతో టైటిల్స్ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.‘గుండమ్మ కథ’ రీమేక్?ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.– అలిపిరి సురేష్ -
అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..అయితే అన్నపూర్ణ స్టూడియోస్నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.కుటుంబ ఉమ్మడి నిర్ణయం..ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.తనతో బాగా కనెక్ట్ అయ్యా..శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. -
ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్ఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
మెగాస్టార్కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
'ఏఎన్ఆర్ చివరి ఆడియో సందేశం'.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్!
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎన్ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని ప్రదర్శించారు.ఏఎన్ఆర్ ఆడియోలో మాట్లాడుతూ..' నా కోసం మీరు అంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు చెబుతూనే ఉన్నారు. మీ ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు' అంటూ చివరిసారిగా ఐసీయూ నుంచి సందేశమిచ్చారు. ఇవాళ శతజయంతి వేడుకల్లో నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఇది విన్న మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. -
అభిమానులతో కలసి ANR హిట్ సినిమా చూసిన నాగచైతన్య
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరబాద్లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైయింది. 31 నగరాల్లో ANR 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.ఈ ఫెస్టివల్లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని హైదరబాద్లోని శాంతి థియేటర్లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమాను కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. -
ఏఎన్నార్తో నటించడం నా అదృష్టం: చిరంజీవి
లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్నార్ 100వ జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన అద్భుతమైన నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించుకుంది. సినీపరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. తనతో కలిసి నటించడం ఎన్నటికీ మర్చిపోలేను. ఆ అద్భుతమైన క్షణాలు నాకు మధురమైన జ్ఞాపకాలు అని రాసుకొచ్చారు. Remembering the legendary ANR,#AkkineniNageswaraRao garu, one of the greatest actors of all time on his 100th birth anniversary.An acting genius and A doyen of Cinema, ANR garu’s memorable performances remain etched in the hearts and minds of Telugu audiences. His… pic.twitter.com/nW0TCrz2Cf— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2024 చదవండి: ఇంగ్లీష్తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం -
హిట్ సినిమా కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకొస్తాడు: నాగార్జున
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 -
కుటుంబంతో పాటు తండ్రి హిట్ సినిమాను చూడనున్న నాగార్జున
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన నటించిన పది క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) వారు దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు నాగేశ్వరరావు క్లాసికల్ హిట్ సినిమాల ప్రదర్శన ఉండనుంది. అన్నపూర్ణ స్టూడియోస్, హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ ఐనాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. సెప్టెంబర్ 20న హైదరాబాద్ సినిఫ్లెక్స్లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనకు అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ పాల్గొననున్నారు. సాయింత్రం 6:30 గంటలకు ఈ షో ఉంటుంది. టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014) -
ఇంగ్లీష్తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం
అక్కినేని నాగేశ్వరావు జీవితంలో తక్కువగా తెలిసిన, కానీ ఎంతో లోతైన అంశం ఆయనకు ఇంగ్లీష్ భాషతో ఉన్న అనుబంధం. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం లేనందుకు ఆయనని హేళన చేశారు. ఆ అవమాన భారంతో గుండెలు మండి బాత్ రూమ్లోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఓ మలుపుగా మారింది. నాగేశ్వరరావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ పత్రికలను ప్రధాన వనరుగా చేసుకొని, ప్రతిరోజూ పత్రిక చదువుతూ, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేశారు. కొంత కాలం పిదప ఆయన తన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ, చక్కటి శైలితో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన విషయమే ఆయనకు విజయంగా మారింది.స్కూల్కు వెళ్లలేదు, కానీ తానే విశ్వవిద్యాలయం అయ్యాడుఅక్కినేని పాఠశాలకు వెళ్లలేదు. పెద్ద చదువులు చదవలేదు. కానీ సినీ కళపై ఉన్న అంకితభావంతో స్కూల్కు వెళ్లకపోయినా, నటన కళలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సినిమాను తన తరగతి గది అనుకున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఆయనకు ఓ పాఠం. అంచలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, శ్రద్ధతో నేర్చుకోవడం వలన ఆయన తానే ఓ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించారు. ఎంతో మందికి ఆదర్శవంతులయ్యారు.-సందీప్ ఆత్రేయ, సాక్షి పోస్ట్ -
అక్కినేని తర్వాతే ఎవరైనా.. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని ఘనత
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)ఎప్పటికీ గుర్తుండిపోయే..లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.ఆ రెండింటిలోనూపై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్గా నిలిచిపోయారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నవలా నాయకుడుఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!) -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్లోని చివరిపాటను మోహన్లాల్తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు.. 10 క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్
ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.1941లో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్లో 250 చిత్రాలకు పైగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యున్నతమైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. 1924 సెప్టెంబరు 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు. 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశంలో 25 ప్రధాన నగరాల్లో నాగేశ్వరరావు నటించిన 10 సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోలతో పాటు వడోదర, జలంధర్, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా ఈ సనిమాలు రిలీజ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రధాన సిటీలలో విడుదల అవుతాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)నిధులుఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, NFDC - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా , మల్టీప్లెక్స్ చైన్ PVR-Inox సంయుక్తంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి.తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది: నాగార్జున 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ గురించి నాగార్జున ఇలా రియాక్ట్ అయ్యారు. 'కొన్ని దశాబ్దాలుగా ప్రజల హృదయాలలో నిలిచిపోయే పాత్రలలో నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన సాధువుగా కనిపించినా, మద్యపానానికి బానిసగా ఆపై రొమాంటిక్ హీరోగా అనేక రకాల పాత్రలను పోషించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. అందుకే ఆయన్ను 'నటసామ్రాట్' అని పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించిన మార్గదర్శకుడు. అతని వారసత్వం గురించి మేము చాలా గర్విస్తున్నాము. ఈ పండుగ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్ను గుర్తుంచుకుంటారు.' అని నాగ్ అన్నారు.ఆ అదృష్టం నాకు కలిగింది: అమితాబ్ బచ్చన్'అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలా సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ, వినయం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని తెప్పిస్తాయి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగను జరుపుతుంది. బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి గురించి అందరూ తెలుసుకునే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుంది.' అని అన్నారు. -
ఏయన్నార్ శత జయంతి సందర్భంగా కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్స్లో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు నూరవ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ఏయన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్స్క్రీన్’ పేరుతో ఓ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్తో ΄ాటు వరంగల్, కాకినాడ, తుముకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్స్ చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్మార్క్ సినిమాల ఫెస్టివల్తో జరుపుకోనుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఎఐ, పీవీఆర్–ఐనాక్స్కి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫెస్టివల్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ‘‘ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికే ఈ పండగ’’ అని తెలి΄ారు ఎన్ఎఫ్డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్. -
పద్మ విభూషణ్.. ఆ దిగ్గజ నటుడి తర్వాత మెగాస్టార్కే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అయితే తెలుగు సినీరంగంలో ఈ అవార్డ్ ఇప్పటివరకు ఒక్కరికే మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్ను వరించింది. దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికీ మాత్రమే దక్కింది. అక్కినేనికి పద్మ విభూషణ్ మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు (7 సార్లు), జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నారు. అవార్డుల రారాజు మెగాస్టార్ తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం
దీపావళి.. తెలుగు వారి ముంగిట ఎంతో వెలుగులతో జరిగే పండుగ. నేడు ప్రతి ఇంటి ముందు కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి రివ్వున వెళ్లే తారా జువ్వలతో పాటు చిచ్చుబుడ్లు వెలుగుల ముందు అందరూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా ఇవన్నీ నిలుస్తాయి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో కూడా దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ సందర్భంగా కొన్ని పాటలు మీకోసం.. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన విచిత్రబంధం సినిమాలో “చీకటి వెలుగుల రంగేళి..” అంటూ సాగే దీపావళి పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది. మామగారు 1991లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున జంటగా నటించారు. ఇందులోని దిపావళి పండుగ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షాసేథ్, ప్రభాస్ మధ్య దీపావళీ సాంగ్ బాగా పాపులర్ అయింది. 1950 లో విడుదలైన షావుకారు తెలుగు సినిమా డ్రామా ఎంటర్టైనర్గా నిలిచింది. ఇందులో నటించిన వారు షావుకరు జానకి, గోవింద రాజుల సుబ్బ రావు, నందమురి తారక రామారావు. నిర్మాతగా బి నాగిరెడ్డి కాగా ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు. -
అన్నపూర్ణ స్టూడియోలో ANR శత జయంతి ఉత్సవాలు
-
అక్కినేని.. నీకెవరు సాటిరాని!
తెలుగునాట సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జన్మించి నేటితో 99 ఏళ్లు నిండాయి. సెప్టెంబర్ 20న 1924లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి 100 ఏళ్లు నిండుతాయి. ఈ రోజు నుంచే ఆ శకపురుషుడి శతవసంత వేడుక ఆరంభమైంది. ప్రపంచమంతా, వాడవాడలా విశేష వేడుకలు మొదలయ్యాయి. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణల కోలాహలం మొదలైంది. తెలుగు జన హృదయ సామ్రాజ్యలను దోచుకున్న 'నటసామ్రాట్' అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం. తానే గీసుకున్న అందమైన 'చిత్రం'. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని, జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి, జీవించిన నిత్య అధ్యయన శీలి. చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం. తను రాసిన 'అ ఆలు..' చదివితే చాలు. అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది. ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు, కళాప్రపూర్ణుడు. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం. సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వాగ్గేయకారులు,మహాభక్తులు, కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు. కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు, విప్రనారాయణుడు ఈయనే ఏమో! అని భ్రమ కలుగుతుంది. చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం. "స్పర్ధయాన్ వర్ధతే విద్య" అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు, పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా, తన ఉనికిని కాపాడుకుంటూ.. తన విశిష్ట ముద్ర వేసుకోడానికి, ఎంత తపన పడ్డాడో? జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు, సావిత్రి వంటి ప్రతిభామణులు ఉన్న కాలంలో, దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో! అడుగడుగునా,ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి,గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు. ఆ తపనే తపస్సు. హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం, వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం. నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి, పరమ భక్తులైనతుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం. అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది. తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే. ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది.'నవరాత్రి' సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఆయనే తొలి నవలా నాయకుడు కూడా. ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. 'దేవదాసు'గా ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు.ఆ హెయిర్ కట్, ఆ మీసకట్టు,డ్రెస్ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మించారు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ, నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ నటప్రస్థానాన్ని ప్రారంభించారు. స్త్రీ పాత్రలు వేసి,తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు. పాటలు, పద్యాలు పాడి డాన్సులు వేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతి భవనానికి మెట్లు కట్టుకున్నారు. వెండితెరపై ఏడు దశాబ్దాలు 16 ఏళ్ల వయస్సులోనే (1940)'ధర్మపత్ని'తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 20ఏళ్ల ప్రాయంలోనే 'సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. అప్రతిహతంగా ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిది పదుల వయస్సులోనూ 'మనం'లో జీవించి మెప్పించారు. జీవితంలో తుదిశ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు. కె విశ్వనాథ్కు దర్శకుడిగా అవకాశం నటుడుగా విజృంభించడమే కాక,'అన్నపూర్ణ' బ్యానర్లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి. కె.విశ్వనాథ్లో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని నాగేశ్వరావు. కేవలం గుర్తించడమే కాక 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి.. ప్రోత్సహించినవారు కూడా ఆయనే. ఎక్కడ ప్రతిభ, పాండిత్యం ఉంటే అక్కడ గుర్తించి, ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి, గౌరవించిన కళాహృదయుడు, ప్రతిభా పక్షపాతి అక్కినేని.మహాదాత కూడా. కాలేజీ కోసం ఉన్నదంతా దానం గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి. తన ప్రతిభ పట్ల, రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు. ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు. కేవలం గుడివాడ కాలేజీకే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే, పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు.'అపాత్రాదానం' చేయకూడదన్నది ఆయన నియమం. తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు. సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం. 50 ఏళ్లకే గుండె ఆపరేషన్ 50 ఏళ్ల వయస్సులోనే గుండె దెబ్బతిన్నది. అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు. అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు. తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు. గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది. అచంచలమైన మనోధైర్యం, విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు. ఆ తీరు అన్యులకు సాధ్యపడదు. సునిశితమైన పరిశీలన, చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు, నిలువెల్లా రసికత, గుండెనిండా పట్టుదల, నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు. క్రమశిక్షణకు మారుపేరు అకడమిక్గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో పిల్లలను బాగా చదివించారు. చదివించడమే కాక,ఎంతో క్రమశిక్షణతో పెంచారు. శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ, నిజ జీవితంలోనూ తన బలాలు,బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు. తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు. ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు. రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా చిరునవ్వుతో తప్పించుకున్నారు. కానీ,రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు. రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక 'ఆట'విడుపు. సాధించని అవార్డులు లేవు ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి.నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనను చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ,కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి. ఒక్క 'భారతరత్న' తప్ప, ఘనమైన గౌరవాలన్నీ దక్కించుకున్నారు. 'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్' స్థాపించారు. దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు. దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు'ను అందుకున్నారు. అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. "బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన వయసులో డబ్బులు లేవు. డబ్బులున్న నేడు వయస్సు లేదు" అంటూ జీవనసారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని. అక్కినేని వలె జీవించడం, జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని 'అమరజీవి'గా అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు. రచయిత: మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా) తొలిసారి రాముడిగా ఆయనే.. సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం. రాముడంటే ఆయనే అనేలా.. తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది. రావణుడిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ఒక్కసారైనా ఒదిగిపోయారు.. తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది. ఆదిపురుష్లో ప్రభాస్ అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది. -పిన్నాపురం మధుసూదన్ -
అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లెజెండరి నటులు దివంగత నాగేశ్వరరావును ఉద్దేశించిన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దూమారం లేపాయి. దీంతో బాలయ్య క్షమాపణలు చెప్పాలటూ అక్కినేని అభిమానులంతా డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యాలపై స్పందించిన బాలయ్య వివరణ ఇస్తూనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ‘నాగేశ్వరరావు గారు నాకు ఎప్పుటికి బాబాయే. ఆయన అంటే నాకు చాలా గౌరవం.ఆయన కూడా నన్ను తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. నన్ను అప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే అక్కడ లేని(అక్కినేని కుటుంబంలో) అప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి. గుర్తు పెట్టుకోండి’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బాలయ్య కామెంట్స్ వైరల్గా మారాయి. కాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన ‘అక్కినేని-తొక్కినేని’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ టైమ్లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత -
అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య
‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుని కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో యాదృచ్చికంగా ఆ మాట వచ్చిందన్నారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు(ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు . నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ నేర్చుకున్నాను. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చాం. బాబాయి(నాగేశ్వరరావు) పై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు’ అని బాలకృష్ణ అన్నారు. కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. -
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్. మెంటల్ హ్యాష్ట్యాగ్ ‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్ మామయ్య’ అనే హ్యాష్ట్యాగ్స్ ట్విటర్ వేదికగా ట్రెండింగ్లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘ఈ మెంటల్కి సర్టిఫికెట్ రెన్యూవల్ చేయలేదా?.. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. Ma mental balakrishna ni kutha pagal degai la Unaru 🤣 Andhukai mata matladai mundhu alochinchi matladali... Adhi yavar ina sare.... #MentalBalaKrishna pic.twitter.com/rvD6oVOlEV — AK Badri (@AKBadri6848) January 25, 2023 సినిమాల్లో డైలాగ్స్ ఏముంది బొచ్చడు చెప్పుకోవచ్చు కానీ బైట అలా ఉండదు #VeeraSimhaReddy#MentalBalaKrishna pic.twitter.com/sf31KY3Y2e — Mahesh (@Norito_DON) January 23, 2023 చివరి రోజుల్లో ఎన్టీఆర్కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్ చేశారు. ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు. ‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం. మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్నోట్లో పేర్కొన్నారు. పవన్ స్పందించాలి ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సెకండ్ సీజన్లోని ఓ ఎపిసోడ్కు పవన్ గెస్ట్గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
తాగే బ్రాండయినా మార్చుకో లేదా తీరు మార్చుకో.. బాలయ్యకు వార్నింగ్
తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించిన దిగ్గజాలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జనవరి 22న ఆయన వర్ధంతి కాగా అదేరోజు నందమూరి బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అంటూ ఏఎన్నార్ను కించపరిచేలా మాట్లాడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వరుసగా సినిమాలు విజయం సాధించడంతో బాలకృష్ణకు గర్వం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఏఎన్నార్ అభిమానులు బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. నర్తకి సెంటర్లో బాలయ్య ఫ్లెక్సీని దగ్ధం చేశారు. వెంటనే బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగే బ్రాండ్ అయినా మార్చుకో లేదా మాట తీరైనా మార్చుకో అని నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. చదవండి: విజయ్ ఆంటోని ఆరోగ్యంపై క్లారిటీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు నాగ్ అలా.. ఏఎన్నార్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. -
ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. దిగ్గజ నటుడైన అక్కినేని కించపరుస్తూ మాట్లాడటం సరికాదంటూ బాలకృష్ణపై మండిపడుతున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్ అదే విధంగా గతంలో దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి తారకరామారావు గురించి ప్రస్తావిస్తూ గౌరవప్రదంగా వ్యాఖ్యానించిన నాగార్జున పాత వీడియోను అక్కినేని ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలో వైరల్ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమా గత ఏడాది జనవరి 14న విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. దీంతో ‘బంగార్రాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ను నిర్వహించారు. ఈ వేదికపై ఎన్టీఆర్ వర్ధంతిని గుర్తు చేసుకుని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫిలిం ఇండస్ట్రికి రెండు కళ్లు ఎప్పుటించో అంటుంటారు. ఒకటి నందమూరి తారకరామారావు గారు, ఇంకొకరు అక్కినేని నాగేశ్వరరావు. చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్ ఈ రోజు జనవరి 18.. నందమూరి తారక రామారావుగారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకు మనం ఆయనను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ లివ్స్ ఆన్.. అలాగే ఏయన్నార్ లివ్స్ ఆన్’’ అన్నారు’‘ఎన్టీఆర్ వర్ధంతి నాడు నాగార్జున అంత బాగా మాట్లాడితే, జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి నాడు ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడటం సబబేనా? ఇదేనా బాలకృష్ణ సంస్కారం అంటూ అప్పటి నాగార్జున వీడియోను, ఇప్పటి బాలకృష్ణ వీడియోను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేశారు. Difference between #MentalBalaKrishna and King @iamnagarjuna Nag gave huge respect towards late NTR garu on his death anniversary during #Bangarraju celebrations👏, on the other hand Ball insulted legendary #ANR on his death anniversary during VSR success meet 🤮🤮🤮 pic.twitter.com/zefa3eOrYR — Nag Mama Rocks 🤙🔥👑😎🌟🫶⛓️🇮🇳 (@SravanPk4) January 24, 2023 -
బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ అన్నారు. (చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్) దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వ్యాఖ్యలపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. ‘బాలయ్య స్టేజ్పై ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మహానటుల గురించి జోక్గా మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఏన్నాఆర్ నాకు బాబాయ్ లాంటివాడు అని చెప్పుకునే బాలకృష్ణ.. ఆయన వర్థంతి రోజు(జనవరి 22).. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? అభిమానం ఉంటే ఒక్క నిమిషం మౌనం పాటించాలి. నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? బతికున్నంత కాలం నటించిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తిని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్లే. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు హీరో నాగచైతన్య, నిఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. -
బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్
‘అక్కినేని తొక్కినేని’ అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేన్నారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. (చదవండి: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. pic.twitter.com/NAuvMrQZtu — chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023 pic.twitter.com/0coiyzlkiD — Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023 -
ఒక శకం ముగిసింది
-
250 థియేటర్లో రీ రిలీజ్కు రెడీ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’(1982) చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. విష్ణుప్రియ సినీకంబైన్స్ బేనర్పై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్ ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతిబింబాలు’ సినిమాని అనేక కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయాను. కానీ, ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని జోడించి, సరికొత్త హంగులతో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గత సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని మా వాణి వెంకటరమణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్. ఈ చిత్రానికి సమర్పణ: రాజేశ్వరన్ రాచర్ల, నిర్వహణ: జాగర్లమూడి సురేశ్ బాబు. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
రీ-రిలీజ్కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్బస్టర్ చిత్రాలు!
‘ఏదీ... కొంచెం ఫేస్ లెఫ్ట్కి టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ ‘ఘరానా మొగుడు’లో చిరంజీవి, ‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’లో మహేశ్బాబు మాస్గా రెచ్చిపోతే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ చిత్రాలను మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూసే చాన్స్ రావడం ఫ్యాన్స్కి పండగే. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను ‘నేడే చూడండి.. మళ్లీ విడుదల’ అంటూ రీ రిలీజ్ చేసే కొత్త ట్రెండ్ వల్ల ఆ చాన్స్ దక్కుతోంది. ఇక ఆ విశేషాల్లోకి వెళదాం... మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’ (2006) పలు రికార్డులు సాధించింది. సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇటీవల మహేశ్బాబు బర్త్డే (ఆగస్ట్ 9) సందర్భంగా రిలీజ్ చేస్తే మళ్లీ రికార్డ్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో సింగిల్ షో రిలీజ్ చేస్తే.. టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. థియేటర్లు కూడా పెంచాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఈ చిత్రం రికార్డ్ సాధించింది. 4కె (ఆల్రెడీ ఉన్న పిక్సెల్స్ దాదాపు నాలుగు రెట్లు పెరుగుతాయి. వీడియో మరింత స్పష్టంగా కనబడుతుంది.. 4కె వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి) హంగులతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనే పరిస్థితుల్లో ఈ సినిమాకి వచ్చిన ఆదరణ ఇండస్ట్రీకి బూస్ట్ అయింది. దాంతో పాటు ఇటీవల విడుదలైన స్ట్రయిట్ చిత్రాలు ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం’కి లభించిన ఆదరణ ఇండస్ట్రీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో పలు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్కి రెడీ అవుతుండగా.. ‘పోకిరి’లా కొత్త హంగులతో మళ్లీ రిలీజ్ కాబోయే చిత్రాలు కొన్ని రెడీ అవుతున్నాయని తెలిసింది. వాటిలో ముందు వరుసలో ‘ఘరానా మొగుడు’ ఉంది. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఘరానా మొగుడు’ (1992) సూపర్ డూపర్ హిట్. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని కొత్త హంగులతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ‘బంగారు కోడి పెట్ట..’ అంటూ చిరు వేసిన మాస్ స్టెప్పులు మళ్లీ చూసే చాన్స్ వస్తే... అభిమానులకు ఆనందమే కదా. ఈ నెలలోనే నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్ 29) కూడా. నాగార్జున నటించిన చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అయిన ‘శివ’ (1989)ను కూడా 4కె వెర్షన్కి మార్చి మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. సిల్వర్ స్క్రీన్పై మళ్లీ సైకిల్ చైన్ సందడిని చూడొచ్చన్న మాట. ఇవే కాదు.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ కూడా రీ రిలీజ్ కానుందట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’ (2008). సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డేకి ఈ చిత్రం రిలీజ్ కానుందని టాక్. ఇంకా ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉంది. రంగుల బజార్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘మాయాబజార్’ (1957) ఎవర్ గ్రీన్. ఒకరితో మరొకరు పోటీపడ్డారా అన్నట్లు ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు తదితర తారల అద్భుత నటనతో కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. భావితరాలకు ఈ చిత్రాన్ని చూపించాలనే ఆకాంక్షతో రంగులద్ది ఈ దృశ్యకావ్యాన్ని గోల్డ్స్టోన్ సంస్థ 2010లో విడుదల చేసింది. సో.. రీ రిలీజ్ అనేది పన్నెండేళ్ల క్రితమే ఉంది. రిలీజ్కి రెడీ అవుతున్న ఏయన్నార్ ‘ప్రతిబింబాలు’ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 1982లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏయన్నార్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు’ వంటి సినిమాలను నిర్మించాను. అయితే ఏయన్నార్గారితో నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమాని కొన్ని దుష్పరిణామాల వల్ల విడుదల చేయలేకపోయాను. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మిళితం చేసి, సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నాను. నా సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కేన్సర్తో బెడ్ మీద నుంచే ఏఎన్నార్ డబ్బింగ్.. అక్కినేని అమల ఎమోషనల్
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: ‘మా మామ గారు అక్కినేని నాగేశ్వర్రావు చివరి వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. కేన్సర్తో బాధపడుతూనే ‘మనం’ సినిమాకు పనిచేశారు. చివరి దశలో హాస్పిటల్ బెడ్పైనుంచే ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో తాను ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపానని, మీరు విచారించాల్సిన అవసరం లేదని ఆయన మా అందరికీ చెప్పేవారు’ అని మామయ్య అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ అక్కినేని అమల ఎమోషనల్ అయ్యారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ కేన్సర్ అవగాహన పరుగు పోస్టర్ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించకపోవడం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్ విజృంభణకు కారణాలన్నారు. కలుపు మందులు, పురుగుమందులు చాలా వరకు కేన్సర్కు కారణమవుతాయని తెలిసినా వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కేన్సర్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రేస్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, గ్లోబల్ రేస్ డెరైక్టర్ నిరంజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దేనికీ పనికిరానన్నారు, ఆ ప్రమాదంలో తీవ్రగాయాలు: నటుడు
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు. చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు. -
Telugu Movie: 50 ఏళ్ల ‘ప్రేమనగర్’
కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్ రూపం – ‘ప్రేమనగర్’. ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. ఒకరు కొంటే, వేరొకరు తీశారు! ‘ప్రేమనగర్’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్కు చెందిన శ్రీధర్రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె.ఆర్. విజయ హీరోయిన్. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్రెడ్డికి సెంటిమెంట్ పట్టుకుంది. ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని, హిట్ హీరోయిన్ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్’ ప్రారంభించారు. ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్ స్క్రిప్ట్ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్ ఇల్లు, ప్రేమనగర ఫుల్ఫ్లోర్ సెట్ సంచలనం. అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్మార్క్ ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’, ఆ వెంటనే ‘ప్రేమనగర్’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్మార్క్. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. రిపీట్ రన్ల... బాక్సాఫీస్ నగర్! ‘ప్రేమనగర్’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్’ బంపర్ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్ రన్ల పరంగా నంబర్ 1 చిత్రమైంది. హార్ట్ ఆపరేషన్ తర్వాత అక్కినేని రెస్ట్ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్’ రిపీట్లో 50 రోజులు ఆడడం విశేషం. మూడు భాషలు... ముగ్గురు స్టార్లు... ‘ప్రేమనగర్’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్నగర్’లో రాజేశ్ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్ను మరో మెట్టెక్కించింది. అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా 3 భాషల్లో హిట్. ఆ తరువాత ‘ప్రేమనగర్’ మూడు భాషల్లో హిట్. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్ కుమార్. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్ 40 వారాలాడిన కెరీర్ బెస్ట్ హిట్. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్లో 2013 మార్చి 8న రీరిలీజ్ చేస్తే, అప్పుడూ హిట్టే. మారిన పాటలు! మారని క్లైమాక్స్! ‘ప్రేమనగర్’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు. లవ్స్టోరీలకు ఇది సెంటిమెంట్ డేట్! ‘ప్రేమనగర్’ బాక్సాఫీస్ హిట్తో ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్ 24నే రామానాయుడు రిలీజ్ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్ ‘లవ్స్టోరీ’ ఇదే డేట్కి రిలీజ్ చేయడం విశేషం. – రెంటాల జయదేవ -
నాన్న ఫేవరెట్ పంచె, వాచ్ : నాగ్ భావోద్వేగ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. యావత్ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. 75 వసంతాలకు పైగా వెండి తెరను సుపంపన్నం చేసిన ఎఎన్ఆర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్కమింగ్ మూవీ బంగార్రాజు లుక్ను జోడించారు. కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది Remembering dear Nana! My hero!! My inspiration!! #ANRLivesOn pic.twitter.com/CgHKCLwObY — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2021 -
సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా!
సినిమాల్లో బాల నటులుగా నటించిన వారు కొంతమంది పెద్దాయ్యాక ఇతర రంగాల్లో రాణిస్తుండగా.. మరికొందరూ సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పటి మన స్టార్స్ ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా నటించిన వారే. ఊయలలో ఉన్నప్పుడే వారు వెండితెర ఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, మనోజ్లు కూడా బాల నటులుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటించిన మన స్టార్ హీరోలు చైల్డ్ అర్టిస్టులుగా నటించిన విషయం తెలుసా?.. వారుల ఎలా ఉంటారో చూశారా?. (చదవండి: మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్) కాగా అప్పటి లెజెండరీ నటుడి తనయుడు చైల్డ్ అర్టిస్టుగా నటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది బుర్రకు పని చెబుతున్నారు. మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి స్టార్ ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ బుడ్డోడు ఓ లెజెండరి నటుడు తనయుడు.. తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు.. అంతేకాదు ఆయన తనయులు కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడైన సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా... లేదా.. అయితే ఎవరో తెలుసుకుందా రండి!. (చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..!) అయితే అప్పట్లో టాలీవుడ్ను ఏలిన కథానాయకులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ అర్టిస్టులుగా హరికృష్ణ, బాలకృష్ణలు నటిస్తుండగా, నాగేశ్వరావు సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్ చైల్డ్ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు. అనంతరం ‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. అప్పటి నటశిరోమణి చేతిలో తెరపై ఆడుకున్న ఈ బుడ్డోడే ఇప్పటి మన ‘కింగ్’ నాగార్జున. (చదవండి: Meera Jasmine Now: మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?) -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్కేస్లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్స్టాప్లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్
తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాల నటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున అక్కినేని. అలా ఇప్పడు టాలీవుడ్లో స్టార్ హీరో ఎదిగారు ఆయన. అలాగే నిర్మాతగాను ఆయన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. నాగార్జున బాల నటుడిగా పరిచయం అవుతూ తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మొదటిసారిగా ‘సుడిగుండాలు’ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తాజాగా ఆర్జీవీ తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘సుడిగుండాలు సన్నివేశం.. చంద్రశేఖరం ఆయన కుమారుడిని స్కూలుకి కారులో తీసుకేళ్లారు’ అంటూ ఆర్జీవీ ఈ వీడియోను పంచుకున్నాడు. కాగా నాగార్జున ‘వెలుగు నీడలు’ అనే చిత్రంలో కూడా బాల నటుడిగా నటించారు. ఈ ఇందులో కూడా అక్కినేనికి కొడుకుగా కనిపించారు. అయితే నాగార్జున-అక్కినేని కాంబినేషన్లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘రావుగారిల్లు’, ‘ఇద్దరు ఇద్దరే’, ‘శ్రీరామదాసు’, ‘మనం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. That’s @iamnagarjuna 😎 pic.twitter.com/Lv2WHnJawq — Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2021 చదవండి: సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్! -
చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం
కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్ పాయింట్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్ అందుకున్నారు. కలర్ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఈ పాయింట్తో వచ్చిన సక్సెస్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందాల తారలతో... ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్ అక్కినేనికి కెరీర్ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్నూ, ఇమేజ్నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్ రోల్ చేశారు. ఆకట్టుకొనే కథ... కథనం... ‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్ మూవీస్ పతాకంపై టి. గోవిందరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్ సెంటిమెంట్కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది. అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు. తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా. ఆరుద్ర కలం... పాటల బలం... ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్ పాపులర్. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్ ఆల్బమ్గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్ గ్రీన్ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు. ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్! సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి. అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్ హిట్స్ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు. ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్ హిట్స్ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు. విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట! ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం. మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి. కలర్ అక్కినేని వర్సెస్ బ్లాక్ అండ్ వైట్ అక్కినేని! ఓ మాస్ హిట్ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్ఫుల్ మాస్ హిట్ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది. అక్కినేని కథతో... రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు. ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి. కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అక్కినేని సినీ కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!! సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు. – రెంటాల జయదేవ -
ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం
ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం! అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్ బ్యానర్పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్లో పుట్టిన కథ! సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్ డాల్ లేక్లో షూటింగ్ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్ ఓకే. సొంత స్టూడియో బ్యానర్ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది. ఆగిన షూటింగ్! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!! మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు. ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ! గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్ హిట్స్ ‘దేవదాసు’, ‘ప్రేమ్నగర్’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం. ఆ పాటలకు వందనం... అభివందనం! చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్టైమ్ హిట్. ఎస్పీబీకి సింగర్గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు. మరపురాని డైలాగ్ డ్రామా! నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది! మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే! ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్! అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్ జయసుధ’ల కాంబినేషన్ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్లో, ట్రేడ్లో ఆ పదం పాపులరైంది. బాక్సాఫీస్ చరిత్రలో... సువర్ణాధ్యాయం ‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) ఆడింది. తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ (60 వీక్స్) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్లలో షిఫ్టులు, నూన్షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్లో ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది. అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’ నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్ – కె. బాలచందర్ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్ థియేటర్లో నూన్షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు. ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్ వర్గాల టాక్. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది. రన్లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్! ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్ రన్లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్ రిలీజులోనే బెంగుళూరులో నూన్ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది. ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది. ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్కు కిరీటమైందీ చిత్రం. ఫస్ట్ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్ 20న అక్కినేని బర్త్డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్ రిలీజ్ చేశారు. అయితే, రిపీట్ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్నగర్’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం. వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్! నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది. అక్కినేని, జయసుధ చిత్రం... భళారే విచిత్రం! గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్ డేస్లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది. ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’! గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్’ (1982)గా కమలహాసన్తో రీమేక్ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్ కూడా చేసి, రిలీజ్ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు. కోటి అంటే... కోటిన్నర! ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్లో రెండో గోల్డెన్ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది. - రెంటాల జయదేవ -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - అక్కినేని నాగేశ్వరరావు
-
ఆంధ్ర ప్యారిస్తో అక్కినేనికి అనుబంధం
‘బాలరాజు’గా ‘కీలుగుర్రం’ ఎక్కి.. ‘లైలాను–మజ్నూలా ప్రేమలో ముంచి.. పారూ కోసం ‘దేవదాసు’లా మారి.. ‘అనార్కలి’ కోసం సలీంలో పరకాయ ప్రవేశం చేసి.. ‘మూగ మనసు’తో ముద్ద బంతి పువ్వును మురిపించి.. ‘నవరాత్రి’లో నవరస నటన ప్రదర్శించి.. ‘దసరా బుల్లోడు’గా దుమ్ములేపి.. ‘ప్రేమనగర్’కు ‘మేఘసందేశం’ పంపించి.. అభిమానులకు ‘ప్రేమాభిషేకం’ చేసి.. ‘మనం’ అంతా ఒక్కటే నంటూ మూడు తరాలతో ముచ్చట చేసి దివికేగిన నటసామ్రాట్ అక్కినేని. ఈ అక్కినేనికి అదృష్ట దేవత ఎదురొచ్చి ఆహ్వానించి అద్భుతమైన నటుడిగా నిరూపించుకునే అవకాశం కల్పించింది మన తెనాలి. రేపు అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తెనాలి : అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవపురంలో ఓ రైతు కుటుంబంలో 1924 సెప్టెంబరు 20న జన్మించారు. నాగేశ్వరరావుకు మూడున్నరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. పొరుగు ఊరిలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించినా చదువుపై ధ్యాస ఉండేది కాదు. గ్రామాల్లో జరిగే కోలాటాలు, భజన్లు, ఊరేగింపుల్లో పాటలు పాడేవారితో తిరుగుతూ.. అనుకరించేవాడు. ఈ క్రమంలో పాటలు, పద్యాలు వంటపట్టాయి. తొలిసారి ఆరో తరగతిలో స్కూల్ పిల్లలతో కలిసి ‘హరిశ్చంద్ర’ నాటకంలో నారద పాత్ర వేశాడు. – పాఠశాల వార్షికోత్సవంలో చంద్రమతిగా స్త్రీ పాత్రలో నటించాడు. ఇంటి నుంచి ప్రోత్సాహం ఉండటంతో నాటక సమాజాల్లో వేషాలు వేశాడు. అలా స్త్రీ పాత్రల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఓ సారి సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు కొనసాగించారు. చిన్న వేషంతో సరిపెట్టి.. నాగేశ్వరరావుకు ధర్మపత్ని సినిమాలో అవకాశం వచ్చినా అందులో పిల్లలంతా కలిసి పాడుకునే పాట సన్నివేశంలోనే వేషం ఇచ్చారు. ఆ తర్వాత ముదినేపల్లిలోని ఎక్సెల్షియర్ క్లబ్ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు ఒక నాటక ప్రదర్శనలో అక్కినేనిని చూసి తన నాటక సమాజానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత క్లబ్లో శాశ్వత ప్రాతిపదికన ‘నాయిక’ పాత్రలకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా మలుపు తిరిగింది.. క్లబ్ ప్రదర్శించిన తెలుగు తల్లి, సత్యాన్వేషణ, ఆశాజ్యోతి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలోనే ఇతర జిల్లాల నుంచి నాటక ప్రదర్శనలకు క్లబ్కు ఆహ్వానాలు ఎక్కువయ్యాయి. అలా తెనాలి నుంచి ఆహ్వానం రావడంతో తెనాలిలో నాగేశ్వరరావు ఆశాజ్యోతి నాటకంలో స్నేహలత పాత్ర పోషణతో స్థానిక ప్రేక్షకులను మెప్పించారు. తిరుగు ప్రయాణంలోనే అక్కినేనిని అదృష్టం ఎదురొచ్చి స్వాగతించింది. అక్కడి నుంచే ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. తెనాలితో ప్రత్యేక అనుబంధం.. నాటకాల్లో సహనటి అంజలి దంపతులు 1957లో తీసిన సువర్ణసుందరి సినిమా శత దినోత్సవానికి నాగేశ్వరరావు స్థానిక స్వరాజ్ టాకీస్కు వచ్చారు. తర్వాత అక్కినేని సినీజీవిత వజ్రోత్సవ వేడుకలను తెనాలిలో వైభవంగా నిర్వహించగా, అక్కినేనిని భారీ ఊరేగింపుతో తీసుకొచ్చి సత్కరించారు. దేవదాసు సినిమా 1980ల్లో విడుదలైనప్పుడు తెనాలిలో 300 రోజులు ఆడటాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. రైల్వేస్టేషన్లో బుల్లోడు.. తెనాలిలో ఓ ప్రదర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వేస్టేషన్కు నాగేశ్వరరావు నాటక బృందం చేరుకుంది. తోటి సభ్యులతో కలిసి రైలు ఎక్కుతున్న నాగేశ్వరరావును అదే రైల్లోని ఫస్ట్క్లాస్ ఏసీలో ఉన్న ప్రతిభా సంస్థ ఘంటసాల బలరామయ్య గమనించారు. దగ్గరకు పిలిచి పేరు, ఊరు వివరాలు తెలుసుకుని ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. సీతారామ జననం సినిమాలో శ్రీరాముడు పాత్రధారి కోసం అన్వేషిస్తున్న నిర్మాత బలరామయ్య దృష్టిలో పడిన నాగేశ్వరరావు, ఆయన ఆహ్వానంతో దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి 1944 మే 8న చెన్నైలో అడుగుపెట్టారు. చెప్పినట్టే బలరామయ్య అవకాశమిచ్చి ఆశీర్వదించారు. అప్పటి నుంచి నటనలో వెనుదిరిగి చూడలేదు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. చివరగా ‘మనం’ సినిమాలో కొడుకు, మనుమడితో కలిసి నటించి అక్కినేని మూడు తరాల నటనను వెండి తెరపై పూయించారు. -
చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్!
‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. నేటికీ తన మ్యాజిక్తో అభిమానులను మాయ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను ప్రేమించిన ఈ ఆపిల్ బ్యూటీ... తొలి సినిమా జ్ఞాపకాలను వివాహ బంధంతో ముడివేసుకుని.. శాశ్వతంగా గుండెగూటిలో పదిలపరచుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరికీ కెరీర్ పరంగా బిగ్బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా... అక్కినేని ఇంటి కోడలికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదేళ్ల సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాల గురించి సమంత తన అభిమానులతో పంచుకున్నారు. లెజండరీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు తన గురించి గతంలో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరి నటనకు వంద మార్కులు వేయాలంటే... చైతన్యకు 49, సమంతకు 51 మార్కులు వేస్తాను’’ అంటూ నాగేశ్వరరావు పేర్కొన్న వీడియోను ఆమె షేర్ చేశారు. కాగా ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య సినిమాల్లో నాగ చైతన్యతో కలిసి నటించిన సమంత.. మనం సినిమాలో చైతూ, నాగార్జున, నాగేశ్వరరావు, అఖిల్తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైతూను పెళ్లాడిన సమంత.. అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను కొనసాగిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక రీల్లైఫ్ భార్యాభర్తలుగా నటించిన సామ్- చైతూ రియల్ లైఫ్లో భార్యాభర్తలుగా మారిన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం మజిలీ ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత నటించిన తాజా చిత్రం జాను కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ❤️🙏 my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC — Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020 -
అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన
డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం డాలస్లో జరిగింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997లోను, 2012లోను టెక్సాస్కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా.తోటకూర ప్రసాద్ నాయకత్వంలో 2014లో ఈ ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని అన్నారు. 2019 సంవత్సరానికి గానూ డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శారద ఆకునూరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి.ఆర్ రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. అక్కినేని అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని మిత్రులం కొంతమంది ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా.అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014లో గుడివాడ, 2015లో హైదరాబాద్, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయని తెలిపారు. 2019 అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు “జీవిత సాఫల్య పురస్కారం”– శ్రీమాగంటి మురళీమోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు "విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్ "సినీ రత్న"– “మహానటి” చిత్రబృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం "వ్యాపార రత్న"- డా. సూరపనేని విజయకుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు "రంగస్థలరత్న"– పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు "వైద్య రత్న"- డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి "సేవా రత్న" – “మన కోసం మనం ట్రస్ట్”– చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి "వినూత్న రత్న"– శ్రీసత్తిరాజు శంకరనారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ "యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతికుమార్, సాహసవీరుడు కాగా, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థకు డాక్టర్.ప్రసాద్ తోటకూర(వ్యవస్థాపక అధ్యక్షులు), శారద ఆకునూరి(అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట(ఉపాధ్యక్షులు), డాక్టర్.సి.ఆర్.రావు( కార్యదర్శి), రవి కొండబోలు(కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించండి. -
సత్యం పలికిన పాపం!
బీయస్ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, బి.సరోజాదేవి... నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఆ విగ్రహాన్ని చూసి రాజావారికి మతిపోయినంత పనైంది. ఏమి అందం! ఏమి అందం!! ‘‘మోహిని కాదురా. వెన్నెల వెలుగులో వెలిగిపోతున్న శిలాప్రతిమ. ఆ మోహిని మోహనమూర్తిని తిరస్కరించే అందాలబొమ్మ. ఏ సిద్ధహస్తుడు చెక్కాడో ఈ చిన్నారిని’’ సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు రాజు. ‘‘నేనే ప్రభూ’’ అంటూ ఒక నిరాడంబరుడు అక్కడికి వచ్చాడు. ‘‘నీవా!’’ అంటూ ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘సృష్టికర్తను మరిపించే శిల్పాన్ని ప్రదర్శించావు!’’ అని ప్రశంసించాడు. ‘‘అది మానవులకు సాధ్యం కాదు ప్రభూ. ప్రకృతిని చూసే కళాకారుడు ప్రతిరూపాన్ని సృష్టిస్తాడు. ఇది జీవం ఉన్న సింగారి శిల్పం’’ అన్నాడు శిల్పి. ‘‘ఇంతటి సౌందర్యరాశి ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు. ‘‘ఇక్కడే ఉంది’’ అని జవాబు చెప్పాడు శిల్పి. ‘‘ఇంతటి అందాలబొమ్మ మా అంతఃపురంలో అలంకారం ఉండాల్సిందే. ఈ ప్రతిమను అంతఃపురానికి తరలించండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘వద్దు ప్రభూ... ఇది నా జీవనాధారం... నా కలలసాధనం’’ అని అడ్డుపడ్డాడు శిల్పి. ‘‘శిల్పి! నీ శ్రమకు ప్రతిఫలంగా కోరినంత బంగారం ఇస్తాను. పుచ్చుకో’’ అని ఆశపెట్టాడు రాజు. ‘‘ప్రభూ! అదేనాటికీ జరగదు. నా ప్రాణమైనా వదులుకుంటానుగానీ దీన్ని మాత్రం వదలను’’ అని ఆ సుందర విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాడు శిల్పి. రాజుగారి అహం దెబ్బతిన్నది. ‘‘ ఈ రాజ్యం నాది... ఈ రాజ్యంలో సర్వస్వం మాదే. మా ఆనందాన్ని, మా వాంఛను ఎవరూ తొలగించలేరు’’ అన్నాడు రాజు. విగ్రహాన్ని తరలించే క్రమంలో పెనుగులాట జరిగింది. విగ్రహం కింద పడి విరిగిపోయింది. ఇది చూసి శిల్పి గుండె పగిలిపోయింది. ‘‘విరిగిపోయిన బొమ్మను నీవే ఉంచుకో. సజీవ ప్రతిమనే మేము దక్కించుకుంటాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు రాజు. ‘‘రాజం...’’ అని పెద్దగా కేకలు వేస్తూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు రాజు. ‘‘ప్రభూ! తమ రాకతో మా గృహం పావనం అయింది’’ అని ఆనందపడిపోయింది రాజం. ‘‘నీ కూతురెక్కడ?’’ అడిగాడు రాజు. ‘‘అమ్మాయి మంజరీ...’’ అని పిలిచింది రాజం. మంజరి వచ్చింది. ఆమె అందాన్ని చూసి పరవశుడైపోయాడు రాజు. ‘‘ఆహా! మంజరి నిజంగా రంభే. కరిగిన బంగారంలో చంద్రుడిని సానబెట్టి పొడి చేసి మెదిపి ఆ ముద్దతో బ్రహ్మ ఈ మూర్తిని సృష్టించాడు’’ అని పొగడ్తల వర్షం కురిపిస్తూనే... ‘‘ఇంతటి సౌందర్యరాశిని ఇంట్లో దాచి మమ్మల్ని మోసం చేశావా?’’ అని పిడుగులా గర్జించాడు రాజు. ‘‘లేదు ప్రభూ! ముందు నాట్యరాణిని చేసి తమ ముందు...’’ అని గొణికింది రాజం. ‘‘నాట్యరాణి ఎన్నడో అయిపోయింది. మా సంస్థానంలో రాజనర్తకిగా నియమిస్తున్నాను. మంచిరోజు చూసి అంతఃపురంలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాను. ఈ నవరత్నముద్రిక నాట్యరాణికి మా ప్రేమచిహ్నం’’ రాజంకు రాజముద్రిక ఇచ్చి ఆ ఇంటి నుంచి వెళ్లాడు రాజు. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘‘ఈనాటికి మన బాగ్యరేఖ పండి నువ్వు రాజనర్తకి అవుతున్నావు. ఈ సీమలో ఈ గౌరవం మనకే దక్కింది’’ అన్నది కూతురితో. ‘‘ఆ గౌరవం నాకు అక్కర్లేదు. ఆ అంతఃపురంలో నేను నాట్యం చేయను’’ అన్నది గట్టిగా మంజరి. ‘‘ఈ మహాయోగం నీకు పట్టాలని అహోరాత్రాలు కలలు కన్నాను. వెదుక్కుంటూ సిరివస్తే నిరాకరిస్తావా! వీల్లేదు... ఏమైనా సరే నువ్వు నాట్యం చేసి తీరాల్సిందే’’ అంటూ కూతురు మీద గట్టిగా కేకలు వేసింది రాజం. ప్రజలు శిల్పిని చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఇంతలో ‘‘ఆగండి’’ అనే మాట వినిపించింది. ‘‘రామానుజాచార్యులు వస్తున్నారు’’ అంటూ ప్రజలు పక్కకు తప్పుకున్నారు. ‘‘ ఇతడిని విముక్తి చేయండి’’ అని ప్రజలను ఆదేశించి ‘‘నీవు ఎవరు నాయనా? ఎందుకీ దండన?’’ అని శిల్పిని అడిగాడు. ‘‘సత్యం పలికిన పాపం’’ అన్నాడు శిల్పి. ‘‘నీ ప్రయాణం ఎక్కడికి నాయనా?’’ అడిగారు రామానుజాచార్యులు. ‘‘ఏమో స్వామి! దిక్కులేని వాడిని ఎక్కడికని చెప్పను!’’ అన్నాడు దిక్కులు చూస్తూ ఆ శిల్పి. ‘‘సరే, మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు శాంతి లభిస్తుంది నాయనా’’ అని దిక్కులేని అతనికి ఒక దిక్కు చూపారు రామానుజాచార్యులు. ‘‘తమ ఆజ్ఞ’’ అన్నాడు కృతజ్ఞతాభావంతో శిల్పి. ‘‘నీ స్థితి నాకు అర్థమైంది నాయనా. అనిత్యమైన సౌందర్యాన్ని ప్రేమించి సాధ్యం చేసుకోలేదని బాధపడుతున్నావు’’ అన్నారు రామానుజాచార్యులు. ‘‘లేదు స్వామి, నన్ను ఈ లోకం వంచించింది. నా సుందరస్వప్నాలను తుడిచి వేసింది. నాకు ఈ లోకంలో భీకర శాకినీ ఢాకినీ పిశాచాలే కనిపిస్తున్నాయి. వంచన వికటాట్టహాసం చేస్తూ నన్ను బెదిరిస్తోంది’’ అని బాధపడుతూ ‘‘స్వామీ, నాకు ఈ లోకంలో శాంతి లేదా?’’ అని అడిగాడు శిల్పి. ‘‘ఉంది నాయనా.. పువ్వు పుష్పించి నేల రాలినట్టే... కనిపించే అందం అంతా అంతరించిపోతుంది. చరాచర జీవజాలంలో కనిపించే సౌందర్యమంతా ఆ భగవంతుడి లీలావిలాసం. నీ సౌందర్యదృష్టిని నిత్యమైన ఆ అందం వైపు మరల్చు. అర్థం చేసుకో. దానిని కళా రూపంలో సృష్టించి తరతరాల మానవులు దర్శించి ఆనందించి తరించేట్టు చెయ్యి’’ అని ఉపదేశించారు రామానుజాచార్యులు. ‘‘ధన్యోస్మి గురుదేవా! పరమార్థం బోధపరిచి దివ్యజ్యోతిని చూపించావు. శిష్యుడనై నీ సన్నిధిలోనే ఉండి ఆ సాధన చేస్తాను. కాని ఒక ప్రార్థన...’’ అన్నాడు శిల్పి. ‘‘ఏమిటది?’’ అడిగారు రామానుజాచార్యులు. ‘‘నా పూర్వచరిత్ర ఈ క్షణంతో మరుగునపడిపోవాలి’’ అన్నాడు శిల్పి ‘‘అలాగే నాయనా... సుందరనారాయణ విగ్రహాన్ని లోకోత్తరంగా సృష్టించి నీ కళాప్రతిభను సార్థకం చేసుకో’’ అని ఆశీర్వదించారు రామానుజాచార్యులు. సమాధానం: అమరశిల్పి జక్కన -
‘మామయ్యకు మహా ఇష్టం’
పంజగుట్ట: నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని, పలు సినిమాలను తెలుగులో రీమేక్ చేశారని ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. బెంగాళీస్ ఇన్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ ‘హైదరాబాద్ బెంగాళీ ఫిల్మ్ ఫెస్టివల్’ వివరాలను ఎర్రమంజిల్లోని హోటల్ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. కార్యక్రమానికి హాజరైన అమల మాట్లాడుతూ.. మా మామయ్యకు బెంగాళ్ సినిమాలంటే ఎంతో మక్కువ అన్నారు. ఈ ఫెస్టివల్కు 50 మంది ప్రముఖులు బెంగాళ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకావడం సంతోషకరమన్నారు. ఫెస్టివల్ డైరెక్టర్ పార్థ పాతమ్ మలిక్ మాట్లాడుతూ.. ఫెస్టివల్ను ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని శివ థియేటర్లో ప్రారంభిస్తున్నప్పటికీ అధికారికంగా 19వ తేదీన బంజారాహిల్స్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత బుద్దదేబ్ దాస్గుప్త ప్రారంభిస్తారని తెలిపారు. బెంగాళి సినిమా ఈ యేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిగ్గజాల సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. బెంగాలి ఇన్ హైదరాబాద్ అధ్యక్షురాలు మోసొమి శర్మ, జాయింట్ కన్వీనర్ మాలిక్ బసు పాల్గొన్నారు. -
‘యన్.టి.ఆర్’లో ఏఎన్నార్
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సినీ ప్రముఖులు సోషల్ ఈ మీడియా ద్వారా ఏఎన్నార్ను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రయూనిట్ ఏఎన్నార్కు నివాళులర్పిస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ బయోపిక్లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్ లుక్ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. -
మనం చూడనిది!
‘‘నా వయసు 32’’ అంటున్నారు నాగార్జున. హ్యాండ్సమ్గా ఫిట్గా ఉండే నాగార్జున ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అయినా థర్టీ ప్లస్ అంటే నమ్మేట్టే ఉంటుంది. ఇంతకీ పని గట్టుకుని ‘32 ఇయర్స్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే.. ‘నా వయసు ముప్పై రెండే, కానీ... నటుడిగా’ అన్నారు నాగ్. మే 23తో నటుడిగా నాగార్జున వయసు 32. అదేనండీ ఇండస్త్రీకి వచ్చి 32ఏళ్లు అవుతోంది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ మే 23న రిలీజ్ అయింది. అదే రోజున అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ సినిమా ‘మనం’ కూడా విడుదలవ్వడం విశేషం. ఈ విషయం గురించి నాగార్జున స్పందిస్తూ – ‘‘కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతాయా? లేక యూనివర్శ్కి నంబర్ గేమ్స్ అంటే ఇష్టమా? అని ఆశ్చర్యపోతుంటాను. నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’, మా నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రెండూ మే 23నే రిలీజ్ అయ్యాయి. మేం ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ డేట్ 23ని రివర్స్ చేస్తే 32. అది నా ఏజ్. యాక్టర్గా నా వయసు 32. ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘మనం’ సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ – ‘‘మనం’ రిలీజ్ అయి 4 సంవత్సరాలు అవుతోంది. మమ్మల్నందర్నీ నవ్వించారు, ఏడిపించారు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇలా ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నాన్నా. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ చిరునవ్వు తెచ్చుకుంటాం. ఏయన్ఆర్ ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు నాగార్జున. అన్నట్లు ‘మనం’లో ఏయన్నార్ కింద, నాగచైతన్య కుర్చీలో కూర్చుని, నాగార్జున నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కనిపించని రేర్ ఫొటో ఒకటుంది. పైన ఉన్నది అప్పుడు మనం చూడని ఫొటోనే. ‘మనం’ విడుదలై నాలుగేళ్లైన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసిన ఫొటో ఇది. -
‘ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్గా తెరకెక్కిన మనం సినిమా రిలీజ్ అయి నేటికి నాలుగేళ్లు. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన ఈ సినిమా, దివంగత నటుడు నాగేశ్వరర్రావు చివరి సినిమా కావటం విశేషం. ఆరోగ్యం సహకరించకపోయినా.. చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలన్న కోరికతో ఈ సినిమాను పూర్తి చేశారు ఏఎన్నార్. మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాగార్జున ట్వీట్ చేశారు. ‘మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటా.. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్ చేశారు నాగ్. It’s been 4 yrs since #Manam released. I hv been thinking of how you made us cry,laugh and finally inspire the family to face life and death!! we think of you all the time NANA and we smile🙏 #ANRliveson pic.twitter.com/XjCM1YrFne — Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 May 2018 -
తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా ఉంది : నాగ్
కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ఈ రోజు నేను తండ్రిగా గర్వపుడుతున్నా.. కొడుకుగా ఈర్ష్య పడుతున్నా.. నేను ఎప్పుడు నా తండ్రి లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నాగచైతన్య ఆ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది’ అంటూ మహానటి సినిమాలోని నాగచైతన్య లుక్ను రిలీజ్ చేశారు నాగార్జున. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగా యువ నటుడు నాగచైతన్య కనిపించారు. సినిమాలోని నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోకు యంగ్ హీరో నాని వాయిస్ ఓవర్ అందించారు. Am today a proud father and a jealous son. I never played my father legendary #ANR Garu. But, I am overwhelmed and very happy to present to you all, Chay as ANR in #Mahanati #ANRliveson 👉 https://t.co/v1FdzRajcp pic.twitter.com/yCWJYDLmb8 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 10 May 2018 -
పదం పలికింది – పాట నిలిచింది
ఒక పాత్ర మానసిక స్థితికీ, దాని మేధోస్థాయికీ తగిన పదాలతో రాసిన పాట విన్నప్పుడు ఒక రసస్పందన ఏదో కలుగుతుంది. అలాంటి అనుభూతే 1982లో వచ్చిన ‘మేఘసందేశం’ చిత్రంలోని ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ కలిగిస్తుంది. గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందులో మొదటి చరణంలో నాయకుడు– ‘వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని / కడిమి వోలె నిలిచానని’ అని పాడతాడు. రెండో చరణంలో– ‘రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై / ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని / శిథిల జీవినైనానని’ అని తన మనోవేదననూ, మరణ యాతననూ వెల్లడిస్తాడు. నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది రమేశ్ నాయుడు. పాడింది కె.జె.యేసుదాస్. ఈ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడం గమనించదగ్గది. ఇది అక్కినేని 200వ చిత్రం కావడం మరో విశేషం. -
ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం
నాటి సినిమా తుఫాన్లను కనిపెట్టడానికి వాతావరణ శాఖ ఉంది. అది తుఫాను వచ్చే ముందే ఆ సంగతి కనిపెట్టి హెచ్చరికలు చేస్తుంది. ప్రమాద సూచికను ఎగురవేయమంటుంది.జనం జాగ్రత్త పడతారు. కాని ఆడపిల్ల రేపే తుఫానును కనిపెట్టే శాఖ ఏదీ లేదు. హెచ్చరికలు చేసే విభాగం ఏదీ లేదు. జాగ్రత్తలు చెప్పే వ్యవస్థంటూ అసలు లేనే లేదు. అందుకే ఆ తుఫానులో చిక్కుకున్న మగాళ్లు చిక్కుల్లో పడి దోవ తప్పి అల్లకల్లోలం అవుతారు. తాత్కాలిక అంధులై తల్లడిల్లుతారు. తెరిపిన పడటానికి ఒక జీవితకాలం వెచ్చిస్తారు.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. ఆడపిల్ల చేసిన గాయాన్ని ఆడపిల్లే పూడ్చాలి. అలా పూడ్చగలిగే దేవత ఎదురు రావాలి. వస్తే ధన్యత. చేసిన పూజలన్నీ ఫలించినట్టే. ఈ సినిమాలో అక్కినేని జమీందారు మనవడు. పెద్ద మహలు, ఎస్టేటు, మేనేజరు, నౌకర్లు, తోటలు, పూలు, ఫలాలు, గుర్రాలు పూన్చిన వాహనాలు... అక్కినేని చాలా సిగ్గరి. సంస్కారవంతుడు. భావకుడు. పుస్తకాలు, సంగీతం, గానం... ఇవి అతనికి ఇష్టం. పుస్తకాల ర్యాక్లో భాగవతం, సంగీత రత్నాకరం ఉన్నవాడు ఈ కాలం కుర్రవాడు అవుతాడా? కాదు అని చెప్తుంది ఆ మహల్లో అద్దెకు దిగిన జమున. మహలు కింది భాగం బావురుమంటోందని కాలక్షేపానికి ఒక బ్యాంక్ ఏజెంట్కు అద్దెకు ఇస్తారు. ఆ ఏజెంట్ కుమార్తే జమున. ఆ అమ్మాయి అసలు అమ్మాయి కాదు. రాకెట్టు. మొహమాటం లేదు. అరమరికలు అసలే లేవు. అంతపెద్ద జమీందారుని కూడా చనువుగా పలకరిస్తుంది. తన బుజ్జికుక్క పిల్లతో అతడిని ఆటలాడమంటుంది. ర్యాక్లో ఉన్న గంభీర సాహిత్యాన్ని చూసి డిటెక్టివ్లు, వార పత్రికలు లేవా అని అడుగుతుంది. ఆ అమ్మాయి రాకతో అక్కినేని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అంతవరకు నిస్సారంగా గడుస్తున్న తన జీవితానికి ఒక ఉత్సాహం దొరికినట్టు భావిస్తాడు. తన వయసును తాను గుర్తుకు తెచ్చుకుని హుషారు తెచ్చుకుంటాడు. అవన్నీ పక్కనపెట్టండి– ఒకరోజు సాయంత్రం అతడు కాలేజీ నుంచి మహలుకు చేరుకోగానే పియానో ముందు కూర్చుని ఆమె పాడే పాట వింటాడు. ఎంత జీవనోత్సాహం ఉన్న పాట అది. పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే.... అంతే.. ఆ పాటకు ఆమెకు తన మనసు కానుకగా ఇస్తాడు. మరునాడు ఉద్యానవనానికి వెళ్లి సంతోషంగా పాడుకుంటాడు. ఏమని? నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదుర లేచెనెందుకో... కాని ఈ మెలుకువ మృతపాయం కానుంది. తనను కబళించనుంది. ఎందుకంటే జమున మనసులో అక్కినేని అంటే ప్రేమభావం లేదు. సోదరభావం ఉంది. ఎన్నడో చనిపోయిన తన సోదరుణ్ణి అక్కినేనిలో చూసుకుంటూ అతడికి సన్నిహితం అవుతుంది ఆమె. ఈ సంగతి ఏరోజు తెలుస్తుందో ఆ రోజే అక్కినేని సగం చచ్చిపోతాడు. ఆడపిల్ల మనసు ఎటువంటిదో కనిపెట్టడం ప్రాణాంతకమైన విషయంగా గ్రహిస్తాడు. ఈలోపు తండ్రి పని చేసే బ్యాంకు దివాలా తీసి జమున కుటుంబం హటాత్తుగా నిష్క్రమిస్తుంది. కంటి ముందు ఆమె కనిపించకపోయేసరికి అక్కినేని ఇంకా నిర్లిప్తతలో కూరుకుపోతాడు. అదంతా ఆ ఎస్టేట్ మేనేజర్ అయిన గుమ్మడి కూతురు సావిత్రి చూస్తుంది. అతడిని తిరిగి మామూలు మనిషి చేయాలని చూస్తుంది. అతడి పట్ల అనురాగం ప్రదర్శిస్తుంది. సపర్యలు చేస్తుంది. ఆ పాడైపోయిన వీణలో తాను నాదం నింపుతుంది. కాని అక్కినేనికి భయం. పాత గాయం అతణ్ణి దారుణంగా భయపెడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మనసులో ఏముందో... తాను ఈ అమ్మాయిని ఇష్టపడితే కనుక తాను ఏ దృష్టితో చూస్తూ ఉందో. ఒకసారి దెబ్బ తినింది చాలు.. మళ్లీ తినాలా అని సతమతమవుతాడు. కాని అతడి మనసు అప్పటికే ఆమెతో నిండిపోయింది. ఆ సంగతి చెప్పలేడు. ఆమె ఇష్టాన్ని గ్రహించలేడు. ఏం చేయాలో అర్థం కాక తనను తాను హింసించుకోవడానికి అన్నట్టు గానాబజానాల వాళ్ల వెంట తిరుగుతూ ఉంటాడు. మరోవైపు దూరపుబంధువులు ఎస్టేటు మీద దావా వేసి అస్తి పెండింగ్లో పడేట్టు చేసి అతణ్ణి రోడ్డు మీదకు తెస్తారు. భౌతికంగా మానసికంగా సంక్షోభంలో ఉన్నా సావిత్రి అతడి నీడ వదలదు. ఆరాధిస్తూనే ఉంటుంది. చివరకు అతడు ధైర్యం చేస్తాడు. ఆమెకు తన మనసులో మాట చెప్తాడు. ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరై అతడి పాదాల మీద పడుతుంది. కథ సుఖాంతమవుతుందనుకునేంతలో దాయాదులు వేసిన పన్నాగంలో యాక్సిడెంట్ అయ్యి అక్కినేనికి మతి పోతుంది. జగ్గయ్య వంటి మిత్రుడు వైద్యం చేస్తున్నా వేరే ఏదో ఓదార్పు అవసరమవుతుంది. అప్పుడు జమునను అక్కినేని ముందుకు తీసుకుని వస్తారు. అన్నేళ్ల క్రితం పాడిన పాటను తిరిగి ఆమె పాడుతుంది. పగలే వెన్నెలా.. జగమే ఊయలా... మరో వైపు సావిత్రి అతడికెంతో ఇష్టమైన వయొలిన్ని అతడి చేతుల్లో పెట్టి వాయించమంటుంది. అటు పాట.. ఇటు సంగీతం.. చెదిరిన అతడి స్థిరత్వాన్ని వెనక్కు తీసుకువస్తాయి. అతడు మామూలు మనిషి అవుతాడు. సావిత్రి అతణ్ణి తన మనిషిగా గెలుచుకుంటుంది. సావిత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలో ఉంటుంది. ఆ పూజ వృ«థాపోలేదని ఫలం దక్కిందని కథ. కాని ఆ పూజ కన్నా అక్కినేని పట్ల ఆమె ప్రదర్శించిన ఆరాధన ఎక్కువ. ఆ ఆరాధనే ఆమెకు అతణ్ణి తిరిగి అప్పజెప్పిందని అర్థం చేసుకోవాలి. 1964లో వచ్చిన ‘పూజాఫలం’ మ్యూజికల్. పాటల కంటే కూడా నేపధ్య సంగీతం ద్వారా ఒక బ్యాలే లాగా ఈ సినిమా కొనసాగుతుంది. సినిమా అంతా వయొలిన్, వీణ, ఏదో ఒక రాగం, గానం ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్ను బి.ఎన్.రెడ్డి కాకుండా ఇంకెవరు తీసినా ఇది ఒక్కరోజు కూడా ఆడి ఉండేది కాదు. బి.ఎన్. వల్లే ఇది క్లాసిక్ స్థాయిలో నిలబడింది. ముఖ్యంగా క్లయిమాక్స్లో అక్కినేని వయొలిన్ వాయించడం మొదలుపెట్టి తన మానసిక స్థితికి తగ్గట్టుగా కాసేపు శృతిలో మరికాసేపు అపశృతిలో వాయించే సన్నివేశం ఇంతకు మునుపు లేదు అటు తర్వాత కూడా లేదు. క్యారెక్టరైజేషన్, కథ నడక... వీటన్నింటిలో బిఎన్ మార్కు కనిపిస్తుంది. ఆయనకు నప్పని కామెడీ ట్రాకును పెట్టినా పొట్టి ప్రసాద్, రమణారెడ్డి, రేలంగి దానిని పండించే ప్రయత్నం చేస్తారు. సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావు ప్రావీణ్యం ఈ సినిమాలో అడుగడుగునా గమినంచవచ్చు. కథారచయిత మునిపల్లె రాజు రాసిన ‘పూజారి’ అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమా అసలు సిసలు అక్కినేని సినిమా అనిపిస్తుంది. ఆయన కాకపోతే ఎవరూ ఈ పాత్రను చేయలేరు. చేసినా ఎవరూ చూడలేరు. అబ్బాయి మనసులో అమ్మాయిని పెట్టుకుని ఆ సంగతి బయటపెట్టక నలుగుతూ ఉండటం ఈ సినిమాతోనే మొదట చూపారనిపిస్తుంది. ఈ సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత ఇటువంటి కథాంశం ఉన్న సినిమాలు అనేకం తెలుగులో, తమిళంలో వచ్చాయి. తెలుగులో డబ్ అయిన ‘హృదయం’, పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’ ఇవన్నీ చివరి వరకూ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి సతమతమయ్యేవే. పూజాఫలం నీట్ అండ్ క్లీన్ సినిమా. అబ్బాయిల సినిమా. అబ్బాయిల మనసును కొద్దో గొప్పో చెప్పిన సినిమా. ఫలించిన సినిమా. ప్రాక్టీసు పెడితే రెండు లక్షలు ఈ సినిమా 1964లో వచ్చిందని చెప్పుకున్నాం. దీనికి మాటలు రాసిన డి.వి.నరసరాజు ఆ నాటి కట్నం లెక్కలు ఒక డైలాగులో చెప్పించారు. ఎస్ఎస్ఎల్సీ పాసైతే పదివేలు. బి.ఏ. పాసైతే పాతిక వేలు. ఎంబిబిఎస్ చేరితే యాభై వేలు. పాసైతే లక్ష. ప్రాక్టీసు పెడితే రెండు లక్షల కట్నం ఆ రోజుల్లో మార్కెట్లో ఉందట. మరి ఈ రోజుల్లో ఎంబిబిఎస్ పాసై ప్రాక్టీసు పెట్టిన వాళ్లు ఎంత డిమాండ్ చేస్తున్నారో కాని మగపిల్లలను కట్నం కోసమే పెద్ద చదువులు చదివించే మనస్తత్వం మాత్రం ఇంకా పోలేదు... అనుకునే దాఖలాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. – కె -
కళాతపస్వికి అక్కినేని జీవిత సాఫల్యపురస్కారం
డాలస్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్ డాక్టర్.అక్కినేని నాగేశ్వర రావు 94వ జయంతి సందర్భంగా డాలస్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం అయ్యింది. అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ను 2014 లో స్థాపించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. తోటకూర ప్రసాద్ తెలిపారు. నాగేశ్వరరావు 'కృషి, పట్టుదల, ఆత్మస్తైర్యం, దూరదృష్టి' అనే విశిష్ట లక్షణాలు ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని జరుపుతున్నామన్నారు. 2014లో గుడివాడ, 2015 లో హైదరాబాద్, 2016లో చెన్నైలో జరిపామని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16 న ఏలూరులో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భoగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలను అందజేస్తున్నామని తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు. అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్కి “జీవిత సాఫల్య పురస్కారం” అందజేయనున్నట్టు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి 'విద్యా రత్న'; ప్రముఖ నటులు, సినీ, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకి 'సినీ రత్న'; అత్యధిక చలన చిత్రాల పంపిణీదారులు, నిబద్ధతతో వ్యాపారం చేస్తున్న ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్. వి.వి. బాల కృష్ణారావుకి 'విశిష్ట వ్యాపార రత్న'; కార్మిక స్థాయి నుండి ప్రజాకవిగా ఎదిగి ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకి 'రంగస్థల రత్న'; విదేశాలలో పని చేస్తూ ఎక్కువ డబ్బు గడించే అవకాశాలువచ్చినప్పటికీ వాటిన్నంటిని వదులుకొని మాతృదేశంలోనే ఉండి వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. గుడారు జగదీష్కి 'వైద్య రత్న'; ‘మానవ సేవే మాధవ సేవగా’ భావిస్తూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థులకు అవసరమైయ్యే శిక్షణను అందజేస్తూ వందలాది మంది యువత మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి సహాయం చేస్తున్న మానవతావాది, తన స్వగ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న మాయలూరి మనోహర్ రెడ్డికి 'సేవారత్న'; అంధత్వ లోపం ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా తనకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి , స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విశేష ప్రతిభ కనబరుస్తున్న షాకీర్ మహమ్మద్కి 'వినూత్న రత్న'; ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అన్నింటిని ఎదుర్కొని అంత్యంత చిన్నవయస్సులో, ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్గా (బోయింగ్ - 777) ఎంపికైన కెప్టెన్ అన్నే దివ్యకు 'యువ రత్న' పురస్కారాలను అందజేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర, అధ్యక్షులు డాక్టర్. సి.ఆర్. రావులు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు), డాక్టర్. సి.ఆర్. రావు (అధ్యక్షులు), రావు కల్వల (ఉపాధ్యక్షులు), శారద అకునూరి ( కార్యదర్శి), చలపతి రావు కొండ్రకుంట (కోశాధికారి), రవి కొండబోలు, ధామా భక్తవత్సలు , డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఏలూరులో 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి మోహన్ ముళ్లపూడి సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.orgను సందర్శించండి. -
ఇదో మనవరాలి కథ
నాటి సినిమా మాట తప్పని తండ్రి – ఆ తండ్రి పెంపకంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే వ్యక్తిగా పెరిగిన కొడుకు – తండ్రీకొడుకుల మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న మనవరాలు. ముగ్గురూ మంచితనానికి కేరాఫ్ అడ్రస్. సీతారామయ్యగారు గొప్పవారు. తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు ఇంకా గొప్ప. తండ్రీ–కొడుకు– మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్ జర్నీ ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ తాతా మనవరాలి కథ ఏంటంటే... గోదావరి తీరంలోని సీతారామపురం ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని నాగేశ్వరరావు). భార్య జానకి (రోహిణి హట్టంగడి), ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ఇది సీతారామయ్య కుటుంబం. కొడుకు శ్రీనివాస మూర్తి అలియాస్ వాసు (రాజా)కి తండ్రంటే ప్రాణం. కొడుకంటే తండ్రికి కూడా బోల్డంత ప్రేమ. ఫాదర్–సన్ అనడంకంటే ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అనడం కరెక్ట్గా ఉంటుంది. కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాడు సీతారామయ్య. ఆ విషయం చెప్పేలోపే వాసు తాను సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెబుతాడు. మునసబుని వియ్యంకుణ్ణి చేసుకుంటానని మాటిచ్చేసానంటాడు తండ్రి. సుమతికి మనసిచ్చానంటాడు కొడుకు. తండ్రి మాటకు ఊళ్లో ఎంత విలువ ఉందో చెప్పి, పెళ్లికి ఒప్పుకోమంటారు వాసు అక్కా బావ. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకుగా మాట తప్పలేనంటాడు వాసు. తప్పక పెళ్లికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. అవే చివరి మాటలు! పాతికేళ్లు ప్రతి మాటనూ పంచుకున్న కొడుకు మనసిచ్చిన అమ్మాయి గురించి ఒక్క మాట కూడా ముందు చెప్పకపోవడం తనను అవమానించినట్లుగా, అగౌరవించినట్లుగా భావిస్తాడు సీతారామయ్య. సుమతి, తానూ డాక్టర్స్ కాబట్టి, ఊళ్లో ఆస్పత్రి కట్టిస్తే, ఇక్కడే ఉంటామంటాడు వాసు. ఆస్పత్రి కావాలంటే ఆస్పత్రి, ఆస్తి కావాలంటే ఆస్తి.. ఏదైనా ఇచ్చేస్తా.. కానీ, ఎప్పటికీ నాతో మాట్లాడకూడదంటాడు. కొడుకుతో సీతారామయ్య మాట్లాడే చివరి మాటలవే. ఈ తండ్రీకొడుకుల మధ్య జానకమ్మ నలిగిపోతుంది. పుట్టిన తర్వాత కొడుకు చేసిన మొదటి తప్పుని క్షమించమని జానకమ్మ బతిమాలుతుంది. తాను కూడా మొదటిసారి మాట తప్పానంటాడు సీతారామయ్య. మరోవైపు కోడలు సుమతి అన్యోన్యంగా ఉన్న తండ్రీకొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడుతుంది. చేసేదేం లేక భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోతాడు వాసు. కాలం ఎవరికోసమూ ఆగదు. 20 ఏళ్లు గడిచిపోతాయ్. పైకి మామూలుగానే ఉన్నా సీతారామయ్య మనసులో కొడుకు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బాధను బయటపెట్టకుండా సీతారామయ్య, జానకమ్మ గంభీరంగా రోజులు గడుపుతుంటారు. కట్ చేస్తే... అమెరికా టు ఇండియాకి సీత సీతారామయ్య మనవరాలి (పెద్ద కుమార్తె కూతురు) వివాహం కుదురుతుంది. ఈ పెళ్లికి సీతారామయ్య మరో మనవరాలు (వాసు కూతురు) సీత (మీనా) అమెరికా నుంచి ఇండియా వస్తుంది. మనవరాలిని చూసి, మురిసిపోతుంది జానకమ్మ. సీతారామయ్య మనసు మురిసినా బయటపడడు. ‘నా పేరు సీత.. మీ పేరే’ అంటూ తాతయ్యతో మాటలు కలిపిన మనవరాలికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు సీతారామయ్య. పెరిగింది అమెరికాలో అయినా తెలుగింటి పిల్లలా మనవరాలు ఉండటం, సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం సీతారామయ్య మనసుని ఆకట్టుకుంటుంది. మనవరాలిలో కొడుకుని చూసుకుంటాడు. మాట పట్టింపుతో కొడుకు తన ఇంటికి రాలేదని ఓ మూల బాధపడతాడు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వాసు ఫ్రెండ్ (మురళీమోహన్) ఇండియా వచ్చి, సీతారామయ్యగారింటికి వెళతాడు. ‘మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు’ అని సీతారామయ్య దంపతులు అడగడంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని సీత దాచిన విషయం అతనికి అర్థమవుతుంది. చెప్పొద్దని మురళీమోహన్తో సీత విన్నవించుకుంటుంది. అతను వచ్చిన దారినే అమెరికా చెక్కేస్తాడు. మనవరాలిలోనే కొడుకు ‘నీలో నన్ను చూసుకునేవరకూ తాతయ్యకు నేను చనిపోయిన విషయం చెప్పకు’ అని తండ్రి చివరి క్షణాల్లో చెప్పిన మాటను నిలబెట్టడానికి సీత విశ్వప్రయత్నం చేస్తుంది. దుఃఖాన్నంతా లోపల మింగేసుకుని, బయటికి నవ్వుతుంటుంది. ఇప్పుడో చిక్కొచ్చి పడుతుంది. సీతారామయ్య–జానకమ్మల షష్టిపూర్తి వేడుక నిర్ణయం అవుతుంది. ఆ వేడుకకు కొడుకు వస్తాడని ఆశిస్తారు. వాసు రాడు? మరీ ఇంత పట్టింపా? అని సీతారామయ్య బాధపడిపోతాడు. ఎలాగైతేనేం వేడుక బాగానే జరుగుతుంది. ఆ తర్వాత జరగకూడనిదే జరుగుతుంది, జానకమ్మ హఠాన్మరణం ఇంటిల్లిపాదినీ కుంగదీస్తుంది. ఇప్పుడైనా కొడుకు వస్తాడని ఎదురు చూస్తాడు సీతారామయ్య. రాకపోవడంతో ఈసారి బాధ.. కోపంగా మారుతుంది. ‘నువ్విక్కడే ఉంటే నా కొడుకు లేని వెలితి బాగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లిపో’ అంటాడు మనవరాలితో. సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చివరకు తాతయ్య చెప్పినట్లే అమెరికా ప్రయాణమవుతుంది. కానీ, అప్పటివరకూ రాసుకున్న డైరీని మరచిపోయి, వెళ్లిపోతుంది. అది చదివి, కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్పోర్ట్కి వెళ్లి మనవరాలిని వెనక్కి తీసుకొస్తాడు. కొడుకు అస్తికలను గోదావరిలో కలుపుతాడు. ‘మా నాన్న మీకు గిఫ్ట్ పంపించాడు’ అంటూ ఇంటికొచ్చిన రోజున మనవరాలు ఇచ్చిన చేతి కర్రను నదిలో విసిరేస్తాడు. దీని అవసరం లేదు.. నువ్వున్నావుగా అంటూ మనవరాలిని అక్కున చేర్చుకుంటాడు. ఇది ఓ మనవరాలి కథ. అందుకే ఏయన్నార్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ అని టైటిల్ పెట్టారు. ఆ మనవరాలి ప్రేమ, త్యాగం మనసుని మెలిపెడతాయి. తప్పంతా పరిస్థితులదే మాట ఇచ్చిన తండ్రిదీ తప్పు కాదు. తండ్రి మాటను కాదన్న కొడుకుదీ కాదు. తప్పంతా పరిస్థితులదే. మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో సినిమా గంభీరంగా మొదలవుతుంది. నవలను దర్శకుడు క్రాంతికుమార్ వెండితెరకు ట్రాన్స్ఫామ్ చేసిన తీరు బాగుంటుంది. కళ్లెదుటే జరుగుతున్న కథేనేమో అన్నంతగా హృదయాన్ని తాకే సన్నివేశాలతో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి విగ్ లేకుండా నటించిన సినిమా. ‘సీతారామయ్య’లాంటి పాత్రలు చేయడం ఆయనకు కష్టం కాదు. జీవించేశారు. ఏయన్నార్కి దీటుగా నటించగలిగింది మీనా. బాలనటిగా మెరిసిన మీనా మెయిన్ లీడ్ చేసిన మొదటి సినిమా ఇది. అద్భుతంగా నటించింది. ఈ పాత్రల్లో వీళ్లను తప్ప వేరేవాళ్లను చూడలేం అన్నంతగా రోహిణి హట్టంగడి, రాజా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. అతిథి పాత్రలో దాసరి నారాయణరావు గోదావరి యాసలో నవ్వించారు. ‘పూసింది పూసింది పున్నాగ’, ‘భద్రగిరి రామయ్య’, ‘కలికి చిలకల...’ వంటి పాటలతో సినిమా హాయిగా సాగుతుంది. కీరవాణి ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్.1991లో వచ్చిందీ సినిమా. విడుదలై పాతికేళ్లవుతున్నా సీతారామయ్యగారు, ఆయన మనవరాలు మనసుల్లో నిలిచిపోయారంటే కథ గొప్పతనం అది. ఏయన్నార్ అభినందనను మరచిపోలేను – మీనా ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకి ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయడం అంటే మాటలా? టెన్షన్ అనిపించినప్పటికీ మంచి ఛాన్స్ అని ఒప్పుకన్నా. నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. దాంతో నా భయం మొత్తం పోయింది. ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మనకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. పంక్చువాల్టీ ముఖ్యం’ అని ఏయన్నార్గారు నాకో సలహా ఇచ్చారు. అది ఎప్పటికీ మరచిపోలేను. అలాగే సినిమా విడుదలైన తర్వత, ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. అది మరచిపోలేను. చెన్నయ్లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగ (2014) అప్పుడు అన్ని భాషలవాళ్లు వచ్చారు. అక్కడే ఏయన్నార్గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేను పాల్గొన్నాను. ఆయన్ను చూడటం అదే చివరిసారి. ‘మనం’ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తాతయ్య–నానమ్మలకు చెప్పలేక గోదావరి తీరాన మీనా ఏడవడం, తాతయ్య అమెరికా వెళ్లిపొమ్మన్నప్పుడు పడే బాధ ప్రేక్షకుల కళ్లు చెమర్చే సన్నివేశాలు. కొడుకు పంపిన బహుమతి (చేతికర్ర)ని సీతారామయ్య ఆప్యాయంగా తడిమి చూసుకునే సీన్, అది చూసి జానకమ్మ మురిసిపోవడం అలరిస్తాయి. ‘పెళ్లి చేసినట్లే చేసి నాకు మరణశిక్ష విధించారు’, ‘కన్నతండ్రికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడా మీ నాన్న.. వాడి కోసం ఒక్క మెట్టు కూడా దిగను’, ‘మాటకు విలువ తెలియనవాడితో నన్ను మాట్లాడమని అడగొద్దు’ వంటి డైలాగ్స్ సూపర్బ్. గణేశ్ పాత్రో రాసిన ఇలాంటి సంభాషణలు సినిమాకు బలం. 1991లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. నాలుగు నంది అవార్డులు దక్కించుకుంది. మలయాళంలో ‘సంధ్వానమ్’గా, కన్నడంలో ‘బెల్లి మొదగళు’ పేరుతో, హిందీలో ‘ఉదార్ కీ జిందగీ’గా రీమేక్ అయింది. – డి.జి. భవాని -
రికాడ్డేన్స్
అన్ని రికాడ్డేన్స్ల గురించీ మనం చెప్పలేపోవొచ్చునేమో గానీ, అంభేరుపురం రికాడ్డేన్స్ మటికి చాలా ఆరోగ్యకరమైంది. మనసుని నిండుగా చేసీసీది. పిల్లాపాపల్తో కలిసి చూడబుల్గా ఉండీది. బాగుండీది. మా చోడవరం కంటే అంభేపురవేంటీ పెద్ద పొడిచీసిన ఊరుగాదు. చిన్నూరే. కాపోతే, అక్కడ పందార ఫేట్రీ ఉంది. భూషణం రికార్డింగ్ డేన్స్ ట్రూపూ ఉంది. కాబట్టికే ఆ ఊరికి కొంత గర్రా. గొప్పున్నోడు ఫోజులు కొడతాడు. భరించాలి. జుత్తున్నమ్మ ముడేసుకుంటుంది. మాటాడగూడదు. అంభేరుపురం డేన్స్ ట్రూపు ఎలాంటిదంటే, అదంతా ఒక కుటుంబం కిందే లెక్క. అక్కినేని నాగేశ్వరరావుగా భూషణంబాబు స్టెప్పులు దంచీవాడు. కిశోర్కుమారయితే నందమూరి తారక రామారావుని స్టేజీమీద దింపీసీవాడు. వాళ్ల చుట్టాలమ్మాయిలే వాళ్ల పక్కన హీరోయిన్లు. ఫీమేల్ ఆర్టిస్టుల కోసం వెతుక్కోనక్కర్లేదన్నమాట. వరాలని ఒక పిల్ల ఉండీది. ఆ పిల్లా భూషణం దూరపు బంధువే. క్లబ్డ్యాన్సులు గట్రా చేసీది. బాబ్జీ అని ఉండీవాడు. అతగాడేమో హిందీ పాటలు, పవర్ స్టార్ క్రిష్ణ డేన్సులు వేసీవాడు. ‘తనే రాజబాబు.. రాజబాబే తను..’ అని తల్లితోడుగా నమ్మీసీ ఎండు నరం లాంటి వాడొకడు ఎప్పుడూ రడీరడీచ్చే. వీడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లాంటివాడు. ఒక ట్రూపులో పెరమనెంటుగా ఉండడు. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరికి పోతాడు. ఆ రాత్రికి డేన్సేస్సి డబ్బులు పట్టూ పోతాడు. సరుకున్నవాడు. అందుకే వీడికి డిమేండెక్కువ. రాజమండ్రి అనకాపల్లి కేంద్రాలుగా చాలా రికార్డింగ్ డేన్స్ బృందాలుండీవి. కాదన్లేదు. వేల్పుల వీర్రాజు, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్లాంటి వాళ్లు ఆ రోజుల్నాడు బాగానే ఏలీవారు. వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాదు మా భూషణం. చోడవరం వినాయకుడి నవరాత్రులప్పుడు బాలగణపతి సంఘం తొలీతా బుక్ చేసీది ఇతగాణ్ణే. తనూ కాదనీవాడు కాడు. పొయ్యికాడ ఆకుమడి పోగ్రాం కాదనీసి ఎక్కడెక్కడో తిరిగితే ఏం లాభం.. డబ్బు మిగలొచ్చునేమో గానీ నలిగిపోతాం.. సుఖవుండదు.. అనుకునీవాడు. వెంటనే బాలగణపతి సంఘానికి మాటిచ్చీసీవాడు. భూషణం ట్రూపు డ్రస్సులు భలే ఉండీవి. ఆయన స్వయానా టైలరు. నలభైయ్యేళ్ల కిందట టీవీలెక్కడివి. గూగుల్లూ, యూ ట్యూబులూ ఎక్కడని చచ్చేయి. అయినా భూషణానికి లోటు లేదు. ఒకసారి సినిమా చూస్తే చాలు. హీరో హీరోయిన్ల స్టెప్పులు, డ్రస్సులు అన్నీ గుర్తుపెట్టీసుకునీవాడు. తనేసుకుని ఏఎన్నార్ బట్టలు కుట్టుకునీవాడు. తన హీరోయిన్ రత్నావళికి వాణిశ్రీ దుస్తులు సిద్ధపరిచీవాడు. ఎన్టీఆర్గా చేసీ కిశోర్కి పెద్ద కాలర్ చొక్కాలు, బెల్బాటమ్ ఫేంట్లు క్షణాల మీద తయారుపెట్టీవాడు. అతని పక్కన కథానాయికకీ బట్టలు రైట్ చేసీవాడు. మిగతా డ్యాన్సర్లకి కూడాని చాలా శ్రద్ధగా మేకప్ సామాన్లు, డ్రస్సులు కొనిచ్చీవాడు. చోడవరం ఎంతో దూరం కాదు గనక రిక్షాల మీద బయలుదేరిపోయీవాడు. ప్రోగ్రాం జరిగీ గణపతి గుడికి చవితినాటి సాయంత్రం ట్రూపుని తీసుకొచ్చీసీవాడు. వీళ్ల బృందం ఊళ్లో దిగిందని తెలిస్తే చాలు. కుర్రనాగన్నలు రెచ్చిపోయీవారు. ‘ఎన్టీఆర్ వచ్చేడట్ట. ఏఎన్నార్ దిగీసేడట్ట..’ ఇకను ఇవే మాట. గుంటసావాదిగాళ్లందరూ పొలోమని ఆలయానికే పోయీవారు. వద్దంటున్నా వినకుండా రిక్షాలమీంచి డేన్సర్ల ఇనప రేకుపెట్టెలు లైటింగ్ సామాన్లు దింపీసి మోస్సీవారు. స్టేజీ వెనకాల తాటి కమ్మల్తో కట్టిన మేకప్ దడిలోకి చేరబెట్టీవారు. అలాంటప్పుడే కొందరు కుర్రాళ్లు మాచెడ్డ నీరసపడిపోయీవారు. ఎన్టీఆర్ వేషం కట్టీ కిశోర్, నాగేశ్వర్రావు యేక్షన్ చేసీ భూషణం ఆ క్షణాన హీరోల్లా వాళ్ల కళ్లకి కనిపించీవారే కాదు. ‘‘స్టేజీ మీదున్నట్టు గాని బయటలేరేట్రా..’’ అంటూ ఆ కురాళ్లు బితుకుబితుకుమంటూ దెబ్బతినీసినట్టు అయిపోయీవారు.‘‘అదేటీ గాదు. మేకప్పేసేక, రంగునైట్లు ఎలిగేక, ఆల్లు హీరోల్నాగే ఉంతార్లేరా’’ ఇంకో గుంటకక్కగట్టెవడో సరిదీవాడు. రాత్రి ఎనిమిదయ్యేసరికి తిళ్లు తిని మేకప్పులకి కూర్చునీవారు భూషణం బ్యాచీ సభ్యులు. ముఖం మీద జుత్తులు పడకుండా నెత్తికి రుమాలు గుడ్డలు కట్టుకునీవారు మగడేన్సర్లు. నేత్రాలమీద పెద్ద పెద్ద కనుబొమలు దిద్దికునీవారు. ముఖానికి తెల్ల కోటాలు దిట్టంగా కొట్టుకునీవారు. ఆడవాళ్లు మాత్రం పొడవైన కొప్పులు నెత్తిమీద పెట్టుకునీవారు. వాటికి వరసావాయీ లేకుండా చెంపపిన్నులు గుచ్చుకునీవారు. సన్నటి కనుబొమల్ని పెన్సిళ్లతో గీసుకునీవారు. మొహాలకి గులాబీరంగు దట్టంగా రాసుకునీవారు. కళ్ల పైరెప్పల మీద చెమ్కీ అద్దుకునీవారు. పెదాలకి ఎర్రరంగు పట్టించీవారు. అది బాగా అంటుకోడానికి మూసుకున్న మూతుల్ని ముప్ఫయిచుట్లు తిప్పీవారు. ఇదంతాను తాటాకుదడి కన్నాల్లోంచి ఊరి కుర్రగాళ్లు చూసీవారు. పక్కనున్న పాతచెర్లోంచి పీక్కొచ్చిన తూటికాడ కర్రల్తోటి బాలగణపతి సంఘం కార్యకర్త వీళ్లని ఆట్టే దెబ్బతగలకుండా కొడుతుండీవారు. దూరంగా తోలుతుండీవారు.క్లబ్డ్యాన్సులేసీ వరాలు మొగుడు రాజులని ఉండీవాడు. వాడు ఆటకి పనికిరాడు. వాడితో ఆడిస్తే ఏనుగు చేత గానుగాడించినట్టే. మొత్తం బొక్కడిపోద్ది. వాడు తిండికి తిమ్మరాజు. పనికి పోతురాజు. అంచేత, వాణ్ని స్టేజీ ముందరుండీ ఫోకస్ లైటు దగ్గిర కూచోబెట్టి రంగుల ముచ్చికాయితాల చక్రం తిప్పమనీవాడు భూషణం. పాటకి తగ్గట్టుగా స్టేజీని రంగుల కాంతిలో ముంచమనీవాడు. డేన్సెంతో ఫోకసింగూ అంతే ముఖ్యమని చిలక్కి చెప్పినట్టు చెప్పీవాడు. పిచిక్కి మప్పినట్టు మప్పీవాడు. రాజులుగాడు తక్కువేంటీ కాదు. వాడికీ, వాడి పెళ్లాం వరాలకీ ఇచ్చీ కిరాయి ముందే భూషణాన్ని అడిగి తీసీస్కునీవాడు. కాదంటే అల్లరి పెట్టీవాడు. వరాలు ఆడకుండా అడ్డీసీవాడు. అందుకే ఆ డబ్బేదే వాడికి పారీమని చెప్పీది ఆ పిల్ల. రోజూ బీడీలు కాల్చీ రాజులుగాడు సొమ్ము చేతిలో పడగానే రెడ్విల్స్ అంటించీవాడు. అస్తమానూ సారా తాగీవోడు ఆరారా సేంపిలేసీవాడు. ముష్టి చెక్కపొట్లాం నమిలీవాడల్లా రత్నా జరదాకిల్లీ బిగించీవాడు. ఎవడేంటి చెప్పినా చివరికి వాడికి పుట్టిన బుద్ధే వాడిది. వాడి పెళ్లాం పాటప్పుడు సక్రంగా చక్రం తిప్పి భలే రంగులు చూపించీవాడు. వాడికిష్టం లేని పాటలొచ్చినప్పుడు మటికి చెత్త రంగులు ఫోకస్ చేసీసి కంపు కొట్టించీసీవాడు. డేన్స్లన్నీ అయిపోయేక ఉస్సురుమంటూ ‘అలా సేసేవేటి రాజులూ’ అని భూషణం కొద్దిగా కోప్పడితే, ‘అదేటి మాయ్యా. బాగానే తిప్పినా గదేటి సెక్రం’ అని అన్నీ చేసీసి ఏవీ ఎరగనట్టు ఎర్రిపప్పలా మాటాడీవాడు. మెత్తని కక్కలా గునిసీవాడు. భూషణవూ అటు తిరగ్గానే ‘దురత్తీరిందా’ అన్నట్టుగా ఓరగా ఓ వెకిలి నవ్వు విసిరీవాడు. రాత్రి పదికి రికాడ్డేన్స్ మొదలయిపోయీది. అప్పటికే ఊళ్లోని ఇల్లుపిల్లాద్రీ స్టేజీ ముందు వారసరిగా చేరీసీవారు. మరీ ముఖ్యంగా అగ్రజాతి పురుష పుంగవుల భార్యామణులయితే నిలుచున్న చోటు నుంచి బెత్తెడు దూరమూ కదిలీవారు కారు. తమ దిక్కుమాలిన మొగుళ్లు ఏడాదికోమారు చూపించీ మహావినోదం ఇదేనని వాళ్లంతా గట్టిగా భావించీవారు. రోజూ వంటింట్లో పడి చచ్చీ తమకి ఈ రోజే స్వేచ్ఛాదినమన్నట్టుగా ప్రవర్తించీవారు. ఆసక్తిగా డేన్స్ల మీదనే మనసు లగ్నం చేసీవారు. వీళ్లకి వెనకాల సకల రకాల జనావళీ పోగుబడిపోయీవారు.ముందుగుండా ‘శుక్లాం బరధరం విష్ణూం.. శశివర్ణం చతుర్భుజం..’ ఘంటసాల రికార్డు పాడించీవాడు భూషణం. స్టేజీ మీద తెర వెనుకే డేన్సర్లందరూ నిలబడి ప్రార్థన చేసీవారు. ఆ వెంటనే ఫస్టు ఫస్టు ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది..’ పాట వేస్తున్నట్టుగా మైకులో హిందీపాటల డేన్సరు బాబ్జీ ప్రకటించీవాడు. ప్లేటును ప్లేయర్ మీద వేసీవాడు. తెర తొలిగీది. పాట మొదలవగానే కిశోర్కుమార్ స్టేజీ మీది దీపకాంతుల మధ్య ఎన్టీవోడిలాగానే వెలిగిపోయీవాడు. ‘తల్లా పెళ్లామా’ సినిమా అతగాడు ఎన్ని సార్లు చూసేడో మనకి తెలీదు. ‘‘పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవదు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు’’ అన్నచోట స్టేజీ దిగిపోయి అచ్చం సినీమాలో రామారావు బాధపడున్నట్టుగానే రెండు చేతులూ అడ్డంగా గాల్లో ఊపీసీవాడు. జనంలోకొచ్చీసి చాలా ఇదయిపోయీవాడు. ప్రేక్షకులు ప్చ్..ప్చ్.. కొట్టీసి, హాహాకారాలు చేసీసి ఆయన చుట్టూ చేరిపోయీవారు. ఆ పాట మైకంలోంచి వాళ్లు చప్పున తేరుకోలేపోయీవారు. ఈ వ్యవహారాన్ని సరిచేయడానికన్నట్టుగా.. ‘‘నెక్స్ట్ అయిటమ్ ‘దత్తపుత్రుడు’ చిత్రంలో ‘పిల్లోయ్ జాగత్త’, జూనియర్ ఏఎన్నార్ భూషణం జూనియర్ వాణిశ్రీ రత్నావళి’’ అనే ఎనౌన్స్మెంటు వెలువడీది. ఈలలు మిన్నుముట్టీసీవి. ‘‘ఆడదిలే అని వదిలేస్తుంటే అడ్డుతగులుతున్నావా, నా దెబ్బ చూపమంటావా’’ పంచె కట్టుకుని భూషణం రెచ్చిపోతూ నోరు కదిపీవాడు.‘‘పాపం పోనీ పసివాడంటే, పైకి పైకి వస్తావా, ఒక పట్టు పట్టమంటావా’’ రత్నావళీ తక్కువ తినీది కాదు. చదివింపుల మీద చదివింపులు వచ్చిపడిపోయీవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటలయిపోయేక ‘హమ్ కిసీసే కమ్నహీ’ హిందీ సినిమాలోని ‘‘బచ్నా ఏ హసీనోం లోమై ఆగయా’’ మోగీది. రికార్డు ప్లేయర్ నడిపించీ బాబ్జీ చకచకా స్టేజీ ఎక్కీసీవాడు. రిషీకపూర్లా విరగబడిపోయీవాడు.ఆ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల..’ వర్ర వర్రగా వరాలు ఆడీది. వినాయకచవితినాడు తిన్న ఉండ్రాళ్లు, జిల్లేడుగాయల కంటే ఈ డేన్సులే బాగున్నట్టుగా పందిరి కింద చేరిన ప్రజానీకం పరవశించీది. అనంతరం ‘సెక్రటరీ’ సినిమాలోని ‘మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు’, ‘అడవిరాముడు’ చిత్రంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘అమ్మ మాట’లోని ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు’, ‘ఇదాలోకం’లోని ‘‘గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు’ పాట మోతెక్కిపోయీవి. చప్పట్లే చప్పట్లు. ఈలలే ఈలలు. అవునట్టు, రాజబాబు విషయం చెప్పనే లేదు కదూ. ఆమ్మో వాడి డేన్స్ సామాన్యమైన డేన్స్ కాదు. ‘‘చిలకలాంటి చిన్నదానా.. రావే వయ్యారి జాణ..’’ మొదటగా రుచి చూపించీవాడు. ఆనక ‘‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను’’ పాటలో కలగలిసిపోయి నానా దీర్ఘాలు తీసీవాడు. పందిరి మొత్తం నవ్వుల పువ్వులు పూస్సీది. రికాడ్డేన్స్ చివర్నజేసి కిశోరేమో ‘దేవత’ లోని ‘బొమ్మపే చేసి ప్రాణము పోసి’ పాట వేసీవాడు. ఆ వెంటనే, ‘ప్రేమనగర్’లోని ‘ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్య నందనం’ సాంగుని భూషణం లాగించీవాడు. మూడు గంటలకు పైగా సాగే రికాడ్డేన్స్లో అశ్లీలం పాలు చిన్నమెత్తు కూడా భూతద్దం పెట్టి వెదికినా కనిపించీది కాదు. ఆఖరికి, వరాలు వేసే క్లబ్ డేన్స్లప్పుడూ సుబ్బరవైన గుడ్డలు కట్టుకునే ఆడీది. ఈ విధంగా, మూడు పువ్వు ఆరు కాయలుగా సాగిపోతున్న భూషణం రికార్డింగ్ డేన్స్ ట్రూపు ఉన్నట్టుండి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది. హఠాత్తుగా చిక్కుల్లో చిక్కుబడిపోయింది. చివికి చీకాకుపడిపోయింది. పోలీసు బాబుల నుంచి ఎదురయిన ఆంక్షలతో రొడ్డ రొడ్డగా నానా బాధలూ పడిపోయింది. ఎక్కడో ఎవరో రికాడ్డేన్స్ ట్రూపులవాళ్లు ఏవో అభ్యంతకర నృత్యాలు చేస్తున్నారని చెప్పీసీ విశాఖపట్నం జిల్లా ఖాకీ అధికారులు వీటి మీద నిషేధం పెట్టీసేరు. ఇవి ఆడితే కటకటాల వెనక్కేనని నిబంధన విధించీసేరు. తుంటి కొడితే పళ్లు రాలినట్టుగా ఎక్కడో ఏదో జరిగితే భూషణం రికాడ్డేన్స్కి ముంచుకొచ్చీసింది. భూషణం బాబు వేదనకు అంతూదరీలేదు. నోటి దగ్గర కూడుపోవడం ఒక ఎత్తయితే, ఇష్టమైన హీరో డేన్సులు చేయలేకపోవడం అంతకుమించిన ఎత్తు. మనసంతా కల్లోలపడిపోయింది. రోజుల వ్యవధిలోనే టీబీ పేషెంట్లాగ అయిపోయేడు. ఆరు నెలలు కాళ్లరిగేలాగ నాయకుల దగ్గరకీ పోలీసు పెదబాబుల దగ్గరకీ తెగ తిరిగేడు. ‘‘ఆకల్తో సస్తన్నాం’’ అని మొరపెట్టుకున్నాడు. ‘ఆట సూసి, అది మంచో సెడో సెప్పండి’ అంటూ బతిమాలేడు. లాభం లేపోయింది. అంతవరకూ భూషణం ట్రూపు డేన్స్ మంచివేనని మెచ్చుకున్న జనమెవ్వరూ కొంచెం కూడా నోరిప్పలేదు. మాట సాయం అస్సలు చెయ్యలేదు. ‘పక్కవాడి తగూ వినవేడుక’ టైపులో లేని జాలి ప్రదర్శించి తప్పుకున్నారు. పెళ్లాలతో సహా పెద్ద పెద్ద కుర్చీలేసుకుని తమ అభిమాన హీరోల పాటల్ని భూషణం, కిశోరు ఆడుతుంటే చూసి తరించీసిన సీఐలు, ఎస్ఐలూను కలుగజేసుకోనేలేదు. ఎవడెలా పోయినా అధికారులు చెప్పినట్టు చేసీసీ తమ బతుకులు బాగుండీలా చూసీసుకుంటే సరిపోతుందనుకున్నారు. ఒల్లక కూచుండిపోయేరు.కొన్నాళ్లిలా గడిచిపోయేయి. డేన్స్లేసీ కాళ్లతో పగలూ రాత్రీ భూషణానికి కుట్టుమిషను తొక్కడం తప్పింది కాదు. ఇష్టపడి తొక్కీ తొక్కుడు వేరు. హృదయం లేని తొక్కుడు వల్ల తప్పుడు కుట్లు పడిపోయి గుడ్డలు పాడయిపోయీవి. కస్టమర్లు తిట్టిపోసీవారు. ఇలాగే మరికొంత కాలం పోయాక ఎవరో మనసున్న ఎస్పీ దొరగారు జిల్లాకొచ్చేరు. చార్జి తీసుకున్నారు. రికాడ్డేన్సర్ల బాధ విని కొద్దిగా కరిగేరు. మళ్లీ డేన్సులు మొదలెట్టుకోవచ్చని పెద్దమనసుతో ఆదేశాలిచ్చేరు. కాకపోతే వీటికి ‘భామాకలాపం’ అని పేరు పెట్టుకోమన్నారు. భూషణం ఏం చేయగలడు. అదే పదివేలనుకున్నాడు. పడుతూ లేస్తూ సరుకూ సప్పరా మళ్లీ సమకూర్చుకున్నాడు. రికాడ్డేన్స్కి తలపడ్డాడు. సేన్నాళ్లుగా ప్రోగ్రాము లేకపోడంతోనూ అప్పుల పాలయిపోడంతోనూ మునుపటి ఉత్సాహం అంభేరుపురం బృందంలో లేకపోయింది. ఏదో ఆడేం అంటే ఆడేం అన్నట్టుగా ఉండీవారు. కాలమూ మెల్లగా మారిపోవొచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లే సినిమాలకు దూరమైపోడం మొదలెట్టేరు. వాళ్ల పిల్లలు తెరమీదికి దిగీసేరు. భూషణం రికాడ్డేన్స్ పూర్తిగా మూలకెళ్లిపోడానికి అడ్డులేపోయింది. కొన్నాళ్లపాటు భూషణం కొడుకు సూర్యం, కిశోర్ కొడుకు చంద్రం, నాగార్జున, బాలకృష్ణ డేన్సులు చెయ్యకపోలేదు. కానీ పెద్దగా హిట్టవ్వలేదు. జనాలూను స్పీడు యుగంలో పడిపోయి ముఖం పక్కకి తిప్పీసుకున్నారు. ఆ బెంగతోనేనేమో భూషణం గుండె ఓ నాటి తెల్లవారుఝామున అకస్మాత్తుగా ఆగిపోయింది. అతగాడు వెళ్లిపోడంతో నాథుడు లేక ట్రూపంతా కకావికలమైపోయింది. ఏవో పనులు వేపగించుకోడానికి, కూలిపనులు చేసుకోడానికి డేన్సర్లందరూ ఎటెటో చెదిరిపోయేరు. భూషణం ట్రూపే కాదు. కాలచక్రంలో పడిపోయి ఇలాంటి డేన్స్ బృందాలన్నీ చాలామటుకు మొగుమొత్తంగా అయిపు లేకుండా పోయేయి. ఇంతకీ, చిన్నప్పటి రికాడ్డేన్స్ ఊసులన్నీ నాకెందుకిప్పుడు ఉన్నపాటున గుర్తుకొచ్చినట్టు. బాల్యంలోకి పాళంగా నేనెందుకు పయనమైపోయినట్టు. ఎందుకంటేను... ఈ మధ్యనే విశాఖపట్నంలో తోటగరువు దుర్గాలమ్మ పండగ ఘనంగా జరిగింది. ఆ సమయంలో అనుపు సంబరానికి అటుగా వెళ్లవలిసివచ్చింది. అంభేరుపురం రికాడ్డేన్స్ బాబ్జీ ఏమో లైటింగ్ పనులు చేస్తూ అక్కడ కనిపించేడు. పెద్దవాడయిపోయేడు. బాగా లొంగిపోయేడు. ఒకప్పుడు రిషీకపూర్లా మెరిసినవాడు ఇప్పుడు ముసిలి కపూర్లా ఉప్పూపత్రీ లేనట్టయిపోయేడు. ఒంటికి ప్రాణం తప్ప మరేంటీ లేనట్టుగా అవుపించేడు. నేనెవరో తనకేం ఎరుక. నేనే గుర్తుపట్టేను. ఎలా ఉన్నావన్నాను. ఆశ్చర్యపోయేడు. ‘‘నా పేరు తమరికెలా తెలుసును’’ అనడిగేడు. చోడవరం భోగట్టాలు, రికాడ్డేన్స్ ఊసులూ గబాగబా చెప్పీసరికి గొప్పగా సంతోషపడిపోయేడు. ‘హమ్ కిసీకే కమ్ నహీ’ సినిమా పేరెత్తగానే కొత్త బలం వచ్చీసినట్టుగా అయిపోయేడు. అతని ముఖం అప్పటికప్పుడే వెలిగీసింది. ‘‘వొప్పుడో వొయిజాగొచ్చీసినా నాయినా. సీరియల్ సెట్లు బిగించుకుంతన్నాను. బతకాలిగదేటి’’ అన్నాడు.ఒకప్పుడు ఎందరెందరి పొగడ్తలో పొందినవాడు. ఈవేళ ఈకలు తీసిన కోడిలా అయిపోయేడు. నా మనసు బాధతో ఒక్క సిటం మూలిగింది. ఇంతలోనే అన్నాడు కదా.. ‘‘వుప్పుడు రికాడ్డేన్సులెక్కడియి బావూ? ఏ ఇనాయికసవితి పండగ సూసినా, ఏ దసరా టెంట్ల కాడ ఎదికినా డేన్స్ బేబీ డేన్సింగులే. ఈ డేన్సింగులేసి గుంటల్లో ఒక్కుదానికీ ఒంటిమీద సరీగా గుడ్డముక్కలుండవు. కాలంనాడు మావంతా చెరీరం మొత్తానికీ గుడ్డలు సుట్టుకునీవోల్లం. ఆడీవోల్లం. అయినా గానీ పోలీసోల్లు కుదరదనీవోరు. మరా పోలీసుబావులు వుప్పుడేటయిపోయినారో తెల్దు. ఆల్లు మటికి ఏటి సేత్తార్లెండి. వుప్పుడు ఆడగుంట్లకి దయిద్రుగొట్టు బట్టలు తొడిగించీసీదీ అమ్మాబావులే గదేటి. ఒకనాడు తప్పుకాన్దాన్ని తప్పు అనీనారు. వుప్పుడు రాంగుని రైటంతన్నారు’’ అనీసేడు నిస్త్రాణగా. ఇలా అంనే, తనకిక సెలవిప్పించమన్నట్టుగా నావేపు చూసేడు. నాతో నిమిత్తం లేకుండా అటేపు తిరిగీసి దీపాల తోరణాలు కట్టుకోడంలో మునిగిపోయేడు. -
అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం
‘శ్రీమతి అన్నపూర్ణ మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదాలతో... మా అబ్బాయి అఖిల్ నిశ్చితార్థ వేడుకకు మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నాం’ - ఇట్లు అమల అండ్ అక్కినేని నాగార్జున. సినీ ప్రముఖులకూ, సన్నిహితులకూ అక్కినేని కుటుంబం నుంచి అందిన ఆహ్వానం ఇది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్, అఖిల్ల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్లో పెళ్లి చేయాలనుకుం టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్కి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్నగర్ టాక్ -
నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయి చాలా కాలం అవుతున్నా.. ఏఎన్నార్ సినిమాలో ఎలా నటిస్తారని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏఎన్నార్ను మరోసారి వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని టీం. గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించనున్న నాగేశ్వరరావు పాత్ర దాదాపు మూడు నిమిషాల పాటు కనిపించనుందట. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కిన నాగభరణం సినిమాలో కూడా చనిపోయిన విష్ణువర్థన్ హీరోగా కనిపిస్తున్నారు. అదే తరహాలో ఓం నమోవేంకటేశాయలో ఏఎన్నార్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. -
టీయస్సార్కి ఏయన్నార్ అవార్డు
ప్రతి ఏటా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన నిష్టాతులకు ‘రసమయి డా.అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు బహూకరిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును ‘కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి అందించనున్నట్లు ‘రసమయి’ అధినేత డా.ఎంకె. రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఏయన్నార్తో సుబ్బరామిరెడ్డికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. సినీ కళాకారులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్న ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితం. ఈనెల 21న హైదరాబాద్లో అవార్డు ప్రదానం చేయబోతున్నాం. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు హాజరు కానున్నారు’’ అని తెలిపారు. -
ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాళ్లమో..
‘‘డెబ్భై ఐదేళ్ల క్రితం ఘంటసాల బలరామయ్యగారు మా నాన్నగారిని (అక్కినేని నాగేశ్వరరావు) చూసి, ‘కుర్రాడు బాగున్నాడే చలాకీగా..’ అనుకుని యాక్టర్ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇచ్చి ఉండకపోతే మేం ఎక్కడుండేవాళ్లమో? ఏం చేసేవాళ్లమో? ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనీ, కొత్తవారిని ప్రోత్సహించాలని నాన్నగారు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళుతున్నాం’’ అన్నారు నాగార్జున.. శ్రీకాంత్ తనయుడు రోషన్ని హీరోగా పరిచయం చేస్తూ, జి. నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి, నిర్మాత అల్లు అరవింద్కు ఇచ్చారు. హీరో గోపీచంద్ ట్రైలర్ లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ- ‘‘రోషన్ డైలాగ్ డెలివరీ, మెమొరీ పవర్ గుడ్’’ అన్నారు. నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఈ వయసులో నిర్మాత ఎందుకయ్యారని కొందరు అడిగారు. నిర్మాతకు వయసుతో పనేముంది? రాబోయే తరం గురించి నాకు మా తాత చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండటం, నా మిత్రుడు నాగార్జున యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పడం ఈ చిత్రం నిర్మించడానికి ఓ కారణం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో ఇద్దరు హీరోలు. ఒకరు రోషన్, మరొకరు నాగార్జునగారు. నాగార్జునగారి ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందీ సినిమా. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’తో హిట్ సాధించిన ఆయన ‘నిర్మలా కాన్వెంట్’తో హ్యాట్రిక్ సాధించబోతున్నారు’’ అన్నారు. ‘‘సెట్స్కి వెళ్లి, రోషన్ హార్డ్వర్క్ స్వయంగా చూశా. చాలా గర్వంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘పెద్ద సంస్థల ద్వారా లాంచ్ అవడం రోషన్ లక్’’ అని తనయుణ్ణి మురిపెంగా చూస్తూ, ఊహ అన్నారు. ‘‘ఏయన్నార్గారు, మా నాన్న రాజేశ్వరరావుగారి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. నేను నాగార్జునగారి చిత్రాలకు సంగీతం అందించా. ఇప్పుడు నా కుమారుడు రోషన్ సంగీత దర్శకుడు కావడం హ్యాపీ’’ అని కోటి అన్నారు. రోషన్ మాట్లాడుతూ - ‘‘నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు, కళ్లు పైకే చూస్తుండాలి.. కాళ్లు కిందే ఉండాలన్నారు. అమ్మానాన్న తలెత్తుకునేలా ఉంటాను’’ అన్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు ధవళ సత్యం, ఆయన సోదరుడు ధవళ మల్లిక్, దర్శకుడు కల్యాణ్కృష్ణ, హీరోయిన్ శ్రేయాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని అంచు పంచెలు...
పొందూరు ఖాదీకి ఎవర్గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కినేని నాగేశ్వరరావే. ఆకుపచ్చ, ఊదా, కెంపు రంగుల్లో అంచులు ఉండే పంచెలంటే అక్కినేనికి మహా ఇష్టం. ఈ తరహా పంచెలు అక్కినేని పంచెలు గానే స్థిరపడిపోయాయి. చనిపోయేంత వరకు ఏఎన్ఆర్ పొందూరు ఖాదీనే వాడారు. అక్కినేని స్వయంగా పంచెలకు అంచును డిజైన్ చేసి పొందూరుకు పంపించడంతో ఆ వస్త్రాలకు మంచి గిరాకీ వచ్చింది. ఏటా సుమారు రూ. 40 వేలు విలువ చేసే వస్త్రాలను ఆయన కొనుగోలు చేసేవారు. ఈ పంచెలను నేయడానికి పొందూరు ఫైన్(100వ కౌంట్) దారాన్ని వాడుతారు. అంచు సింగిల్ బోర్డర్ అంచు పంచె రూ.8వేలు నుంచి రూ. 9వేలు వరకు ధర పలుకుతోంది. ఏటా రూ 7 లక్షలు విలువ చేసే ఏఎన్ఆర్ అంచు పంచెలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. -
నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్నినాయనా.. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాగ్.. ఒక పాత్ర కోసం పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మనం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ త్వరలో సోగ్గాడిగా అభిమానులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం నాగ్ ఎంచుకున్న గెటప్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు చిత్రయూనిట్. ఎన్నో చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు చేసిన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావే తన పాత్రకు స్ఫూర్తి అంటున్నాడు నాగ్. అంతేకాదు ఈ సినిమాలో తన గెటప్ కోసం నాగ్ వాడిన కాస్ట్యూమ్స్ గతంలో అక్కినేని నాగేశ్వరరావు వాడినవే.. ఈ సినిమాలో నాగ్ వాడిన వాచీ కూడా 1959లో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా కొన్నది కావటం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తుండగా, హంసానందిని, అనసూయ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. -
నిజ జీవిత కథానాయకుడు అక్కినేని
‘బతికి బావుకునేది లేదని చావబోకు- చచ్చి సాధించేది లేదని బతకబోకు-బతికి జీవితాన్ని సాధించు-చనిపోయి కలకాలం జీవించు’. ఇవి అక్కినేని నాగేశ్వరరావు తన ‘అ-ఆలు’ (అక్కినేని ఆలోచనలు)పుస్తకంలో రాసుకున్న మా(పా)టలు. దీనికి నిలువెత్తు నిర్వచనం ఆయన జీవితమే. కృష్ణాజిల్లాలోని మారుమూల కుగ్రామంలో జన్మించి, చదువు సంధ్యలు అంతమాత్రంగానే అబ్బిన ఓ కుర్రవాడు, నాటకాలలో ఆడపిల్లల వేషాలు వేస్తుండగా..గుడివాడ స్టేషనులో ఓ నిర్మాత కంటబడటం, సినీ రంగంలో అడుగుపెట్టడం.. తొలి దశలో ఎన్ని అవమానాలు ఎదురైనా.. మొక్కవోని దీక్షతో క్రమశిక్షణ, పటుట్టదలతో ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా ఎదగడం నిజంగా అద్భుతం.. ఇది తెలుగు సినిమా కథ కాదు, నిజ జీవిత కథానాయకుని కథ. సినీ రంగాన్ని ఏలిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు దీక్షాదక్షత. గోదావరితో ఏఎన్నార్ అనుబంధం గోదావరి తీరంతో అక్కినేనికి ఎనలేని సంబంధం ఉంది. ఔట్ డోర్ షూటింగుకు నటులు అంతగా ఇష్టపడని రోజుల్లో ఆయన మూగమనసులు సినిమాలో హీరోగా నటించారు. దాని చిత్రీకరణ గోదారి ఒడ్డునే జరిగింది. జిల్లాలోని పులిదిండి, ర్యాలి గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న బుద్ధిమంతుడు సినిమాకీ ఆయనే హీరో.. అందాల రాముడు, సీతారామయ్యగారి మనుమరాలు, సూత్రధారులు, శ్రీరామదాసు ఇలా ఏఎన్నార్ నటించిన ఎన్నో చిత్రా లు గోదారి ఒడ్డున ప్రాణం పోసుకున్నాయి. అన్నీ అఖండ విజయాలే. గోదారి తీరాన ఉన్న ఎందరో కళాకారులు, చిత్రకారులు, సాహితీవేత్తలతో అక్కినేనికి మంచి సాన్నిహిత్యం ఉంది. రాజమండ్రి టీ నగర్లోని పాల గంగరాజు దుకాణంలో లభించే పాలకోవా అంటే అక్కినేనికి ప్రాణం. నాకు డైలాగ్ పెట్టమన్నారు. 1955లో రోజులు మారాయి శతదినోత్సవానికి అక్కినేని రాజమండ్రి వచ్చారు. నా అన్న శ్రీపాదపట్టాభి ద్వారా అప్పుడే అక్కినేనితో నాకు పరిచయమైంది. ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆ పరిచయం అలాగే దినదినప్రవర్ధమానమైంది. తొలిసారిగా బాపు, రమణలు తీసిన బుద్ధిమంతుడు సినిమాలో నాకు ఆయనతో నటించే అవకాశం లభించింది. పతాక సన్నివేశంలో విలన్ పాత్రధారి నాగభూషణాన్ని అరెస్టు చేసే పోలీస్ అధికారి పాత్రను నాకు ఇచ్చారు. ‘మన జిత్కు డైలాగ్ పెట్టండి’ అని ఆయన రచయిత ముళ్లపూడికి సూచించారు. అందారాముడు, సూత్రధారులు, శ్రీరామదాసు.. ఇలా ఎన్నో చిత్రాలలో ఆయనతో కలసి నటించాను. దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు ఆయన అందుకున్నాక, తొలి సన్మానం నా చేతులమీదుగా రాజమండ్రిలోనే జరగడం నా అదృష్టం. - జిత్ మోహన మిత్ర, గాయకుడు, రంగస్థల, సినీనటుడు అహంభావం అణువంత కూడా లేదు 2007 మేలో గోదావరీ తీరాన శ్రీరామదాసు షూటింగ్ జరుగుతోంది. నాది భక్తునిగా ఒక చిన్న పాత్ర. మిమ్మల్ని కలవడం, కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆయనతో అన్నాను. ఆయన ఆప్యాయంగా నా ఉద్యోగం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీరిక సమయాల్లో కళారంగానికి సంబంధించిన ఎన్నో సత్యాలను ఆవిష్కరించేవారు. ఆయన ఎంత గొప్ప నటుడో, వ్యక్తిగా కూడా అంత గొప్పవారు. - నేదునూరి గోపాలకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయుడు. చిన్నతనం నుంచి ఆయనకు అభిమానినే ఉద్యోగరీత్యా బాపట్లలో బ్యాంకులో పనిచేస్తున్న నేను ఒకసారి హైదరాబాద్ బ్యాంకు పనిమీద వెళ్లాను. నేను సేకరించిన అక్కినేని ఫొటోలతో కూడిన ఆల్బమ్ను ఆయనకు చూపించా. వాటిని చూసి ఈ ఫొటోలు నా వద్ద కూడా లేవే అన్నారు. 1953లో దేవదాసు శతదినోత్సవం సందర్భంగా ఆయన, సావిత్రి, పేకేటి శివరాం వచ్చారు. వరద రోజులు. అప్పుడు హోటళ్లు లేవు. వచ్చిన నటీనటులు వాడ్రేవువారి భవనంలో దిగారు. అప్పుడు నేను తొలిసారిగా అక్కినేనిని చూశాను. ఓసారి అక్కినేని పుట్టినరోజున నేను ఆయన బొమ్మగీసి పంపితే, ఆయన అభినందనలు తెలియజేస్తూ లేఖ రాసారు. నాగేశ్వరరావు అరుదైన నటుడు. - ఎం.వి.అప్పారావు (సురేఖ), విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, కార్టూనిస్టు -
ఎవర్ గ్రీన్
-
నిజజీవిత కథానాయకుడు
నేడు అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి దేవదాసు ఎలా ఉంటాడు? విప్రనారాయణ ఎలా ప్రవర్తిస్తాడు? కవి కాళిదాసు, భక్త జయదేవుడు ఎలా ఉండి ఉంటారు? మరి, దసరా బుల్లోడంటే? భగ్న ప్రేమి కుడి నుంచి భాగవతోత్తముడి దాకా, కవీశ్వరుడి నుంచి కుటుంబ కథల కథా నాయకుడి దాకా - ఏ పాత్రకైనా రోల్ మోడల్గా నిలవడం ఎంతటి నటుడికైనా సవాలు. కానీ, కష్టపడి పైకొచ్చి, ఆ సవాలును ఇష్టపూర్తిగా స్వీకరించి, అభినయమే శ్వాసగా బతికిన నటుడంటే అక్కినేని నాగేశ్వరరావు(1924 - 2014). పెద్దగా చదువైనా లేని పల్లెటూరి పిల్లగాడు... పెద్దయ్యాక కూడా నాటకాల్లో ఆడవేషాలు వేసిన ఒక కుర్రాడు... పెద్దమనుషుల్ని పరిచయం చేస్తే కనీసం నమస్కరించి మాట్లాడడం కూడా తెలియని శుద్ధ బుద్ధావతారం... నేర్చుకొనే గుణం ఉంటే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడవచ్చనీ, సాధన చేస్తే కొన్ని కోట్ల మందిని ఆకట్టుకొనే కథానాయకుడు కావచ్చనీ, ఒక జాతి తరతరాలూ చెప్పుకొనే కల్చరల్ ఐకాన్గా చిరకాలం మిగిలిపోవచ్చనీ నిరూపించడం అక్కినేని జీవిత కాలంలో చేసి చూపెట్టిన అపూర్వ సాధన. అనారోగ్యం రావచ్చు... ఒకటికి రెండు గుండె ఆపరేషన్లు జరగచ్చు... జీవితంలో, కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురుకావచ్చు. కానీ, ‘బతుకు కన్నీటి ధారలలో బలి చేయకు’ అన్న పాఠాన్ని ఎలా చెప్పాలి? అవన్నీ ఎదురై నప్పుడు అక్షరాలా ఆచరించి చూపడం తప్ప! అక్కినేని చేసింది అదే! ఆఖరి క్షణంలో క్యాన్సర్ కబళిస్తున్నప్పుడు కూడా అదే ధైర్యం... అదే హుందాతనం. చేస్తున్న వృత్తినే దైవంగా భావించడం, ఆ భావనతోనే ఆఖరు దాకా జీవించడం... చాలా మంది చెబుతారు. కానీ, అక్కినేని చేసి చూపించారు. ‘నటుడిగానే మరణించాలి. మరణించాక కూడా జీవించాలి’- ఇది కొందరికి ఆశ. ఇంకొందరికి తీరని ఆశయం. మరికొందరికి కేవలం జనం మెచ్చడానికిచ్చే స్టేట్మెంట్. కానీ, చిన్ననాటే రంగస్థలంపై మొదలుపెట్టి, వెండితెరపై ‘ధర్మపత్ని’ (1941) నుంచి చనిపోయే ముందు ‘మనం’ (2014) దాకా ఏడున్నర దశాబ్దాల పైగా వృత్తినే శ్వాసించడం ఏయన్నార్ ఘనత. జీవితంలో నటించడం ఎక్కువై, నటనలో జీవించడం తక్కువైన రోజుల్లో అక్కినేని జీవితకాలపు జ్ఞాపకాల్ని జనం గుండెల్లో మిగిల్చిన మహానటుడు. అందుకే, భారతీయ సినీచరిత్రలో ఏయన్నార్ కథ చిరకాలపు పాఠం. అచ్చతెలుగు జీవితం, పంచెకట్టు వేషమంటే ఇప్పటికీ గుర్తొచ్చే ఆయన అమరజీవి... తెలుగు సమాజపు సమష్టి చేతనలో సదా చిరంజీవి. -
హీరో.. హీరోయిన్.. ఓ చెట్టు..
సమ్థింగ్ స్పెషల్ నా చిన్నతనంలో మా ఊరికి అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. ఈ చెట్టు కిందే షూటింగ్ జరిపారు. ఆయనతో షేక్హ్యాండ్ ఇచ్చిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. మట్టిపిడతలో అన్నం వండించుకుని నాగేశ్వరరావుగారు తినేవారు. మా చెట్టు వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను చూసే అదృష్టం కలిగింది. - నీరుకొండ లక్ష్మణరావు, స్థానికుడు మా నిద్రగన్నేరుచెట్టు మా గ్రామానికే తొలిమెట్టు. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు పలు సన్నివేశాల్లో నటించారు. ఏడాదిలో రెండు మూడు షూటింగులన్నా మా గ్రామంలో జరుగుతాయి. ఇటీవల అల్లరి నరేష్ నటించిన బందిపోటు సినిమా ఇక్కడ షూటింగు జరుపుకున్నదే! - బోగవెళ్లి బ్రహ్మానందం, స్థానికుడు -
ఏయన్నార్ 75 ఏళ్ల సినీ జీవితం
-
అక్కినేని జ్ఞాపకాలు
-
గోదావరి బుల్లోడు అక్కినేని
రాజమండ్రి కల్చరల్ : మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మన మధ్యనుంచి నిష్ర్కమించి అప్పుడే ఏడాది గడిచింది. గోదావరి జిల్లాలతో అవినాభావ అనుబంధం ఆయనకు ఉంది. గోదావరి తీరాన రూపు దిద్దుకున్న అక్కినేని సినిమాలు చరిత్ర సృష్టించాయి. 1963లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన మూగమనసులు కోటిపల్లి రేవు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్పై వచ్చిన పూలరంగడు షూటింగ్ కపిలేశ్వరపురంలో జరిగింది. 1969లో బాపు, రమణల బుద్ధిమంతుడు పులిదిండి, ర్యాలి గ్రామాలలో నిర్మాణమైంది. 1997లో విడుదలైన ఆత్మీయుడు తాపేశ్వరం లాకుల వద్ద, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరణ చేసుకుంది. 1982నాటి మేఘసందేశం సన్నివేశాల షూటింగ్ దోసకాయలపల్లి, నందరాడ గ్రామాల్లో జరిగింది. 1970లో విడుదలయిన ఇద్దరమ్మాయిలు షూటింగ్ సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీలో జరిగింది. ఆ తరువాత వచ్చిన సూత్రధారులు షూటింగ్ అన్నవరం, మిర్తిపాడు, తొర్రేడు, కపిలేశ్వరపురం గ్రామాల్లో జరిగింది.సీతారామయ్యగారి మనుమరాలు షూటింగ్ కోనసీమలో జరిగింది. మాధవయ్యగారి మనుమడు మిర్తిపాడు, తొర్రేడు గ్రామాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరిసారిగా అక్కినేని 2013 జనవరి 9న గైట్ కళాశాల వార్షికోత్సవాలకు రాజమండ్రి వచ్చి షెల్టాన్ హోటల్ 614 గదిలో ఉన్నారని ఆయన అభిమాని అడబాల మరిడయ్య తెలిపారు. -
‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!
నేడు అక్కినేని ప్రథమ వర్ధంతి ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం! లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు! గండాలమారి దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు! పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు! ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు! అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా? 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది! అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్కుమార్ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు. అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు. అక్కినేని ఎత్తిపొడుపు! 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు. చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు! -
అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో!
సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని. పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను. షాట్కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు. అంతే. రిహార్సల్లో దంచాను. టేక్లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను! - రావి కొండలరావు సీనియర్ నటుడు, జర్నలిస్ట్ -
అక్కినేని ఆలోచనలు
‘‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’ ‘‘నువ్వు మంచివాడవని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. అది చాలు.. నువ్వు నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.’’ -
పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్
- ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్లో జనవరి 22న మరణించారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్లతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1991లో దాదాసాహెబ్ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది. - ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడే తేదీ (అపాయింటెడ్ డే)గా జూన్ 2ను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 4న నోటిఫికేషన్ జారీ చేసింది. - కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా నిలిచాయి. - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెం ట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పా టుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఫిబ్రవరి 18న ఆమో దం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది. - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్సభ ఆమోదించినందుకు నిరసనగా అప్పటి ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు. - ఆంధ్రప్రదేశ్లో రాష్ర్టపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచేందుకు నిర్ణయించింది. రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973లో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ర్టపతి పాలన విధించారు. - సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోంశాఖ మార్చి 28న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. - ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30 తర్వాత పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 25న నిర్ణయించింది. - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్దన్రెడ్డి (80) హైదరాబాద్లో మే 9న అనారోగ్యంతో మరణించారు. - 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 63 సీట్లతోను, సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీ కూటమి 106 సీట్లతో విజయం సాధించాయి. మే 16న వెలువడిన అసెంబ్లీ ఫలితాలలో టీఆర్ఎస్, టీడీపీలు మెజారిటీ సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించాయి. కాగా సీమాంధ్రలో వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. - తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్గా వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి (టీఆర్ఎస్), డిప్యూటీ స్పీకర్గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. - ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. - బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16న ప్రకటించింది. - ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 281 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిందని జూన్ 10న విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. - ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్గా కోడెల శివ ప్రసాదరావు (టీడీపీ), డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్ధ ప్రసాద్ (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. - అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది. - తెలంగాణ రాష్ట్ర తొలి శాసనమండలి ఛైర్మన్గా స్వామిగౌడ్ (టీఆర్ఎస్) జూలై 2న ఎన్నికయ్యారు. - పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014ను జూలై 11న లోక్సభ, జూలై 14న రాజ్యసభ ఆమోదించాయి. - ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్ సైట్)గా గుర్తించింది. ఈ దిబ్బలు సుమారు 20 వేల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి. - కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కేంద్రం నియ మించింది. దీనికి చైర్మన్ కేంద్ర హోం శాఖ మంత్రి. - తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగస్టు 2న జమ చేసింది. తిరుపతి వచ్చిన ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు 1800 కిలోల బంగారాన్ని తితిదే కార్య నిర్వహణాధికారి ఎం.జి. గోపాల్ అందజేశారు. దీంతో ఇంతపెద్ద మొత్తం బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొదటి సంస్థగా తితిదే రికార్డు సృష్టించింది. - రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 20న 2014-15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి బడ్జెట్ను శాసనసభకు సమర్పించారు. మొత్తం బడ్జెట్: రూ. 1,11,824 కోట్ల్లు. - 2013-14 సామాజిక, ఆర్థిక సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 20న శాసనసభకు సమర్పించింది. ముఖ్యాంశాలు: రాష్ట్ర మొత్తం జనాభా: 4.94 కోట్లు. పురుషులు: 2.47 కోట్లు (50.1 శాతం), మహిళలు: 2.46 కోట్లు(49.9 శాతం), గ్రామీణ జనాభా: 70.42 శాతం. పట్టణ జనాభా: 29.58 శాతం. స్త్రీ, పురుష నిష్పత్తి: 996: 1000, అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా: విజయనగరం (1,019), తలసరి ఆదాయం: రూ.76,041, అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా: విశాఖపట్టణం (రూ.1,13,860), అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా: శ్రీకాకుళం (రూ.53,203). - బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. - ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాపు (81) చెన్నైలో ఆగస్టు 31న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిచిత్రం సాక్షి (1967). 2013లో బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. - ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 27న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు నివేదిక అందించింది. - ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల్లో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. - ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు. - అందరికీ విద్యుత్తు అందించే కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. - వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించే లక్ష్యంతో కిసాన్వాణి సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది. - హుద్ హుద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుద్ హుద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్కు హుద్ హుద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుద్ హుద్ అనేది ఇజ్రాయెల్ జాతీయ పక్షి. - దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ ఏఏ (అఅ) రేటింగ్ సాధించింది. - హైదరాబాద్లో 11వ మెట్రో పొలిస్ సదస్సు అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతివృత్తంతో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. - తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు. - తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర పక్షిగా పాల పిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నవంబరు 17న తెలిపారు. - రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ఇ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్-2014 అవార్డు లభించింది. - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే డిసెంబరు 8న బాధ్యతలు చేపట్టారు. - వికీపీడియా గ్రాంట్కు పశ్చిమగోదావరి జిల్లా పోడూరుకు చెందిన బాసె కాశీవిశ్వనాథ్ ఎంపికయ్యారు. 2015 జనవరిలో ప్రకటించే గ్రాంట్కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వందల ప్రతిపాదనల్లో ఏడింటిని ఎంపిక చేయగా వాటిలో భారత్ నుంచి విశ్వనాథ్ ప్రతిపాదన ఒకటి. - రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తెలుగులో రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఎంపికయ్యారు. - పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది. - రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 22న ఆమోదం తెలిపింది. జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్తో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టం రాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నవంబరు 16న ఆ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. -
ఏఎన్నార్ ఎప్పటికీ బతికే ఉంటారు
అక్కినేని పురస్కారాల సభలో హీరో నాగార్జున సాక్షి, విజయవాడ బ్యూరో: దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఎప్పటికీ మన మనస్సుల్లో బతికే ఉంటారని ప్రముఖ హీరో, ఆయన తనయుడు నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాస్, హీరో నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు సందేశాన్ని కామినేని చదివి వివిపించారు. మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు టి.ప్రసాద్, ప్రిన్సిపాల్ శంకర్ ప్రసంగించారు. ప్రముఖులకు అక్కినేని పురస్కారాలు వివిధ రంగాల్లో విశేషమైన సేవలందిస్తోన్న తొమ్మిది మంది ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు, శాంతాబయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి, ఐఏఎస్ అధికారి సంపత్కుమార్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్, విద్యావేత్త ఎంఎన్ రాజు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకుడు వంశీరామరాజు, నాటక రంగ ప్రముఖుడు జి.గోపాలకృష్ణ, క్రీడారంగంలో వెన్నం జ్యోతి సురేఖలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. -
బాపు,రమణ ధనుస్సు బాణాలు
‘‘బాపు-రమణ ఒకరికొకరు... ఎలాగంటే, ధనుస్సు బాణంలాగా ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేశారు. కష్ట సుఖాలు పంచుకుంటూ స్నేహానికే వన్నె తెచ్చారు. చిత్రకారుడు, రచయితగా వృత్తిని స్వీకరించిన ఈ ఇద్దరు మిత్రులూ జీవితాంతం కలిసి నడిచారు. వీరిద్దరి కలయికతో సాక్షి చిత్రం తెరకెక్కింది. అయితే వీరిద్దరికీ బ్రేక్ ఇచ్చింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బుద్ధిమంతుడు చిత్రమే.’’ చెన్నై, సాక్షి ప్రతినిధి:విభిన్న కళాకారులైన బాపు, రమణ ధనుస్సు బాణాలవలె ఒకరి గెలుపు కోసం ఒకరుగా నిలిచారని ప్రముఖ కథకులు, పాత్రికేయులు శ్రీరమణ (హైదరాబాద్) అభివర్ణించారు. తరతరాల తెలుగు కవిత ధారావాహిక 57వ ప్రసంగ కార్యక్రమాన్ని వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించారు. చెన్నై ఆస్కా హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ‘బాపు రమణ సినిమాలు- సాహిత్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఒకరు చిత్రకారుడు, మరొకరు రచయిత ఎవరి అభిరుచులు వారివిగా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలా జీవితాంతం కలిసి నడిచారన్నారు. గురజాడను అనుక్షణం తలచుకునే వారిద్దరూ కలిసి అద్భుతమైన పాత్ర లు సృష్టించారని చెప్పారు. రమణ సృష్టించిన పాత్రలే ఆయనను గుర్తుంచుకునేలా చేశాయన్నారు. ఫిలాసఫీతో సృష్టించిన అప్పారావు, బుడుగు పాత్రలు నేటికీ సజీవంగా నిలిచిపోయాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో ముత్యాల ముగ్గు ఒక చరిత్రగా మిగిలడం బాపు-రమణల ప్రతిభకు తార్కాణమన్నారు. ఆరు దశాబ్దాల స్నేహంతో వారి సినిమాలు ఒక బ్రాండ్గా నిలిచిపోయాయని తెలిపారు. సినిమా రివ్యూ జర్నలిస్టుగా నిర్మొహమాటంగా విమర్శలు రాసిన రమణను సినిమా పరి శ్రమ ఆహ్వానిస్తే తొలుత నిరాకరించారని చెప్పారు. ఎందుకంటే తనచేత విమర్శలకు గురైన వారు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని వెనకడుగు వేశారన్నారు. ఒక యాడ్ ఏజన్సీలో ఆర్ట్ డెరైక్టర్ అరుున బాపు, రమణతో కలిసి సినిమా తీద్దామన్న నిర్ణయంతో సాక్షి చిత్రం వచ్చిందన్నారు. చిత్రకల్పన బ్యానర్పై అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంలో తీసిన బుద్దిమంతుడు సినిమాతో వారిద్దరికీ బ్రేక్ వచ్చిందని తెలిపారు. సంగీతం, రచనలపై వారిద్దరికీ ఉన్న పట్టు, చక్కటి సినిమా టీమ్, డబ్బులు ఎగవేయరు అనే మంచిపేరును పరిశ్రమలో సంపాదించుకున్నారని తెలిపారు. 60 ఏళ్లుగా సెలబ్రటీలుగా నిలిచారు, తుది శ్వాస వరకు అలాగే నిలిచారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జంట బాపూ-రమణ అన్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలిచారని అన్నారు. దివంగత బాపు సోదరుడు శంకరనారాయణ, కుమారుడు వెంకటరమణ, కుమార్తె భానుమతి, కోడలు భారతి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వక్త శ్రీరమణను ఆస్కా మాజీ అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి చేతుల మీదుగా వేదవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు జేకే రెడ్డి, కందనూరు మధు సత్కరించారు. నగరానికి చెందిన తెలుగు కుటుం బాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
'ముదుర్స్' గా పుట్టి 'మదర్స్' మాట వినని హర్ష
'మనుషుల్ని సృష్టించిన దేవుడే...' అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆఖరు సినిమా 'మనం' లో డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు తన్మయులై విన్నారు. 'బై బర్త్ ముదుర్సగా పుట్టిన వారు మదర్స్ మాటే వినరు, ఇంక అదర్స్ మాట ఎందుకు వింటారు' అంటూ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో నితిన్ గురించి చిలిపిగా పరిచయం చేస్తున్నా అలాగే విన్నారు. 'ఐలవ్ యు అంటే ఇలా ఇవ్వు' అని కొత్తగా రాసినా అబ్బా బాగుందే అనుకున్నారు. ఈ మాటల మాయ వెనుక ఉన్నది హర్షవర్ధన్. నటునిగా చాలాకాలంగా ప్రేక్షకులకు తెలిసినా రచయితగా ఇప్పుడు కొత్త అవతారంలో అందిరినీ అలరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టి విజయనగరంలో చదువుకున్న హర్షవర్ధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో సంభాషించారు. మీది విజయనగరమే కదా..? హర్ష: నేను పుట్టింది రాజాంలో. ఎల్కేజీ నుంచి నాల్గవ తరగతి వరకు విశాఖలో చదువుకున్నా. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరం వరకు విజయనగరంలో చదువుకున్నా. అందుకే విజయనగరం తో బంధం వీడనంతంగా బలపడింది. చాలా వ రకు స్నేహితులు ఇక్కడి వారే. విజయనగరంలో మూడు రోజులుగా గడుపుతున్నారు. ఎలా ఉంది..? హర్ష: అమ్మతో అనుబంధాలు పంచుకున్నా. నా చిన్న నాటి మిత్రులందరినీ కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నె ల 26, 27 తేదీల్లో మళ్లీ విజయనగరం వచ్చి ఆరెండు రోజులు పూర్తిగా నా చిన్ననాటి మిత్రులతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాం. సినీ రంగంలోకి ఎందుకు వెళ్లాలనిపించింది.? మీకు అందులో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? హర్ష: నాకు చిన్న తనం నుంచి సినిమా అంటే పి చ్చి. అందుకే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడిని. డిగ్రీ పూర్తయిన తరువాత సినీరంగంలో ఎవరూ తెలియకున్నా స్నేహితుడి తో కలిసి ఎర్రబస్సెక్కినట్లు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయా.(నవ్వుతూ...) అక్కడ మీ జర్నీ సంగతులు..? హర్ష: అమ్మ, నాన్న కాస్త భయపడ్డారు. నేను మాత్రం పట్టుదలతో ఎలా అయినా రాణించాలనుకున్నా. అయితే సినిమా అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు. అసలు మీరు ఏమి అవుదామని అక్కడికి వెల్లారు..? హర్ష: నా పట్టుదల అంతా ఒక్కటే. మ్యూజిక్ డెరైక్టర్ కావాలని. అయితే అప్పట్లో నాకు కనీసం సంగీతం అంటే అవగాహన ఉంది తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. అందరి లాగానే హైదరాబాద్ వెళ్లగానే అన్ని ఆఫీసులకు తిరిగాను. కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే నన్ను చూసిన వాళ్లంతా నీ కళ్లు, వాయిస్ బాగున్నాయి. యాక్టింగ్ చేయచ్చుగా అని అడిగారు. అయితే మీ తొలి ప్రయత్నం కెమేరా ముందున్న మాట.? హర్ష: ఏదో వచ్చిన తర్వాత నిరాశతో వెనక్కివెళ్లిపోకుండా ఎలా అయినా సినీ రంగంలో సిర్థపడాలనుకున్నా. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ముందుగా రుతురాగాలు సీరియల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వందేమాతరం సీరియల్ ముందు టెలికాస్ట్ అయిందనుకోండి. మీరు తొలుతగా గుర్తింపు తెచ్చుకున్న సందర్బం..? హర్ష: అమృతం సీరియల్. ఆ సీరియల్ నాకు తొలి మెట్టు వంటిది. మీరు కథలు రాస్తుంటారా..? హర్ష: విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాకు. అందులో హీరో నరేష్, రాజీవ్ కనకాల నటించారు. అందులో సగభాగమే నా పాత్ర ఉంది. మీరు చేసిన సినిమాల్లో ఇష్టమైనవి..? హర్ష: నటన పరంగా లీడర్. క్యారెక్టర్ పరంగా స్టాలిన్ సినిమాలో చేసిన పాత్ర. 55 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవితో గడిపడటం ఎంతో అనుభూతినిచ్చింది. సెట్లో ఆయన నేను మాత్రమే ఉండేవారం. నేను పుట్టిన ఊరు, పెరిగి పెద్దయిన పరిస్థితులు అన్ని ఆయనకు వివరించా. మీకు బాగా గుర్తింపు వచ్చిన సందర్భం..? హర్ష: గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ని. అప్పటి వరకు నేను ఏ మాటలు, కథలు రాయాలన్నా సేఫ్జోన్లోనే ఉంటూ నా పని చేసేవాడ్ని. అయితే ఆ సినిమా నా సినీ జీవితంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో రిస్క్తో (డూ అర్ డై) అన్న చందంగా ఆ సినిమా చేశాం. చివరికి మంచి ఫలితం లభించింది. మీకు నచ్చిన తారలు..? హర్ష: అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఓ వైవిధ్యం ఉంటుంది. మీరు సినీరంగంలో రాణించేందుకు ఎవరైనా సహాయం చేశారా..? హర్ష: నాకు ప్రేక్షకులే వెన్నుదన్ను. మొదటిలో చిన్న చిన్న రోల్స్ (అంటే ఆ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్లిపోయేదో తెలియనవి) కూడాచేశా. మీరు పుట్టి పెరిగిన ఊరిలో సన్మానం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది..? హర్ష: అసలు నాకు సన్మానాలంటేనే ఇష్టం ఉండదు. మొన్న రోటరీ వాళ్లు ఇచ్చింది పురస్కారం. ఆ విషయం ఇక్కడకు వచ్చేంత వరకు తెలియదు. సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగారు.. మీ అనుభూతి..? హర్ష: ఈ రంగంలో రాణించాలంటే అదృష్టం ఉండాలి. నా కన్నా బాగా నటించి గలిగే వారు, నటన అంటే ప్రాణం పెట్టేవారు, అందగాళ్లు చా లా మంది ఉన్నా వారికి అవకాశాలు దక్కని పరి స్థితి. అలా అని కాస్త యావరేజ్గా ఉన్నా నా కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారు లేకపోలేదు. మనం సినిమాకి మాటలు రాశారు. ఆ సినిమా గురించి కాస్త...? హర్ష: తప్పకుండా... నేను చిన్నపుడు మాయాబజార్ సినిమా చూశా. అప్పట్లో ఆడియో టేపులు ఉండేవి. మా ఇంట్లో ప్రతి రోజు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన డైలాగులు వింటుండేవాడిని, ఒక రోజు ఇంట్లో వారి ముందే 90 నిమిషాలు పాటు అందులో డైలాగులు చెప్పేశా. అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సినిమాయే నాకు మాటలు నేర్పింది. ఆ సినిమాలో హీరో నటించిన ఏఎన్ఆర్ చివరి చిత్రానికి మాట లు రాయటం పూర్వజన్మ సుకృతం. నా కోసమే ఆయన అన్నాళ్లు జీవించి ఉన్నారేమో అనిపించింది. నేను సమకూర్చిన మాటలనే ఆయన పలికారు. ఎంతో అనందమనిపించింది. జీవితంలో మీ లక్ష్యాలు ..? హర్ష: సినిమా రంగంలో అయితే ఏమీ లేవు. ప్రస్తుతం జరుగుతున్నదంతా నాకు బోనస్. పర్సనల్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కోటి మొక్కలు నాటాలని ఉంది. 1000 మంది అ నాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించాలని ఉంది. లేటెస్ట్గా మీరు మాటలు రాసిన సినిమా? హర్ష: వస్తుంది.. గురువారం ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. -
రియల్ హీరో అక్కినేని: రోశయ్య
సాక్షి, సిటీబ్యూరో: అత్యంత ప్రజాభిమానం చూరగొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రియల్ హీరో అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కొనియాడారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కినేని 91వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి మాట్లాడుతూ గొప్ప కారణజన్ముడు అక్కినేని అని తెలిపారు. అక్కినేని- కిన్నెర పురస్కారాన్ని గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా సాహితీ వేత్త, రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశానికి అందజేశారు. ఎస్వీ రామారావు రూపొందించిన ‘అక్కినేని జైత్రయాత్ర’ లఘు చిత్ర ప్రదర్శన, ప్రముఖ గాయకుడు ఆర్. సంపత్ బృందం నిర్వహించిన అక్కినేని చిత్ర సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకుంది. రఘురామ్ రచించిన‘అక్కినేని అభిమానిగా..’ గ్రంథాన్ని గవర్నర్ రోశయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవో డాక్టర్ పి. మధుసూదనరావు, సారిపల్లి కొండలరావు, సమత గోపాల్, సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు, కిన్నెర సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాలి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని లాంటి నటుడు మరోసారి జన్మించరు
అక్కినేని జయంత్యుత్సవాల్లో మేయర్ స్వరూప అనంతపురం కల్చరల్ : నటనకే ఓనమాలు నేర్పిన అక్కినేని వంటి నటుడు మళ్లీ పుట్టరని, ఆయన లేనిలోటు తెలుగు చలనచిత్రానికి తీరనిదని మేయర్ స్వరూప, అనంత కళావాహిని సంస్థ వ్యవస్థాపకుడు వరం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక కృష్ణకళామందిరంలో అక్కినేని జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో అక్కినేని చలన చిత్రాల సమాచారంతో కూడిన వాఖ్యానం చేసిన రమేష్ యాంకరింగ్ అందరినీ ఆకట్టుకుంది. త్యాగరాయ సంగీత సభ నిర్వాహకుడు జ్ఞానేశ్వరరావు, అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు, బళ్లారి రాఘవ అవార్డు గ్రహీత మల్లేశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ అక్కినేనితో తమ అనుబంధాన్ని వివరించారు. దేవదాసు, కాళిదాసు, క్షేత్రయ్య ప్రేమనగర్, మేఘసందేశం వంటి చిత్రాలు భారతీయ సినీ వినీలాకాశంలో మెరిసే తారలన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినీ దిగ్గజాల జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్న వరం వెంకటేశ్వర్లను అభినందించారు. అనంత కళావాహిని సభ్యులు వరప్రసాద్, శ్రీకాంత్, మేడా సుబ్రమణ్యం, మహీధర్, రంగస్థల కళాకారుడు కోటి మల్లేశ్, డాన్స్మాస్టర్లు మక్బుల్, విష్ణు పాల్గొన్నారు. అలరించిన అక్కినేని డూప్ సమావేశంలో అక్కినేని డూప్గా అనేక చిత్రాల్లో నటించిన కృష్ణారావు ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. పలు వినోదకర సన్నివేశాలను అక్కినేనిని అనుకరిస్తూ చేసిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా శాస్త్రీయ నృత్యకళాకారిణి టీకే భవ్య అద్భుత నాట్యాలతో ఆకట్టుకుంది. -
‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రస్థాయి నటుల్లో దివంగత సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకరని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో రసమయి నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేనికి నీరాజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ... తెలుగు భాష, సినీరంగం ఉన్నంత వరకు అక్కినేని ఉంటారన్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని ముఖానికి తప్ప ఆయన మనసుకు మడతలు లేవు అని కొనియాడారు. సినీనటుడు కృష్ణ మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలోకి రావటానికి కారణం అక్కినేని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టి.సుబ్బరామిరెడ్డి, నటి విజయనిర్మల, రసమయి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కె.రాము పాల్గొన్నారు. -
కథ కంచికి వెళ్లిపోయింది.. చరిత్ర మాత్రం మిగిలింది!
ఏయన్నార్ జయంతి స్పెషల్ సుమారు 60 మంది హీరోయిన్లతో స్టెప్పులేసి, డ్యూయెట్లు పాడి, రొమాన్స్ చేసి, ఆ రోజుల్లో ఓ కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని కలలోకి ఏ హీరోయిన్ రాలేదా? ఇదే మాట ఆయన్నే నేరుగా అడిగితే ‘ఎందుకు రాలేదు... వచ్చింది... కాకపోతే ఆమె హీరోయిన్ కాదు’ అని అన్నారాయన. హీరోయిన్ కాకపోతే ఇంకెవరయి ఉంటారు? మనసుకి నచ్చిన ప్రతి వారితో ఎంతో చనువుగా ఉంటారాయన. అలాంటిది ఆయన కలల్లోకి చొరబడే ఆ డ్రీమ్గర్ల్ ఎవరై ఉంటారు? ‘అమ్మో... నేన్చెప్పనుగాక చెప్పను’ అంటూ ఓ రెండు మూడు రోజులు బతిమాలించుకుని ఆ రహస్యాన్ని బయటపెట్టారాయన - ‘సూర్యకాంతం’ అని. ఈ మాట ఎవరు విన్నా ఆశ్చర్యపోతారు. ఆయన మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటారు. కానీ ఇది నిజం. ‘భార్యాభర్తలు’ షూటింగ్లో... ఓ సీన్లో ఆవిడ అద్దం ముందు కూచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. ఆవిడ వెనక సోఫాలో నేను కూచొని ఉన్నాను. లావుగా ఉన్నా కళ గల ముఖం అనుకున్నాను. అంతే... అదే సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అయిపోయిందనుకుంటాను... అదే రోజు రాత్రి ఆవిడ కల్లోకొచ్చింది. ‘ఏ.. ఏ.. ఏ..’ అంటూ పెద్ద అరుపుతో లేచి కూచున్నాను. ‘‘ఏంటండీ... ఏమయ్యింది... ఎప్పుడూ ఇలా నిద్దట్లో అరవలేదు?’’ అంటూ అడిగింది అన్నపూర్ణ. ‘‘సూర్యకాంతం కల్లోకొచ్చింది’’ అని చెప్పాను. అంత అర్ధరాత్రిలోనూ మా ఆవిడ ఒకటే నవ్వు ‘‘ఏ సావిత్రో, జమునో, కృష్ణకుమారో రాకుండా సూర్యకాంతం ఏమిటండీ మరీనూ?’’ అంటూ. ‘‘ఈ ఎక్స్పీరియెన్స్ నేను షూట్ చేసుకుంటాను’’ అని అడిగాను. ‘‘వద్దు... పెద్దావిడ... బావుండదు... పైగా ఆవిడ నన్ను ‘తమ్ముడూ’ అని అంటుంది. పత్రికల్లోకైతే ఓకే గానీ విజువల్గా వద్దు. పాఠకులు అర్థం చేసుకోగలరు గానీ ప్రేక్షకులు వాళ్లలా ఆలోచించలేరు’’ అని అన్నారు. అంత క్లియర్ కన్విక్షన్ ఉన్న వ్యక్తి ఆయన. అలానే కమిట్మెంట్ విషయంలో కూడా అటువంటి వ్యక్తిత్వం మరొకరిలో కనబడదు. ‘మా టీవీ’ కోసం చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ షూటింగ్ టైమ్లో ‘ఆయనొస్తే కూచోబెట్టండి’ అని ఓ కుర్చీ వేయించి, పక్కన ఇంకేమైనా మంచి లొకేషన్లు ఉన్నాయా అని చూడడానికి వెళ్లి వచ్చేలోగా ఆయనొచ్చి కూచునేవారు. నేను రాగానే లేచి నిలబడేవారు. ‘‘మీకన్నా దాదాపు ముఫ్ఫై ఏళ్ళు చిన్నవాణ్ణి సార్...’’ అని సిగ్గుపడిపోతుంటే ‘‘ఇక్కడ మీరు డెరైక్టరు... నేను మిమ్మల్ని గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది’’ అనేవారు అక్కినేని. షూటింగ్ ముగియగానే ‘‘మళ్లీ ఎప్పుడుండొచ్చు?’’ అని అడిగేవారు. ‘‘రెండు రోజుల ముందు నుంచీ ఎర్లీగా పడుకోవాలి. షూటింగ్ టైమ్లో ముఖం ఫ్రెష్గా కనిపించాలి కదా!?’’ అనేవారు. అంత బాధ్యత ఫీలయ్యే నటీనటులు ఇవాళ ఎంతమంది ఉండి ఉంటారు? అంతవరకూ మనల్ని పేరు పెట్టి పిలిచే అక్కినేని ఒకసారి షూటింగ్ టైమ్ గనుక ఫిక్స్ అయితే ఇంక ఆయన నుంచి వచ్చేది ‘ఓకే సర్’ అనే. ఆ ‘సర్’ అనే పదం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఉంటుంది. ప్యాకప్ అయిన వెంటనే మాయమైపోతుంది. మనల్ని మన పేరుతోనే పిలుస్తారు. మనసుకి, మెదడుకి ఎంతో శిక్షణ ఇస్తేనే గాని ఇంతటి క్రమశిక్షణ సాధ్యం కాదు. చాలా విషయాలు నాతో పంచుకునే వారాయన. ‘‘సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు వీలైతే ఓసారి రండి’’ అని ఫోన్ చేసేవారు. కారప్పూస, టీ ఆయన ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. వెళ్లేసరికి ఇద్దరికి రెడీగా ఉండేది. ఇక కబుర్లే కబుర్లు. ‘‘కొన్ని పాత్రలు నేను వెయ్యకపోతే అవి ఎందుకు వెయ్యటం లేదో, వాటి గురించి ఎన్టీఆర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాణ్ణి. ఎందుకంటే తర్వాత అప్రోచ్ అయ్యేది ఆయన్నే కాబట్టి’’ అని చెప్పారు ఏయన్నార్. ‘గుర్తుకొస్తున్నాయి’ తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించాల్సి వచ్చేది. ఉదాహరణకి ‘పూజాఫలం’ సినిమాలో ఆయన పక్కన వేసింది జగ్గయ్య అని నేనూ, కాదు రమణమూర్తి అని ఆయనా వాదించుకున్నాం. ఒక్క క్షణం ఆలోచించి ‘‘వద్దు... మీ వెర్షనే కానివ్వండి. యూ ఆర్ ది కెప్టెన్’’ అని మనస్ఫూర్తిగా నేననుకున్న వెర్షన్కే తన అనుభవాల్ని చెప్పారు. మర్నాడు సరిగా ఉదయం 6 గంటలకి... ఏయన్నార్ గారి దగ్గర్నుంచి ఫోన్... ‘‘మీరే కరెక్ట్. ‘పూజాఫలం’లో నా పక్కన యాక్ట్ చేసింది జగ్గయ్యే. మరి రమణమూర్తి అని ఎలా పొరబడ్డానో ఏమిటో?’’ అంటే, ‘‘ఐయామ్ సారీ... షూటింగ్ టైమ్లో నేను మీతో అలా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది కాదు’’ అని ఆయన అంటూంటే ఆ సంస్కారం ముందు అంగుష్ఠమాత్రుణ్ణయిపోయా. నేనేది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కఠి నంగా తీసుకున్న నిర్ణయాలు కూడా నా మీద అభిమానంతో సడలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి - ఇక జీవితంలో అడుగు పెట్టనన్న సారథీ స్టూడియోస్లో దాదాపు ముప్ఫై ఏళ్ల తర్వాత తిరిగి అడుగు పెట్టడం. నేను జీవితాంతం గర్వంగా చెప్పుకోగలిగిన సంఘటన అది. ‘గుర్తుకొస్తున్నాయి’ 74 ఎపిసోడ్లు. తెరపై ఏయన్నార్, సుమ తప్ప ఇంకెవరూ కనిపించరు. 74 ఎపిసోడ్లు తెరపై కేవలం ఇద్దరే... టెలివిజన్ చరిత్రలో అదొక రికార్డ్. ‘నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు గుండెల్లో దాచుకున్న రహస్యాలతో సహా అన్నీ కవర్ చేసేశారు మీరు. ఈ వయసులో కూడా నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని ప్రేక్షకులకి రుజువు చేశారు. నా ఆనందం కొద్దీ ఇస్తున్నాను. కాదనకండి’’ అంటూ ఓ చెక్ ఇచ్చారాయన. ‘నా ఉద్యోగ ధర్మంగా నాకెంతో ఇష్టమైన మీ గురించి చేశాను. నేనిలా తీసుకోకూడదు’’ అన్నాను. దానికాయన ఎంత మురిసిపోయారో - ‘ఐ లైక్ యువర్ క్యారెక్టర్’ అంటూ అంతటితో ఊరుకోలేదు. నేను పని చేసిన ‘మా టీవీ’ యాజమాన్యాన్ని ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని, డబ్బుగా ఉంటే ఖర్చయిపోతుందని ఓ బంగారు కంకణం చేయించి ఆయనకు చూపించాను. ‘‘మంచి పని చేశారు. ఉంచండి. ఎప్పటికైనా ఆ కంకణాన్ని నేను మీకు తొడుగుతాను’’ అని అన్నారు అక్కినేని. ఇవాళ... కథ కంచికి వెళ్లిపోయింది... చరిత్ర మాత్రం మిగిలింది... బంగారంలాంటి ఆయనే లేరు. ఆ బంగారు కంకణం మాత్రం ఆయన తొడగకుండానే మిగిలిపోయింది ఆయన గుర్తుగా...!! - రాజా, మ్యూజికాలజిస్ట్, raja.musicologist@gmail.com -
అక్కినేని పేరుతో అవార్డులివ్వాలి
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకుఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి సాక్షి, సిటీబ్యూరో: దివంగత మహానటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిటఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలని ఎంపీ, నటుడు మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో యువ కళావాహిని ఆధ్వర్యంలో ఎస్. కొండలరావు సారథ్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ నేతృత్వంలో నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మహానటుడు అక్కినేని 91వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల ప్రారంభోత్సవంలో మురళీ మోహన్ మాట్లాడుతూ ఈ విషయమై సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు ఆలోచించాలని కోరారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహానటులు అక్కినేని, ఎన్టీఆర్లు గుర్తుండి పోతారని అన్నారు. నాటక రచయిత డీఎస్ దీక్షిత్లు మాట్లాడుతూ ఏటా నిర్వహించే ఈ నాటిక పోటీల ప్రారంభ, ముగింపు సభలకు వారి వారసులు నాగసుశీల, నాగార్జునలు తప్పక హాజరు కావాలని కోరారు. అంతకుముందు అక్కినేని చిత్రపటానికి ఎంపీ మురళీమోహన్ పూలమాల వేశారు. ఏఎన్ఆర్ నాటక కళాపరిషత్ను అక్కినేని కుమార్తె నాగసుశీల ప్రారంభించారు. అనంతరం కళాకారులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (ఆకాశవాణి), జి.ఎల్.ఎన్.మూర్తి(థియేటర్ క్రిటిక్), జర్నలిస్టులు మహమ్మద్ రఫీ, పి.అబ్బులు, వి.రాజశేఖర్(దూరదర్శన్), డి.సురేష్ కుమార్, రాధాప్రశాంతి (సినీ నటి), ఎన్.రవికుమార్ తదితరులకు డాక్టర్ అక్కినేని నాటక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, సినీ నటి గీతాంజలి, నటులు ఎల్.బి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ, నచ్చావోయ్ నారాయణ అనే నాటికలను ప్రదర్శించారు. -
నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు!
చిరు ప్రాయంలోనే స్వర ప్రయాణం మొదలుపెట్టి దశాబ్ద కాలంగా తన గానంతో శ్రోతల్ని తన్మయానికి గురిచేస్తున్నారు ప్రణవి. గాయనిగా, అనువాద కళాకారిణిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న ప్రణవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రణవితో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ. ప్రస్తుతం ఏ ఏ సినిమాలకు పాడుతున్నారు? ముందే చెప్పేయకూడదు. ఎందుకంటే... విడుదలయ్యేంత వరకూ మేం పాడిన పాట అందులో ఉంటుందో లేదో చెప్పలేం. పరిస్థితులను బట్టి ఏమైనా జరగొచ్చు. అందుకే.. మంచి సినిమాలకే పాడుతున్నాను అని మాత్రం చెప్పగలను. ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటే... ఇక్కడ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఒకసారి రికార్డ్ చేసిన పాటను ఆల్బమ్ నుంచి తప్పించడానికి ఎన్నో కారణాలుంటాయి. సరే... గాయనిగా మీకు దక్కిన గొప్ప ప్రశంస? నేటి జనరేషన్లో ప్రణవి పాటంటే నాకిష్టం అని ఓ సందర్భంలో కీరవాణి అన్నారు. అలాగే... చిత్రగారు కూడా నా పాటను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. అక్కినేని జాతీయ అవార్డు అందుకోవడానికి లతా మంగేష్కర్గారు ఇక్కడకు వచ్చినపుడు, ఆమె ముందు పాడే అవకాశం నాకు వచ్చింది. నా పాట విని లతాజీ ‘బహుత్ అచ్చాహై’ అని మెచ్చుకున్నారు. అసలు గానం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? మా అమ్మ వీణ వాయిస్తారు. పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. నాకు స్వరజ్ఞానం అమ్మ నుంచే అబ్బింది. నాన్న తెలుగు టీచర్. అలాగే... మంచి కళాకారుడు కూడా. బాపుగారి వద్ద కూడా పనిచేశారు. వీరిద్దరే నా తొలి గురువులు. నాలోని స్వరజ్ఞానం గమనించి... వారే నాకు సంగీతం నేర్పించారు. తొలి అవకాశం ఎలా వచ్చింది? నేను తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుని. ఇప్పటికి మూడొందల సినిమాల పైచిలుకు డబ్బింగ్ చెప్పాను. సినిమాల్లో చైల్డ్ కారెక్టర్లకు చెప్పేదాన్ని. ‘అతడు’ సినిమాలో త్రిష ఫ్రెండ్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ‘నేను పార్దూ.. నీ పద్దూని’ అనే డైలాగ్ నేను చెప్పిందే. చిన్న డైలాగే అయినా... అది చాలా పాపులర్. అలాగే కళంకిత, అంతరంగాలు, శివలీలలు తదితర సీరియల్స్లో కూడా కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. కెమెరామేన్ సంతోష్శివన్గారు హిందీ, తెలుగు భాషల్లో తీసిన ‘హలో’ సినిమా తెలుగు వెర్షన్కి తొలిసారి పాడాను. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. ఆ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్యగారి ద్వారా కల్యాణ్మాలిక్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ‘ఆంధ్రుడు’ సినిమాలో ఓ శ్లోకం పాడాను. పేరు తెచ్చిన పాటలు? ‘ఛత్రపతి’ సినిమా కోసం నాతో హమ్మింగ్స్ పాడిం చారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయనే... ‘శ్రీరామదాసు’ సినిమా కోసం ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాట ట్రాక్ పాడించారు. ఆ పాట శ్రేయాఘోషల్ పాడాలి. కానీ నా పాట నచ్చి ఉంచేశారు. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. ఇంకా ‘యమదొంగ’లోని ‘రబ్బరు గాజులు’, ‘యంగ్ యమ’, ‘నువ్వు ముట్టుకుంటేనే’ పాటలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కీరవాణిగారు నాకందించిన ప్రోత్సాహం నిజంగా చాలా గొప్పది. మరి ఆర్టిస్టుగా ఎందుకు ప్రయత్నించలేదు? చిన్నప్పుడు ‘హిట్లర్’ సినిమాలో నటించాను. కొన్ని ప్రైవేటు యాడ్స్లో కూడా చేశాను. అయితే.. మా ఇంట్లో ఎవరికీ నటనపై ఆసక్తి లేదు. అందుకే అటువైపు చూడలేదు. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? దానికి టైమ్ ఉంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయితోనే తాళి కట్టించుకుంటా. -
దేవదాసు అయ్యేదెవరు?
-
అక్కినేనికి కమల్ వాయిస్?
దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వ నాయకుడు కమలహాసన్ వాయిస్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్లో ఆసక్తికరమైన అంశం ఇదే. అక్కనేనికి కమల్ వాయిస్ అవసరమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏఎన్ఆర్ చివరి చిత్రం మనం ఏఎన్ఆర్తో పాటు ఆయన కొడుకు, ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కొడుకు యువ నటుడు నాగచైతన్య కలసి నటించిన చిత్రం మనం. శ్రీయ, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిం ది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలోకి అనువాదం కానుంది. తమిళంలో అక్కినేని పాత్రకు కమలహాసన్తో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అదే విధంగా నాగార్జున పాత్రకు నటుడు మాధవన్ డబ్బింగ్ చెబితే బాగుంటుందనుకుంటున్నట్లు సమాచారం. కమలహాసన్కు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా గౌరవం. ఆయన ఇటీవల మనం చిత్రం చూసి చాలా గొప్ప చిత్రం అంటూ ప్రశంసించడంతో పాటు ఏఎన్ఆర్ తన మానసిక గురువు అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఆయనకే వాయిస్ ఇచ్చే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయం. మరి కమల్ ఏఎన్ఆర్గా పాత్రకు డబ్బింగ్ చెబితే మనం చిత్రానికి అది మరింత ప్రత్యేక అంశంగా నిలిచిపోతుంది. మరో విషయం ఏమిటంటే మనం చిత్రం తెలుగు వెర్షన్ ఇప్పటికీ చైన్నైలోని ప్రముఖ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. -
అఖిల్ నాకు పోటీ అవుతాడు..అవ్వాలి కూడా : నాగ చైతన్య
‘‘నిజంగా ‘మనం’ సినిమా తాతయ్యకు ఘనమైన నివాళి. అవార్డుల కోసమో, రివార్డుల కోసమో మేమీ సినిమా చేయలేదు. తాతయ్య చివరి సినిమా అక్కినేని వంశాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తలంపుతో ఈ సినిమా చేశాం. అమెరికాలో అయితే.. ఇప్పటికే మిలియన్ (పది లక్షల) డాలర్ల వసూళ్లు వచ్చాయి. మా కుటుంబ హీరోల చిత్రాల్లో ఇంతటి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే’’ అని నాగ చైతన్య సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు. మీ తాతయ్యతో, మీ నాన్నతో తొలిసారి కలిసి నటించారు కదా. ఆ అనుభూతి ఎలా ఉంది? నాకు వంద ఫ్లాపులొచ్చినా, వంద విజయాలొచ్చినా.. ‘మనం’ మాత్రం నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. తాతయ్యతో నటించే భాగ్యం ఈ సినిమాతో నాకు దక్కింది. ఆ మధుర క్షణాలు నా గుండెలో నిలిచిపోతాయి. భవిష్యత్తులో నా ఉన్నతికి అవి మరింత దోహదం చేస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడానికి తడబడుతూనే ఉన్నాను. తలబిరుసుగా నటించాలి, తాగుబోతుగా నటించాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో తాతయ్యను ‘ముసలోడా’ అని సంబోధించడానికి ఇబ్బంది పడ్డా. తాతయ్య, నాన్న నా రోల్ మోడల్స్. వారి ముందు అలా నటించడం చాలా కష్టంగా అనిపించింది. కానీ వారిద్దరి సహకారం అద్భుతం. పవన్కల్యాణ్కి ‘ఖుషి’, మహేశ్కి ‘ఒక్కడు’, ఎన్టీఆర్కి ‘సింహాద్రి’, బన్నీకి ‘దేశముదురు’... మీకేమో ‘మనం’... ఇలా స్టార్ హీరోలందరికీ ఏడో సినిమా బ్రేక్ ఇచ్చింది. మీరేమంటారు? అది యాదృచ్ఛికమే. నాక్కూడా అదే రిపీట్ అవ్వడం ఆనందంగా ఉంది. తాత ‘మూగ మనసులు’, నాన్న ‘జానకిరాముడు’, మీరేమో ‘మనం’... ముగ్గురూ పునర్జన్మల నేపథ్యంతో కూడిన సినిమాలు చేయడం కూడా యాదృచ్ఛికమే కదా! అవును... అది కూడా కావాలని చేసిందేం కాదు. అయితే.. ‘మనం’ చేశాక పునర్జన్మ విషయంలో కొంత నిజం ఉందనిపిస్తోంది. గత జన్మలో తీరని కోర్కెలు ఏమైనా ఉంటే...మళ్లీ పుట్టి ఆ కోర్కెలను తీర్చుకుంటారని కొన్ని కథలు కూడా వెలువడ్డాయి. ప్రయోగాల్నిమన హీరోలు దరిచేరనీయరు. ఓ హీరోగా ఈ విషయంపై మీ దృక్కోణం ఏంటి? నా మైండ్సెట్లో కొంత మార్పు వచ్చిందండీ. ప్రయోగాల్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సరైన కథ, కథనాలు, ఆసక్తిని గొలిపే అంశాలు, పుష్కలంగా వినోదం ఉంటే.. ప్రయోగాలు కూడా సఫలం అవుతాయని ‘మనం’ రుజువు చేసింది. ఇక నుంచి కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉంది. కెరీర్ మొదట్లో తాతయ్య, నాన్న కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. పాత్రల పరంగా కూడా భిన్నంగా వెళ్ళారు. వారితో పోల్చి చూస్తే... నేను జీరో. కెరీర్ మొదట్లో నేను కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశా. ఇక నుంచి వారి దారిలోనే పయనించాలని నిర్ణయించుకున్నాను. ‘ఆటోనగర్ సూర్య’ సంగతేంటి? ఆ సినిమా జాప్యం విషయంలో నా ప్రమేయం లేదు. కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. అయితే... ఒకటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే. మీరు చేస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మీరే చూసుకుంటున్నారట? సినీ నిర్మాణంలో కూడా అనుభవం అవసరమని నాన్న చెప్పారు. అందుకే.. ఆ సినిమా ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నా. టాకీ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తున్నాం. జూలై లేదా ఆగస్ట్లో విడుదల చేస్తాం. భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని కూడా ఉంది. ‘మనం’లో అఖిల్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటున్నారు అందరూ. మరి, మీ అభిప్రాయం ఏమిటి? నిజమే.. అఖిల్ ఎంట్రీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిజానికి స్క్రిప్ట్ టైమ్లో ఆ సీన్ లేదు. అఖిల్ కూడా ఉంటే బావుంటుందని విక్రమ్కుమార్ అనడంతో అందరం ‘ఓకే’ చేశాం. కథలో ఆ సీన్కి మంచి ప్రాముఖ్యత ఉంది. మా అందర్నీ అఖిలే రక్షిస్తాడు. నిజంగా తనకు అది గ్రేట్ ఇంట్రడక్షన్. అలాంటి పరిచయం లభించడం చాలా లక్కీ అని నేనే అఖిల్తో చెప్పా. అంటే భవిష్యత్తులో అఖిల్ మీకు పోటీ అవ్వబోతున్నాడన్నమాట? అవుతాడండీ... ఎందుకవడు? అవ్వాలి కూడా. అసలు సినిమా అంటేనే పోటీ. అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. మీరన్నట్టు మా కుటుంబంలోనే నాకు కావాల్సినంత పోటీ ఉంది. కెరీర్ విషయంలో అఖిల్కు ఏమైనా సలహాలిస్తుంటారా? నేను సలహాలివ్వడం కాదు, తనే నాకు సలహాలిస్తుంటాడు (నవ్వుతూ). సుధీర్వర్మ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు? జూలైలో మొదలవుతుంది. కొత్త పంథాలో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అది. సుధీర్ ‘స్వామి రారా’ సినిమా నాకు నచ్చింది. అదే పంథాలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. -
'మనం'కు మంచి స్పందన
చెన్నై: అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేణా పుంజుకుంటున్నాయి. శుక్రవారం విడుదలైన మనం చిత్రం తొలి రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 4.02 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. విదేశాల్లో ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో 1.17 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. నాగేశ్వరరావు కుమారుడు, యువ సామ్రాట్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. కాగా కేన్సర్తో బాధపడ్డ నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు ముందే మరణించిన సంగతి తెలిసిందే. -
సినిమా రివ్యూ: మనం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల్లో 'మనం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు జనరేషన్ లు తెరపై కనిపించడం అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ లాంటి అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే చిత్రంలో నటించడం అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ తోపాటు ప్రోమోలతో సగటు సినీ ప్రేక్షకుడికి చేరువైన 'మనం' చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే. అర్ధాంతరంగా చనిపోయిన రెండు జంటలు (రాధామోహన్ & కృష్ణవేణి, సీతారాం &రామ లక్ష్మి) మళ్లీ జన్మించడమే మనం చిత్ర కథ. రెండు జంటలను కలుపడానికి వారి కుమారులు చేసిన ప్రయత్నానికి తెర రూపమే 'మనం' చిత్రం. సీతారాం, నాగేశ్వరరావు పాత్రల్లో అక్కినేని నాగార్జున, రాధామోహన్, నాగార్జునగా నాగ చైతన్య, కృష్ణవేణి, ప్రియగా సమంత, రామలక్ష్మి, అంజలి పాత్రల్లో శ్రీయలు, నాగ చైతన్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావులు నటించారు. కథ: నాగార్జున ఓ బిజినెస్ మాగ్నెట్. అతి చిన్న వయస్సులోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన వ్యాపారవేత్త. అనుకోకుండా నాగచైతన్య, సమంతలను కలుసుకుంటాడు. నాగచైతన్య, సమంతలను చూడగానే తన చిన్నతనంలో చనిపోయిన తల్లి, తండ్రులు (రాధా మోహన్, కృష్ణవేణి) మళ్లీ పుట్టారు అని నిర్థారించుకుంటాడు. నాగచైతన్య, సమంతల రూపంలో ఉన్న తన తల్లితండ్రులను కలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నసమయంలో ఓ యాక్సిడెంట్ కు గురైన అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున రక్తాన్ని ఇచ్చి కాపాడుతాడు. ఈ ఘటనలో శ్రియను కలుసుకుంటాడు. అయితే ఆస్పత్రిలో నాగార్జున, శ్రియలను చూసిన నాగేశ్వరరావు.. తన పసితనంలో పొగొట్టుకున్న తల్లితండ్రులు(రామలక్ష్మి, సీతారాం)లుగా గుర్తిస్తాడు. నాగార్జున, శ్రియలను కలుపడానికి నాగేశ్వరరావు, నాగ చైతన్య, సమంతలను కలుపడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తారు. నాగార్జున, నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా?, నాగ చైతన్య, సమంతలు పూర్వజన్మ గురించి తెలుసుకుంటారా? నాగార్జున, శ్రియలు ఒక్కటవుతారా? తమ నాగార్జున, శ్రియలను కలపడానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానమే 'మనం' చిత్ర కథ. నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకే చిత్రంలో రెండు జనరేషన్లకు చెందిన పాత్రలను పోషించడంలో జట్టుగా అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నలుగురు హీరోహీరోయిన్లు పాత్రలకు జీవం పోశారు. సమంతను అమ్మ అంటూ, నాగ చైతన్యను నాన్న అంటూ పిలుస్తూ నాగార్జున ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రేక్షకులను మెప్పించారు కూడా. ముఖ్యంగా నాగేశ్వరరావు పాత్రలో నాగార్జున నటించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ లో అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో ఓ అనుభూతిని కలిగించాడు. రెండవ భాగం ప్రారంభమైన దగ్గర నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిలో అక్కినేని నాగేశ్వరరావు చేరువవ్వడంతోపాటు చక్కటి ఫీలింగ్ ను నింపారు. ఇక నాగచైతన్య తన వయస్సుకు మించిన ఓ బరువైన పాత్రలో కనిపించడమే కాకుండా రెండు పాత్రలకు తగినట్టుగా పరిణతిని ప్రదర్శించాడు. సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ఆలీ, బ్రహ్మనందం, సప్తగిరి కామెడీతో ఆలరించారు. ముఖ్యంగా ఈ చిత్ర కథను రూపొందించిన విక్రమ్ కే కుమార్ కే క్రెడిట్ దక్కుతుంది. మనం చిత్రంలో అక్కినేని వంశంలోని నాగేశ్వరరావు, నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ లకు తగినట్టుగా కథను రూపొంది.. చాలా ఒద్దికగా, కథపై నియంత్రణతో.. చిత్రాన్నిమలిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. రెండు పునర్జన్మ కథలను చక్కగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆలరింప చేయడంలో విక్రమ్ కుమార్ సఫలమయ్యారు. వివిధ జనరేషన్లకు తగినట్టుగా ఓ మూడ్ ను క్రియేట్ చేయడంలో కెమెరామెన్ పీఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ లు ప్రధాన పాత్రలు పో్షించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అనూప్ రూబెన్ అందించిన అందర్ని పాటలు ఆకట్టుకున్నాయి. వందేళ్ల సినిమా చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల సినీ జీవితంతో ప్రేక్షకుడికి విభిన్నమైన పాత్రలతో ఆలరించి, ఆకట్టుకుని తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు 'మనం' చిత్రం గొప్ప నివాళి. -
నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు
లక్కీ గాళ్ ఆఫ్ టాలీవుడ్ అంటే సమంతానే. ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్లే. గ్లామర్తో పాటు అభినయానికీ ప్రాధాన్యమిచ్చే సమంత ‘మనం’లో రెండు రకాల పాత్రలు పోషించారు. అక్కినేని త్రయం హీరోలుగా విక్రమ్కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో సమంత ప్రత్యేకంగా ముచ్చటించారు. నిజంగా నా అదృష్టం: అక్కినేని కుటుంబం నటించిన ఈ లెజెండ్రీ మూవీలో నాకూ స్థానం దొరకడం నిజంగా అదృష్టం. అయితే... వాళ్లు కాకుండా ఎవరు చేసినా... ఈ సినిమాను మాత్రం వదులుకునేదాన్ని కాదు. ఇందులో రెండు రకాల పాత్రల్లో కనిపిస్తాన్నేను. వాటిలో ఒక పాత్ర పేరు ‘కృష్ణ’. తల్లి పాత్ర. నా కెరీర్లో వయసుకు మించిన పాత్ర చేయడం ఇదే. రెండో పాత్ర పేరు ‘ప్రియ’. జోవియల్గా అల్లరి చేస్తూ ఉండే పాత్ర. నిజంగా ఈ రెండు పాత్రలు నాకు ఛాలెంజ్. అలాగే... ఇందులో శ్రీయ కూడా ఓ కథానాయిక. గొప్పగా నటించింది తను. చైతూ, నేను కలిసి నటించిన మూడో సినిమా ఇది. ఇందులో మా జంట యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ‘నాగేశ్వర్’ ఎవరు? అని అందరూ అడుగుతున్నారు. తనెవరో తెరపై చూస్తేనే మజాగా ఉంటుంది. అక్కినేనిగారి విజువల్స్ చూస్తాను: అక్కినేనిగారి కాంబినేషన్లో నావి రెండు మూడు సీన్లే. నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు. ఆయన సెట్లో ఉంటే సమయమే తెలిసేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. ‘ఏమాయ చేశావె’ టైమ్ నుంచి ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. ఆర్టిస్ట్గా నాకందిన తొలి ప్రశంస ఆయనదే. ఇప్పటికీ... ‘నేను సరైన రంగంలోనే ఉన్నానా. నటిగా నేను కరెక్టేనా’ అనిపించినప్పుడు ‘ఏ మాయచేశావె’ సక్సెస్మీట్లో అక్కినేనిగారు నా గురించి మాట్లాడిన విజువల్స్ చూస్తాను.అంతే... నాలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎగిరిపోతుంది. అక్కినేనిగారితో పాటు నాగార్జునగారితో కూడా కలిసి చేసే అవకాశం ఈ సినిమా పుణ్యమా అని నాకు దక్కింది. అభినయానికే తొలి ప్రాధాన్యం: నేను మొదట్నుంచీ గ్లామర్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘ఏమాయ చేశావె’లో కూడా నాది గ్లామర్ పాత్ర కాదు. నా అదృష్టమో ఏమో తెలీదు కానీ... నేను కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసినా, ఏడాదికి ఒకటైనా సరే... అభినయానికి ఆస్కారమున్న సినిమా నాకు దక్కింది. ఏమాయ చేశావె, ఈగ, ఇప్పుడు ‘మనం’. ఇక నుంచి కూడా అభినయానికే తొలి ప్రాధాన్యం ఇస్తాను. -
‘డాక్టర్లు ఎన్ని రోజులని చెప్పార్రా’ అని నాన్న అడిగారు
నాగార్జున మంచి నటుడు. మంచి నిర్మాత. మంచి వ్యాపారవేత్త. వీటన్నింటినీ మించి... మంచి కొడుకు. ఎంత మంచి కొడుకంటే.. తన తండ్రి అక్కినేని టాపిక్ తెస్తేనే భావోద్వేగానికి లోనైపోయేంత. తండ్రి జ్ఞాపకాల్లో జీవించడం ఆయనకిష్టం. తండ్రి గురించి వినడం ఆయనకిష్టం. తండ్రి గురించి మాట్లాడటం ఆయనకిష్టం. మొత్తంగా తండ్రే ఆయనకు లోకం. కాసేపు ఆయనతో ముచ్చటిస్తే ఇది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఈ నెల 23న తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నాగ్ నటించిన ‘మనం’ చిత్రం విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్కుమార్ దర్శకుడు. ‘మనం’ ముచ్చట్లు చెప్పడానికి ఆదివారం నాగార్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ‘మనం’ గురించే కాక, తన తండ్రి అక్కినేని చివరి రోజుల్ని ఉద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలివి. ‘మనం’ సినిమాకు గత ఏడాది మార్చిలో కొబ్బరికాయ కొట్టాం. కానీ... ఆ ఎండల్లో నాన్నను కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే... జూలైలో చల్లబడగానే షూటింగ్ మొదలుపెట్టాం. నాన్నకు ముందే చెప్పేశాను.. ‘నాన్నా.. ఏం ఫర్లేదు... సినిమాను ఏడాది పాటు నిదానంగా తీసుకుందాం. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చేసేసి వెళ్లిపోండి’ అని. అలాగే వచ్చి చేసి వెళ్లిపోయేవారు. ఎందుకో తెలీదు కానీ... గత ఏడాది ఆయన 90వ పుట్టిన రోజుని మిత్రులు, శ్రేయోభిలాషులందరినీ పిలిపించుకొని మరీ చేసుకున్నారు. చెన్నయ్, యూఎస్, లండన్... ఇలా దేశవిదేశాల నుంచి కూడా వచ్చారు. వాళ్లందరి సమక్షంలో పుట్టినరోజును జరుపుకోవాలని నాన్నకు ఎందుకు అనిపించిందో!సెప్టెంబర్ 30... మా కుటుంబానికి అదో దుర్దినం. ఎందుకంటే... నాన్నకు తొలిసారి కడుపు నొప్పి వచ్చింది ఆ రోజే. నాన్న అప్పుడు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నారు. ‘ఇంటికెళ్లండి నాన్నా... తర్వాత చూసుకుందాం’ అని పంపించేశాను. అయినా హాస్పిటల్కెళ్లి చూపించుకున్నారు. ‘ఎసిడిటీ’ అన్నారు. యాంటాసిడ్ ఇస్తే తగ్గిపోయింది. అసలు నాన్నకు ఎసిడిటీ అనేది ఎన్నడూ లేదు. అంత హెల్దీగా ఉండేవారు. అక్టోబర్ 10... నాన్నకు మళ్లీ కడుపులో నొప్పి వచ్చింది. ఈ దఫా తీవ్రంగా. స్కాన్ చేస్తే... చిన్న ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. దాన్ని డాక్టర్లు తొలగించేశారు. మళ్లీ నాన్న పర్ఫెక్ట్. అయితే... ఆ ట్యూమర్ని బయాప్సీకి పంపినప్పుడు అసలు విషయం బయటపడింది. నాన్నకు ‘కేన్సర్’. ఇంట్లో అందరి గుండె ఆగినంత పనైంది. తక్షణ కర్తవ్యం ఏంటని డాక్టర్లను అడిగాం. ‘ఓపెన్ చేస్తే కానీ చెప్పలేం. కానీ ఓపెన్ చేయడానికి ఆయన వయసు సహకరించదు’ అనేశారు. మేం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే.. ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే... ఫోన్లు చేసి ఏడవడం, ఇంకొందరైతే... ‘సార్... మీరు బాగున్నారా?’ అనడగడం. నాన్నకు విసుగొచ్చేసింది. ఇది ఆగాలంటే.. ఉన్న విషయం చెప్పేయడమే మంచిదని భావించారు. అక్టోబర్ 19... నాన్న ప్రెస్మీట్ పెట్టారు. అంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అదే రోజు... ‘మనం’ షూటింగ్లో పాల్గొన్నారు. శ్రీయతో నా సీన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారిగా... కడుపు పట్టుకొని పడిపోయారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాం. స్కాన్ తీశారు. అప్పుడు తెలిసింది.. ట్యూమర్ పెరిగిపోయి.. జీర్ణాశయాన్ని మెలిపెట్టేసిందని, ఆ ప్రాంతమంతా బిగుసుకుపోవడంతో ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడంలేదని. ఇక ఎంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నాన్నకు నొప్పి ఆగడంలేదు. సర్జరీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు. నాన్న మొండి మనిషి. ‘చేసేయండి’ అన్నారు. కడుపుని ఓపెన్ చేశారు. అది కడుపంతా స్ప్రెడ్ అయిపోవడం గమనించారు. అయినా సరే.. సర్జరీ చేసేశారు. పెద్ద సర్జరీ. అయినా తట్టుకున్నారు. రెండ్రోజుల్లోనే లేచి తిరిగారు కూడా. ఓ రోజు సర్జరీ చేసిన డాక్టర్లందర్నీ ఇంటికి పిలిపించారు నాన్న. ‘నన్ను ఓపెన్ చేశారు. లోపల ఏముందో మీ అందరికీ తెలుసు. అబద్ధం చెప్పొద్దు. నిజం చెప్పండి’ అని సూటిగా అడిగారు. నాన్నతో వాళ్లు అబద్ధం చెప్పలేకపోయారు. ‘మీకు కావాల్సినవన్నీ తినండి. సాధ్యమైనంతవరకూ ఆనందంగా ఉండండి. అంతకు మించి ఏం చెప్పలేం’ అనేశారు. ఇక వాళ్లను పంపించేసి, మమ్మల్ని పిలిపించారు నాన్న. ‘ఎన్ని రోజులు అని చెప్పార్రా’ అనడిగారు. నాన్న అబద్ధం చెబితే అస్సలు ఊరుకోరు. ఆయన దగ్గర ఉన్నదున్నట్లు చెప్పేయాలి. అందుకే... ‘ఏమో నాన్న.. ఇన్ని రోజులనేం చెప్పలేదు. మమ్మల్ని మాత్రం ఎక్కువ సమయం మీతోనే గడపమన్నారు’ అని చెప్పేశాం. ఆ రోజే అందర్నీ భోజనాలకు పిలుస్తూ... ‘ఏడుస్తూ వచ్చేటట్లయితే... ఎవరూ నా ఇంటికి రావొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇక ఆ రోజు నుంచి మాతో కబుర్లు చెబుతూ హ్యాపీగా గడిపారు నాన్న. కేన్సరేమో... ఆయన్ను లోలోపల నిదానంగా తినేస్తోంది. ఓ రోజు నాన్న నన్ను పిలిచి... ‘మనం’లో నా వర్క్ ఎన్ని రోజులుంది అనడిగారు. మీరు ఆర్రోజులొస్తే సరిపోతుందని చెప్పాను. సీన్స్ అన్నీ తెప్పించుకొని చూశారు. ‘ఫస్ట్ క్లైమాక్స్ ఫినిష్ చేయ్’ అన్నారు. సినిమా పూర్తవ్వాలంటే... క్లైమాక్స్ పూర్తి చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది నాన్నకు బాగా తెలుసు. తర్వాత ఏయే సీన్స్ తీయాలో కూడా వివరించి చెప్పారు. ‘ఆర్టిస్టులందర్నీ రెడీ చేసి పెట్టుకో... ఏదో ఒకరోజు నేనొచ్చి చేసేసి వెళ్లిపోతా’ అని చెప్పారు. అన్నట్లుగానే... ముందు క్లైమాక్స్ కంప్లీట్ చేసేశారు. తర్వాత నిదానంగా మిగిలిన సీన్స్ పూర్తి చేశారు. ‘మనం’ ట్రైలర్లో లాస్ట్ షాట్ మీరు చూసే ఉంటారు. నాన్నపై తీసిన లాస్ట్ షాట్ కూడా అదే. ఆ షాట్లో ఆయన నవ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. జనవరి 14... అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైన రోజు. ఆ రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు నాన్న. వర్కర్లందర్నీ పిలిచి వాళ్లతో పాటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అయితే... ఈ దఫా నాన్న రాలేరు అనుకున్నాను. కానీ.. వీల్ ఛెయిర్లో స్టూడియోకి వచ్చారు. ఉద్యోగులందర్నీ పేరుపేరునా పలకరిచారు. సాయంత్రం మా అందర్నీ ఇంటికి పిలిచారు. ‘నా జీవితం అందమైందిరా.. చేయాల్సినవన్నీ చేసేశాను’ అని సంబరపడిపోయారు. క్రమంగా నాన్న ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కిమ్స్ డాక్టర్లు చెప్పారు... ‘రెండు వారాల్లో ఆయనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రిపేర్ అయిపోండి. హాస్పిటల్కి తీసుకొచ్చినా వేస్ట్. మేం సర్జరీలు కూడా చేయలేం. పెయిన్ మెడికేషన్ ఇంట్లో రెడీగా పెట్టుకోండి’ అని. పెయిన్ మెడికేషన్ ఇచ్చిన మనిషి చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే... అలా నిద్రలో ఉండిపోతాడంతే. చేసేది లేక డాక్టర్ల మాట పాటించాం. జనవరి 21... రాత్రి మా ఫ్యామిలీ మొత్తం నాన్నతోనే ఉన్నాం. భోజనాలు చేశాం. అందరికీ నాన్న ‘గుడ్బై’ చెప్పారు. నిద్ర వస్తోందని లోపలకెళ్లి పడుకున్నారు. నేను పదింటివరకూ అక్కడే ఉన్నాను. ఇంటికెళ్లేముందు నాన్నను ఓసారి చూసి వెళదామని గదిలోకి వెళ్లాను. గురక పెడుతున్నారు. సరే... వెళ్లబోయాను. ఇంతలో నర్స్ ‘అదేంటిసార్... నాన్నకు గుడ్ నైట్ చెప్పకుండా వెళ్లిపోతారా?’ అంది. ‘నాన్న... నాన్న’ అని తట్టాను. నాన్న లేచారు. ‘గుడ్నైట్ నాన్నా’ అన్నాను. ‘సరే... వెళ్లు. రేపు కలుద్దాం’ అని నిద్రలోకి జారుకున్నారు. నిద్రలోనే.... నిజంగా నాన్నది అద్భుతమైన జీవితం. ఒక మనిషి ఎంత సాధించగలడో అంతా సాధించారు. అందుకే... ఆయన ధన్యజీవి. ‘మనం’ మీకు చాలా ప్రత్యేకమైన సినిమా కదా? కచ్చితంగా. నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా. శివ, గీతాంజలి విడుదలై పాతికేళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు నా కెరీర్లో రాబోతున్న మరో మైలురాయి ‘మనం’. నాకే కాదు, నా కుటుంబం మొత్తం ప్రేమించి ఈ సినిమా చేశాం. ఆడుతుందా, ఆడదా అనే విషయాలు మేం ఆలోచించలేదు. ‘ఇలా చేద్దాం’ అనుకున్నాం.. చేసేశాం. తెరపై కూడా చైతూ నాకు కొడుకే. నాన్న వాడికి తాతే. ఈ మధ్యకాలంలో నాకు సూట్ అయ్యే పాత్రలు నేను చేయలేదు. ఇన్నాళ్లకు నాకు తగ్గ పాత్రను ‘మనం’లో చేశాను. మొన్నే అందరం చూసుకున్నాం. అద్భుతంగా అనిపించింది. ఇందులో అమితాబ్ కూడా నటించారు కదా. ఆ విషయం నాన్నగారికి తెలుసా? ఆయనకు తెలీదండీ... నాన్న మనకు దూరమైన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. నాన్నకు అమితాబ్గారంటే చాలా ఇష్టం. ఆయన నటనను ఎప్పుడూ పొగుడుతుండేవారు. అందుకే... ఈ సినిమాలో ఆయనతో కూడా నటింపజేయాలనిపించింది. ‘నాన్న చివరి సినిమాలో మీరూ నటిస్తే బావుంటుంది’ అని స్వయంగా ఆయన్ను అడిగాను. ‘మూడు జనరేషన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని... అన్నమాట ప్రకారం వచ్చి నటించారు. ఇందులో ఆయనది చాలా చిన్న వేషం. మీ నాన్నగారి పాటను ఇందులో రీమిక్స్ చేశారట కదా? ‘ప్రేమనగర్’లోని ‘నేను పుట్టాను...’ పాటను రీమిక్స్ చేశాం. ఇందులో ముగ్గురం నటించాం. మణిరత్నం సినిమా సంగతేంటి? చర్చలు జరిగాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. మొన్ననే ‘గీతాంజలి’కి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పా. ఆ సినిమాకు పాతికేళ్లు వచ్చినట్లు ఆయనకు తెలీదంట. ఎన్టీఆర్, మీరూ కలిసి చేస్తున్నారట? అవును... పీవీపీవాళ్లు తీస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వైజాగ్లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం. మరి అక్కడ స్టూడియో కట్టాలనే యోచన ఏమైనా ఉందా? 1974లో నాన్న స్టూడియో కట్టారు. అయినా... చెన్నయ్ నుంచి హైదరాబాద్కి పూర్తి స్థాయిలో పరిశ్రమ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్సర్లు కావాలన్నా, మ్యూజిషియన్లు కావాలన్నా చెన్నయ్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి. మన తెలుగునేలపై చదువుపై చూపించే శ్రద్ధ కళలపై చూపించరు. కానీ తమిళనాడు, కేరళలలో విద్యావంతులు ఎంత ఎక్కువగా ఉంటారో, కళాకారులు కూడా అంతే ఉంటారు. అందుకే... ఇప్పటికీ కళాకారుల్ని మనం అక్కడ్నుంచే తెచ్చుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థమైందేంటంటే... స్టూడియో అని ఓ నాలుగు గోడలు కడితే సరిపోదు. ముందు ఒక వ్యవస్థ అక్కడ క్రియేట్ అవ్వాలి. అసలు పరిశ్రమ వైజాగ్ వెళ్లే అవసరం ఉందంటారా? అసలక్కడ పాలనా వ్యవస్థే లేదు. స్టూడియోలకి తొందరెందుకు? మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఏదైనా స్మారక చిహ్నం ఏర్పాటు చేసే ఆలోచన ... ఉందండీ... అమ్మ, నాన్న ఇద్దరి పేరిటా చేయాలి. నాన్న మ్యూజియం కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మ్యూజియం అంటే నాన్నకు చాలా ఇష్టం. స్టూడియోలోనే... సరైన స్పాట్ చూసి ఆ కార్యక్రమాలు మొదలుపెడతాం. నాన్న పేరిట ప్రతి ఏడాదీ ఇచ్చే అవార్డును కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తాం. -
కౌంటింగ్ను పరిశీలించిన ఎస్పీ
గుడివాడ అర్బన్, న్యూస్లైన్ : స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల్లోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ వివరాలను మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్కుమార్, ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య, కార్యాలయపు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే సిబ్బందికి తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంచినీళ్లు ఏర్పాటు చేయలేదని, తాగడానికి బయటకు వెళ్తుంటే పోలీసులు మరలా లోపలికి రానివ్వడం లేదంటూ పలు వార్డుల అభ్యర్థులు ఎస్పీ దృష్టికి తీసుకురాగా... స్పందించిన ఎస్పీ డిఎస్పీ జి.నాగన్నను పిలిచి మంచినీళ్లు ఏవి అని ప్రశ్నించారు. మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేయలేదని డీఎస్పీ బదులిచ్చారు. దీంతో రూమ్లో ఓ పక్కన మంచినీళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. దీంతో ఎస్పీ వెళ్లిన అరగంట తరువాత మంచినీళ్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో... మచిలీపట్నం క్రైం : హిందూ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ జె ప్రభాకరరావు సందర్శించారు. ఉదయం 9 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే తనకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలకు ఆయన సూచించారు -
అక్కినేని ఆవకాయ
‘కొత్త ఆవకాయ’... అసలు ఈ సౌండ్ వింటేనే ‘అద్భుతః’ అనిపిస్తుంది. చిత్రాన్నాల్లో పులిహోర, కూరల్లో వంకాయ, పచ్చళ్లలో కొత్త ఆవకాయ... వీటికి తిరుగేలేదు. ఆర్యుల మాట కూడా ఇదే. పైగా ఇది ఆవకాయ సీజన్. ఇతర రాష్ట్రాల సంగతి ఏమో కానీ... మన తెలుగు లోగిళ్లలో మాత్రం ప్రస్తుతం ఎక్కడ చూసినా కొత్త ఆవకాయ ఘుమ ఘుమలే. ఇక్కడున్న స్టిల్ చూడండి. గరిటెతో కలపాల్సిన ఆవకాయని చక్కగా చేతితో కలిపేస్తున్నాడు సుమంత్. పైగా ఇది సినిమా కోసం తీయించుకున్న స్టిల్ కాదు. ఇంట్లో స్వయంగా ఆవకాయ పెడుతూ తీయించుకున్న స్టిల్. సుమంత్కి ఆవకాయకి ఉన్న అనుబంధం మామూలుది కాదు. సుమంత్ చిన్నప్పట్నుంచీ తాతయ్య, నాయనమ్మ దగ్గరే పెరిగిన విషయం తెలిసిందే. అక్కినేని అన్నపూర్ణ ఆవకాయ పెట్టడంలో సిద్ధహస్తురాలట. స్వహస్తాలతో ఆమె ఆవకాయ పట్టి, చుట్టాలకు, పక్కాలకు పంపేవారట. ‘అన్నపూర్ణమ్మగారి ఆవకాయ’ అనగానే అందరూ లొట్టలేసుకొని మరీ తినేవారట. ఏఎన్నార్కి కూడా అన్నపూర్ణమ్మ ఆవకాయ అంటే మహా ప్రీతి. అందుకే... ఆమె ఆవకాయ పెడుతున్నప్పుడు పక్కనే ఉండి మామిడి ముక్కల సైజు నుంచి, ఆవపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పాయలు, నూనె... ఇలా మోతాదులన్నీ దగ్గరుండి చూసేవారట. ఆమె పోయాక కూడా... ఆమె రుచి చూపించిన ఆవకాయని మాత్రం అక్కినేని వదల్లేదట. బతికున్నంతవరకూ ఈ సీజన్ రాగానే ఇంట్లో ఆవకాయ పెట్టాల్సిందే. అన్నపూర్ణమ్మ పంపినట్టే అక్కినేని కూడా తమ ఇంటి ఆవకాయని అందరికీ పంపేవారట. గత ఏడాది కూడా ఈ పద్ధతిని అనుసరించారట అక్కినేని. సుమంత్ షూటింగ్ పనిమీద విదేశాల్లో ఉంటే... ఆవకాయని అక్కడికి పంపారట. తాతయ్య దగ్గరే ఆవకాయ తయారీని నేర్చుకున్నారు సుమంత్. ఇప్పుడు ఆయనకి నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలు మాత్రం అలా ఉన్నాయి. అందుకే... నాన్నమ్మ, తాతయ్యల జ్ఞాపకమైన అక్కినేని ఆవకాయని స్వయంగా తయారు చేశారు సుమంత్. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఈ స్టిల్ పెట్టుకున్నారాయన. -
మా ఇద్దరి అదృష్టం ఇది
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రచార చిత్రానికి వచ్చిన స్పందనే అందుకు గొప్ప నిదర్శనం. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో క్లిక్స్ దీనికి లభించాయి. ఈ విషయంపై అక్కినేని నాగార్జున ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘మనం ప్రచార చిత్రాలకు ఈ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉంది. చాలా కొత్తగా ఉన్నాయని ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మా కుటుంబం కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. దర్శకుడు విక్రమ్కుమార్ సరికొత్త శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాన్న చివరి సినిమాలో ఆయనతో పాటు భాగం పంచుకునే అదృ ష్టాన్ని నాకు, నాగచైతన్యకు కలిగించిందీ సినిమా’’ అని చెప్పారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, మే నెల 23న ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ తెలిపారు. శ్రీయ, సమంత కథానాయికలు. -
'మనం' విడుదల తర్వాతే అఖిల్ ఆరంగేట్రం: నాగార్జున
తన తండ్రితోను, కొడుకుతోను కలిసి నటించిన 'మనం' చిత్రం విడుదలైన తర్వాతే.. అఖిల్ సినీరంగ ప్రవేశం ఉంటుందని అక్కినేని నాగార్జున తెలిపారు. తన తండ్రి నాగేశ్వరరావుతోను, కొడుకు నాగచైతన్యతోను కలిసి 'మనం' చిత్రంలో నటించడం చాలా అద్భుతమైన అనుభవమని ఆయన అన్నారు. ఇటీవలే కన్నుమూసిన అక్కినేని నాగేశ్వరరావుకు 'మనం' చిట్టచివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వినోదభరితమైన చిత్రమని, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నాగ్ అన్నారు. తన నటజీవితంలోనే ఇలాంటి సాహసోపేతమైన పయనం ఎప్పుడూ చేయలేదని, ఒకేసారి ఒకే సినిమాలో తన తండ్రితోను.. తన కొడుకుతోను కలిసి తాను నటించిన ఏకైక చిత్రం ఇదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 31వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఇంకా సమంత, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. మనం విడుదలైన తర్వాత మాత్రమే అఖిల్ సినీరంగ ఆరంగేట్రం చేస్తాడని కూడా నాగార్జున చెప్పారు. -
అక్కినేని ఆశయాలు భావితరాలకు ఆదర్శం
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) చైర్మన్ తోటకూర ప్రసాద్ అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మెరుగైన సమాజం కోసం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో అక్కినేని ఆశయాలను భావి తరాల వారికి తెలియజేసేందుకు ఏఎఫ్ఏ తరపున పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రసాద్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రసాద్తో పాటు ఏఎఫ్ఏ వైస్ చైర్మన్ రవి కొండబోలు, డైరెక్టర్ భక్తవత్సలు ఇటీవల అక్కినేని స్వస్థలం కృష్ణా జిల్లా వెంకట రాఘవపురం గ్రామాన్ని సందర్శించారు. ఏఎన్ఆర్ కాలేజీకి వెళ్లి, వచ్చే డిసెంబర్లో అక్కడ అక్కినేని అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే విషయంపై చర్చించారు. హైదరాబాద్లో అక్కినేని కుటుంబ సభ్యుల్ని కూడా వారు పరామర్శించారు. ఏఎన్ఆర్ నివాసంలో నాగ సుశీల, సుమంత్, సుప్రియ తదితరుల్నికలిశారు. -
మన తెరపై మహాశివుళ్లు
ఒకే ఒక్కసారి: అక్కినేని నాగేశ్వరరావు శివుడి పాత్ర చేసిన విషయం చాలా మందికి తెలియదు. ‘మూగ మనసులు’ సినిమాలో ఆయన ఈ గెటప్లో కనపడతారు. అది కూడా కొద్దిసేపే. ‘గౌరమ్మా.. నీ మొగుడెవరమ్మా..’ పాటలో ఆయన్ను శివుడిగా చూడొచ్చు. ‘పరమానందయ్య శిష్యుల కథ’లో శోభన్బాబు, ‘వినాయక విజయం’లో కృష్ణంరాజు భోళాశంకరునిగా కనిపిస్తారు. నందమూరి బాలకృష్ణ ‘సీతారామ కల్యాణం’లో శివుడిగా కాసేపు కనబడతారు. దేవుళ్ల పాత్రలు పోషించడం అంత సులభతరం కాదు. ఆహార్యం కుదరాలి. వాచికం ఉండాలి. హావభావాల్లో దైవత్వం కనబడాలి. ఇక శివుడి పాత్ర అయితే చెప్పనే అక్కర్లేదు. ఓ రకంగా కత్తి మీద సాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటివరకూ వెండితెరపై రాణించిన వెండికొండ శివుళ్లను ఓసారి గుర్తు చేసుకుందాం..! తెలుగు తెరపై తొలి శివుడెవరు?: తెలుగు సినిమా పుట్టింది 1932లో. సినిమా శివుడు మాత్రం 1935లో పుట్టాడు. ప్రముఖ నటి దాసరి కోటిరత్నం నిర్మించిన ‘సతీ అనసూయ’లో శివుడి పాత్ర ఉంది. అయితే ఆ పాత్ర ఎవరు చేశారో రికార్డులకెక్కలేదు. సదా... శివుడు: అప్పట్లో శివ పాత్రలకు స్పెషలిస్ట్ ఎవరంటే సదాశివరావు. చిన్నా పెద్దా ఏ సినిమాలో అయినా శివుడు పాత్ర అంటే ఆయన్నే అడిగేవారు. ‘దక్ష యజ్ఞం’, ‘గుణసుందరి కథ’ తదితర చిత్రాల్లో శివుడిగా కనిపించింది ఆయనే. సదా శివరావు ఆహార్యం, అభియం అచ్చంగా శివుడే అనే భావన కలిగించడంతో ఆయన్ను ఎక్కువ ఆ పాత్రకు అడిగేవారు. భళా బాలయ్య: కేరక్టర్ నటుల్లో ఎక్కువసార్లు శివుడి పాత్ర పోషించిన ఘనత ఎం. బాలయ్యకే దక్కుతుంది. ‘పార్వతీ కళ్యాణం’ (1958)తో మొదలుపెట్టి ‘భక్త కన్నప్ప’, ‘మల్లమ్మ కథ’, ‘జగన్మాత’ తదితర చిత్రాల్లో ఆయన శివయ్యగా కనిపించారు. అలాగే కన్నడ సినిమా ‘శివభక్త’లో కూడా ఆయన ముక్కంటిగా కనిపించడం ఓ విశేషం. రూపం పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత శివుడంటే బాలయ్యే అని అప్పట్లో ఓ బ్రాండ్. ‘భక్త కన్నప్ప’ క్లయిమాక్స్లో శివుడి విశ్వరూపం చూపించే సన్నివేశంలో బాలయ్య రూపం తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. కొడుకు కోసం శివుడి పాత్ర చేసిన కాంతారావు: జానపద చిత్రాల్లో తనదైన శైలిలో విజృంభించిన కాంతారావు, శివుడి పాత్రను కూడా గొప్పగా పండించారు. ‘శ్రీ గౌరీ మహత్యం’ చిత్రంలో ఆయన తొలిసారిగా వెండితెరపై శివుడిగా దర్శనమిచ్చారు. కానీ, పాముని మెడలో వేసుకుని నటించడానికి విపరీతంగా భయపడ్డారట. ఆ పాము ఒకచోట ఉండక శరీరం మీద తిరుగుతుండటంతో మేకప్ చెరిగిపోయేదట. మళ్లీ మళ్లీ మేకప్ వేయించుకుని, భయాన్ని దిగమింగుకుని కాంతారావు ఆ పాత్ర పోషించారు. ఆ తర్వాత మరోసారి శివుడిగా నటించే అవకాశం ‘భక్త మార్కండేయ’ ద్వారా వచ్చిందాయనకు. ఈసారి కాంతారావు పెద్దగా భయం లేకుండానే ఈ పాత్రను చేశారు. శివుడిగా మూడోసారి ఆయన కనిపించిన చిత్రం ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’. అయితే ఆయన ఈ సినిమా చేయడం వెనక ఓ కథ ఉంది. ఆ సమయంలో కాంతారావు కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో, వైద్యం చేయించడానికి డబ్బు అవసరమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’లో రాముడిగా నటించిన అమర్నాథ్ని సాయం చేయమని కోరితే ఆ చిత్రంలో శివుడు పాత్ర ఇప్పించారు. ఏ కొడుకుని కాపాడుకోవడం కోసం అయితే కాంతారావు ఆ సినిమా అంగీకరించారో, షూటింగ్లో పాల్గొని ఇంటికెళ్లేసరికి ఆ కొడుకు చనిపోవడం దురదృష్టకరం. శివుడంటే ఎన్టీఆరే!: వెండితెరపై రాముడన్నా, శ్రీకృష్ణుడన్నా ఎన్టీఆరే. పరమశివుడిగానూ ఆయనకు తిరుగు లేదు. అయితే, చిత్రంగా ఆయన ఈ పాత్రను చేసింది రెండే రెండు సినిమాల్లో. అయినా కూడా బలమైన ముద్రనే వేశారు. ‘దక్షయజ్ఞం’లో ఎన్టీఆర్ శివపాత్ర పోషణ నభూతో న భవిష్యతి. క్లయిమాక్స్లో ఆయన చేసిన ప్రళయ తాండవం... రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆ తర్వాత ‘ఉమా చండీ గౌరీశంకరుల కథ’ చిత్రంలో శివుడిగా నటించారు. ముక్కంటిగా మెగాస్టార్: ఎన్టీఆర్ తర్వాతి జనరేషన్లో శివుడి పాత్రను పూర్తి స్థాయిలో అభినయించే అదృష్టం దక్కింది చిరంజీవికే. ‘పార్వతీ పరమేశ్వరులు’ చిత్రంలో ఓ పాటలో శివుడి గెటప్లో కనిపించిన చిరంజీవి, ఆ తర్వాత ‘ఆపద్భాందవుడు’లో కూడా ఓ పాటలో కనిపించారు. ‘శ్రీ మంజునాథ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువ. మంచి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి శివుడి పాత్రలో కూడా మెప్పించగలిగారు. శివుడిగా ప్రతినాయకులు: హీరోలే కాదు.. విలన్లుగా రాణించిన నటులు కూడా శివుడి పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా నాగభూషణం అయితే ఈ విషయంలో ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. నాగుల చవితి, భూకైలాస్, చెంచులక్ష్మి సినిమాల్లో ఆయన శివుడిగా నటించారు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్లో రావణాసురుడు శివలింగానికి తలను మోదుకుంటున్న సమయంలో నాగభూషణం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్. నిజమైన పాముని మెడలో వేసుకుని నటించిన ఘనత ఆయన సొంతం. ఆ పాము ఒంటిపై పాకుతున్నా, ఆయన మొహంలో హావభావాలు చెడకుండా జీవించారు. అలాగే, వేమూరి గగ్గయ్య ‘భక్త సిరియాళ’లోనూ, రావు గోపాలరావు ‘మా ఊళ్లో మహాశివుడు’లోనూ, త్యాగరాజు ‘బాలనాగమ్మ’లోనూ శివుడిగా కనపడతారు. రాజనాల, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్రెడ్డి కూడా పరమేశ్వరుని పాత్ర పోషించారు. కేరక్టర్ నటుల్లో అమర్నాథ్ ( సతీ అనసూయ), మాధవపెద్ది వెంకట్రామయ్య (సతీ తులసి), రామశర్మ (సతీ తులసి), ఘంటసాల రాధాకృఫ్ణయ్య (పార్వతీ కళ్యాణం), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (భక్త మార్కండేయ), వి. శివరాం (వీరాంజనేయులు), సీహెచ్ నారాయణరావు (గంగా గౌరీ సంవాదం) ముక్కంటిలుగా కనిపించారు. ఇక కష్టమే!! ఇప్పుడసలు పౌరాణిక చిత్రాలే అరుదైపోయాయి. ఒకవేళ ఇలాంటివి వచ్చినా మన యువ కథానాయకులు శివ పాత్రలో కనబడటానికి ఎంతవరకూ ఆసక్తి చూపిస్తారో!? ఇక వెండితెర శివుళ్లుగా మన హీరోలను చూడలేమేమో!? - డి.జి. భవాని -
ఫిల్మ్ జర్నలిస్టులకు అక్కినేని అవార్డులు
-
'ఆయన మై ఫెవరేట్ హీరో....'
తిరుమల : అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన 'ఆత్మబలం'లోని చిటపట చినుకులు పడుతూ ఉంటే... పాట ఎన్నటికీ మరువలేనని అలనాటి సినీనటి సరోజాదేవి అన్నారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సరోజాదేవి మీడియాతో మాట్లాడుతూ 'ఆంధ్రాకు రాగానే నాగేశ్వరరావు గుర్తొచ్చారు. ఆయన మై ఫెవరేట్ హీరో. హాయ్ హీరోయిన్ ఎలా ఉన్నావ్ అని నాగేశ్వరరావు నన్ను అడిగేవారు' అని తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తెలుగులో నటించిన ప్రతి సినిమా హిట్ అయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనతోపాటు సినిమాల్లో నటించిన నటీనటులను మిస్సయ్యాను అనే ఫీలింగ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత మనస్సుకు సంతృప్తిగా ఉందని తెలిపారు. -
గొప్ప నటులను కోల్పోయాం....
వేటపాలెం : తెలుగు సినీపరిశ్రమ వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ్ కిరణ్ వంటి గొప్ప నటులను కోల్పోయిందని నటుడు నవదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేటపాలం మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ హైస్కూల్లో ఆదివారం ఓ సావనీర్ను ఆవిష్కరించాడు. అనంతరం వేటపాలెంలో సన్నిహితుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ కేవలం అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు మంచి నటులను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోవడం బాధగా ఉందన్నాడు. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తయిందని, ఇప్పటివరకూ 25 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను నటించిన బంగారు కోట, అంతసీన్ లేదు, నటుడు చిత్రాలు రిలీజ్కి సిద్ధంగా ఉండగా, అంతా నీమాయ, పాగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నాడు. తనకు చందమామ, గౌతం, ఆర్య-2 చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపాడు. తాను చిన్నతనంలో చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినట్లు నవదీప్ గుర్తు చేసుకున్నాడు. -
భామనే...సత్యభామనే..!
కళల పట్ల కాస్త ఆసక్తి ఉన్న ఎవరికైనా సరే.. స్థానం నరసింహారావు పేరు తప్పక గుర్తుంటుంది. తెలుగు నాటకరంగంలో తొలి ‘పద్మశ్రీ’ ఆయన. స్థానంవారు రంగస్థలంపై గొప్ప పాత్రలు చాలా పోషించినా.. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం ‘సత్యభామ’. స్త్రీ పాత్ర. ఒక్క సత్యభామే కాదు, చింతామణి లాంటి వేశ్య పాత్రను కూడా పోషించి మెప్పించారాయన. రంగస్థలంపై ఆయన తర్వాత స్త్రీ పాత్రధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రమణ్యశాస్త్రి. ఆయనకైతే.. లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఆడవారికే మతిపోగొట్టే వయ్యారం శాస్త్రిది. సినిమా అనేది రాకముందు ప్రజానీకానికి ప్రధాన వినోద సాధనం నాటకమే. అప్పట్లో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే, పాపంగా ఫీలయ్యేవారు. ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కేసుకునేవారు. అలాంటి టైమ్లో ఆడపాత్రలన్నీ పోషించింది మగవారే. నాటి నుంచి నేటి దాకా ఎంతమంది రంగస్థలంపై స్త్రీలుగా అలరించినా... స్థానం, బుర్రా వారి స్థానం మాత్రం చిరస్మరణీయం. ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకొచ్చిందంటే... వీరిని ఆదర్శంగా తీసుకొని వెండితెరపై కూడా స్త్రీలుగా అలరించిన, అలరిస్తున్న మేటి నటులు ఎందరో ఉన్నారు.సినీ హీరోల్లో స్త్రీ పాత్ర అనగానే.. ముందు గుర్తొచ్చేది అక్కినేని. నిజానికి వెండితెరపై ఆయన స్త్రీగా కనిపించింది తక్కువే. వీరుడిగా, భగ్న ప్రేమికునిగా, లవర్బోయ్గానే ఎక్కువగా కనిపించారు. రంగస్థలంపై మాత్రం ఎన్నో స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని వెండితెరపై స్త్రీగా కనిపించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’(1956). కృష్ణసాని బండారాన్ని బట్టబయలు చేయడానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు. ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. పైగా కృష్ణసానిగా చేసింది భానుమతి. ఆమెకు దీటుగా స్త్రీ వేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే. సహజంగా వయ్యారం అక్కినేని సొంతం. మరోవైపు నాటకానుభవం. ఇంకేం... ఆ సన్నివేశాన్ని పండించారు.చర్చ ఆడ వేషాల గురించే అయినా, ‘నర్తనశాల’(1963)లోని బృహన్నల పాత్రను కూడా ఇక్కడ స్మరించుకోవాల్సిందే. ‘బృహన్నల’ అంటే పేడి. స్త్రీ కాదు. అయినా... వయ్యారం, హొయలు, ఆహార్యం, ఆంగికం, నడక, నడత... ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి. ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగుతెరకు మకుటం లేని మహారాజు. ప్రేక్షకులు ఆయనలో జగదేకవీరుణ్ణి చూసుకుంటున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఈ హిజ్రా వేషం కట్టారాయన. పేడితనంలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో నభవిష్యతి అనేలా పలికించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది గొప్ప సాహసం. మళ్లీ ఆయనే... అదే పాత్రను ‘శ్రీమద్విరాటపర్వం’(1979)లో చేసినా.. అంత గొప్పగా రాణించలేకపోయారు. ఎన్టీఆర్ స్త్రీ పాత్రల విషయానికొస్తే... దేవాంతకుడు(1960), పిడుగురాముడు(1966) చిత్రాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ‘పిడుగురాముడు’లో అయితే, ‘రంగులు రంగులు రంగులు.. హోయ్ రమణులు వలపుల పొంగులు’ పాటలో లేడీగా.. ఎన్టీఆర్ స్టెప్పులు మాస్ని కట్టిపడేశాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ల తరంలో హీరోలకు మీసం తప్పనిసరి కాదు. ఆ తరం హీరోలందరూ పాత్రోచితంగా మీసాలు లేకుండా కూడా నటించేశారు. అందుకే స్త్రీ పాత్రలనూ తేలిగ్గా పోషించగలిగారు. కానీ 80ల్లోకొచ్చేసరికి హీరోకి మీసం కంపల్సరీ అయ్యింది. హీరో అనేవాడు మీసం తీయడం సాహసంతో కూడిన విషయంగా మారింది. అలాంటి సందర్భంలోనూ దర్శకుని మాటను శిరసావహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు చిరంజీవి. ‘నా పేరు మిస్సు మేరీ...’ అంటూ లేడీ గెటప్పులో అదరగొట్టేశారు. ఆ సినిమానే ‘చంటబ్బాయి’ (1986). నిజానికి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు. ఆయనకు మీసమే అందం కూడా. పాత్ర కోసం ఆ మీసాన్నే త్యాగం చేశారాయన. ఇక స్త్రీ పాత్ర అనగానే... కచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నరేష్. జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ (1988)లో తొలిసారి ఆయన లేడీ గెటప్ వేశారు. సుత్తివీరభద్రరావు, నరేష్లపై ‘చూపులు కలిసిన శుభవేళ...’ అంటూ... ఓ పేరడీ యుగళగీతాన్ని కూడా తీశారు జంధ్యాల. ఆ తర్వాత వచ్చింది ‘చిత్రం భళారే విచిత్రం’(1992). ఇక ఈ సినిమాలోని నరేష్ చేసిన స్త్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజారమణి డబ్బింగ్ ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. కళ్లలో అమాయకత్వం, ఒళ్లంతా వయ్యారం, సిగ్గు పడుతూ ఆ కొంటెనవ్వు.. అవన్నీ చూసి ఆడవారు సైతం అసూయ పడ్డారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా విజయానికి ఆ గెటప్ ప్రధాన పాత్రే పోషించింది. రీసెంట్గా ‘కార్తీకమాసం’ చిత్రంలో కూడా లేడీ గెటప్ వేశారు నరేష్. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ నిర్మించి, నటించిన చిత్రం ‘మేడమ్’ (1993). ఇందులో రాజేంద్రప్రసాద్ స్త్రీగా నటించడమే కాదు, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ధీరవనితగా నటకిరీటి అభినయం విమర్శకుల ప్రశంలందుకుంది. ‘మహిళా ఇక నిదుర నుంచి మేలుకో...’ అంటూ మహిళాలోకానికి లేడీ గెటప్పులో పిలుపును కూడా ఇస్తారు ఇందులో రాజేంద్రప్రసాద్. ఆ పాటను ఎస్పీ బాలు పాడటం విశేషం. ఇక ‘భామనే సత్యభామనే’ (1996)లో భామా రుక్మిణిగా కమల్హాసన్ ఒలికించిన వయ్యారాన్ని తేలిగ్గా మరిచిపోగలమా! బాలకృష్ణ కూడా ‘పాండురంగడు’(2008)లో స్త్రీగా కనిపించి, పలువురి ప్రశంసలు పొందారు. తాత అక్కినేని స్ఫూర్తిగా సుమంత్ కూడా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రంలో లేడీ గెటప్ వేశారు. తాత పోలికలు ఉండటం వల్లనో ఏమో.. ఆ వేషంలో జనానికి తెగ నచ్చేశారు. వీరి తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో దాదాపు ద్వితీయార్ధమంతా లేడీ గెటప్తోనే అలరించేశారు మనోజ్. ఇందులో మనోజ్ పాత్రే హైలైట్. ఏది ఏమైనా... మగవాళ్లు ఆడవారిగా నటించడం కత్తి మీద సామే. హాస్యం హద్దు మీరితే అపహాస్యం అవుతుంది. అలాగే... స్త్రీ పాత్ర పోషణలో ఏ మాత్రం తప్పులు దొర్లినా... పేడి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. యువనటులు అయినా కూడా ‘స్త్రీ పాత్రలు’ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయమే. -
నటనకు నిర్వచనం అక్కినేని
వివేక్నగర్, న్యూస్లైన్: తెలుగు వారికి గర్వకారణమైన నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు భారత చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజమని శాసన మండలి అధ్యక్షులు డా.ఎ.చక్రపాణి కీర్తించారు. తెలుగు చలన చిత్ర సీమలో ఒక ధ్రువతార రాలిపోయిందంటూ ఆయన అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. డా.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, శ్రీ త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆదర్శజీవితం ఆయన సొంతమని ఆయన మృతికి తొలిసారిగా శాసన మండలిలో నివాళులర్పించి సంతాప తీర్మానం చేశామన్నారు. నటులు చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ నాటక రం గాన్ని అమితంగా ప్రేమించే అక్కినేని పేరిట గురుకుల స్థాయిలో నటనాలయం స్థాపించాలనే యోచన ఉందని ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. సభలో సారిపల్లి కొండలరావు, ఎంఎల్సి రుద్రరాజు పద్మరాజు, నటులు కైకాల సత్యనారాయణ, పి.వి.రాజేశ్వరరావు, డా.కె.వి.కష్ణకుమారి, పరుచూరి హనుమంతరావు, వై.కె.నాగేశ్వరరావు, లంక లక్ష్మీనారాయణ, వంశీరామరాజు, డా. యం.కె.రాము, మద్దాళి రఘురామ్, ప్రవాస భారతీయురాలు, యుఎస్ఏ తెలుగు కళాసమితి రేవతి, ఎస్వీ.రామారావు, కళాదీక్షితులు, డా.పోతుకూచి సాం బశివరావు, పలువురు సాహితీవేత్తలు, నాటక రంగ, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఒక నిముషం మౌనం పాటించి దివంగత అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
శరత్ నాయకుడు
పురాణాలు, ఇతిహాసాల నుంచి కథలు స్వీకరించడం చిటికెలో పని. జానపద కథ అల్లమంటే మనవాళ్లకు తిరుగులేదు. ఎటొచ్చీ సాంఘిక వస్తువును కథగా కల్పించడమంటేనే కాసింత తెల్లముఖం. అందునా సినిమాకు పనికి వచ్చే కథను కల్పించడం అంటే కష్టసాధ్యమే. అందుకే తెలుగువాళ్లు బెంగాలీ జుబ్బా తొడుక్కోవాల్సి వచ్చింది. బెంగాలీ పాత్రలే తెలుగు హీరోలుగా కనిపించాల్సి వచ్చింది. 1949లో ‘విప్రదాసు’ నవల మొదటిసారిగా ‘మన దేశం’ పేరుతో మన దగ్గర సినిమాగా వచ్చింది. ఆ తర్వాత ఆ వరుస అలా కొనసాగి శరత్ రంగప్రవేశంతో ఉధృతమయ్యింది. శరత్ వల్ల అక్కినేని, అక్కినేని వల్ల శరత్ తెలుగు నేల మీద, వెండి తెర మీద ఒకరి చేయి మరొకరు పట్టుకొని దూసుకుపోయారు. ఆ శరత్ నవలల్లో ఏముంది.. బండెడు పాదధూళీ కుండెడు కన్నీళ్లూ అన్నారట ఎవరో. మనుగడ కోసం పోరాటం మనకు తెలిసిందే. ప్రతి జీవీ తన ఆకారాన్ని బట్టి శక్తియుక్తులను బట్టి వ్యూహాలు రచించుకొని మనుగడ సాగిస్తుంది. అక్కినేని కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన కళ్లు, ఒళ్లు, విగ్రహం చిన్నవి. రూపం ఆజానుబాహు కాదు. కాని తన కళ్లలో ఏదో మత్తు, చూపులో వగరు, నడకలో విరుపు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఈ లక్షణాలు మహిళా ప్రేక్షకులనాకర్షిస్తాయనీ తెలుసు. కనుక తన దారి వేరుగా వేసుకున్నారు. ఇంకో కారణం అప్పటికే ‘పాతాళభైరవి’ (1951) వచ్చి ఎన్.టి.ఆర్ను తిరుగులేని జానపద నాయకుణ్ణి చేసింది. అక్కినేని అంతకుముందు కత్తులు పట్టుకున్నా ఎన్.టి.ఆర్కే పేరు. ఆయనదే ఊపు. ఆ గాలి ఎలాంటిదంటే 1952లో 26 సినిమాలు వస్తే మూడు ఎన్.టి.ఆర్వి ఒక్కటే అక్కినేనిది. ఆ ఒక్కటి కూడా ఫ్లాప్ అయిన భరణివారి ‘ప్రేమ’. దాంతో అక్కినేని ఆలోచించారు. సాంఘిక చిత్రాలవైపు చలో పోదాం అనుకున్నారు. 1950లో వచ్చిన ‘సంసారం’ అందుకు ఊతం. తర్వాత మూడేళ్లకు వచ్చిన ‘దేవదాసు’ ఆ దారిని ఖాయం చేసి అలాంటి పాత్రలకూ దాంతోపాటు నవలా చిత్రాలకూ నాంది పలికింది. బెంగాలీ రచయితల్లో శరత్ పెద్ద స్టార్. టాగోర్ సమకాలీనుడు. దేవదాసు రాసి పొందిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. నిజానికి శరత్ ఆ నవలను నూనూగు మీసాల వయసులో రాశాడు. ఐతే దీనిని చదివితే కుర్రాళ్లు పాడైపోతారేమోననే భయంతో ప్రచురించకుండా పెట్టె అడుగునెక్కడో పడేశాడు. కాని శరత్ మిత్రుడొకడు చదివి ముగ్థుడై ఆయనకి చెప్పకుండా ఈ నవలను ప్రచురణకిచ్చేశాడు. ఆ తర్వాతిదంతా చరిత్ర. మరి ఇంత ఘనమైన నవలను తెరకెక్కించాలని డి.ఎల్. నారాయణ అనుకున్నప్పుడు సహజంగానే విమర్శలు తప్పవు. పరిశ్రమలోని పెద్దలు అక్కినేని పనికిరాడన్నారు. పత్రికలు ఇదేం సెలక్షన్ అని కామెంట్ చేశాయి. అయితే డి.ఎల్. వెనక్కు తగ్గలేదు. నవయుగ కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటివారు అక్కినేనికి తమ మద్దతు మానలేదు. ఎలాగో ఆ పాత్ర ఆయనకు వచ్చింది. వీరుడికి తగిన సమరస్థలి. అక్కినేని కూడా సినీ రంగంలో తాను నిలబడడానికి ఇదే ఆఖరి చాన్సు అనుకున్నారు. ఆ స్పృహతోనే సర్వశక్తులు ఒడ్డి ‘దేవదాసు’ చేశారు. ఫలితం తెలిసిందే. ఇందులో దేవదాసు తన పిరికితనంతో ప్రేమ, పేరు, కులం, కుటుంబం అన్నీ పోగొట్టుకుంటాడు. అయినా సరే ఆ పాత్రంటే మనకు అసహ్యం కలగదు. పైగా జాలి, ప్రేమ కలుగుతాయి. దీనికి కారణం అక్కినేని అభినయం. ఆయన అందులోకి తెచ్చిన జీవం. ముఖ్యంగా- చంద్రముఖి దేవదాసు వీడ్కోలు సన్నివేశం,ై రెల్లో ధర్మన్నను వదిలి దుర్గాపురం వెళ్లే సన్నివేశం, చావుబతుకుల్లో పార్వతి కోసం పరితపించే సన్నివేశం ఈ మూడింట్లో అక్కినేని- దేవదాసును నిజంగా చూస్తున్నామా అన్నంత భ్రాంతి కలిగించారు. కాళుడులోంచి కాళిదాసు వచ్చినట్లు దేవదాసులోంచి అక్కినేనిలోని నటుడు బయటికొచ్చి సాంఘిక నాయకుడిగా దశాబ్దాల పాటు విజయదుందుభి మోగించాడు. ఆ వరుసలో శరత్ రచించిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా వచ్చిన చిత్రం తోడికోడళ్లు. ఆదుర్తి దర్శకుడు. ప్రేక్షకుల కోసమని నవలని బాగా మార్చాల్సి వచ్చింది. దానికి కారణం శరత్తే. ఆయన నవలల పట్ల ఉన్న ఒక అభిప్రాయం. ఆ శరత్ నవలల్లో ఏముంది.. బండెడు పాదధూళీ కుండెడు కన్నీళ్లూ అన్నారట ఎవరో. అలాంటి కథని దుక్కిపాటి, ఆదుర్తి, ఆత్రేయ తీసుకొని తెలుగుదనం జోడించి తోడికోడళ్ల సంగ్రామం సినిమా సక్సెస్ ఫార్ములాల్లో ఒకటని స్థిరపరిచేశారు. ఇందులో అక్కినేని- తాను వేసిన సత్యం పాత్రకు సమగ్ర రూపకల్పన జరగక పోయినా ఆ లోపాలు కనబడకుండా నటించి ఆ పాత్రను చిరస్మరణీయం చేశారు. ‘కారులో షికారుకెళ్లే’ పాట ఇందులోదే కదా. శ్రీశ్రీ రాశారని అనుకున్నారు. ఆత్రేయ మెరుపు అది. శరత్ రాసిన ‘కాశీనాథ్’ నవల ఆధారంగా తీసిన చిత్రం ఇల్లరికం. ఇందులో ఇల్లరికానికి అంగీకరించిన ఒక స్వాభిమాని అనుభవించే మానసిక క్షోభను అక్కినేని బాగా అభినయించారు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో- రాధ(జమున)తో వేణు (అక్కినేని) ‘అన్నం తింటుంటే అవమానిస్తున్నారు. నిన్ను క్షమిస్తున్నాను. కాని ఆ భగవంతుడు క్షమించడు’ అన్నప్పుడు ఆ గొంతులో కాఠిన్యం ధ్వనించదు. ఒక హుందాతనం గోచరిస్తుంది. మరో విశేషం. ఈ సినిమాలోని ‘నిలువవే వాలు కనులదానా’ పాట అక్కినేనికి నచ్చలేదట. అయినా దర్శకుడు తాతినేని ప్రకాశరావు నచ్చచెప్పి తీశారు. తీరా రిలీజయ్యాక ఆ పాట వల్లే ఆ చిత్రం రజతోత్సవాలు జరుపుకుంది. శరత్ రచించిన ‘బడీ దీదీ’ నవల ఆధారంగా భానుమతీ రామకృష్ణులు నిర్మించిన చిత్రం ‘బాటసారి’ (1961). ఇది అక్కినేని నటజీవితంలో కలికితురాయి. చివరి ఊపిరి వరకూ ఆయన ఈ సినిమా గురించి మాట్లాడేవారు. అక్కినేనికి తన పాత్రల్లో ఎక్కువ నచ్చింది కూడా ‘సురేన్’ పాత్రే. సురేంద్రనాథ్ అమిత మితభాషి. సమాజంలో ఒంటరిగా వదిలేస్తే బతకడం తెలీని, చేతగానిమనిషి. మాటల ద్వారా గాక చూపుల ద్వారా, కదలికల ద్వారా భావాన్ని వ్యక్తం చేసే పాత్ర అది. చాలా కష్టం. కాని అలాంటి చాలెంజ్ను ఎదుర్కొని సఫలం అయిన నటుడు అక్కినేని. ఇక శరత్ రచించిన ‘దత్త’ నవల ఆధారంగా ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వాగ్దానం’ (1961). బ్రహ్మసమాజం నేపధ్యంగా సాగే నవలను తెలుగు వాతావరణానికి అనువుగా మలచడంలో ఆత్రేయ విఫలమైనా ‘సూర్యం’ పాత్రలో అక్కినేని సఫలమయ్యారు. సినిమాలో నాయికే ప్రధానం. నాయకుడు మబ్బుచాటు చంద్రుని వలే ఉంటాడు. తనకు అన్యాయం, అవమానం జరిగినా పట్టించుకోని సంయమనశీలి. ఈ రకమైన పాత్రలు అక్కినేనికి కొట్టినపిండే అయినా ఆత్రేయ దర్శకత్వపు అత్యుత్సాహంలో అక్కినేని నట వైదుష్యం అడవిలో కూసిన కోయిలే అయింది. అయినా ‘నా కంటిపాపలో నిలిచిపోరా’ (దాశరథికిదే తొలి చిత్రగీతం) అన్న పాట ద్వారా అక్కినేని మరోసారి లవర్బాయ్ అని నిరూపించుకున్నాడు. ఇలా ఒక బెంగాలీ రచయితకు ఒక తెలుగు హీరో దొరికి ఆదరణ పొందడం విడ్డూరం. ఆ భోగం శరత్కు దక్కింది. ఆ వైభోగం అక్కినేనికే సాధ్యమైంది. - కంపల్లె రవిచంద్రన్, 9848720478 -
ముద్దబంతి పువ్వులు..మూగకళ్ల ఊసులు..ఎనక జనమ బాసలు..
గత జన్మలో మనం ఏంటి? తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. 10, 20 ఏళ్ల క్రితం కాలేజ్ ఏజ్లో గాఢాతి గాఢంగా, ప్రాణాతిప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మళ్లీ తారసపడితే ఆ ఫీలింగే వేరు. అలాంటిది గతజన్మలో వలచిన అమ్మాయి తారసపడితే... నిజంగా షాకింగే కదూ! అసలు గత జన్మ బంధాలుంటాయా? ఏమో... కొంతమందిని చూస్తే వాళ్లు మనకు ముందే తెలిసినట్టుగా, బాగా దగ్గరైనట్టుగా... ఒక్క మాటలో చెప్పాలంటే ‘సోల్మేట్’లాగా అనిపిస్తుంది. పూర్వజన్మ అనేది ఒకటుంటుందని చాలామంది నమ్ముతారు. దాన్ని బేస్ చేసుకుని ఓ ప్రేమకథ అల్లితే... అదే ‘మూగ మనసులు’. ఇది ముగ్గురు మనుషుల కథ. మూడు జన్మల కథ. ఈ సినిమాతో మనకు ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్టుంది. అందుకే 50 ఏళ్లయినా ఈ సినిమాని మరచిపోలేక పోతున్నాం. సేలంలో ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆదుర్తి సుబ్బారావు డెరైక్టర్. మనవాడే. మద్రాసు నుంచి రైటర్ ముళ్లపూడి వెంకట రమణని పిలిపించారు. నా దగ్గరో కథ ఉంది. ఆత్రేయకు రాయమని ఇస్తే ఆరు నెలలు పెట్టుకుని సినిమాకు పనికిరాదని తేల్చేశారు. దీని సంగతొకసారి చూస్తారా?’’ అన్నారు ఆదుర్తి. ఓ పడవవాడు... చదువుకుంటున్న డబ్బున్న యువతి... వీరిద్దరి మధ్యనా ప్రేమ ఉందనే సంగతి వాళ్లకే తెలియదు. సూక్ష్మంగా ఆదుర్తి చెప్పిన ఈ కథ రమణకు నచ్చేసింది. హోటల్లో మూడ్రోజులు కూర్చొని కథ, మాటలు, పాటలకు పల్లవులు రెడీ చేశారు. ఫైనల్గా మెరుగు పెట్టమని ఆత్రేయకు స్క్రిప్టు ఇచ్చారు ఆదుర్తి. ‘‘సుబ్బారావ్... ఇదో గొప్ప కథ. ఈ రమణెవడో బాగా రాశాడు. దాన్ని మార్చి అంతకన్నా బాగా రాయాలనుకుని ఈ నాలుగు రోజులూ తంటాలు పడ్డాను. అందరూ ఆత్రేయ రాసిన డైలాగులు ఫెయిర్ కాపీ చేస్తారు. నేనేమో ఈ రమణ డైలాగుల్ని కాపీ చేశాను’’ అన్నారు ఆత్రేయ చాలా నిజాయతీగా. ఆదుర్తికి ధైర్యం వచ్చేసింది. ఈ కథంటే ఎందుకో తెలీదుగానీ ఆయనకు విపరీతమైన మమకారం. ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న కథ - నిజ జీవితంలో విన్న కొన్ని పునర్జన్మ సంఘటనలు - హిందీ సినిమా ‘మధుమతి’... ఇవన్నీ మిళాయించి ఈ స్టోరీలైన్ అనుకున్నారు. అది ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ తాజ్మహల్ హోటల్లో మ్యూజిక్ సిట్టింగ్స్. కేవీ మహదేవన్ మ్యూజిక్. ఆత్రేయ 7 పాటలు రాశారు. ‘గోదారి గట్టుంది’ పాటను దాశరథి, ‘గౌరమ్మా... నీ మొగుడెవరమ్మా’ పాటను కొసరాజు రాశారు. అప్పట్లో ఏ షూటింగైనా స్టూడియోల్లో, సెట్స్లో జరగాల్సిందే. ఇదేమో అంతా గోదావరితో ముడిపడిన కథ. గోదావరి సెట్ వేయలేరు కదా! మద్రాసులో సముద్రమే తప్ప, నది లేదు. గోదావరి జిల్లాలకు వెళ్లి తీరాల్సిందే. దాంతో స్టూడియోను దాటి కెమెరా సఖినేటిపల్లి బయలుదేరింది.తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో షూటింగ్. ఏయన్నారూ, సావిత్రి, జమునలాంటి స్టార్లు... ఇంకేముంది... పొలోమంటూ ఒకటే జనం. ఆ ఊళ్లో రుద్రరాజువారి కుటుంబం ఫేమస్. మొత్తం ఎనమండుగురు అన్నదమ్ములు. ఒక్కో తారకు ఒక్కో ఇంట్లో బస. ఆతిథ్యం అదుర్స్. టైమ్పాస్ కోసం ఖాళీ ప్లేస్లో షటిల్ కోర్టు ఏర్పాటు. గోదావరి ఒడ్డున ఓ జమిందారు బంగ్లా కావాలి. ఎక్కడా దొరకలేదు. దాంతో ఆర్ట్ డెరైక్టర్తో ముక్తేశ్వరం రేవులో సెట్ వేయించేశారు. ఆ రోజుల్లో 80 శాతం సినిమా అవుడ్డోర్లోనే తీయడమంటే మామూలు విషయం కాదు. మిగతా 20 శాతం హైదరాబాద్ సారథీ స్టూడియో, మద్రాసు వాహినీ స్టూడియోలో పూర్తి చేశారు. ధవళేశ్వరంలో ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాట తీశారు. మోటార్ బోట్లో ఏయన్నార్, సావిత్రిపై వస్తుందీ పాట. బాగా ఎండ. చెమట వల్ల జారిందో ఏమో కానీ సావిత్రి టపీమని గోదాట్లో పడిపోయింది. యూనిట్ గుండె జారిపోయింది. గజ ఈతగాళ్లు కూడా గజగజ వణుకుతూ సావిత్రిని కాపాడ్డం కోసం దూకేశారు. సావిత్రికి మాత్రం కంగారు లేదు. బ్రహ్మాండమైన స్విమ్మర్ ఆమె. కానీ కట్టుకున్నది చీర కదా, కాళ్లు కదపడం కష్టమైపోయింది. ఈలోగా ఈతగాళ్లు వచ్చి కాపాడేశారు. ఇక జమునదొక ఎపిసోడ్. ఆమె చేసేది మేకలు తోలుకునే గౌరి పాత్ర. గోదావరి యాసలో మాట్లాడాలి. ఆమెకు అస్సలు అలవాటు లేదు. దాంతో ఆమెకు ఆ యాస నేర్పే బాధ్యతను కె.విశ్వనాథ్కి అప్పగించారు. రెండ్రోజులు అదే పని. చిన్నపిల్లలతో ఓనమాలు దిద్దించినట్టుగా నేర్పించారు. మాంచి ఎండలో... రాళ్లూ, రప్పల మధ్య ‘ముక్కుమీద కోపం’ పాట తీస్తున్నారు. ఈ పాటలో జమున, ఏయన్నార్కి కాలు అడ్డంపెట్టి కొట్టాలి. ఆ ఎగరడంలో పొరపాటున జమున కాలికి రాయి గుచ్చుకుపోయింది. ఒకటే రక్తం. అయినా బాధ ఓర్చుకునే పాట పూర్తి చేశారు జమున. ‘గోదారి గట్టుంది’ పాటకు కూడా అంతే. జమున సోలో సాంగ్. హీరాలాల్ డాన్స్ డెరైక్టర్. యమా స్ట్రిక్ట్. అనుకున్నట్టు రాకపోతే వంద టేక్లైనా తీసుకుంటాడు. గోదావరి ఒడ్డున ఎండల్లో ఇసుకలో ఈ పాట. అదీ చెప్పుల్లేకుండా చేయాలి. 30 టేక్లు. ఇసుకలో పరిగెత్తి పరిగెత్తి జమున అరికాళ్లు బొబ్బలెక్కిపోయాయి. ఒకటే ఏడుపు. చివరకు 31వ టేక్ ఓకే అయ్యింది. కె.విశ్వనాథ్ ఈ సినిమాకు సెకండ్ యూనిట్ డెరైక్టర్గా కూడా పనిచేశారు. ఏ ఏ ఏ 1964 జనవరి 31. మార్నింగ్ షోకే ఫలితం తేలిపోయింది. ‘మూగ మనసులు’ సూపర్డూపర్ హిట్. ఈ సినిమాకొచ్చిన ప్రశంసలు, పురస్కారాలకు లెక్కేలేదు. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఓ కిరీటం. గోపీ పాత్రలో ఏయన్నార్ అదరగొట్టారు. అంత పెద్ద హీరోని పట్టుకుని, సావిత్రి ‘ఏరా... ఏరా’ అంటుంది. ఇప్పుడైతే అలా పిలిపించుకోవడానికి ఏ హీరోనూ ఒప్పుకోరేమో! ఇంకో సీన్లో ఏయన్నార్ గుండె మీద జమున కాలుపెట్టి నిలుచుంటే, ఆయనేమో ఆవిడ పాదాలకు పారాణి దిద్దుతుంటాడు. ఎక్కడా ఇగోల్లేవు. అందుకే ఆ సీన్స్ ఇన్నేళ్లయినా బతికే ఉన్నాయి. ఇక కళ్లతోనే యాక్ట్ చేయడం సావిత్రికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదేమో. గౌరి పాత్ర జమున కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ‘గౌరమ్మా’ పాటలో ఏయన్నార్ని కాసేపు శివుడిగా చూడొచ్చు. ఆయన మళ్లీ ఎప్పుడూ ఈ వేషం వెయ్యనే లేదు. టైటిల్స్కి ముందు పూర్వ జన్మస్మృతి గురించి పరిచయ వాక్యాలు చెప్పింది ఎవరో తెలుసా? ఆచార్య ఆత్రేయ. ఆయన వాయిస్ ఓవర్ చెప్పిన ఏకైక సినిమా ఇదే!డెరైక్టర్గా ఆదుర్తి గ్రేట్నెస్ చెప్పడానికి ఈ ఒక్క సినిమా చాలు. ఎక్కడా ఒక్క వేస్టు సీన్ కనబడదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇదో భయంకరమైన ట్రాజెడీ సినిమా. దానిని చాలా నేర్పుగా ‘సుఖాంతం’ అనిపించేలా రూపకల్పన చేశారు. ఏ ఏ ఏ ఈ సినిమా ఇన్నేళ్లు బతికిందంటే ప్రధాన కారణం పాటలే. పాటలు లేకుండా ‘మూగ మనసులు’ని కలలో కూడా ఊహించలేం. పాలల్లో పంచదార కలిసిపోయినట్టుగా సంగీత సాహిత్యాలు కలగలసిపోయి మధురాతి మధురంగా అనిపిస్తాయి. మామ సంగీతం మనల్ని అమృతంలో మునకలేయిస్తుంది. పాటల్లో ఎక్కడా డాంబికం కనబడదు. అర్థం కాని పదమే వినబడదు. మ్యూట్లో పెట్టి పాటలు చూస్తున్నా మనం అలా అలా పాడేసుకుంటాం. అంతలా మనలో లీనమై పోయాయా పాటలు. ఆ సాహిత్యం వెనుక సారాన్ని విశ్లేషిస్తే ఓ ఉద్గ్రంథమే తయారవుతుంది! ఏ ఏ ఏ ఈ చిత్రాన్ని హిందీలో ‘మిలన్’గా రీమేక్ చేస్తే సెన్సేషనల్ హిట్టయ్యింది. తమిళంలో సావిత్రి సొంతంగా ‘ప్రాప్తం’ పేరుతో రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ‘‘అప్పట్లో నేను వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా పనిచేస్తుండేవాణ్ణి. ఆ సమయంలోనే ఆదుర్తిగారితో సాన్నిహిత్యం ఏర్పడింది. తన దగ్గరకు వచ్చేయమన్నారు. దాంతో నా ఉద్యోగానికి సెలవు పెట్టి చేరాను. మొదట ఈ కథను వేరే నిర్మాతకు చెబితే ఖర్చు ఎక్కువవుతుందని వదిలేశారు. దాంతో ఈయన సి.సుందరంతో కలిసి ఈ సినిమా తీశారు. ఒక ఆర్టిస్టుతో సీన్లు తీస్తున్నపుడు, మరో ఆర్టిస్టుని ఖాళీగా ఉంచడం ఎందుకు అని నన్ను సెకండ్ యూనిట్ డెరైక్టర్ని చేసి, కొన్ని సీన్లు తీయించారు. అప్పట్లో ఆదుర్తిగారు వరుసగా ‘మనసులు’ వచ్చే విధంగా టైటిల్స్ పెట్టేవారు. అందుకే దీనికి ‘మూగ మనసులు’ అని ముందే పెట్టేసుకున్నారు. ఏ తరం వాళ్లకైనా ఈ సినిమా నచ్చుతుంది’’. - కె.విశ్వనాథ్ -
నాన్నగారు ఆ రాత్రి అందర్నీ పిలిపించుకున్నారు!
మహానటుడు ఏయన్నార్ దివికేగి అప్పుడే వారం రోజులైపోయింది. కుటుంబ సభ్యులూ అభిమానులూ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నాగార్జున కూడా తండ్రి లేని లోటుని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నాకాయన తండ్రికన్నా ఎక్కువ’’ అంటూ ఏయన్నార్ చివరి రోజుల్ని, అప్పటి సంఘటల్ని నాగ్ ‘ఫేస్బుక్’లో ఇలా ఆవిష్కరించారు. * ‘మనం’ షూటింగ్ లొకేషన్లోనే ఉన్నప్పుడే నాన్నగారు అస్వస్థతకు గురయ్యారు. అన్ని పరిక్షలు చేసిన తర్వాత కేన్సర్ ఐదో దశలో ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పటివరకు నాన్నగారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు కేన్సర్ అని తెలియగానే, మాకు ధైర్యం చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం పదిహేను రోజులకు ఆస్పత్రినుంచి నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడాయన, ‘నా ఆరోగ్యం ఇంకా పాడవ్వకముందే ‘మనం’లో నా పాత్రకు డబ్బింగ్ చెబుతా. డబ్బింగ్ పరికరాలన్నీ ఇంటికి తెప్పించు. ఒకవేళ నేను చెప్పకపోతే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్తో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించేస్తావు’ అన్నారు. ఆయన అనుకున్నట్లుగానే డబ్బింగ్ చెప్పారు. ఒక్క పాట మినహా తన పాత్రకు సంబంధించిన మిగతా షూటింగ్ని పూర్తి చేశారు. 1920 నుంచి 2013 మధ్యలో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. అందులో నాన్నగారు 90 ఏళ్ల వ్యక్తి పాత్ర చేశారు. మార్చి, 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆయనకు ఓ ఘనమైన వీడ్కోలుగా ఈ సినిమా ఉంటుందని నా ఆకాంక్ష. * ఇంత త్వరగా ఇలా జరుగుతుందని నాన్నగారు ముందే ఊహించారనుకుంటున్నాను. మాక్కూడా తెలియజెప్పాలనుకుని ఉంటారు. ఎందుకంటే, సెప్టెంబర్లో తన 90వ పుట్టినరోజుని దేశ, విదేశాల్లోని తన మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలనుకున్నారు. అందర్నీ ఆహ్వానించారు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు. దాదాపు రెండు వేల మంది ఆ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. అతిథుల కోసం సుమారు 200 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గరికెళ్లి, అందరితోనూ మాట్లాడారు. ఆ సందర్భంగా గంటసేపు తన లైఫ్ ట్రావెలింగ్ గురించి మాట్లాడారు. లక్కీగా మేం ఆ స్పీచ్ని రికార్డ్ చేశాం. దీన్ని అందరి ముందుకూ తీసుకురావాలనుకుంటున్నాం. * చివరి దశలో నాన్నగారు అన్ని సినిమాలూ చూడటం మొదలుపెట్టారు. ఆయా సినిమాల్లోని ఆర్టిస్టుల యాక్టింగ్ గురించి మాత్రమే ఆయన మాట్లాడేవారు. ‘శ్రీరామదాసులో నా నటన ఆయనకిష్టం. ఏ చివరి రోజుల్లో ఆయనకు నొప్పి అనిపించేది. ఆస్పత్రికి తీసుకెళితే, మొదటిసారి ‘పెయిన్ కిల్లర్స్’ ఇచ్చారు. మరో రెండు నెలలు మాత్రమే అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్నగారు ‘ఇంటికెళదాం’ అన్నారు. ఆ రాత్రి (జనవరి, 21) మమ్మల్నందర్నీ ఆయన దగ్గర ఉండమన్నారు. తొమ్మిదిన్నరకు అందర్నీ ఇంటికెళ్లమన్నారు. కేన్సర్ని ఎదుర్కొలేం అని తెలుసుకున్న తర్వాత ఆ రాత్రే ఆయన ప్రశాంతంగా కనుమూశారు. నాన్నగారి మరణవార్త తెలుసుకుని, అభిమానులు, ఇతరులు స్పందించిన తీరుకి మేమంతా విస్తుపోయాం. బాధపడటానికి కూడా మాకు టైమ్ దొరకలేదు. వేలాది మంది తరలి వచ్చారు. అంతమందికి ప్లేస్ లేకపోవడంతో మేం ఇంటి గేటు మూసేశాం. * తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అందరి సందర్శనార్థం నాన్నగారి భౌతికకాయాన్ని ఉంచాం. * నాన్నగారి చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ గడపడం కోసం షూటింగ్స్ అన్నీ వదులుకున్నాను. నా పనులన్నీ మానుకున్నాను. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పటికీ పని మీద మనసు నిమగ్నమవ్వడంలేదు. పరధ్యానంగానే పని చేస్తున్నాను. -
ఏఎన్నార్ గొప్ప మానవతా వాది
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మరో ధృవ తారను కోల్పోయిందని తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పేర్కొంది. ఏఎన్నార్ అద్బుతమైన నటుడని కీర్తించింది. అంతేకాకుండా అంతకు మించిన మంచి మానవతావాది అని తెలిపింది. ఆ మహానటుడి నటన, జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని వెల్లడించింది. దాదాపు 75 ఏళ్లకు పైగా పలు చిత్రాలలో నటిస్తునే ఉన్నారని చెప్పింది. ఏఎన్నార్ నటించిన చిత్రాలు ప్రపంచ ప్రేక్షకుల మదిని రంజింప చేశాయని తెలిపింది. ఆ మహానటుడి నటనాచాతుర్యం ఆమోఘమని అభివర్ణించింది. అక్కినేనితో తమ సంస్థకు గల అనుబంధాన్ని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అందులోభాగంగా 2012లతో జీవిత కాల సాఫల్య పురస్కారంతో తమ సంస్థ అక్కినేనిని గౌరవించిన సంగతిని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. -
ఏఎన్నార్ మృతికి నాట్స్ సంతాపం
అమెరికా: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మహానటుడు, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రగాఢ సంతాపం తెలిపింది. కృష్ణా జిల్లా వెంకటరాఘవాపురంలో సెప్టెంబర్ 20, 1924న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన మే 8, 1944లో సినీ నటుడిగా అరంగేట్రం చేసి, తన తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా నటిస్తునే ఉన్నారని తెలిపింది. ఆయన సినీ ప్రస్థానంలో సుమారు 256 పైగా చిత్రాలలో హీరోగా, పౌరాణిక,జానపద, సాంఘిక,సామాజిక పాత్రలలో నటించారని పేర్కొంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య , ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మ విభూషణ్ తదితర పురస్కారాలను ఏఎన్నార్ అందుకున్నారని నాట్స్ వెల్లడించింది. తన నటనతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు మరణం.. అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు శుక్రవారం వెల్లడించారు. అక్కినేని మరణించారన్నా వార్తా ఇప్పటికీ తాము జీర్ణించుకో లేక పోతున్నామన్నారు. ఈ సందర్బంగా అక్కినేని కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందని గంగాధర్ దేసు తెలిపారు. -
ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల
'మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం' అని అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల వ్యాఖ్యానించారు. ఫిలిం చాంబర్లో నిర్వహించిన ఏఎన్ఆర్ సంతాప సభలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర విభాగాలకు చెందిన టెక్నిషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు స్పందించని సినీ పరిశ్రమ..మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం అని నాగసుశీల అన్నారు. ఇదే సభలో మహానటులకు జరిగిన అన్యాయంపై ఆర్ నారాయణ మూర్తి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ స్వార్థాల వల్ల మహానటులు ఎన్ టీఆర్ కు భారత రత్న రాలేదు అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఏఎన్నాఆర్ కు భారతరత్న ఇచ్చి తీరాలి నారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలంటే..
ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వారితో పాటు జాతికి ఎనలేని సేవలు చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కినేని పార్థివదేహానికి గురువారం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ వడ్డిపల్లి రామారావు నేతృత్వంలో 24 మంది సిబ్బంది, పోలీసు బ్యాండు ఇందులో పాల్గొన్నాయి. ప్రభుత్వం తరఫున ఓపెన్ టాప్ ట్రక్ను పూలతో అలంకరించి తెస్తారు. కత్తితో సహా తుపాకులు (.303 రైఫిల్) ధరించిన 15 మంది ఫైరింగ్ సిబ్బంది. పార్థివ దేహాన్ని మోసే బేరర్లు 10 మంది ఉంటారు. సదరు వ్యక్తి జాతికి చేసిన సేవలు, ప్రభుత్వం నుంచి అందుకున్న అవార్డులను గౌరవిస్తూ ఇంటి వద్ద పార్థివదేహానికి ‘గార్డ్ ఆఫ్ హానర్’ పేరిట గౌరవ వందనం సమర్పిస్తారు. తరవాత బేరర్లు శవపేటికను భుజాలపై ఎత్తుకుని లయబద్ధంగా నడుస్తూ అంతిమ సంస్కారాలు చేసే చోటికి తీసుకువెళతారు. దీన్ని ‘ధీరే చల్’ అంటారు. పార్థివ దేహాన్ని చితిపై పెట్టి కట్టెలు పేరుస్తున్న సమయంలో మరోసారి ‘గార్డ్ ఆఫ్ హానర్’తో పాటు తుపాకుల్ని లయబద్ధంగా తిప్పుతూ ‘సలామీ శస్త్ర్’ వందనం చేస్తారు. చితికి నిప్పుపెట్టే ముందు గాల్లోకి మూడు రౌండ్ల చొప్పున కాల్పులు జరిపి రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. అనంతరం తుపాకుల్ని తలకిందులుగా తిప్పి కుడి కాలుమీద పెట్టుకుంటారు. దీన్ని ‘శోక్ శస్త్ర్’గా పిలుస్తారు. సలామీ శస్త్ర్, శోక్ శస్త్ర్ సందర్భాల్లో శ్రద్ధాంజలి ఘటిస్తూ పోలీసు బ్యాండ్ వాయిస్తారు. ‘కార్వాయ్’గా పిలిచే ప్రధాన కార్యక్రమం 10 నిమిషాలుసాగుతుంది. -
ఇంక సెలవు
నటసమ్రాట్ అక్కినేనికి తెలుగు జాతి తుది వీడ్కోలు సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. కుటుంబ సభ్యులు, అశేష అభిమాన జనవాహిని శోకతప్త హృదయాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కినేని తనయులు వెంకట్, నాగార్జున సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కినేని మనవడు సుమంత్ ముందుగా నాగార్జునతో కలిసి ప్రదక్షిణలు చేశారు. నాగార్జున భుజంపై కుండతో తండ్రి పార్థివ దేహం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేశారు. ఆయనతో పాటు కుమారుడు వెంకట్, కూతురు నాగసుశీల, కోడలు అమల, మనవలు సుమంత్, నాగచైతన్య, సుశాంత్, అఖిల్ తదితరులు కూడా ప్రదక్షిణలు చేశారు. కన్నీళ్ల మధ్య కార్యక్రమాన్ని కొనసాగించారు. పలువురు ప్రముఖులు అక్కినేని చితిపై గంధపు చెక్కలు వేసి నివాళులర్పించారు. పోలీసు లు అధికారిక లాంఛనాలతో అక్కినేనికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి తుపాకులు ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే సమయంలో నాగార్జునతో పాటు కుటుంబసభ్యులంతా కలిసి చితికి నిప్పంటించారు. పోలీసులు బ్యాండ్మేళాతో గౌరవ వందనం సమర్పించారు. అంతటితో అంత్యక్రియల ఘట్టం ముగిసింది. చితికి నిప్పంటించిన సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక పోయా రు. ఆయనను సముదాయించడం ఎవరి తరమూ కాలేదు. అంత్యక్రియలు ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కూడా నాగార్జున గుండెలవిసేలా ఏడుస్తూనే ఉన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓదార్చే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న దాసరి, చిరంజీవి, రామానాయుడులను పట్టుకొని నాగార్జున విలపించారు. నాన్న మరిక లేరంటూ బోరున ఏడ్చేశారు. దాంతో చిరంజీవి, దాసరి, రామానాయుడు కూడా కన్నీరు కార్చారు. ఘన నివాళులు అక్కినేని అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుని అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. అంత్యక్రియలకు అలనాటి అగ్ర తార శ్రీదేవి ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, టబు, అనుష్క, జయసుధ, కైకాల సత్యనారాయణ, నిర్మాత డి.రామానాయుడు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, డి.సురేశ్బాబు, భానుచందర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆర్.నారాయణమూర్తి, బ్రహ్మానందం, మురళీమోహన్ సహా ఎందరో సినీ నటులు అక్కినేని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు కూడా పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ముందు బారులు తీరారు గేట్లు తెరవగానే భారీగా లోనికి చొచ్చుకెళ్లారు. అక్కినేని భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు అక్కినేని స్వగ్రామం రామాపురం నుంచి గ్రామస్తులు బ్యానర్లతో ర్యాలీగా తరలివచ్చారు విజయనగరం నుంచి కూడా అక్కినేని అభిమానులు బస్సుల్లో తరలివచ్చారు అభిమానులు చెట్లెక్కి, కరెంట్ తీగల పక్కనే నిలబడి మరీ అంత్యక్రియలను చూస్తూ విలపించారు అక్కినేని ఫొటోతో కూడిన బ్యానర్లు పట్టుకుని, దారి పొడవునా ‘అమరజీవి అక్కినేని అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు 60 ఏళ్లుగా అక్కినేనిని అభిమానిస్తున్న గుంటూరుకు చెందిన షేక్ అమీన్ తన హీరోను కడసారి చూసుకునేందుకు వచ్చాడు. ఓ వికలాంగ అభిమాని అంతిమయాత్ర పొడవునా చేతులపైనే నడిచి అభిమానం చాటుకున్నాడు చాలామంది అభిమానులు అక్కినేని పాత ఫొటో డిజైన్ చేసిన నల్ల బ్యాడ్జీలు ధరించారు అక్కినేని మృతికి సంతాప సూచకంగా గురువారం రాజధానిలోని అన్ని థియేటర్లలోనూ మార్నింగ్ షోలు రద్దు చేశారు సినీ, టీవీ షూటింగులన్నీ రద్దయ్యాయి. సినీ కార్మిక సంఘ కార్యాలయాలు మూతపడ్డాయి సినీ కార్మికులు భారీ ర్యాలీగా అంత్యక్రియలకు తరలివచ్చారు పోటెత్తిన జనసంద్రం అక్కినేని భౌతిక కాయాన్ని కడసారిచూసేందుకు ఉదయం నుంచే ప్రజలు, అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణంతో పాటు పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయాయి. అన్నపూర్ణ స్టూడియోకు దారితీసే రోడ్లన్నీ జనంతో పోటెత్తాయి. భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అక్కినేని పార్థివ దేహాన్ని ఫిల్మ్ చాంబర్కు తరలించారు. 12.30 గంటలకు అక్కినేని భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శన కోసం ఫిల్మ్ చాంబర్లో ఉంచారు. మధ్యాహ్నం 1 గంటకు ఫిల్మ్ చాంబర్ నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా సాగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వెంట రాగా, దారి పొడవునా అభిమానులు కన్నీరు కారుస్తూ సాగారు. సాయంత్రం 3.05కి అన్నపూర్ణ స్టూడియోస్కు చేరేసరికే రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ప్రధాన ద్వారం నుంచి అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి అక్కినేని పార్థివ దేహాన్ని చేర్చడానికి అరగంట పట్టింది. అక్కినేనికి కర్ణాటక అసెంబ్లీ గురువారం ఘన నివాళులు అర్పించింది. ఆయన మరణం పట్ల సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించింది. అక్కినేని మృతి సినీ ప్రేక్షకులకు తీరని లోటని స్పీకర్ కాగోడు తిమ్మప్ప అన్నారు. పలు రికార్డులు ఆయన సొంతమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు?
కామన్మెన్ గుండె చప్పుడు ఆగిపోయింది... తెలుగమ్మాయి స్కూల్ పుస్తకంలోకొచ్చిన మొదటి హీరో ఫొటో కనపడకుండా పోయింది... సినిమా థియేటర్కి కట్టిన మొట్టమొదటి హీరో బ్యానర్ గాలికి ఎగిరిపోయింది... తన కోసం క్యూలో జనానికి తొక్కిసలాట అలవాటు చేసిన తొలి తెలుగు సినిమా టికెట్... 91 ఏళ్ల తర్వాత ఇప్పుడు చినిగిపోయింది... తెలుగు హీరో అడ్రస్కి పోస్ట్మేన్ తెచ్చిన తొలి ప్రేమలేఖ... ఊరి గోడలు దాటి నట్టింటికొచ్చిన మొదటి సినిమా పోస్టర్... సెలూన్ గోడలమీద సినిమా హీరోలకు చోటిచ్చిన స్టయిలిష్ హీరో స్టిల్ ఫొటో... ఇప్పటికీ ఊళ్లో వైన్ షాప్ బోర్డ్ మీద గ్లాస్ పట్టుకొని కనిపించే దేవదాసు బొమ్మ... భౌతికంగా ఇక లేదు. వెండితెర చిన్నబోయిన వేళ అది... సినిమా తల్లి గర్భశోకంతో వెక్కి వెక్కి ఏడ్చిన వేళ అది. తెలుగునేల జనసంద్రంగా మారిన వేళ అది. 75 ఏళ్ల పాటు అసమాన నటనతో తెలుగుతెరను స్వర్ణయుగశోభితం చేసిన అద్వితీయ నటుడు అక్కినేని.. భౌతికంగా ఇక కనబడరని తెలిసి కోట్లాది జనం గుండెలవిసేలా తల్లడిల్లిన వేళ అది. ప్రేమలోని మాధుర్యాన్ని వెండితెర సాక్షిగా తెలియజేసిన అందాల ‘బాలరాజు’ ఇక లేడా? ‘కలిమిలేములు కష్టసుఖాలు.. కావడిలో కుండలని భయమేలోయీ..’ అని ధైర్యం చెప్పిన ‘దేవదాసు’ ఇక రాడా? విరహాన్నీ, విషాదాన్నీ, హాస్యాన్ని, ఆగ్రహాన్నీ అన్ని రసాలనీ అనితరసాధ్యంగా అభినయించి దశాబ్దాల పాటు ఆనందాన్ని పంచిన అభినయ శిఖరం భౌతికంగా ఇక కనిపించదా? నిన్నటిరోజు తెలుగు ప్రజానీకం గుండెల్లో ప్రతిధ్వనించిన ప్రశ్నలివి. విషణ్ణ వదనాలతో అక్కినేని భౌతికకాయాన్ని అనుసరించినవారు లక్షలాదిగా ఉంటే... కోట్లాది మంది జనాలు టీవీ సెట్లకు అతుక్కుపోయారు. కన్నీటితోనే ఆ మహా నటుడికి తుది వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం 11.30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన అక్కినేని అంతిమయాత్రలో... సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అగ్నిసంస్కారం జరిగే వరకూ ఆ బహుదూరపు బాటసారికి తోడుగా నిలిచారు. కుటుంబ సభ్యులతో పాటు, సినీ ప్రముఖులు సైతం కన్నీటి పర్యంతమైన ఆ ఘట్టం... మాటలతో వర్ణించరానిదే. అగ్నిలో పునీతుడవుతున్న అక్కినేనిని చూసి, అశేష తెలుగు జనం అశ్రు నివాళి అర్పించిన వేళ అది. -
అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు
-
అశ్రునయనాలతో అక్కినేని అంత్యక్రియలు
-
దుఃఖాన్ని ఆపులేకపోయిన నాగార్జున
హైదరాబాద్: తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు సందర్భంగా అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖాన్ని ఆపులేకపోక భోరున ఏడ్చేశారు. అక్కినేని అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న తర్వాత నాగార్జున, వెంకట్, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. అశ్రునయనాలతోనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతున్నంతసేపు ఆయన దుఃఖిస్తూనేఉన్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి చితికి నిప్పటించారు. అశ్రునయనాలతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తండ్రికి చివరిసారి వీడ్కోలు పలికి పుట్టెడు శోకంలో మునిగిన నాగార్జునను దాసరి నారాయణరావు, బ్రహ్మానందం గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి తదితరులు కూడా ఆయనను ఓదార్చారు. -
అశ్రునయనాల మధ్య అక్కినేని అంత్యక్రియలు
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహానటుడికి అన్నపూర్ణ స్టూడియాలో మధ్యాహ్నం 3.30 గంటలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు నిర్వహించిన నిర్వహించిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. నాగార్జున, వెంకట్, సుమంత్, అఖిల్, సుశాంత్, నాగ చైతన్య తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి చెందిన మహిళలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు. దాసరి నారాయణ, సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, రాజశేఖర్, జీవిత, శ్రీదేవి, మహేశ్వరి, టబు, రమాప్రభ తదితర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. -
దసరా బుల్లోడు.. ఇక లేడని..
మొన్నటి వరకు ఎవరైనా ఇన్షర్ట్ వేసుకుని బాగా ముస్తాబైతే ‘ఏమిరా నాగేశ్వర్రావులా తయారయ్యావు’ అని అంటుండేవారు. అక్కినేని వేసే స్టెప్పులు, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఆనాటి తరం వారు బాగా అనుకరించే వారు. యువతులైతే నాగేశ్వర్రావు సినిమాలను చూసేందుకు ఇష్టపడేవారు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన సినిమాల్లో నటిస్తున్నార ని తెలుసుకున్న అభిమానులు సంతోషించారు. వారి ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అక్కినేని మరణించారనే వార్త జిల్లా ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయమే అక్కినేని మరణ వార్త తెలుసుకున్న అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మహానటుడు ఇకలేడా అని జీర్ణించుకోలేకపోతున్నారు. నట సామ్రాట్ అక్కినేని అస్తమయంతో సినీప్రియులు దుఃఖించారు. ఘన నివాళి అర్పించారు. అక్కినేని కారణ జన్ముడు.. అక్కినేని నాగేశ్వర్రావు కారణ జన్ముడు. ఆయన జన్మించిన శతాబ్దం లో పుట్టడం నా అదృష్టం. నాగేశ్వర్రావు సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. హైదరాబాద్కు సినీ పరిశ్ర మ రావడానికి నాగేశ్వర్రావు కారకుడు. చనిపోయే వరకు కూడా నటించాడు. మిస్సమ్మ, గుండమ్మకథ, ప్రేమ్నగర్, దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాలు ఎస్సెట్. సినిమాలో నృత్యాలను తీసుకొచ్చిందీ ఆయ నే. మాలాంటి వారికి ఆయన డిక్షనరిలాంటి వారు. - పైడిపెల్లి వంశీ, ప్రముఖ సినిమా దర్శకుడు, మంచిర్యాల గొప్ప నటుడాయన.. నాగేశ్వర్రావుతో అనుబంధం మరచిపోలేను. విజయవాడలో నాకు కళాకారుడిగా నాగేశ్వర్రావు చేతుల మీదుగా సన్మా నం జరగడం జీవితంలో మరచిపోలేని అనుభూతి. సుమంత్తో రణం సినిమా తీయడానికి నాగేశ్వర్రా వు ఇంటికి వెళ్లగా ఎంతో ఓపికతో కథ విన్నారు. దర్శకునిగా నన్ను ప్రోత్సహించారు. ఆయనకు వచ్చిన అవార్డులు, సినిమాలపై 45 నిడివి గల టీవీ డాక్యుమెంట్ తీశాను. కొత్త నటులను ప్రోత్సహించేంవారు. - దండనాయకుల సురేశ్కుమార్, టీవీ, చలన చిత్ర దర్శకుడు అక్కినేని సినిమాలే బాగా ఆడేవి.. నాడు థియేటర్లలో అక్కినేని నాగేశ్వర్రావు సినిమా ప్రదర్శించామంటే ప్రేక్షకుల తాకిడి విపరీతంగా ఉండేది. మహిళాభిమానులు ఎక్కువ. లైలా మజ్ను, దసరాబుల్లోడు, పల్నా టి యుద్ధం, ముగ్గురు మరాఠీలు, దేవదాస్, ప్రమాభిషేకం సినిమాలు మా వసంత టాకీసులోనే ప్రదర్శించాం. విద్యుత్ అంతరాయం ఉన్నా ఓపికతో ఆ యన సినిమా చూసేవారు. ఉదయం ఆట టికెట్ దొరక్కపోతే మ్యాట్నీ షోకు లైన్లో ఉండే వారు. - ముస్త్యాల శంకరయ్య, సినిమా థియేటర్ యజమాని, మంచిర్యాల ఆరు కిలోమీటర్లు నడిచే వారం.. మంచిర్యాల శివారులోని నస్పూర్ గ్రామం మాది. మంచిర్యాలలోనే వసంత టాకీస్ ఉంది. అందులో నాగేశ్వర్రావు సినిమా వేశారంటే మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన కలిసి వెళ్లి చూసే వారం. అలా ఆరు కిలోమీటర్లు నడిచేవారం. ఆయనపై ఉన్న అభిమానంతో నడక ప్రయాస తెలి సేది కాదు. సినిమాల్లో అద్భుతంగా నటించేవారు. 90లోనూ నటించారంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. - పురుషోత్తంరావు, సినిమాహాలు మేనేజర్, మంచిర్యాల నేటితరం నటులతోనూ పోటీ.. నాగేశ్వర్రావు లాంటి గొప్ప నటుడు మరొకరు లేరు. నాటి నుంచి నేటితరం నటుల వరకూ ఆయన పోటీ పడ్డారు. సీతారామయ్యగారి మనుమరాలు సినిమాలో ఆయన నటన తిరుగులేని ది. సినీ పరిశ్రమ పురోగతికి అంకురార్పణ చేశారు. ఈ తరం హీరోయిన్లతో కూడా స్టెప్పులేస్తానని ఓ ఆడియో ఫంక్షన్లో నాగేశ్వర్రావు చెప్పడం ఆయనలో ఉన్న ఉత్సాహానికి నిదర్శనం. ఆయన చివరి వరకు కూడా నటననే ప్రేమించాడు, నటించాడు. - ఈరేటి శ్రీనివాస్, వ్యాపారి, మంచిర్యాల స్వశక్తిని నమ్మిన మనిషి.. ప్రేమ అనే పదానికి అక్కినేని మారుపేరు. ప్రేమాభిషేకం, దేవదాసు, గుండమ్మ కథలు చాలా గొప్ప చిత్రాలుగా పేరు సాధించాయి. స్వశక్తిని నమ్ముకుని ఎదిగిన వ్యక్తి ఆయన. సమాజ సేవలోనూ ముందుండే నిరాడంబర మనిషి అక్కినేని. గొప్పలు ఆశించకుండా, స్వార్థాలకు దూరంగా ఉంటూ ఎదిగారు. అక్కినేనిని నేటి నటులు ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి వ్యక్తులను స్మరించాలి. నేనూ ఆయన అభిమానినే. - మనోహర్, రిటైర్డ్, స్కూల్ అసిస్టెంట్ -
అక్కినేనికి దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ
-
అక్కినేని దీప్తి.. ఖాదీకి విశ్వవిఖ్యాతి
సినిమాల్లో పాడటంతోనే ఆగిపోకుండా.. నాలుగు దశాబ్దాలకు పైగా ఖాదీనే ధరించి.. తన అభిమాన దీప్తితో పొందూరు ఖాదీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. స్వయంగా డిజైన్ తయారు చేయించి.. ఏఎన్నార్ పంచెలన్న ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించి.. పొందూరు ఖాదీ ఆర్థికంగానూ బలపడటానికి బలమైన పునాది వేశారు. నేడు అక్కినేని అంటే.. పొందూరు ఖాదీ, పొందూరు ఖాదీ అంటే.. అక్కినేని అన్నట్లు పర్యాయ పదాలుగా మారిపోయారు. ఆ విధంగా పొందూరుతోనూ.. శ్రీకాకుళం జిల్లాతోనూ విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఒక్క ఖాదీయే కాకుండా చేనేతపైనా తన ముద్ర వేసిన ఆయన శ్రీకాకుళంలో బీసీఐసీ ఉత్సవాలకు, మరికొన్ని చోట్ల జరిగిన కార్యక్రమాలకు హాజరై జిల్లాపై తన ఆత్మీయతను చాటుకున్నారు. నేడు ఆ మహానటుడు మన మధ్య నుంచి వెళ్లిపోవచ్చు గాక.. వేసిన ముద్ర, ఆత్మీయ బంధం చిరస్మరణీయంగా నిలిచి పోతాయి.బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు మరణవార్త సిక్కోలు జిల్లాను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయనకు ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉంది. ఖాదీ దుస్తులంటే ఏఎన్ఆర్కు ప్రాణం. ఆయన పేరుతో పొందూరు, అక్కులుపేట చేనేత కార్మికులు పంచెలకు జరీ అంచులు నేస్తుంటారు. సరుబుజ్జిలి మండలం వీరమల్లిపేటలో గతంలో దేవదాసు పర్యటించారు. ఇక ఆయన లేరనే వాస్తవాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అచేనేత వస్త్రాలతో విడదీయలేని అనుబంధం పొందూరు,ఆమదాలవలస, న్యూస్లైన్.: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు చేనేత వస్త్రాలంటే వల్లమానిన అభిమానం. అందుకే ఆయన స్వయంగా డిజై న్ తయారు చేయించి రూపొందించిన జరీ అంచు ఖాదీ పంచెలు వస్త్ర ప్రపంచంలో నేటికీ ధ్రువ తారగా నిలుస్తున్నాయి. ఖాదీకి వన్నె తెచ్చిన జరీ అంచు పంచెలను సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ హంసలతో పోల్చిన సందర్భం ఉంది. గాంధీ మనుమరాలు తారాగాంధీ మూడు సార్లు పొందూరు ఖాదీ సంస్థను సందర్శించిన సందర్భంలో ఏఎన్ఆర్ అంచుపంచెలను పరిశీలించి తన్మయత్వం చెందారు. జాతీయ నావికాదళ అధికారుల సతీమణుల సంఘం సైతం ఈ పంచెలను చూసి కార్మికుల హస్తకళా నైపుణ్యాన్ని కొనియాడారు. గతంలో సింహాచలం దేవస్థానానికి సైతం అక్కినేని బోర్డర్తో కూడిన పంచెలను సమర్పించేవారు. నాలుగన్నర దశాబ్దాల నుంచి నాగేశ్వరరావు పొందూరు ఖాదీ వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరిశ్రమపై కృతజ్ఞతా భావంతో ఆయన నటించిన పలు చిత్రాల్లో పొందూరు పేరు కలిసి వచ్చే విధంగా పాట ల్లో, సంభాషణల్లో ప్రస్తావింపజేసేవారు. ఏఎన్ఆర్ అంచు పంచెలు ఉత్పత్తి ఇలా... ఏఎన్ఆర్ అంచుపంచెలు రెం డు రకాలు. 5 సెంటీ మీటర్ల వెడల్పుతో ఉన్న అంచును సింగిల్ బోర్డర్ అని, 10 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటే డబుల్ బోర్డర్ అని గతంలో నాగేశ్వరరావే నామకరణం చేశారు. ఈ అంచులు అందమైన ఆకుపచ్చ, ఊదా, కెంపు రంగుల్లో ఉంటాయి. వీటిని నేయడానికి నూరవ కౌంట్ దారాన్ని ఉపయోగిస్తుంటారు. గుజ రాత్లోని సూరత్ నుంఈ ప్రత్యేకంగా తెప్పిస్తున్న బంగారు జరీని వీటిలో ఉపయోగిస్తుంటా రు. సింగిల్ బోర్డర్ పంచె ఖరీదు రూ.3,600, డబుల్ బోర్డర్ రూ. 6,500లు ఉంటుంది. సరాసరిన ఏటా 5.5 లక్షలకు పైగా ఏఎన్ఆర్ పంచెలు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత విభాగంలో తక్కువ ఖరీదుకు దొరికే ఏఎన్ఆర్ అంచు పంచె లు కూడా ఉన్నాయి. పొందూరు సాయిబాబా చేనేత సహకార సంఘం, సింగుపురం హటకేశ్వర చేనేత సహకార సంఘం, అక్కుల పేట సీతారామ చేనేత సహకార సంఘం సభ్యులు ఎక్కువగా వీటిని నేస్తారు. ఆమదాలవలస మండలంలోని అక్కులపేట,ఏనాంపేట చేనేత కార్మికులు కూడా ఏఎన్ఆర్ జరీ అంచు పంచెలను ఎక్కువగా తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. వీరమల్లిపేటలో ‘అక్కినేని’ వీరమల్లిపేట(సరుబుజ్జిలి)న్యూస్లైన్: చరిత్ర పురుషులు గతిం చినా వారి మధురానుభూతులు, పాతజ్ఞాపకాలు, మనుషులతో ఉన్న సత్సంబంధాలు ఎప్పటికీ మరువలేము. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అకాల మరణంతో మండలంలోని సింధువాడ పంచాయతీ పరిధిలోని వీరమల్లిపేట గ్రామం చిన్నబోయింది. గతంలో ఈ ఊర్లో అక్కినేని అడుగు పెట్టి గడిపినది కొద్ది గంటలే అయినా గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అప్పటి మంత్రివర్యులు తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాం అధ్యక్షురాలుగా ఉన్న తమ్మినేని శ్రీరామ్మూర్తి సేవాసమితి వీరమమల్లిపేట గ్రామాన్ని దత్తతగా తీసుకొని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆబృహత్తర కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏఎన్ఆర్ 2002 జనవరి 27న గ్రామంలో అడుగుపెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలు, అభిమానులతో కొన్ని గంటలు గడిపారు. ఆయన మరణ వార్త ఇక్కడి వారిని శోకసంద్రంలోకి నెట్టింది. అక్కినేని మరణం కలచి వేసింది అక్కినేని ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. ఆయన తమ గ్రామానికి వచ్చిన సందర్భంగా సర్పంచ్గా ఉండడం, పిన్న వయస్కుడిని కావడంతో నన్ను అభినందించి పలుసూచనలు,సలహాలు అందించారు. ఉన్నకొద్దిగంటలే అయినా మమ్మల్ని ఎంతో ఆకట్టుకొన్నారు. గ్రామంలో ఉన్న వాతావరణం, ఐకమత్యాన్ని చూసి వీరమల్లిపేటకు బదులు శాంతిమల్లిపేట అని పేరుపెడితే బాగుండేదని సలహా ఇచ్చారు. జి.శివానాందమూర్తి,సర్పంచ్,సింధువాడ నటసామ్రాట్ నటనను తలుచుకుంటూ.. టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు శ్రీకాకుళం కల్చరల్, న్యూస్లైన్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణవార్త సిక్కోలు ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. మహానటుడు మరిలేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. బుధవారం తెల్లవారుజాము నుంచే టీవీలకు అతుక్కుపోయి ఆయన గురించి వచ్చే వార్తలను, విశేషాలను తెలుసుకున్నారు. ఏఎన్ఆర్ నటించిన సినిమాలు, పోషించి పాత్రలు, చేసిన నృత్యాలు, అభినయాలను తలచుకున్నారు. ఏఎన్ఆర్తో స్వీయ పరిచయం ఉన్న వారు వారి జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. చిన్నతనం నుంచి ఆయన సినిమాలను చూసిన అభిమానులు కంటతడిపెట్టుకున్నారు. ్డ్ఠ 2002 జనవరి 29, 30, 31 తేదీల్లో మద్రాసు తెలుగు అకాడమి సంస్థ నిర్వాహకులు టీవీకే శాస్త్రి ఆధ్వర్యంలో భారత కల్చర్, ఇంటిగ్రిటీ కమిటీ (బీసీఐసీ) నిర్వహణలో పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగినసాంస్కృతిక ప్రదర్శనల సందర్భంగా అక్కినేని శ్రీకాకుళం వచ్చారు. ఆయన్ను చూసేందుకు, కలిసేందుకు, మాట్లాడేందుకు ఎంతో మంది అభిమానులు పోటీ పడ్డారు. ఆ సందర్భంగా ఏఎన్ఆర్ను కలిసిన కొంత అభిమానుల మాటలు మనం పంచుకుందాం. అక్కినేని ద్వారానే ‘పోజ్’ వచ్చింది ఏఎన్ఆర్ స్టిల్స్ను చూసి నేను స్టైల్ మార్చాను. నాటి నుంచే తనను అందరూ ‘అక్కినేని పోజ్’ అనే వారు. తెలుగు సినిమా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎలిన వారు ఎన్టి ఆర్, ఎఎన్ఆర్లు. వారిద్దరూ లేక పోవడం విచారకరం. సినిమా రంగంలో కొత్త శకం వీరి ద్వారానే వచ్చింది. ఏఎన్ఆర్ నటించిన దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం సినిమాలు అద్భుతమైనవిగా చెప్పవచ్చు. - చిగిలిపల్లి శ్యామలరావు, మాజీ సినీ నటుడు చాలాసార్లు అక్కినేనిని కలిశాను టీవీకే శాస్త్రి నిర్వహించిన బీసీఐసీ కార్యక్రమాలలో చాలాసార్లు ఏఎన్ఆర్ను కలిశాను. ఆయన మంచి నటుడు, చాలా సౌమ్యుడు. ఎవరిని విమర్శించరు. దేవుడిని నమ్మడు. తన స్వయం కృషే తన ఎదుగుదలకు కారణంగా అనుకునే వ్యక్తి. ఉదయం ఆరు గంటలకు రేడియోలో ఆయన ఇక లేరనే వార్త విని చలించిపోయాను. - బండారు చిట్టిబాబు, సినీ,రేడియో సంగీత దర్శకుడు కుటుంబ కథా చిత్రాల్లో నటించారు నాగేశ్వరరావు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లోనే నటించేవారు. పాటలు, నటన బాగుండేవి. ఆయన కుటుంబం బాగుండాలి. - ఐ.సావిత్రమ్మ, ఇప్పిలి వీధి, శ్రీకాకుళం -
అందాలరాముడుతో అనుబంధం
ఖమ్మం కల్చరల్/ భద్రాచలం టౌన్, న్యూస్లైన్: అక్కినేని నాగేశ్వరరావుతో జిల్లావాసులు తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శోకతప్తులవుతున్నారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకునేందుకు 1978లో తోటి ఆర్టిస్టులతో కలిసి జిల్లాకేంద్రంలో ఆయన విరాళాలు సేకరించింది మొదలు.. భద్రాద్రి రాముని సన్నిధిలో పలు చిత్రాల షూటింగ్లో పాల్గొన్నారు. ఆ సందర్భాలను స్మరిస్తూ బాధాతప్తులవుతున్నారు. అక్కినేని అభిమానులు బుధవారం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. దివిసీమ ఉప్పెనబాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పది కేంద్రాల్లో సినీ కళాకారులు రూ.10 లక్షల విరాళాలు సేకరించగా దానిలో ఒక్క ఖమ్మంలోనే రూ.2.78 లక్షలు వసూలు కావడం గమనార్హం. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్లో అక్కినేని, జయసుధ, అల్లు రామలింగయ్య తదితరులు నటించిన ‘కొడుకు పుట్టాలా..’ హాస్య నాటిక అలరించింది. - 1999 ఫిబ్రవరి11న ఖమ్మంలో ‘భలేమంచిరోజు’ పేరుతో నిర్వహించిన ఘంటసాల గాన విభావరికి అక్కినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2001 ఫిబ్రవరి15న వైరాలో కొండబోలు వెంకయ్య మెమోరియల్ కళాశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు. అదేరోజు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా కళాకారుల ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారి ‘ఇల్లరికం’ చిత్ర షూటింగ్ కోసం భద్రాచలం వచ్చినట్లు శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థాన విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు తెలిపారు. ఆ తర్వాత అందాల రాముడు చిత్రాన్ని దాదాపు 90శాతం గోదావరి పరిసరాల్లో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. భద్రాద్రికి ఖ్యాతినార్జించి పెట్టడంలో ఈ చిత్రం దోహదపడిందని అర్చకులు అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా రామాలయంలో భద్రుని గుడి ఎదుట ఉన్న శాసనస్తంభాల వద్ద అక్కినేని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారని చెబుతున్నారు. ఆయనకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చే సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారట. ఆయనతోపాటు ప్రముఖ నటులు నాగభూషణం, రాజబాబు మరికొంత మంది ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు.’ అందాలరాముడు తర్వాత ‘దొరబాబు’ చిత్రం షూటింగ్ను భద్రాచలం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారని రామాలయ ప్రస్తుత ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. నాగార్జున హీరోగా శ్రీరామదాసు చిత్రంలో రామదాసు గురువు కబీర్దాస్గా అక్కినేని నటించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రామాలయ పరిసర ప్రాంతంలోనే ఘనంగా జరిపారు. నాగేశ్వరరావు, నాగార్జునను ఆయన అభిమానులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. చిట్టచివరిగా 2011 ఆగష్టు 15వ తేదీన బాపు దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా యలమంచిలి సాయిబాబా నిర్మాతగా నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ ఆడియో ఆవిష్కరణకు అక్కినేని ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం వచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అవార్డుల కంటే అభిమానుల సంతృప్తే నా ధ్యేయం. మనిషికి ఆత్మ సంతృప్తి ప్రధానం. ఆత్మకు, దేవునికి రూపాలులేవు. ఈ రెండూ ఒక్కటే.’ అన్నారు. అక్కినేనితో అనుబంధాన్ని ఆలయ అర్చకులు, జిల్లా కళాకారులు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. -
బహుదూరపు ‘బాటసారీ’!నిను మరువదోయి గోదారి!
తన అలలకే కొత్తకులుకు నేర్పిన ‘అందాలరాముడు’ తిరిగి రాని తీరాలకు తరలిపోయాడని గోదారి గొంతు మూగబోయింది. ఆ బహుదూరపు ‘బాటసారి’ తనతో గడిపిన మజిలీల స్మృతులు.. వరదవేళ అలల్లా ముప్పిరిగొనగా దుఃఖోద్విగ్నతతో ఉక్కిరిబిక్కిరైంది. క్షణానికి 24 ఫ్రేములుతరలిపోయే వెండితెరపై తరతరాలకూనిలిచే ‘ప్రేమనగర్’ కట్టిన ఆ ‘జమీందార్’కు తుదిక్షణం ప్రాప్తించిందన్న పాడు కబురుతో ఈ గడ్డ గుండె చెదిరిపోయింది. ‘నిండు నూరేళ్లు అలరిస్తూనే ఉంటా’నని నిన్నగాక మొన్ననే ‘చేతిలో చెయ్యేసి’ చెప్పిన ‘దసరా బుల్లోడు’- మరో పదేళ్లు బాకీ పడి, ‘టాటా వీడుకోలు.. గుడ్బై ఇంక సెలవు’ అంటూ ‘మరో ప్రపంచాని’కి తరలిపోవడంతో.. ప్రతి ఎదా వ్యధతో బరువెక్కింది. ‘ముద్దబంతి పువ్వుల’ మార్దవాన్ని అనితర సాధ్యంగా అనుభూతికి తెచ్చి, ‘మూగమనసుల’ ఊసుల్ని ముగ్ధమనోహరంగా ‘కళ్లకు కట్టించిన’ ఆ సరంగు జీవన పయనానికి లంగరు దించేశాడన్న దుర్వార్తతో.. ఈ సీమలోని కాల్వలకు చెంపలపై కన్నీటి కాల్వలు తోడయ్యాయి. నటరాజుకు ప్రీతిపాత్రుడైన ఆ ‘దత్తపుత్రుడు’.. ‘మరుజన్మ’ ఉందో, లేదోనని సందేహించినా.. నూరుజన్మలు తిలకించినా తనివి తీరని అభినయసిరిని మిగిల్చి.. బతుకురంగస్థలంపై తన పాత్రను చాలించాడన్న నిజం ‘నిజం’ కారాదని, ‘మాయాబజారు’లో ఘటోత్కచుని గారడీలాంటి భ్రాంతి అయితే బాగుండునని అభిమానులు ఘోషించారు. తన కనుపాపలపై విషాదాన్ని కొలువు తీర్చి, శిలలతో సైతం శోకం పెట్టించిన ఆ ‘దేవదాసు’.. ఆ మృత్యుదేవతను కూడా బావురుమనిపించి, చావును గెలిచి.. ‘మళ్లీ పుడితే’ ఎంత బాగుండునని విలపించారు. అమలాపురం, న్యూస్లైన్ :‘అక్కినేని’... తెలుగు సినిమా పాటకు ఆట నేర్పించారు. ఆ లెజెండ్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందినది... ‘దసరాబుల్లోడు’లోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల.. నీ పైట కొంగుజారిందే చూడుమల్లా’ ఒకటి. ఆ పాటను చిత్రీకరించింది పైరు పచ్చని కోనసీమలోనే. కామనగరువులోని అమలాపురం ప్రధాన మురుగునీటి కాలువ (మురుక్కోడు) వద్ద ఆ పాట చిత్రీకరించారు. పాట తొలి పల్లవి మొదలయ్యేది ఈ కోడు గట్టు మీదే. ఈ పాట చిత్రీకరణ నాటి నుంచి ఈ కాలువ ‘దసరాబుల్లోడు కోడు’గా స్థిరపడిపోయింది. మరో మూడు సూపర్ హిట్ సాంగ్స కోనసీమలోనే చిత్రీకరించారు. 1971లో వీబీ రాజేంద్రప్రసాద్ ‘దసరాబుల్లోడు’ సినిమా చాలా వరకు కోనసీమలోనే చిత్రీకరించారు. అప్పుడు అక్కినేని, వాణిశ్రీ, నాగభూషణంతోపాటు నటులందరూ అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయం పక్కనే చిక్కం చంచలరావు ఇంట్లో నెల్లాళ్లు బస చేశారు. అమలాపురం మురుక్కోడు వద్ద ‘పచ్చగడ్డి కోసేటి’తో పాటు ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ’, ‘ఎట్టాగ ఉన్నాది ఓలమ్మీ’ పాటల చిత్రీకరణ అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, శానపల్లిలంక, మడిపెల్ల, ముమ్మిడివరంలోని చిప్పలపాలెం ప్రాంతాల్లో జరిగింది. అప్పడు అమలాపురంలోని వెంకట రమణ థియేటర్ మేనేజర్ యర్రమిల్లి నారాయణస్వామి బంగ్లాలో యూనిట్ సభ్యులు ఉన్నారు. అయినవిల్లి మండలంలో చిత్రషూటింగ్ సమయంలో వీరవల్లిపాలెంలో అప్పటి ఉపసర్పంచ్ సలాది సత్యనారాయణమూర్తి ఇంట్లో ఆ చిత్ర యూనిట్ బృందం కొన్ని రోజులు విడిది చేసింది. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గోదావరి లంకల్లోనూ చిత్రీకరించారు. ఇసుక తిన్నెల్లో అందమైన ఇంటి సెట్ను వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఏఎన్నార్ నటించిన మరో చిత్రమాణిక్యం ‘మూగమనసులు’ సైతం 1964లో కోనసీమలోని గోదావరి తీరంలో సఖినేటిపల్లి, ముక్తేశ్వరంరేవు, రాజోలులలో చిత్రీకరించారు. ఆ చిత్రంలోని ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు’ పాట సఖినేటిపల్లి గోదావరి గట్టు, ఆ పరిసర నదీపరీవాహకాల్లో చిత్రీకరించారు. ‘గోదారి గట్టుందీ... గట్టుమీద చెట్టుంది’ పాట సఖినేటిపల్లి రేవు ఏటిగట్టుపై షూటింగ్ చేశారు. మేకప్ మ్యాన్ అమలాపురం వాసే ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన ఏఎన్నార్కు మేకప్ వేసిన మామిడిపల్లి శ్రీను అమలాపురం వాసే. ఆయన ఏఎన్నార్కు పలు చిత్రాలకు సహాయ మేకప్ మ్యాన్గా, మేకప్ మ్యాన్గా పనిచేశారు. ఏఎన్నార్ ఎప్పుడూ తనను ‘ఒరేయ్ అమలాపురం...’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారని శ్రీను చెప్పారు. ఏఎన్నార్కు అల్పాహారం మా హోటల్ నుంచే... అమలాపురంలో పుల్లయ్య హోటల్కు అప్పట్లో పెద్దపేరు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో దసరా బుల్లోడు చిత్ర షూటింగ్ సమయంలో ఏఎన్నార్కు అల్పాహారం మా హోటల్ నుంచే వెళ్లేది. ఏఎన్నార్కు పెసరట్టు అంటే మహా ప్రీతి. ఆయనకు ఇష్టమని తెలుసుకుని కోనసీమ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసు ప్రత్యేకంగా వండించి పంపించాను. - సలాది రమణ, పుల్లయ్య హోటల్ యజమాని మూడు సినిమాలిక్కడే కపిలేశ్వరపురం, న్యూస్లైన్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన గురుబ్రహ్మ, సూత్రధారులు, రాజేశ్వరి కల్యాణం సినిమాలలో అత్యధిక భాగం కపిలేశ్వరపురం దివాణం, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. సూత్రధారులు సినిమా సుమారు 40 రోజుల పాటు దివాణంలోనే చిత్రీకరించారు. ఆ సినిమా ప్రతినాయకుడు కైకాల సత్యనారాయణ నివాసంగా కపిలేశ్వరపురం దివాణంలో చిత్రీకరించారు. 1986లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో‘గురుబ్రహ్మ’ సినిమా షూటింగ్ కపిలేశ్వరపురం, అంగరలలోనే జరిగింది. 1993లో విడుద లైన నాగేశ్వరరావు, వాణిశ్రీ, మీనా నటించిన రాజేశ్వరి కల్యాణం సినిమా సుమారు పది రోజులు కపిలేశ్వరపురంలోనే చిత్రీకరించారు. గురుబ్రహ్మ షూటింగ్కు కపిలేశ్వరపురం వచ్చిన నటి శారద స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న వినాయకుని ఆలయంలోని ఉపాలయాన్ని ప్రారంభించారు. మరపురాని క్షణాలు రాజమండ్రి కల్చరల్ : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా అక్కినేనికి రాష్ట్రంలో జరిగిన తొలి సన్మానం 1991లో రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జిత్ మోహన్ మిత్రా, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అక్కినేని నటించిన దేవదాసు, రోజులు మారాయి, సువర్ణసుందరి తదితర చిత్రాల శతదినోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. అక్కినేని ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాలగంగరాజు కోవా అంటే ప్రీతి రాజమండ్రిలోని కుమారి థియేటరు సమీపంలో ఉన్న పాలగంగరాజు దుకాణంలో లభించే పాలకోవా అంటే అక్కినేనికి చాలా ఇష్టం. ఆ దుకాణం యజమానులు గోవింద్, విజయ్లకు ఆయన స్వదస్తూరితో ఉత్తరం రాస్తూ,‘ మీ పాలకోవాలో ఉన్న తీపి కన్నా, మీ ఇద్దరి అభిమానం మరింత మధుర’మన్నారు. మాయాబజార్ ‘కోట’ రామచంద్రపురం, న్యూస్లైన్ : పట్టణంలోని రాజుగారి కోటలో రెండు చిత్రాల షూటింగ్లో అక్కినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు ‘మాయాబజార్’ (సాంఘిక చిత్రం) ఇక్కడే తీశారు. అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో వైవీఎస్ చౌదరి తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘సీతారాముల కల్యాణం’ చిత్రం కూడా రాజుగారి కోటలో తీశారు. ఈ రెండు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మాయాబజార్ షూటింగ్కు సుమారు 10 రోజులు, సీతారాముల కల్యాణం చిత్రం షూటింగ్ సుమారు 20 రోజులు జరిగింది. ఆ సందర్భంగా అక్కినేని కాకినాడలో బస చేసేవారు. అక్కడ నుంచి ఆయన ప్రతి రోజూ షూటింగ్కు ఇక్కడకు వచ్చేవారు. సహనటులను ప్రోత్సహించేవారు బాపు, రమణల ‘బుద్ధిమంతుడు’లో నేను అక్కినేనితో నటించాను. పతాకసన్నివేశంలో దుష్టపాత్రధారిని నేను పోలీసు అధికారిగా అరెస్టు చేయాలి. అక్కినేని బాపు రమణలతో నాకు ఓ డైలాగు ఉండేటట్టు చేయమన్నారు. ఆ మహనటుడికి సాటి నటులను ప్రోత్సహించే అలవాటు ఉండేది. 1953లో రాజమండ్రిలో జరిగిన ‘దేవదాసు’ శతదినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు, నా సోదరుడు శ్రీపాద పట్టాభి నన్ను ఆయనకు పరిచయం చేశారు. సమయపాలనకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. గురుబ్రహ్మ షూటింగ్ కపిలేశ్వరపురంలో జరిగింది. నిర్మాతలు ఉదయం ఆరు గంటలకు షూటింగ్ అంటే, ఆయన సరిగా ఆరుగంటలకే మేకప్తో సిద్ధమయ్యారు. హీరోయిన్ అక్కడికి రాలేదు. వెళ్లిపోతానన్నారు అక్కినేని. అక్కినేనిని సముదాయించే బాధ్యత నాపై పడింది. రాత్రి పొద్దుపోయేవరకు పని చేయడం ఆయన నైజానికి విరుద్ధం. కానీ, వేకువజామునే పని మొదలు పెట్టేవారు. - జిత్ మోహన్ మిత్రా, నటుడు, రాజమండ్రి హేయ్ గోదావరీ అనేవారు సూత్రధారులు సినిమాలో ఒక పాటకు నేను నృత్యదర్శకత్వం వహించాను. ఎప్పుడు నేను అక్కినేనిని కలిసినా, హేయ్, గోదావరి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. -సప్పా దుర్గాప్రసాద్, నాట్యాచార్యుడు,రాజమండ్రి మా ఇంట్లోనే వారం షూటింగ్ రాజేశ్వరి కల్యాణం సినిమా షూటింగ్ సుమారు వారం రోజులు మా ఇంటిలో జరిగింది. నాగేశ్వరరావుగారు మా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించేవారు. - కమ్మ వీరవెంకట్రావు, కపిలేశ్వరపురం -
మనసులు మూగబోయాయ్
అక్కినేని నాగేశ్వరరావు ఆడపిల్ల వేషం వేసి రంగస్థలంపై కనిపిస్తే.. చూసినోళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. ఇది సుమారు ఏడున్నర దశాబ్దాల క్రితం మాట. సినీ రంగంలో అడుగిడక ముందే.. మన జిల్లా అల్లుడు కాకముందే అక్కినేనికి ‘పశ్చిమ’తో అనుబంధం ఉంది. 1940కి ముందునుంచి 1944 వరకూ భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు, ఉండి, నవుడూరు, పాలకొల్లు ప్రాంతాల్లో అక్కినేని నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దెందులూరు ఆడపడుచు అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్న ఆయన ఆమె పేరిట ఏలూరులో పల్వరైజింగ్ మిల్లు నెలకొల్పారు. ఏటా సంక్రాంతి నాడు ఆ మిల్లుకు వచ్చేవారు. కార్మికులందరినీ పేరుపేరునా పలకరించేవారు. కొత్త దుస్తులు ఇచ్చి మరీ వెళ్లేవారు. ఆదుర్తి సుబ్బారావు నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన తెరకెక్కి మూగమనసులు సినిమా చాలాభాగం నరసాపురంలోనే షూటింగ్ పూర్తిచేసుకుంది. అవుట్ డోర్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం.. నాగేశ్వరరావు సహా అందులో నటించిన వారందరికీ మంచి పేరు తెచ్చినదీ ఇదే కావడం విశేషం. నాగేశ్వరరావు నటించిన ఇలాంటి సినిమాలెన్నో ‘పశ్చిమ’లో క్లాప్ తీసుకున్నారుు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికే అలవాటు పడిన నట సామ్రాట్ అక్కినేని అశేష అభిమానులను దుఃఖసాగరంలో ముంచి.. దివికేగిన తన భార్య అన్నపూర్ణమ్మ చెంతకు వెళ్లిపోయూరు. సినీ వినీలాకాశంలో మేరునగధీరుడిలా.. మహా నిఘంటువులా.. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రలా మిగిలిపోయూరు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. నాటకాలు వేసే రోజుల్లోనే అది కొనసాగగా దెందులూరు ఆడపడుచును పెళ్లాడాక మరింత బలపడింది. ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా దూరం కావడం అభిమానులను దుఃఖ సాగరంలో ముంచెత్తుతోంది. దెందులూరు, న్యూస్లైన్ : అక్కినేని నాగేశ్వరరావు మరణవార్తతో ఆయన అత్తవారు ఊరైన దెందులూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులతో పాటు స్నేహితులు, అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్కు తరలివెళ్లారు. దెందులూరు అల్లుడు దెందులూరులో కొర్లిపర వెంకట నారాయణ, నాగభూషణమ్మ దంపతులకు రామ కుటుంబరావు, అన్నపూర్ణమ్మ సంతానం. అన్నపూర్ణమ్మను అక్కినేని నాగేశ్వరరావు 1949 ఫిబ్రవరి 18లో వివాహం చేసుకున్నారు. అక్కినేని సతీమణి, అత్తామామలు, బావ ఇప్పటికే కాలం చేశారు. ప్రస్తుతం గ్రామంలో అక్కినేని బావ కుమారుడు సుబ్రహ్మణ్యవర ప్రసాద్, కోడలు నాగమణి కుటుంబ సభ్యు లు ఉంటున్నారు. సంక్రాంతికి ఇక్కడే.. వివాహం అనంతరం ప్రతి సంక్రాంతికి అక్కినేని దెందులూరు వచ్చేవారు. పెద్ద పెద్ద దుంగలు పోగుచేసి భోగి మంటలు వేసేవారు. నువ్వుల అరిసెలు, పా యసం, పులిహోర, దెందులూరు వంకాయలతో చేసిన కూర అమితంగా ఇష్టపడేవారు. పండగ మూడు రోజులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో గడిపేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్లు ఇచ్చేవారు. అత్తారింటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అభిమానంగా పేరుపెట్టి మరీ పలకరించేవారు. బంధువులు.. స్నేహితులు దెందులూరులో బంధువులు కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి ఆంజనేయచౌదరి (అబ్బులు), వీరమాచినేని సురేంద్రచౌదరితో ఎక్కువగా మెలిగేవారు. మేనల్లుడు వీరమాచినేని శివాజీతో వ్యవసాయంపై చర్చించేవారు. శ్రేయోభిలాషులు వడ్లపట్ల నాగభూషణం, ఘంటా బాబూరావుతో గ్రామంలోని సంగతులపై ఆరా తీసేవారు. ఏలూరులో వ్యాపార సంస్థలు అక్కినేని ఏలూరులో అన్నపూర్ణ ఫ్లోర్మిల్, పల్వరైజింగ్ వ్యాపార సంస్థలను నిర్వహించారు. ఆయనకు ఏలూరులో వ్యవసాయక్షేత్రం కూడా ఉంది. శ్యామల, నవయుగ, లక్ష్మీ ఫిలింస్, అన్నపూర్ణ సినీ చిత్ర సంస్థలతో అనుబంధం ఉండేది. వ్యవసాయంపైనే చర్చలు మామయ్య ఎక్కువగా వ్యవసా యం, ప్రకృతి, ఖ ర్చు, ప్రాంతాల వారీ గా పంట దిగుబడుల వ్యత్యాసంపైనే నాతో చర్చించేవారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువను ఎన్నటికీ మరువలేను. కుటుంబ సంబంధాలు, జీవన విధానం, గౌరవ మర్యాదలలో అక్కినేని అందరికీ ఆదర్శప్రాయుడు. - వీరమాచినేని శివాజీ, మేనల్లుడు మాటల్లో, ఆదరణలో ప్రత్యేకత అక్కినేని నాగేశ్వరరావు మాటల్లో, ఆదరణలో చూపిన ప్రత్యేకత ఎన్నడూ మరువలేను. అన్ని పరిస్థితులపై వాకబు చేసే విధానం, వ్యక్తిపై ఆసక్తి, స్పష్టత, సమయం కేటాయింపు వంటివి ఆయనలో ఉన్న సద్గుణాలు. - వడ్లపట్ల నాగభూషణం, శ్రేయోభిలాషి నరసాపురంలో ‘మూగమనసులు’ నరసాపురం టౌన్ : ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు.. వెనుక జన్మ బాసలు ఎవ్వరికీ తెలుసులే’ పాట వింటే అక్కినేని నటించిన మూగమనసులు చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంతోనే అక్కినేనికి నరసాపురంతో అనుబంధం ఏర్పడింది. 1963లో మూగమనసులు సినిమా 90 శాతం చిత్రీకరణ నరసాపురంలో జరిగింది. ఈ సందర్భంగా చాలా రోజులపాటు నాగేశ్వరరావు ఇక్కడే బసచేశారు. పలు సన్నివేశాల చిత్రీకరణ నరసాపురంలోని వలంధర రేవు, ఓసూరివారి తోట, మాధవాయపాలెం పడవల రేవు, తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ‘గోదావరి గట్టుంది గట్టుమీద చెట్టుంది.. చెట్టుమీద పిట్టుంది’, ‘నా పాట నీ నోట పలకాలి చిలక’ పాటలను ఇక్కడే చిత్రీకరించారు. ఇప్పటికీ మూగమనసుల మేడుంది సినిమాలో ఏఎన్ఆర్ నివాసానికి సఖినేటిపల్లి రేవులో, సావిత్రి నివాసానికి ఓసూరివారి తోటలో సెట్టింగులు వేశారు. అప్పటి మునిసిపల్ చైర్మన్ కురిశేటి కృష్ణమూర్తి గుర్రపుబండిని చిత్రంలో వినియోగించారు. ఓ సూరి వారి తోటలో ఓ బిల్డింగ్ను ‘మూగమనసులు మేడ’గా ఇప్పటికీ ప్రజలు పిలుస్తుంటారు. నాటకాలు వేసే రోజుల్లో నరసాపురం వచ్చిన ఆయన ఓ రాత్రి కుమ్మరి వీధి రామాలయంలో నిద్రపోయారు. గోదావరి తీరం.. వి‘చిత్ర’ బంధం కొవ్వూరు : గోదావరి నది పరీవాహక ప్రాంతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు సినిమాలు తెరకెక్కాయి. 1963లో మూగమనసులు, 1973లో అందాలరాముడు, 1982లో మేఘసందేశం, 1990లో సీతారామయ్యగా రి మనుమరాలు, మాధవయ్యగారి మనుమడు వం టి సినిమాలను గోదావరి తీరంలో చిత్రీకరించారు. మేఘసందేశం షూటింగ్ ఎక్కువగా పోలవరంలో జరిగింది. సీతారామయ్యగారి మనవరాలు చిత్రం షూటింగ్లోని పలు సన్నివేశాలను తాళ్లపూడి మండలం మలకపల్లిలోని కుంటముక్కల వారి భవనంలో, సింగన్నపల్లి సమీపంలో గోదావరి ఒడ్డున తెరకెక్కించారు. అక్కినేని ఔదార్యం పాలకొల్లు, న్యూస్లైన్ : పాలకొల్లులో 1940లో మునిసిపల్ హైస్కూల్ భవన నిర్మాణానికి ఆశాజ్యోతి, తెలుగుతల్లి, సత్యాన్వేషణ అనే నాటికలు ప్రదర్శించగా స్త్రీపాత్రలో అక్కినేని నటించారు. నాటిక వేసేందుకు కృష్ణా జిల్లా ముదినేపల్లి నుంచి ఆయన గుర్రపుబండిలో వచ్చేవారు. నాటక ప్రదర్శన ల్లో వచ్చిన సొమ్మును ప్రయాణ ఖర్చులు పోను మిగిలింది హైస్కూలు నిర్మాణానికి విరాళంగా అందజేశారు. అక్కినేని 60 చిత్రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 1956లో పాలకొల్లులో అభిమానులు ఆయన్ను సత్కరించారు. మూగమనసులు షూ టింగ్ సందర్భంగా మరోసారి సత్కరించారు. దర్శకులు దాసరి, కోడి రామకృష్ణ ఆధ్వర్యంలో అక్కినేని ఇక్కడ సత్కరాలు అందుకున్నారు. ఏలూరులో జ్ఞాపకాలు ఏలూరు (ఆర్ఆర్పేట): శ్యాంప్రసాద్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘విజయ’శత దినోత్సవం సందర్భంగా అక్కినేని తొలిసారి ఏలూరు వచ్చారు. మొదట్లో నగరానికి చెందిన కొల్లి అంజయ్య నాటక సమాజంలో ఆఫీస్ బాయ్గా పనిచేశారు. అదే సమాజంలో నాటక ప్రదర్శనలిచ్చారు. బీవీ రాజు పాఠశాల ప్రారంభం నటసామ్రాట్ను 2001లో డాక్టర్ బీవీ రాజు భీమవరం తీసుకువచ్చారు. స్థానిక ఏడో వార్డులోని బీవీ రాజు మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలను అక్కినేనితో ప్రారంభింపజేశారు. అనంతరం అక్కినేని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇలా ఆ రోజంతా ఆయన భీమవరంలోనే గడిపారు. - న్యూస్లైన్ / భీమవరం కల్చరల్ -
మనసున మనసై... బ్రతుకున బ్రతుకై...
తన మహోన్నత నటనతో సుదీర్ఘ తెలుగు సినీచరిత్రను ప్రభావితం చేశారు అక్కినేని. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతయ్యగా, కాళిదాసుగా, జయదేవుడిగా, రామకృష్ణుడిగా, అభిమన్యుడుగా, విప్రనారాయణుడిగా, తుకారాంగా, కబీరుగా ఒకటేమిటి... వందలాది పాత్రలతో తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్న కథానాయకుడు అక్కినేని. తన అభినయ కౌశల్యంతో ప్రాణం పోసిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నో! ఆయన పాటలన్నీ మన బ్రతుకున బ్రతుకుగా, మనసున మనసుగా పెనవేసుకుపోయినవే! స్థాలీపులాక న్యాయంగా వ్యాసం, సంజాయిషీగా జాబితా... అమర ప్రేమికులైన ‘లైలా మజ్నూ’ల గాథ పలుమార్లు వెండితెరను అలంకరించినా, తెలుగులో మాత్రం ఒకే ఒక్క పర్యాయం తెరకెక్కింది. అదే ‘భరణీ’వారి ‘లైలా మజ్నూ’ (1949). సూఫీ సిద్ధాంతం ప్రకారం, లైలా మజ్నూ పరమాత్మ జీవాత్మలకి ప్రతీకలు! లైలా తనకి దూరమవుతున్నప్పుడు, ‘‘పయనమయే ప్రియతమా! నను మరిచిపోకుమా’’ అని పరితప్త హృదయంతో వీడ్కొలుపుతాడు. ఇది అతని ప్రణయోన్మాదపు ప్రాథమిక దశ! మజ్నూ ముఖంలో దైన్యం, నైరాశ్యం నిండి ఉంటాయి. అతని నేత్రాలలో నాయికారాధనతో ఏదో అలౌకికానందం ప్రతిఫలిస్తూంటుంది. నాగేశ్వరరావు ముఖంలోను, కళ్లల్లోను ఆయా భావాలను అద్భుతంగా ప్రదర్శిస్తాడు. పార్వతి, ‘దేవదాసు’(1953) కూడా అమర ప్రేమికులే! ప్రేయసి ‘పారూ’ ఎడబాటుతో తాగుబోతుగా మారిన దేవదాసు శారీరక, మానసికావస్థలను నాగేశ్వరరావు గొప్పగా ప్రేక్షకుల ముందుంచారు. లైటు స్తంభం క్రీనీడన, దారినపోయే కుక్కపిల్లను నిమురుతూ, చెత్తకుండీ పక్కన కూర్చుని, దగ్గేటప్పుడు గుండెను పట్టుకునే తీరు... ‘నాగేశ్వరరావు నట జీవితానికి ‘దేవదాసు’ పాత్ర కలికితురాయి’ అని ‘జగమే మాయ’ అనే ఒక్క పాటతోనే నిరూపించవచ్చును. 1953లోనే నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘బ్రతుకు తెరువు’ వచ్చింది. ఒక వివాహితుడు తన ఉద్యోగార్థం, ఒక శ్రీమంతురాలిని అవివాహితునిగా మోసం చేయవలసి రావడం ఈ చిత్ర కథావస్తువు. అంతరాత్మ అంగీకరించకపోయినా, అవసరార్థం అబద్ధాల బతుకు సాగించే కథానాయకునిగా నాగేశ్వరరావు చాలా సున్నితంగా, మోతాదును మించని స్థాయిలో నటించి, విమర్శకుల ప్రశంసలను అందుకోగలిగారు. ‘అందమే ఆనందం’ పాట సందర్భాన నాగేశ్వరరావు ప్రదర్శించిన నటన అతి మనోహరం! అందం, ఆకర్షణీయమైన మగటిమి కలిగినా, నాయిక మీద వేరే దృష్టి లేని నాయకుని సంస్కారం, అతని శారీరక భాష రూపేణా ఈ పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘విప్రనారాయణ’(1954)లో శ్రీరంగనాథ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షిస్తూ, ‘పాలించరా రంగా’ అంటూ పాడే సమయాన ప్రఫుల్లిత నేత్రాలలో తొణికిసలాడే భక్తి పారవశ్యాన్ని చూసినవారెవరైనా, ఆయన నాస్తికుడంటే నమ్మలేరు! భక్తి మనోగతమైనా, శారీరక భాష ద్వారా అది ప్రకటితమయ్యే తీరును నాగేశ్వరరావు బాగా ఆకళింపు చేసుకోగలిగారు కాబట్టే, ఆయన మహానటుడు కాగలిగారు. 1955నాటి ‘అర్ధాంగి’లో మేదకుడైన తన భర్తను ప్రయోజకునిగా తీర్చిదిద్దడం ఈ చిత్రంలో కథావస్తువు. గది బయటి ఆకర్షణలు నాయకుని వివశుని చేస్తూండగా, ‘‘వద్దురా కన్నయ్యా!’ పాటని ఆలపిస్తుంది. ముఖంలో అవివేకంతో కూడిన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే, కళ్లల్లో ద్వైదీ భావ సంఘర్షణను ప్రకటించిన తీరు అత్యద్భుతం! 1955లోనే వచ్చిన ‘దొంగరాముడు’లో దాదాపు సినిమా అయిపోయే సమయాన ‘చిగురాకులలో చిలకమ్మా’ యుగళ గీతం వస్తుంది. నౌకరుగా, డ్రైవరుగా ఉద్యోగాలు చేసిన రాముడు, ఈ పాట దగ్గర డాబుసరిగా సూటను ధరిస్తాడు. కూరలను అమ్ముకునే సీత అతని ప్రేయసి. సూటు అలవాటు లేనివాడు ధరించినప్పుడు, అతగాడి మేనరిజమ్స్ ఏవిధంగా ఉంటాయో, ఈ పాటలో ప్రదర్శిస్తారు. ఎంతో కష్టపడి అలవరుచుకున్న బాడీ లాంగ్వేజ్, నిలుచునే భంగిమ ఆ పాత్ర ప్రవర్తన రీతిని పట్టిచ్చే విధంగా ఉండటం విశేషం! 1956లో వచ్చిన ‘భలేరాముడు’లో కూడా నాగేశ్వరరావు దొంగ పాత్రనే ధరించారు. దొంగతనం చేసి తెచ్చిన ఆభరణాన్ని తన ప్రేయసికి అలంకరింపనెంచిన నాయకుడు, నిదురిస్తూన్న ఆమె సౌందర్యాన్ని చూసి, మంత్రముగ్ధుడై, ఈ గీతమాలపిస్తాడు. ప్రకృతిని అనుశాసించే ప్రేమ తమకాన్ని ‘ఓహో మేఘమాలా!’ పాటలో సాధించగలిగారు.1956లో విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’లో వికటకవిగానే కాక, దేశభక్తి ప్రపూర్ణుడిగా రామకృష్ణుని దర్శకుడు బి.ఎస్.రంగా కొత్త కోణంలో చూపించారు. ‘‘చేసేది ఏమిటో చేసేయి సూటిగా’ అని పాడుతూ, పాదుషాని ఆకట్టుకొని, రాజ్యాన్ని రక్షించుకోగలుగుతాడు. నాగేశ్వరరావు నడిచే పద్ధతి, మాట తీరు ముసల్మానుల జీవన విధానాన్ని ప్రతిఫలించేలా ఉంటాయి. పాట పాడే సమయాన, పాదుషా వస్తున్నాడేమోనని దొంగ చూపులు చూస్తూ, మొక్కను అతను నాటే విధానం, అక్కినేని అసమాన ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది. ‘తోడికోడళ్ళు’(1957) శరత్ రచించిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా రూపొందింది. నాయకుడు చదువులో వెనుకబడి ఉన్నా, ప్రగతి భావాలలో ముందుంటాడు. ‘‘కారులో షికారుకెళ్లే’ పాటలో గాంభీర్యం మూర్తీభవించిన కవిగా కనిపిస్తారు ఏఎన్నార్.1957లోనే వచ్చిన ‘మాయాబజార్’లో అభిమన్యుడి పాత్రలో ప్రణయవశాన, వియోగ బాధలో వివశుడై, ‘నీ కోసమె నే జీవించునది’ అని విరహ గీతాన్ని ఆలపిస్తాడు. తన హావభావాల ద్వారా ఒక అసహాయ శూరుని నిస్సహాయ స్థితిని, దైన్యాన్ని చక్కగా ప్రతిఫలింపజేశాడు. 1958లో వచ్చిన ‘భూ కైలాస్’లో త్రికాలజ్ఞుడైన నారదుడు, విష్ణువును శపించిన పార్వతి పరితపిస్తూంటే, ఇతను ఆమెను అనునయిస్తూ, ‘రాముని అవతారం’ పాడతాడు. ఆలపించే సమయాన, భవిష్యద్దర్శనాన్ని చేస్తూన్న ఆ మౌని కళ్లల్లోని వింత కాంతులను, నాగేశ్వరరావు అద్భుతంగా ప్రతిఫలింపజేశారు. ఇదే ఏడాదిలో విడుదలైన ‘చెంచులక్ష్మి’లో ‘చెట్టు లెక్కగలవా ఓ నరహరి’ యుగళ గీతంలోనూ, ‘భార్యభర్తలు’ చిత్రంలో ‘ఏమని పాడెదనో’ అని పాడుతున్నప్పుడూ నాగేశ్వరరావు అభినయం అనితర సాధ్యం! ‘జయభేరి’, ‘బాటసారి’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మహాకవి కాళిదాసు’, ‘భక్త తుకారాం’ వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలలోని పాటల్లో ఆయన మహోన్నతమైన నటనను ప్రదర్శించి, ప్రేక్షకులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ఈ సంగతులన్నింటినీ సాఫల్యంగా వివరించినట్లయితే, అదో బృహద్గ్రంథం అవుతుంది. ఓపిక, తీరిక ఉన్నప్పుడు అటువంటి గ్రంథ రచనకి ఉపక్రమించడం శుభకరం! ఏయన్నార్ టాప్ సాంగ్స్ ఈ జాబితా కూడా మన ఉల్లాసం కోసమే గానీ... మిగతా పాటలు తక్కువని కాదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు చెంచాతో సముద్రాన్ని తోడ శక్యమా? ఖుషీ ఖుషీగా నవ్వుతూ - ఇద్దరు మిత్రులు ఈ నల్లని రాలలో - అమరశిల్పి జక్కన నిన్నలేని అందమేదో - పూజాఫలం చామంతి ఏమిటే ఈ వింత - ఆత్మీయులు వాడిన పూలే వికసించెనె - మాంగల్యబలం ఓ బాటసారి నను మరువకోయి - బాటసారి నీ సుఖమే నే కోరుకున్నా - మురళీకృష్ణ కాదు సుమా కల కాదు సుమా - కీలుగుర్రం ప్రేమ యాత్రలకు బృందావనము - గుండమ్మ కథ నా కంటి పాపలో నిలిచిపోరా - వాగ్దానం కలకానిది విలువైనది - వెలుగు నీడలు మనసు పరిమళించెనే - శ్రీకృష్ణార్జున యుద్ధం కలిసె నెలరాజు కలువ చెలిని - అనార్కలి హాయిహాయిగా ఆమని సాగే - సువర్ణసుందరి ఘనా ఘన సుందరా - భక్త తుకారాం ఆకాశ దేశాన ఆషాఢ మాసాన - మేఘ సందేశం శిలలపై శిల్పాలు చెక్కినారు - మంచి మనసులు ముద్దబంతి పూవులో - మూగమనసులు చిటపట చినుకులు పడుతూ ఉంటే - ఆత్మబలం సిగలోకి విరులిచ్చి - సుమంగళి ఎవరి కోసం ఎవరి కోసం - ప్రేమనగర్ కనుగొంటిని హరిని - చక్రధారి ఉదయ కిరణ రేఖలో - శ్రీవారి ముచ్చట్లు ఆగదు ఏ నిమిషము నీ కోసము - ప్రేమాభిషేకం మల్లెపూల మారాణికి - అమరజీవి - డా॥కంపల్లె రవిచంద్రన్ -
తాతయ్యను అలా చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి!
అక్కినేనికి ముద్దుల మనవడు సుమంత్. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగారు. ‘‘నాకు అమ్మా నాన్నా ఇద్దరూ తాతయ్యలోనే కనిపిస్తారు’’ అని అంటుంటారు సుమంత్. మంగళవారం మధ్యాహ్నం... ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ప్రమోషన్లోభాగంగా సుమంత్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా తాతయ్య గురించి ఎన్నో ముచ్చట్లను ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఏ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాను తాతయ్య చూశారు. హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఆయన అలా నవ్వుతుంటే.. నాకు కలిగిన ఆనందాన్ని మాటలతో చెప్పలేను. ఎప్పుడూ ఆయన అలాగే నవ్వుతూ ఉండాలనుకున్నాను. ఏ ఈ సినిమాలో నేను లేడీ గెటప్ వేసిన సంగతి తెలుసు కదా. అలా నటించడం కష్టమైనా... ఇష్టంతో చేశా. తాతయ్యలోని వయ్యారమంతా నాలో కనిపించిందని చాలామంది అన్నారు. ఆయన మనవణ్ణి కదా! తాతయ్య ఆ గెటప్ చూసి నన్ను అభినందించారు. ఏ తాతయ్యకు ఇప్పుడు సినిమాలు చూడడమే వ్యాపకం. కొత్త, పాత తేడా లేకుండా అన్ని సినిమాలూ తెప్పించుకొని మరీ చూస్తున్నారు. మనం కూడా చూడనన్ని సినిమాలు చూసేస్తున్నారు. సినిమాను ఆయన ఎంత ప్రేమిస్తారో... ఎంత పూజిస్తారో... ఎంత ఆరాధిస్తారో నాకిప్పుడు అర్థమవుతోంది. తాతయ్య ఆశ, శ్వాస సినిమానే! ఏ నేను తాతయ్య దగ్గరే పెరిగాను. చిన్నప్పుడు ఆయనతో పాటు షూటింగులకు వెళ్లేవాణ్ణి. తాతయ్య నటనను శ్రద్ధగా గమనిస్తుండేవాణ్ణి. ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ చూసి.. ఇంటికొచ్చి ఓ గ్లాస్ పట్టుకొని ‘వందనం అభివందనం’ అని యాక్ట్ చేయడ ం నాకు ఇంకా గుర్తే.. తాతయ్య కూడా నన్ను చూసి భలే మురిసిపోయేవారు. కొన్ని సినిమాల క్లైమాక్సుల్లో తాతయ్య చనిపోవడం చూసినప్పుడల్లా భయపడిపోయేవాణ్ణి. నిజంగా అలాగే జరిగిందేమో... అని కుమిలిపోయేవాణ్ణి. తాతయ్య ఒళ్లో కూర్చోబెట్టుకొని ‘అవన్నీ నిజం కాదు నాన్నా... కేవలం యాక్టింగే’ అని బుజ్జగించేవారు. ఏ తాతయ్య నాతో చాలా విషయాలను షేర్ చేసుకుంటారు. వృత్తిపరంగా ఎన్నో సలహాలిస్తుంటారు. అంతేతప్ప తన అభిప్రాయాలను మాత్రం రుద్దరు. తాతయ్య తరచూ చెప్పే మాటొక్కటే. ‘ట్రెండ్ని గమనిస్తూ ఉండు. దాన్ని బట్టే మనం నడవాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. జీవితం అనేది పాత చింతకాయ పచ్చడిలా ఉండకూడదు’ అని. తాతయ్య అలాగే బతికారు. తాత, మనవడు అనే బంధాలను కాసేపు పక్కన పెడితే... ఆయన పెద్ద స్టార్, నేను ఆయన అభిమానిని. ఏ తాతయ్య గురించి నేను ఎంతైనా మాట్లాడగలను. కానీ... నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. 256 చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తాతయ్య. స్వతహాగా మహానటుడు కావడంతో అన్నీ అవలీలగానే నటించేశారనుకుంటున్నా. అయితే.. ‘బాటసారి’ విషయంలో మాత్రం కష్టపడ్డట్టు చెబుతారు. నేనూ ఆ సినిమా చూశాను. వెరీ టఫ్ క్యారెక్టర్. సాధారణమైన నటులు ఆ పాత్రను చేయలేరు. ఏ తాతయ్య సూపర్స్టార్. ఇది అందరికీ తెలిసిందే. అయితే... అంతటి స్టార్ స్టేటస్ని కూడా ఆయన కేర్ చేయరు. తాతయ్యకు కేరక్టర్ ముఖ్యం. అందుకే... ఎన్టీ రామారావుగారు హీరోగా చేసిన ‘మిస్సమ్మ’లో కమెడియన్గా నటించారు. ఆయన చేయడం వల్ల కమెడియన్ పాత్ర కూడా హీరో పాత్ర అయిపోయింది. ఏ తాతయ్య చిత్రాల్లో నాకు ఇష్టమైన చిత్రం ‘దేవదాసు’. ఆ పాత్రను ఆ స్థాయిలో చేయదగ్గ నటుడు ఇండియన్ సినీ హిస్టరీలోనే లేడు... రాడు కూడా. ‘దేవదాసు’ని నేటి ట్రెండ్కి తగ్గట్టుగా మార్చి, రీమేక్ చేయాలని ఉంది. పైగా అందులో ‘దేవదాసు’గా నేనే నటించాలని ఉంది. అది నిజంగా సాహసమే. కానీ చేస్తా. నిజానికి బాలీవుడ్లో ఇప్పటికే మోడ్రన్ దేవదాసు వచ్చేసింది. కానీ ఎక్కడో రావడం ముఖ్యం కాదు. ఇక్కడ రావడం ముఖ్యం. ఎందుకంటే... దేవదాసు మనకు దగ్గరైనట్లు ఎవరికీ దగ్గర కాలేదు. ఇండియా మొత్తం మీద ఎంతమంది ‘దేవదాసు’లున్నా... మన దేవదాసే గ్రేట్. అందుకే... ఇక్కడ ముఖ్యంగా మోడ్రన్ దేవదాసు రావాలి. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తాను. -
ఏఎన్ఆర్ లేరు.. జ్ఞాపకాలు ఉన్నాయ్..
పాకాల, రామప్పలో షూటింగ్కు వచ్చిన అక్కినేని వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు కూడా.. నాగేశ్వర్రావు మృతితో విషాదంలో అభిమానులు నాగేశ్వర్రావు బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఎన్ఆర్తో ఉన్న అనుబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. పోచమ్మమైదాన్ / హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మృతి చెందిన విషయం తెలియగానే జిల్లాలోని ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే టీవీల్లో స్క్రోలింగ్ రావడంతో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అలాగే, చాలా మంది హుటాహుటీన అక్కినేని పార్థివ దేహాన్ని చూసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ నాగేశ్వర్రావుతో తమ అనుబంధం, జిల్లాకు వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వరంగల్లో ఏఎన్ఆర్ గుర్తులు.. వరంగల్లోని సుశీల్(అప్పటి నవీన్), న టరాజ్(అప్పటి దుర్గ కళామందిర్) సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఏఎన్ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోజులు మారాయి సినిమా 100 రోజులు ప్రదర్శించిన సందర్భగా సునీల్ (అప్పటి రాజేశ్వరి) థియేటర్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజంజాహి మిల్లు గ్రౌండ్ నుంచి సునీల్ థియేటర్ వరకు ఎండ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో అభిమాన సంఘం అధ్యక్షుడు పోలెపాక మాణిక్యం తాను రూపొందించిన కళాతపస్వి అనే సావనీర్ను ఏఎన్ఆర్కు బహూకరించారు. దివిసీమ ఉప్పెన వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్ఐటీ(అప్పటి ఆర్ఈసీ)లో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఎన్టీఆర్తో కలిసి పాల్గొన్న ఏఎన్ఆర్ నగరంలో జోలెతో తిరుగుతూ విరాళాలు సేకరించారు. కేయూలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణలు అక్కినేని నాగేశ్వర్రావు నటించిన పలు సినిమాల షూటింగ్ వరంగల్లో జరిగింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు వద్ద చక్రధర్ సినిమాలోని సంతలో కుండలు అమ్మే సన్నివేశంతో పాటు ఓ ఫైట్ను చిత్రీకరించారు. అలాగే, 1966లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఆత్మగౌరవం సినిమా షూటింగ్ను రామప్పలో చిత్రీకరించగా, నాగేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ వరంగల్ వాసేనని తెలుసుకుని ఓరోజు షూటింగ్ పూర్తయ్యాక అర్ధరాత్రి వెళ్లి కలిశారు. 1968లో అభిమాన సంఘం ఏర్పాటు... వరంగల్కు చెందిన పలువురు 1968లో ఏఎన్ఆర్ ఆర్ట్స్ అసోసియేషన్ పేరిట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలుత సినిమాల విడుదల సందర్భంగా సంబరాలు నిర్వహించగా, ఏఎన్ఆర్ సూచన మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రతీ పుట్టిన రోజు వేడుకలకు వరంగల్ అభిమానులను హైదరాబాద్ పిలిచే అక్కినేని.. 2012లో అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన గెట్ టూ గెదర్కు పలువురు ఇక్కడి నుంచి వెళ్లారు. చిత్రసీమకు తీరని లోటు తెలుగు సినీరంగానికి విశిష్ట సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు మరణం చిత్ర రంగానికి తీరని లోటు. అందరు అభిమానులతో పాటు నేను కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరావును కలవడం, ఆయనతో కలిపి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి. - పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర మంత్రి ‘దేవదాసు’పై వ్యాసాన్ని మెచ్చుకున్నారు.. నేను నల్లగొండ జిల్లాలో లెక్చరర్గా, డ్రమెటిక్ క్లబ్ ఇన్చార్జ్గా ఉన్నప్పుడు 1966లో నిర్వహించిన నాటికల పోటీలకు అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలా గే, 1987లో అమెరికా నుంచి వచ్చిన నా మిత్రుడు అక్కినేనిని చూడాలని అనడంతో వెళ్లి మాట్లాడాము. 2002లో నేను నంది అవార్డు కమిటీలో మెంబర్గా బాధ్యతలు నిర్వహించి నప్పుడు చివరి రోజున ఆయనే వచ్చి మా అందరినీ కలిసి మాట్లాడి వెళ్లారు. నేను దేవదాసు చిత్రంపై రాసిన వ్యాసాలను 2011లో నేరెళ్ల వేణుమాధవ్తో కలిసి వెళ్లి చూపిస్తే చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. -అంపశయ్య నవీన్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 1953 నుంచి స్నేహితులం.. 1953 నుంచి నాగేశ్వర్రావుతో స్నేహం ఉంది. నేనంటే విపరీతమైన అభిమానం చూపించేవారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన ఆయన సహృదయులు కూడా. ముక్కుసూటి మనిషి. నిష్పక్షపాతంగా మాట్లాడేవారు. తనకు తెలియనివారు పలకరిస్తే తెలిసినట్లు నటించకుండా ఎవరు, ఏమిటని ఆరా తీసేవారు. - పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ అక్కినేనితో 45 ఏళ్ల అనుబంధం.. నా అభిమాన నటుడు ఏఎన్ఆర్ మృతిని తట్టుకోలేకపోతున్నా. ఉదయం నాలుగు గంటల కే బల్దియా ఉద్యోగి వచ్చి విషయం చెప్పగానే కూలబడిపోయాను. అక్కినేనితో నాకు 45 ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడల్లా కిచెన్తో సహా మొత్తం తిప్పి చూపించేవారు. అలాగే, ఆయన సినిమాలు విడుదల కాగానే నా స్పందన ను లెటర్ ద్వారా తెలియజేస్తే మళ్లీ తిరుగు ఉత్తరం రాసేవారు. శ్రీవారి ముచ్చట్లు సినిమా లో సైడ్లాక్లు పెద్దగా ఉండడంతో బాగా లేదని చెప్పగా.. ఆ తర్వాత సాధారణంగా మార్చుకున్నారు. అప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వరంగల్ నుంచి ఎవరైనా వెళ్లి కలిస్తే మాణిక్యం తెలుసా అని అడిగేవారు. నన్ను మా ఇంట్లో వాళ్లందరూ ఏఎన్ఆర్ అనే పిలుస్తారు. ఆయనపై మూడు సావనీర్లు తీశాను. - పోలెపాక మాణిక్యం, ఏఎన్ఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వనప్రేమికుడు అక్కినేని.. డోర్నకల్, న్యూస్లైన్ : అక్కినేని నాగేశ్వర్రావుకు మొక్కలు, చెట్లు, పూలంటే చాలా ఇష్టమని, వన ప్రేమికుడనే మాటకు ఆయన నిజమైన ఉదాహరణ అని ఖమ్మం జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన భాగం నాగార్జునచౌదరి తెలిపారు. డోర్నకల్ పక్కనే ఉన్న బుద్దారానికి చెందిన నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టుడియోలో లైటింగ్ విభాగంలో మేనేజర్గా పనిచేస్తుండగా, ఆయన తండ్రి సూర్యనారాయణ నాగేశ్వర్రావు వద్ద గతంలో పనిచేశారు. సూర్యనారాయణ 1955లో తండ్రితో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి మద్రాస్కు వెళ్లారు. అక్కడ అక్కినేనిని కలవగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం హైదరాబాద్కు వచ్చి అన్నపూర్ణ స్టూడియోను స్థాపించగా, అందులో గార్డెన్ సూపర్వైజర్గా పనిచేశారు. నాగేశ్వర్రావు కుమారుడు, సినీ హీరో నాగార్జును పాఠశాలకు తీసుకువెళ్లడం, మధ్యాహ్నం భోజనం తినిపించడం వంటి పనులు కూడా సూర్యనారాయణ చేసేవారు. కొంతకాలానికి అక్కడ పనిమానేసి వచ్చిన ఆయన 1994లో తన కుమారుడు నాగార్జున చౌదరిని హీరో నాగార్జున వద్ద పనికి చేర్చారు. కాగా, సూర్యనారాయణ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగేశ్వర్రావు కన్నుమూసిన నేపథ్యంలో నాగార్జున చౌదరి విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు తన తండ్రికి అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. -
జిల్లాతో అక్కినేని అనుబంధం
అశేష ప్రేక్షక హృదయాల్లో తన నటనతో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్రావుకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణాన్ని అభిమానులు, ఆయనతో సాన్నిహిత్యం గల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నటించిన సువర్ణ సుందరి, దసరాబుల్లోడు, ప్రేమ్నగర్, ప్రేమాభిషేకం, ఏడంతస్తుల మేడ, మాయబజార్, వంటి చిత్రాలు జిల్లాలో వంద రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. - న్యూస్లైన్, కరీంనగర్ కల్చరల్ జిల్లాకు మూడు పర్యాయాలు వచ్చిన అక్కినేని జిల్లా కేంద్రానికి రెండు సార్లు వచ్చారు. సువర్ణసుందరి చిత్రం వందరోజులు ప్రదర్శించబడిన సందర్భంలో ఒకసారి, త్యాగరాయ కల్చరల్ అకాడమీ తరఫున సన్మానానికి మరోసారి వచ్చారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి అక్కడికి వెళ్లారు. తన నట జీవితం 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలలకు రూ.25 చొప్పున విరాళం అందజేశారు. అందులో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల(సైన్స్) కూడా ఉంది. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక నటుడికి అభిమాన సంఘం ఏర్పాటు చేశారంటే అది అక్కినేనిదే. లతీఫోద్దీన్ అహ్మద్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాది. స్వర్గీయ డి.కన్నయ్య గౌరవ అధ్యక్షులుగా, ప్యాట దిల్బాబు, సిరికొండ వెంకటేశం, చల్లా భూమయ్య, జిల్లా రాములు, దారం రాజేశ్వర్, కె.వెంకటరత్నం, బోడ్ల విభీషణ్ కలిసి అక్కినేని అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. త్యాగరాయ కల్చరల్ అకాడమీ తరఫున 1993 డిసెంబర్ 15న నగరంలోని సీవీఆర్ఎన్ రోడ్లో గల ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో అక్కినేని నటజీవిత మహోత్సవాన్ని నిర్వహించి వజ్రస్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. ఈ సన్మాన సభలో అప్పటి శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు, ప్రభు త్వ విప్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పాట రాజం నాగేశ్వర్రావు, అప్పటి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు పాల్గొన్నారు. అక్కినేనితో ఆయన అభిమానులకున్న అనుబంధం వారి మాటల్లోనే.. జిల్లాలో తొలి అభిమాన సంఘం మాది.. జిల్లాలోని సుల్తానాబాద్లో 1969లో ఆయన పేరున అభిమాన సంఘాన్ని ప్రారంభించాం. జిల్లాలోనే మాది మొదటి అభిమాన సంఘం. ఆయన జీవిత విశేషాలతో కళాస్రష్ట అనే ప్రత్యేక సంచిక కూడా రూపొందించాం. మొదటిసారి కరీంనగర్కు సువర్ణసుందరి వంద రోజుల వేడుకలకు వచ్చారు. ఆయనను కలిసి సన్మానించాం. ప్రతీ సంవత్సరం ఆయన పుట్టినరోజుకు హైదరాబాద్ వెళ్లి అభినందించేవాళ్లం. ఆయన లేరన్నది వాస్తవం కాకపోతే బాగుండు. - లతీఫోద్దీన్ ఆహ్మద్ ప్రేక్షకులే నా దైవం... -అక్కినేని త్యాగరాయ కల్చరల్ అకాడమీ నిర్వహించి న నటజీవిత మహోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకులే నాకు దేవుళ్లు, వారి కోరిక మేరకే నేను సినీరంగంలో ఉన్నాను. నా కళ ను అంతగా అభిమానించిన ప్రేక్షకుల్లో నేనే దైవాన్ని చూసుకుంటున్నాను’ అన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా అభిమానుల గుండెల్లో బతకాలని ఉందని గద్గద స్వరంతో అన్నారు. ప్రేమ్నగర్తో అభిమానినైనా.. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పు డు రోజ్ టాకీస్లో ప్రేమ్నగర్ సినిమా చూసిన. ఆ తర్వాత ఆయన అభిమానినయ్యా. ఆ తర్వాత సుల్తానాబాద్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లతీఫోద్దీన్ ప్రో త్సాహంతో అభిమాన సంఘం ఏర్పాటు చేశాను. ప్రతీ చిత్రం చూడడం, బ్యానర్లు కట్టడం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చే శాం. ఆయన ప్రతీ పుట్టిన రోజుకు వెళ్లి అభినందించడం, ఫొటోలు దిగడం చేసేవాళ్లం. ఆయన మరణం జీర్ణించుకోవడం కష్టమే. - పసుపులేటి రాజేశ్వర్రావు, అసిస్టెంట్ అకౌంటెంట్ ట్రాన్స్కో అభిమానం పెరిగింది.. నాగార్జున అంటే అభిమానం. ఆయనపై అభిమానంతో రాజేశ్వర్రావు ఆధ్వర్యంలోని సమాఖ్యలో చేరాను. దీంతో పాటే నాగేశ్వర్రావు సినిమాలు చూడడంతో ఆయనపై అభిమానం పెరిగింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజుకు వెళ్లడం పరిపాటి అయింది. ఆయనతో ఉండే ఆ కాసేపు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన మరణం సినీ పరిశ్రమకు, నాలాంటి అభిమానులకు తీరని లోటు. - తూము నారాయణ, నాగార్జున ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు అనుబంధం మరవరానిది.. అక్కినేని నాగేశ్వర్రావుతో అనుబంధం ఇప్పటిది కాదు. ఆయన అభిమానిగా ఆయన పేరున 1976 జనవరి 14న కరీంనగర్లో అభిమాన సంఘం ప్రారంభించాం. ఆయన నటించిన ప్రతీ చిత్రాన్ని ఐదు నుంచి ఆరు సార్లు చూసేవాళ్లం. కరీంనగర్కు రావడం చాలా సంతోషంగా అనిపించింది. మా చేతుల మీదుగా ఆయనను ఘనంగా సన్మానించాం. - సిరికొండ వెంకటేశం అరుదైన అవకాశం దక్కింది.. నా జీవితంలో మరవలేని అవకాశం, త్యాగరాయ కల్చరల్ అకాడమీ ద్వారా ఆయనను సన్మానించడానికి ఒప్పించడానికి ఏడాది పట్టింది. ఆరోగ్యం సహకరించదని చెప్పినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాం. చివరకు కరీంనగర్ వచ్చి మా సన్మానాన్ని అందుకున్నారు. కార్యక్రమం తర్వాత తరచూ ఆయనను కలిసే వాడిని. - రఘువీర్సింగ్ -
అవార్డుల ‘అక్కినేని’
హైదరాబాద్, న్యూస్లైన్: పౌరాణికం.. చారిత్రకం.. సాంఘికం.. నవల.. చిత్రం ఎలాంటిదైనా ఆ పాత్రల్లో ఒదిగిపోవడం నటసామ్రాట్ అక్కినేనికి మాత్రమే సొంతం. తన నటనతో ఎన్నో అపురూపమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారాయన. అందుకే రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి అవార్డులు అక్కినేని సొంతమయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయనను అవార్డుల అక్కినేనిగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. ఆయనకు వచ్చిన అవార్డులు వేల సంఖ్యలో ఉండడంతో వాటిని భద్రపరిచేందుకు, అభిమానులు తిలకించేందుకు అనువుగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా అక్కినేని అవార్డు గ్యాలరీని 2005లో ఏర్పాటు చేశారు. అక్కినేని అందుకున్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (1991)తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తదితర అవార్డులు, మెమోంటోలు, జ్ఞాపికలు ఈ గ్యాలరీలో భద్రపర్చారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను అందుకున్న అరుదైన బిరుదులు, జ్ఞాపికలకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. స్టూడియో సందర్శన కోసం వచ్చిన అభిమానులు, ప్రజల కోసం ఈ గ్యాలరీ తెరిచి ఉంచేవారు. ఇప్పటి వరకు ఈ గ్యాలరీని 12 లక్షల 46 వేల మంది సందర్శించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అక్కినేని కూడా తరచూ ఈ గ్యాలరీకి వచ్చి తాను అందుకున్న అవార్డులను మురిపెంగా చూసుకునేవారు. మానసిక ప్రశాంతత కావాల్సినప్పుడు ఆయన ఈ గ్యాలరీలో గడిపేవారని స్టూడియో వర్గాలు తెలిపాయి. అంతేకాదు అక్కినేనిపై పలువురు రాసిన పుస్తకాలు కూడా ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచారు. అక్కినేనికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయన పలు పుస్తకాలు రాశారు. రచనల్లో ఆయనది అందె వేసిన చేయి. తన జీవితచరిత్రను ‘నేను నా జీవితం’ అనే పుస్తకంగా రాశారు. అమెరికాలో తన మొదటి పర్యటనను వివరిస్తూ ‘నేను చూసిన అమెరికా’ అనే పుస్తకాన్ని రాశారు. అ, ఆ లు, మనసులోని మాట అనే పుస్తకాలను సైతం ఆయన రచించారు. -
3 గంటలకు అక్కినేని అంత్యక్రియలు
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11.30 గంటల వరకు ఏఎన్ఆర్ భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అంతిమ యాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్కినేని బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. అక్కినేనికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
పల్లె కన్నీరు
అక్కినేని మృతితో వెంకటరాఘవపురంలో విషాదఛాయలు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న గ్రామస్తులు కడసారి చూపుకోసం హైదరాబాద్ పయనం నందివాడ, న్యూస్లైన్ : ఏఎన్నార్ పుట్టినూరు రామాపురంలో సర్పంచి మొండ్రు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, పెరిగిన పల్లె వెంకటరాఘవపురంలో అక్కినేని పేరిట నిర్మించిన కళాక్షేత్రం వద్ద సర్పంచి మెరుగుమాల సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం నివాళులర్పించారు. నటననే నమ్ముకున్న ఆయన వెండితెరపై నవరసాలను ఒలికించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుని కృష్ణా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. నాలుగో తరగతి వరకు గ్రామంలోనే.. ‘‘అక్కినేని నాలుగో తరగతి వరకు వెంకటరాఘవపురం గ్రామంలో చదువుకున్నారు. అప్పట్లో తల్లితో కలిసి వ్యవసాయం చేసేవారు.. ఆ తర్వాత నాటకాల్లో ఆడ పాత్రలు పోషిస్తూ గుడివాడకు మకాం మార్చారు. అప్పుడు ఆయన్ను ఘంటసాల బలరామయ్య మద్రాసు తీసుకుకెళ్లి సినిమాల్లో వేషాలు ఇప్పించారు...’’ అంటూ గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకొంటూ కని పించారు. అభివృద్ధి భలే చేశారు.. ‘‘సినిమాల్లోకి వెళ్లాక కూడా అక్కినేని అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి బాగోగులు పట్టించుకునేవారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించారు. జన్మభూమి పథకం కింద గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు కూడా నిర్మించారు...’’ అంటూ కొందరు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధిని చర్చించుకున్నారు. బుడమేరుపై వారధి నిర్మాణం.. ‘‘అక్కినేని స్వగ్రామానికి పశ్చిమగోదావరి జిల్లా హద్దుగా ఉండేది. గ్రామం సరిహద్దులో ఉన్నా వెళ్లాలంటే బుడమేరు అడ్డుగా నిలిచింది. దీంతో బుడమేరు డ్రెయిన్పై వంతెనను నిర్మింపజేశారు..’’ అంటూ రామాపురం, కుదరవల్లి గ్రామాలకు చెందిన రైతులు చెప్పారు. దీనికి వారు అక్కినేని వారధిగా నామకరణం కూడా చేశారట. విద్యకు ప్రాధాన్యతనిచ్చేవారు.. ‘‘అక్కినేని కుటుంబంలో ఆయనకు మాత్రమే సంతకం చేయడం, చదవడం వచ్చు. అందుకే ఆయన ఎందరికో విద్యాదానం చేశారు. గుడివాడ భూషణగుళ్ల సమీపంలో కళాశాల భవన నిర్మాణానికి పర్వతనేని వెంకటరత్నం, వెంకట్రామయ్య శ్రీకారం చుట్టారు. వారు సినీహీరోగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు సాయం కోరారు. అప్పటికి పెద్దగా సంపాదించకపోయినా విద్యపై ఆమితమైన ఆపేక్షను కనబరుస్తూ కళాశాల నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దాంతో కళాశాలకు ఆయన పేరే పెట్టారు..’’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు. అక్కినేని కళాక్షేత్రం.. ‘‘స్వగ్రామానికి ఎన్నో సేవలందించినందుకు గుర్తుగా గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు వెంకటరాఘవపురంలో కళాకేంద్రాన్ని నిర్మించారు. అందుల్లో ఏఎన్నార్ మధురస్మృతులుగా పాత ఫొటోలను ఏర్పాటుచేశారు.. 2009లో డిసెంబర్ రెండున అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా అక్కినేనితోపాటు ఆయన కుటుంబసభ్యులు వచ్చి కళాకేంద్రాన్ని ప్రారంభించారు...’’ ఇలా పట్టణ ప్రముఖులు ఏఎన్నార్ గొప్పతనాన్ని కీర్తించారు. హైదరాబాద్ బయలుదేరిన గ్రామస్తులు.... అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రామాపురం, వెంకటరాఘవపురం గ్రామాలవారు రాజధాని వెళుతున్నట్లు రామాపురం సర్పంచి వెంకటేశ్వరరావు తెలిపారు. అక్కినేనికి గ్రామం తరఫు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు. -
అక్కినేనికి దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ
అక్కినేని మృతితో సినిమా పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఆయన తన సినిమాలతో ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచి ఉంటారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. అక్కినేని కుమారుడు నాగార్జునకు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగేశ్వరరావు మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు చిత్రసీమకు చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ - ప్రధాని మన్మోహన్సింగ్ ఓ కళాకారుడిగా అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి అక్కినేని ఎంతో కృషి చేశారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’’ - రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారు. ఆయన మంచి మార్గదర్శకుడు, మంచి వ్యక్తి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ - రోశయ్య, తమిళనాడు గవర్నర్ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అక్కినేని ఎనలేని కృషి చేశారు. నాటక, సినీ రంగాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ 75 ఏళ్లు సినీపరిశ్రమలో కొనసాగారు. అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్లో నిర్మించి చిత్ర పరిశ్రమ ఇక్కడ స్థిరపడడానికి దోహదపడ్డారు. ఆయన మరణంతో భారత చలన చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమా మహా నటుడిని కోల్పోయింది.’’ - ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలుగుజాతి ఒక నట దిగ్గజాన్ని కోల్పోయింది. తెలుగు తెరకు ద్విపాత్రాభినయాన్ని పరిచయం చేసిన నటుడు అక్కినేని. అలాంటి గొప్ప నటుడి సరసన నేను తెలుగు చిత్ర పరిశ్రమకు (మనుషులు మమతలు చిత్రం ద్వారా) పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.’’ - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి భారత సినీ పరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయనను మనం ఎప్పటికీ మరిచిపోలేం. అక్కినేని మృతి బాధాకరం’’ - నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం సినీ రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు పెద్దలోటు. అక్కినేని మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’ -కె.చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ అధినేత అక్కినేని తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆయనతో నా బంధం సినిమాకే పరిమితం కాదు.. మాది కుటుంబ బంధంలాంటిది. నా దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో నాగేశ్వరరావుగారే. ఆయన కెరీర్లో నిలిచిపోయే సినిమా చేయాలనే పట్టుదలతో.. రెండు వందలవ సినిమా ‘మేఘ సందేశం’ చేశాం. మంగళవారం రాత్రి ఆయన చూసిన చివరి సినిమా ‘మేఘసందేశం’ అని కుటుంబ సభ్యులు చెబితే తెలిసింది.’’ - దాసరి నారాయణరావు అక్కినేని ‘ఇల్లరికం’ వంద రోజుల వేడుక జరిగినప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్ని. ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ని చూసి.. నటుడిని కావాలనే ఆలోచన కలిగింది. నాగేశ్వరరావుగారితో కలిసి నేను చాలా సినిమాలు చేశాను. నన్నెంతగానో ప్రోత్సహించేవారు. ఆయన మృతి బాధాకరం’’ - కృష్ణ సినిమాపరంగానే కాదు.. వ్యక్తిగతంగా నాగేశ్వరరావుగారితో నాకు బంధుత్వం ఉంది. ఆయనతో నేను నిర్మించిన ‘ప్రేమ్నగర్’ నన్ను నిర్మాతగా నిలబెట్టింది. పదిహేను రోజుల క్రితమే ఆయన్ను కలిశాను. చాలా సరదాగా మాట్లాడారు. ఈ రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు’’ - రామానాయుడు అసెంబ్లీ, మండలి నివాళి సాక్షి, హైదరాబాద్: నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. బుధవారం శాసనసభలో భోజన విరామ సమయం తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతాప సందేశాన్ని చదివారు. అక్కినేని సినీ ప్రయాణం సాగిన తీరును, అందుకున్న పురస్కారాలను గుర్తు చేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఉదయం శాసనమండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ చక్రపాణి సంతాప సందేశాన్ని చదివారు. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని ధ్రువతారగా నిలుస్తారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. మాజీ సభ్యురాలు సంయుక్త బుల్లయ్య మృతికి కూడా మండలి సంతాపం ప్రకటించింది. ఆ నమ్మకమే నడిపిస్తోంది ‘‘1972లో నాకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఓ 14 ఏళ్లు బతుకుతానన్నారు’’ - తన 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2013 సెప్టెంబర్ 28న జరిపిన సన్మానం సందర్భంగా అక్కినేని అన్న మాటలివి. రాగసప్తశ్వరం నిర్వాహకురాలు వీఎస్ రాజ్యలక్ష్మి, టీఎస్ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, నటులు కలిసి ఆయనకు రజత సింహాసనం బహూకరించారు. ఆ సందర్భంగా భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ‘‘నాకు భగవంతునిపై నమ్మకం లేదు. ప్రేక్షక దేవుళ్లపైనే నమ్మకం. భగవంతుని కంటే నమ్మకమే ముఖ్యం. ఇంకా నేను బతికున్నానంటే నన్ను నడిపిస్తున్నది నమ్మకమే. 89, 90... ఇలా వయసు పెరుగుతోందంటే ప్రేక్షకుల ఆశీర్వాదమే. వైద్యుల సలహాల వల్లే ఇలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అన్నారు. తనకు ఆరోగ్య సలహాలిచ్చే డాక్టర్ పీఎస్ రావుకు పాదాభివందనం చేశారు. -
నేడు థియేటర్లు, షూటింగ్లు బంద్
హైదరాబాద్, న్యూస్లైన్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం షూటింగ్లన్నీ బంద్ పాటిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ వెల్లడించారు. అలాగే సినిమా థియేటర్లు కూడా బంద్ పాటించాలని కోరారు. షూటింగ్లు, థియేటర్లు బంద్ పాటించాలన్న నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలకు తెలియజేశామన్నారు. అలాగే గురువారం రాష్ట్రంలో అన్ని టెలివిజన్ షూటింగ్లకూ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ డిజిటల్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సురేష్కుమార్ తెలిపారు. అక్కినేని మరణవార్తతో బుధవారం సినీ కార్యాలయాలు మూతపడ్డాయి. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చినప్పుడు అక్కినేనికి చెందిన అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోనే 24 క్రాఫ్ట్ల కార్యాలయాలు వెలిశాయి. సినీ కార్మికుల నివాసాలతో పాటు సినీ అనుబంధ కార్యాలయాలూ ఇక్కడే ఏర్పాటయ్యాయి. వివిధ సినీ యూనియన్లతో పాటు వీటన్నింటికీ అనుబంధమైన ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం కూడా అన్నపూర్ణ స్టూడియో వద్దే ఏర్పాటైంది. అక్కినేని మృతితో ఆయా కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అక్కినేనికి సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల వారంతా నివాళులర్పించారు. -
ఎప్పటికీ ఎవర్గ్రీన్
అక్కినేని మృతితో శోకసంద్రంలో రాష్ట్రం గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు కడసారి చూపునకు తరలివస్తున్న ప్రజలు జనసంద్రమైన అన్నపూర్ణ స్టూడియోస్ సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖుల నివాళులు దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ నేడు సినీ షూటింగులు, థియేటర్లు బంద్ శాసనమండలి, అసెంబ్లీ సంతాప తీర్మానాలు మధ్యాహ్నం దాకా అన్నపూర్ణ స్టూడియోస్లో భౌతికకాయం అనంతరం ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు ఓ.. దేవదా.. బోరున వర్షం.. ఉరుములు.. మెరుపులు.. ఒకటే దగ్గు.. నోట్లోంచి తెరలు తెరలుగా రక్తం.. ‘ఇంకెంత దూరం..’.. ‘ఇంకో కోసెడు ఉంది బాబు..’ ‘అంతవరకు బతుకుతానో లేదో, కోరినంత డబ్బు ఇస్తాను త్వరగా పోనీ’ దుర్గాపురం వచ్చేసింది.. చావిట్లో గడ్డిపై పడిపోయిన ఆయన నోట మాట పెగలటం లేదు.. పార్వతిని చూసేందుకు తపించిన ఆ కన్నులు కాసేపటికే మూతపడ్డాయి.. ఇచ్చిన మాట కోసం ప్రాణాలకు తెగించి పట్నం నుంచి వచ్చిన ఓ దేవదా..! నిన్ను పార్వతి కన్నా అమితంగా ఆరాధిస్తున్న కొన్ని కోట్ల గుండెలు పిలుస్తున్నాయి.. మా కోసం మళ్లీ రావా.. మహా నటశిఖరం నేలకొరిగింది. అఖిలాంధ్ర ప్రేక్షకులను ఏకంగా ఏడు దశాబ్దాలకు పైగా ఆనంద సాగరంలో ఓలలాడించిన సినీ దిగ్గజం ఇక సెలవంటూ జీవిత రంగ స్థలం నుంచి నిష్ర్కమించింది. నటనకే కొత్త భాష్యం చెప్పడమే గాక హుషారైన డ్యాన్సులతో తెలుగు సినిమాకు కొత్త పోకడలు నేర్పిన నటసమ్రాట్ మరి లేరన్న వార్త తెలిసి ఆంధ్ర దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. బుధవారం తెల్లవారుజామున అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్న విషాద వార్త సూర్యోదయానికి ముందే రాష్ట్రమంతటా దావానలంలా పాకింది. అశేష అభిమానులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నటుణ్ని కడసారి కళ్లారా చూసుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అక్కినేని భౌతికకాయాన్ని ఉంచిన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారింది. ఏఎన్నార్ మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమ కూడా తల్లడిల్లిపోయింది. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ నటీనటులంతా అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించేందుకు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచీ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు బుధవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. శాసనమండలి, శాసనసభ అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి. ఏఎన్నార్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. సినీ షూటింగులకు కూడా విరామం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11.30 దాకా అన్నపూర్ణ స్టూడియోస్లో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం చాంబర్లో ఉంచుతారు. 12.30 నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలవుతుందని ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. ఫిలిం చాంబర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు అంతిమయాత్ర చేరుతుందని తెలిపారు. గురువారం సాయంత్రం మూడింటి తర్వాత అక్కినేని పార్ధివ దేహానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అన్నపూర్ణ స్టూడియోలో అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజుల్లా ఏలిన అగ్రశ్రేణి ద్వయంలో ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు ఏఎన్నార్ కూడా మహాభినిష్ర్కమణం చేసి కళామతల్లికి కడుపుకోత మిగిల్చారు. ఎన్నెన్ని పాత్రలు! ఎంతటి వైవిధ్యం! ఎంతటి నటనా వైదూష్యం! జానపద నాయకుడిగా మురిపించినా, అల్లరి ప్రియుడిగా కొంటె చేష్టలతో అలరించినా, భగ్న ప్రేమికుడిగా భేష్ అన్పించినా, నవలా నాయకునిగా రాణించినా, విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, సాంఘిక పాత్రల్లో సాటిలేని నటన ప్రదర్శించినా, మహా భక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, వయసు పైబడ్డాక కుటుంబ పెద్దగా వెండితెరకే నిండుదనం తెచ్చినా ఆయనకే చెల్లింది. పద్మాలు మొదలుకుని ఫిల్మ్ఫేర్లు, దాదాసాహెబ్ ఫాల్కే దాకా అక్కినేనిని వరించినన్ని అవార్డులు, ఆయనకు దక్కినన్ని సన్మానాలు మరే సినీ ప్రముఖుడికీ లభించలేదు. తెలుగు సినీ పరిశ్రమ ఆనాటి మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడంలో ఆయనదే కీలక పాత్ర. 1974లోనూ, ఆ తర్వాత మరోసారి 1988లోనూ పెను సవాలు విసిరిన తీవ్రమైన గుండె జబ్బును అంతులేని ఆత్మవిశ్వాసంతో జయించి, ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు చెక్కుచెదరని ఆరోగ్యంతో జీవించి చూపించిన రియల్ హీరో ఏఎన్నార్. 90 ఏళ్ల వయసులో కూడా తన కుటుంబంలోని మూడు తరాల వారితోనూ కలసి తాజాగా ‘మనం’ అనే సినిమాలో నటించారాయన. కేన్సర్ మహమ్మారి తనను కబళించేందుకు ప్రయత్నిస్తోందని, అభిమానుల ఆశీర్వాద బలంతో దాన్ని కూడా జయిస్తానని ఆ షూటింగ్లో ఉండగానే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించిన అంతులేని ఆత్మబలం అక్కినేని సొంతం. అక్కినేనిని కేర్కు చేర్చిన 108 అంబులెన్స్ ఏఎన్నార్కు ఇటీవలే కిమ్స్లో మలద్వార కేన్సర్ శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. అప్పటినుంచీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కోలుకుంటున్నారని అంతా అనుకుంటున్న సమయంలో అధిక విరేచనాలతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఏఎన్నార్కు గుండెపోటు వచ్చింది. ఆయన మనవరాలు సుప్రియ వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఆ సమయంలో సరిగ్గా జూబ్లీహిల్స్ చౌరస్తాలోనే ఉన్న అంబులెన్స్ నాలుగు నిమిషాల్లో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 17లోని అక్కినేని నివాసానికి చేరుకుంది. అంబులెన్స్ సిబ్బంది వడివడిగా ఆక్సిజన్ సిలిండర్తో పాటు లోనికి వెళ్లి అక్కినేనికి ప్రథమ చికిత్స చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను 10 నిమిషాల్లోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కినేనితో పాటు మనవరాలు సుప్రియ, మనవడు సుమంత్ కూడా అంబులెన్స్లోనే ఆస్పత్రికి వెళ్లారు. కన్నీరుమున్నీరైన నాగార్జున బుధవారం తెల్లవారుజాము 1.45 గంటలకు 108 అంబులెన్స్ అక్కినేనిని కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి చేర్చింది. డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని వైద్య బృందం మొదట ఆయనకు సీపీఆర్, తర్వాత ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించింది. ఇదంతా జరుగుతుండగానే ఆయన పల్స్రేటు పడిపోయింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. అక్కినేని చనిపోయినట్టు తెల్లవారుజాము 2.45కు వైద్యులు ధ్రువీకరించారు.ఆయన మృతికి గుండెపోటే కారణమని విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం ఆయన గుండెకు గతంలో అమర్చిన పేస్మేకర్ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఏఎన్నార్ కుమారుడు నాగార్జున సహా కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. తండ్రి లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక నాగార్జున సహా వారంతా కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత మృతదేహాన్ని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. తండ్రి పార్ధివ దేహంతో పాటు నాగార్జున కూడా స్టూడియోకు చేరుకున్నారు. సోదరి నాగసుశీల అక్కడకు రావడంతోనే దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమని విలపించారు. నాగార్జున రోదన చూసి ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా కన్నీరుమున్నీరయ్యారు. నాగార్జునను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అరగంట పాటు ఆయన గుక్కపట్టి ఏడ్చారు. అది చూసి అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏఎన్నార్ పేస్మేకర్ను హృద్రోగంతో బాధపడుతున్న ఎవరైనా నిరుపేద కళాకారునికి ఉచితంగా అందజేయవచ్చని సమాచారం. అభిమానులతో కిక్కిరిసిన అన్నపూర్ణ స్టూడియో అక్కినేని మరణవార్త తెలియగానే అభిమానులు తండోపతండాలుగా అన్నపూర్ణ స్టూడియో వద్ద బారులుతీరారు. బుధవారం తెల్లవారుజామున మూడింటి నుంచే అక్కడ క్యూలు కట్టారు. వారి సంఖ్య గంటగంటకూ పెరిగిపోవడంతో స్టూడియో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. 70 వేల మందికి పైగా తరలిరావడంతో స్టూడియో ఆవరణంతా అభిమానులతో నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ప్రముఖుల రాక మొదలవడంతో రోడ్లకు రెండు వైపులా వాహనాల పార్కింగ్లతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టూడియో ప్రధాన ద్వారం నుంచి క్యూ ఏర్పాటు చేసి అభిమానులను లోనికి పంపారు. నుంచునేచోటు కూడా లేక చాలామంది చెట్ల పెకైక్కి, అక్కడి నుంచే తమ నటుణ్ని కడసారి చూసుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాక కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. సందర్శించిన ప్రముఖులు అక్కినేని పార్ధివ దేహాన్నిపలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన లోటు తీర్చలేనిదని కొనియాడారు. అక్కినేని భారతీయ చిత్ర పరిశ్రమకే మేరునగమని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్ధివ దేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర మంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురందేశ్వరి, సర్వే సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కె.చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేష్, గీతారెడ్డి, డీకే అరుణ, వట్టి వసంత్కుమార్, సి.రామచంద్రయ్య, దానం నాగేందర్, కె.జానారెడ్డి, గల్లా అరుణకుమారి, కాసు కృష్ణారెడ్డి, మాజీ మంత్రులు దేవేందర్గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, సీఎం రమేశ్, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, రామోజీరావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మర్రి శశిధర్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, శంకర్రావు, జూలకంటి రంగారెడ్డి, డి.శ్రీనివాస్, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులున్నారు. సినీ ప్రముఖుల నివాళులు అక్కినేనికి నివాళులర్పించిన సినీ ప్రముఖుల్లో నటుడు కృష్ణ, హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, పవన్కల్యాణ్, మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు రామానాయుడు, సురేశ్బాబు, వీబీ రాజేంద్రప్రసాద్, కవి సి.నారాయణరెడ్డి, నటి అనుష్క, రోజా, తమిళ నటులు శరత్కుమార్, రాధిక దంపతులు, నాగేంద్రబాబు, హరికృష్ణ, జయప్రద, రానా, సాయిధరమ్ తేజ్, అలీ, అల్లు అరవింద్, వేణుమాధవ్, శ్రీకాంత్, ప్రకాష్రాజ్, మురళీమోహన్, జయసుధ, వాణిశ్రీ, జమున, రమాప్రభ, గీతాంజలి, మోహన్బాబు తదితరులున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: డీకే అరుణ అక్కినేని మృతి పట్ల సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. - సాక్షి నెట్వర్క్ -
నీడ ఉంది...నటవృక్షం లేదు!
ఎవరెస్ట్ అలాగే ఉంది. ఏఎన్నార్ కూడా అంతేననుకున్నాం! నయాగరా అలాగే ఉంది. ఆ నటనాఝరీ అంతేననుకున్నాం! చుక్కలన్నీ అలాగే ఉన్నాయి. చక్కనయ్యా... అంతేననుకున్నాం! వటవృక్షాలు అలాగే ఉన్నాయి. నటసామ్రాట్ కూడా అంతేననుకున్నాం! అనుకున్నాం. ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాం. ఎప్పటికీ అనుకుంటూనే ఉంటాం! తెలుగు తెరపై చెరగని సంతకం చేసి,‘ఇక లేరు’ అనే మాటను చెరిపేసినిశ్శబ్దంగా నిష్ర్కమించారు అక్కినేని. ఆయనకిదే సాక్షి అక్షర నివాళి... ప్రస్థానం 1924-2014 గంగోత్రి వద్ద ప్రారంభమైన ఆ చిన్న దార గంగా ప్రవాహమైనట్టు... కృష్ణా జిల్లా వెంకటరాఘవపురం బుల్లోడు స్త్రీ పాత్రలతో మొదలుపెట్టిన నట ప్రస్థానం ఎవరెస్ట్ శిఖరంగా ఎదిగింది. నాటకాల్లో పాత్రలు వేయడానికి మహిళలు వెనుకాడే రోజుల్లో, నాగేశ్వరరావు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. గుడివాడ నాటక రంగాన్ని గుడిగా చేసుకున్నారు. ఎక్సెల్షియర్ క్లబ్ డ్రమెటిక్ అసోసియేషన్ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావును గురువుగా చేసుకున్నారు. అక్కినేని నటించిన తొలి సాంఘిక నాటకం ‘ఆశాజ్యోతి’. అందులోని స్నేహలత పాత్రకు జీవం పోశారు. చాలామంది ఆయనను మహిళ అనే అనుకున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ: పాలకొల్లులో ఆశాజ్యోతి ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ టౌన్లో పేరున్న ముచ్చర్ల సుబ్బరాజు, యాభై ఏళ్ల ఆయన బంధువు చూస్తున్నారు. ఆ బంధువు భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాడు. అక్కినేనిని తదేకంగా చూస్తుండటంతో ‘ఏంటీ, కళ్లార్పకుండా చూస్తున్నావ్. ఆమెను పెళ్లి చేసుకుంటావా?’అని అడిగారు సుబ్బారావు వేళాకోళంగా. ‘ఆమె ఒప్పుకుంటే తప్పకుండా చేసుకుంటాను’ అన్నాడా బంధువు. మర్నాడు, ఆ అమ్మాయి అక్కినేనే అని తెలిసి, ఆయన బిక్కమొహం వేశాడు. హీరోయిన్ వేషాల్లో నాగేశ్వరరావు అంతగా మాయచేసేవారన్న మాట. తెలుగుతల్లి, సత్యాన్వేషణ లాంటి నాటకాలు అక్కినేనికి ఎంతో పేరు తెచ్చాయి. ఒక్కో ప్రదర్శనకు ఎనిమిది రూపాయలు వచ్చేవి. నెలలో ఎనిమిది ప్రదర్శనలుండేవి. అంటే నెలకు అరవై నాలుగు రూపాయలు! అదేమీ తక్కువ మొత్తం కాదు. సబ్-రిజిస్ట్రార్ జీతం ముప్ఫై రూపాయలే! అదృష్టం బెజవాడ స్టేషన్లో ఆగింది అదృష్టం కొందరి తలుపు తడుతుంది. అక్కినేనికి మాత్రం అదృష్టం రైలు కూతగా పిలిచింది. నాగేశ్వరరావు బృందం గుడివాడ వెళ్తూ బెజవాడ స్టేషన్లో రైలుకోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్న దర్శకనిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేనిని తదేకంగా చూసి, ‘నీదేవూరు’ అని అడిగి, ‘సినిమాల్లో నటిస్తావా’ అన్నారు. ‘అవకాశం వస్తే నటిస్తాను’ అన్నారు నాగేశ్వరరావు, ఆయనెవరో తెలియక. 1944 మే 8వ తేదీన ఘంటసాల బలరామయ్య పిలుపు మేరకు అక్కినేని ప్రతిభా స్టూడియోకు వెళ్లారు. నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న పుట్టారు. అందరికీ ఆయన జన్మదినం అదే. అయితే, అక్కినేని మాత్రం మే 8వ తేదీయే తన జన్మదినం అనుకుంటారు. ‘సీతారామ జననం’లో నాగేశ్వరరావుకు రాముడి పాత్ర లభించింది ఆరోజే. నిజానికి ఆయన తొలిచిత్రం ధర్మపత్ని. అయితే, పాత్ర నిడివి, ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుంటే ‘శ్రీ సీతారామ జననమే’ తన మొదటి సినిమాగా అక్కినేని భావిస్తారు. తన వూరు పేరులో ఉన్న రామనామం ఆయన పాత్ర కావడం విశేషం. దర్శకుడి పేరులోనూ రామయ్య ఉండటం మరో విశేషం. ‘శ్రీ సీతారామ జననం’ తర్వాత, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్నసుందరి మొదలైన చిత్రాల్లో అక్కినేనికి వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ‘బాలరాజు’ సినిమా ఆయనకు స్టార్డమ్ తెచ్చింది. ప్రతిపాత్ర ఒక ఛాలెంజ్ హీరోగా నిలదొక్కుకున్న కొత్తలోనే అక్కినేని ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి చొరవ చూపారు. ‘దేవదాసు’ పాత్రను పోషించడానికి వెనకడుగు వేయలేదు. తాగుడు సన్నివేశాలను న భూతో న భవిష్యతి అన్న రీతిలో పండించారు. తాగుడుకు బానిసైన భగ్నప్రేమికుడు ‘దేవదాసు’గా జీవించిన అక్కినేని వెర్రిబాగులోడుగా ‘అర్ధాంగి’ లో అద్భుతంగా నటించారు. ‘పునర్జన్మ’లో మతి చలించిన కళాకారుడిగా, అమాయకత్వం నిండిన పిచ్చివాడిగా నటించారు. మంచి మనసులు, మూగమనసులు, వెలుగునీడలు వంటి సినిమాల హీరోగా సూపర్హిట్లు కొడుతూనే నవలా నాయకుడిగానూ ఇమేజ్ను సంపాదించుకున్నారు. కోడూరి (అరెకపూడి) కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి నవలలను సినిమాలుగా తీసినప్పుడు నాగేశ్వరరావే హీరో. తాము చదివిన నవలల్లో తాము ఊహించుకున్న హీరోలానే అక్కినేని ఉండటంతో పాఠక ప్రేక్షకులు నీరాజనం పలికారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా! నాగేశ్వరరావు హీరోగా నిలదొక్కుకున్నాక, కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగారు. దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రారంభించాలనుకున్నప్పుడు అక్కినేని ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థకు ఆయనే చైర్మన్. మేనేజింగ్ డెరైక్టర్ మధుసూదనరావు. తన సంస్థ తీసే సినిమాల కథ గురించి మాత్రమే నాగేశ్వరరావు పట్టించుకునేవారు. ఫలానా హీరోయిన్ ఉండాలని కానీ, ఫలానా పాత్రకు ఫలానా నటుడిని తీసుకోండని కానీ అక్కినేని ఎప్పుడూ సిఫారసు చేయలేదు. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాక, నాగేశ్వరరావు పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించారు. శ్రీరంగనీతులు, యువరాజు, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, పిల్ల జమిందార్, బుచ్చిబాబు మొదలైన సినిమాలను నటిస్తూ నిర్మించారు. ప్రేమాభిషేకం సూపర్ డూపర్ హిట్ అయి, చరిత్రనే సృష్టించింది. ప్రయోగ శీలి నిర్మాతగా ప్రయోగాలకు కూడా ముందడుగు వేశారు నాగేశ్వరరావు. తన అభిమాన, ఆస్థాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి సుడిగుండాలు, మరో ప్రపంచం చిత్రాలను తీశారాయన. అశ్లీల సాహిత్యం పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో సుడిగుండాలులో చెప్పారు. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో, ఎలాంటి విద్యను నేర్పించాలో మరో ప్రపంచం చిత్రంలో మరో కోణం చూపించారు. చిరంజీవికి ఆదిగురువు! తెలుగు చిత్రసీమలో హీరోలు నృత్యాలు చేయడం అక్కినేనితోనే మొదలయ్యింది. నాటకాల్లో ఆడపాత్రలు వేసిన అనుభవం కూడా ఆయనకు పనికొచ్చింది. నాగేశ్వరరావు డ్యాన్సుల్లో ఒక అందం ఉంటుంది. స్టెప్పుల్లో చక్కటి స్టైల్ కనిపిస్తుంది. ‘నిలువవే వాలు కనులదానా’ అంటూ ‘ఇల్లరికం’ చిత్రంలో అక్కినేని వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. స్టెప్పుల్లో స్పీడు పెంచింది కూడా ఆయనే. ‘దసరా బుల్లోడు’లో నాగేశ్వరరావు స్టెప్పుల వేగం పండిత పామరులను మెప్పించింది. ‘అతి’ అనిపించకుండా డ్యాన్స్ చేయడం ఆయనకే చెల్లు. ‘నృత్యాల్లో అక్కినేనే నా ఆదిగురువు’ అని చిరంజీవి ఓ సందర్భంలో పేర్కొన్నారు. అభిమానుల ‘అందాల రాముడు’! తనకు సాయపడినవారి పట్ల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. తను అభిమానించేవారిని ఆదరించే సంస్కారం ఆయనది. బాపు, రమణలు సినిమాల్లోకి రాకముందు నుంచీ వారన్నా, వారి ప్రతిభన్నా అక్కినేనికి అభిమానం. బాపు తొలిచిత్రం ‘సాక్షి’ చూసి, ‘నాతో తీసి ఉంటే, మొదటి వారంలోనే మీ పెట్టుబడి వచ్చేసే’దన్నారు. ‘మంచి కథ తయారుచేయండి, నా కాల్షీట్లు ఇస్తాను’ అన్నారు. ఎంతో డిమాండ్లో ఉండీ, కాల్షీట్లిస్తానంటూ తనే ముందుకొచ్చిన సహృదయుడు, ‘బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడు’ అక్కినేని! సినిమా నటులకు పిల్లల్ని ఇవ్వడానికి వెనుకాడే తల్లిదండ్రులున్న రోజుల్లో... తనను వివాహమాడటానికి ముందుకొచ్చిన అన్నపూర్ణను పువ్వుల్లో పెట్టుకుని చూసిన మంచి భర్త నాగేశ్వరరావు. ఆమె పేరుమీదే స్టూడియోను నిర్మించి, చిరస్మరణీయురాలిని చేసిన సంస్కారవంతుడు. పెద్ద హీరో అయ్యాక కూడా తల్లి కాళ్లు పడుతున్న నాగార్జునను చూసి ఆనందభాష్పాలు రాల్చిన మంచి నాన్న. కోట్లు సంపాదించి, ఇంట్లో ఎన్నో కార్లు ఉన్నా కష్టనష్టాలు తెలియాలనే ఉద్దేశంతో పిల్లల్ని స్కూలుకు బస్సుల్లో పంపిన ముందుచూపున్న చక్కని క్రమశిక్షణ గల తండ్రి. అయిదారేళ్ల మనవడు, నేటి హీరో సుమంత్... ఇంట్లో కరెంటు పోయి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, తన ఏసీ కారులో పక్కన కూర్చోబెట్టుకుని, గంటల తరబడి, హైదరాబాద్ రోడ్లపై తిప్పిన మా మంచి తాతయ్య. సినిమా పిలుపు వచ్చినప్పుడు తమ నాటక సమాజంలోని మేకప్మ్యాన్ మంగయ్యను ‘వెళ్లమంటారా’ అని అక్కినేని అడిగారు. ‘వాళ్లుగా పిలిచినప్పుడు వెళ్లడమే మంచిది. రాణించకపోతే నాటకాలు ఎలానూ ఉంటాయి’ అని పెద్దాయన సలహా ఇచ్చారు. ఆ అభిమానంతో ఆయన కుమారుడిని అక్కినేని తమ అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ చీఫ్గా తీసుకుని తన కృతజ్ఞతను తెలుపుకున్నారు. అవార్డులు, రివార్డులు! సాంఘిక చిత్రాల స్టయిలిష్ హీరోగా మాస్తో పాటు మహిళల ఆరాధననూ అందుకున్నారు. సినిమాల్లో సిగరెట్ కాల్చేటప్పుడు కూడా అక్కినేనిలో ఓ స్టైల్ కనిపిస్తుందని సహజ నటి జయసుధ ఓ సందర్భంలో ప్రశంసించారు. నటసమ్రాట్ నాగేశ్వరరావుకు ప్రేక్షకులిచ్చిన బిరుదు. కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది. తెలుగు సినిమాలు ఉన్నంతవరకూ అక్కినేని పంచిన నటనా వెలుగులు ప్రకాశవంతంగా ఉంటాయి. డెబ్భై అయిదేళ్ల ఆయన నట జీవితం అజరామరం. - కె.వి.ఎస్.వర్మ -
అభినయ రుషి
నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించుకోవడం (రీఎన్వెంటింగ్). ఒక వ్యక్తితోనే ఒక పరిశ్రమ నిలబ డదుగానీ, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిశ్రమలో ఎప్పటికీ పూరించలేని ఒక ఖాళీ ఏర్పడవచ్చు. అక్కినేని లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇలాంటిదే. అక్కినేని జీవిత చరిత్ర, సినిమా చరిత్ర మనకు తెలిసిందే. ఆయనలా అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు, అసాధారణ జ్ఞాపకశక్తితో గతాన్ని అవలీలగా మనకు అందించిన వారు ఎవరూలేరు. తెలుగు సిని మారంగంలో, ఆమాటకొస్తే దక్షిణ భారత సినిమారంగంలో నటనకు ఉన్న అర్ధాన్నీ , రూపురేఖలనూ మార్చిన ఘనత ఆయనది. దక్షిణ ప్రాంతం సినిమాల్లో నాయకుల నటన నాటక రంగ అభినయానికి దగ్గరగా ఉన్న రోజులలో ఓవరాక్షన్ గొప్ప నటనగా చలామణి అవుతున్న కాలంలో అండర్ప్లే అంటే ఏమిటో చేసి చూపించిన ప్రతిభ అక్కినేనిది. నాటకరంగంలో నటనకూ, చలనచిత్ర నటనలో ఉన్న తేడాను బహుశా మొట్టమొదట గుర్తించిన నటుడు నాగేశ్వరరావుగారే. అక్కినేని సినీజీవితాన్ని విహంగవీక్షణం చేస్తే, పురా ణ పాత్రలు, జానపద నాయక పాత్రలతో సినీరంగ ప్రవే శం చేశారు. కానీ ఆ రెండూ నిజానికి ఆయనకు నప్పే పాత్రలు కావు. ఆ విషయాన్ని అందరికంటే ముందు గ్రహించింది బహుశా ఆయనే. పరిమితులు తెలుసునన్నంత మాత్రాన అక్కినేని సవాళ్లకు భయపడ్డారనికాదు. ఎలాంటి సవాలైనా స్వీకరిం చే సత్తా ఆయనకుంది. దేవదాసు పాత్ర ఒప్పుకోవడమే ఒక పెద్ద సవాలు. మిస్సమ్మలో తన ప్రధాన ప్రత్యర్థి ఎన్టీ రామారావు నాయకుడని తెలిసీ అప్రధాన హాస్య పాత్రను స్వీకరించడం మరో సవాలు. అన్నిటికంటే గొప్ప సవాళ్లు భూకైలాస్, శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రాల్లో ఎన్టీఆర్ దేదీప్య మానంగా వెలిగిపోతాడని తెలిసీ, తనకు మామూలుగా ఒప్పని పాత్రలు (నారదుడు, అర్జునుడు) స్వీకరించి మెప్పించడం. నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్ష కుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించు కోవడం (రీఎన్వెంటింగ్). గంభీరమైన కుటుంబ కథా నాయకుడిగా లెక్కకు మించి బోరు కొట్టించే సంఖ్యలో సినిమాలు చేశాక, 1970లలో గ్రామీణ అల్లరి పిల్ల వాడిగా, స్టెప్పులు వేసిన సాహసం ఈ పునః సృజనలో భాగమే. అన్ని కథలూ ఒకేలా తయారవుతున్న తరు ణంలో నవలలను తెరకెక్కించడానికి సంపూర్ణంగా మద్ద తు ఇవ్వడం, ఆ పాత్రలకు తనదైన సృజనను అందిం చడం కూడా ఇటువంటిదే. వయసు పైబడటంతో సిని మాలకు స్వస్తి చెప్పక, మామూలు యాంత్రికమైన తండ్రి పాత్రలతో సరిపెట్టుకోక, సీతారామయ్యగారిగా నటించ డం కూడా ఈ పునః సృజనలో భాగమే. ఆయనతో స్నేహం గొప్ప అనుభూతి- వెండి తెరమీద చూసి ఆనందించిన నటుడితో పరిచయం అవుతుందనీ, గంటలకొద్దీ వారితో మాట్లాడతామని అనుకోము. కానీ అక్కినేనిగారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించిన సందర్భంగా 1990లో దూరదర్శన్ కోసం ఇంట ర్వ్యూ చేసిన నాటి నుంచి ఆయనతో ఒక అరుదైన స్నేహం ఏర్పడింది. సాహిత్య సభల్లో నా ప్రసంగాలను ఆయన మెచ్చుకున్నపుడు, మా యూనివర్శిటీలో మహాసభలకు ఆయన కోసం నేను ఆంగ్లంలో ఉపన్యాసం రాసి ఇచ్చినపుడూ, తన పేరిట స్థాపించిన జాతీయ పురస్కారం కోసం తొలిసారిగా దేవానంద్ని ఎంపిక చేసి, నన్ను మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా ఉండి, ఆ సభను ఇంగ్లీషులో నిర్వహించమని ఆయన కోరినపుడూ, వరల్డ్ స్పేస్ రేడియో కోసం నాకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినపుడూ... ఇలా ఎన్నో సంభాషణలూ... అపుడపుడూ ఫోన్లో కూడా. ఒక్క సన్నివేశం బాగా గుర్తు. నేను హడావిడిగా యూని వర్శిటీకి బయల్దేరుతున్నపుడు, నా లాండ్లైన్ మోగింది. నేను తీయగానే ‘ఎవరండీ?’ అన్నా. ‘నాగేశ్వరరావు’ని అన్నారు. ‘ఏ నాగేశ్వరరావండీ?’ అని విసుగ్గా అన్నాను, అప్పటికే బస్సు మిస్సయ్యానన్న చికాకుతో. ‘అక్కినేని నాగేశ్వరరావు అంటారండీ నన్ను’ అన్నారు ఎంతో సౌమ్యంగా. మరో సన్నివేశం- వరల్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మా కొత్త స్టూడియోని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఒప్పుకున్నారు. కారు పంపుతానని చెప్పాను. ‘మీకు కారున్నట్టుందిగా’ అన్నారు. ‘ఉంది కానీ అది చిన్నది. మారుతీ జెన్. మంచి కారు పంపుతాను’ అని గొణిగాను. ‘‘మీకు బాగున్నది నాకెందుకు బాగుండదూ. పైగా మీతో వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.’’ అని నా కారులోనే స్టూడియోకు వచ్చారు. అక్కినేనిగారు మా అమ్మాయి పెళ్లికి వచ్చి, రెండు గంటలకుపైగా ఉండి, మామూలు బంధువులా మా వాళ్లందరితోనూ కలిసిపోయి మాట్లాడారు. అన్నపూర్ణమ్మగారు కాలం చేసినపుడు, పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఆయన నాతో గంటకుపైగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానుగానీ, మీరు చేసిన ఆ పాత ఇంటర్వ్యూ నాకెంతో ఇష్టం’’ అన్నారాయన. ‘ఎందుకో తెలీదుగానీ మిమ్మల్ని నేను చాలా అడ్మయిర్ చేస్తాను’’ అని అన్నారు అక్కినేనిగారు. ఆయన్ని ఈరోజు ఆఖరిసారిగా చూస్తున్నప్పుడు ‘‘మనిషంటే ఇలా తృప్తిగా, పరిపూర్ణ జీవితం గడిపి, ప్రశాంతంగా శాశ్వత నిద్ర చేస్తూ తనలా ఉండమని మనకు స్ఫూర్తినివ్వాలి’’ అనిపించిది. బహుశా అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి. మృణాళిని, విమర్శకురాలు, సాహిత్యవేత్త -
మరపురాని మనిషి
ఆయనో సమష్టి విజయరూపం. అటువంటి మహావ్యక్తి తనువు చాలిస్తే కన్నీరు పెట్టుకోకూడదు. కానీ, మాట వింటే అది కన్నీరు అవదు కదా! అందుకే తెలుగునాట ప్రతి కనుపాప చెమర్చుతున్నది. ప్రతి కళాహృదయం బరువెక్కుతున్నది. వందేళ్ల తెలుగు సినిమా రంగం... అందులో ఎన్నో వేల మంది నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, కళాకారులు... అద్భుత ప్రతిభావంతులు. కానీ, ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారినా, పరిస్థితులు ఎలా పరిణమించినా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లినా మరపురాని, మదిని వీడిపోని ప్రతిభ కొందరు కళాకారుల సొంతం. అలాంటి కొద్దిమందిలో అక్కినేని నాగేశ్వరరావు అగ్రేసరులు. ఆయన రంగంలో ఆయనకి ముదిమి లేదు. భయం లేదు. జంకూ లేదు. నిత్యనూతనంగానే ఆయన జీవితం గడిచింది. మనిషికి మరణం తప్పదు. కానీ అక్కినేని మాత్రం మరణించని మనిషే. ఎన్నో లక్షల మంది కన్నీటి గురుతుల వెనుక, పన్నీటి జల్లు వంటి చల్లటి జ్ఞాపకాల కింద, అభిమానుల గుండె సవ్వడిలో, వందల చలనచిత్రాల ద్వారా అక్కినేని చిరంజీవి. అనారోగ్యానికి దొరికిపోయినా వందేళ్లూ బతుకుతానని మొన్నమొన్ననే ధీమాగా పలికిన వ్యక్తి, ఎవరో పిలిచినట్టు ఇంతతొందరగా వెళ్లిపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. ఇది దురదృష్టమే. ఈ దురదృష్టం చలనచిత్ర సీమ మొత్తానిది. యావత్తు ప్రేక్షకలోకానిది. దేవదాసు, విప్రనారాయణ, బాటసారి, మాయాబ జార్, మహాకవి కాళిదాసు, మిస్సమ్మ, అమరశిల్పి జక్కన్న... ఇలా చిరస్థాయిగా నిలిచే వెండితెర రూపా లు ఎన్నో! ఎంతటి జీవన ప్రవాహాన్నయినా పట్టుకుని నిశ్శబ్దంగా తెర మీద నటన ద్వారా ఆవిష్కరించగ లిగిన, అనుభూతికి రూపాన్ని ఇవ్వగలిగిన ఆయన అరుదైన ప్రతిభను ‘నటన’ అన్న పదంతో తూచడం సాధ్యం కాదు. అదో కళాసంస్కారం. అదో నిత్య అధ్యయన కృషి ఫలితం. ‘అక్కినేనిని తొలిసారి తెర మీద ఎప్పుడు చూశాం?’ అని ఎవరికి వారు ప్రశ్నించుకుని, ఆ బిందువు నుంచి తెలుగు సినిమా గతాన్ని నెమరు వేసుకుంటే ఎవరికి వారికే ఒక చరిత్ర భాగం తయారవుతుంది. తెలుగు ప్రజలతో అక్కినేనికి ముడిపడిన బంధం ఎలాంటిదో ఆ చరిత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఆనాడు మనకి సినిమా అంటే కేవలం రెండు మూడు గంటల కాలక్షేపం కాదు. మన సామాజిక జీవితంలో అదొక భాగం. సినిమాకు వెళ్లడం అంటే, అందునా అక్కినేని సిని మాకు వెళ్లడం అంటే, అదో గొప్ప కళాయాత్ర. 1960 ప్రాంతాలలో ఏలూరులో నా అనుభవం- సినిమా విడుదలైన రోజు నుంచి ప్రతిరోజూ గోపాలకృష్ణా టాకీస్ దగ్గర (కర్రవంతెన) ఎన్ని ఎడ్లబళ్లు విడిసి ఉన్నాయో లెక్క వేసేవారు. బళ్లు నిలబెట్టుకోవడానికే అన్నట్టు ఉండే ఆ విశాలమైన స్థలంలో చుట్టుపక్కల ఊళ్ల నుంచి, కుటుంబాలను తరలించుకు వచ్చిన బళ్లు అవన్నీ. ఒక్కటి మాత్రం బాగా గుర్తు. అక్కినేని సినిమాకు వచ్చినన్ని బళ్లు మరే నటుడి సినిమాకు వచ్చేవి కాదు. అక్కినేని స్వయం కృషితో చదువు నేర్చుకున్నారు. చదువు విలువ తెలిసిన వారు. తన గమనంతో, సహృదయతతో పదిమందికీ బతువు చదువును కళాత్మకంగా నేర్పిన ధన్యజీవి. నలుగురి మధ్య సామాన్య మాన్యుడు. కోట్లకొద్దీ సామాన్యులకి మాన్యుడు. అసామాన్యుడు. తెలుగుతనానికి రాయబారి. వ్యక్తిగా, కళాకారుడిగా, గృహస్థుగా... ఆయనో సమష్టి విజయరూపం. అటువంటి మహావ్యక్తి తనువు చాలిస్తే కన్నీరు పెట్టుకోకూడదు. కానీ, మాట వింటే అది కన్నీరు అవదు కదా! అందుకే తెలుగునాట ప్రతి కనుపాప చెమర్చుతున్నది. ప్రతికళాహృదయం బరువెక్కుతున్నది. అక్కినేనితో ఓ తరం నటుల యుగం ముగిసిపోయినట్టే. ఆ తరం అంటే వెండితెర మీద బంగారు పంట. మాయాబజార్ను గుర్తుకు తెచ్చుకుని, ఆ అద్భుత కళాఖండం కోసం పని చేసిన కళాకారులలో ఇం కా ఎందరు మిగిలారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే చెప్పలేని దిగులు. సాత్వికమైన కళాభివ్యక్తి కలి గిన, పరిపుష్టమైన ఓ తరం తిరిగిరాని లోకాలకి మరలిపోయిందన్న దిగులు. సుస్వరం, సుశబ్దం మౌనంగా నిష్ర్కమిస్తున్నాయన్న వేదన మరో వైపు. అరవై, డెబ్భై దశకాలు తెలుగు కుటుంబ గాథా చిత్రాలకు స్వర్ణయుగం. అలాంటి చిత్రాల మూలస్తం భాలలో ప్రధానంగా చెప్పుకోవలసి వస్తే ఏయన్నార్ పేరే మొదటిగా చెప్పుకోవాలి. తమ్ముడు, అన్న, కాలేజీ విద్యార్థి, జవాన్, కిసాన్, కవి, కార్మికుడు, జులాయి, భక్తుడు, దేవుడు, డాక్టర్, యాక్టర్ అన్నింటికీ మించి ప్రేమికుడు.. ఆయన ధరించని పాత్ర లేదు. సాంఘిక ం, జానపదం, పురాణ చిత్రం అన్న భేదం ప్రేక్షకుడికే గానీ ఆయనకు లేదేమోననిపిస్తుంది. కాళి దాసు, జయంతుడు, అభిమన్యుడు -పాత్రల మధ్య నిశితమైన వైవిధ్యం చూపుతూ, సునాయసంగా నటించారాయన. ప్రేమికుడిగా ఆయన నటనను చూస్తుంటే, ఓ భగ్నప్రేమికునిగా చూస్తూ ఉంటే... అక్కినేని ఒక పాత్రలో దర్శనమిస్తున్నారని మరచిపోయి, ఆ ప్రేమికుడి భావాలతో ప్రేక్షకులు మమేకమైపోయిన సందర్భాలు ఎన్నో! ఆయన మన కుటుంబంలోని వాడేనన్న మధుర భ్రాంతి. ఆయన నటించిన సినిమాలలో ఒక కాల పు సినిమాలకు రంగులు లేకపోయినా, ఆయన కలలే వేరే రంగులు లేని లోటును తీర్చేవి. మనకున్న చక్కటి కుటుంబ కథాచిత్రాలు చాలా గొప్పవి. ఆ గొప్పతనంలో సింహభాగం అక్కినేనిదే. 1979 నుంచి వరసగా, 2013 నాటి గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని కూడా వీక్షించిన అనుభవం, 35 ఏళ్లుగా చూసిన ఎన్నో వందల చిత్రాలు కలిగించిన అనుభూతి ద్వారా నాకు కలిగిన నమ్మకమిది. అక్కినేని లేని వెండితెర చరిత్రకు పరిపూర్ణతలేదు. నటనేకాదు, ఆయన ప్రసంగం కూడా నిర్దుష్టంగా ఉంటుంది. నిర్దిష్టంగా కూడా ఉంటుంది. విరిసిన వెన్నెల వంటి నవ్వు. జీవితసారం మీద అనేక ఇంటర్వ్యూలలో అలవోకగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు దేనికవే. అన్నింటి మీదా అక్కినేని ము ద్ర సుస్పష్టం. కొన్ని వందల చిత్రాలలో కనిపించిన అక్కినేని రూపం ఇవాళ నుంచి చరిత్ర పుటగా మారిపోయింది. స్టార్ ఏయన్నార్ ఇప్పుడు వెండితెరను వీడి దివికేగిన నక్షత్రం. వి. రాజారామమోహనరావు, సినిమా విమర్శకుడు, నవలా రచయిత -
మహాభినిష్ర్కమణం!
తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు... భారత చలన చిత్ర పరిశ్రమకే దిగ్గజమనదగ్గ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. నిజజీవితం లోనూ, వెండితెరపైనా ఆయనది పరిపూర్ణమైన జీవితం. నిండైన వ్యక్తిత్వం. ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పడానికి, ఒక కళాకారుడు ఎలా ప్రవర్తిల్లాలో తెలుసుకోవడానికి ఆయన ఏ తరానికైనా పనికొచ్చే పెద్ద విశ్వవిద్యాలయం. అందులో నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత లభిస్తుంది. భవిష్యత్తు తరాలకు కూడా అది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కృష్ణాజిల్లాలో కేవలం యాభై గడపలే ఉన్న పల్లెటూరు వెంకటరాఘవాపురంలో పుట్టి, నాలుగో తరగతితోనే చదువు ఆపేసిన ఒక అర్భకుడు అసామాన్యుడిగా ఎదిగి 74 ఏళ్లపాటు తెలుగు చలన చిత్ర రంగంలో దేదీప్యమానంగా వెలగడమంటే మాటలుకాదు. తన కుటుంబంలో అంతకుముందెవరూ కళాకారులు లేరు. తెలిసీతెలియని వయసులో రంగస్థలంపై చిన్న పాత్రను పోషించి ఇంటికొచ్చినప్పుడు తల్లి ఆయన ముఖకవళికల్లో సంతోషాన్ని పసిగట్టి ఆ రంగంలోనే ప్రోత్సహించాలని సంకల్పించకపోతే తెలుగు సినీ కళామ తల్లికి ఇంతటి శిఖరాయమానమైన మనీషి లభించే వాడుకాదు. తన నటనతో ఆయన ఏడెనిమిది తరాలను అలరించారు. సమ్మోహన పరిచారు. రొమాంటిక్ హీరోగా, కుటుంబ కథా చిత్రాల నాయకుడిగా తెలుగు ప్రేక్షకులను కలలప్రపంచంలో తేలియాడేలా చేశారు. భిన్న రంగాల్లో ఆయన ఒదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. నటుడిగానేకాక వ్యాపారవేత్తగా, నిర్మాతగా కూడా ఆయన సూపర్ హిట్. హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమను నెలకొల్పడమనే అంశం ఊహకు కూడా అందనిరోజుల్లో అన్నపూర్ణా స్టూడియో నిర్మించడం ద్వారా దానికి అంకురార్పణచేశారు. వందల మందికి ఉపాధి కల్పించారు. సమాజ శ్రేయస్సును కాంక్షించి ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ వంటి ప్రబో ధాత్మక చిత్రాల నిర్మాణానికి పూనుకున్నారు. తనలో వెల్లువెత్తే భావాలకు అక్షరరూపం ఇచ్చి ‘అఆలు’ (అక్కినేని ఆలోచనలు) పేరిట కవితా సంకలనాన్ని వెలువరించారు. తాను చదువుకోలేదన్న బాధ ఏమూలో ఉన్నందువల్ల కావొచ్చు... పుట్టిన ఊరికి సమీపంలో ఉన్న గుడివాడ పట్టణంలో కళాశాల నెలకొల్పడానికి నడుంకట్టారు. తెలుగు తెరపై తిరుగులేని తారగా ఎదిగి, కోట్లు గడించాక చేసిన పనికాదు ఇది. తన సంపాదన ఇంకా అంతంతమాత్రంగానే ఉన్నకాలంలో పెద్ద మనసుతో ఆలోచించి చేసిన మహత్కార్యం. ‘ప్రతిదీ సులభ సాధ్యమ్ము కాదు లెమ్ము... నరుడు నరుడగుట దుష్కరము సుమ్ము’ అని గాలిబ్ అన్నట్టు ఇదంతా అలవోకగా, అయాచితంగా ఆయనకు లభించలేదు. కఠోర శ్రమ, స్వీయ క్రమశిక్షణ, పట్టుదలవంటి లక్షణాలుంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కూడా కాదు. తాము పనిచేస్తున్న రంగంలో తప్ప ఇతరేతర రంగాల గురించి, అందులో జరుగుతున్న పరిణామాల గురించి అసలే ఏమీ తెలియని, పట్టని వ్యక్తులుండే పరిశ్రమలో అక్కినేని విషయ పరిజ్ఞానం అపారమైనది. ప్రతి అంశాన్నీ నిశితంగా, లోతుగా తెలుసుకోవాలనే పట్టుదలే ఆయనకు అన్నిటినీ నేర్పింది. ఆ పరిజ్ఞానమే ఆయనను ఒక నటుడికుండే పరిమితులను అధిగమించేలా చేసింది. జీవితాన్ని గురించి, మృత్యువు గురించి ఆయనకు విస్పష్టమైన అభిప్రాయాలుండేవి. చానెళ్లలో వచ్చి కూర్చుని తన అభిమానులడిగే ప్రశ్నలకుగానీ, చర్చ నిర్వహించేవారు అడిగే ప్రశ్నలకుగానీ ఆయన చెప్పే జవాబులు అందరినీ చకితుల్ని చేసేవి. ఆయనలోని తాత్వికుడిని పట్టి చూపేవి. స్వస్వరూప జ్ఞానం ఆ జవాబుల్లో స్పష్టంగా కనబడేది. ‘మీ అభిమానం అలా మాట్లాడిస్తున్నది తప్ప...నా గురించి నాకు తెలుసు’ అని వినమ్రంగా మాట్లాడేవారు. సున్నితంగా తోసిపుచ్చేవారు. నాస్తికుడిగా జీవితాన్ని ప్రారంభించి చివరివరకూ తన విశ్వాసాలను అలాగే ఉంచుకున్నారు అక్కినేని. అలాగని తన సంతానానికి దైవభక్తి వంటివి ఉంటే వాటిని నియంత్రించే పనికి పూనుకోలేదు. తన అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఆ రకంగా చూస్తే ఆయన అత్యంత ప్రజాస్వామిక వాది. ఆ నాస్తికభావాలు వెండితెరపై పాత్ర పోషణలో ఏనాడూ ఆయనకు ఆటంకం కాలేదు. విప్రనారాయణ, భక్తతుకారం, మహాకవి క్షేత్రయ్యవంటి పాత్రల్లో ఆయన జీవించారు. ఈ క్రమంలో ఆయనకు అనేకానేక అవార్డులు లభించాయి. నటసమ్రాట్గా, ఎవర్గ్రీన్గా జనం నీరాజనాలుపట్టారు. కనక వర్షం కురిపించే కమర్షి యల్ చిత్రాల కథానాయకుడిగా వెలిగిపోయినా అక్కినేని మనసు మాత్రం ఉండవలసిన చోటే ఉండేది. అందుకే తన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన వాటి గురించి అడిగితే ‘బాటసారి’, ‘విప్ర నారాయణ’, కాళి దాసు’ వంటి చిత్రాలను ప్రస్తావించేవారు. ఇవి భారీ వసూళ్లు చేయక పోయినా సీరియస్ ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలనూ, ప్రశంసలనూ అందుకున్న చిత్రాలు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదని అక్కినేని అంటుండే వారు. చివరి వరకూ తనలోని కుతూహలాన్నీ, విషయాసక్తినీ ఆయన పోగొట్టు కోలేదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆచరించదగ్గ, అనుసరించ దగ్గ లక్షణాలివి. శూన్యంలో ప్రయాణం ప్రారంభించి, స్వయంశక్తితో ఒక్కో మెట్టే ఎక్కి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అక్కినేని ఏ దశలోనూ తప్పటడుగులు పడనీయలేదు. కుటుంబంపట్లా, సమాజం పట్లా తన బాధ్యతను మరవలేదు. అంతటి అరుదైన, అపురూపమైన వ్యక్తిత్వం మన మధ్యనుంచి కనుమరుగుకావడం యావత్తు తెలుగు జాతికి బాధాకరమైన విషయం. మహోన్నత వ్యక్తులు కనుమరుగయ్యాక కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. మార్గదర్శకులుగా నిలుస్తారు. అందు వల్లే అక్కినేని లాంటి వ్యక్తికి మరణం లేదు. -
బడికెళ్లని ఆచార్యుడు...
నివాళి: సుద్దాల అశోక్తేజ, ప్రముఖ సినీ గేయ రచయిత ఫైనల్గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్ని మ్యూట్లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్లో ఆయనేం చెప్పదలుచుకు న్నారో అర్థమైపోతుంది. అదే సీన్ని కళ్లు మూసుకుని కేవలం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్లోని మెస్మరిజం అదే! ‘‘ఇల్లు కొనుక్కున్నారా?’’ ‘‘లేదు సార్...’’ ‘‘పోనీ... కారైనా ఉందా?’’ ‘‘అదీ లేదండీ...’’ ‘‘ఎప్పటికైనా సరే... ముందు ఇల్లు కొనుక్కోండి. మీ భార్య సంతోషిస్తుంది. ఆ తర్వాతే కారు’’ ‘‘అలాగే సార్’’. 2000 సంవత్సరంలో ‘సకుటుంబ సపరివార సమేతం’ షూటింగ్ స్పాట్లో ఏయన్నార్గారికి, నాకూ మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. అలా ఆయన నోట నా పాట రావడం నిజంగా నా అదృష్టమే. ఆ షూటింగ్ లొకేషన్లో చాలాసార్లు కలిశాన్నేను. ఎన్నో ఏళ్ల జీవితానుభవంతో ఆయన చెప్పిన కొన్ని అంశాలను నా మనసులోనే భద్రపరచుకున్నా. ఆయన చెప్పిన సలహాలు... అప్పుడే కెరీర్ మొదలు పెట్టిన నాకు ఓ గైడింగ్ ఫోర్స్లా ఉపకరించాయి. ‘‘ఇండస్ట్రీలో నీకెవరిమీదైనా కోపం కలిగినా, అసహనం వచ్చినా ఎక్కడా వ్యక్తపరచొద్దు. నీలో నువ్వు దాచుకో. లేకపోతే నీ భార్యతో పంచుకో. సినిమా పరిశ్రమలో గోడలకు, కిటికీలకు, రోడ్లకు, అన్నింటికీ చెవులుంటాయ్’’. నిజంగా ఎంత గొప్ప సలహా అది. ఏయన్నార్ చెప్పిన ఇంకో విలువైన విషయం ఏంటంటే... ‘‘ఇక్కడ ఎవరికి వాళ్లే ఆధునిక భస్మాసురులు. క్రమశిక్షణ, వృత్తిపట్ల గౌరవభావం, టైమ్సెన్స్... ఈ మూడూ లేకపోతే మన నెత్తి మీద మనమే చేయిపెట్టుకున్నట్టు. ప్రతిభ కన్నా ముఖ్యమైన అంశాలు అవి’’. నిజంగా నాకైతే ఆయన సూచనలు సినీ భగవద్గీతలా అనిపించాయి. ఆయన నటించిన ‘నటసమ్రాట్’ అనే టీవీ సీరియల్కి టైటిల్సాంగ్ రాశాను. ఆ పాటలో ‘బడికెళ్లని ఆచార్యుడు నటసమ్రాట్... ఏ గుడికెళ్లని తాత్వికుడు నటసమ్రాట్...’ అనే రెండు వాక్యాలు ఆయన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన కారులో కొన్నాళ్లపాటు ఈ పాట మార్మోగి పోయింది. ఆయన నటించిన ‘శ్రీరామదాసు’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను. సముద్రాల, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర, సినారె లాంటి హేమాహేమీలతో పనిచేసిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా ఈ తరంలో నాలాంటి కొంతమందికే దక్కింది. ‘రవీంద్రభారతి’లో జరిగిన 10-15 సభల్లో నేనూ ఆయనతో పాటు పంచుకున్నా. ఓసారి ‘అక్కినేని అభినయ అవలోకనం’ అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆయన అభినయం గురించి 45 నిమిషాలు ప్రసంగించాలి. అదీ ఆయన ముందు. కొంచెం కష్టమే. కానీ నాకిష్టంగా అనిపించింది. నేనేం చెప్పానంటే... ‘‘సావిత్రి కేవలం కళ్లతోనో, నవ్వుతోనో అభినయిస్తుందంటారు. అయితే మీకో సినిమా సీన్ చెప్పాలి. ‘పెళ్లి కానుక’ సినిమాలో హీరోయిన్కి తన బిడ్డను అప్పగించి, సూర్యాస్తమయం వైపుకి ఏయన్నార్ నడుచు కుంటూ వెళ్తుంటారు. ఆ షాట్లో కేవలం ఆయన వీపు మాత్రమే కని పిస్తుంది. ఆ వీపుతో కూడా తాను చెప్పదలుచుకున్న భావాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు’’. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం క్లాప్స్. నా అబ్జర్వేషన్ని ఏయన్నార్ కూడా ప్రశంసించారు. ‘నవరాత్రి’లో కూడా అంతే. ఆయన, సావిత్రి కేవలం సైగలతోనే సంభాషించుకుంటారు. ఎంత గొప్ప యాక్టింగ్. ఎవరు చేయగలరండీ అలా. ‘శ్రీరామదాసు’ ఆడియో ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. ఏయన్నార్తో కలిసి నేనూ రైలులో వెళ్లా. ఆయనతో రెండు గంటలు స్పెండ్ చేశా. ఎన్ని అనుభవాలు చెప్పారో. ఓసారాయనకు మశూచి వచ్చిందట. అవి చిదిపితే మొహం మొత్తం మచ్చలు మిగులుతాయి. దానికి ఒకటే పరిష్కారం. ఒక్కో పొక్కుని సిరంజితో గుచ్చి ఇంజెక్షన్ చేయాలి. ఆల్మోస్ట్ యాసిడ్ లాంటి మందు. నిజంగా నరకమే. అయినా భరించారు. ఆయన జీవితం ప్రతి మలుపులోనూ ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అడ్డుపుల్లలు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిపీలకం అని వెక్కిరించిన వాళ్ల ఎదురుగానే... ఎవరెస్ట్లా ఎదిగి చూపించారు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఆయన్నుంచి ఈ తరమే కాదు... రాబోయే తరాలు కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. తెరపై ఆయన గొప్ప లవర్ బాయ్. తెర బయట ఆయనో గొప్ప లైఫ్ లవర్బాయ్. జీవితం పట్ల ఆమోఘమైన ప్రేమ ఉందాయనకు. అదే ఆయన్ను ఇంత దాకా నడిపించింది. గుండె మనిషిని నడిపిస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఒక మనిషి... గుండెను నడిపిస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? ప్రపంచంలో అలాంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే అక్కినేని. అమెరికాలో ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్లే ఈ గుండె ధైర్యాన్ని చూసి విస్తుపోయారట. మనిషి ఎంత కాలం బతికినా 120 ఏళ్లకు సరిపడ్డా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తారాయన. ఫైనల్గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్ని మ్యూట్లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్లో ఆయనేం చెప్పదలుచుకున్నారో అర్థమైపోతుంది. అదే సీన్ని కళ్లు మూసుకుని కేవ లం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్లోని మెస్మరిజం అదే! ఈ నట రవిబింబం అస్తమించింది! అభినయ మేరునగం క్రుంగిపోయింది! మొత్తంగా ఒక శకం ముగిసింది..! -
తమిళంలోనూ ప్రేమదాసే
సినీ దాసులెం దరున్నా సినీ జగత్తులో దేవదాసు ఒక్కరే... ఆయనే అక్కినేని. ఈ దేవదాసు కీర్తి అజరామరం. తమిళంలోనూ ఈయన ప్రేమదాసుగానే కీర్తికెక్కారు. అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకున్నా సినీ భారతావనికి ఆయన పేరు చిరస్మరణీయమే. అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎందరో ఎన్నో రకాలుగా కీర్తించారు. అయినా ఆ మహానటుడి గురించి రాయడానికి మాటలు చాలవు. 250 చిత్రాల సినీ యుగ పురుషుడు. గ్లాస్ పట్టితే అక్కినేని పట్టాలి. క్లాస్ స్టెప్లేస్తే ఆయనే వేయాలి. ప్రేమనగర్ చిత్రంలో నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది అంటూ ప్రేక్షకులను గమ్మత్తుగా మత్తులోకి తీసుకెళ్లారు. నిజ జీవితంలో నిండు పున్నమి లాంటి ఆయన నవ్వే అభిమానులను మైమరపించింది. అంతటి చిద్విలాసి ఏఎన్ఆర్. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ పరిశ్రమతోనూ విడదీయరాని అనుబంధం వుంది. ఎవర్గ్రీన్ చిత్రం దేవదాస్. తమిళంలోనూ అద్భుత విజ యాన్ని సాధించింది. జెమినీ గణేశన్, సరోజదేవి నటించిన కల్యాణ పరిసు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యపాత్ర పోషించారు. ఒరు ఇరవు, మాయా కరి, పూంగోతై, ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి, అల్లా ఉద్దీన్ అద్భుద విళక్కు, మంజల్ మహిమై, అదిశయ పెణ్, దైవమేతుణై, ఎంగళ్ సెల్వి, తుయ్ ఉళ్లం, అన్భుమగళ్, మనిదన్ మారవిళ్లై, పెణ్ముణం మొదలగు తమిళ చిత్రాల్లో నాగేశ్వరరావు నటించి తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందారు. భారత జాతి గొప్ప నటుడిని కోల్పోయింది తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం నన్నెంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది. నాగేశ్వరరావు నాటక రంగం నుంచి ఎదిగిన నటుడు. ఆయన ధర్మపత్ని చిత్రం నుంచి సినీ కెరీర్ను ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన దేవదాస్ చిత్రం నాగేశ్వరరావు నట విశ్వరూపానికి మైలురాయిగా నిలిచింది. ఇరు ఇరవు, పూంగోతై తదితర చిత్రాల్లో తమిళ ప్రేక్షకులను అలరించిన నటుడీయన. తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో నాగేశ్వరరావు. రఘుపతి వెంకయ్య, దాదా ఫాల్కే అవార్డు, పద్మభూషణ్, కలైమామణి, ఫిలింఫేర్, ఎన్టీఆర్ జాతీయ అవార్డు వంటి ఎన్నో అవార్డులకు అక్కినేని అలంకారం అయ్యారు. తెలుగులో నా తొలి చిత్రం (మనుషులు మమతలు) నాగేశ్వరరావుతోనే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అలాంటి మహానటుడి మరణం భారత సినీ జాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - సీఎం జయలలిత సినీ ఆకాశంలో గొప్ప స్టార్ అక్కినేని నాగేశ్వరరావు నాకు మానసిక గురువు. అలాంటి మహానటుడి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు పదహారేళ్ల వయసులో సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ సమయంలో నాగేశ్వరరావు గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో సలహాలిచ్చేవారు. అక్కినేని సినీ వినీలాకాశంలో ఒక గొప్ప స్టార్. తెలుగు సినిమా పెద్ద దిక్కును కోల్పోయింది. - కమలహాసన్ -
అక్కినేని అడుగు జాడలు
బతికి ఏం బావుకుంటామని చావబోకు చచ్చి ఏం సాధిస్తామని బతకబోకు బతికి జీవితాన్ని సాధించు చనిపోయి కలకాలం జీవించు - ‘అ.. ఆ’లులో అక్కినేని నువ్వు ఏడిస్తే ఏడ్చాం.. నువ్వు నవ్వితే నవ్వాం.. నువ్వు ‘ప్రేమాభిషేకం’ అంటే మేం పట్టాభిషేకం చేశాం.. ‘చెంగావి రంగు చీర..’ అంటూ స్టెపులేస్తే నీ అడుగుల్లో అడుగులేశాం. ‘ఆగదు ఏ నిముషం నీకోసం..’ అంటూ కాలానికి భాష్యం చెబితే అర్ధం చేసుకున్నాం.. కానీ.. టాటా.. వీడుకోలు అంటూ మాకు దూరం అవుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాం.. అని జిల్లాలోని ఏఎన్ఆర్ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని, వచ్చిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆంధ్రాప్యారిస్లో అపూర్వ ఆహ్వానం తెనాలిరూరల్, న్యూస్లైన్ : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 60 సినివూలు పూర్తిచేసిన సందర్భంలో ఆంధ్రదేశంలోని అన్ని పట్టణాల్లో వజ్రోత్సవాలు నిర్వహించారు. నాగేశ్వరరావు రాష్ట్రమంతా పర్యటించారు. అదే సందర్భంలో 1957 జూలైలో తెనాలిలో నాగేశ్వరరావును సన్మానించేందుకు పట్టణంలోని నాటక సంస్థలన్నీ కమిటీగా ఏర్పడ్డాయి. ఆహ్వానసంఘ కమిటీకి అధ్యక్షుడిగా కల్లూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా నేతి పరమేశ్వరశర్మ, కోశాధికారిగా సత్యనారాయుణ టాకీస్ అధినేత వాసిరెడ్డి నారాయుణరావు, ఉపాధ్యక్షుడిగా చంద్రవళి సత్యనారాయుణ, ‘వూయులఫకీరు’ వల్లూరి వెంకట్రావుయ్యు వ్యవహరించి ఏఎన్ఆర్ను ఆహ్వానించారు. సత్కారంలో భాగంగా టాపులేని వాహనంలో అక్కినేనికి జరిగిన ఊరేగింపులో వేలాదిజనం పాల్గొన్నారు. వుుందుగానే అక్కినేని వస్తారని తెలిసినందున పరిసరాల్లోని గ్రావూల నుంచి ప్రజలు ఉదయూన్నే భోజనం వుూటలతో సహా తెనాలి చేరుకున్నారు. నాగేశ్వరరావుకు ఆరోజు నాగకళావుందిర్లో ఘనసన్మానం జరిగింది. పట్టణ కళాకారులతో ఆయున విడిగా తాలూకా హైస్కూలులో సవూవేశవుయ్యూరు. పట్టణ చరిత్రలో ఇదొక అద్భుతమైన సన్నివేశంగా ఇప్పటికీ చెప్పుకొంటారు. అక్కినేని సినిమాల్లో చేసిన క్యారెక్టర్లకూ, తన జీవితానికి సంబంధం ఉందని, ఆయన సినిమాల్లోని సంఘటనలు తన నిజజీవితంలో జరిగాయని తెనాలి మండలం కొలకలూరుకు చెందిన అభిమాని ‘మిఠాయి’ శివయ్య ఇప్పటికీ చెబుతుంటారు. ప్రతి సందర్భంలోనూ తన భార్యతో కలసి ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కినేనిని కలసి వచ్చేవారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వీ కృష్ణారావు కన్వీనరుగా 1999 ఆగస్టు 28వ తేదీన ఇక్కడి పాత రాజ్యం టాకీస్లో నిర్వహించిన శ్రీ మద్దూరి కృష్ణమూర్తి స్మారక రాష్ట్రస్థాయి పద్య నాటక పోటీలను అక్కినేని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆదరణ మరువలేనిది.. చిలకలూరిపేట : కళాకారుల్లో చిన్న పెద్ద కళాకారులు ఉండరు.. మనమంతా కళాకారుల కుటుంబమే.. అంటూ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత విడదల సాంబశివరావు. మట్టిమనిషి టీవీ సీరియల్లో ఆయనతో పాటు ప్రధానపాత్రలో నటించిన సాంబశివరావు అక్కినేని మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ‘టీవీలో సీరియల్లో పని చేసేటప్పుడు రెండేళ్లు ఆయనతో కలిసి ఉన్నా. ఆయనతో కలిసి నటించిన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిది..’ అన్నారు. ‘నా జన్మభూమి..’ అని పాడింది ఇక్కడే.. దుగ్గిరాల, న్యూస్లైన్: సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు నటనను ప్రత్యక్షంగా చూసే అవకాశం దుగ్గిరాల మండల ప్రజలకు దక్కింది. 1969 సంవత్సరంలో ‘సిపాయి చిన్నయ్య ’ చిత్రంలోని ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ.. హైహై నాసామి రంగా..’ అనే పాటలోని కొన్ని సన్నివేశాలను దుగ్గిరాల ప్రాంతంలో చిత్రీకరించారు. దుగ్గిరాల నీటిపారుదల శాఖకు చెందిన బంగ్లా ప్రాంతంలోను, మంచికలపూడి పెట్రోలు బంకు సమీపంలో, రేవేంద్రపాడు కాలువకట్ట సమీపంలో నాలుగురోజుల పాటు చిత్రీకరించారు. ఈ సమయంలో మండలం చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అక్కినేనిని చూశారు. మంచికలపూడి వద్ద వంగిన తాడి చెట్టు ఎక్కి దూకుతూ తీసిన సన్నివేశం, రేవేంద్రపాడు వంతెన సమీపంలో నాగలితో దున్నటం, నాట్లు వేయించిన సన్నివేశాలు తీశారు. నాట్లు వేసే సీన్లో రేవేంద్రపాడు మహిళలు పాల్గొన్నారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన జమిందారు మొక్కపాటి వెంకటేశ్వరరావు భవనంలో పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగుతో ఆయన భోంచేశారు అని పెద్దలు గుర్తు చేసుకున్నారు. ఏఎన్ఆర్ను ప్రత్యక్షంగా చూసిన వారి చూసిన అనుభవాలు వారి మాటల్లో.. తృప్తిగా భోంచేశారు.. షూటింగ్ జరుగుతున్నప్పుడు మా గ్రామంలో ఎవరో భోజనానికి రమ్మన్నారట. వచ్చాక వాళ్లెవరు పట్టించుకోలేదట. ఈ సమయంలో గ్రామస్తులు చెప్పటంతో ఏఎన్ఆర్ మా ఇంటికి వచ్చారు. సరాసరి వరండాలోకి వచ్చి కూర్చున్నారు. అయ్యో తెలియకుండా వచ్చారే.. నాకు తెలియదు గదా అని నేనన్నాను. అప్పుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘రైతుల ఇళ్ళల్లో సంవత్సరం పొడవునా ఉండే ఆవకాయ పచ్చడి అంటే నాకు ఇష్టం వాటితో భోజనం పెట్టండమ్మా..’ అన్నారు. అప్పుడు వెంటనే భోజనం సిద్ధం చేసి పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగుతో భోజనం వడ్డించాను. తృప్తిగా భోంచేసి, చాలా బాగుందమ్మా అన్నారు. - మొక్కపాటి శేషకుమారి, రేవేంద్రపాడు ఎంతో ఆనందాన్నిచ్చింది.. 1969లో రుమేనియా దేశానికి చెందిన యూనివర్సల్ 500 ట్రాక్టర్ను కొనుగోలు చేశాను. ఏపీజీ 8600 నంబ రు వచ్చింది. అప్పుడే రేవేంద్రపాడులో అక్కినేని నటించిన సిపాయి చిన్నయ్య చిత్రం షూటింగ్ జరుగుతోంది. ట్రాక్టర్ నడిపే సన్నివేశం కోసం పాత ట్రాక్టర్ టాపు తీసి సిద్ధం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మా పిల్లలు కొత్తగా వచ్చిన మా ట్రాక్టర్ను తీసుకొచ్చారు. దాన్ని అక్కినేని నడిపారు. ఎంతో ఆనందాన్నిచ్చింది. - కుర్రే వెంకటరెడ్డి, నూతక్కి గుంటూరు గడ్డపై.. 1953లో బతుకుదెరువు చిత్ర విజయోత్సవ సభకు గుంటూరు వచ్చి న ఏఎన్ఆర్ నగర ప్రజల అభిమానాన్ని అందుకున్నారు. 1955లో సంతానం చిత్ర విజయోత్సవానికి కృష్ణమహల్ థియేటర్కు వచ్చారు. 1956 ఇలవేల్పు చిత్ర విజయోత్సవంలో, 1957లో నగర పౌర సన్మానం అందుకున్నారు. అమరశిల్పి జక్కన్న, మూగమనసులు చిత్రాల వంద రోజుల విజయోత్సవాలకు నగరానికి విచ్చేశారు. 1988లో ఏసీ న్యాయ కళాశాలలో ఏఎన్ఆర్కు సన్మానం జరిగింది. 1991లో మారుతీనగర్లోని మారుతీదేవాలయంలో నటుడు ధూళిపాళ్ళ నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. 1993లో నాటి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ రాయపాటి సాంబశివరావు ఏఎన్నార్ను స్వర్ణకిరీటంతో సత్కరించారు. 1996లో విజయకృష్ణా హోటల్లో ఆయన వీరాభిమానులు ఆయనను ఘనంగా సత్కరించారు. -
అక్కినేనికి జగన్ నివాళి
-
అక్కినేని 'డిటెక్టివ్' కథ
తెలుగు చిత్రసీమ మణిహారంలో 'మిస్సమ్మ' ఓ ఆణిముత్యం. ఈ సినిమాలో దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యపాత్రలు పోషించారు. ఆద్యంతం హాయిగా సాగిపోయే ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకోవడమే గాక తెలుగువారి మదిలో మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఈ సినిమాలో అక్కినేని డిటెక్టివ్ పాత్రలో అక్కినేని హాస్యం పండించారు. అప్పటికే అగ్ర కథానాయకుడయిన నాగేశ్వరరావు చిన్న పాత్ర చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన డబ్బులకు అమ్ముడైపోయాడన్న వారు లేకపోలేదు. 'మిస్సమ్మ'లో తాను చేసిన పాత్ర గురించి అక్కినేని ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు. అవకాశాల కోసం ఎవరిని అడగని అక్కినేని- 'డిటెక్టివ్' పాత్ర నేను చేస్తానని అడిగి మరీ చేశారట. తన కెరీర్తో అడిగి చేసిన పాత్ర ఇదొకటేనని అక్కినేని స్వయంగా వెల్లడించారు. అయితే దీని వెనుకో కారణముందని ఆయన చెప్పారు. దేవదాసు సినిమా విడుదలై ఘన విజయం సాధించాక ఆయనకు అన్నీ విషాద పాత్రలే వచ్చాయటే. దీంతో 'ట్రాజెడీ కింగ్' ముద్ర పడిపోతుందని భావించిన ఏఎన్నార్ రూటు మార్చారు. డిటెక్టివ్ పాత్ర నేనే చేస్తానంటూ చక్రపాణి గారిని స్వయంగా అడిగి మరీ చేశానని అక్కినేని వెల్లడించారు. డబ్బులకు అమ్ముడయి తాను చిన్న పాత్ర చేశానని అప్పట్లో అంతా అనుకున్నారని.. అమ్ముడపోయి చేసిన పాత్ర కాదని... అడిగి చేసిన పాత్ర అని ఆయన వివరణయిచ్చారు. అయితే డిటెక్టివ్ పాత్రకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడడంతో అక్కినేనికి ఆయనే సాటి. సీనియర్ నటుడు అయినప్పటికీ మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా నడుచుకుంటూ చివరి వరకు నటనను కొనసాగించిన నటసామ్రాట్ ఏఎన్నార్. ఒకదశలో ఏఎన్నార్ టీవీ సీరియల్లో కూడా నటించారు. దీనిపైన కూడా ఒకానొక సందర్భంలో ఆయన వివరణయిచ్చారు. టీవీ సీరియల్లో నటించడాన్ని తాను డీ-ప్రమోషన్గా భావించడం లేదని, తన దృష్టిలో ఇది ప్రమోషన్ అని నిక్కచ్చిగా చెప్పారు. శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక విజ్ఞానంలో మనం కూడా పాలు పంచుకోవడం అంటే ప్రగతి కాదా అంటూ ప్రశ్నించారు. దటీజ్ అక్కినేని. తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిన అక్కినేని జనవరి 22న భౌతికంగా దూరమయ్యారు. -
అక్కినేనికి ప్రభాస్ నివాళులు
-
రేపు షూటింగ్లు, సినిమా థియేటర్లు బంద్
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు అక్కినేని భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు హైదరాబాద్ రానున్నారు. అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు వచ్చే అవకాశం ఉంది. అక్కినేని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో ఏఎన్ఆర్ అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి డీకె అరుణ తెలిపారు. బుధవారం ఆమె అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడుతూ ఓ మహానటుడిని కోల్పోయామని అన్నారు. కాగా అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతికకాయాన్ని నేడు, రేపు అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంచనున్నారు. గురువారం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. కాగా మరోవైపు అక్కినేని మృతికి సంతాపంగా సినిమా కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు.