Election Code of Conduct
-
కొత్త రేషన్కార్డుల జారీ ఆపోద్దు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొత్త రేషన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆలస్యం చేయకుండా కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశాలు జారీ చేశారు.సోమవారం తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు(Telangana New Ration Cards) సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారాయన. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(Election Code) అమలు ఉంది. అందుకే కార్డుల జారీ నిలిచిపోయింది. అయితే.. కోడ్ అమలు లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. అలాగే..అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు(Ration Card Apply) చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అవగాహన కల్పించాలని సూచించారాయన. -
‘కోడ్’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పెత్తనంతో..ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఎవరికి వారే..ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్కు విన్నవించారు. టీఎంయూ, ఎన్ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. -
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు ఆర్డినెన్స్?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.చైర్మన్, పాలకవర్గం నియామకం యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు. స్వాగత తోరణానికి రంగులు యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్తో నిర్మించారు. నవంబర్లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్? యాగశాల ఏర్పాటుకు మార్కింగ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
అబ్బా.. సర్కారు డబ్బా!
2,736 కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయంరాబోయే మూడేళ్లలో ఆర్టీసీకి 2,736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత మూడేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సు లను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2,736 బస్సుల్లో మొదటి దశ కింద 1,500 బస్సుల టెండర్ ప్రక్రియ చేపట్టాం. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని.. మిగిలిన వాటిని ఆ తర్వాత దశలవారీగా ప్రవేశపెడతాం. – 2023, మార్చి 7న అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించిన విషయం సాక్షి, అమరావతి : 2023లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,500 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. టెండర్లు పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసేసింది. బస్సులు కూడా వచ్చేశాయి. వాటిని ప్రారంభించడమే తరువాయి.. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడా బస్సులను ప్రస్తుత ప్రభుత్వం కేవలం జెండా ఊపి ప్రారంభిస్తోందంతే. కానీ, అంతా తామే చేశామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం యమా బిల్డప్ ఇస్తోంది. ఈ బస్సుల కొనుగోళ్లలో వీరి పాత్ర పిసరంత కూడా లేకపోయినా తెగ డబ్బా కొట్టుకుంటున్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు. విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత సర్కారు ప్రారంభిస్తూ అంతా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్న జాబితాలో ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభం కూడా చేరింది. టీడీపీ ప్రభుత్వం 1,400 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఆ బస్సుల కొనుగోళ్లకు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్సార్సీపీ సర్కారే. ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభిస్తోందంతే. కానీ, ఆ వాస్తవాన్ని మరుగునపెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మూడు దశల్లో 2,906 బస్సుల కొనుగోలు నిజానికి.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. ముందుగా 2019–20లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజిల్ బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల–తిరుపతి ఘాట్రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ మొత్తం 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇక 2023 చివరిలో మరో 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా చేశాయి. ఎన్నికల నియమావళి ఉండటంతో గత ప్రభుత్వం ప్రారంభించలేదు. వాటినే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.. అంతే! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు కోసం ఇప్పటివరకు టెండర్లు పిలవనే లేదు. మరి టెండర్లు పిలవకుండానే కొత్త బస్సులను రెండు నెలల్లో ఎలా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. వాస్తవానికి ఈ బస్సులన్నింటికీ టెండర్లు పిలిచి డబ్బులు చెల్లించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ బస్సులకు మహా అయితే ఈ రెండు నెలల కాలంలో తుది మెరుగులుదిద్ది ఉంటారు. ఇప్పుడు వీటికి జెండా ఊపుతూ అదేదో మొత్తం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ టీడీపీ లేబుల్ వేసుకుంటున్న తీరుని చూసి జనం నవ్వుకుంటున్నారు. -
డీజీపీ, పలువురు కమిషనర్ల మార్పు?
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల హడావుడి, కోడ్ ముగియడంతో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనదైన టీంను సెట్ చేసుకోవడంపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీజీపీ, పలువురు పోలీస్ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది. కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉందని సమాచారం. శివధర్రెడ్డి వైపు సర్కారు మొగ్గు ప్రస్తుతం డీజీపీ (హెచ్ఓపీఎఫ్–హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీ (హెచ్ఓపీఎఫ్)గా సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్రెడ్డి, జితేందర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న సీవీ ఆనంద్ అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పోస్టులో ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ శివధర్రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్రెడ్డిని ఇటీవల ఏర్పడిన రెండు డీజీపీ ర్యాంకు ఖాళీల భర్తీలో భాగంగా పదోన్నతి ఇచ్చి పోలీస్ బాస్గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికి డీజీపీలుగా పదోన్నతి ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్లు కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా బదిలీ అయిన అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్రతన్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు.అదేవిధంగా టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసిన సందీప్ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఇలా రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్రెడ్డిలకు డీజీపీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆ ముగ్గురు కమిషనర్లు కూడా.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిõÙక్ మొహంతి, వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్జా, రామగుండం సీపీ శ్రీనివాసులుకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది. ఇంటిలిజెన్స్ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న శిఖా గోయల్ వద్ద కీలక పోస్టులైన సీఐడీ, మహిళా భద్రత విభాగం, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర ఐపీఎస్లకు అప్పగించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో అత్యంత కీలకమైన ట్రాఫిక్ అడిషనల్ సీపీ, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ, క్రైమ్స్ అడిషనల్ సీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఐజీగా ఉన్న విశ్వప్రసాద్కే మళ్లీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ పోస్టును ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చాలా జిల్లాల ఎస్పీలు, డీసీపీలు ఎన్నికల బదిలీల్లో భాగంగా పోస్టింగ్లు పొందారు. వారిలో కొందరిని ప్రభుత్వం తమ ప్రాధాన్యాల మేరకు బదిలీ చేసి, ఆ స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.హైదరాబాద్కూ కొత్త సీపీ?రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సహా మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. కాగా త్వరలో జరగనున్న బదిలీల్లో ఎక్కువ మంది పోలీస్ కమిషనర్లకు స్థాన చలనం తప్పదనే వార్తలు వస్తున్నాయి. కమిషనర్ల తీరుపై రాజకీయ నాయకులు, సొంత శాఖలోని అధికారులు, సామాన్యుల నుంచి వచ్చిన ప్రతి స్పందనలు ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీ పోస్టుకు టీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, రైల్వే, రోడ్డు భద్రత అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా రాచకొండ సీపీగా ఉన్న సు«దీర్బాబు అనూహ్యంగా బదిలీ కావడంతో ఐజీ తరుణ్ జోషీకి రాచకొండ సీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సు«దీర్బాబు తిరిగి సీపీగా వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో ఈ పోస్టులో పనిచేసి, పౌరసరఫరాల కమిషనర్గా బదిలీ అయిన డీఎస్ చౌహాన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్సభ ఎన్నికలు ముగిశాక.. జూన్లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. స్థానికంగా (క్షేత్రస్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 6వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం లేదా బీసీ కమిషన్ పరంగా... స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు. గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా... జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్ పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదేవిధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది. బీసీలకు 42% స్థానిక రిజర్వేషన్లపై హామీఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచి్చంది. ఈ మేరకు బీసీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. కొత్త ఓటర్ల జాబితా (లోక్సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన జాబితా) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి.. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు కమిషన్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్కు అనుగుణంగానా? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం. ఈ కసరత్తు జరిగితే...ఆగస్ట్, సెప్టెంబర్లో ఎన్నికలు? ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ఆలోచనకు ప్రభుత్వపెద్దలు ఓకే చెబితే రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు పంపిస్తే ఆగస్ చివర్లో లేదా సెప్టెంబర్లో ముందుగా గ్రామపంచాయతీ ఆ తర్వాత జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించుకోవచ్చుపనని అభిప్రాయపడుతున్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారా? ఈ ఆగస్టుతో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ పరిస్థితుల్లో పాత కమిషన్ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన కసరత్తును పూర్తిచేసి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళుతుందా ? లేక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్ ద్వారానే ఈ కార్యాచరణను నిర్వహిస్తారా అన్నది కూడా అధికారవర్గాల్లో చర్చకు వస్తోంది. ఆగస్ట్లో కొత్తగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాక... బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మాత్రం ఈ ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి ? ముందుగా జీపీ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే... తొలుత జీపీ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్లోని జాదవ్పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్ ముగిసేలోగా తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ విధానం, ఎగుమతుల విధానం, నూతన లైఫ్సైన్సెస్, మెడికల్ టూరిజం, ఈవీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత, వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, చేనేత కారి్మకులకు ఉపయోగపడేలా విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. -
‘కోడ్’ పోగానే పందేరం!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ మరోమారు నామినేటెడ్ పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు 37 మంది పార్టీ నేతలను పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో 17 మందికి చాన్స్ ఇవ్వనున్నట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. తొలిదఫాలో అవకాశం దక్కిన 37 మంది, ఈ 17 మంది కలిపి.. ఒకేసారి పదవీబాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మలి దఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఎవరెవరికన్న దానిపై కాస్త స్పష్టత తొలిదఫా నామినేటెడ్ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు. రెండో దఫాలో కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలి దఫాలో పీసీసీ అనుబంధ విభాగాల్లో.. చేనేత, ఎక్స్ సరీ్వస్మన్, సేవాదళ్లకు అవకాశం రాలేదు. దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని సమాచారం. వారితోపాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షులు, మరో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో చాన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైనవారికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు రాగా.. రెండో దఫాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. జూన్ 6వ తేదీన లోక్సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేటెడ్ జాబితా విడుదల, అందరి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు, విద్యా కమిషన్లు కూడా.. వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్ ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి. రెండో దఫా నామినేటెడ్ జాబితాతోపాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి. రైతు కమిషన్ చైర్మన్గా ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిలను నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. వ్యవసాయ, విద్యా శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ.. కీలక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ఆ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్తున్నారు. పోటీ చేసి ఓడినవారికి లేనట్టే! గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి మలి దఫా నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్రెడ్డి.. ఎన్ని విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చినా తొలిదఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలేదు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా మాత్రమే కొనసాగుతారని, ఎలాంటి నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. -
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలనపై దృష్టి పెడతామన్న సీఎంరాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎజెండాలో కీలక అంశాలుజూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు. -
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
మాఫీకి మార్గం చూడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
సాక్షి, అమరావతి: పేదలంటే ఏమాత్రం పట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పదం వింటేనే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక వారికి ఏదైనా మేలు జరిగితే.. గుండెలు బాదుకోవడం.. గగ్గోలు పెట్టడం.. పెడబొబ్బలు.. ఆర్తనాదాలే. పుట్టుకతో సహజసిద్ధంగా ఆయనకు అబ్బిన ఈ లక్షణాలు ఇప్పుడు మరీ వికృతరూపం దాల్చి కరాళ నృత్యం చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన పథకాలను ఎన్నికల కోడ్ ముసుగులో ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఎన్నికల కోడ్ లేని సమయంలోనే పేదల చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే దానిపై ‘పచ్చ’ముఠా పెట్టిన గగ్గోలు అంతాఇంతా కాదు. ఆ విధానాన్ని అమలుచేయకుండా చేయని కుట్రలులేవు. అలాగే, అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సేకరిస్తే వాటిపైనా న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంది. ఆఖరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ తమ పెత్తందారీ ధోరణిని ప్రదర్శించింది. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కోర్టుల్లో కేసులు వేసింది. కానీ, సీఎం జగన్ సర్కారు వీటన్నింటినీ ఛేదించుకుని తన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగించింది. ఇందుకు సుప్రీంకోర్టుకూ వెళ్లి పచ్చ మాఫియాపై విజయం సాధించింది. కానీ, ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. దీంతో మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేసి అనేకమంది మృతికి ఈ పెత్తందార్లు కారణమయ్యారు. తమ రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగుల ప్రాణాలుపోయినా పర్వాలేదనే ధోరణిలో చంద్రబాబు బ్యాచ్ వ్యవహరించింది.ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకూ బ్రేకులు..నిజానికి.. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ అన్నది కొత్త కార్యక్రమమేమీ కాదు. ఎప్పటి నుంచో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సూర్యోదయంలోపే వైఎస్సార్ పెన్షన్ కానుకను అందిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న విధానానికి ఎన్నికల కోడ్ వర్తించకపోయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు బృందం ఫిర్యాదు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతవులును రోడ్డుపాల్జేసింది. అలాగే.. పేద విద్యార్థుల చివరి త్రైమాసికం విద్యాదీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేసింది. అసలివి ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీ పథకాలే. లబ్ధిదారులు సైతం పాత వారే తప్ప కొత్తగా ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయినాసరే, చంద్రసేన ఒత్తిడితో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇవి చెల్లించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి.. 2023లో కరువు కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమనేది ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియే. చంద్రబాబు కుట్రల కారణంగా.. కరువుతో పంటలు కోల్పోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్లో విత్తనాల కొనుగోళ్లకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అప్పులు పాలవుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా రైతులపట్ల కర్కశంగా, నిర్దయగా వ్యవహరించింది. ఇలా బాబు నిర్వాకంతో రాష్ట్రంలో 6,95,897 కరువు బాధిత రైతులకు చెల్లించాల్సిన రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయాయి.తెలంగాణలో ఓకే.. ఏపీలో మాత్రం నో..కానీ, తెలంగాణలో వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ‘నో’ చెప్పింది. ఈ విషయంలో ఏపీపట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పేద విద్యార్థుల పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గత ఐదేళ్ల నుంచి విద్యాదీవెన పథకం కింద డీబీటీ రూపంలో బటన్నొక్కి ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. విద్యాదీవెన కింద చివరి విడత కిస్తీని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కూడా ఇప్పటికే కొనసాగుతున్న పథకం అయినప్పటకి చంద్రబాబు బృందం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.610.79 కోట్ల విద్యాదీవెన చెల్లింపులను నిలుపుదల చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరనే కనీస జ్ఞానం కూడా లేకుండా రాజకీయానికే బాబు బ్యాచ్ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో అప్పులుచేసి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితికి బాబు తీసుకొచ్చారు.‘చేయూత’ నిధులకూ చెక్..ఇక మరోపక్క.. పేద అక్కచెల్లమ్మలకు ‘చేయూత’ కింద ఆఖరి విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రారంభించినప్పటికీ బాబు బృందం ఒత్తిడితో ఆ నిధుల చెల్లింపులకూ ఎన్నికల సంఘం మొకాలడ్డింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళల జీవనోపాధికి సాయం అందించే ‘చేయూత’ పథకం అమలు కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం అమలుచేసింది కూడా. ఇప్పుడు చివరి విడత కింద 29 లక్షల మంది పేద మహిళలకు సాయం అందాలి. దీనికి కూడా బాబు బృందం ఒత్తిడితో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు కోటరీ పెత్తందారీ పోకడలతో అడ్డుకోవడం ద్వారా పేద విద్యార్థులు, రైతులు, మహిళల పొట్టకొట్టి తమ వికృతరూపాన్ని ఆ ముఠా చాటుకుంది. -
వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
సాక్షి, అమరావతి: అధికారం, అవినీతి మరిగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ రెండూ లేక, ఇక దొరకవని తేలిపోవడంతో మతి చెడింది. ఈసారీ అధికారం దక్కదన్న అక్కసు, తీవ్ర అసహనం ఈ వృద్ధ నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైకు దొరికితే చాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కారు కూతలు కూస్తున్నారు. తిట్లే ప్రధానాంశంగా మాట్లాడుతున్నారు. అనకూడని నిందలేస్తూ తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు.రోజురోజుకు నీచ స్థాయికి దిగజారిపోతున్నారు. మతి పూర్తిగా చెడిపోయి, గతి తప్పి బజారు భాషకు దిగిపోయారు. నోరు తెరిస్తే తిట్ల పురాణం, బూతుల దండకమే. సీఎం వైఎస్ జగన్ను కొట్టండి.. తిట్టండి అంటూ మొదలైన ఆయన ప్రచారం.. ఇప్పుడు చంపండి.. నరకండి అనే స్థాయికి దిగజారిపోయింది. సీఎం వైఎస్ జగన్నే కాకుండా, ఆయన కుటుంబాన్ని, చివరకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను కూడా విచక్షణ మరిచి దూషిస్తున్నారు.ఎన్నికల నిబంధలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ పదే పదే అనకూడని మాటలు అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎంనని చెప్పుకొంటూనే, ఆ హుందాతనమేదీ తనలో లేదని, ఉన్నదల్లా నీచ మనస్తత్వమేనని వేదికల మీదే బహిరంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇలా గతి తప్పి మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. అయినా చంద్రబాబు కారు కూతలను ఎన్నికల సంఘం (ఈసీ) వినీ విననట్టు ఊరుకోవడమూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అన్ని ప్రయత్నాలూ విఫలమై..ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప. దీంతో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ పైన, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై బురద చల్లడానికి, ప్రజలను పక్కదారి పట్టించి, ఓట్లు దండుకోవడానికి బాబు పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయి. పింఛన్లు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై పన్నిన కుట్రలు పారలేదు.అవి బూమరాంగై తిరిగి ఆయనకే గట్టిగా తగిలాయి. టీడీపీ ఓటమిని నిర్ధారించాయి. అంతకు ముందు కూడా ప్రభుత్వంపై అనేక అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు. రోజురోజుకూ ఆయనే దోషిగా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. మరోపక్క ఓటమి భయం ఆయనలో అణువణువునా వ్యాపించింది. కంటి ముందు అవినీతి కేసులు దయ్యాల్లా కనిపిస్తున్నాయి. దీంతో వణికిపోతున్న ఈ వయసు మళ్లిన వెన్నుపోటు వీరుడు నోటికి పని చెప్పారు. ఇలా ఉంటుంది.. చంద్రబాబు తీరుచంద్రబాబు నక్క వినయం, తోడేలు దాడి ఎలా ఉంటాయో సోమవారం అనకాపల్లిలో జరిగిన ప్రధాని మోదీ సభే చెబుతోంది. ఈ సభలో ప్రధాని ఉన్నంతవరకు చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా మెలిగారు. ఆయన వెళ్లీ వెళ్లగానే మైకందుకున్న చంద్రబాబు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను తూలనాడుతూ, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ‘జగనన్న భూహక్కు అంట.. నీ తల్లి మొగుడిచ్చాడా.. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా.. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా.. జేజే తాత ఇచ్చాడా.. ఎవడిచ్చాడు’ అంటూ వినే వారికి రోత పుట్టించారు. మహిళలు చెవులు మూసుకునేలా చేశారు. ఆదివారం జరిగిన సభల్లోనూ ఇలాగే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అంతకు ముందూ ఆయన ముఖ్యమంత్రిపై దాడులు చేయాలని, ఆయన్ని కొట్టాలంటూ మాట్లాడారు. తాడికొండ సభలో సీఎంను రాయితో కొట్టాలని కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీఎంను దున్నపోతు అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యల తర్వాతే సీఎం జగన్పై విజయవాడలో రాయి దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన మాటలు దాడుల నుంచి చంపండి అనే వరకు సాగాయి. సీఎంను గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఓ సభలో విచక్షణ మరిచి అనడంతో పక్కనున్న నేతలే ఆశ్చర్యపోయారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో సీఎంను చంపితే ఏమవుతుంది అని మాట్లాడి దిగజారడంలో తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్నారు. సీఎం జగన్పై కట్టలు తెగే స్థాయిలో అసూయ, ద్వేషాలను చంద్రబాబు వెళ్లగక్కుతుండడం చర్చనీయాంశంగా మారింది.ఇదేమి తీరు ఈసీ?చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నా ఎన్నికల సంఘం మౌనం వహిస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహిరంగ వేదికలపై సీఎంను కొట్టండి, గాజు గ్లాసుతో పొడవండి, చంపితే ఏమవుతుంది అంటూ పిలుపునిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నా ఈసీకి వినపడటంలేదా? ఈసీ ఎందుకు మౌనం వహిస్తోంది? తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకొని, 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది.ఏపీలో చంద్రబాబు సభా వేదికలపై ఎంతలా వీరంగం వేస్తున్నా, సీఎం జగన్ కుటుంబ సభ్యులను, మహిళలను కూడా దూషిస్తున్నా, చంపాలని బహిరంగంగానే కార్యకర్తలను రెచ్చగొడుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. తెలంగాణలో అయితే ఒకలా, ఏపీలో అయితే మరోలా ఈసీ తీరు ఉంటుందా? తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకొన్నంత మాత్రాన చంద్రబాబు వ్యాఖ్యల విషయంలో ఈసీ జోక్యం చేసుకోకూడదని ఏమీ లేదు. అయినా ఈసీ మౌనం వెనుక మర్మమేమిటన్నది ప్రజలకు అర్థంకావడంలేదు.జగన్ది హుందాతనం..బాబుది దిగజారుడుతనంఒకవైపు జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని హుందాగా ప్రజలను కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం దిగజారిపోయి తిట్ల పురాణంతో సభలు నడిపిస్తున్నారు. సీఎం జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చి చూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళుతుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు చవకబారు దూషణలకు దిగుతున్నారు. జగన్ ఒక పద్ధతిలో మాట్లాడుతూ ముందుకెళుతున్న వైనాన్ని, చంద్రబాబు బజారుస్థాయి మాటలను ప్రజలు గమనిసూ్తనే ఉన్నారు. -
ఎన్నికల కమిషనా.. ఎన్డీఏ కమిషనా?
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్ ఎందుకిలా చేస్తోంది? ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి... కోడ్ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? ఈసీపై ఒత్తిళ్లు... ఎన్డీఏ భాగస్వామి కనక ఓకే నిజానికి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... కేంద్ర ఎన్నికల కమిషన్పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్ జగన్ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. -
పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు
బెంగళూరు: పెళ్ళి కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండటం.. వరుణ్ణి చిక్కుల్లో పడేసింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు నియమాలను అతిక్రమించాడనే కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..దక్షిణ కన్నడలోని పుత్తూరు తాలూకాలోని వరుడు తన వెడ్డింగ్ కార్డులో 'మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడమే ఆ దంపతులకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి' అని పేర్కొన్నారు. ఈ ట్యాగ్లైన్పై వరుడి బంధువుల్లో ఒకరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఫిర్యాదు అందుకున్న తరువాత ఏప్రిల్ 14న పుత్తూరు తాలూకాలోని వరుడి నివాసానికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించారని వరుడు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం, దేశం పట్ల ఉన్న శ్రద్ధ కారణంగా వరుడు ఇలా చేసినట్లు స్పష్టం చేశారు. -
పచ్చపార్టీ ప్రలోభాలు
సాక్షి, చిత్తూరు/చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్/గిద్దలూరు రూరల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఓవైపు మనీ.. ఇంకోవైపు మద్యం పంపిణీ చేస్తూ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ముందుగానే ఓటమి ఖాయం కావడంతో కాస్తయినా పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నగదు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చాలా సులువుగా అక్కడి మద్యాన్ని సరిహద్దులు దాటిస్తూ డంప్ చేస్తున్నారు. బుధవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గురజాల జగన్మోహన్, ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీకు వచ్చినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు, పెద్ద ఎత్తున మద్యం అందజేశారు. పలమనేరు నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి ‘పచ్చ’ జెండాలు మోస్తూ ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు. అయితే మళ్లీ తాజాగా చిత్తూరు రూరల్ మండలంలో జనసమీకరణ చేసి టీడీపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు ద్విచక్ర వాహనాలుప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు రూ.లక్షలు విలువ చేసే బుల్లెట్లు, ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి టీడీపీ అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో పాల వ్యాపారం చేసే వారికి ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఇచ్చారు. వాటికి టీడీపీ స్టిక్కర్లు అంటించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవిగో ప్రలోభాలు..♦ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లక్ష్మీపురం, ముత్తుకూరుల్లో ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కర్ణాటక మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు రూ.80 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.♦ ఇటీవల చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రూరల్ మండలంలో పిల్లలకు పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో షాదీమహల్ వద్ద రంజాన్ పర్వదినం ముందు రోజు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తరఫున ముస్లింలకు టీడీపీ గుర్తులతో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ♦ గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ తాయిలాల పంపిణీలో స్పీడ్ పెంచారు. రెండు రోజుల ముందు శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో నిత్యావసర వస్తువులతోపాటు చీర, జాకెట్, ప్యాంటు, చొక్కా, మద్యం బాటిల్, రూ.500 నగదు కిట్గా పంపిణీ చేశారు. ♦నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ క్వారీల రాజకీయానికి తెరతీశారు. తమ పార్టీలోకి వస్తే క్వారీలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మరికొందరికి డీకేటీ భూములు కూడా ఇస్తామని అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇక పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ♦టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ తాయిలాలు ఊపందుకున్నాయి. ఇటీవల చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని 243 పోలింగ్బూత్ల్లో ఒక్కో చోట రూ.30 వేల చొప్పున పంపిణీ చేశారు. అలాగే జనసమీ కరణ కోసం ఒక్కొక్కరికి రూ.300 నగదు, మద్యం సీసా, బిర్యానీ అందజేశారు.♦ ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి నామినేషన్ పర్వంలో ఓటులేని వారి చేతికి టీడీపీ జెండా ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి నామినేషన్కు నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి జనాన్ని తరలించారు. నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. -
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
మోదీపై ఫిర్యాదు: సీతారాం ఏచూరి
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శ్రీరాముడి అంశంపై ప్రజలను మతపరంగా సంఘటితం చేసేలా పలు ప్రకటనలు చేశారని, దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కోడ్ను ఉల్లంఘించేలా మోదీ మాట్లాడిన మాటలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏచూరి గురువారం కేరళలోని కోజికోడ్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో అప్పటి నుంచే అంటే ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్తో పాటు లేటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలొద్దు
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర పురపాలక– పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరూ స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదన్నారు. కోడ్ అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల అమల్లో సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని ఆదేశించారు. మహిళల గౌరవానికి పెద్దపీట ఎన్నికల ప్రచారంలో మహిళల గౌరవం విషయంలో కఠిన వైఖరిని అమలుచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళలను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పార్టీల నాయకులకు తక్షణం నోటీసులివ్వడం ద్వారా మహిళల గౌరవం విషయంలో గట్టి వైఖరిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ నేతలు, ప్రచారకర్తలు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఆశ్రయించకుండా చూసుకోవడానికి పార్టీ ముఖ్యులు/అధ్యక్షులు జవాబుదారీతనం వ్యవహరించాలని కోరింది. రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియకు సిద్ధంకండి ఈ నెల 18న (రేపు) నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18న నోటిఫికేషన్ జారీ నుంచి రోజూ ఈసీఐకి నివేదికలు పంపాలని చెప్పారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ లోపు కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. సీ–విజిల్ ఫిర్యాదులను అధికారులు సంతృప్తకరస్థాయిలో పరిష్కరిస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ, కేంద్రాలు వెబ్కాస్టింగ్ ద్వారా గరిష్టస్థాయిలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏడాది చివర్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుకు ప్రారంభమైనా.. వాటి నిర్మాణం మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల నిర్మాణం కోసం కనీసం మరో ఐదు నెలల పాటు వారు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 11న అట్టహాసంగా ప్రారంభించింది. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో నే పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వటమో, తొలి విడత ఆర్థిక సాయం కింద చెక్కు జారీ చేయడంతోనో ప్రారంభిస్తారు. కానీ ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని కేవలం ప్రారంభిస్తున్నట్టు పేర్కొ నటమే తప్ప ఇలాంటివేవీ లేకుండా, లబ్ధిదారుల ప్రస్తావనే లేకుండా సాగింది. వాస్తవానికి ఇప్పటివరకు లబ్ధిదారులను గుర్తించనేలేదు. దరఖాస్తులు స్వీకరించినా.. ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ నెలలోనే ప్రజా పాలన పేరుతో పేదల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వీటిల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. 80 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, వాటిల్లో గతంలోనే ఇందిరమ్మ ఇళ్లను పొందిన దాదాపు 14 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వెరసి 66 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినట్టుగా రికార్డు చేశారు. వాటిని స్క్రూటినీ చేసి ఇతర కారణాలతో అనర్హమైనవి ఉంటే తొలగించాల్సి ఉంది. ఆ తర్వాత అసలు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించకుండా పెండింగులో పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే కోడ్ అమల్లోకి రావటంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్ ముగిసినా.. -
టీడీపీ ‘కిక్కు’రొకో.. ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా
మునగపాక : ఎన్నికల కోడ్ కూతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పన్నింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతోంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్తనూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు పంపారు. ఈ వ్యవహారంలో సూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందంటే.. యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు రప్పించి తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టారు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాకనుంచి అక్రమ మద్యం రవాణా అవుతోందని వచ్చిన సమాచారంతో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేసుల్లో 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్టు వారు చెప్పడంతో గడ్డివాము వద్ద తనిఖీలు చేపట్టి స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.50 లక్షల విలువైన 39,168 క్వార్టర్ బాటిళ్లు (7వేల లీటర్ల మద్యం) స్వాధీనం చేసుకుని ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా ఈ కేసులో మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త బి.ప్రసాద్నూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు. కాగా.. వెంకటస్వామి, ధర్మతేజ దినేష్కుమార్ యలమంచిలి నియోజకవర్గం కట్టుబోలుకు ఇదే తరహాలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు వారి యత్నానికి గండికొట్టారు. కేసు విచారణ సమయంలో పోలీసులకు మరింత సమాచారం అందినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మద్యాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో సహకరించిన అందరి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇంతపెద్దమొత్తంలో మద్యం స్వా«దీనం చేసుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు చెబుతున్నారు. -
జూన్లో జాబ్ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ల జాతరకు లైన్క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
కోడ్ ఉల్లంఘిస్తే కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ వంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచే ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేస్తోంది. షెడ్యూల్ విడుదలైన 20 రోజుల్లోనే కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 4,584 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 4,337 ఎఫ్ఐఆర్లు నగదు, వస్తువుల జప్తుకు సంబంధించినవి కాగా, అనుమతుల్లేకుండా నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై 247 కేసులు నమోదు చేశారు. నేరుగా ఫిర్యాదుకు నిర్దేశిత సమయం రోజు సా.4–5 గంటల మధ్య స్వీకరణ సాధారణ ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని నేరుగా కలిసి ఫిర్యాదు లేదా విజ్ఞాపనపత్రం ఇవ్వాలనుకనే వారికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నిర్దేశిత సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజు సా.4–5 గంటల మధ్య తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ పనిదినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తాము కార్యాలయంలో అందుబాటులో ఉంటే అందజేయవచ్చన్నారు. తాను కార్యాలయంలో అందుబాటులో లేని పక్షంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు లేదా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఫిర్యాదులివ్వడానికి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.129 లోని ఫిర్యాదు సెల్లో అందుబాటులో ఉంటుందని ముకే‹Ùకుమార్ పేర్కొన్నారు. రూ.47.49 కోట్లు జప్తు.. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్ 5 వరకు రూ.47.49 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో.. ♦ నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న రూ.17.85 కోట్ల నగదు, రూ.8.82 కోట్ల విలువైన మద్యం, రూ.1.63 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.12.36 కోట్ల విలువైన బంగారం వంటి విలువైన లోహాలను స్వాదీనం చేసుకున్నారు. ♦ ఇవికాక.. ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు సిద్ధంచేసిన రూ.1.56 కోట్ల విలువైన వివిధ వస్తువులతో పాటు రూ.5.24 కోట్ల విలువైన ఇతర సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొంది. ♦ ఎన్నికల వేళ లైసెన్స్లు కలిగిన ఆయుధాలను పోలింగ్ స్టేషన్లో సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,681 ఆయుధాలను డిపాజిట్ చేయగా ఇంకా 17 చేయాల్సి ఉంది. ♦మరోవైపు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 32 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. అలాగే, ఎన్నికల సందర్భంగా సమస్యలను సృష్టించడానికి అవకాశమున్న 432 మందిని గుర్తించామని ఇంకా 21 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీచేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ♦ సీ–విజిల్ యాప్ ద్వారా 7,838 ఫిర్యాదులు రాగా అందులో 90 శాతం కేసులను నిర్దేశిత 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు తెలిపింది. ♦ రాష్ట్రంలోను, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా కోసం 298 చెక్పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటుచేసిన 5,07,561 బ్యానర్లు, హోర్డింగులు తొలగించారు. -
పామునైనా నమ్మగలం గానీ..: మమత
కూచ్బెహార్/మాల్బజార్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విష పూరిత పామునయినా నమ్మొచ్చేమోగానీ, కాషాయదళాన్ని మాత్రం విశ్వసించరాదన్నారు. ఆవాస్ యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరితే గుడ్డిగా నమ్మొద్దని ప్రజలను కోరారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతంపై మాత్రమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి వాటికి తాము తలొంచబోమని తెగేసి చెప్పారు. అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని ఈసీని కోరతామన్నారు. -
కుప్పంలో ఎన్నికల కోడ్కు టీడీపీ తూట్లు
కుప్పంరూరల్ (చిత్తూరు జిల్లా): కుప్పంలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి పింఛనుదారులను రోడ్డుపాలు చేసిన టీడీపీ నేతలు... మరోవైపు పింఛనుదారులపై ప్రేమను నటిస్తున్నారు. పింఛనుదారులను ఆటోల్లో సచివాలయాలకు తీసుకువెళుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సచివాలయాల్లో వృద్ధులకు మజ్జిగ పంపిణీ చేస్తూ టీడీపీ కరపత్రాలను అందజేస్తున్నారు. కుప్పం మండల పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల, పంచాయతీ స్థాయి నాయకులు తమ గ్రామాల పరిధిలోని లబ్ధిదారులను ఆటోల్లో సచివాలయాలకు తరలించి, వారికి మజ్జిగ, ఇతర చల్లని పానీయాలు అందజేశారు. మరికొంతమంది సచివాలయాల ముందు మజ్జిగ ప్యాకెట్లతో తిష్టవేసి లబ్ధిదారులకు పంచిపెట్టారు. లబ్ధిదారులు తిరిగి వెళ్లే సమయంలో ‘ఈ పరిస్థితికి సీఎం వైఎస్ జగణ్ కారణం. టీడీపీకి ఓటు వేస్తే ఒకటో తేదీ ఉదయమే మీ ఇంటి వద్దకు వచ్చి రూ.4వేలు పింఛను ఇచ్చే కార్యక్రమం చేపడతాం’ అని టీడీపీ నేతలు చెబుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తే గొడవకు.. కుప్పం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తే గొడవకు దిగారు. దాసేగౌనూరు గ్రామంలో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పెన్షనర్లను ఆటోల్లో తీసుకువెళుతూ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతుండగా, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మురుగేష్, మరికొందరు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా లబ్ధిదారులను తీసుకువచ్చి ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెండుగంపల్లి సచివాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులను వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్ ధర్మ, టౌన్ బ్యాంకు చైర్మన్ భాగ్యరాజ్ ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ములకలపల్లి సచివాలయంలో స్థానిక టీడీపీ నాయకుడు మురళి ఏకంగా సచివాలయం లోపలికే వెళ్లి లబ్ధిదారులకు మజ్జిగ, కూల్డ్రింక్లు పంపిణీ చేశారు. -
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
నేటి మధ్యాహ్నం నుంచి.. సచివాలయాల్లో పింఛన్లు
సాక్షి, అమరావతి: ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ♦తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే íపింఛన్ల పంపిణీ చేపడతారు. ♦ ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ♦ వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ♦ సచివాలయాల వద్దకు వచ్చే íపింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ♦ పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ♦ సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ♦ ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ♦ పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ♦ ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్ను పాటించాలి. ♦సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. n పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయాలు పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలు సేకరించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానంలో పింఛన్లు అందించేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామన్నారు. వారందరికీ అప్పటికప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడంలో చాలా సమస్యలున్నట్లు తేలిందన్నారు. పింఛన్ల డబ్బులు బ్యాంకులో జమ చేసినా వాటిని తీసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని గుర్తించామన్నారు. మరో ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడంలోనూ ఇబ్బందులున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా సచివాలయాల ఉద్యోగులు కేవలం 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. 12,770 మంది ఏఎన్ఏంలు, 14,232 మంది వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీష్ అసిస్టెంట్లు, 6,754 మంది ఎనర్జీ అసిస్టెంట్లను వారి విధులకు అటంకం కల్పిస్తూ పింఛన్లు పంపిణీ చేయించే పరిస్థితి లేదని తమ చర్చల్లో గుర్తించామన్నారు. మిగిలిన సచివాలయాల ఉద్యోగులలోనూ చాలా మంది ఎన్నికలకు సంబంధించి బీఎల్వో విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. వారందరినీ మినహాయిస్తే లబ్దిదారుల ఇళ్ల వద్ద í íపింఛన్ల పంపిణీకి వినియోగించుకునేందుకు సచివాలయాల ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు లబ్దిదారుల చిరునామాలు కచి్చతంగా తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, అందువల్ల పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్ధారించుకున్నారు. -
అను‘మతి’ లేని పవన్ కళ్యాణ్ పర్యటన
పిఠాపురం: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. అలాంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటిస్తూ.. అధికారులు అడ్డుకుంటే ప్రభుత్వంపై నెపాన్ని నెడుతూ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన నాలుగో రోజు మంగళవారం నిబంధనలకు విరుద్ధంగా సాగడంతో ఎన్నికల అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. పవన్ తొలుత పిఠాపురం ఏబీసీ చర్చిలో ప్రార్థనలకు వచ్చారు. ఆ చర్చి పాస్టర్లు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో మొక్కుబడిగా ప్రార్థనలు పూర్తిచేసుకున్న పవన్ అక్కడి నుంచి కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు బషీర్బీబీ దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం రోడ్డు షోగా బయలుదేరి యు.కొత్తపల్పిలోని ఒక ఫంక్షన్ హాలులో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఇంతలోనే అక్కడికి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని సమావేశం నిర్వహణకు అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దీంతో జనసేన నేతలు నీళ్లు నమిలారు. అధికారులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక త్వరలోనే మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుంచి పవన్ వెళ్లిపోయారు. తోసేస్తున్నది బౌన్సర్లే తన పైన, తన సెక్యూరిటీ పైన కొందరు అల్లరి మూకలు బ్లేడ్లతో దాడి చేస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ సోమవారం వ్యాఖ్యానించారు. అయితే పవన్ పర్యటనలో అడుగడుగునా ఆయన అనుచరులు, బౌన్సర్లు జనంతో తీవ్ర ప్రతిఘటనకు దిగుతూ బలవంతంగా తోసేస్తున్నారు. దీంతో పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా, పవన్ మంగళవారం పర్యటన వివరాలు అంటూ జనసేన అధికారికంగా షెడ్యుల్ ప్రకటించింది. దీని ప్రకారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గంటగంటకూ మార్పులు చేసుకుంటూ అసలు ఆయన ఎక్కడ ఆగుతారో.. ఎక్కడకు వెళతారో తెలియని అయోమయ పరిస్థితులు సృష్టించారు. దీంతో పోలీసులు అవస్థలుపడ్డారు. పగలు పిఠాపురం.. రాత్రి హైదరాబాద్ పవన్ నాలుగు రోజుల పర్యటన పగలు పిఠాపురం.. రాత్రి హైదరాబాద్ అన్నట్టుగా కొనసాగడం చర్చనీయాంశమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం వరకూ మాత్రమే పిఠాపురంలో ఉండి, రాత్రికి హైదరాబాద్కు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి వస్తున్నారు. కాగా, పవన్కళ్యాణ్ను సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, డ్యాన్స్ మాస్టర్ జానీ తదితరులు పిఠాపురంలో కలుసుకున్నారు. వారితో కలసి ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు.ప్లాన్ ప్రకారమే..సమావేశం ఉన్నట్టు జనసేన పార్టీ ముందు రోజే అధికారికంగా ప్రకటించింది. అటువంటప్పుడు దీనికి అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే అనుమతి తీసుకోకుండా సమావేశం ఉన్నట్లు ప్రచారం చేసుకుని.. తీరా జనం ఉండగా సమావేశం ఆగిపోతే ఆ నెపం ప్రభుత్వం మీదకు నెట్టి సానుభూతి పొందేందుకు ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలనుకుంటే 24 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని, కానీ ఈ సమావేశం కోసం జనసేన నేతలెవరూ తమకు దరఖాస్తు చేయలేదని పిఠాపురం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వరప్రసాద్, వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ టీవీ విలేకరిపై దాడికి యత్నం పవన్ పర్యటనలో ఆయన బౌన్సర్లు జనసేన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పిఠాపురం చర్చిలో ప్రార్థనలకు పవన్ హాజరు కాగా, అక్కడకు వచ్చిన జనసేన ఉభయ గోదావరి జిల్లాల నాయకురాలు చల్లా లక్షి్మని బౌన్సర్లు అడ్డుకుని తోసేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ భూషణంపై దాడి చేయడానికి బౌన్సర్లు ప్రయత్నించగా.. స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకుని, ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బౌన్సర్లను అక్కడి నుంచి పంపించేశారు. పవన్కళ్యాణ్ పర్యటనకు వర్మ డుమ్మా ‘నా గెలుపు బాధ్యత అంతా వర్మదే. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడుచుకోండి..’ అంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు. రెండోరోజే పవన్ పిఠాపురం పర్యటనకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ డుమ్మా కొట్టారు. పవన్ పిఠాపురం, కొత్తపల్లి పర్యటనల్లో వర్మతో పాటు టీడీపీ నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో ఇక్కడ పొత్తు మళ్లీ చిత్తయిందని పలువురు పేర్కొంటున్నారు. అయితే పవన్ పర్యటన వివరాలు, సమాచారం తనకు తెలియజేయకపోవడం వల్లే తాను రాలేదని పిఠాపురం జనసేన ఇన్చార్జి, ఆ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్పై వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఉదయ్శ్రీనివాస్ తన అనుచరులకు క్లాస్ పీకి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగకుండా చూసుకుంటామని వర్మను బతిమలాడుకున్నట్లు చెబుతున్నారు. -
ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ తొలగించిన ఎంసీడీ
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తన 12 జోన్ల నుంచి 5,20,042 పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ (హోర్డింగ్లు, పోస్టర్లు, వాల్ పెయింటింగ్లు, జెండాలు) తొలగించింది. ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చి 16న ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో మే 25న ఢిల్లీలో ఓటింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తొలగించిన మొత్తం పొలిటికల్ అడ్వర్టైస్మెంట్లలో.. 257280 హోర్డింగ్లు, 192601 వాల్ పెయింటింగ్లు & పోస్టర్లు, 40022 సంకేతాలు, 30139 జెండాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఈ నియమం అమలులో ఉంటుందని ఎంసీసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ప్రోత్సహించే పోస్టర్లు, హోర్డింగ్లు లేదా బ్యానర్లను తొలగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఎంసీడీ బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. -
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్లో పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
Election Commission of India: ‘విజిల్’ ఊదేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరం వేళ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ‘సీ విజిల్’ యాప్ను ప్రజలు సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రజల నుంచి 79,000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో 99 శాతానికిపైగా ఫిర్యాదులు పరిష్కరించామని కేంద్ర ఎన్నికల తెలిపింది. వీటిలో 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించినట్లు ఈసీ పేర్కొంది. 58,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు (73శాతం) అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లకు సంబంధించినవి కాగా.. 1400కు పైగా ఫిర్యాదులు నగదు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి ఉన్నాయి. -
3 నుంచి పింఛన్ల పంపిణీ.. బ్యాంకులకు వరుస సెలవులే కారణం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటినే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతోపాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారమిచ్చింది. గతేడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యధావిధిగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్తో ప్రత్యేక మార్గదర్శకాలు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి సెర్ప్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్తో నిర్దేశిత పరిమితికి మించి వ్యక్తులు నగదు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ప్ అధికారులు సూచించారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. పింఛన్లు పంపిణీ సమయంలో ప్రచారం చేయడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. -
కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకులాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచిచూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మేనిఫెస్టోలోని హామీల అమలుపై దృష్టి సారించి. కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త గురుకులాల ఏర్పాటు అవసరమున్న మండలాల వారీగా బీసీ గురుకుల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 292 బీసీ గురుకులాలు.. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర, ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో డిమాండ్కు తగినట్లుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 292 బీసీ గురుకుల పాఠశాలలను మండలాల వారీగా విభజించి.. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపిన అధికారులు, మండలాల వారీగా ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో కూడా ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించారు. ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. -
డీలాపడే.. ఇళ్లపై రంకెలు
సాక్షి, అమరావతి : అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే అ ప్రభుత్వం చేసే మంచి పనులేవీ రామోజీరావుకు కనిపించవు. ఒకవేళ కనిపించినా కనిపించనట్లు జీవిస్తారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయనెంత దుర్మార్గం చేసినా ఆహా ఓహో అంటూ భజనలు. ఇది తన సహజ లక్షణమని ఆయన నిత్యం నిరూపించుకుంటున్నారు. తాజాగా.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంస్కరణను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి విజయవంతంగా అమలుచేయడాన్ని ఈ పచ్చకళ్ల రామోజీరావు సహించలేకపోతున్నారు. జగన్ను, ఆయన సర్కారును ఎలాగైనా అభాసుపాల్జేయాలన్న కసి ఆయనను దహించేస్తోంది. దీంతో.. దేశంలో పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసిన ఏకైక ప్రభుత్వంగా నిలిచినా దాన్ని తక్కువచేసి చూపేందుకు, లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించేందుకు తన క్షుద్ర పత్రికలో చేతికొచ్చింది రాసిపారేస్తున్నారు. ‘అంకెలు భళా.. అమలు డీలా’ అంటూ నిజాలకు పాతరేసి తన పెత్తందారీ భావజాలాన్ని అక్షరం అక్షరంలో ప్రదర్శించారు. 45 రోజుల వ్యవధిలో పేదలకిచ్చిన 15.59 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం డీలాపడడం ఎలా అవుతుందో రామోజీరావుకే తెలియాలి. పేదలకు జగన్ సర్కారు చేస్తున్న మేలుతో చంద్రబాబుకు ఇక జన్మలో అధికారం దక్కదన్న దుగ్థతో రామోజీనే డీలాపడి ఇష్టమొచ్చినట్లు రంకెలు వేస్తున్నారు. అసలు.. రిజిస్ట్రేషన్ల శాఖ సంవత్సరం మొత్తం మీద చేసే రిజిస్ట్రేషన్ల సంఖ్య 20 లక్షలు. మామూలుగా అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేయడానికి దాదాపు ఏడాది పడుతుంది. కానీ, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వారికి వెనువెంటనే హక్కు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ రిజిస్ట్రేషన్లు చేసింది. ఫిబ్రవరి 4న మొదలుపెట్టి మార్చి 15 వరకు రికార్డు స్థాయిలో 15.59 లక్షల రిజిస్ట్రేషన్లను చేసింది. ఎన్నికల పనులు, రీసర్వే వంటి కార్యక్రమాలున్నా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అత్యంత వేగంగా రిజిస్ట్రేషన్లు చేసి చరిత్ర సృష్టించడాన్ని డీలాపడడం అని రామోజీ పదకోశంలో ఈనాడు అనుకుంటే దానిని కడుపుమంట కాక ఇంకేమనాలి? నిజానికి.. చంద్రబాబు తన హయాంలో పేదలకు చెప్పుకోదగ్గ మేలు చేసింది ఏమీలేదు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో–పంచుకో–తినుకో) పద్ధతిలో పచ్చముఠా రాష్ట్ర ఖజానాను పూర్తిగా నాకేసింది. కానీ, ఇప్పుడు అలాంటిదేవీులేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం పేదలకు దక్కాలన్నదే సీఎం జగన్ తపన. దీనిని చంద్రబాబే కాదు.. ఎల్లోగ్యాంగ్లో ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ రాతలు.. ఈ రోత కథనాలు. రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక విరామం.. ఇక ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని వక్రీకరించి ఇక అక్కడితో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయినట్లు చిత్రీకరించడం రామోజీ దివాళాకోరుతనం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న కన్వేయన్స్ డీడ్లపై సీఎం ఫొటో ఉండకూడదనే నిబంధనవల్లే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లకు విరామం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఫొటోలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో మిగిలిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. లెక్క ఎక్కువ కాదు. అసలు లెక్కే రామోజీ.. ఇళ్ల స్థలాల లెక్కను ఎక్కువచేసి ప్రచారం చేసుకుంటున్నారని, కాలనీలు కాదు ఊళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. 31.19 లక్షల మంది ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలివ్వగా అందులో 22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. మరో 7 లక్షల మంది పొజిషన్లో ఉండడంతో వీరికి గతంలోనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలినవి టిడ్కో, ఇతర ఇళ్లు. ఇందులో లెక్క ఎక్కువచేసి చూపింది ఎక్కడ? 22 లక్షల మంది జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటున్న విషయం నిజంకాదా? 17 వేలకుపైగా జగనన్న కాలనీలు ఏర్పడడం రామోజీకి కనిపించడంలేదా? 22 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే 15.50 ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. త్వరలో మిగిలిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇవి కాగితాల్లో లెక్కలు కాదు. వాస్తవంగా కనిపించే లెక్కలే. రిజిస్ట్రేషన్లు చేయకుండా టీడీపీ అడ్డంకులు.. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020లోనే జీఓ ఇచ్చినా టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి దానికి అడ్డుపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఏకంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి, పేదలకు అప్పటికి డీకేటీ పట్టాలిచ్చింది. టీడీపీ అడ్డుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించేందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (పీఓటీ) చట్టాన్ని 2021లో సవరించి పదేళ్ల తర్వాత ఇంటి పట్టాను అమ్ముకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించింది. రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఉపయోగంలేని రిజిస్ట్రేషన్ అంటూ వక్రభాష్యం చెబుతూ పేదలను మోసం చేస్తోంది. వాస్తవానికి.. ఈ రిజిస్ట్రేషన్ చేయడంవల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటాబేస్లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టిౖఫెడ్ కాపీ పొందే దానికి వీలుంటుంది. ఫోర్జరీ, ట్యాంపరింగ్ భయం ఉండదు. ఇన్ని ఉపయోగాలుండగా రిజిస్ట్రేషన్ అవసరంలేదని బుకాయించడం రామోజీ ఏడుపు కాక మరేమిటి? వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడ రాయించుకున్నారు? ఇళ్ల స్థలాలు తీసుకున్న వారిలో కొందరు చనిపోవడంతో వారి వారసులను (లీగల్ హైర్స్) గుర్తించడం ఆలస్యమవడంవల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యాయి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా ఈనాడు రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థలాలను వైఎస్సార్సీపీ నేతలు తమ పేరుతో ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆధారాల్లేకుండా కుట్రపూరిత రాతలు రాస్తోంది. అలాగే, ఈ కథనంలోనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మొదట రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే తప్పుడు ఆరోపణను అచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఇచ్చిన ఇళ్లన్నింటికీ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే దానిపైనా నిందలు మోపి తన వక్రబుద్ధిని ఆ క్షుద్ర పత్రిక చాటుకుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు ఆటోమేటిక్గా వస్తాయని, వాటికి కన్వేయన్స్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయడం అవసరంలేదనే వింత వాదన లేవనెత్తింది. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ లేకుండా యాజమాన్య హక్కులు ఎలా వస్తాయో మహా మేధావి రామోజీకే తెలియాలి. -
‘వికసిత్ భారత్’ సందేశాలను ఆపండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది. -
‘మోదీ’ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ‘మోదీకీ పరివార్’, ‘మోదీ కీ గ్యారెంటీ’ ప్రకటనలను గుప్పిస్తోందని, వీటిని వెంటనే తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ల కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం ఈసీని కలిసి ఎన్నికల కోడ్ను బీజేపీ ఎలా ఉల్లంఘించిందో వివరించింది. సుప్రీంకోర్టు గతంలోనే క్లీన్చిట్ ఇచ్చినా 2జీ స్ప్రెక్టమ్ కేసులో అభూత కల్పనలతో బీజేపీ తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందని ఈసీకి ఫిర్యాదుచేసింది. -
టీడీపీ నేతల బరితెగింపు
ఉదయగిరి/గుడివాడ టౌన్/కడప సెవెన్రోడ్స్ /ఎర్రగుంట్ల/ జంగారెడ్డిగూడెం: టీడీపీ నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా అనుమతులు లేకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెళ్లి అభ్యంతరం తెలిపితే దాడులకు సైతం తెగపడుతున్నారు. ఎంపీడీవోపై దౌర్జన్యం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు ఆవరణలో బుధవారం సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అనుమతులు లేకుండా అనుచరులతో సమావేశం నిర్వహించారు. దుత్తలూరు ఎంపీడీవో కె.సురేష్బాబు సమావేశ ప్రాంతానికి వెళ్లి అనుమతులు తీసుకోనందున సమావేశం ఆపివేయాలని నేతలకు తెలిపారు. కానీ వారు పట్టించుకోకుండా సమావేశం కొనసాగించడంతో ఆ దృశ్యాలను తన సెల్లో ఎంపీడీవో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న టీడీపీ నేతలు, కొంతమంది కార్యకర్తలు ఎంపీడీవోపై దౌర్జన్యం చేస్తూ నానా దుర్భాషలాడుతూ సెల్ఫొన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అక్కడున్న కార్యకర్తలు కారును చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా కొందరు కార్యకర్తలకు సర్దిచెప్పి కారును అక్కడి నుంచి పంపించారు. ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చేజర్ల మల్లికార్జునపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రెండ్రోజుల క్రితం వింజమూరులోని కాకర్ల క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడానికి ప్రయత్నించిన అధికారులను కూడా అడ్డుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు అధికారులు ఆ ఫ్లెక్సీలు తొలగించారు. కడప టీడీపీ అభ్యర్థి అభ్యంతరకర పోస్టు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి, రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఆమె బుధవారం ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసును జారీ చేశామన్నారు. అనుమతులు లేకుండా టీడీపీ కార్యాలయం అనధికారికంగా ఓ భవనంలో టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో జంగారెడ్డిగూడెం ఎంపీడీవో, ఎంసీసీ నోడల్ అధికారి కేవీప్రసాద్ మున్సిపల్ కమిషనర్, ఎంసీసీ నోడల్ అధికారి నరేంద్రకుమార్, పోలీస్ సిబ్బంది, ప్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారి కేవీ రమణ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు అక్కడికి వచ్చేలోపే పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించారు. అక్కడికి చేరుకున్న అధికారులకు ఇది పార్టీ కార్యాలయం కాదని.. ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇల్లు అని, తమ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అనుమతులు లేకుండా ఎటువంటి పార్టీ కార్యకలాపాలు ఆ భవనంలో చేయకూడదని హెచ్చరించి అధికారులు వెనుతిరిగారు. కాగా, ఈనెల 16న దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజే సాయంత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికులను కార్యాలయానికి రప్పించి ప్రలోబాలకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల వీరంగంగుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను గురువారం తొలగించే ప్రయత్నం చేసిన మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ నాయకులు వీరంగం చేశారు. తాము అనుమతుల కోసం దరఖాస్తు చేశామని అవి వచ్చేవరకు తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ కార్యాలయంలో బ్యానర్లు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో గురువారం నాటికి కూడా టీడీపీ కార్యాలయంలో బ్యానర్లపై పేర్లు తొలగించలేదు. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీ పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం. టీడీపీ నేత వాహనం సీజ్ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా కారులో సామగ్రి కడప అర్బన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తిరుగుతున్న టీడీపీ నేత వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ వాహనాన్ని రెవెన్యూ, పోలీసు బృందం గురువారం సీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేసే క్రమంలో కడప డిప్యూటీ తహసీల్దార్ రోనాల్డ్ శామ్యూల్ ఆధ్వర్యంలో డబ్ల్యూఆర్డీ ఏఈ రమణ, హెడ్కానిస్టేబుల్ జె.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ ఎం.వి శేషారెడ్డి వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో స్కార్పియో వాహనం (ఏపీ39 క్యూఎఫ్ 3838) కోడ్కు విరుద్ధంగా ఉండటాన్ని గుర్తించారు. కారు వెనుక అద్దం మొత్తం ‘మన భూపేష్ అన్న మన జమ్మలమడుగు’ అని ఫొటో అతికించడంతో పాటు వాహనంలో పార్టీ కండువాలు, ప్లాస్టిక్ జెండా పైపులు, క్యాలెండర్లు, కరపత్రాలు ఉన్నాయి. దీంతో ఆ సామగ్రితో పాటు వాహనాన్ని అధికారుల బృందం స్వా«దీనం చేసుకుంది. దీనిపై కడప వన్టౌన్ సీఐ సి.భాస్కర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు. -
వలంటీర్లపై తప్పుడు ప్రచారం.. ఖండించిన ఈసీ
సాక్షి, అమరావతి: పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం(మార్చి 17) నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. జూన్ 6న పూర్తవుతుంది. అంటే.. మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. ఏపీలోనూ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల కోడ్ అమలవుతోంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తవుతున్నా, జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న గ్రామ వలంటీర్లు ఎవరైనా కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 9676692888 సీఈఓ వాట్సాప్గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది. అలాంటి న్యూస్ నమ్మవద్దని తెలిపింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే.. ‘రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి, వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వాట్సాప్(9676692888) చేయండి’ అని పేర్కొంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. అది ఫేక్ న్యూస్ అని, అటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని స్పష్టం చేశారు. చదవండి: 'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్గా బాబు! FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
కట్టుదిట్టంగా ‘కోడ్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ని కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ వెబ్సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియోలు కూడా వెంటనే తొలగించాలని సీఎస్ స్పష్టంచేశారు. అంతేకాక.. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలతోపాటు ప్రభుత్వ ఆస్తులపైనున్న రాజకీయ ప్రకటనలన్నీ కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జవహర్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. చాలావరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్నందున వారంతా కోడ్ మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలి. కోడ్కు సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో కార్యదర్శులందరూ నివేదిక ఇవ్వాలి. పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరంలేదు : ముఖేష్ కుమార్ మీనా ♦ ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు నిషిద్ధం. ♦వర్క్ఆర్డర్ ఉండి క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులను చేపట్టకూడదు. పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధంలేదు. ♦ అలాగే, వివిధ రకాల పించన్లపంపిణీకీ ఎలాంటి అభ్యంతరంలేదు. ♦ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్డ్ లబ్ధిదారులకు యధావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చు. కోడ్ అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ, టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదు. ♦ కోడ్ అమలులోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించకూడదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్స నిమిత్తం నిధులు మంజూరు చెయ్యొచ్చు. అన్ని రకాల ప్రకటనలనూ నిలిపివేయాలి.. ఇక కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ వెంటనే తొలగించాలి. అలాగే, వివిధ పబ్లిక్ ఆస్తులు అంటే.. బహిరంగ ప్రదేశాలు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైలు..రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు.. వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నింటినీ వెంటనే తొలగించాలి. అదే విధంగా.. ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేయాలి. మంత్రులెవరూ అధికారిక వాహనాలు వాడరాదు.. ఎన్నికల ప్రకటన వచ్చేసినందున ఇక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఎంపీ లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉండరాదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలూ ఉండకూడదు. అలాగే, విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై కూడా ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి కూడా ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులెవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర ఏ రకమైన లబి్ధపొందినా అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్కుమార్, వై. శ్రీలక్ష్మి, కె. విజయానంద్, వర్చువల్గా.. ఎం.టి. కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్కుమార్, హరీశ్కుమార్ గుప్తా, ప్రవీణ్ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీమోహన్, పలువురు కార్యదర్శులు, కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
సెలవుల్లోనే రోడ్షోలు: సీఈఓ వికాస్రాజ్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్షోలకు సెలవు రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్షోలపై నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్లు, బ్లడ్బ్యాంకులున్న ప్రాంతాల్లో కూడా రోడ్షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వికాస్రాజ్ మీడియాకు వివరించారు. రెండున్నరేళ్లలో 30 లక్షల ఓట్లు తొలగింపు గత డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు నమోదవగా.. 8,58,491 ఓటర్లను తొలగించినట్టు వికాస్రాజ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 30లక్షల ఓట్లను తొలగించామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో బోగస్ ఓట్లున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ నిర్వహించారని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోగస్ ఓట్ల తొలగింపు నిరంతర ప్రక్రియగా జరుగుతోందన్నారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త ఓటరుగా నమోదు కోసం ఏప్రిల్ 15లోగా ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోక్సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పిస్తామని వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే ఓటర్ల చిరునామా మార్పు(ఫారం–8), తప్పుల దిద్దుబాటు(ఫారం–7) దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈసారి 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచి ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. లెక్కలు చూపకుంటే స్వాధీనం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సరైన లెక్కలు లేకుండా రూ.50వేలకు మించిన నగదు తీసుకెళ్లరాదని వికాస్రాజ్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిననాటి నుంచి ఇప్పటివరకు రూ.243 కోట్లు విలువైన నగదు/సరుకులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. మార్చి 1 నుంచి ఆదివారం వరకు రూ.21.63 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నియామకమైన చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చా? అనే అంశంపై నిబంధనలను పరిశీలించాక తెలియజేస్తామన్నారు. ఈ–పేపర్లకు ఇచ్చే ప్రకటనలకు సైతం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సర్టిఫికేషన్ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను విడుదల చేశారు. -
24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్ కుమార్మీనా స్పష్టం చేశారు. -
మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, నల్గొండ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల్లో హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువైన 13 కిలోల బంగారం పట్టుకున్నారు పోలీసులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: ED: కవిత అరెస్ట్పై ఈడీ కీలక ప్రెస్నోట్ విడుదల - -
Lok sabha elections 2024: ఎన్నికల షెడ్యూల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించనుంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది. -
కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో పెట్టారు. కాగా, కోడ్ తొలగిన వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది. సీనియారిటీ తారుమారు కాకుండా.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీజోన్ కేడర్లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు. -
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో బెల్లంపల్లిలోని నెన్నెల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దుర్గం చిన్నయ్య గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చినా ఎన్నికల సిబ్బంది అడ్డుచెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!
ఎన్నికలు.. ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు మాత్రమే పాల్గొనే నిశబ్ధ యుద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్హత లేని నేతల్ని ఓడించేందుకు.. అర్హత ఉంటే మళ్లీ ఎన్నుకునేందుకు అదికూడా ఐదేళ్లకొకసారి దొరికే అవకాశం ఎలక్షన్స్. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఓటేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడికీ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి భారీగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అందులో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటేసేందుకు సిద్ధమైన వాళ్లు దాదాపు 10 లక్షలుకాగా.. మిగతా వాళ్లు మరో ఏడు లక్షలు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ కోసం సర్వం సిద్ధమైన వేళ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలి? సరైన ఓటు వేశామా? లేదా? అనేది ఎలా నిర్ధారించుకోవాలి.. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయాలి.. ఆ విషయాలన్నీ ఈ కథనంలో.. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు.. పోలింగ్ కేంద్రాల వద్ద తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి. పార్టీల గుర్తులు, పార్టీలను ప్రతిబింబించే రంగుల దుస్తులు.. కండువాలు.. టోపీలు ధరించొద్దు. అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఓటేసేందుకు లోనికి వెళ్లాక.. బూత్ లోపలికి సెల్ఫోన్లు, ఇతర డివైజ్లు(పరికరాలు) తీసుకెళ్లకూడదు. అలాగే.. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి. ఓటు హక్కు ఉండి ఓటర్ కార్డు లేకున్నా.. కింద ఉన్నవాటిల్లో ఏదో ఒక కార్డుతో వెళ్లి ఓటేయొచ్చు ఆధార్కార్డు బ్యాంక్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ పెన్షన్ కార్డు(ఫొటో తప్పనిసరి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సర్వీస్ ఐడీ కార్డులు ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినప్పుడు ముగ్గురు అధికారులు ఉంటారు. ఓటర్ లిస్ట్లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాతే ఓటరు.. పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ)లోపలికి వెళ్లి ఓటు వేయాలి. అక్కడ ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తును ప్రెస్ చేస్తే ఓటేసినట్లు లెక్క. ఇంతకీ మనం వేసిన ఓటు పడిందా? లేదా? పడితే మనం వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా? ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఓటేసే టైంలో.. సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, దానిని బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దశలవారీగా వీవీ ప్యాట్ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది. తెలంగాణలో వీవీ ప్యాట్ విధానం అమలు చేయడంతో ఇది రెండోసారి. ఫిర్యాదులు కూడా.. ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా రికార్డు అయినా.. బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థి/ పార్టీ గుర్తును తప్పుగా చూపితే.. లేదంటే ఓటు ఒకరికి బదులు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ కేంద్రంలో ఉండే ఆఫీసర్కు ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్స్ 1961.. 49 ఎంఏ ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లేదంటే టోల్ఫ్రీ నెంబర్లు 1950, సీ-విజిల్ యాప్ లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటు విషయంలో నష్టం జరిగిందని భావిస్తే.. న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించొచ్చు. ఇలా జరుగుతుంది.. ఈ విషయమై టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు. ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచారమని తేలితే దాని పరిణామాల గురించి కూడా వివరిస్తారు. ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు టెస్ట్ ఓటు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓటరు చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో పోలింగ్ ను నిలిపివేస్తారు. ఆపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ఆరోపణ తప్పని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫారం 17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. -
Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం
మిర్యాలగూడ టౌన్: పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఓటరు పరిశీలనలో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు బోగస్ వారా..? లేక నిజమైనా ఓటరా..? అని నిశితంగా పరిశీలిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థు లు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించుకుంటారు. నిబంధనలు ఇవే.. ► పోలింగ్ కేంద్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు సంబధించిన పోలింగ్ ఏజెంట్లకు ప్రాధాన్య క్రమంలో కుర్చీలను వేస్తారు. ► ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ► పోలింగ్ ఏజెంట్ల ఫారంలో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్గా నియమితులైన వారికి ఏజెంట్ల పాసును జారీ చేస్తారు. ► ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు పాసులను జారీ చేసినా ఒక్కరు మాత్రమే బూత్లో కూర్చోవటానికి అనుమతి ఇస్తారు. ఓటరు జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. ► పోలింగ్ ఏజెంట్లు ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ► పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు ఓటింగ్ సమయానికి గంట ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పనులను వారు కొనసాగిస్తారు. ఆలస్యం అయితే ఓటింగ్ యంత్రాల సీల్లో ఏజెంటు సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన తరువాతనే సంతకం చేయాలి. ► పోలింగ్ ఏజంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్, వైర్లెస్, కార్డ్లెస్ పరికరాలను తీసుకెళ్లరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించవద్దు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి పంపడం వంటివి చేయవద్దు. ► పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని పోలింగ్ ఏజెంట్లు నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగిన అధి కారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది చదవండి: దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు? -
ఒటరు సమాచార చీటీల పంపీణీ విషయంలో జాగ్రత్త.. రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు
మహబూబ్నగర్: శాసనసభ ఎన్నికలలో భాగంగా పంపిణీ చేసే ఓటరు సమాచార చీటీలను జాగ్రత్తగా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన ఓటరు సమాచారంతో పాటు మిగతా వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా 1950 టోల్ ఫ్రీ నంబర్కు, అదేవిధంగా ఫిర్యాదుల సెల్కు వచ్చే అన్ని ఫిర్యా దులను ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిశీలకులు పోలింగ్ రోజున కంట్రోల్రూమ్కి వెళ్లి సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. రాష్ట్రస్థాయి ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా మాట్లాడుతూ అదనపు బలగాలను రిజర్వ్లో ఉంచుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పు డు అత్యవసర సమయంలో వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది ఉండాలని సూచించారు. అన్ని పోలింగ్ బూతులు మ్యాపింగ్ చేయాలని, పోలింగ్ రోజు 144 సెక్షన్ విధించాలని, పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతిస్తారో ప్రతి పోలింగ్ అధికారి ముందే తెలుసుకొని ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపించాలని, ఎవరైనా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం అందించినప్పుడు తక్షణమే సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారం ఇచ్చే విధంగా సోషల్ మీడియా టీమ్ను అప్రమత్తం చేయాలని తెలిపారు. ♦ కలెక్టర్ జి.రవినాయక్ శాసనసభ ఎన్నికల నిర్వహణకు మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలలో చేసిన వివరాలను సమర్పించారు. జిల్లాలో 42మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 838 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్ ఫామ్ 12–డీ పంపి ణీ, హోం ఓటింగ్ అంశాలపై పవర్ పా యింట్ ప్రజంటేషన్ లో వివరించారు. ♦ ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ పోలీసుపరంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను కలుపుకొని మొత్తం 881 కేంద్రాలకు సంబంధించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో భాగంగా అంతర్ జిల్లా చెక్పోస్టుల ఏర్పాటు, అక్రమంగా తరలించే మద్యం, నగదు సీజ్ చేయడం, బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్కుమార్ మిశ్రా, పోలీస్ పరిశీలకురాలు ఇళక్కి యా కరునాగరన్, అధికారులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలు
-
వివాహాలకు అడ్డంకిగా ఎన్నికల నియమావళి
ఫంక్షన్ హాళ్లను వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచార వేదికలుగా మార్చుకుంటుండటంతో పెళ్లిళ్ల నిర్వహణ ప్రధాన సమస్యగా మారనుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా, అలాగే ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు భోజనాలు, రాత్రి పూట బసకు వీటిని ముందే బుక్ చేసుకుంటున్నారు. టెంట్లు, వంట సామగ్రి కూడా పెళ్లిళ్లకు దొరికే పరిస్థితి లేదు. తిరుమలగిరి (తుంగతుర్తి): ఎన్నికల కోడ్.. శుభకార్యాలు చేసే వారికి కష్టాలను తెచ్చి పెట్టింది. దీని ప్రభావం ప్రధానంగా పెళ్లిళ్లపై పడుతోంది. నవంబర్ 16వ తేదీ నుంచి వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లింటివారు దుస్తులు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలుకు, నగదు లావాదేవీలు చెల్లింపులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెక్పోస్టుల వద్ద పట్టుకుంటుండడంతో.. ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే సీజ్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, వంట వాళ్లకు, టెంట్లకు, దుస్తులు, బంగారం కొనుగోళ్లు వంటి వాటికి నగదు అవసరం. ఎంత లేదన్నా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. బంగారం సైతం కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే.. డబ్బు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడుతున్నారు. శుభకార్యాల కోసం తీసుకెళ్తున్నామని ఆధారాలు చూపించినా పోలీసులు వినిపించుకోవడం లేదు. డబ్బు పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్, ఎన్నికల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. డిజిటల్ చెల్లింపుల పైనా ఆంక్షలు డిజిటల్ లావాదేవీలైనా జరుపుదామనుకున్నా సాధ్యం కావడం లేదు. లక్షకు మించి డిజిటల్ లావాదేవీలు జరిపినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిపై కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు డేగ కన్ను వేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా నోటీసులు ఇచ్చి సంజాయిషీలు అడుగుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలు లేవు.. పెళ్లిళ్లలో అతిథులను తీసుకెళ్లడానికి వాహనాలు అవసరం. సొంత వాహనాలు ఉన్న వారికి పెద్ద సమస్య ఉండక పోవచ్చు. కానీ అవి లేని వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెళ్లి కోసం కార్లు, బస్సులు దొరకడం లేదు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన మరుసటి రోజే అభ్యర్థులు వీటిని బుక్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి ఒక్కో అభ్యర్థి అధికారికంగా మూడు, నాలుగు, అనధికారికంగా 10, 15 వాహనాలను బుక్ చేసుకున్నారు. దీంతో పెళ్లిళ్లకు వాహనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. -
మరో రెండు రోజులే గడువు... జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్
మహబూబ్నగర్: నామినేషన్లు సమర్పించేందుకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని, ఈ చివరి రోజుల్లో ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికలపై రిటర్నింగ్, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్పై, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీపై ఎక్కువగా దృష్టి సారించాలని, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, సీ విజిల్ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా విశ్లేషించాలని, రిటర్నింగ్ అధికారులు తక్షణమే వారి నియోజకవర్గ ఎన్నికల ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. త్వరలో జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రానున్న నేపథ్యంలో నోడల్ అధికారులు అందరూ వారి విషయాలకు సంబంధించి రిజిష్టర్లు, రికార్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను నామినేషన్ల చివరి తేదీ నుంచి పోలింగ్కు ఐదురోజుల ముందు వరకు పంపిణీ చేయాలని, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ జాగ్రత్తగా చేపట్టాలని కోరారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైనా 15 మందికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే అదనపు బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా ఎఫ్ఎల్సీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఫాం– 12 ఇచ్చి మళ్లీ సేకరించిన వివరాలను తక్షణమే సమర్పించాలని, ముఖ్యంగా హోం ఓటింగ్పై డీఎంహెచ్ఓ, జిల్లా సంక్షేమ అధికారి, డీఆర్డీఓలు దృష్టిసారించాలని చెప్పారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ డేటా బేస్ తయారు చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇతర సిబ్బందికి సంబంధించిన డేటా బేస్ను కూడా సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు సీ విజిల్, సువిధ ఇతర ఫిర్యాదులను పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఈ నెల 30న జరిగే పోలింగ్పై రూపొందించిన ‘నవంబర్ 30’ స్టిక్కర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు మోహన్రావు, అనిల్కుమార్, నటరాజ్, ఏఎస్పీ రాములు, డీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం.. జిల్లా ఎన్నికల అధికారి
నల్లగొండ: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు డబ్బు, మద్యం సరఫరా, ఉచితాలపై పోలీస్, సర్వేలెన్స్ బృందాల ద్వారా పటిష్ట నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ తెలిపారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఎస్హెచ్ అజయ్ బందూ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్, ఐటీ, వాణిజ్య, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఎస్పీ అపూర్వరావుతో కలిసి కలెక్టర్ కర్ణన్ హాజరై మాట్లాడారు. పోలీసులు, ఇతర సర్వే లెన్స్ టీమ్ల ద్వారా మొత్తం రూ.42,00,46,385 విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులు సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ.11,02,1319 నగదును, రూ.27,01,35,625 విలువ గల బంగారు, వెండి, ఆభరణాలు.. రూ.2,89,22,622 విలువ గల 1,27,548 లీటర్ల మద్యం, 6,66,37 డ్రగ్స్, 22,77,398 విలువైన ఉచితాలకు సబంధించిన సొమ్మును తనిఖీల్లో స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్సులో ఎస్.పి.అపూర్వ రావు,ఎం.సి.సి.నోడల్ అధికారి, స్పెషల్ కలెక్టర్(భూ సేకరణ) హరి సింగ్ , ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్,ఇతర అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. స్ట్రాంగ్రూముల వద్ద భద్రత విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట పీఆర్ ఎస్ఈ తిరుపతయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
కంటి డాక్టర్కు పొలిటికల్ కష్టాలు
సాక్షి, జగిత్యాల : ఆయనో నేత్ర వైద్యుడు. ఎంతో ఓపికగా కళ్ళ ఆపరేషన్లు చేస్తారు. కాని ఎమ్మెల్యేగా ఆయన సహనం కోల్పోతుంటారు. తప్పుల్ని ఎత్తి చూపినవారిని ఆవేశంతో బెదిరిస్తారు. తనమీద ఫిర్యాదులు చేస్తే మళ్ళీ బెదిరిస్తారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారయన. ఎన్నికల వేళ ఆయన చేస్తున్న తప్పులు ఎక్కడికి దారి తీస్తాయో అని అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేస్తున్న తప్పులు ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎన్నికలు జరిగే తేదీలతో ఒకసారి షెడ్యూల్ విడుదలయ్యాక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిబంధనావళి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులెవ్వరికైనా ఒకేవిధంగా వర్తిస్తాయి. ఒకరికెక్కువ, ఇంకొకరికి తక్కువ అనే మినహాయింపులేమీ ఉండవు. కానీ జగిత్యాల అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ సంజయ్కుమార్ ఎలక్షన్ కోడ్ తనకు వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తూ కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. ఎన్నికల వేళ ఓట్ల వేట కొనసాగిస్తూ.... తన కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. అసలు పార్టీ కార్యాలయంలో ఆ చెక్కులుండటమే తప్పంటే.. చెక్కుల పంపిణీపై ఫిర్యాదు చేసిన వారిని సదరు ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గురించి గుంటి జగదీశ్వర్ అనే ఓ లాయర్ జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఎన్నికల కమిషన్ నోటీసులిచ్చింది. అది కాస్తా ఆ నేత్రవైద్యుడిలో అసహనానికి కారణమైంది. దాంతో.. జగిత్యాల శివార్లలోని రాజేశుడి గుట్ట ఆలయంలో పూజారిగా కూడా పనిచేసే సదరు అడ్వకేట్ గుంటి జగదీశ్వర్ దగ్గరకు హుటాహూటీన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెళ్లారు. అక్కడున్న మీడియా కెమెరాలను రికార్డ్ చేయొద్దంటూ హుకుం జారీ చేశారు. దైవ నామస్మరణతో మారుమ్రోగుతున్న మైకులనూ ఆపేయించారు. ఎన్నికల వేళ ఎమ్మెల్యే ఆఫీస్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడమే తప్పంటే.. గుడికెళ్లి రాజకీయాలు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యే బెదిరించాడని లాయర్ కమ్ పూజారి గుంటి జగదీశ్వర్ చెబుతున్నారు. నేత్ర వైద్యుడిగా ఎంతో ఓపికతో కళ్ల ఆపరేషన్స్ చేసే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. రాజకీయాలకు వచ్చే వరకు అసహనంతో, ఆగ్రహంతో ఎందుకు సహనాన్ని కోల్పోతున్నారనే చర్చ జగిత్యాల సర్కిల్స్ లో మొదలైంది. ఇప్పటివరకూ జగిత్యాలలో టఫ్ ఫైట్ ఉంటుందనుకుంటున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆగ్రహావేశాలు పార్టీకి నష్టం మరింతగా జరుగుతుందనే అభిప్రాయాలు గులాబీ వర్గాల్లోనే చర్చకొస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎన్నికల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన బాధితుడు గుంటి జగదీశ్వర్ ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాడు. డాక్టర్ సంజయ్ కుమార్ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. మెడికల్ కళాశాల భవనానికి భూమిపూజ చేస్తున్న సమయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కోరుట్ల శాసనసభ్యుడైన విద్యాసాగర్ రావు నేతృత్వంలో పనులను ప్రారంభించారు. ఆ శిలాఫలకంపై క్యాబినెట్ హోదా కల్గిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత పేరును ముద్రించకపోవడం వివాదానికి కారణమైంది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్వయంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఈవిషయమై మందలించారు. జడ్పీ చైర్ పర్సన్ పేరు ముద్రించాకే శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తన ఎమ్మెల్యే సీటుకి అడ్డు పడుతుందన్న నాటి ప్రచారం నేపథ్యంలో.. ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించి దావా వసంత పేరును శిలాఫలకంపై ముద్రించకపోవడంపై జగిత్యాల ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ వర్గాల్లోనే పెద్ద చర్చ జరిగింది. గతంలోనూ పలుమార్లు తానేం మాట్లాడుతున్నానో తనే గుర్తించలేని స్థితిలో.. చెప్పాలనుకునేదొకటి, చెప్పేదొకటన్నట్టు మీడియా అటెన్షన్కు డాక్టర్ సంజయ్ కుమార్ టార్గెట్గా మారారు. తీరా ఇప్పుడు ఎన్నికల వేళ తత్తర పడుతున్న సీన్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. కానీ, ఈ విషయాలు ఎమ్మెల్యేకు చెబితే మళ్లీ దాని గురించి ఏమనుకుంటారోనని.. ఆయన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న ఆయన శ్రేయోభిలాషులు కూడా చెప్పడానికి సందేహిస్తున్నారట. మొత్తంగా గెలుపు అవకాశాలున్న చోట.. కోడ్ ఉల్లంఘనలు.. పైగా అహంకారపు బెదిరింపులు.. తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఎలక్షన్ టైమ్లో ఇవేం తలనొప్పులని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయట. -
కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సీపీ అభిషేక్ మహంతి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో 16 కేసులు నమోదవడం, అందులో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడినా, మందు, విందులు ఏర్పాటు చేసినా, సమయం దాటి ప్రచా రం కొనసాగించినా, డీజే వాహనాలు వాడినా, ఆఖ రుకు ఎమ్మెల్యే అభ్యర్థి పోస్టర్లు వాహనాలకు వేసుకున్నా కేసులు పెడుతూ.. ఆ వాహనాలు సీజ్ చేస్తున్నారు. కొన్ని పార్టీల వారు ప్రచారంలో భాగంగా ఆటోలు, కార్లపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఆ వాహనాలను సీజ్ చేయడంతో తాము జీవనోపాధి కో ల్పోతున్నామని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. ► కేశవపట్నం మండలంలోని ఎరడపల్లికి చెందిన మాతంగి హరికృష్ణ, కలకుంట్ల రంజిత్రావు, పోతునూరి హరీశ్, వి.సాయికృష్ణ గత మంగళవారం డీజేతో మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయికి ప్రచారం చేసినందుకు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► చొప్పదండిలో బీఆర్ఎస్కు చెందిన మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, మహేశ్, ఎన్నం మనోహర్, శ్రీకాంత్ అనుమతి లేకుండా స్థానిక ఫంక్షన్హాల్లో దాదాపు 100 మందికి భోజనం, మద్యం సరఫరా చేయగా.. కేసు నమోదైంది. ► కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో ఎం.హరీశ్ కారులో అనుమతి లేకుండా తరలిస్తున్న బీజేపీకి సంబంధించిన 500 కరపత్రాలు, 10 పార్టీ కండువాలు గుర్తించి, కేసు నమోదు చేశారు. ► హుజూరాబాద్లో మంగళవారం టీడీపీకి చెంది న ఐత హరీశ్, రామగిరి అంకూస్, ఆడెపు రవీందర్, లింగారావు, ఫయాజ్ అనుమతి లేకుండా అంబేడ్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చినందుకు కేసు నమోదైంది. ► కమాన్ చౌరస్తా వద్ద తనిఖీల్లో శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన నందికొండ మహేందర్రెడ్డి కారుపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్ను ప్రదర్శించినందుకు కేసు నమోదైంది. ► తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన వరికోళ్లు చంద్రయ్య తన ఆటోపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్ ప్రదర్శించినందుకు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► గంగాధరకు చెందిన పులి మారుతి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం బుధవారం అనుమతి లేకుండా వంద మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రామడుగులోని ముదిరాజ్ సంఘం భవనం వరకు డీజే వినియోగంపై కేసు నమోదైంది. ► గంగాధరకు చెందిన లోక రాజేశ్వర్, రామిడి సురేందర్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ తాడిచెరువు గ్రామ శాఖ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. బుధవారం బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్ సమయం దాటినా ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. ► మానకొండూరులో నిర్వహించిన తనిఖీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మండపల్లికి చెందిన జగ్గాని శివ, చొప్పదండి శ్రీనివాస్ కారులో సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్కి సంబంధించిన 180 కరపత్రాలు, 50 బుక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► జమ్మికుంట పరిధి జగ్గయ్యపల్లెలో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనంలో డీజే వినియోగంపై అబ్దుల్ కరీమ్, బడే జేమ్స్, వడ్డేపల్లి సతీశ్, వడ్డెపల్లి పోచయ్యలపై కేసు నమోదైంది. ► కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద చేపట్టిన తనిఖీ ల్లో తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్కి చెందిన జమీల్ఖాన్ తన ఆటోపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్ను అంటించినందుకు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► కశ్మీర్గడ్డలో బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ మహబూబ్ ఖాన్ మైనారిటీ యూత్ ఆత్మీ య సమావేశంలో 500మందికి చికెన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదైంది. ► చొప్పదండిలో గురువారం బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ లోక రాజేశ్వర్ రెడ్డి,బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 300 మందితో సమావేశం నిర్వహించారు. ఇక్కడ డ్రోన్ వినియోగంపై రాజేశ్వర్ రెడ్డి, రవిశంకర్, రాజులపై కేసు నమోదు చేశారు. ► ఇంటింటి ప్రచారానికి బదులుగా గర్శకుర్తిలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పులి మారుతి, చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం, గ్రామ శాఖ అధ్యక్షుడు చిప్ప చక్రపాణిలపై కేసు నమోదైంది. ► కనపర్తి సర్పంచ్ పర్లపల్లి రమేశ్, వల్బపూర్ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మొలుగు పూర్ణచందర్ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ స్తంభాలకు జెండాలు కట్టడం, టపాసులు పేల్చడంపై గురువారం కేసు నమోదు చేశారు. ► హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్, పార్టీ వీణవంక మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి వీణవంకలోని ఓ ఫంక్షన్హాల్లో 300 మందితో సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లో ఎన్నికల కోడ్ను అతిక్రమించిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ అతిక్రమించారు. వందలాది వాహనాల కాన్వాయ్తో ర్యాలీ నిర్వహించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలి చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు వాహనాలను అడ్డం పెట్టడంతో బేగంపేట నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్కు సైతం సైడ్ ఇవ్వకుండా వాహనాలు అడ్డుపెట్టి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణుల ఓవర్ యాక్షన్పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న తాత్కాలిక బెయిల్పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. కోర్టు.. ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు -
ఎన్నికల తర్వాతే గృహప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్థిరాస్తి రంగంపై పడింది. సాధారణంగా రియల్టీ మార్కెట్లో నగదు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అనధికారిక లావాదేవీలే అధికం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు, ఎన్నికల సంఘం అధికారులు నగదు ప్రవాహంతోపాటు ఆన్లైన్ లావాదేవీలపై కూడా గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడం శ్రేయస్కరం కాదని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తీసుకెళ్తే.. పోలీసుల తనిఖీల్లో చిక్కితే అసలుకే ఎసరొస్తుందని ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పటి వరకూ ఎదురుచూపులే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బుతో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తానికి గృహ రుణం కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. మరోవైపు ఆన్లైన్ ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరుపుదామంటే.. వాటిపై కూడా నిఘా పెట్టా లని ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ ప్రవేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి. ఎన్నికలు డెవలపర్ల మీద కంటే కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నికలకు 1–2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకు కస్టమర్లు వేచిచూసే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు. ముందస్తు బుకింగ్లు.. స్థిరాస్తి సంస్థలకు నిరంతర క్రయవిక్రయాలు జరపకపోతే సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగుల జీవభత్యాలు ఇతరత్రా వ్యయాల నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాసులు, విశ్వసనీయమైన కస్టమర్లతో ముందస్తు బుకింగ్లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు జరిపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సాధారణమే కానీ, ఈసారి తెలంగాణలో నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. దీంతో బిల్డర్లు ఫండ్ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఇది డెవలపర్లకు కొంత భారమేనని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. -
అడ్డగోలుగా ప్రచారాలు.. జోరుగా వ్యక్తిగత ఆరోపణలు
మేడ్చల్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారాలు అడ్డగోలుగా చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తాము సమర్థంచే పార్టీలు, అభ్యర్థుల కోసం ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాను ఫాలో చేసే వారికి చిర్రెత్తిస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా తమ ప్రచారం తాము చేసుకోవాలని నిబంధనలు ఉన్నా అడ్డూ అదుపు లేని సోషల్ మీడియాలో పోస్టింగ్ల జోరుగా కనిపిస్తోంది. ప్రత్యేక గ్రూపులు.. ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల్లో మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాను నేటి రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రధానంగా వాట్సాప్, ఫేస్బుక్లను ఎక్కువగా వాడుతున్నారు. యూట్యూబ్కు కొంతవరకు నియంత్రణ ఉంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో ఉండే ఓటర్ల నంబర్లు సేకరించి గ్రూపులుగా తయారు చేస్తున్నారు. మా ఊరు, మన వార్డు, మన కాంగ్రెస్, మన బీజేపీ, మన బీఆర్ఎస్, జంగయ్య సైన్యం, మల్లారెడ్డి సైన్యం, మున్సిపాలిటీ, మండలం, నియోజకవర్గం ఇలా వార్డు స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారు పెట్టే పోస్టింగ్లు నిజమో కాదో ఎవరికీ తెలియదు.. కానీ చక్కర్లు మాత్రం జోరుగా కొట్టిస్తున్నారు. ఓ ప్రముఖ సర్వేలో మా అభ్యరి్థకి 70శాతం మంది ఓటర్లు మొగ్గుచూపారని, గెలుపుమాదే అని ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. ఆ సర్వే ఎవరూ చేశారు, ఏ సంస్థ చేసింది పోస్ట్ పెట్టిన వాడికే తెలియదు. అభిమానం కట్టలు తెంచుకుని ఉండటంతో వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం ఫేస్బుక్లో షేర్ చేయడమే వారి పని. సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉండటంతో ప్రచారంలో నాయకులు దానిపై ఆధారపడుతున్నారు. వీటీ కోసం స్థానికంగా ప్రత్యేక వ్యస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫొటోలు పెట్టి అందంగా మేకప్ చేసి సందేశాలను విడుదల చేస్తున్నారు. ఒక్కో మెసేజ్కు రూ.30, వీడియోకు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. చాలామందికి ఇదో రకం ఉపాధిగా మారింది. ఫొటోలు పెట్టుకొని గ్రూపుల్లో ప్రచారాలు చేయడం, వాట్సాప్లలో పెట్టడం, స్టేటస్ పెట్టుకోవాలని సూచించడం వంటి మెసేజ్లు ఎన్నో కనిపిస్తున్నాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్నా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అంటున్నారు. -
‘కోడ్’ పేరుతో అత్యుత్సాహం!
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది. బుధవారం రామాయంపేట చెక్పోస్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించడం కోసమే అన్నట్లు ఈ పోలీసులు విచక్షణ మరచి వ్యవహరించారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు కామారెడ్డిలో లాజిస్టిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్లిన వీళ్లు బుధవారం కారులో తిరిగి వస్తున్నారు. అందులో ఉన్న బ్యాగులో రూ.50 వేలు (రూ.500 నోట్ల కట్ట) ఉంది. రామాయంపేట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కారు ఆపారు. బ్యాగ్ తనిఖీ చేసిన ఎస్ఐ నేతృత్వంలోని పోలీసులు అందులో రూ.50 వేలు ఉండటం గమనించారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి రూ.50 వేల వరకు నగదు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ చెక్పోస్టులోని పోలీసులు యువకులను ఆ నగదుకు లెక్కలు చెప్పమని గద్దించారు. అవి తమ వ్యాపారానికి సంబంధించినవి అని చెప్తున్నా వినిపించుకోలేదు. రూ.50 వేలు సీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పోలీసులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేచారు. ఆ యువకుల జేబుల్లో, పర్సులు తనిఖీ చేశారు. ఒకరి పర్సులో రూ.200 ఉండటంతో ఆ మొత్తంతో కలిపి తాము రూ.50,200 సీజ్ చేసినట్లు, అవి ఒకరి వద్దే లభించినట్లు పంచనామా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా ఒకరి పేరు రాసి ఆ మొత్తం స్వాదీనం చేసుకున్నారు. రూ.50 వేలకు మించిన నగదు ఒకరి వద్ద ఉంటే సీజ్ చేస్తారా? లేక ఒక వాహనంలో ఉంటే సీజ్ చేస్తారా? దానికి సంబంధించి ఈసీ ఆదేశాలు చూపాలంటూ యువకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ ఉత్తర్వులు చూపాలంటే ముందు పేరు చెప్పాలంటూ తెలుసుకుని పంచనామాపై రాశారు. రామాయంపేట పోలీసుల తీరుపై యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ లెక్కల కోసం ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమనిప్రశ్నిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. కోడ్ పేరుతో పోలీసుల చూపిస్తున్న అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు తెచి్చపెడుతోంది. కోడ్ అమలులోకి వచి్చన నాటి నుంచి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారు. హైదరాబాద్లోనే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకు ఉంది. బోయిన్పల్లి పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్న రూ.55,900 నగదుతో మాత్రమే ఎన్నికల లింకులు ప్రాథమికంగా బయటపడ్డాయి. ఈ నగదు తరలిస్తున్న న్యూ బోయిన్పల్లి వాసి ఎం.భాస్కర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో ఆ కోణంలో ‘ఎలక్షన్ డబ్బు’గా అనుమానిస్తూ స్వాదీనం చేసుకున్నారు. ఇది మినహా మరే ఇతర ఉదంతంలోనూ నగదు స్వాధీనంలో రాజకీయ కోణం బయటపడకపోవడం గమనార్హం. -
కీలక విధుల్లో కేంద్ర బలగాలు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల క్రతువును ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి నగర పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, పక్షపాతానికి తావు లేకుండా కొత్వాల్ సందీప్ శాండిల్య చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కీలక ఎలక్షన్ డ్యూటీల్లో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఎన్నికల విధుల కోసం ఇప్పటి వరకు నగరానికి 11 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయి. వీటికి నేతృత్వం వహించే కమాండింగ్ ఆఫీసర్లతో సందీప్ శాండిల్య సోమవారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీలో జరిగిన ఈ కీలక సమీక్షలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ సైతం పాల్గొన్నారు. నగరంలో ఉన్న కీలక పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై కేంద్ర బలగాల అధికారులకు అవగాహన కల్పించారు. వీరిని నిఘా, తనిఖీలతో పాటు చెక్పోస్టుల్లోనూ వినియోగించాలని నిర్ణయించిన కొత్వాల్ శాండిల్య ఆ అంశాలను వారికి వివరించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు, బాధ్యతలను వారికి తెలియజేశారు. ఈ బలగాలకు అవసరమైన సదుపాయాలు, బస ఏర్పాటు చేసే బాధ్యతలను స్థానిక ఏసీపీలకు అప్పగించారు. విధి నిర్వహణ, తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. మరోపక్క ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లాను యూనిట్గా నిర్ణయించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నగర కమిషనరేట్ నుంచి ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. అనేక ఠాణాలకు కొత్త ఇన్స్పెక్టర్లు రాగా వీరిలో చాలామంది నగరానికి, ఏరియాకు పూర్తి కొత్త. అత్యంత కీలక పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లకు తమ పరిధిలోని ప్రాంతాలపై పట్టు వచ్చేలా చేయాలని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫ్లాగ్ మార్చ్లుగా పిలిచే పాదయాత్రలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంలో కమిషనరేట్లో ఉన్న పోలింగ్ బూత్ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు.వీటిలో పోలింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు. మరోపక్క పోలింగ్ స్వేచ్ఛగా జరుగుతుందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికీ భారీ కసరత్తులు చేస్తారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్మార్చ్లుగా పిలిచే కవాతులను పోలింగ్ ముగిసే వరకు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి చేసే ఈ కవాతులు చేయాలని అధికారులకు కొత్వాల్ స్పష్టం చేశారు. తమ పరిధిలో ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? ఎటు నుంచి అసాంఘికశక్తులు విరుచుకుపడే అవకాశం ఉంది? అనే అంశాలపై ఇన్స్పెక్టర్లకు పట్టుండాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు. -
మద్యం షాపులపై నజర్
బంజారాహిల్స్: ఎన్నికల అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించే క్రమంలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. గత రెండు వారాల నుంచి పోలీసులు తమ పరిధిలోని వైన్షాపులు, బ్యాంకులు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల దుకాణాల వద్ద తిష్టవేస్తూ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చిన డబ్బులను, వైన్ షాపుల నుంచి నాలుగు బాటిళ్లకు మించి తీసుకెళ్తున్న మద్యాన్ని సీజ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు దసరా సందర్భంగా తన ఇంట్లో విందు కోసం సోమవారం సాయంత్రం 6 మద్యం సీసాలు, 20 బీర్లు తీసుకుని వెళ్తుండగా అప్పటికే అక్కడ తిష్టవేసిన పోలీసులు ఆయన వెళ్తున్న దారిలో కొద్ది దూరం అనుసరించి..కారును ఆపి మద్యం సీజ్ చేయడమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నించగా నువ్వు ఓటర్లకు పంచడానికే మద్యం తీసుకెళ్ళుతున్నావంటూ పోలీసులు జవాబు ఇవ్వడంతో ఆ యువకుడు నోరెళ్లబెట్టాడు. ఇలా ప్రతి వైన్షాపు వద్ద పోలీసులు తిష్టవేస్తూ ఓవర్ యాక్షన్కు దిగుతున్నారు. ఎవరు ఎంత మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారో నిఘా వేసి వారు కొద్ది దూరం వెళ్లాక ఆపి మద్యాన్ని సీజ్ చేసి దాన్ని ఎన్నికల లెక్కల్లో చూపిస్తున్నారు. అంతే కాదు..మద్యం దుకాణాలు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల షాపుల యజమానులు రాత్రి షాపు బంద్ చేసి ఆ రోజు కలెక్షన్ తీసుకెళ్లాలనుకున్నా అక్కడ మఫ్టీలో నిఘా ఉంటున్న పోలీసులు వారిని వేటాడి వెంబడిస్తున్నారు. చాలా మంది షాపుల యజమానులు తమ రోజువారీ వసూలు చేసిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయలేని పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రతి రోజూ ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక లిక్కర్ కేసు నమోదు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. దీంతో పోలీసులు ఠాణాలను వదిలి వైన్షాపుల వద్ద తిష్టవేయాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. ఇంకా ఎన్నికలకు ఆరువారాల సమయం ఉండగా ఇప్పటి నుంచి ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తారని అధికారులు ఎలా భావిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి అటు వ్యాపారులు, ఇటు ప్రజలు పోలీసుల తీరుతో విసిగిపోతున్నారు. చాలా చోట్ల తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల తీరును చాలా చోట్ల జనం ఎండగడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మరో రెండు నెలలు నిరీక్షణే...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్కు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు కొంతకాలం బ్రేక్ పడనున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులకు రెండు, మూడు త్రైమాసికాలు అత్యంత కీలకం. తొలి త్రైమాసికంగా బడ్జెట్ సర్దుబాట్లు, ఇతరాత్రా కారణాలతో చెల్లింపుల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి నిధుల లభ్యత, ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపుల్లో వేగం పుంజుకుంటుంది. కానీ ఈసారి సంక్షేమ శాఖలకు రెండో త్రైమాసికంలో నిధులు విడుదల కాలేదు. పలు రకాల చెల్లింపులు నిలిచిపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు భారీగా పేరుకుపోయాయి. సంక్షేమ శాఖలు ఆమోదించి ఖజానా విభాగానికి పంపించినప్పటికీ అక్కడ క్లియరెన్స్ రాని బిల్లులు దాదాపు రూ.1,175 కోట్లు ఉన్నాయి. ఇవిగాకుండా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన డైట్ చార్జీలు మరో రూ.675 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.1,850 కోట్లు ఖజానా విభాగంలో పెండింగ్లో ఉండగా... ఇవి రెండో త్రైమాసికంలో వస్తాయని అధికారులు భావించారు. చివరి నిమిషం వరకు సంక్షేమాధికారులు వేచిచూసినప్పటికే నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మూడో త్రైమాసికంలోనైనా ఈ నిధులకు మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వాటి విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చివరి క్వార్టర్పైనే ఆశలు... విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద దాదాపు 12.65లక్షల మంది లబ్ధిదారులుంటారు. వీరితో పాటు మరో 10 లక్షల మంది గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నారు. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఎంతో కీలకం. కోర్సును ముందుకు సాగించాలన్నా... వసతిగృహంలో ఉండాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు. కొంతకాలంగా ఈ రెండు పథకాలకు, డైట్ చార్జీల విడుదలలోనూ జాప్యం చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి నుంచి గురుకులాలు, వసతిగృహాలు, సంక్షేమ అధికారుల ద్వారా ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖజానా విభాగంలో నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపకారవేతన నిధుల విడుదల నిలిచిపోయింది. ఇవన్నీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించినవే. ఇవిగాకుండా 2022–23 విద్యా సంవత్సరం దరఖాస్తు పరిశీలన. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లులు రూపొందించి ఆమోదించిన బిల్లులకు గత రెండు త్రైమాసికాల్లో రిక్తహస్తం చూపిస ప్రభుత్వం మూడో త్రైమాసికంలోనైనా నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... చివరి త్రైమాసికంలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
కోడ్ కూత ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అమల్లోకి వచ్చిన ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (కోడ్) ఏయే పథకాలకు వర్తిస్తుందనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న పథకాలే అయినప్పటికీ ఆ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే వెసులుబాటు కోడ్ అమల్లో ఉంటే సాధ్యం కాదు. కానీ, ఈ కోడ్ సాకుగా కొన్ని పాత పథకాలు, ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను అమలు చేయడంలో కొందరు అధికారుల గందరగోళ వైఖరి చర్చకు దారితీస్తోంది. రెవెన్యూ కార్యకలాపాలు ‘యథాతథం’ ఇక, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, రెవెన్యూ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతారే తప్ప దైనందిన రెవెన్యూ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ధ్రువీకరణ పత్రాల మంజూరు, ధరణి దరఖాస్తుల పరిష్కారం లాంటివి కోడ్ కారణంగా ఆగిపోవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో 58, 59ల ద్వారా భూముల క్రమబద్ధీకరణ కూడా ఆగదని అంటున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక విడత నిధులు మంజూరైన లబ్ధిదారునికి రెండో విడత నిధులు మంజూరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జిల్లాకో తీరుగా గొర్రెల పంపిణీ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం విషయంలో ఎన్నికల కోడ్ను జిల్లాకో రీతిలో అమలుపరుస్తున్న తీరు విస్మయపరుస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రెండో విడత రాష్ట్రంలో అమలవుతోంది. మొత్తం 3.5లక్షలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 1.25లక్షల మందికి పైగా లబ్ధిదారులు వారి వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేశారు. ఇందులో కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కేవలం 28వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇక కోడ్ అమల్లోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోకుండా చేతులెత్తేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయాధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు వదిలేశారు. దీంతో కొన్ని జిల్లాల కలెక్టర్లు గొర్రెలను పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఆయా జిల్లాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు వచ్చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథావిధిగా కొనుగోళ్లు చేస్తుండడం గమనార్హం. కొసమెరుపేమిటంటే... 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత గొర్రెల పథకం అమలు కావడం గమనార్హం. ఆ బాధ్యత అధికారులదే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘కోడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజలపై ఉంది. కోడ్ అడ్డురాని పథకాలను, కార్యక్రమాలను, జీవోలను, రోజువారీ కార్యకలాపాలను యథాతథంగా అమలు చేసే బాధ్యత అధికారులదే. ఈ విషయంలో అధికారులదే తుది నిర్ణయం’ అని స్పష్టం చేశారు. డబ్బుల్లేవని కోడ్ మాట చెపుతున్నారు ‘అసలు కోడ్కు గొర్రెల పథకానికి సంబంధం లేదు. 2018లో ఎన్నికలు జరిగే రోజున కూడా గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా కోడ్ సమస్య కాదు. సరిగా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసి గొల్లకుర్మలను మోసం చేసింది. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో కోడ్ అనే సాకు చూపెడుతున్నారు.’ – ఉడుత రవీందర్, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
తెలంగాణ ఎన్నికలు.. 11 రోజుల్లో ఎంత డబ్బు సీజ్ చేశారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి (అక్టోబర్ 9) నుంచి ఈ రోజు వరకు (శుక్రవారం) వరకు 11 రోజుల్లో తనిఖీల్లో మొత్తం రూ.286 కోట్ల 74 లక్షల 1,370 విలువ గల సొత్తు సీజ్ చేశారు. నిన్న ఒక్కరోజే తనిఖీల్లో రూ. 42 కోట్ల 93 లక్షల 5,700 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో రూ. 28 కోట్ల 73 లక్షల 55, 200 విలువ గల బంగారం, వెండి వజ్రాలను సీజ్ చేశారు. రూ. 8 కోట్ల 8 లక్షల 2,070 నగదును నిన్న ఒక్కరోజే సీజ్ చేయగా, కోటి 68 లక్షల 45,982 విలువ గల మద్యం సీజ్ చేశారు. చదవండి: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ -
ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై స్పష్టత కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సాక్షి, హైదరాబాద్: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు. పండగలు, పెళ్ళిళ్ళ సీజన్లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు. -
తెలంగాణ: ఎన్నికల వేళ కట్టలే కట్టలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.200 కోట్లు దాటిన పట్టుబడిన మొత్తం విలువ. నిన్న ఒక్కరోజే రూ.70 కోట్లకు పైగా విలువగల సొత్తును సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్లు, 95 అంతర్రాష్ట్ర చెక్పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
తెలంగాణ: 8 రోజుల్లో ఎంత సీజ్ చేశారంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలో లెక్కపత్రం లేని సొమ్ము రూ. 100 కోట్లు దాటింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఈ రోజు ఉదయం వరకు పట్టుబడ్డ వాటి విలువ రూ.130 కోట్లు. పట్టుబడిన నగదు అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు సీజ్ చేసిన అమౌంట్ రూ. 71,55,58,094 నిన్న ఒక్కరోజు సీజ్ చేసిన అమౌంట్ రూ.12,58,59,177 పట్టుబడిన మద్యం నిన్న ఒక్కరోజు పట్టుబడిన మద్యం విలువ రూ.1,10,98,610 (మద్యం : 7998 లీ, 625 కిలోల నల్ల బెల్లం, 4 కిలోల అల్లం) అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మద్యం విలువ రూ.7,75,79,917 (మద్యం-52091 లీటర్లు, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల అల్లం) మత్తు పదార్థాలు నిన్న ఒక్కరోజు పట్టుబడిన పట్టుబడిన మత్తు పదార్థాలు రూ.1,60,43,125 (560 కిలోల గంజాయి) అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మత్తు పదార్థాలు రూ.4,58,04,720 (1694 కిలోల గంజాయి) పట్టుబడిన బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులు నిన్న ఒక్కరోజు పట్టుబడ్డ వాటి విలువ రూ.4,93,88,430 (8.110 కిలోల బంగారం & 29.08 కిలోల వెండి) అక్టోబరు 9 పట్టుబడిన వాటి విలువ 40,08,44,300 (72.267 కిలోల బంగారం & 429.107 కిలోల వెండి,- 42.203 క్యారట్ల వజ్రాలు) ఉచిత వస్తువులు నిన్న ఒక్కరోజు పట్టుపడ్డ వాటి విలువ రూ.1,61,02,900 (3900 కిలోల బియ్యం వగైరా) అక్టోబర్ 9 నుండి పట్టుబడ్డ వాటి విలువ రూ.6,29,04,500 ( 43700 కిలోల బియ్యం, 627 చీరలు, 80 కుట్టు యంత్రాలు, 87 కుక్కర్లు వగైరా) మొత్తం స్వాధీనాల విలువ నిన్న ఒక్కరోజు మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 21,84,92,242 ఇప్పటివరకు మొత్తం సీజ్ చేసిన వాటి విలువ రూ. 1,30,26,91,531 చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
ఎన్నికలకు పోలీసులు సిద్ధం
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తారని తెలిపారు. 10 డైనమిక్ చెక్పోస్ట్లు.. ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో 10 డైనమిక్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్పోస్ట్లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. వాహనాలకు జీపీఎస్, కెమెరాలు డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్ అధికారి నోడల్ ఆఫీసర్గా ఉంటారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులపై నిఘా.. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు
ముహమ్మద్ ఫసియొద్దీన్: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు. ఎవరైనా కోడ్ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్’ యాప్ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. విద్వేషాలు రెచ్చగొట్టరాదు... భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు. ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు. ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు. ఊరేగింపులు... ఊరేగింపుల రూట్ మ్యాప్ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి. ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. పోలింగ్ బూత్ల వద్ద.. ఓటర్లు మినహా పోలింగ్ బూత్లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్ కలిగిన వారికి మినహాయింపు. పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి. సభలకు ముందస్తు అనుమతి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలి. సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. స్వేచ్ఛగా ఓటు వేసేలా.. అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి. తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి. ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు. పోలింగ్బూత్ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు. అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు. పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి. -
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. లేదంటే కఠిన చర్యలుంటాయ్..!
సూర్యపేట్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై ఎస్ఎస్టీ, ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,201 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని, వాటిలో 152 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు చెప్పారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్లు పరిశీలించి ఓటర్లు, సిబ్బందికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార మాధ్యమాలతో పాటు బ్యాంకు ఖాతాలపై నిఘా పెంచాలని తెలిపారు. 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకునే సదుపాయంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్లో సిబ్బంది అక్రమ రవాణాలపై నిఘా పెంచాలన్నారు. ఇన్చార్జ్ ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రమణనాయక్, డీఎస్పీ ప్రకాష్, ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. రూ.50వేల వరకు మాత్రమే అనుమతి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులు రూ.50వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని కలెక్టర్ వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆమొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారని పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా ఎక్కువ నగదు పట్టుబడితే సంబంధిత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపి, నగదు విడుదలకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో నగదు తీసుకెళ్లాలని సూచించారు. అధికారులకు ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం, ఏటీఎం స్లిప్, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపారం సేవల నగదు అయితే లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. సీజ్ అయిన నగదు విషయంపై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్లో జిల్లా గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ సురేష్ నంబర్ 83745 66222, కమిటీ కన్వీనర్ డీసీఓ శ్రీధర్ నంబర్ 91001 15651ను సంప్రదించాలని కోరారు. -
తెలంగాణ డీఎస్సీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ శుక్రవారం(అక్టోబర్ 13న) నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 20 నుంచి 30వ తారీఖుల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. తాజా వాయిదాతో పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్ణయిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5 వేల 89 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే.. ఆ డీఎస్సీ ఎగ్జామ్ నవంబర్ 20 తారీఖు నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. -
నిరుద్యోగులకు నిరాశే...!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల ఆశలకు గండిపడింది. దాదాపు ఏడాదిన్నరగా ఉద్యోగాల కోసం చేసిన శ్రమకు ‘కోడ్’బ్రేకులు వేస్తుందేమోనని వారిలో నిరాశ నెలకొంది. ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నవంబర్ 3న ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనల తాలూకు పరీక్షల నిర్వహణ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణాలు, సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. పరీక్షలు సరే... ఫలితాల మాటేంటి? రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంతో భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే 38 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) దాదాపు 11 వేల ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) మరో 17 వేల ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంఎస్ఆర్బీ) 10 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. వీటితో పాటు ఇటీవల డీఎస్సీ ద్వారా 6 వేల టీచర్ ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడ్డాయి. డీఎస్సీ, గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి. పోలీసు నియామక ఫలితాల విడుదల దాదాపు పూర్తి కాగా... మెడికల్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనని వారు ఎదురు చూస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలను వదులుకుని ప్రభుత్వ కొలువులకు సన్నద్దమైన అభ్యర్థులకు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేలా లేదు. -
పట్టుకున్న నగదు, వస్తువులు రూ. 37 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినప్పటి నుంచీ పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తంగా 1,196 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. తనిఖీల కోసం 89 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 169 ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వివరించింది. ఇప్పటివరకు కమిషన్ నేతృత్వంలో సాగిన నిఘా, స్వాదీనాలు, కేసుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాల మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.20,43,38,375 నగదును, రూ.14,65,50,852 విలువైన బంగారం, వెండి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.86,92,533 విలువైన 31,730 లీటర్ల మద్యం, వెయ్యి కిలోల నల్లబెల్లం, 501 కిలోల అల్లం స్వాధీనం చేసుకున్నారు. రూ.89,02,825 విలువైన 310 కిలోల గంజాయిని తనిఖీల్లో పట్టుకున్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు తరలిస్తున్నారనే అనుమానంతో 7,040 కిలోల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22,51,963. మొత్తంగా నగదు, వస్తువులన్నీ కలిపి విలువ రూ.37,07,36,548 అని కమిషన్ గుర్తించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై 34,388 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ♦ గురువారం హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.33.55 లక్షలను, జూబ్లీహిల్స్లో మణిపూర్కు చెందిన మహిళ నుంచి రూ. 5.50 లక్షలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అబిడ్స్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షల నగదు, అమీర్పేటలో మరొకరి నుంచి రూ. 9.9 లక్షలను, మియాపూర్లో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 448.96 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ♦ నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురంలో చేపట్టిన వాహన తనిఖీల సందర్భంగా ఎలాంటి పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు. ♦ మేడిపల్లి పోలీసులు నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద వాహన తనిఖీల్లో రూ.13.50 లక్షలు, హబీబ్నగర్ పోలీసులు సీతారామ్భాగ్ ఎక్స్ రోడ్డులో ఓ వ్యక్తి నుండి రూ.6.95 లక్షలు నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. లైసెన్స్డ్ తుపాకులు రద్దు!
యాదాద్రి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు (గన్స్) పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల నుంచి పోలీస్ శాఖ ఆయుధాలను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు వారందరికి నోటీసులు జారీచేసింది. నోటీసు అందిన వారం రోజుల్లోగా తమ వద్ద ఉన్న తుపాకులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందజేయాలని స్పష్టం చేసింది. దీంతో లైసెన్స్డ్ తుపాకీలు కలిగిన వారంతా పోలీసు స్టేషన్ల బాటపట్టారు. ఉమ్మడి జిల్లాలో 455 మంది లైసెన్స్ తుపాకులు తీసుకున్న వారు ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే. ఆ తరువాత బడా వ్యాపారులు ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలో 227 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో దాదాపుగా ఇప్పటికే పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 154 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, 110 మంది ఇప్పటికే తిరిగి అప్పగించారు. యాదాద్రి జిల్లాలో 74 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో కొంతమంది తిరిగి అప్పగించారు. మిగతా వారు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నాయకులు ఉన్నారు. తగ్గిన లైసెన్స్డ్ గన్లు నల్లగొండ జిల్లాలో గన్ కల్చర్ కొంత మేర తగ్గింది. గతంలో భారీ సంఖ్యలో వ్యక్తిగత తుపాకులు కలి గిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణ భయంతో వ్యక్తిగత భద్రత కోసం గన్ లైసెన్స్లను ఎక్కువ మంది తీసుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 వరకు వ్యక్తిగత ఆయుధాలను సమకూర్చుకోగా, ఇప్పుడు వారి సంఖ్య 455కు తగ్గిపోయింది. గత ఎన్నికల సమయంతో పోల్చితే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు మినహా నల్లగొండలో ఈ ఐదేళ్లలో గన్ లైసెన్స్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. 2018 ఎన్నికల సమయంలో నల్లగొండలో 257 మంది లైసెన్స్డ్ గన్స్ కలిగిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 227కు తగ్గింది. దుర్వినియోగం చేయవద్దనే.. ఎన్నికల సమయంలో, సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు తారసపడినప్పుడు వాటిని దుర్వినియోగం చేసే అవకాశాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధన తీసుకువచ్చింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎవరూ వ్యక్తిగతంగా భయబ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న గన్లను పోలీసు స్టేషన్లలో అప్పగించేలా నిబంధన విధించింది. వీటికి మినహాయింపు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్న సమయంలో గన్స్ పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయడంలో కొన్ని విభాగాలను మినహాయించారు. ముఖ్యంగా బ్యాంకుల సెక్యూరిటీ, టోల్ ప్లాజాలు, క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్లో ఉన్న వాటిని డిపాజిట్ చేయడం నుంచి మినహాయించారు. -
TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నా సమయంలో వెలువడింది. ఈసీ ప్రకటన చేశాక.. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆరోజు సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, బంగారం, మద్యం.. ఇతరాలను సీజ్ చేయడం ప్రారంభించారు పోలీసులు. గురువారం సాయంత్రం దాకా.. అంటే ఈ మూడు రోజుల్లో సీజ్, కేసుల వివరాలు పరిశీలిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు(కేవలం) : రు. 20,43, 38, 375 అక్రమ సరఫరాలద్వారా పట్టుబడిన మద్యం స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రు. 86,92,533 స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రు. 89,02,825 స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ రు 14,65,50,852. మొత్తం ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం విలువ రు.22,51,963 (ల్యాప్టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైనవి) నేరారోపణకు గురయిన వారు - 1196 మంది సరిహద్దు చెక్ పోస్టులు ►అంతర్ రాష్ట్ర సరిహద్దులు: 89. ►ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు: 169 ►ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు 34,338. ►ప్రజల ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132. ►ప్రైవేటు ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు : 11,434 ►ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు: 7,322. వారం తర్వాత కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించింది కేంద్రం. అక్టోబర్ 20నాటికి ఈ బలగాలు తెలంగాణ అంతటా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి. -
తెలంగాణలోనే ఖరీదైన ఎన్నికలు..! రసవత్తరంగా సిర్పూర్ పాలిటిక్స్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించడంతో పోలీస్శాఖ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కౌటాల(సిర్పూర్): కుమురంభీం జిల్లాకు ఓ వైపు మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. మరో వైపు ఆదిలా బాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. గతంలో సిర్పూర్లో మవోయిస్టుల దాడులతో ఎన్నికలు నిలిపివేసిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పా ల్వాయి పురుషోత్తంను కాగజ్నగర్ పట్టణంలోని తన కార్యాలయంలోనే మవోయిస్టులు కాల్చి చంపి న ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. జి ల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. అడపాదడపా మవోయిస్టు సానుభూతిపరులంటూ పో లీసులు కొందరిని పట్టుకుని కేసులు నమోదు చే స్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల వేళా ఎలాంటి అలజడులు లేకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్పోస్టుల వద్ద తనిఖీలను ప్రారంభించారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఖరీదైన ఎన్నికలు..! పార్లమెంట్, అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీటీసీ, మున్సి పల్, కార్పొరేషన్.. ఇలా ప్రతీ ఎలక్షన్ ఖరీదైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వీటికి మినహాయింపు ఏమీ కాదు. డబ్బులు పంచడం ఏ స్థాయికి చేరిదంటే.. ‘మాకు నోట్లు అందలేదంటూ..’ కొంతమంది ఓటర్లు బహిరంగంగానే రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళనకు దిగే వరకు వెళ్లింది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఈసారి మరింత ఖరీదైనవిగా చరిత్రలో నిలుస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే కాస్ట్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పోలీస్శాఖ, ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో టాప్ టెన్ కాస్ట్లీ ఎన్నిక సెగ్మెంట్లను గుర్తించగా.. అందులో ఆశ్చర్యకరంగా సిర్పూర్ నియోజకవర్గం సైతం ఉండడం గమనార్హం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇక్కడి నుంచే బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. చెక్పోస్టులు ప్రారంభం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ అవుతుండగా, అదే నెల 30న పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,47,634 మంది ఓటర్లు ఉండగా 597 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74 సమస్యాత్మక కేంద్రాలు, 46 మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాంకిడి, సిర్పూర్(టి)లోని హుడ్కిలి, వెంకటాపూర్, చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, రెబ్బెన, తాండూర్ మధ్య, దహెగాంలోని కల్వాడ, జైనూర్లో అంతర్ జిల్లా చెక్పోస్టులను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా వాహనాల రాకపోకలపై నిఘా ఉంచి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. -
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలి
కొత్తగూడెం: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున పటిష్ట పర్యవేక్షణ జరగాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, సీ – విజిల్ యాప్నకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్లు, సమస్యాత్మక ప్రాంతాలకు మ్యాపింగ్ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే సమీప పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. లైసెన్స్డ్ పిస్టళ్లను పోలీస్ శాఖకు సరెండర్ చేయాలని, లేదంటే రద్దుచేస్తామని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతిలేదని చెప్పారు. నగదుతో రవాణా చేసే వారు తగిన ఆధారాలు చూపించకుంటే సీజ్ చేస్తామని తెలిపారు. ఆ నగదు విడుదలకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఉంటుందని, పరిశీలన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని, తప్పుడు సమాచారంతో పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్, డీఎఫ్ఓ కిష్టగౌడ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డీఆర్ఓ రవీంద్రనాథ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారుల నియామకం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. మ్యాన్పవర్ మేనేజ్మెంట్కు నోడల్ అధికారులు(ఎన్ఓ)గా డీఈఓ వెంకటాచారి, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ కె. మహేశ్వరరావు, కోఆర్డినేటర్గా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు వ్యవహరిస్తారని తెలిపారు. ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఎన్ఓగా సీపీఓ శ్రీనివాసరావు, కోఆర్డినేటింగ్, మాస్టర్ ట్రైనర్లుగా డీఈఓ కార్యాలయ ఏపీఓ కిరణ్కుమార్, పి సాయికృష్ణ వ్యవహరిస్తారని, మెటీరియల్ మేనేజ్మెంట్ ఎన్ఓగా భూగర్భ జల శాఖాధికారి ఎం.బాలు కోఆర్డినేటింగ్ అధికారిగా డీఏఓ అభిమన్యుడు ఉంటారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్కు ఎన్ఓగా ఎంవీఐ జైపాల్రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ఆర్టీఓ పి.వేణు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డీఎంలు వ్యవహరిస్తారు. కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీకి ఎన్ఓగా డీఐ సీహెచ్ సంపత్, స్వీప్ ఎన్ఓగా సివిల్ సప్లై డీఎం త్రినాథ్బాబు, కో ఆర్డినేటర్గా డీఆర్డీఓ మధుసూదన్రాజు ఉంటారు. ఈవీఎం మేనేజ్మెంట్ ఎన్ఓగా అదనపు కలెక్టర్ పి.రాంబాబు వ్యవహరిస్తారు. ఎంసీసీ ఎన్ఓగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, కో ఆర్డినేటర్లుగా సీఈఓ విద్యాలత, డీఎల్పీఓ పవన్ ఉంటారని కలెక్టర్ వివరించారు. -
ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్.. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి..
ఖమ్మం: ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్ ఉంది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా, ఈసారి మరింత పెరిగేలా అవగాహన కల్పిస్తున్నాం... అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీ.పీ. గౌతమ్ తెలిపారు. సీపీ విష్ణు ఎస్.వారియర్తో కలిసి ఆయన జెడ్పీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లోని రాజకీయ నేతల ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగు కప్పడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాల నిర్వహణ, సొంత ఖర్చులతో హోర్డింగ్స్ పెట్టుకోవాలనుకునే వారు మున్సిపాలిటీల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఖమ్మంకు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వైరాకు అదనపు కలెక్టర్, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీఓ, మధిరకు ఖమ్మం ఆర్డీఓ, పాలేరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ఓలుగా వ్యవహరిస్తారని చెప్పారు. డబ్బు, మద్యం పంపకంపై సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కాగా, కొత్త కోడళ్లు తమ పుట్టింటి నుంచి ఓటు హక్కును అత్తింటి వద్దకు మార్చుకోవడానికి ఫామ్–18ను దరఖాస్తు చేసుకోవాలని, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసుకునే హక్కు ఉందని చెప్పారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఐదు మోడల్పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. జింకలతండా గోదాంలో లెక్కింపు వచ్చేనెల 30న పోలింగ్ ముగిశాక ఈవీఎంలను రఘునాథపాలెం మండలం జింకలతండాలోని గోడౌన్కు తరలిస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలో గతంతో పోలిస్తే 63 పోలింగ్కేంద్రాలు పెరగగా, ఓటర్లకు ఇబ్బంది రాకుండా అన్ని ఆవాసాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ సోమవారం జిల్లావ్యాప్తంగా రూ.53 లక్షలు సీజ్ చేసి 17 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో 10 వేల మందిని బైండోవర్ చేయగా, ఈసారి వారంలోగా ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఇక జిల్లాలో 131 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. 128 మంది వద్ద తుపాకులు ఉన్నాయని చెప్పారు. వీరిలో బ్యాంక్ లైసెన్స్దారులు మినహా మిగతా వారు డిపాజిట్ చేయాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో 390 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు. కొత్త జాబితాలో తొలగింపులు ఉండవు.. ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు తప్పక పాటించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సీపీ వారియర్తో కలిసి సమావేశమైన ఆయన మాట్లాడారు. కొత్తగా ఓటరు జాబితాలో తొలగింపులకు అవకాశం లేకపోగా, అర్హులు ఉంటే పేర్ల నమోదుకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యయ పర్యవేక్షణ అమలు కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అనుమానాస్పద లావాదేవీలపై రిటర్నింగ్ అధికారులకు బ్యాంకర్లు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైన్స్లో అమ్మకాలకు సంబంధించి గత మూడు నెలల నివేదిక సేకరించాలన్నారు. ఎంసీఎంసీ ప్రారంభం.. కలెక్టరేట్లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ – మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) సెల్ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ ప్రారంభించారు. ఎన్నికల సంబంధ వార్తలపై నిఘా వేయడమే కాక ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు ఏర్పాటుచేసిన ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో 15 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 ఎంసీసీ, 15 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటుచేశామని, ఈ బృందాలు షిఫ్ట్ల వారీగా 24గంటలు పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, వ్యయ పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి సాయికుమార్, డీటీఓ కిషన్రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి, డీసీఓ విజయకుమారి, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, ఏసీపీ గణేష్, డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ ఏ.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, డీపీఆర్వో ఎం.ఏ.గౌస్, ఏపీఆర్వో వి.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1950, 90632 11298 నంబర్లతో కంట్రోల్రూం ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ పరిశీలించారు. ఏ ఫిర్యాదు ఏ అధికారికి అందజేయాలో చార్జ్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఫిర్యాదులను 1950, 90632 11298 నంబర్లకు ఇచ్చేలా ప్రచారం చేయాలని తెలిపారు. -
సరిహద్దులపై పోలీస్ ఫోకస్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తం 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అవి హైదరాబాద్ రూట్లో రేణికుంట టోల్ప్లాజా, పెద్దపల్లి మార్గంలో మొగ్దుంపూర్, జమ్మికుంట వైపు సిరిసే డు, వరంగల్ రూట్లో పరకాల ఎక్స్రోడ్ వద్ద, మంచిర్యాల రూట్లో చొప్పదండి ఆర్నకొండ వద్ద ఉన్నాయి. ఒక్కో చెక్పోస్టులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఎకై ్సజ్ శాఖ నుంచి ఒకరు, అటవీశాఖ నుంచి ఒకరు, రవాణా శాఖ నుంచి ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేల డబ్బులు, మద్యం, ఇతరత్రాలను కట్టడి చేసేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం హుజూరాబాద్శివారులోని కేసీక్యాంపు, ఇల్లందకుంట మండలం సరిసేడు, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్నకొండ చెక్పోస్టును రూరల్ ఏసీపీ కరుణాకర్రావు తనిఖీ చేశారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యం నగదు, బంగారం తీసుకెళ్లేవారు రశీదులు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, ఎలాంటి ఆధా రాలు లేని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన ఆయుధాలపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. గన్స్ను సమీపంలోని పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని తెలిపారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రూ.1.50 లక్షలు సీజ్ కరీంనగర్ టూటౌన్ పరిధిలోని తెలంగాణచౌక్ వద్ద మంగళవారం బైక్పై వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.1.5 లక్షలు సీజ్ చేశారు. 10మంది పాతనేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. త్రీటౌన్ పరిధిలోని కాపువాడలో ఓ బెల్ట్షాపులో 23 మద్యం బాటిళ్లు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లిలో ఓ బెల్టుషాపు నుంచి రూ.3,800 విలువ చేసే మద్యం సీజ్ చేశారు. వీణవంక మండలంలో 13మందిని తహసీల్దార్ తిరుమల్రావు ఎదుట భైండోవర్ చేసినట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని ఓ బెల్టుషాపులో మద్యంబాటిళ్లను సీజ్ చేశారు. -
స్వేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు
నిర్మల్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమష్టిగా పని చేయాలని ఎస్పీ ప్రవీణ్కుమార్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కిషోర్కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్పటిల్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. కోడ్ దాటొద్దు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే కోడ్ అమలులోకి వచ్చిందని కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరూ నియమావళిని దాటొద్దని హెచ్చరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పోస్టర్లు, చిహ్నాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 922 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవంబర్ 30న ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. చునావ్ గ్రామసభ, సెల్ఫీ విత్ పోలింగ్ స్టేషన్ వంటి వినూత్న కార్యక్రమాలనూ నిర్వహిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల ఓటు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. ఓటు నమోదు చేసుకోవచ్చు.. జిల్లాలో 7,11,190మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించామన్నారు. ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు ఈనెల 31లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. పెద్ద క్యూలైన్లు లేకుండా.. ఈసారి ఎన్నికలకు పెద్ద క్యూలైన్లు లేకుండా ప్రశాంతంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 1,500 దాటకుండా ఓటర్లు ఉండేలా చూస్తున్నామన్నారు. ఓటరుకు కేవలం 2కి.మీ. లోపే పోలింగ్ కేంద్రం ఉంటుందని చెప్పారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు. తొలిసారి ఎన్నికల కమిషన్ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచి ఓటువేసే ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. ఇలా ఓటు వేసేవారికి బీఎల్ఓలు ఫామ్–12డి ఇస్తారని, దీన్ని నవంబర్ 8లోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పంపించవచ్చని చెప్పారు. దివ్యాంగులు ఈ ఫామ్తోపాటు సదరం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు ఎలక్ట్రానిక్/పోస్టల్ ఓటు వినియోగించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. రూ.50 వేల లోపే అనుమతి.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్కుమార్ కోరారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా ఎన్నికలు పూర్తిచేద్దామన్నారు. కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచే జిల్లాలో సరిహద్దుల్లో ఐదుచోట్ల, అంతర్గతంగా ఐదుచోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మద్యం, డబ్బు, మత్తుపదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగదు కేవలం రూ.50 వేలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్తే స్వాధీనం చేసుకుని గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. సరైన లెక్కలు లేకపోతే ఆ డబ్బు ఐటీ అధికారులు జప్తు చేసుకుంటారని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు సంబంధిత పత్రాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతిస్తారని చెప్పారు. గన్లైసెన్స్ ఉన్నవారు ఆయుధాలను సమీప పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని తెలిపారు. రౌడీషీట్, కమ్యూనల్ కేసులు ఉన్నవారిని బైండోవర్ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 17 మావోయిస్టు ప్రభావి త ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. ఇక కనీసం సిగ్నల్ వ్యవస్థలేని 10 షాడో జోన్లో ఉన్నవాటికి శాటిలైట్ ఫోన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీ–విజిల్, డయల్ 100, కంట్రోల్రూం నంబర్లను ఉపయోగించుకుని పారదర్శక ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ కోరారు. -
రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. రాజధాని పరిధిలో... బషీర్బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీ ల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని చైతన్యపురి పరిధిలో బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్నగర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా లాల్పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాదీనం. షేక్పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాదీనం. వివిధ జిల్లాల్లోనూ... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి బీడీఎల్ చౌరస్తా వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 9,38,970తో పాటు గాయత్రి ఆస్పత్రి వద్ద తనిఖీల్లో మరో కారులో తరలిస్తున్న రూ.71,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డికి చెందిన నగేష్ నుంచి రూ.7 లక్షలతోపాటు షాద్నగర్లోని జీహెచ్ఆర్ కాలనీకి చెందిన అశోక్ బైక్పై తీసుకెళ్తున్న రూ. 11.50 లక్షలను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వద్ద తనిఖీల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన వ్యాపారి కారులో తరలిస్తున్న రూ. 5.40 లక్షల నగదును స్వా«దీనం చేసుకొన్నారు. ఏపీకి చెందిన వారి నుంచి వైరాలోని చెక్పోస్టు వద్ద రూ.5లక్షలు, తల్లాడ సూపర్ మార్కెట్ యజమాని కొత్తూరి సైదకుమార్ రూ. 5 లక్షలను సీజ్ చేశారు. మధిర వద్ద తనిఖీల్లో కోనా గోపాలరావు అనే వ్యక్తి నుంచి రూ.12.65 లక్షలను సీజ్ చేశారు. -
ఎన్నికల కోడ్లోకి అమిత్ షా సభ
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రాను న్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ఇటీవలే అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన ఖరారవగా ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సభ ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ టూర్ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎన్నికల కోసం ఇలా.. సిద్థంగా వున్నాము..
జిల్లాలో 1,338 పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్–14 టీంలు, స్టాటిస్టిక్ సర్వైలైన్స్–14 టీంలు,వీడియో సర్వైలైన్స్ టీంలు–09, వీడియో వీవింగ్ 05,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 19 టీంలు కరీంనగర్: ఎన్నికల కోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిర్వహణలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ బి.గోపి వెల్లడించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఐజీ రమేశ్నాయుడు, సీపీ సుబ్బారాయుడుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 2,807 బ్యాలెట్ యూనిట్ లు, 2,222 కంట్రోల్ యూనిట్ లు, 2,187 వివి పాట్ లు సిద్ధంగా ఉంచాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను సి–విజిల్యాప్ ద్వారా చేయొచ్చని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను కంట్రోల్ రూమ్కు 1950కు 24 గంటలపాటు ఫిర్యాదు చేయొచ్చన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారానికి సంబంధించిన ప్రభుత్వ, రాజకీయ ప్రకటనల తొలగింపు ప్రారంభమైందని ప్రభుత్వ పరిధిలోని ఆస్తులపై 24 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాటిని 48 గంటల్లో ... ప్రైవేటు ఆస్తులపై ఉన్న యాడ్స్ను 72 గంటల్లో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్నాయని.. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేయాల్సి వస్తే.. డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఐటీ, ఎక్సైజ్, ఫారెస్ట్, జీఎస్టీ, ఆర్టీవో డిపార్ట్మెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ఒకవేళ ఎలాంటి నగదు సీజ్ చేసినా.. డీఆర్డీవో నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వాటిని పరిశీలించి చర్యలు చేపడుతుందని వివరించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ–సువిధ యాప్ ద్వారా పర్మిషన్ల కోసం్ల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మీడియా ప్రసారాలు, వార్తా కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వాటిని అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరువ్యవహరించినా వారిపై కేసులు నమోదు చేస్తాం అని స్పష్టంచేశారు. జిల్లాలో తనిఖీల కోసం ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సుబ్బారాయుడు చెప్పారు. ఇందులో మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయన్నారు. ఎన్నికలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో చేసుకుంటామని తెలిపారు. అక్రమ ఆయుధాలు, లైసెన్స్డ్ ఆయుధాలు వెంటనే సరెండర్ చేయాలని ఆయన ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
ఎలక్షన్ కోడ్.. భారీ ఎత్తున గోల్డ్, నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే.. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీంతో.. రాషష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి.. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా నగదు.. బంగారం పట్టివేత.. ►చాదర్ఘాట్లో రూ.10 లక్షల నగదు స్వాధీనం ►శంకర్పల్లిలో రూ.80 లక్షల నగదు స్వాధీనం ►చందానగర్లో ఆరు కేజీల బంగారం పట్టివేత ► ఫిల్మ్ నగర్లో రూ.30 లక్షల నగదు పట్టుకున్న పోలీసులు ► సౌత్ వెస్ట్, సౌత్ జోన్లలో.. రూ. 25 లక్షల దాకా హవాలా నగదు పట్టివేత ► బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండి సీజ్ చేశారు అబిడ్స్ పోలీసులు. బంగారం 16 కేజీల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి విలువ రూ.10 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలోనే దీనిని పట్టుకున్నారు. ► వనస్థలిపురంలో.. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జరిగిన వాహన తనిఖీల్లో రూ. 4 లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు ► శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. పరిమితికి మించి డబ్బుతో వెళ్లడం, మద్యం రవాణా మీద దృష్టిసారించింది. ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న కార్లు, బైకులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్న పోలీసులు. రూ.50 వేలకు మించి నగదుతో వెళ్తే.. దానికి సంబంధించిన పత్రాలు, రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. డబ్బు మాత్రమే కాదు.. ఆభరణాలకు ఇది వర్తించనుంది. ► ఖమ్మం జిల్లాలో 9 లక్షల 80 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి లో 5 లక్షలు,కల్లూరు లో 4 లక్షల 80 వేల నగదును పట్టుకుని సీజ్ చేశారు. కొణిజర్ల మండల కేంద్రంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో.. కల్లూరు వైపు వెళ్తున్న ఓ కారు నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు లక్షల నలభై వేల నగదును పట్టుకున్నారు. ► కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ బస్ స్టాప్ దగ్గర పోలీసుల తనిఖీల్లో ఓ వాహనంలో తీసుకెళ్తున్న మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. -
Karnataka Assembly elections 2023: కర్ణాటకలో ఐటీ దాడులు..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా సొత్తు బయటపడింది. రూ.15.3 కోట్ల నగదుతోపాటు రూ.7.08 కోట్ల విలువైన 10.14 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు ఐటీ సీఈవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.365 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని పేర్కొంది. -
రూ.4,411.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24కి) తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రూ.4,411.68 కోట్ల బడ్జెట్ను ఫిబ్రవరి 15న జరిగిన పాలకమండలి సమావేశం ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అప్పుడు ఈ వివరాలు వెల్లడించలేదని తెలిపారు. తిరుమలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ప్రజలంతా, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గతనెలలో జరిగిన పాలకమండలి సమావేశంలో కొన్ని పాలనపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్ఈ జగదీశ్వర్రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు.. ♦ వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. ♦ కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్కు ముందు ఏడాదికి రూ.1,200 కోట్ల కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. ♦ భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్లో జారీచేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తిచేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ♦ అలిపిరి నుంచి వకుళమాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం. ♦ ఏప్రిల్ 5వ తేదీన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పి స్తారు. ♦ వేసవిలో మూడునెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల సిఫారసులు బాగా తగ్గించాలని కోరుతున్నాం. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం. ♦ తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ.5.25 కోట్లు మంజూరు చేశాం. ♦తమిళనాడు రాష్ట్రం ఊలందూరుపేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించాం. ♦ తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల పడమర వైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునికీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ.4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం. ♦ శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.990 కోట్లకు వడ్డీ ఆదాయం టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా పెద్ద ఎత్తున వడ్డీ ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం మరో రూ.177 కోట్లు పెరిగి మొత్తం రూ.990 కోట్లు వస్తాయని పేర్కొంది. హుండీ ద్వారా రూ.1,591 కోట్ల రాబడి అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,591 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో టీటీడీ అంచనా వేసింది. 2022–23 బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ రూ.1,315.28 కోట్ల మేర పెరిగింది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పందసేవ సిబ్బంది జీతాలకు రూ.1,532 కోట్లు వెచ్చించనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.690.50 కోట్లు కేటాయించారు. కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.600 కోట్లు వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నిల్వ రూ.291.85 కోట్లుగా అంచనా వేశారు. ఇటీవల కొన్ని వసతి గదులు, కల్యాణమండపాల అద్దె పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వీటిద్వారా ప్రస్తుత సంవత్సరం రూ.118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. -
10 నుంచి రాగి జావ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ త్వరలో ముగియనుండటంతో కొద్ది రోజులుగా నిలిచిపోయిన పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం తన కార్యాలయ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి, ఏప్రిల్ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించి అమలు తేదీలను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్తో సంబంధం లేనందున మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ అమలును ప్రారంభించాలని నిర్ణయించారు. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగి జావను చేర్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఏప్రిల్ 6 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ట్రయల్ రన్ ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. బీఏసీ సమావేశంలో చర్చించి సమావేశాల షెడ్యూలును ఖరారు చేయనున్నారు. మార్చి, ఏప్రిల్లో షెడ్యూల్ ఇలా.. మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ. మార్చి 22న ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందించిన వలంటీర్ల పేర్ల ప్రకటన. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ప్రదానం. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం. మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం మార్చి 31న జగనన్న వసతి దీవెన. ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం. ఏప్రిల్ 10న ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సన్మానం -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి
మధురవాడ (భీమిలి): తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మధురవాడలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆ పార్టీ మద్దతు అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, ఆయన అనుచరులు చంద్రపాలెం పాఠశాలలోకి టీడీపీ జెండాలు కట్టిన నాలుగు వాహనాలతో ప్రవేశించారు. అంతటితో ఆగకుండా స్టాఫ్ రూమ్లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పాఠశాల పని వేళల్లో గొలగాని సన్యాసిరావు, గొల్లంగి ఆనందబాబు తదితరులు టీడీపీ టీ షర్టులు, కండువాలు వేసుకుని ప్రవేశించి ప్రచారం నిర్వహించారు. -
ఈసీపై ఎన్నదగిన తీర్పు
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం, వాటికి విశ్వసనీయత కల్పించటం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అత్యంత కీలకం. ఈ కర్తవ్యనిర్వహణలో తలమునకలు కావాల్సిన ఎన్నికల సంఘం(ఈసీ) స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ పని పూర్తిచేస్తున్నదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తే విశ్వస నీయత దానంతటదే ఏర్పడుతుంది. అందుకే ఎన్నికల సంఘం కూర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ప్రకారం ఇకపై ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే త్రిసభ్య కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను ఖరారు చేయాల్సివుంటుంది. ఇంతవరకూ అనుసరిస్తున్న విధానం వేరు. కేంద్ర పాలకుల ఇష్టారాజ్యంగా ఆ నియమాకాలుంటున్నాయి. ఎన్నికల సంఘం విధులు, అధికారాల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. విస్తృతాధికారాలుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని, అందుకు అనుగుణమైన అధికారాలు దానికుండాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, అవసరమైన మార్గదర్శకాల ఖరారు కోసం ఎన్నికల సంఘం ఉండాలని రాజ్యాంగంలోని 324 అధికరణ మొదలుకొని 329వ అధికరణ వరకూ నిర్దేశిస్తున్నాయి. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను ఏవిధంగా ఎంపిక చేయాలన్న అంశంలో రాజ్యాంగం ఏమీ చెప్పలేదు. ఈ అధికరణలపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగి నప్పుడు ఎంపిక ప్రక్రియను పార్లమెంటుకే విడిచిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిర్దిష్టంగా ఉండే నిబంధనలకే తూట్లుపొడవటం అలవాటైన దేశంలో స్పష్టత కొరవడితే చెప్పేదేముంది? ఇది సహజంగానే అధికారంలో ఉండేవారికి వరమైంది. తమకు అనుకూలురైనవారిని ఆ సంఘంలో నియమించటం ఒక సంప్రదాయంగా స్థిరపడింది. అందువల్లే ఎన్నికలు ముంచుకొచ్చినపుడల్లా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు రివాజుగా మారాయి. ఎన్నికలు ప్రకటించటం దగ్గర్నుంచి ఎన్నికల తేదీల ఖరారు, ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. పార దర్శకత లోపించటమే ఇందుకు కారణం. గడువు పూర్తయిన రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి మాత్రమే ఎన్నికల ప్రకటన వెలువరించి, మరో రాష్ట్రం గురించి మౌనం పాటించారన్న విమర్శలు ఒకపక్క... ప్రచారసభల్లో అవతలి పార్టీ నేతలు ఏం మాట్లాడినా మౌనంవహిస్తూ తమపై మాత్రం దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మరోపక్క తరచు ఈసీ ఎదుర్కొనాల్సివస్తోంది. కొన్ని సందర్భాల్లో అదిచ్చే వివరణలు అసంబద్ధంగా ఉండటం కూడా కనబడుతూనే ఉంది. కేంద్రంలోని పాలకపక్షం తన విధేయులను ఎన్నికల సంఘంలో నియమించటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపించటం కూడా మామూలే. యూపీఏ పాలనలో ప్రధానంగా బీజేపీనుంచి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే ఇప్పుడు బీజేపీయేతర పక్షాలు ఆ పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు అధికారంలోకొచ్చినా కమిషనర్ల ఎంపిక ప్రక్రియ మార్చాలన్న ఆలోచనకే దూరంగా ఉంటున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే అది తమకే గుదిబండవుతుందని, తమ పాచికలు పారవని భావిస్తున్నారు. వాస్తవానికి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ఎన్నికల సంఘం కూర్పు, ఎన్నికల సంస్కరణల గురించి లోతుగా పరిశీలించి నివేదిక ఇచ్చింది. కమిషనర్ల ఎంపికకు ఒక ప్రత్యేక కమిటీ ఉండాలని సూచించింది. కానీ ఇంతవరకూ దాని ఊసే లేదు. ఎన్నికల సంఘం తటస్థ పాత్ర పోషిస్తున్నదని పార్టీలకు పూర్తి నమ్మకం కుదిరినప్పుడే ఆ ఎన్ని కలపై ప్రజానీకంలో కూడా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం తాను సర్వస్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నానన్న భరోసా అందరిలోనూ కలగజేస్తే మెజారిటీ ప్రజానీకం నిర్భయంగా ఓటేయగలుగుతారు. మొదట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఒక్కరే ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యంవహిస్తే 1987 నాటి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో అప్పటి సీఈసీ ఆర్వీఎస్ పేరిశాస్త్రి వ్యవహరించిన తీరుతో ఆందో ళనపడ్డ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1989 లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీని ఇద్దరు సభ్యుల కమి షన్గా మార్చారు. కానీ ఎన్నికల అనంతరం వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని తిరగదోడింది. ఆ తర్వాత పదవి కోల్పోయిన కమిషనర్ ధనోవా సుప్రీంకోర్టుకెళ్లినా లాభం లేక పోయింది. తదనంతరకాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం అప్పటి సీఈసీ శేషన్ దూకుడు చూసి కీడు శంకించి త్రిసభ్య కమిషన్గా దాన్ని మార్చింది. కొత్తగా ఎంఎస్ గిల్, జీవీజీ కృష్ణ మూర్తిలను తీసుకుంది. ఎన్నికల సంఘం చట్టాన్ని సవరించి ముగ్గురికీ ఒకే రకమైన అధికారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించారు. అయితే అంతా మారినట్టేనా? లేదని ఇన్ని దశాబ్దాల అనుభవాలు పదే పదే నిరూపించాయి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈసీకి నిందలు తప్పటం లేదు. నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత కూడా అంతంతమాత్రం. సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే ప్రభుత్వాలు దీన్ని గ్రహిస్తే బాగుండేది. కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై కొత్త చట్టం తీసుకు రావాలని, అంతవరకూ తమ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తాజాగా ధర్మాసనం ప్రకటిం చింది. ఈ తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టం తీసుకొస్తుందని, ఇకపై ఎన్నికల సంఘం తటస్థత విషయంలో అనుమానాలకూ, అపోహలకూ ఆస్కారం ఉండదని ఆశించాలి. -
రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నారా లోకేష్
సాక్షి, తిరుపతి: రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను నారా లోకేష్ ఉల్లంఘించారు. పార్టీ జెండాలను తొలగిస్తున్న వీఆర్వో, వీఆర్ఏ, డిప్యూటీ తహశీల్దార్పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఐడీ కార్డులు చూపించాలంటూ అధికారులపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. సీఐ ఆరోహణరావును అసభ్య పదజాలంతో లోకేష్ దూషించారు. పాదయాత్రలో బయట నుంచి వచ్చిన గూండాలతో దౌర్జన్యానికి తెర తీశారు. కాగా, నారా లోకేశ్ బుధవారం కూడా బెదిరింపులకు దిగారు. ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ లోకేష్ నోరు పారేసుకున్నారు. చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ -
చంద్రబాబు పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు అవుతోంది. అయితే.. బుధవారం రాత్రి జగ్గంపేట బస్టాండ్ సెంటర్లో చంద్రబాబు రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహించారు. ఒకవైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. అక్కడే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహన్ని ఆవిష్కరించి దండ వేశారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. దీంతో.. ఎన్నికల పరిశీలకుల ఫిర్యాదు మేరకు నవీన్ పై జగ్గంపేట పోలీస్స్టేషన్లో సెక్షన్ 188 IPC క్రింద కేసు నమోదు అయ్యింది. -
రామ్పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఓటర్లను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలించి ప్రమాణం చేయించడంపై ఎన్నికల కోడ్ ప్రత్యేక బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన సుమారు 700 మందిని యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా 15 ఆర్టీసీ బస్సుల్లో ఆ గ్రామ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు. ఓటర్లను తీసుకొనిపోయి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి, ఆలయంలో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించారని పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఫొటోలు, వీడియోగ్రఫీ సాక్ష్యాల ఆధారంగా టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారానికైన వ్యయాన్ని మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఎన్నికల ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. -
Munugode Bypoll: నల్లగొండ, యాదాద్రిలో ఎన్నికల కోడ్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల్లోనూ ఇది అమల్లో ఉండనుందని నల్లగొండ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగకుండా చూడాలని ఎస్పీ రెమా రాజేశ్వరికి లేఖ రాశారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి రాతలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని పేర్కొన్నారు. నవంబర్ 8న ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు. చండూరులో నామినేషన్ల స్వీకరణ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 7వ తేదీన ప్రారంభం కానుంది. చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15వ తేదీన ఉప సంహరణలు ఉంటాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఏఎంఆర్పీ) జగన్నాథరావు పేరునే ప్రతిపాదించారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారిగా కొనసాగనున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కోసం చండూరు డాన్బాస్కో స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంలను ఆర్జాలబావిలోని గోడౌన్కు తరలించనున్నారు. కౌంటింగ్ కూడా ఆర్జాలబావిలోనే నిర్వహిస్తారు. అదనపు కలెక్టర్ సమీక్ష జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్రావు సోమవారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఈఆర్ఓ జగన్నాథరావు, ఎన్నికల విభాగం అధికారులతో కోడ్ అమలుపై ఆయన సమీక్షించారు. ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన వీడియోగ్రఫీపై సూచనలు చేశారు. -
తిరుపతి కోర్టుకు నటులు మోహన్బాబు, విష్ణు, మనోజ్
సాక్షి, తిరుపతి: నటుడు మంచు మోహన్బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో 2019లో అప్పటి ప్రభుత్వం మోహన్బాబుపై కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 2019లో మదనపల్లి హైవేపై మోహన్బాబు ఫ్యామిలీ ఆందోళన చేసింది. దీంతో ఆరోజు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది. చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని) -
సీఎం కోడ్ ఉల్లంఘన? ఆయన భార్య ఏమన్నారంటే..
పోలింగ్ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలు తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన భార్య వెనకేసుకొచ్చిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి తన నియోజకవర్గం ఖతిమాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వేయడానికి వెళ్లిన టైంలో.. బీజేపీ కాషాయపు కండువాలు మెడలో ధరించి ఉన్నారు. అంతేకాదు దుస్తులపై కమలం గుర్తులు కూడా ఉన్నాయి. అనంతరం ఓటు వేశాక.. వాళ్లు గుర్తులను ప్రదర్శించడం ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం.. మాన్యువల్ పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, మరేదైనా ప్రచార సామగ్రిని పోలింగ్ బూత్ల దగ్గర ప్రదర్శించకూడదు. కానీ, పుష్కర్, ఆయన భార్య పార్టీ కండువాలు, గుర్తులు ధరించడమే కాదూ.. కార్యకర్తలతో పోలింగ్ టైంలోనూ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై పుష్కర్ భార్య గీతను ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా.. ‘ఇది ప్రచారం అని ఎవరన్నారు?. ప్రతీ ఎన్నికల్లోలాగే.. ఈసారి ఎంత ఓటింగ్ నమోదు అవుతుందో చూడడానికే వచ్చాం. ప్రతీ పార్టీకి చెందిన వాళ్లూ ఇలా పార్టీ సింబల్స్ను ధరించే ఉన్నారు. అయినా ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధమై వస్తారు. ఇలాంటివి వాళ్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? అని బదులిచ్చారు ఆమె. మరోవైపు ఆ సమయంలో బీజేపీ హడావిడి తప్ప అక్కడేం కనిపించలేదు. అయినా పోలింగ్ సిబ్బంది, ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసులు వాళ్లను అడ్డుకోలేదన్న పలువురు ఓట్లర్లు చెప్పడం గమనార్హం. खटीमा में ये क्या हो रहा है?@pushkardhami चुनाव प्रचार खत्म होने के बाद खुलेआम पैसे बाँट रहे हैं। खटीमा से आम आदमी पार्टी के प्रत्याशी @sskaleraap ने खुद धामी को रंगे हाथों पकड़ा तो धामी ने कैमेरा बंद कराने की कोशिश की।@ECISVEEP व @UttarakhandCEO जल्द इसका संज्ञान लें। pic.twitter.com/oLpuKV7UkX — Aam Aadmi Party Uttarakhand (@AAPUttarakhand) February 13, 2022 ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల ప్రచారం పేరిట డబ్బులు పంచారంటూ ఆప్ ఏకంగా ఉత్తరాఖండ్ సీఎంపైనే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆప్ యూనిట్ ట్విటర్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేయగా...ఈసీ చర్యలేవంటూ? పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు 2022: ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ..
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ జనవరి 8న ప్రకటించింది. దీంతో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై కూడా నిషేదం విధించారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా 900 మంది అబ్జర్వర్లను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఇదే అభ్యర్థి వ్యయాన్ని రూ.28లక్షలుగా నిర్ణయించారు. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 14న మొదలై.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ముగియనుంది. చదవండి: (ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల) -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
ఒంగోలు: అమరావతి పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో మహాపాదయాత్ర బృందానికి వ్యతిరేకదిశలో 250 నుంచి 300 మంది రాజకీయ నాయకులు దూసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పాదయాత్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక దిశలో వచ్చారని తెలిపారు. అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దౌర్జన్యం చేస్తూ ముందుకు సాగారని, ఒక పోలీసు అధికారి చేతిలోని మ్యాన్పాక్ను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటనల వీడియోను ప్రదర్శించారు. తమ సిబ్బంది వారిని అదుపుచేసేందుకు యత్నించారే తప్ప ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా కూడా ఈ గుంపులో వచ్చినట్లు గుర్తించామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయడం బాధ్యతగా భావిస్తూ పాదయాత్ర బృందానికి భద్రత కల్పిస్తున్నామన్నారు. నాలుగు వాహనాలకు, 157 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా వందల వాహనాలు వస్తున్నాయని, అనుమతికి మించి 15 రెట్లకుపైగా జనం పోగవుతున్నారని, పరిమితికి మించి మైక్లు వినియోగిస్తున్నారని, కోవిడ్ నిబంధనలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుండటంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాదయాత్ర సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తమశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా హైకోర్టు ఆదేశాలు, డీజీపీ షరతులకు లోబడి అనుమతి పొందిన 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. నాగరాజు అనే వ్యక్తి గాయపడినట్లు ప్రచారం జరిగిందని, అతడికి ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. భద్రత కల్పించడం కోసమే ట్రాఫిక్ను సైతం క్రమబద్ధీకరిస్తున్నామని, పెద్ద ఎత్తున జనం రావడం వల్ల పాదయాత్రలో ఉన్నవారి భద్రతకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఒంగోలు టౌన్ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు పాల్గొన్నారు. -
పాదయాత్రకు విరామం
-
రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్
కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల క్రమంలో కోడ్ పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. -
ప్రభుత్వ ఉద్యోగులూ.. జాగ్రత్త!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరపగా నిజమేనని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అవే ఎన్నికల్లో చొప్పదండి మండలం ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన సస్పెండ్ అయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులపై ఇలాగే వేటు పడింది. అందుకే ఉద్యోగులూ.. జాగ్రత్త!. సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికపై దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. దీంతో ఉద్యోగులు అనుచితంగా వ్యవహరిస్తే వేటు వేయడానికి సిద్ధమైంది. ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి వత్తాసు పలకొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ పోస్టులపై కూడా ఓ కన్నేశారు. ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఏర్పడే ప్రభావం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహార శైలి మాత్రం పెనుచిక్కులు తేనుంది. సభలు, సమావేశాలు వద్దు ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకొని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే చాలు వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అయినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెనుముప్పే. అందుకే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకపోవడమే ఉత్తమం. ఇష్టానుసారంగా మాట్లాడటం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినచర్యలు చేపట్టేందుకు ఎన్నికల సంఘం తన నిబంధనలకు మరింత పదును పెడుతోంది. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తూనే అంగన్వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు. సెల్ఫోన్లతో కష్టాలు.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు లేనివారు లేకపోగా ఉన్నవారు అధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులు సెల్ఫోన్ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది. ఉద్యోగులు ఎటువైపు? హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని ప్రతికూలం అంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఉద్యోగుల తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్ విధానంపై ఉద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి: సిట్టింగ్లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు ! -
ఆ రెండు జిల్లాల్లోనే ఎన్నికల కోడ్.. ప్రస్తుత పథకాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.హుజూరాబాద్ స్థానం కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఉప ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉందని, అన్ని రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 305 పోలింగ్ కేంద్రాలు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని, ఎలాంటి ర్యాలీలను అనుమతి ఉండదన్నారు. ప్రచార వాహనాల్లో కూర్చునే పార్టీల నేతలు సైతం కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. హుజూరాబాద్ పరిధిలో 2,36,430 మంది ఓటర్లు ఉండగా, 305 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. పోలింగ్లో ఉపయోగించనున్న ఈవీఎంలకు ఇప్పటికే అన్ని పార్టీల సమక్షంలో తనిఖీలు పూర్తి చేశామన్నారు. వయోజనులు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు పోస్టల్బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్కు వారం ముందు వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. -
‘అమరావతి’ ఆందోళనకారుల ర్యాలీ
సాక్షి, గుంటూరు/తాడికొండ: ముందస్తు అనుమతులు లేకుండా రాజధాని అమరావతి ఆందోళనకారులు ర్యాలీ చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి ఆందోళనకారులు సోమవారం విజయవాడలోని దుర్గమ్మ గుడి దర్శనానికంటూ ర్యాలీగా బయల్దేరారు. ఓవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రగా ఆందోళనకారులు విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, మందడం, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ అనుమతులు లేవని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు విజయవాడకు బయల్దేరతామని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమను అడ్డుకున్నారని తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నించారు. మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు పోలీస్ సిబ్బందిని పిడిగుద్దులు గుద్దడం, గోళ్లతో రక్కడం చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగ్బంధానికి యత్నం దుర్గ గుడి దర్శనం పేరిట ఆందోళనకారులందరూ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బ్యారేజీని దిగ్బంధించాలని ప్రణాళిక రచించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆదివారమే గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నేతలే ఈ కుట్రలకు తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళనకారులు ర్యాలీలకు దిగడం చూస్తుంటే బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మోదీ ఫోటోను తొలగించండి: కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో నాలుగు రాష్ట్రాలతోపాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరోనా వైరస్ టీకా వేసుకున్న తర్వాత వైద్యులు అందించే సర్టిఫికేట్పై ముద్రించిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫోటోతో కూడిన సర్టిఫికేట్ల వల్ల ఓటర్లు ప్రభావితం కావడానికి అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని నరేంద్రమోదీ దుర్వినియోగం చేసున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అది ఎన్నికల కోడ్కు వ్యతిరేకమని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వ్యాక్సినేషన్ పూర్తైన అనంతరం వైద్యులు అందించే సర్టిఫికేట్పై నరేంద్ర మోదీ ఫోటో తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఇక సోమవారం అరవై ఏళ్లు పైబడినవారికి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిందే. అదే విధంగా ఈ వ్యాక్సినేషన్లో పలువురు ప్రముఖులు కూడా కరోనా టీకా వేయించుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసొం, పుదుచ్చేరిలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. చదవండి: ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్ -
మోదీ ఫోటోను తొలగించండి: కేంద్ర ఎన్నికల సంఘం
-
కోడ్, కోవిడ్.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు
క్యాడర్ను కాపాడుకోలేక... ఎన్నికల్లో వరుస పరాజయాలు.. పునాదులను కదిలించిన ‘కుప్పం’పంచాయతీ ఫలితాలు.. నైరాశ్యంతో జారిపోతున్న క్యాడర్.. సొంత పార్టీ నేతలను కాపాడుకోలేక, కార్యకర్తల్లో నమ్మకం కలిగించలేని దైన్యంతో చంద్రబాబు తిరుపతి పర్యటనలో 5 వేల మందితో ధర్నా ముసుగులో రెచ్చగొట్టి అల్లర్లకు పథకం వేసినట్లు స్పష్టమవుతోంది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనే అంశాన్ని విస్మరించి కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ను పట్టించుకోకుండా ధర్నాకు దిగి ఎన్నికల్లో సానుభూతి పొందాలనే ఎత్తుగడ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో వాటిని ప్రభావితం చేసేలా వ్యవహరించారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ ఏమాత్రం గెలిచే అవకాశాలు లేకపోవడం, పంచాయతీ ఫలితాలే పునరావృతం కానున్నాయని తేలడంతో టీడీపీ నేతలే స్వచ్ఛందంగా నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధం కావడంతో బలవంతం చేశారంటూ వివాదాలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, తిరుపతి, చిత్తూరు అర్బన్, తిరుపతి క్రైం: పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శాంతి భద్రతల అంశాన్ని గాలికి వదిలేయడంతోపాటు యథేచ్ఛగా ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతిపక్ష నేతగా ఎంతో అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబు వరుసగా ఎన్నికల్లో దారుణ పరాజయాలను ఎదుర్కోవడం, పార్టీ క్యాడర్ను కాపాడుకోలేక తాజాగా తిరుపతి ఎయిర్పోర్టులో వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ నేతల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబును పోలీసులు సోమవారం తిరుపతి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే చంద్రబాబు విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసనకు దిగి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. తొమ్మిది గంటలకుపైగా హైడ్రామా అనంతరం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు పయనమయ్యారు. పోలీసులు బతిమిలాడుతున్నా వినిపించుకోకుండా నేలపై కూర్చున్న చంద్రబాబు బెదిరించి.. డైరీలో పేర్లు రాసుకుని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు కోవిడ్ నిబంధనలను సైతం లక్ష్యపెట్టకుండా తన మందీ మార్బలంతో చిత్తూరు, తిరుపతిలో 5,000 మందితో ధర్నాకు సిద్ధం కావడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. కోడ్ అమలులో ఉండటం, కోవిడ్ రెండో దశ ఉధృతంగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ధర్నాకు అనుమతి ఇవ్వలేమని ఆదివారం రాత్రే స్పష్టం చేస్తూ నోటీసులు కూడా పంపారు. దీన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘నన్నే అడ్డుకుంటారా? ఎంత ధైర్యం? మీ అంతుచూస్తా..!’అని బెదిరించినట్లు తెలిసింది. తన బ్యాగ్లో నుంచి డైరీ తీసుకుని అక్కడున్న పోలీసుల పేర్లను రాసుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులను బెదిరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అనంతరం అక్కడే కింద బైఠాయించారు. ‘సార్ కుర్చీలో కూర్చోండి..’అంటూ ఏఎస్పీ మునిరామయ్య, డీఎస్పీలు రామచంద్ర, మురళీకృష్ణ, సూర్యనారాయణ పలువురు పోలీసులు బతిమాలినా నిరాకరించారు. గంట తరువాత చంద్రబాబు నీరు, కాఫీ, తాజా పండ్లు తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయనకు నారావారిపల్లెలోని ఇంటి నుంచి ప్రత్యేకంగా భోజనం వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు విమానాశ్రయంలోని విశ్రాంతి గదిలో ఉంటే మంచినీరు కూడా ముట్టకుండా తమ అధినేత బైఠాయించారంటూ పార్టీ నేతలు ప్రచారం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాకు అనుమతి లేనందున తిరిగి వెళ్లాలని చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలు సెంథిల్కుమార్, వెంకట అప్పలనాయుడు విమానాశ్రయం చేరుకుని పలుమార్లు చంద్రబాబును అభ్యర్థించారు. ఆయన ఏ సమయానికి తిరిగి వెళతారో అంతుబట్టక హైదరాబాద్, విజయవాడ వెళ్లే అన్ని విమానాల్లో టికెట్లు బుక్ చేసి ఉంచారు. చిత్తూరులో టీడీపీ నేతల వీరంగం.. చంద్రబాబు పర్యటన రద్దైనట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు చిత్తూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రోడ్లపైకి వచ్చి బైకులతో శబ్దాలు చేస్తూ అతివేగంగా నడపటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై వీడియోల ఆధారంగా పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. -
కారు డిక్కీలో కరెన్సీ కట్టలు..
సాక్షి, చేవెళ్ల: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారులు ఓ కారు డిక్కీలో తరలిస్తున్న రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారు డిక్కీలో రూ. 60 లక్షలు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నగదు గురించి ఆరా తీయగా.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినవిగా తెలిసింది. దీంతో పట్టుబడిన నగదును రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అనంతరం నగదును సీజ్ చేసి వివరాలు అందించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల కోడ్.. 50 వేల ఉద్యోగాల భర్తీ ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. మార్చి 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్తోపాటు కోడ్ అమల్లోకి రాగా ఆ వెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రెండు, మూడు నెలలు ఆలస్యం తప్ప దని అధికారులు పేర్కొంటు న్నారు. దీనికితోడు త్వరలో జరగాల్సిన మున్సిపల్ ఎన్ని కలకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉద్యోగ నోటి ఫికేషన్ల కోసం నిరుద్యోగులు నాలుగైదు నెలల వరకు వేచి చూడకతప్పని పరిస్థితి ఉంటుందని చెబు తున్నారు. అలాగే అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేశాకే ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటే మరిన్ని ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకు వస్తాయని తాజాగా ఉన్నతాధికారులు చెప్పడంతో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంకా ఎక్కువ సమయమే పట్టే పరిస్థితి నెలకొంది. అర్థిక శాఖకు అందిన వివరాలు.. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ డిసెంబర్లో ఆదేశించగా ఆర్థిక శాఖ ఆ మేరకు కసరత్తు చేపట్టింది. వివిధ శాఖలు, జిల్లాలవారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించింది. దీని ప్రకారం పోలీసు శాఖ 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించింది. అందులో 450 ఎస్ఐ, మిగతావి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు విద్యాశాఖ కూడా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించింది. 6,500 వరకు సెకండరీ గ్రేట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను ఇచ్చింది. అవి కాకుండా మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల్లో మరో 1500కు పైగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంపించింది. చదవండి: (ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు) ఇక సంక్షేమ శాఖల్లో వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇలా మొత్తంగా 1,700 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంచించింది. అలాగే ఆయా శాఖల పరిధిలోని కొత్త గురుకులాల్లో 3,200 వరకు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చి ప్రతిపాదనలను పంపించాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ తదితర 3,298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని వివరాలను అందజేసింది. మున్సిపల్ శాఖలోనూ 3,878 ఖాళీలు ఉన్నట్లు ఆర్థికశాఖకు పంపించింది. అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్, తదితర శాఖల్లో మొత్తంగా 50 వేల వరకు పోస్టులకు అనుమతి కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. అనుమతుల జారీ ప్రారంభం కాకముందే... శాఖల వారీగా అందిన ఉద్యోగ ఖాళీల పరిశీలన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపట్టింది. అది పూర్తి కాకముందే ఈ నెల 16న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మార్చి 17 వరకు అది అమల్లో ఉండనుంది. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయడానికి వీల్లేదు. అయితే ఈ సమయంలో ఇంటర్నల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. శాఖల వారీగా, పోస్టులవారీగా రోస్టర్ వివరాలను రూపొందించడం వంటి పనులను పూర్తి చేసుకొని నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావచ్చని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. వెంటవెంటనే ఎన్నికలు... ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కనుక వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే నాలుగైదు నెలలపాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచి చూడక తప్పనిపరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశాకే నోటిఫికేషన్ల జారీకి వెళితే ఎక్కువ మొత్తంగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు విద్యాశాఖలో ప్రస్తుతం 4 వేల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) భర్తీ చేయవచ్చు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. ఇలా 6,627 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తే మరో 6,627 ఎస్జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా చేయవచ్చని చెబుతున్నారు. అలాగే హెడ్మాస్టర్, పీజీటీ, టీజీటీ పోస్టులను, ఇలా అవకాశం ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతుల తరువాత భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆరేడు నెలలు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. చదవండి: (ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్కు రైళ్లేవి?) టీచర్ పోస్టులైతే మరింత ఆలస్యం... విద్యాశాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. పదోన్నతుల కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చేసింది. విద్యాశాఖతోపాటు ఏ శాఖలోనూ ఇపుడు పదోన్నతులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే చర్యలు చేపట్టాల్సి వస్తుంది. మరోవైపు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం టెట్ కోసం 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అది నిర్వహించకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మిగితా పోస్టుల నోటిఫికేషన్ల కంటే టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యం కానుంది. -
రాజకీయాల గురించి.. నేతల గురించి మీరు మాట్లాడవచ్చా?
సాక్షి, అమరావతి: ‘రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ.. ఆయన గురించి తాము మాట్లాడకూడదా.. ఇదెక్కడి న్యాయం.. మంత్రులపై కొత్తగా ఆంక్షలు పెట్టారు.. ఎన్నికల కోడ్ మంత్రులు, ఎమ్మెల్యేలకేనా? నిమ్మగడ్డకు వర్తించదా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. వీటిపై ఆయన సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి మీడియాతో మాట్లాడారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణిస్తే ఎన్నికల కమిషనర్కి 2021లో గుర్తొచ్చారా అని అడిగారు. సీబీఐ కేసులో తాను సాక్షిని, నిజం చెబుతాను అని అసందర్భంగా మాట్లాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషనర్గా ఉండి మంత్రి, సలహాదారుడు, ఐఏఎస్ అధికారిని తొలగించాలంటూ లేఖలు రాయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అంబటి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎజెండాలో భాగంగానే రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని.. బాబుకు లబ్ధి చేకూర్చడంలో భాగంగానే అధికారులను భయపెట్టడానికి ఎక్కడిక్కడ బాబు స్క్రిప్్టను చదువుతున్నారని అంబటి మండిపడ్డారు. గతంలో ఎంతోమంది ఎన్నికల అధికారులు, కమిషనర్లను చూశాంగానీ, ఇలాంటి సంకర జాతి (హైబ్రీడ్) కమిషనర్ను చూడలేదని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ పూర్తిగా మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన్ని ఎర్రగడ్డకు పంపాల్సిందేనన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకే ఆయన దిగజారి వ్యవహరించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్ట పరిణామంగా వైఎస్సార్సీపీ భావిస్తోందన్నారు. జగన్పై కక్ష సాధింపునకే.. నిమ్మగడ్డ పర్యటన చూస్తుంటే సీఎం జగన్పై పగ తీర్చుకోవాలనే తాపత్రయం కనిపిస్తోందని అంబటి అన్నారు. ఇందులో భాగంగానే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఒంటిమిట్టలో నిద్రపోవాలనే కోరికను తీర్చుకోవడానికి పర్యటనలు చేస్తున్నారా అంటూ అంబటి నిమ్మగడ్డను ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వైఎస్సార్ను పొగుడుతున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ రాజ్యంగ శక్తికాదు.. చంద్రబాబు తొత్తు అని.. వైఎస్సార్ను పొగుడుతూనే ఆయన విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పని నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారన్నారు. భవిష్యత్తులో దీనికి నిమ్మగడ్డ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పవన్ సొంత కాళ్లపై నిలబడాలి ఇక పవన్ కల్యాణ్ అంశాన్ని అంబటి ప్రస్తావిస్తూ.. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లాలని ఆయన అంటున్నారని.. పవన్ ముందు టీడీపీని, బీజేపీని యాచించడం మానాలని హితవు పలికారు. పవన్ తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితికి వస్తే, అప్పుడు శాసించే స్థాయికి ఒక కులాన్ని తీసుకెళ్లవచ్చన్నారు. తిరుపతి సీటు ఇవ్వండి.. జీహెచ్ఎంసీ సీట్లలో మాకు కొన్ని ఇవ్వండి అని బీజేపీని యాచించారన్నారు. అలాగే, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని అంబటి ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేస్తున్న రోజుల్లో చిరంజీవి, దాసరి నారాయణరావు నాటి ప్రభుత్వాన్ని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఎక్కడున్నారన్నారు. -
టీడీపీ కండువాలు, జెండాలతో నామినేషన్
తెనాలి : పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు విస్మరించారు. ఎన్నికల నియమావళిని, ఎన్నికల కోడ్ను సైతం ఖాతరు చేయలేదు. పార్టీ జెండాలు, కండువాలను ధరించి ఊరేగింపు నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీచేస్తున్న అభ్యర్థి ఊసరపు రాజ్యలక్ష్మి శనివారం నామినేషను దాఖలు చేశారు. ముందుగా అభ్యర్థితో సహా తెలుగుదేశం నేతలు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితరుల నాయకత్వంలో ప్రదర్శన చేశారు. ముందుగా ముసుగు వేసి ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి పార్టీ కండువాలు, పార్టీ జెండాలతో ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయం వరకూ వెళ్లారు. మైకులు, తీన్మార్ బ్యాండులు హోరెత్తాయి. నామినేషను దాఖలు చేసే సమయంలోనూ పార్టీ కండువాలు ధరించే ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై అంగలకుదురుకు చెందిన జాస్తి శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్కు ఫిర్యాదు చేశారు. -
వచ్చే నెల 4 నుంచి వారికి డబ్బులు ఇవ్వొచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలి... దాని కొనసాగింపు పై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న పిటీషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా వరద బాధితులకు ఇచ్చే 10,000 రూపాయల సహాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ శరత్ కోర్టుకు తెలిపారు. వరద బాధితులకిచ్చే సహాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ క్రింద రాదని చెప్పిన ఎన్నికల కమిషన్.. 24 గంటల వ్యవధిలోనే మాట మార్చిందని పిటిషన్దారు ఆరోపించారు. అంతేకాక ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే వరద బాధితుల సహాయం పథకం అమలులోకి వచ్చిందని తెలిపారు. కనుక ప్రస్తుతం దాన్ని ఆపడం పొలిటకల్ ఎజెండా అవుతుందని శరత్ కుమార్ కోర్టుకు విన్నవించారు. పిటిషన్దారు వాదనలు విన్న కోర్టు ఎన్నికలు ఉన్నాయని ముందుగానే తెలుసా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’) ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర బాడీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలా అని హై కోర్టు ప్రశ్నించింది. బాధితులకు సహాయం ఆపకూడదని ఎలక్షన్ కమిషన్ కోడ్ అఫ్ కండక్ట్లో ఉందా అని కోర్టు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల మోడల్ కోడ్ అఫ్ కండక్టే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెక్షన్ 8 ప్రకారం ‘నాట్ టు బీ పుట్ ఆన్ హోల్డ్ టిల్ ది ఎలక్షన్స్ ఆర్ హెల్డ్’ అని కమిషన్ను ప్రశ్నించింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్ని కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని.. అందుకే ఆ పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. పథకం తప్పుదోవ పడుతుందనే ఉద్దేశంతోనే నిలిపివేశామని.. కేవలం ఎన్నికల జరిగేంత వరకే దీనిని ఆపామని.. తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు విన్నవించింది. ఎన్నికల ముందు ఈ సహాయం చేయడం వలన ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత నెల 20 న ప్రారంభమైన ఈ పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. వరద బాధితుల సహాయ పథకం కేవలం జీహెచ్ఎంసీ వరకే పరిమితమా లేక మొత్తం రాష్టానికి వర్తింస్తుందా అని కోర్టు ఏజీని ప్రశ్నించింది. వచ్చే నెల 4 న కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఆదేశించింది. 4వ తారీఖు తర్వాత డబ్బుల పంపింణీ చేయొచ్చని తెలుపుతు.. తదుపరి విచారణను హై కోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది. (గ్రేటర్ పోరు: శ్రీనివాస్గౌడ్కు హైకోర్టులో ఊరట) ధరణిలో ఆస్తుల నమోదుపై విచారణ ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టం బద్ధం కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ధరణిలో ఆస్తుల నమోదుపై రేపు మద్యాహ్నం విచారిస్తామన్న హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దన్న ఉత్తర్వులను రేపటి వరకు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
ఆయన స్టార్క్యాంపెయినర్ కాదనే అధికారం ఈసీకి లేదు
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీ మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్కి లేదని కోర్టు స్పష్టం చేసింది. తనని స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడాన్ని కమల్నాథ్ కోర్టులో సవాల్ చేశారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసి, మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్నాథ్ ఎన్నికల కమిషన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాదని, ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తాము చర్యలు చేపట్టామని కమిషన్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ద్వివేదీ కోర్టుకి తెలిపారు. అయితే ఒక నాయకుడి ప్రచార స్థాయిని నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా? అంటూ కమల్నాథ్ లేవనెత్తిన ప్రశ్నతో సుప్రీంకోర్టు పిటిషన్ను విచారించింది. వారి నాయకుడెవరో నిర్ణయించే అధికారం ఆ పార్టీకే ఉంటుంది తప్ప, ఆ అధికారం ఈసీ కి ఉండదని ఈసీ తరఫున హాజరైన న్యాయవాదికి కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 13న కమల్నాథ్ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ఉపన్యాసంపై ఆధారపడి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీచేసిందని కమల్నాథ్ పేర్కొన్నారు. ‘బాబ్రీ’ మాజీ జడ్జికి భద్రత పొడిగింపు కుదరదు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకులు ఆడ్వాణీసహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన మాజీ ప్రత్యేక జడ్జి జస్టిస్ ఎస్కే యాదవ్కు భద్రత పొడిగించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ కేసు సున్నితమైన అంశం కనుక, అటువంటి కేసులో తాను తీర్పునిచ్చినందున తనకు వ్యక్తిగత భద్రత కొనసాగించాలంటూ జస్టిస్ యాదవ్ సుప్రీంకోర్టును కోరారు. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా భద్రత పొడిగింపు సాధ్యం కాదని కోర్టు త్రిసభ్య బెంచ్ తెలిపింది. -
ఉచిత వ్యాక్సిన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం వివక్షా పూరితమైనదనీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తేల్చింది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెపుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ప్రజాసంక్షేమం కోసం ఇలాంటి వాగ్దానాలు చేయడంలో అభ్యంతరం ఉండదని ఈసీ పేర్కొంది. ఆచరణాత్మకమైన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో తప్పు లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రణాళికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్దిష్ట ఎన్నికల సందర్భాల్లో విడుదల చేస్తుంటారని ఈసీ తెలిపింది. అయితే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత వ్యాక్సిన్ వాగ్దానాన్ని ఒక్క బిహార్ రాష్ట్ర ప్రజలకే ఇస్తానని పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ విస్మరించడం ఆశ్చర్యంగా ఉందని గోఖలే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర మంత్రి నిర్మల విడుదల చేశారు. వ్యాక్సిన్ని బిహార్ ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్న విషయమని, ఇది కేవలం బిహార్కే పరిమితమని, దేశం మొత్తానికి వర్తించదని బీజేపీ తెలిపింది. ప్రధాని బయోపిక్ విడుదల ఉల్లంఘన కాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ను విడుదల చేయడం నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణించలేమని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్ 25వ తేదీన ప్రకటించగా బయోపిక్ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ఈ సినిమా గత ఏడాది మేలోనే రిలీజ్ అయినందున ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టత ఇచ్చింది. -
ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు. (మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం) -
ఎన్నికల కోడ్ కఠినంగా అమలు
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమల్లో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను, ఎన్నికల ఇన్చార్జ్లను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ను కచ్చి తంగా పాటించాలని, అధికార పార్టీతోసహా ఎవ రూ ఎక్కడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఓటింగ్కు రావడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూసుకోవాలని, అలాగే, అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సంసిద్ధతపై ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఇన్చార్జ్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలు ఇంకా సిద్ధం చేయని మునిసిపల్ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పోలింగ్ రోజు ప్రజల చేతి వేలిపై సిరా గుర్తు వేసేటప్పుడు నిశితంగా పరిశీలించాలని నాగిరెడ్డి సూచించారు. కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటింగ్కు అనుమతించాలన్నారు. మున్సిపల్శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ను ఎత్తివేసిన ఈసీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. ఈమేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కోడ్ ఎత్తివేత వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్ను ఉపయోగిస్తుంది. -
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్ ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు. విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్ వీవీ ప్యాట్లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. -
టీడీపీ అభ్యర్థిని అడ్డుకున్న మహిళలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి చేదు అనుభవం ఎదురైంది. రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు గ్రామంలో ఓట్లు అభ్యర్థించడానికి వెళ్లిన నానిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. రేపే పోలింగ్ జరుగుతున్నా.. ఎన్నికల కోడ్ను ఉల్లఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికుల నుంచి నాని తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించినా టీడీపీ అభ్యర్థి వాటిని ఖేతారుచేసి ప్రచారాకి వెళ్లారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం కాలురు, కుప్పం బాదురుల కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగనుంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చంద్రగిరిలో టీడీపీ ప్రలోభాలు -
సోమిరెడ్డి అత్యుత్సాహం..!
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యుత్సాహానికి పోయారు. కేబినెట్ మీటింగ్పై ప్రెస్ మీట్ నిర్వహించి మరోసారి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలను, సీఎం ఆదేశాలను ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. కోటి 40 లక్షల రూపాయల పరిహారం రైతులకు ఇవ్వాలని, తాగునీటి విషయంలో ఆర్థిక ఇబ్బందులను చూసుకోవద్దని సీఎం సూచించినట్టు తెలిపారు. కేంద్ర నుంచి రావాల్సిన నరేగా (జాతీయ ఉపాధి హామీ పథకం) నిదులపై అధికారులతో మాట్లాడాని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ఫొని తుపాన్ వల్ల వ్యవసాయానికి 3 కోట్ల 39 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని, ఉద్యానవన పంటలకు 2 కోట్ల 95 లక్షల రూపాయలు నష్ట పరిహారంగా ఇవ్వాలని అంచనా కట్టినట్టు వెల్లడించారు. అధికారులతో మాకెప్పుడూ సమస్య లేదని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మంత్రులు మీడియాతో సమీక్షల వివరాలు చెప్పకూడదనే ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఇటీవలే సచివాలయం ఆరుబయట సోమిరెడ్డి ప్రెస్మీట్ నిర్వహించి ఎన్నికల కోడ్ను ఉల్లఘించిన సంగతి తెలిసిందే. ‘పొని’ తుపానుపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. -
పంతం కోసం చంద్రబాబు కేబినెట్ సమావేశం..!
సాక్షి, విజయవాడ: ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో కనీసం 50 శాతం వీవీప్యాట్లతో సరిపోల్చాలన్న విపక్షాల అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి వీవీ ప్యాట్లను లెక్కించాలని అడగడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబుకు అనుమానాలు ఎందుకని, ఎన్నికల కమిషన్ను అవమానించే విధంగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేసినప్పుడు ఇవే ఈవీఎంలు ఉన్నాయని, అప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఓటమికి ముందే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారని, ఓటమిని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కేబినెట్ సమావేశం పెట్టాలా వద్దా అనే విషయం చంద్రబాబు తెలీదా?. కేబినెట్ సమావేశం 10 నుంచి 14కు ఎందుకు మారింది?. సమావేశానికి సీఎస్ వస్తారా లేదా అనేది చంద్రబాబు ఆలోచన. పంతాల కోసం చంద్రబాబు కేబినెట్ సమావేశం పెడతారా?. వ్యవస్థను సవాల్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఉన్నారు. ఈనెల 23 తరువాత సీఎంగా ఉండే అవకాశం లేదని చంద్రబాబుకు తెలుసు. లంచాల వల్లే అమరావతి తాత్కాలిక నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. చిన్న వర్షానికి కూడా సచివాలయం చాంబర్లు మునిగిపోతున్నాయి. స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ చాంబర్లో రాజకీయ విమర్శలు చేయడం తగదు. రాజకీయాల గురించి స్పికర్ మాట్లాడం కోడ్ ఉల్లంఘనే. దీనిపై ఈసీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి ’అని అన్నారు. -
చంద్రబాబు మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన
-
బాబు పోలవరం పర్యటన వివాదాస్పదం
అమరావతి: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్లో పోలవరం చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గ్యాలరీలోకి వెళ్లి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం పనులను పరిశీలించారు. అక్కడి నుంచి బయల్దేరి దిగువ కాపర్ డ్యాంకు చేరుకున్న చంద్రబాబు, అధికారులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పలు మ్యాప్లను పరిశీలించారు. ఆయనకు ఈఎంసీ వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్లు ప్రాజెక్టు పనులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు 2019 జూన్కి నీరు ఇస్తానన్న చంద్రబాబు తాజాగా మాట మార్చి 2020 నాటికి గ్రేవిటీతో నీళ్లిస్తామన్నారు. ఇప్పటికీ కేంద్రం నుంచి రూ.4 వేల 367 కోట్లు రావాలని చంద్రబాబు అన్నారు. 2019 జూన్ నాటికి కాపర్ డ్యాం ఒక స్థాయి పనులు పూర్తి అవుతాయని తెలియజేశారు. కాపర్ డ్యాం పూర్తయితే 23 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. కేంద్రం సరైన సమయంలో నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తి చేశామన్నారు. సీడబ్ల్యూసీ ఏజెన్సీలు, కేంద్రం సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. మన దేశంలో అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టేనని, దేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం నవయుగ కంపెనీ సమావేశ మందిరంలో ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమావేశమై సమీక్షించారు. చంద్రబాబు సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొనటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా ఈఎన్సీ వెంకటేశ్వర రావు, సీఈ శ్రీధర్లతో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
గ్రూప్–2 పరీక్షా పేపర్లో బాబు భక్తి!
సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమనరీ పరీక్షలో పలు ప్రశ్నలు అభ్యర్థులను విస్తుపోయేలా చేశాయి. ఎన్నికలకు కొద్దికాలం ముందు ఓట్ల కోసం తన పేరుతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టిన కొన్ని పథకాల గురించిన ప్రశ్నలను ఏపీపీఎస్సీ అడగడం వివాదాస్పదంగా మారింది. సాధారణ ఎన్నికల కోడ్ మే 27వ తేదీ వరకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలోని ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా ఇంకా ముగియలేదు. మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్కు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ తరుణంలో జరిగిన గ్రూప్–2 పరీక్షలో ఏపీపీఎస్సీ అడిగిన పలు ప్రశ్నలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగేలా ఏపీపీఎస్సీ ప్రశ్నలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా చంద్రబాబుపై తన స్వామిభక్తిని ఏపీపీఎస్సీ చాటుకున్నట్లుగా ఉందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వాయిదా వినతిని పట్టించుకోని ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, మరోవైపు.. ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ తరుణంలో గ్రూప్–2 పరీక్షలు సరికాదని, రెండు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీకి విన్నవించారు. తమకు ప్రిపరేషన్కు సరైన సమయం కూడా ఇవ్వకుండా పరీక్షలు పెట్టడంవల్ల నష్టపోతామని అభ్యర్థులు చాలా కాలంగా ఏపీపీఎస్సీ చైర్మన్కు, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటూ రీపోలింగ్ జరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం జరిగేలా ప్రశ్నలు అడగడంపై మండిపడుతున్నారు. 77.92శాతం మంది హాజరు రాష్ట్రంలోని 447 గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాల్లో ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్టు)ను నిర్వహించింది. మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేయగా 2,28,263 మంది హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే, పరీక్షకు హాజరైనది మాత్రం కేవలం 1,77,876 (77.92 శాతం) మంది మాత్రమే. 50,383 మంది పరీక్ష రాయలేకపోయారు. ఉ.9.45 గంటల తరువాత ఎవరినీ అనుమతించరాదన్న నిబంధనతో కొన్నిచోట్ల అభ్యర్థులను అనుమతించలేదు. కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామా హాల్టిక్కెట్లలో అది ఏ ప్రాంతంలో ఉందో స్పష్టంగా లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. అడ్రస్ ప్రకారం ఆ ప్రాంతాలకు వెళ్లగా వారికి అక్కడ పరీక్ష కేంద్రం లేకపోవడం వంటి సంఘటనలూ ఎదురయ్యాయి. పలువురు దీనిపై ఏపీపీఎస్సీని సంప్రదించగా సరిచేసి మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడంతో అలాంటి వారు డౌన్లోడ్ చేసుకున్నారు. అలా చివరివరకు చూసుకోలేని వారు చివరి నిమిషంలో కేంద్రం ఎక్కడుందో తెలియక పరీక్షకు దూరమయ్యారు. బాబు పథకాలపై ఇవీ ప్రశ్నలు.. గతంలో ఏ ప్రభుత్వంలో లేని రీతిలో ఏపీపీఎస్సీ ఈసారి ప్రశ్నలను రూపొందింపజేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పట్ల స్వామిభక్తిని చాటుకుంది. చంద్రబాబు పేరిట అమలవుతున్న పథకాలతో పాటు పేదరికంపై గెలుపు, ఆదరణ, ఎన్టీఆర్ విదేశీ విద్య తదితర స్కీములపైనా ప్రశ్నలను అభ్యర్థులపై సంధించింది. అవి.. – చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత? – పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య, ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? – చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు? – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ కింది వాటికి సాధారణ వేదిక? – ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు? – ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది? ఆంగ్లంలో ఒకలా.. తెలుగులో మరోలా.. మరోవైపు.. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమనరీ ప్రశ్నలు ఆంగ్లంలో ఒక మాదిరిగా, తెలుగులో మరో రకంగా ఉండడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. రెండు మాధ్యమాల్లోని ప్రశ్నలను చదువుకుని సమాధానాలను గుర్తించడం ఇబ్బందిగా మారడంతో పాటు సమయం కూడా చాలా వృధా చేసుకోవలసి వచ్చిందని వారు వాపోయారు. ఉదాహరణకు.. – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని ఎన్ని ప్రధాన విభాగాలను అమలుచేశారు అని తెలుగులో ప్రశ్న ఉంది. ఇదే ప్రశ్న ఇంగ్లీషులో ‘ఫుల్లీ’ (పూర్తిగా) అని అడగ్గా తెలుగులో ఆ పదాన్నే ఇవ్వలేదు. విభజన చట్టంలోని కొన్నిటిని పాక్షికంగా.. కొన్నిటిని పూర్తిగా అమల చేశారు. తెలుగు మాధ్యమంలో ‘పూర్తి’ అని అడగకపోవడంవల్ల అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. – మరో ప్రశ్నలో.. ఏపీ రాజధాని అమరావతిని ఉద్దేశించి.. ‘భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా జస్టిస్ సిటీ నిర్మించుకుంది’ అని అడిగారు. వాస్తవానికి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమూ లేకున్నా.. జస్టిస్ సిటీ నిర్మాణం అయిపోయినట్లుగా కమిషన్ అడగడం విశేషం. జస్టిస్ సిటీ మాట దేవుడెరుగు హైకోర్టు శాశ్వత నిర్మాణం కూడా చేయలేదు. ప్రస్తుతం జిల్లా కోర్టుల కోసం నిర్మించిన భవనాల్లో హైకోర్టును తాత్కాలికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. – అలాగే, పేపర్ కోడ్ ‘డి’లోని 5వ ప్రశ్నలో ఆంగ్ల ప్రశ్నకు సమాధానం 22గా వస్తుండగా.. తెలుగు ప్రశ్నకు 20 సమాధానంగా వస్తుండడంతో అభ్యర్థులు సందిగ్థంలో పడ్డారు. – 26వ ప్రశ్నలో ఆంగ్లలో సీ ఫ్లోర్ (సముద్రపు అడుగుభాగం) అని ఉండగా తెలుగులో సముద్రపు అంతస్తు అని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వాకం.. 20మంది పరీక్షకు దూరం ఏపీపీఎస్సీ చేసిన తప్పిదాలకు పలువురు అభ్యర్థులు ఆదివారం గ్రూప్–2 పరీక్షను రాయలేకపోయారు. దాదాపు 20 మంది విద్యార్థులు ఏపీపీఎస్సీ జారీచేసిన హాల్టికెట్ల ప్రకారం చిత్తూరులో పరీక్ష కేంద్రం ఉందని భావించి ఆదివారం ఉ.9 గంటలకు కొందరు అభ్యర్థులు చిత్తూరు రాంనగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాలకు చేరుకున్నారు. కానీ, అక్కడ పరీక్ష హడావుడి ఏమీ కనబడకపోయేసరికి వారు అవాక్కయ్యారు. హాల్టికెట్లో పరీక్ష కేంద్రం వివరాలు స్పష్టంగా లేకపోవడంతో వారు పరీక్ష రాయలేకపోయారు. వాస్తవానికి శ్రీకాళహాస్తిలోని రాంనగర్కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, అభ్యర్థులు చిత్తూరులోని రాంనగర్ కాలనీ శ్రీ చైతన్య పాఠశాల వద్దకు వెళ్లారు. అధికారులు హాల్టికెట్లో ప్రాంతం పేరు సరిగా ముద్రించి ఉంటే ఈ గందరగోళానికి ఆస్కారం ఉండేది కాదని బాధిత అభ్యర్థులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. -
ప్రధాని మోదీకి ఈసీ మళ్లీ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఈసీ మరోసారి క్లీన్చిట్ ఇచ్చింది. గుజరాత్లోని పటాన్లో ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రచారంలో మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ తేల్చింది. పటాన్లోని ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ను సురక్షితంగా విడుదల చేసేందుకు పాక్పై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. కాగా, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఒకరు మోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేయడంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ఏప్రిల్ 1న నాగపూర్లో చేసిన మెజారిటీ–మైనారిటీ వ్యాఖ్యలపై క్లీన్చిట్ ఇవ్వడానికి సదరు ఎన్నికల కమిషనర్ అంగీకరించలేదని వెల్లడించాయి. -
క్లీన్చిట్ను ఒకరు వ్యతిరేకించారా?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మహారాష్ట్రలో గత నెలలో చేసిన రెండు ఎన్నికల ప్రసంగాలకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒకరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారా? ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అత్యున్నత స్థాయి వర్గాలు అవుననే అంటున్నాయి. మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ చేసిన అనేక ఫిర్యాదులపై సీఈసీ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ గత మూడురోజుల్లో తన నిర్ణయాలను వెలువరించింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఏప్రిల్ 1న వార్దాలో మోదీ చేసిన ప్రసంగానికి క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఎన్నికల కమిషనర్లలో ఒకరు వ్యతిరేకించారు. ఆరోజు ప్రధాని.. మైనారిటీలు ఎక్కువగా ఉండే వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడంపై విమర్శలు గుప్పించారు. అలాగే ఏప్రిల్ 9న లాటూర్లో పుల్వామా, బాలాకోట్ ఘటనలను ప్రస్తావిస్తూ తొలిసారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వీటిపై పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ 2:1 మెజారిటీతో నిర్ణయం వెలువరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏదైనా ఒక అంశంపై భిన్నాభిప్రాయం వక్తమైనప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘ చట్టం–1991 చెబుతోంది. విపక్షం తెలివితక్కువ ఆరోపణలు ఎన్నికల సంఘంపై విపక్షం తెలివితక్కువ ఆరోపణలు చేస్తోందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. ఈసీ వ్యవహారాల్లో బీజేపీ ఏ విధంగానూ జోక్యం చేసుకోవడం లేదన్నారు. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎమ్మెల్యేలను కొనేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒకవేళ ఇతర పార్టీల నేతలు వివిధ కారణాల రీత్యా బీజేపీలో చేరాలనుకుంటే మాత్రం అడ్డుకోవడంలో అర్ధం లేదని పీటీఐతో అన్నారు. కాంగ్రెస్ వంటి విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు. ఈసీపై బీజేపీకి అపారమైన గౌరవ మర్యాదలున్నాయని సింగ్ అన్నారు. మరో రెండింట్లో క్లీన్చిట్ న్యూఢిల్లీ: వారణాసి, నాందేడ్ల్లో చేసిన రెండు ప్రసంగాల సందర్భంగా ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని, కానీ తమ సూచనలు కానీ ఉల్లంఘించలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్లో మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్ను మునుగుతున్న టైటానిక్తో పోల్చారు. రాహుల్ గాంధీ మైక్రోస్కోప్ను ఉపయోగించి కేరళలోని వయనాడ్ సీటును ఎంచుకున్నారని విమర్శించారు. వారణాసిలో భద్రతా బలగాలను, ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. వీటిపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. వీటితో పాటు కాంగ్రెస్ చేసిన ఐదు ఫిర్యాదులను పరిష్కరించిన ఈసీ.. అన్ని విషయాల్లో మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది. -
ఎన్నికల కోడ్ సడలించిన ఈసీ
-
ఏపీలో 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. ఫొని తుపాను కారణంగా సహాయక చర్యలు, పునరావాస చర్యల కోసం సీఈసీ శుక్రవారం ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయింపు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన జరగనుంది. అప్పటి వరకూ ఉన్న ఎన్నికల కోడ్ను ప్రస్తుతం ఫొని తుపాను కారణంగా నాలుగు జిల్లాల్లో రద్దు చేశారు. -
ఆరు లోపు తేల్చండి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల నిబంధనావళి (కోడ్)ని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులపై మే నెల 6 లోపు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘం (ఈసీ)ను ఆదేశించింది. మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ 11 ఫిర్యాదులు చేయగా, ఈసీ రెండింటినే పరిగణించింది. దీంతో ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో కేసువేయడం తెల్సిందే. ఈ కేసును కోర్టు గురువారం విచారించింది. సుస్మిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపిస్తూ ‘మేం ఫిర్యాదు చేసిన ఐదున్నర వారాల తర్వాత ఈసీ కేవలం రెండు ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంది. తొలి ఫిర్యాదు చేసిన 40 రోజుల తర్వాత కూడా మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని ఆదేశించాలంటూ ఇప్పుడు మేం కోర్టుకు రావాల్సి వచ్చింది. మిగిలిన 9 ఫిర్యాదులపై కూడా శుక్రవారమే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండి’ అని కోరారు. ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రెండు ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న విషయాన్ని తెలిపారు. ఏప్రిల్ 16న తమకు ఫిర్యాదు అందగా, ఏప్రిల్ 18, 23, 29 తేదీల్లో పోలింగ్ ఉండటంతో తమ దృష్టంతా ఆ ఏర్పాట్లపై పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అన్ని ఫిర్యాదులపై మే 8 లోపు చర్యలు తీసుకుంటామని చెప్పగా, కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 6కు వాయిదా వేస్తూ, ఆ లోపు అన్ని ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఈసీని ఆదేశించింది. -
అప్పుడు కాదు.. ఇప్పుడే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు రాకముందే యూనివర్సిటీల్లోని దాదాపు 1,110 పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలిలోని తన మనుషుల ద్వారా పావులు కదుపుతోంది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారం చేజారితే ఏమీ చేయలేమన్న ఆందోళనతో అంతకు ముందుగానే ఈ పోస్టుల భర్తీని ముగించాలని హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యామండలిలోని వైస్ చైర్మన్, సీఎంఓలోని కొందరు అధికారుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు చేయించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇంటర్వ్యూలు, నియామకాలు చేయడానికి వీల్లేనందున ఉన్నత విద్యామండలి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. ఈ లేఖను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించగా ఇంటర్వ్యూల నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపింది. దీని ఆధారంగా నియామకాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అనుమతించినా, పోస్టుల రేషనలైజేషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని యూనివర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడంపై రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలపై స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవేవీ పరిష్కారం కాకుండానే నియామకాలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు ఇంటర్వ్యూల నిర్వహణకు నిబంధనల మేరకు ముందుకు వెళ్లవచ్చని గత నెల 25న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ పోస్టుల భర్తీకి వీలుగా కోర్టుల్లో ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ విషయాన్ని పక్కన పెట్టి నియామకాలు త్వరగా పూర్తి చేయించాలని ఆయా వర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూళ్లు పంపించాలని ఉన్నత విద్యామండలి ద్వారా ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. ఆ షెడ్యూళ్లు వచ్చాక కామన్ షెడ్యూల్ ఇచ్చి భర్తీ చేయించాలని చూస్తున్నారు. భారీ మొత్తాలకు పోస్టుల అమ్మకాలు వర్సిటీల్లోని బోధనా పోస్టులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి డబ్బును కూడా తీసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తేటతెల్లమవుతుండడంతో వారందరి నుంచి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఇంటర్వ్యూలు పూర్తి చేయించాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసులు పరిష్కారం కాకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడం సరికాదని, దీన్ని నిలుపుదల చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం అనుమతిచ్చిందన్న సాకుతో భర్తీకి ముందుకు వెళ్తే ఆయా యూనివర్సిటీల అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కూడా దాఖలు చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడితే తదనంతర పరిణామాలకు ఆయా వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని వర్సిటీల అధికారులకు నిపుణులు సూచిస్తున్నారు. యూజీసీ ఉత్తర్వులూ బేఖాతర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున తుది నిర్ణయం వెలువడే వరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని నెలల క్రితం యూజీసీ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు పోస్టుల భర్తీని నిలిపి వేయాలని ఉన్నత విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆదేశించింది. అయినా ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ఒకరు ఫోన్ చేసి ఆయా వర్సిటీల అధికారులపై ఒత్తిడి చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అంతా అక్రమాల మయం యూనివర్సిటీ బోధనా పోస్టుల భర్తీ వ్యవహారం ఆది నుంచి అక్రమాలమయంగా మారిందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 1,385 పోస్టులకు కుదించింది. ఇది కూడా సీఎంవోలో ఉన్న ఒక సలహాదారు, ఉన్నత విద్యామండలిలోని ఉపాధ్యక్షుడొకరు కలసి తమకు నచ్చిన రీతిలో తమ సామాజికవర్గ వ్యక్తులకు వీలుగా చేయించారన్న ఆరోపణలున్నాయి. రేషనలైజేషన్ అక్రమాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్ 101, అసోసియేట్ ప్రొఫెసర్ 174, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,110 ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపైనా కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తోంది. ఇన్ని వివాదాలున్నప్పటికీ పోస్టుల భర్తీకి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తుండటానికి కారణం జేబులు నింపుకోవడానికేనని స్పష్టమవుతోంది. -
మోదీపై ఈసీ చర్య తీసుకుంటుందా!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చిన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలం తాత్సారం చేస్తూ వస్తోన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం సాయంత్రం హఠాత్తుగా మంగళవారం ఉదయం సమావేశమై ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతామని ప్రకటించింది. మోదీ, అమిత్ షాలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం కోర్టు ఈ అంశంపై విచారణ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మంగళవారం సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అంటే, ఎన్నికలకు సంబంధించిన అంశం సుప్రీం కోర్టు పరిశీలనకు వెళ్లినప్పుడు ఎన్నికల కమిషన్ అందులో జోక్యం చేసుకోదు. సుప్రీం కోర్టు నిర్ణయానికే వదిలిపెడుతుంది. సుప్రీం తీర్పును బట్టి నడుచుకునేందుకు సిద్దంగా ఉంటుంది. ఈసారి అందుకు విరుద్ధంగా మోదీ, అమిత్షా, రాహుల్కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సమావేశం అవుతున్నట్టు ప్రకటించడంలో ఏదో మతలబు ఉండే ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంశాన్ని మంగళవారం నాడు విచారిస్తుందనే విషయం తెలియకముందే తాము మంగళవారం నాటి సమావేశాన్ని ఖరారు చేసుకున్నామని ఎన్నికల కమిషన్ అంటోంది. మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం నాడు విచారించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచీ సోమవారం ఉదయమే నిర్ణయించింది. మంగళవారం నాడు సమావేశమై తాము ఈ అంశాన్ని పరిశీలించాలని అంతకన్నా ముందే నిర్ణయం తీసుకున్నామని ఆ వెంటనే ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రకటించలేదు? ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు నిరీక్షించాల్సి వచ్చింది? సుప్రీం కోర్టు విచారణ గురించి తెలిసాక సంప్రదాయం ప్రకారం, తనకన్నా సుప్రీం అధికారాలు కలిగిన సుప్రీం కోర్టుకే వదిలేయకుండా ఎందుకు ఫిర్యాదులను విచారిస్తానని ప్రకటించాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు అయితే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తానయితే చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టవచ్చనే ఉద్దేశమా? ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ తనకు ఎన్నో ఫిర్యాదులు ఎందరిపైనో అందినప్పటికీ కింది స్థాయి నాయకులపై మాత్రమే చర్యలు తీసుకుంది. ఒకటి, రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ వారిపై చిన్న చిన్న శిక్షలు విధించింది. తనకు ఓటు వేయకపోతే ముస్లింల సంగతి చూస్తానంటు హెచ్చరించిన సుల్తాన్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ ఎన్నికల ప్రచారంపై కూడా ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించింది. అయితే మేనకా గాంధీ, తనకు ఏయే ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయో, ఏయే ప్రాంతాల్లో ఓట్లు తక్కువ వచ్చాయే గుర్తించి ఆయా ప్రాంతాలను ఏ,బీ,సీ,డీ ప్రాంతాలుగా కేటిగిరీ చేస్తానని, తద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని, తక్కువ వచ్చిన ప్రాంతాలను పట్టించుకోనంటూ ఓటర్లును బెదిరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడంతో దీనిపై కూడా ఆ పార్టీ సోమవారం నాడు కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఇలాంటి హెచ్చరికలు పునరావృతం అయితే తగిన చర్యలు తీసుకుంటానంటూ సోమవారం నాడు మేనకా గాంధీకి ఈసీ నోటీసు జారీ చేసింది. చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. వారిపై చర్యలు అనుమానమే ? మేనకా గాంధీపైనే చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయిన ఎన్నికల కమిషన్, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై చర్యలు తీసుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి నుంచి బీజేపీకి మిత్రుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదని వారు ఆరోపిస్తున్నారు. మోదీపై, అమిత్ షాలపై ఆరోపణలు ఏమిటీ ? గత ఫిబ్రవరి నెలలో జరిగిన పుల్వామా ఉగ్ర దాడిగానీ, అందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్లోని బాలకోట్పై జరిపిన బాంబు దాడులనుగానీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరదంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వైమానిక దాడిలో పాల్గొని వీరోచితంగా విడుదలై వచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన వర్థమాన్ చిత్రపటాన్ని బీజేపీ ప్రచారం కోసం ఉపయోగించగా, వెంటనే ఆయన ఫొటోలను తొలగించాలని ఆదేశించడమే కాకుండా భారత సైన్యాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వాడుకోరదంటూ తాజా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలన్నింటిని ప్రస్తావిస్తున్నారు. పాకిస్థాన్పై దాడి జరిపిన దేశ సైనికులకు తమ ఓటును అంకితం ఇవ్వండంటూ కూడా ఓటర్లకు పిలుపునిచ్చారు. నేడు దేశం సురక్షితంగా ఉన్నదంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం చిన్నాభిన్నం అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక అమిత్ షా, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ‘మోదీజీ కా వాయు సేన’ పాకిస్థాన్పై దాడి జరిపిందంటూ మాట్లాడారు. ఆయన ఎన్నికల కోడ్కు విరుద్ధంగా మతాల ప్రస్థావన కూడా తీసుకొస్తున్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఎన్నికల నినాదం కూడా ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. సంబంధిత వార్తలు అభినందన్ నిజంగా ఓటేశారా!? ఎన్నికల కోడ్ను ‘పీఎంవో’నే ఉల్లంఘిస్తే! ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది? -
మోదీ కోడ్ ఉల్లంఘనలపై నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై వచ్చిన ఎన్నికల నిబంధనావళి (కోడ్) ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం (ఈసీ)ను ఆదేశించాలంటూ వచ్చిన పిటిషన్లను మంగళవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మోదీ, అమిత్ షాలు విద్వేష వ్యాఖ్యలు చేయడం, సాయుధ బలగాల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం తదితరాల ద్వారా పలుసార్లు నిబంధనలను ఉల్లంఘించారనీ, వీటిపై ఫిర్యాదులు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుస్మిత తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ కోర్టును కోరారు. సింఘ్వీ విన్నపాన్ని పరిశీలించిన ధర్మాసనం, సుస్మిత పిటిషన్ను మంగళవారం విచారిస్తామని హామీనిచ్చింది. కాగా, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, రాహుల్లపై వచ్చిన ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఫిర్యాదులపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. కమిషన్లోని సభ్యులంతా మంగళవారం ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసీ సోమవారం వెల్లడించింది. -
అభద్రత, అవినీతి ఊబిలో చంద్రబాబు
‘నాకు జూన్ 8 వరకు సమీక్షలు చేసే అవకాశం ఉంది’ అని ఈసీని అభ్యర్ధిస్తున్న చంద్రబాబులో ఆ తరువాత నేను ముఖ్యమంత్రిని కాను అనే అభద్రత తొంగిచూస్తోంది. సీఎం కాకపోతే ప్రతిపక్షం నాయకుడవచ్చు, లేకపోతే అసలు తానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. ఇదంతా ప్రజాస్వామ్య దేశంలో సామాన్యమే అని చంద్రబాబు భావించకపోవడం ఆశ్చర్యం. ఆయనకు 2018 డిసెంబర్లోనే తాను దిగిపోతున్న కథ అర్థ మయ్యింది. ఆయన మనసులో లేని అనేకమైన చర్యలు ఈ నాలుగు నెలల్లో హడావుడిగా చేశారు. ఇందులో కొన్ని కేసీఆర్ని అనుకరించినవి కాగా, కొన్ని వైఎస్ జగన్ పాదయాత్రలోని ఒప్పందాలను పూర్వపక్షం చేయాలని చేశారు. నిజానికి వృద్ధాప్య పెన్షన్ 2 వేలు చేయడంలో వృద్ధుల్లో ఉత్సాహం వచ్చిన మాట నిజం. చంద్రబాబు ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ. సామాజిక పింఛన్లకు సంబంధించి 2018–19 బడ్జెట్లో పెట్టకుండా ఎలా ప్రకటించాడు? ఈనాడు రూ.14,400 కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు ఎందుకున్నాయి. నిజానికి వృద్ధులు, వితంతువులు నిరాధారులు అవడానికి కారకుడు చంద్రబాబు కాదా? తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకొని ఏదో ఒక ఉద్యోగ మొస్తుందని ఆశపడ్డవారు తాము వృద్ధులైనా తమ పిల్లలు ఉద్యోగస్తులు కాలేకపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన బాబు మొత్తం ప్రభుత్వోద్యోగ వ్యవస్థను ధ్వంసం చేశారు. దానికితోడు నారాయణ, చైతన్య సంస్ధల దోపిడీకి ద్వారాలు తెరిచాడు. రెండు సంస్థలు భిన్నమైన బినామీ సంస్థల పేరుతో సుమారు 8 వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఏకంగా నారాయణకు మంత్రి పదవి ఇచ్చాడు. ఎందరో విద్యార్థినీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నా నారాయణ సంస్థల మీద ఈగ వాలకుండా చూశారు. ప్రభుత్వ విద్య గుండెను నులిమేశాడు. మెదడును తొలిచివేశాడు. సొంత కుల సంస్థగా ప్రభుత్వాన్ని నిర్వహిం చాడు. తెలుగు నేలలో సామాజిక సాంస్కృతిక విద్యా ఆర్థిక వ్యవస్థలనన్నింటినీ ధ్వంసం చేశాడు. అందుకు గాను బూకరింపు భాష నేర్చుకొన్నాడు. తన అసత్యాల ప్రచారానికి కోట్లు ఖర్చుపెట్టి ప్రచార వ్యవస్థను నిర్మించుకొన్నాడు. బాబు ఇటీవల ఎన్నికల నిర్వహణాధికారుల మీద ధ్వజమెత్తడం ప్రారంభించాడు. తన ఓటమికి రేపు ఈసీని సాకుగా చూపాలనేది తన వ్యూహం. ఎన్నో అంశాల్లో ఈసీ తనను నిలదీయవలసి ఉండగా, బాబే ఈసీని నిలదీయడం ఆయన అభద్రతలోని మూడవ అంశం. పైగా చంద్రబాబు రాజకీయంగా తప్ప రాయలసీమకు, ఉత్తరాంధ్రకు పరిపాలనా క్రమంలో పయనించలేదు. ఈనాడు రాయలసీమలో మంచినీళ్ళకు, గంజి నీళ్ళకు అల్లాడడానికి కారకులు బాబు కాదా! బాబుది దయాహీనమైన స్వభావం. రాష్ట్రంలో పిల్లతల్లులు, శిశువులు పౌష్టికాహారలోపంతో కునారిల్లుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 10 శాతం మందికే అందుతుంది. వందకి 58% మంది స్త్రీలు రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోపక్క వ్యవసాయదారుల్లో జూదం, తాగుడును బాబు పెంచాడు. యువతలో జ్ఞాన సంపదను పెంచవలసిన పాలకుడు తాగుడుకు బానిసలను చేశాడు. ఆహారోత్పత్తిని దెబ్బతీశాడు. రాష్ట్రంలో సబ్ప్లాన్ నిధులను తన సొంత కార్యక్రమాలకు చంద్రబాబు తరలించారు. సబ్ప్లాన్ నిధులతో దళితులకు భూమి కొని ఇవ్వడంకాని, ఇళ్ళ స్ధలాలు, శ్మశాన భూములు ఇవ్వలేదు. దళితులు గ్రామాల్లో విశాలంగా ఉండడానికి వీలు లేదని నిర్దేశించాడు. దళితులు చనిపోతే పూడ్చడానికి çశ్మశాన భూములు రాష్ట్రంలో 80 శాతం దళితవాడలకు లేవు. అంతరానితనం స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. 18,000 బ్యాక్లాగ్లు పూరించకపోవడంలోనే ఆయన కుల వివక్ష కొనసాగుతుంది. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆత్మాశ్రయం రాష్ట్ర ప్రజల ఊపిర్లను పీల్చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలిం చని చంద్రబాబు వంటి పాలకులను ప్రజలు గద్దె నుంచి దించేస్తారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం చైతన్యవంతంగానే వుంటారు. చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించలేదు. ఆయన ఇప్పుడు అవినీతి అభద్రత ఊబిలో వున్నారు. అందుకే అస్థిరంగా అపవాక్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలు సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ పునరుజ్జీవనం కోసం నియంతలైన పాలకులపై నిరంతరం పోరాటం చేయాలి. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి. పాలకులు విసిరే ఏ మాయాజాలానికీ లొంగిపోని వ్యక్తిత్వాన్ని ప్రజలు కలిగివుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం భారతదేశంలో మనగలుగుతుంది. ఆ దిశగానే పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
నియమావళికి నైతికతే ప్రాణం
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11న మొదటి ఘట్టంలోనే మొత్తం 25 లోక్సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. అంటే పోలింగ్కూ, ఫలితాలు వెల్లడి కావడానికి మధ్య 42 రోజుల సుదీర్ఘ సమయం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లోనే ముగిశాయి. ప్రవర్తన నియమావళిని వర్తింపజేయడంలో తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్కూ వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా? ప్రధాని నరేంద్రమోదీకీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కీ వర్తించని ఆంక్షలు తనకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టడం సమంజసమేనా? భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉండాలనీ, అది నేరుగా రాష్ట్రపతికి జవాబుదారీగా ఉండాలనీ, ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఉద్వాసన చెప్పాలంటే పార్లమెంటు అభి శంసన తీర్మానం ఆమోదిస్తేనే కానీ సాధ్యం కాదని రాజ్యాంగాన్ని రూపొం దించిన రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. అత్యంత శక్తిమంతమైన ప్రజా స్వామ్య దేశం అమెరికాలో ఎన్నికల సంఘం లేదు. ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తుంది. మన దేశంలో మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సంఘం 1990ల వరకూ ఏకసభ్య సంఘంగా ఉండేది. 1980ల నాటికి అక్రమార్కులూ, గూండాలూ, నేరగాళ్ళూ ఎన్నికల వ్యవస్థను శాసించే దుస్థితి దాపురించింది. ఆ దశలో తిరునెల్లాయ్ నారాయణ అయ్యర్ శేషన్ (టీ.ఎన్. శేషన్) పదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నియమితులైనారు. శేషన్కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మొదటి నుంచి నిజాయితీపరుడైన, సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. కాకపోతే కొంచెం తిక్క. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో శేషన్ రక్షణశాఖ కార్య దర్శిగా పని చేశారు. రక్షణ మంత్రి వీ. పీ. సింగ్ ప్రభుత్వం నుంచి వైదొలిగి బోఫోర్స్ కుంభకోణంపై ఉద్యమం చేసినప్పుడు రాజీవ్గాంధీని శేషన్ గట్టిగా బలపరిచారు. ఇందుకు మెచ్చి రాజీవ్గాంధీ 1989లో శేషన్కు కేబినెట్ సెక్ర టరీగా పదవోన్నతి ప్రసాదించారు. బోఫోర్స్ కారణంగానే 1989 ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎన్.టి. రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ వీ.పీ. సింగ్ను ప్రధానిగా ఎన్నుకున్నది. సింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే శేషన్ను కేబినెట్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ప్రణాళికాసంఘం సభ్యుడుగా నియమించి కక్ష తీర్చుకున్నారు. మండల్, కమండల్ వీ.పీ. సింగ్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతు ఇచ్చింది. వెనుకబడిన వర్గాల హృదయాలు గెలుచుకునేందుకు మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి దానిని అమలు చేయడానికి సింగ్ పూనుకున్నారు. మండల్కి పోటీగా బీజేపీ కమండల్ ఉద్యమానికి తెర లేపింది. అయోధ్యలో బాబరీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలంటూ బీజేపీ వరిష్ఠనేత లాల్కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. రథాన్ని బిహార్లో లాలూప్రసాద్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్వాణీని అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా వీ.పీ. సింగ్ సర్కార్కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా గద్దెనెక్కారు. శేషన్ను 1990 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియ మించారు. అప్పటి వరకూ తన అధికారాలు ఏమిటో తెలుసుకోకుండా బిక్కు బిక్కుమంటూ వ్యవహరించిన ఎన్నికల సంఘం అనూహ్యమైన రీతిలో జవస త్వాలు సంతరించుకున్నది. రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు అప్పటి వరకూ పరమ సాత్వికంగా ఉండిన సంఘం అకస్మాత్తుగా సింహంలాగా గర్జించడం ఆరం భించింది. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీ.వీ. నరసింహా రావుకూ. శేషన్కూ కొంతకాలం సఖ్యత ఉండేది. శేషన్ని అభిశంసించాలని వామపక్షాలు చేసిన ప్రయత్నాలను పీ.వీ. వమ్ము చేశారు. కానీ ఏకు మేకైన చందాన శేషన్ పీ.వీ.కి కొరకరాని కొయ్యగా తయారైనారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణపైన కేంద్ర మంత్రిమండలి నుంచి సంక్షేమ మంత్రి సీతారాం కేసరి, ఆహారమంత్రి కల్పనాథ్ రాయ్ రాజీనామా చేయాలని 1994లో శేషన్ పట్టుపట్టారు. మధ్యప్రదేశ్లో పోటీ చేస్తున్న కుమా రుడి తరఫున ప్రచారం చేస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షన్ అహ్మద్పైన శేషన్ అభియోగం మోపారు. గవర్నర్ రాజీనామా చేయవలసి వచ్చింది. పంజాబ్లో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పోలింగ్ను రద్దు చేశారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఏకపక్షంగా తీసు కోవడం ద్వారా శేషన్ నాయకులకు సింహస్వప్నమైనారు. ఈ దశలో పీ.వీ. చాణక్యం చేశారు. ఎన్నికల సంఘంలో ఒకరికి బదులు ముగ్గురు ఉండాలని నిర్ణయించి, శేషన్కు తోడు మరి ఇద్దరు కమిషనర్లను నియమించారు. శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని ధ్రువీ కరిం చడమే కాకుండా ముగ్గురికీ సమానహోదా ఉంటుందనీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమవుజ్జీలలో ప్రథముడనీ, మెజారిటీ ఆధారంగా అన్ని నిర్ణయాలూ తీసుకో వాలనీ 1995లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటికే శేషన్ పదవీ కాలం ముగింపునకు వస్తోంది. 1996లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన మెగ్సేసే అవార్డు లభించింది. 1997లో రాష్ట్రపతి పదవికి ఆర్కె నారాయణ్తో పోటీ పడి ఓడిపోయారు. కేరళలోని పాలక్కాడ్లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ శేషన్, భార్య జయలక్ష్మి చైన్నైలోని అల్వార్పేటలో స్థిరపడినారు. జయలక్ష్మి 2018 మార్చి 31న మృతి చెందారు. వారికి సంతానం లేదు. అనారోగ్యంతో ఒంటరిగా శేషన్ శేషజీవితం గడుపుతున్నారు. శేషన్ ఆధిపత్యం సాగిన రోజుల్లో రాజకీయ నాయకులు ఇద్దరికే– దేవుడికీ, శేషన్కే– భయపడేవారని రాజకీయ పండితులు వ్యాఖ్యానించేవారు. ‘ది గ్రేట్ మార్చ్ ఆఫ్ డెమాక్రసీ’గ్రంథ రచయిత క్రిస్టొఫీ జాఫర్లాట్ ఇలా రాశారు: ‘అధినేత బలవంతుడా, బలహీనుడా అనే అంశం ఆధారంగా ఒకే సంస్థ భిన్నమైన వైఖరులు అవలంబిస్తుంది.’ శేషన్ సీఈసీగా పని చేసిన రోజుల్లో దేశంలో అనైక్యత ఉండేది. మత ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో అరాచకం రాజ్యం చేస్తూ ఉండేది. ‘ఆయారాం, గయారాం’ రాజకీయం అడ్డగోలుగా నడిచింది. ఓట్లను కొనుగోలు చేయడం, ఓటర్లకు మద్యం సరఫరా చేయడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా దౌర్జన్యంగా అడ్డుకోవడం యధేచ్ఛగా జరిగేవి. అన్ని పార్టీలలో గూండాలు ముందుపీటీలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ, ప్రజా స్వామ్య వ్యవస్థ అపహాస్యానికి గురైనాయి. ఆ దశలో శేషన్ అడుగుపెట్టారు. ఆరేళ్ళ పదవీ కాలంలో దేశ ప్రజలలో ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం పెంచారు. నాయకులలో ఆ సంస్థ పట్ల గౌరవాన్నీ, భయాన్నీ నెలకొల్పారు. ఎన్నికల సంఘం సాహసోపేతంగా వ్యవహరించలేని సందర్భాలలో దేశ ప్రజలకు శేషన్ జ్ఞాపకం వస్తారు. చండశాసనుడు ఈ రోజున శేషన్ వంటి చండశాసనుడి చేతిలో ఎన్నికల కమిషన్ సారథ్యం ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. శేషన్ను స్ఫూర్తిగా తీసుకొని కమిషన్ మరింత నిర్ణయాత్మకంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్బోధించిన తర్వాత ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా లక్ష్మణ రేఖ దాటిన ఆరుగురు ప్రముఖులపైన శిక్షాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రధాని జీవితకథ ఆధారంగా తీసిన సినిమా విడుదలను అడ్డుకున్నారు. మరి కొన్ని సందర్భాలలో కఠిన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. శేషన్ స్ఫూర్తి సజీవంగా ఉంటే, మోదీని మరోసారి ప్రధాని చేయాలంటూ వ్యాఖ్యానించిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్సింగ్ రాజీనామా చేసేవరకూ ఎన్నికల కమిషన్ విశ్రమించేది కాదు. నిరుపేదలకు కనీస ఆదాయం వచ్చే విధంగా ‘న్యాయ్’ పథకాన్ని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానం అమలు సాధ్యం కాదంటూ తేల్చిచెప్పిన ‘నీతి ఆయోగ్’ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్కుమార్కు ఉద్వాసన అనివార్యమై ఉండేది. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని వార్ధా బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ ‘హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న అమేథీలో ఓడిపోతాననే భయంలో వయనాడ్ వెడుతున్నారు’అంటూ వ్యాఖ్యానించినందుకు నోటీసులు అందు కునేవారు. శాస్త్రజ్ఞులు ఉపగ్రహాన్ని ఛేదించే రాకెట్ ‘మిషన్ శక్తి’ని విజయ వంతంగా ప్రయోగించిన సందర్భంగా టీవీలో దేశవాసులను ఉద్దేశించి ప్రసం గించినందుకు మోదీని తప్పుపట్టేవారు. ‘మోదీజీ సేన’ అంటూ పరవశించి మాట్లాడినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేత గుంజీలు తీయించేవారు. రఫేల్ పత్రాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను వక్రీకరించినం దుకు రాహుల్గాంధీని బోను ఎక్కించేవారు. సుప్రీంకోర్టు సూచించినట్టు సునీల్ అరోరా శేషన్ను అనుసరించి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘంపైన ఒంటికాలిపైన లేచేవారు కాదు. పోలింగ్ ఆరంభమైన రెండు గంటలకే మూడింట ఒక వంతు ఈవీఎం మెషీన్లు పని చేయడం లేదంటూ, రీపోలింగ్ జరిపించాలంటూ యాగీ చేయడానికి సాహసించేవారు కాదు. ఈవీఎంలను రష్యా ఏజెంట్లు హ్యాక్ చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణ చేసేవారు కాదు. ప్రవర్తన నియమావళి కమిషన్ జారీ చేసే ప్రవర్తన నియమావళిని రాజీలేకుండా అమలు చేసింది శేషన్ హయాంలోనే. అభ్యర్థులూ, పార్టీలూ ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవ హరించాలో నిర్దేశించడంతో పాటు, అధికార పార్టీ ఎటువంటి నిగ్రహం పాటించాలో కూడా నియమావళి ఏడవ భాగంలో వివరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి అధికార యంత్రానికి పరిపాలనా బాధ్యతల బదలాయింపు జరగాలన్నది ఉద్దేశం. ఎన్నికల సమయంలో అభ్య ర్థులందరికీ, అన్ని పార్టీలకీ సమానావకాశాలు (లెవల్ ప్లేయింగ్ఫీల్డ్) విధిగా ఉండాలన్న సూత్రాన్ని పాటించేందుకు వీలుగా అధికార పార్టీకి ఎటువంటి ఆధిక్యం లేకుండా చూసేందుకే ఈ ఏర్పాటు. ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. నైతికా ధికారమే ఎన్నికల కమిషన్ను నడిపిస్తుంది. ప్రవర్తన నియమావళి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ, మే 27 దాకా ఈ నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కమిషన్ను ఖాతరు చేయకుండా, దాని అధికారాలను గౌరవించకుండా వ్యవహ రించడం వల్ల చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరిం చవలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి (సీఎస్) పునేఠాపైన ఒత్తిడి తెచ్చి, వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేయిం చింది ముఖ్యమంత్రే. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయించి పునేఠా పదవిని ప్రమాదంలో పడవేసిందీ ఆయనే. ఎన్నికల సంఘం ఎంత మెతకగా ఉన్నప్పటికీ ఇటువంటి ధిక్కారాన్ని సహించ లేకపోయింది. అందుకనే పునేఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో అత్యంత అనుభజ్ఞుడైన అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యంను నియమించింది. ఆయనను ముఖ్యమంత్రి అందరు అధికారుల వలె గౌరవించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆయన సహనిందితుడనీ, కోవర్టు అనీ నోరు పారేసుకోవడం ద్వారా మొత్తం కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల ఆగ్రహాన్ని కొనితెచ్చుకున్నారు. క్షణికా వేశంలో చంద్రబాబు తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారు. ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఎన్ని పేజీల లేఖ రాసినా ఏమి ప్రయోజనం? తనకు సమీక్షించే అవకాశం ఉండి ఉంటే పిడుగులు పడి ఏడుగురు మరణించేవారు కారని ఆ లేఖలో రాయడం ఏ మనస్తత్వానికి అద్దం పడుతుంది? శాశ్వత కార్యనిర్వాహకవర్గం (పర్మెనెంట్ ఎగ్జిక్యుటీవ్) అన్ని వ్యవ హారాలూ చూసుకుంటుంది. ‘ఫణి’ ముమ్మరమై తుపాను సంభవించి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షించవచ్చు. సలహా ఇవ్వవచ్చు. అప్పుడైనా ప్రధాన కార్యదర్శితో, ఇతర అధికారులతో మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉండాలి. కె. రామచంద్రమూర్తి -
చంద్రబాబు కోడ్ ఉల్లంఘనలపై ఈసీ దృష్టి...
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా సీఎం...ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో...దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి...(అంతా నా ఇష్టం!) ఈసీ ఆదేశాలతో ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం నోటీసులు పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొనడంపై సీఎస్...సీఆర్డీఏ, జల వనరుల శాఖ వివరణ కోరారు. అలాగే సమీక్షల్లో పాల్గొన్న అధికారులు కూడా వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కాగా చంద్రబాబు నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. పోలవరం ప్రాజెక్ట్, సీఆర్డీఏ పనులపై సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. -
చంద్రబాబుకు ఆ విషయం తెలియదా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రివ్యూలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. ఆపద్ధర్మ సీఎం అత్యవసర సమయంలో మాత్రమే రివ్యూలు చేస్తారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల పథకాల కోసం ఖజానాలోని సొమ్మును తరలించారని విమర్శించారు. హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. సాధారణ పరిపాలనలో బిల్లులు కూడా పాస్ కావడం లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రూ. 1600 కోట్లతో పట్టిసీమను ఎందుకు ప్రారంభించారో సమాధానం చెప్పాలని అన్నారు. దోచుకోవడం కోసమే చంద్రబాబు పట్టిసీమను చేపట్టారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజస్వామ్య పరిరక్షించడమా అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మించకుండా చంద్రబాబు ఏం చేశారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏ కేటాయింపులో అవినీతి జరిగిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా రూ. 4 కోట్లకు కేటాయిస్తే.. వాళ్లకు నచ్చిన ప్రైవేటు సంస్థలకు రూ. 40 లక్షలకే కేటాయించారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని వ్యాఖ్యానించారు. అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సేవామిత్ర పేరుతో టీడీపీ నాయకులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారని గుర్తుచేశారు. ఈవీఎంల కేసులో నిందితుడు హరిప్రసాద్ను ఎన్నికల సంఘం దగ్గరకు తీసుకెళ్తారా అని నిలదీశారు. గెలుస్తామని చెబుతున్న చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. -
ఏపీలో మరో కొత్త వివాదం
సాక్షి, అమరావతి : ఏపీ ఎన్నికల కమిషన్ ముందుకు మరో కొత్త వివాదం వచ్చింది. కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బదిలీకి ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండా శివశంకర్ను బదిలీ చేసింది. ఈ వ్యవహారం ఈసీ దృష్టికి రావడంతో తమ అనుమతి లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్రస్థాయి అధికారి బదిలీ చేయడంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ఇక ఇప్పటికే ఈవీఎంల మొరాయింపు కుట్రపై సీరియస్గా ఉన్న ఈసీ.. పోలింగ్ రోజు ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిశితంగా పరిశీలన చేస్తోంది. ఏపీలో పోలింగ్ జాప్యానికి చంద్రబాబు నాయుడు సూచనలే కారణమని ఈసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగా లోతైన అధారాలు సేకరిస్తుంది. -
సీఎం చంద్రబాబు సమీక్షలకు సీఎస్ దూరం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు మేరకు సీఎస్ ...ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరు కాలేదు. కాగా పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్డీఏ పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆహ్వానించరాదు. అయితే చంద్రబాబు అధికారులను ఇరకాటంలో పెడుతూ తనకు కావాల్సిన వారికి ఖాజానా నుంచి బిల్లుల చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు సమీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈసీ మరోసారి స్పష్టం చేయడంతో చంద్రబాబు నాయుడు హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు. -
ఎన్నికల కోడ్ను ‘పీఎంవో’నే ఉల్లంఘిస్తే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కేంద్ర పాలిత ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, సంస్కతి, స్థానిక హీరోలు, ఆర్థిక, మతపరమైన ప్రాముఖ్య అంశాలు, అక్కడ పండే ప్రధాన పంటలు, ముఖ్య పరిశ్రమల తదితర వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించండి’ అంటూ ‘నీతి ఆయోగ్’కు చెందిన పింకీ కపూర్ అనే అధికారి ఏప్రిల్ 8వ తేదీన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్కు, ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఈ మెయిల్ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్యటన నేపథ్యంలో ఆయన ఈ మెయిల్ను పంపారు. అంటే ప్రధాని ఎన్నికల ప్రసంగంలో ప్రస్తావించేందుకు ఈ వివరాలు అడిగినట్లు సులభంగానే అర్థం అవుతోంది. అంతకుముందు ‘నీతి ఆయోగ్’ నుంచి బీజేపీ పాలిత మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు మార్చి 31వ తేదీన ఇలాంటి ఈ మెయిలే వెళ్లింది. అలాగే మహారాష్ట్రలోని వార్ధా, లాథూర్ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇలాంటి ఈ మెయిల్స్ వెళ్లాయని వారి నుంచి వచ్చిన లేఖల ద్వారా స్పష్టం అవుతోంది. గోండియా సంక్షిప్త చరిత్ర, భౌగోళిక స్వరూపం, మతాల ప్రాతిపదికన జనాభా శాతం తదితర విరాలతో ‘ప్రధాన మంత్రి కార్యాలయానికి గోండియా జిల్లా సంక్షిప్త సమాచారం’ అనే శీర్షికతో అక్కడి జిల్లా కలెక్టర్ పంపించారు. లాథూర్కు సంబంధించిన చరిత్ర, చారిత్రిక కట్టడాలు, ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల వివరాలను తెలియజేస్తూ అక్కడి కలెక్టర్ కూడా లేఖను పంపించారు. వార్ధా జిల్లా కలెక్టర్ నుంచి అలాంటి సమాచారమే అందింది. ‘వార్ధా డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఫర్ పీఎంవో’ అనే శీర్షికతో పంపిన ఆ లేఖలో ఆ ప్రాంతాన్ని భారత స్వాతంత్య్ర సమర యోధులు మహాత్మా గాంధీ, వినోబాభావే లాంటి వారు సందర్శించి కొంతకాలం అక్కడ గడిపనట్లుగా వివరాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ ఒకటవ తేదీన వార్ధా, మూడవ తేదీన గోండియాలో, ఏప్రిల్ 9వ తేదీన లాథూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని ఆయన అక్కడక్కడ సందర్బోచితంగా ప్రస్తావించారు. మార్చి 10వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ మార్చి పదవ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అంటే ఆ నాటి నుంచి ప్రధాన మంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారెవరూ కూడా అధికారిక కార్యక్రమాలతో పార్టీ ప్రచార కార్యక్రమాలను ముడిపెట్ట రాదు. ఎన్నికల ప్రచారం కోసం అధికార యంత్రాంగం సేవలను ఏమాత్రం ఉపయోగించుకోరాదు. అలాంటప్పుడు ప్రధాని కార్యాలయానికి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ సమాచారం కోసం జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడం ఏమిటీ ? ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ అధికారులుగా కీలక బాధ్యతలు నిర్వహించే కలెక్టర్లు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం ఏమిటీ? వారి చర్య ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం కాదా ? ఇదే విషయమై మహారాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి దిలీప్ షిండేను మీడియా ప్రశ్నించగా, ఈ విషయాలేవి తన దష్టికి రాలేదని తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ స్ఫూర్తి ఏమిటంటే! ‘పదవుల్లో ఉన్న వారు ఎవరైనా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షించాలి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను అందులో పోటీచేసేవాళ్లు శంకించేలా, లేదా సందేహించేలా ఎవరు ప్రవర్తించకూడదు, ప్రవర్తించారన్న సందేహం కలిగేలా కూడా వ్యవహరించరాదు’ అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నరేంద్ర బుటోలియా స్పష్టం చేశారు. అధికార హోదాలో ఉండి రాహుల్ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్ యోజన’ పథకాన్ని విమర్శించినందుకు ఆయన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో నరేంద్ర బుటోలియా ఇలా స్పందించారు. అనేక ఆరోపణలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఇప్పటి వరకు పాలకపక్ష బీజేపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కోడ్ అమల్లోకి వచ్చాక ‘నమో టీవీ’ ప్రసారాలను ప్రారంభించడం అందులో ఒకటి. ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ లేకుండా ఆ టీవీ ప్రసారాలు కొనసాగడం అశ్చర్యం. రాహుల్ గాంధీని విమర్శించే విషయంలో మత పరమైన అంశాలను ప్రస్తావించి కోడ్ ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ పలు రాష్ట్రాల గవర్నర్లపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెల్సిందే. (చదవండి : ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?) -
టీడీపీ అభ్యర్థులైతే తూచ్
కావలి: కావలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిష్పక్షపాతంగా కోడ్ను అమలు చేయాల్సిన ఎన్నికల అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నా కోడ్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చామకూరు శ్రీధర్ సబ్కలెక్టర్గా చేరిన తర్వాత మొదటి ఎన్నికలు కావడంతో కింద స్థాయి సిబ్బందిపై ఆధారపడుతున్నారు. కింద స్థాయి సిబ్బందిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వారు మితిమీరిన జోక్యం చేసుకుంటూ ఆయన్ని తమ దారిలో తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు సమాచారాన్ని అందజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థుల ‘హ్యాండ్బుక్ ఫిబ్రవరి– 2019’ పేజీ నంబర్ 130లో రూల్ నంబర్ 11.3.2లో వివరింగా పొందుపరిచారు. అయితే కావలి ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నట్లుగా వ్యహరించారు. ఎన్నికల అధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో టీడీపీకి అనుకూలమైన వారి ద్వారానే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారి పాత్ర విమర్శలకు దారితీసింది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్లో పేజీ నంబర్ 29లో రూల్నంబర్ 4.4లో బీ5 ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర కావలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపై నేటి వరకు ఎన్నికల అధికారి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్లో పేజీ నంబర్ 144లో రూల్ నంబర్ 22.4 ప్రకారం తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీ సైజు 4 ..8 అడుగులలో మాత్రమే ఉండాలని పొందుపరిచారు. అయితే పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి దగ్గరలో ఏర్పాటు చేసిన టీడీపీ తాత్కాలిక కార్యాలయం వద్ద 5..30 అడుగులతో ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఖర్చులు వివరాలను ఎన్నికల అధికారి పరిశీలించి అభ్యర్థి లెక్కల్లో నిర్ధిష్టంగా కనబరచాలి. కానీ ఇవేమీ జరగలేదు. ప్రయివేటు విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించకూడదు. కానీ టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్రావు, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి కావలిలోని పమిడి స్కూల్ ఆవరణలో భారీ సమావేశం నిర్వహించారు. ‘అభ్యర్థుల హ్యాండ్ బుక్–ఫిబ్రవరి–2019’ పేజీ నంబర్ 89,265లో ప్రయివేటు విద్యాసంస్థల్లో రాజీకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టంగా పొందుపరిచి ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.