IPL-10
-
దానికోసం నేనేమీ ఏడ్వలేదు: హర్భజన్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కకపోవడం తనను ఎంతమాత్రం నిరాశకు గురి చేయలేదని హర్భజన్ సింగ్ తాజాగా స్పష్టం చేశాడు. అయితే తుది పోరులో తనకు అవకాశం దక్కుతుందని తొలుత ఆశించినట్లు భజ్జీ తెలిపాడు. 'ఫైనల్ మ్యాచ్ లో నాకు ముంబై ఇండియన్స్ సెలక్టర్లు చోటు ఇవ్వకపోవడం నాకేమీ బాధ అనిపించలేదు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. నేను జట్టు మనిషిని. కొన్ని సాంకేతికపరమైన అంశాలు ముడిపడి ఉండటంతోనే లెగ్ స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె జట్టులో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ ఉండటం వల్లే నాకు విశ్రాంతి ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబై కోచ్ మహేలా జయవర్ధనే నాకు చెప్పాడు కూడా. నాకు స్థానం దక్కనందుకు ఎటువంటి బాధలేదు. దానికోసం నేనేమీ ఏడ్వలేదు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 'మీరు తుది జట్టులో ఉంటానని భావించారా?'అన్న ప్రశ్నకు భజ్జీ పై విధంగా సమాధానమిచ్చాడు. -
ముంబై ఇండియన్స్ బెస్ట్.. సన్ రైజర్స్ లాస్ట్!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ను స్వల్ప స్కోరుకే కట్టడిచేసి విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 117 సిక్సర్లు నమోదు చేసి అగ్రస్థానం ఆక్రమించగా, సన్ రైజర్స్ అట్టడుగున నిలిచింది. ఓవరాల్గా అన్ని జట్లు కలిపి 705 సిక్సర్లు సాధించాయి. గతేడాది (638) కంటే 67 సిక్సర్లను ఆటగాళ్లు ఈ సీజన్లో రాబట్టారు. ముంబై తర్వాత 92 సిక్సర్లతో గుజరాత్ లయన్స్, 89 సిక్సర్లతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 87 సిక్సర్లు, కోల్కతా నైట్ రైడర్స్ 87 సిక్సర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు75 సిక్సర్లు, సన్రైజర్స్ హైదరాబాద్ 70 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మ్యాక్స్వెల్లు అత్యధికంగా 26 సిక్సర్లతో సంయుక్తంగా తొలిస్థానం దక్కించుకోగా.. యువ సంచలనం రిషబ్ పంత్ 24 సిక్సర్లు, కీరన్ పోలార్డ్ 22 సిక్సర్లు, రాబిన్ ఉతప్ప 21 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!
-
ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!
ఐపీఎల్-10 ఫైనల్ పోరు ముంబై ఇండియన్స్-రైజింగ్ సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠంగా సాగుతోంది. పుణే విజయానికి 4 బంతుల్లో 7పరుగులు కావాలి. మామూలుగా ఇది సాధ్యమే. కానీ సాధ్యాన్ని అసాధ్యంగా మార్చింది ముంబై. ఒక పరుగు తేడాతో ఐపీఎల్-10 విజేతగా నిలిచింది. ఇందుకు కారణం ముంబై టీం పర్ఫార్మెన్స్ కాదట. 4 బంతులు మిగిలివుండగా ముంబై గెలవాలని కళ్లు మూసుకుని స్టేడియంలో ప్రార్థన చేసిన బామ్మట. ఆమె ప్రార్ధనే ముంబైకు మిరాకిల్ విన్ దక్కేలా చేసిందని ట్వీట్లు హోరెత్తాయి. ఆమెకు 'ప్రేయర్ ఆంటీ' అని పేరు పెట్టేశారు ట్వీటరాటీలు. ఈ ట్వీటర్లో వెల్లువలా వస్తున్న ప్రేయర్ ఆంటీ ట్వీట్లను చూసిన బాలీవుడ్ నటుడు అభిషేక్ కూడా రీట్వీట్ చేశారు. ఏమనో తెలుసా?. ఆమె ఎవరో కాదు ముంబై ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ అమ్మ అని. ఆమెను అందరూ ముద్దుగా 'నాని' అని పిలుస్తారు అని చెప్పారు. దీంతో థ్యాంక్స్ నాని మీ వల్లే ముంబై ఇంత ఘనవిజయం సాధించిందని నెటిజన్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. -
అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఫైనల్లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఒకనొక దశలో 71/1 తో పటిష్టంగా కనిపించిన రైజింగ్ పుణెను ముంబై కట్టడి చేసి టైటిల్ ను ఎగురేసుకుపోయింది. ఈ టైటిల్ సాధించడంలో ముంబై ఇండియన్స్ పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా, మిచెల్ జాన్సన్ లు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి పుణెకు గట్టి షాక్ తగిలింది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో పుణె 30 పరుగులు చేయాల్సిన తరుణంలో మలింగాకు బంతి ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్లో అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న స్టీవ్ స్మిత్ బంతిని హిట్ చేయడానికి యత్నించినా సఫలం కాలేదు. ఆ ఓవర్ లో మలింగా యార్కర్లతో హడలెత్తించడంతో కేవలం ఏడు పరుగులే వచ్చాయి. దాంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. . అయితే మలింగా ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది. గత కొన్నేళ్లుగా మలింగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కీలక ఫైనల్లో మలింగా మ్యాజిక్ చేస్తాడని నేను ముందే బలంగా నమ్మా. ఒక ఓవర్ లో పూర్తిగా పరిస్థితుల్ని మార్చేసి శక్తి మలింగాకు ఉంది. ఆ అంచనాల్ని అందుకుని ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు'అని సచిన్ తెలిపాడు. మరొకవైపు జట్టు విజయంలో కోచ్ మహేలా జయవర్ధనే పాత్రను సచిన్ గుర్తు చేశాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించిన తరుణంలో జయవర్ధనే ఆటగాళ్లలో ధైర్యం నింపిన తీరు అమోఘం అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం వరిస్తుందని చెప్పడంతో పాటు ఒకసారి చాంపియన్ ఎప్పుడూ చాంపియన్ అనేది గుర్తించుకుని పోరాడాలంటూ జయవర్దనే ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన విధానం చాలా బాగుందని సచిన్ తెలిపాడు. -
‘యువ’ మెరుపుల్...
ఐపీఎల్–10లో యువ ఆటగాళ్ల హవా ‘యువరాజ్, రైనాలను కలిపి చూస్తే రిషభ్ పంత్. అంతలా నన్ను ఆకట్టుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో అతను ఆడిన తీరు అద్భుతం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ బౌలింగ్ సూపర్. సిరాజ్, థంపి భవిష్యత్ బౌలింగ్కు భరోసా కల్పించారు’ యువ కెరటాలపై సచిన్ కామెంట్స్ ఇవి. నిజమే... ఈ బ్యాటింగ్ దిగ్గజం అన్నట్లు ఐపీఎల్–10కు ఈ యువధీరులంతా కొత్త శోభ తెచ్చారు. – సాక్షి క్రీడావిభాగం ♦ భవిష్యత్ ఆశాకిరణాల్లో కచ్చితంగా రిషభ్ పంత్ ఒకడు. 19 ఏళ్ల ఈ ఢిల్లీ డేర్డెవిల్స్ టాపార్డర్ బ్యాట్స్మన్ ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చేజింగ్లో అతని ఎదురుదాడి అద్భుతం. తమ తొలి మ్యాచ్లో బెంగళూరుకు చుక్కలు చూపించిన పంత్ (57)... ప్రత్యర్థి జట్టును ఓడించినంత పని చేశాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక గుజరాత్ లయన్స్ పాలిట సింహ స్వప్నంగా మారాడు. సిక్సర్ల జడివానతో పరుగుల వర్షం (56 బంతుల్లో 97; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) కురిపించాడు. ఐపీఎల్–10లో ఇది ఆరో అత్యుత్తమం. ఓవరాల్గా 165.61 స్ట్రయిక్ రేట్తో 366 పరుగులు చేశాడు. ♦ ముంబై ఇండియన్స్ యువ సంచలనం నితీశ్ రాణా. ఈ 23 ఏళ్ల బ్యాట్స్మన్ జట్టు కీలక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. చేజింగ్లో విన్నింగ్ పెర్ఫార్మెన్స్కు పెట్టింది పేరు. కోల్కతాతో జరిగిన పోరులో భారీ లక్ష్యఛేదనలో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అతని జోరుముందు చక్కని బౌలింగ్ వనరులున్న సన్రైజర్స్ హైదరాబాద్ పప్పులూ ఉడకలేదంటే అతిశయోక్తికాదు. అనుభవజ్ఞులైన రోహిత్శర్మ, బట్లర్, పొలార్డ్లు విఫలమైన చోట వీరోచిత పోరాటం చేశాడు. ముంబైకి వరుస విజయాలందించాడు. గుజరాత్, పంజాబ్ల బౌలింగ్నూ చీల్చి చెండాడాడు. ఈ సీజన్లో ఆడిన 12 ఇన్నింగ్స్ల్లోనే 30.27 సగటుతో 333 పరుగులు చేశాడు. ♦ రాహుల్ త్రిపాఠి... ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన బ్యాటింగ్ సెన్సేషన్. ధోని మార్గదర్శనంలో ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాట్స్మన్ వచ్చిన అవకాశాల్ని చక్కగా సద్విని యోగం చేసుకున్నాడు. 14 మ్యాచ్ల్లో 391 పరుగులు చేసిన రాహుల్ ఈ సీజన్ టాప్–10 స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఓపెనింగ్లో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు)... కోల్కతాపై ఒంటిచేత్తో గెలిపించాడు. స్టోక్స్ సహా స్మిత్, ధోని పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన ఈడెన్ గడ్డపై సిక్సర్ల మోత మోగించాడు. ♦ యార్కర్ల సూపర్ పేసర్ బాసిల్ థంపి. ఈ లీగ్లో గుజరాత్ లయన్స్ తరఫున ఆకట్టుకున్న యువ బౌలర్. వికెట్ల పరంగా (11) గొప్ప ప్రదర్శన కాకపోవచ్చు. కానీ అతని బౌలింగ్ తీరు... దూసుకెళ్లే బంతుల్లో పదును... అంత ఆషామాషీ కాదు. అందుకే ఐపీఎల్ జ్యూరీ అతని ప్రదర్శనను గుర్తించింది. ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును అందించింది. గంటకు 140 కి.మీ. స్థిరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టించే సహజమైన శైలి అతని సొంతం. అతని షోకు ఒక్క సచినే కాదు... భారత కెప్టెన్ కోహ్లి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కితాబిచ్చారు. ♦ విదేశీ ఆటగాళ్లలో సూపర్ సర్ప్రైజ్ మాత్రం సునీల్ నరైన్దే! కోల్కతా నైట్రైడర్స్ గత టైటిల్ విజయాలకు స్పిన్ మంత్రాన్ని నమ్ముకుంది. కానీ ఈసారి బ్యాట్తో అది కూడా... ఓపెనింగ్ బ్యాట్స్మన్గా నరైన్ ఆల్రౌండర్ అవతారమెత్తాడు. అతని దూకుడు ఎలా ఉందంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఆ వేగాన్ని అందుకోలేకపోయారు. అందుకే ఈ సీజన్లోనే వేగవంతమైన అర్ధసెంచరీ అవార్డు అతని బ్యాట్నే వరించింది. ఈ సీజన్లో నరైన్ 172.30 స్ట్రయిక్ రేట్తో 224 పరుగులు చేశాడు. మేటి బ్యాట్స్మెన్ అయిన డివిలియర్స్ (216), గేల్ (200), యూసుఫ్ పఠాన్ (143), కోరే అండర్సన్ (142)ల కంటే ముందు వరుసలో ఉన్నాడు. అలాగని బౌలింగ్లో విఫలం కాలేదు. 6 పరుగుల ఎకానమి రేట్తో 10 వికెట్లు కూడా తీశాడు. బెంగళూరుపై నరైన్ 15 బంతుల్లోనే చేసిన అర్ధసెంచరీ ఈ టోర్నీలోనే హైలైట్గా నిలిచింది. ♦ వేలంలో అందరి కళ్లు బెన్ స్టోక్స్పైనే! అంచనాలకు అనుగుణంగా రూ.14.5 కోట్లతో రైజింగ్ పుణే పంచన చేరిన స్టోక్స్... కొన్ని ఆరంభ మ్యాచ్ల్లో తేలిపోయినా... తర్వాత తన విలువేంటో చూపాడు. ఈ సీజన్లో నమోదైన ఐదు సెంచరీల్లో అతనిదీ ఓ శతకముంది. మరో వైపు రూ. 12 కోట్లు పెట్టి బౌలర్ టైమల్ మిల్స్ను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు అతను ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐదు మ్యాచ్లే ఆడిన అతను ఐదు వికెట్లు తీసి నిరాశపరిచాడు. -
'ఆ లోటు పుణె జట్టులో కనబడింది'
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడటం పట్ల రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే తుది పోరులో ఓటమి చెందడానికి ప్రధాన కారణంగా విశ్లేషించాడు. 'బెన్ స్టోక్స్ లేని లోటు కనబడింది. ఫైనల్ పోరుకు స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరొరకంగా ఉండేది. స్టోక్స్ లేకపోవడం వల్ల మేము ఎక్సట్రా బౌలర్ తో బరిలోకి దిగాల్సి వచ్చింది. దాంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. ఆ క్రమంలోనే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాం. ఇక్కడ స్టీవ్ స్మిత్-రహానేల భాగస్వామ్యం తప్పితే, వేరే మంచి భాగస్వామ్యాలు రాలేదు. కీలక సమయాల్లో వరుసగా వికెట్లను కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. దాంతో ముంబై ఇండియన్స్ కు దాసోహమయ్యాం' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆఖరి పోరులో పుణె పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కేవలం స్మిత్, రహానేలు తప్పితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో టైటిల్ ను అందుకోవాలనుకున్న పుణె ఆశలు తీరలేదు. -
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
-
వాషింగ్టన్ సుందర్ కొత్త రికార్డు
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ ఆడిన అత్యంత పిన్నవయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-10లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫైనల్లో పాల్గొనే సమయానికి అతని వయసు 17 సంవత్సరాల 228 రోజులు. తద్వారా అంతకుముందు రవీంద్ర జడేజా పేరిట ఉన్న రికార్డును సుందర్ అధిగమించాడు. 2008లో రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫైనల్ ఆడే సమయానికి అతని వయసు 19 ఏళ్ల 178 రో్జులు. అదే ఇప్పటి వరకూ ఐపీఎల్ ఫైనల్ ఆడిన పిన్నవయస్కుడి రికార్డుగా ఉంది. దాన్ని తాజాగా వాషింగ్టన్ సెందర్ సవరించాడు. గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో ఫైనల్కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్రౌండర్ పర్వేజ్ రసూల్తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణె జట్టు నెట్స్లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కేవలం పరుగు తేడాతో రైజింగ్ పుణెను ఓడించి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంచితే, అసలు చివరి ఓవర్ లో తమ వ్యూహం అమలు చేసిన తీరును మ్యాచ్ ముగిసాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 'చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్ ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్తో చర్చించా. సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమనే చెప్పా. అతను పేస్ బౌలింగ్ ను ఎలా పేస్ చేస్తాడో మనం అంతకుముందు చూశాం. మరొకవైపు అప్పుడు జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆపై పుణె పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. కాగా మూడో బంతికి స్మిత్ గాల్లోకి లేపి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. -
జట్టు గెలిచిన ఆనందంలో టవల్ విప్పేసి..
-
జట్టు గెలిచిన ఆనందంలో టవల్ విప్పేసి..
ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ ఆనందం కట్టలు తెగింది. అంతే వినూత్నంగా ఆ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. తాను చేసిన ఒకింత వింత, వికృత ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు. ఆదివారం హోరాహారీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పుణెపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించడంతో బట్లర్ ఆనందంలో కట్టుకున్న టవల్ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు. సావరియా సినిమాలో రణ్బీర్ సింగ్ను గుర్తుకుతెచ్చేలా అతను వేసిన నగ్న గంతుల వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు జోస్ బట్లర్ కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అతను ఫైనల్కు ముందే ఇంగ్లండ్కు వెళ్లిపోయి.. తమ జట్టులో చేరాడు. ఫైనల్లో అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్ను టీవీలో వీక్షించిన ఈ ఇంగ్లిష్ వికెట్ కీపర్ తనదైన స్టైల్లో జట్టు ఆనందంలో భాగమయ్యాడు. -
పుణె ఓనర్పై ధోని ఫ్యాన్స్ సెటైర్లు..
హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె యజమాని సోదరుడు హర్ష గోయంకాకు ధోని అభిమానుల మధ్య ట్వీటర్ వార్ నడుస్తుంది. గతంలో ధోనిపై అవాకు చేవాకులు పేల్చిన హర్షగోయంకాకు ధోని అభిమానులు ట్వీటర్ వేదికగా గట్టిగా బుద్ది చెప్పారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో పుణె విజయం ముంగిట చతికిలబడటంతో గోయంకా పై ధోని అభిమానులు విరుచుకు పడ్డారు. విజయం ఖాయం అనుకున్న సంధర్భంలో ముంబై బౌలర్ల అద్భత ప్రదర్శనకు పుణే ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్ ను దూరం చేసుకుంది. అయితే ఈ ఓటమికి బాద్యుడు గోయంకానే అని ధోని అభిమానులు విమర్శిస్తున్నారు. గోయంకా పై వరుస వ్యంగ్య ట్వీట్లతో విరుచుకు పడుతున్నారు. ఎవరిని కించపరిచేలా మాట్లడవద్దు.. అలా మాట్లడితే ఇలా కర్మ సిద్దాంతం పనిచేస్తుందని ఒకరు.. అడవి రాజు ఏమి చేశాడని మరొకరు.. ఇప్పుడు అడవి రాజు ఎవరో అర్ధమైందా అని వ్యంగ్య ట్వీట్ లతో విరుచుకు పడ్డారు. గతంలో గోయంకా అడవి రాజు ఎవరో తెలిసిందా..అని స్మిత్ను పొగడ్తూ ధోనిని కించపరిచేలా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. మరొకసారి స్ట్రైక్రేట్లను పోస్ట్ చేస్తూ ధోనిని తక్కువ చేసేలా ట్వీట్ చేశాడు. దీంతో అప్పట్లోనే గోయంకా పై అతని అభిమానులు ధోని భార్య సాక్షి సింగ్ ట్వీట్ లతో సమాధానం చెప్పారు. -
ఫైనల్స్కు ముందే ప్రైజ్ దక్కింది
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-10 ఫైనల్ మ్యాచ్కు గంటన్నర ముందే ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్కు భారీ బహుమతి దక్కింది! పుణెతో తుదిపోరు కోసం ముంబై జట్టును సన్నద్ధం చేస్తున్న సమయంలోనే.. రోడ్స్కు శుభవార్త అందింది. ఆదివారం సాయంత్రం సరిగ్గా 6:20కి జాంటీ సతీమణి మెలానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ గెలుపును ముందే ఊహించిన జాంటీ రోడ్స్.. 'ప్రైజ్కు ముందే ప్రైజ్ అందుకున్నా..'నంటూ కొడుకు పుట్టిన విషయాన్ని ప్రపంచానికి షేర్ చేశాడు. పనిలోపనిగా కొడుకు పేరు నాథన్ జాన్ అని కూడా చెప్పేశాడు. ముంబై(సాంటాక్రజ్)లోని సూర్యా హాస్పిటల్లో 'పూల్బర్త్' విధానంలో పురుడుపోసుకుంది మెలానీ. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. నాథన్ కంటే ముందు(2013లో) జాంటీ దంపతులకు జన్మించిన పాపకు 'ఇండియా' అని పేరుపెట్టుకున్న సంగతి తెలిసిందే. జాంటీ ఇద్దరు పిల్లలూ ముంబైలోనే పురుడుపోసుకోవడం గమనార్హం. -
మా వాళ్లతో అదే చెప్పా: రోహిత్ శర్మ
హైదరాబాద్: ఐపీఎల్-10 టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన తమ బౌలర్లపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. తుదిపోరులో తమ టీమ్ అద్భుతంగా ఆడిందని మెచ్చుకున్నాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని, మ్యాచ్ బాగా జరిగిందని పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించి రోహిత్ సేన టైటిల్ కైవసం చేసుకుంది. ‘క్రికెట్లో ఇది గొప్ప మ్యాచ్. అందరూ ఎంజాయ్ చేసివుంటారని భావిస్తున్నాను. ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగులుండగా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బౌలర్లు చెప్పినట్టుగానే ఫీల్డింగ్ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టార’ని మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ అన్నాడు. -
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!
హైదరాబాద్: అతనో మ్యాచ్ ఫినిషర్.. చేజింగ్ ఒత్తిడిలో ఎన్నో విజయాలందించిన అనుభవం.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సందర్భాలెన్నో.. అలాంటి డేంజరేస్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం మంచి వ్యూహంతో ఆ బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని.. క్వాలిఫయర్-1 లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన మహేంద్రుడు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. స్వల్ప లక్ష్యాన్ని ఎదుర్కొలేక అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఒక్క పరుగుతో పుణె పై గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి నుంచి విజయ అవకాశం పుణే వైపు ఉన్న ధోని అవుటవ్వడంతో ఒక్కసారిగా ముంబై పట్టు సాధించింది. అజింక్యా రహానే అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్ తో ఆచితూచి ఆడాడు. ఇదే పుణే ను కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. కేవలం ఓవర్ కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం. పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుట్ తో పట్టు సాధించిన ముంబై పుణె కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. -
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రోహిత్ సేన తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. చివర బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుంది. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఈ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ గ్యాంగ్ గెలుపు అంచులవరకూ వచ్చి చతికిలబడింది. ఆదివారం ఇక్కడ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. చివరి మ్యాచ్ లో ఆద్యంత ఆకట్టుకున్న ముంబై బౌలర్లు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురైన పుణె పోరాడి ఓటమి చెందింది. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(44),స్టీవ్ స్మిత్(51) రాణించినా జట్టుకు విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఉత్కంఠ రేపిన చివరి ఓవర్ చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. మూడో బంతికి స్మిత్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరచడంతో ముంబైకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై మూడంకెల స్కోరుకు చేరగల్గింది. -
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
-
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో టాపార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో కృనాల్ పాండ్యా(47), రోహిత్ శర్మ(24) లు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఫీల్డింగ్ అదుర్స్.. అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పుణె ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని పుణె ఫీల్డర్లు వదల్లేదు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ సిమన్స్ ను రిటర్న్ క్యాచ్ రూపంలో ఉనద్కత్ అద్భుతంగా అందుకున్నతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి కింది పడబోయే సమయంలో ఉనద్కత్ మెరుపు వేగంతో ఒడిసి పట్టుకుని శభాష్ అనిపించాడు. ఆ తరువాత అంబటి రాయుడ్ని స్టీవ్ స్మిత్ రనౌట్ చేసిన తీరు అమోఘం. ఈ రెండు ఒక ఎత్తయితే ఆడమ్ జంపా బౌలింగ్ లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అందుకున్న వైనం మ్యాచ్ కే హైలెట్. ఆపై కరణ్ శర్మను శార్దూల్ ఠాకూర్ రనౌట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక్కడ కరణ్ శర్మ ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను ముందు క్రిస్టియన్ వదిలేశాడు. కాగా, అప్పటికే కరణ్ శర్మ క్రీజ్ ను వదిలేసి ముందుకు వెళ్లి పోయాడు. ఆ సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించిన బౌలర్ శార్దూల్ ఠాకూర్.. క్రిస్టియన్ విసిరిన బంతిని చాకచక్యంగా అందుకుని రనౌట్ చేశాడు. ఒకవైపు మైమరించే క్యాచ్లు, మరొకవైపు అద్భుతమైన రనౌట్లతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు పుణె ఆటగాళ్లు. -
ఐపీఎల్ విజేత ఎవరో?
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 విజేత ఎవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ ల మధ్య తుది సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 3–0తో పుణెదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. పుణె అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్మన్గా, కీపర్గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్కు ఇప్పుడు మరో మ్యాచ్లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్తో కలిసి జట్టును నడిపిస్తే పుణెకు తిరుగుండదు. మరొకవైపు బ్యాటింగ్లో కూడా ముంబైకి తిరుగులేదు. ప్రధానంగా రోహిత్ , అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్లపైనే ముంబై బ్యాటింగ్ లో కీలకం. ఇరు జట్లు గత మ్యాచ్ లో ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతున్నాయి. దాంతో ముంబై ఇండియన్స్ జట్టులో హర్భజన్ సింగ్ కు స్థానం దక్కలేదు. ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్ధీవ్ పటేల్, అంబటి రాయుడు, సిమన్స్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, మలింగా పుణె తుది జట్టు: :స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారీ,ఎంఎస్ ధోని, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గ్యుసన్, ఆడమ్ జంపా, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్ -
ఐపీఎల్ విజేత ఎవరో?
-
స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ కు కొద్ది గంటల ముందు భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరవలేనివిగా పేర్కొన్నాడు. ' నా సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఎత్తు పల్లాలు చవిచూడటమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొంతమంది ప్రజల్ని కూడా కలిశాను. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఐపీఎల్ ఆడటం అనేది అదొ గొప్ప అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ తరువాత కేవలం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉంటా. భారత్ లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది'అని స్టీవ్ స్మిత్ తన ఇన్స్టా గ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ తో తొలిసారి పుణె తలపడతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను లిఖిస్తారు. మరి టైటిల్ పోరులో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
'ఐపీఎల్ ఫైనల్ నీకో ఛాన్స్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో ఫైనల్ కు చేరి అందరి అంచనాల్ని తలక్రిందులు చేసింది రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను తుది సమరంలో ఢీకొట్టడానికి సిద్దమైంది. తమ జట్టు ఫైనల్ వరకూ చేరడానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఎంఎస్ ధోనిల మధ్య సఖ్యత బాగుండటమేనని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ధోని, స్మిత్ లు మంచి సారథులుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. జట్టులో వారి మధ్య సమన్వయం చాలా బాగుంది. ఇదే మా జట్టు ఫైనల్ కు చేరడానికి దోహదం చేసింది. వీరిద్దరూ సీనియర్లు కావడంతో కోచ్ గా నాకు కాస్త భారం తగ్గింది. యువ క్రికెటర్లు వీరి నుంచి ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పదేళ్ల ఐపీఎల్ ను చూస్తే అత్యంత విజయవంతమైన క్రికెటర్ ధోని. ప్రస్తుతం ధోని కోసం మరో ఐపీఎల్ ఫైనల్ ఎదురుచూస్తోంది' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
పుణె సక్సెస్ కు కారణం ఇదే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. అయితే ఆ జట్టు తుది సమరానికి సిద్ధమై మేటి జట్లను సైతం ఔరా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందు పుణె జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి ఆ బాధ్యతల్ని స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగినప్పటికీ, ఆ తరువాత అంతా సర్దుకుంది. ఇక్కడ ధోని కూడా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారనే విషయాన్ని పట్టించుకోకుండా మిస్టర్ కూల్ తరహాలో అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోవడంతో జట్టులో ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు. దీన్ని కాసేపు పక్కకు ఉంచితే, ఈ సీజన్ లో పుణె జట్టు స్వల్ప మార్పుతో బరిలోకి దిగింది. గత సీజన్ పుణె సూపర్ జెయింట్స్ గా వచ్చి నిరాశపరిచిన పుణె.. ఈసారి పుణె సూపర్ జెయింట్ గా పోరుకు సిద్ధమైంది. కేవలం జట్టు పేరులో 'ఎస్' అనే చివరి అక్షరాన్ని తొలగించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇలా పేరు మార్చడానికి న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం)నే కారణమంటున్నాడు పుణె యజమాని సంజీవ్ గోయంకా. తనకు సంఖ్యాశాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ, పేరు మార్చి చూస్తే ఏంపోతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ఇది పుణె జట్టును ఫైనల్ వరకూ చేర్చడంలో సహకరించిందంటూ తెగ ఆనందపడిపోతున్నాడు. -
నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్: ముంబై ఇండియన్స్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగే ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉప్పల్ స్టేడియం చుట్టూ, లోపల పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి రాచకొండ పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్లతో స్టేడియం లోపల, బయట అణువణువూ చెక్ చేశారు. స్టేడియం బయట అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్కు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పించారు. 1,800 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. 870 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 88 సీసీ కెమెరాలతో బందోబస్తు నిర్వహించారు. -
ఐపీఎల్ ఫైనల్: ముంబైలో కలవరం!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో తుది అంకానికి రెండుజట్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రెండుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణే వరుస విజయాలతో ఫైనల్ చేరగా, ముంబై మాత్రం కొన్ని విషయాలలో ఆందోళన చెందుతుంది. ముంబై ఇండియన్స్ను రెండు సెంటిమెంట్లు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో పుణే చేతిలో మూడు పర్యాయాలు ఓడిపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే.. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్లో రెండో స్థానంలో నిలిచన టీమ్ను ఐపీఎల్ కప్ వరిస్తుండటం ముంబైపై ఒత్తిడి పెంచుతుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లకుగానూ 10 మ్యాచ్లు నెగ్గి నాలుగింట్లో ఓడగా, రెండు పర్యాయాలు పుణే చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును కలవరపాటుకు గురిచేస్తుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లోనూ తమ చేతిలో ఓడిన ముంబైతో ఫైనల్ మ్యాచ్ కావడం పుణేలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. లీగ్ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పుణే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్తో సహా ఈ సీజన్లో తలపడిన మూడు పర్యాయాలు పుణే చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్కతా నైట్ రైడర్స్పై నెగ్గి ముంబై ఫైనల్లోకి దూసుకెళ్లినా పుణే అడ్డంకిని అధిగమిస్తేనే వారు మూడోసారి చాంపియన్గా అవతరిస్తారు. మరోవైపు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబైకి ఫైనల్ ఫీవర్ తప్పదని చెప్పవచ్చు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), ఆర్సీబీ(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), సీఎస్కే(1) ఆడగా ముంబై టైటిల్ సాధించగా, 2014లో పంజాబ్(1)పై కేకేఆర్(2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి సగర్వంగా కప్పును రెండో సారి అందుకుంది. ముంబై నెగ్గిన రెండు సీజన్లలోనూ లీగ్ లో చెన్నై(1)పైనే రెండో స్థానంలో ఉన్న ముంబై(2) గెలుపొందడం గమనార్హం. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ ముంబై ఇండియన్స్ (1) - విజేత ? -
'స్టీవ్ స్మిత్ వల్లే సక్సెస్ అయ్యా'
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్. తొలి నాలుగు మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ ఆ తరువాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ 22 వికెట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉనాద్కత్.. ఇందుకు కారణం తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అని పేర్కొన్నాడు. 'స్టీవ్ స్మిత్-ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం నాకు చాలా ఉపయోగపడింది. వారిద్దర వద్ద ఆడటం నాకొక మంచి అనుభవం. ఈ సీజన్ లో ఆఖరి ఓవర్లను ఎక్కువగా వేశా. డెత్ ఓవర్లను వేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కెప్టెన్ నుంచి సహకారం అవసరం. అటువంటి సహకారం నాకు స్మిత్ నుంచి అందింది. నాపై నమ్మకం ఉంచడంతోనే నా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా. స్టీవ్ స్మిత్ కు బౌలర్లకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దాంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపడం కూడా తెలుసు'అని ఉనాద్కత్ పేర్కొన్నాడు. -
'తుదిపోరులో సత్తాచాటుతా'
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్ -1లో నిరాశపరిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి తుది పోరులో మాత్రం సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ లో మెక్లీన్ గన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన త్రిపాఠి.. టైటిల్ పోరులో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వనని అంటున్నాడు. 'నిజానికి అపజయాలే గెలుపుకు సోపానాలు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతా. ఓటుములతో నిరాశ చెందకుండా, మరింత కష్టపడి ముందుకు సాగాలి. ఇప్పటివరకూ నా ఐపీఎల్ ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. అదే స్ఫూర్తితో ఫైనల్లో కూడా రాణిస్తా. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం నా అదృష్టం. మహేంద్ర సింగ్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి మేటి గాళ్ల సలహాలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి' అని రాహుల్ త్రిపాఠి తెలిపాడు. రేపు(ఆదివారం) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. -
వెయిటర్ నుంచి క్రికెటర్గా..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా స్టార్ క్రికెటర్లు అయిన వారు చాలా మందే ఉన్నారు. గల్లీ క్రికెటర్లను సైతం అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన వేదిక ఐపీఎల్ అనడంలో సందేహం లేదు. మరొకవైపు ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటేశ్వరుల్ని చేసే టోర్నమెంట్ కూడా ఇదే. ఎన్ని ఇబ్బందులున్నా క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకోవడానికి ఐపీఎల్ కూడా ఒక కారణం. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రాణించి జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లతో వేలంలో పోటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అనామక క్రికెటర్లకూ ఇక్కడ కొదవ ఉండదు. అదే కోవకి చెందిన ఆటగాడే రాజస్థాన్ లోని ఝున్ ఝున్ అనే గ్రామం నుంచి వచ్చిన కుల్వంత్ ఖేజ్రోలియా. దాదాపు ఏడాది కాలంగా మాత్రమే దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కుల్వంత్ ను ఐపీఎల్-10వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన కుల్వంత్ క్రికెటర్ కాకముందు గోవాలోని రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేసేవాడు. పేద కుటుంబానికి చెందిన కుల్వంత్ ఒకవైపు వెయిటర్ గా పని చేస్తూనే మరొకవైపు క్రికెట్ ఆడటాన్ని వదులుకోలేదు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రాక్టీస్.. క్రికెట్ను కెరీర్ను ప్రొఫెషన్ గా మార్చుకోవాలని ఢిల్లీకి రావడానికి అతని స్నేహితుడే కారణం. కుల్వంత్ లో ప్రతిభను ఫ్రెండ్ గుర్తించడంతో అతనికి తొలి అడుగు పడింది. ఇలా ఢిల్లీకి వచ్చిన కుల్వంత్ క్రికెటర్ గా ఎదిగేందుకు అలుపెరగని పోరాటం చేశాడు. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నెట్స్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ వారితోపాటే నెట్స్ లో గడిపేవాడు. అదే కుల్వంత్ వెలుగులోకి రావడానికి దోహదం చేసింది. కుల్వంత్ ను ఒకసారి పరీక్షించాలంటూ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు సందేశం అందింది. దాంతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీకి ఎంపికయ్యాడు. ఢిల్లీ జట్టులో ఒక అదనపు సభ్యుడిగా ఎంపికైన కుల్వంత్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన కుల్వంత్ మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి 13 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఇదే అతను ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి ఉపయోగపడింది. అయితే కుల్వంత్ కు ఇంకా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ సీజన్ ఐపీఎల్లో అతని కనీస ధర రూ.10 లక్షలకు ముంబై వేలంలో దక్కించుకుంది. కేవలం ఏడాది క్రితం మాత్రమే దేశవాళీ అరంగేట్రం చేసిన తనకు ముంబై ఇండియన్స్ తరపున ఆడటం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు. ఐపీఎల్లో దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు ఇంట్లో చెప్పలేదని కుల్వంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. -
మా పోరాటం సరిపోలేదు: గంభీర్
న్యూఢిల్లీ:ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పట్ల ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబైతో మ్యాచ్ లో తమ పోరాటం సరిపోలేనందువల్లే ఓటమి పాలైనట్లు గంభీర్ తెలిపాడు. తమ సమష్టి వైఫల్యం కారణంగా తుది పోరుకు అర్హత సాధించలేకపోయామన్నాడు. 'కేకేఆర్ మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా జర్నీ చాలా కఠినంగా సాగింది. మా శక్తి వంచన లేకుండా పోరాటం సాగించాం. అయితే కీలక మ్యాచ్ లో చతికిలబడ్డాం. ఇక్కడ మా పోరాటం సరిపోలేదు. దాంతో నిష్క్రమించాల్సి వచ్చింది'అని గంభీర్ ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి పరాజయం చెందింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ -2లో ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. -
అడుగు దూరంలో ధోని..
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తుది పోరుకు అర్హత సాధించడంలో మహేంద్ర సింగ్ ధోని తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్న ధోని.. ప్రస్తుతం తనను తాను నిరూపించుకోవడానికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ధోనిని పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని తప్పుబట్టాడు. గతంలో ఆరు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నధోని ఈ సీజన్ ఫైనల్ పోరులో రాణించి కప్ ను జట్టుకు అందిచిన పక్షంలో తనను పూర్తిగా నిరూపించుకున్నట్లు అవుతుందన్నాడు. 'కెప్టెన్ గా ధోని ఎప్పుడూ గెలిచాడు. ప్రస్తుతం ఆటగాడిగా ధోని నిరూపించుకోవాలనే యత్నంలో ఉన్నాడు. కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగా గెలవగలను అని నిరూపించుకునే సమయం ధోని ముందుంది. ఇందుకు కేవలం పాయింట్ దూరంలో మాత్రమే ధోని ఉన్నాడు. అతన్ని రైజింగ్ పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించను. కానీ ధోని-స్టీవ్ స్మిత్ ల మధ్య సంబంధం బాగుండటం జట్టు మంచి విజయాలు సాధించడానికి దోహదం చేసింది.. ఫైనల్లో పుణెనే గెలుస్తుందని అనుకుంటున్నా. తొలి క్వాలిఫయర్ లో ముంబైపై గెలవడం పుణెకు లాభిస్తుంది. పుణె జట్టులో బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చటం కష్టమే. కానీ గత మ్యాచ్ చివరి ఓవర్లలో రాణించిన ధోని మరొకసారి బ్యాట్ ఝుళిపించి పుణె టైటిల్ సాధించడంలో సాయపడతాడని ఆశిస్తున్నా'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. -
ధోనీపై మళ్లీ తూటాలు: పుణెలో కలకలం
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతోన్న రైజింగ్ పుణె సూపర్జెయింట్ (ఆర్పీఎస్)లో ఆ జట్టు యజమాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సంజీవ్ గొయాంకా ఎంఎస్ ధోనీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడైన హర్ష్ గొయాంకా ధోనీపై పేల్చిన మాటాల తూటాలు వివాదాస్పదం కావడం, వాటికి బదులుగా ధోనీ భార్య సాక్షి ఇచ్చిన ఘాటు కౌంటర్లు హైలైట్ కావడం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ గొయాంకా.. ధోనీ, స్మిత్, జట్టులోని ఇతర ఆటగాళ్లగురించిన విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఎంఎస్ ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని మైండ్ సెట్, గెలవాలనే తపన అమోఘం. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అతను. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్ స్మిత్! గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్ది. అందుకే టీమ్మేట్స్కు ‘12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్..’ లాంటి సూచనలు చేస్తాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది..’ అంటూ ఎడాపెడా స్మిత్ను ఆకాశానికి ఎత్తేస్తూ, జట్టు విజయయాత్రలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదన్నట్లు మాట్లాడారు సంజీవ్ గొయాంకా. హైదరాబాద్లో ఆదివారం(మే 21న) జరగనున్న ఫైనల్స్లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన పుణె జట్టు ప్రస్థానం ఆదివారంతోనే ముగియనుంది. దీనిపైనా గొయాంకా తనదైన శైలిలో స్పందించారు. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గత ఏడాది పుణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్లు రాణించారని, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ ప్లేయర్లు మెరవడం మరింతగా కలిసి వచ్చిన అంశమని గొయాంకా అన్నారు. (ప్రతీకారంతోనే ధోనీ భార్య ఇలా చేసిందా?) -
టైటిల్ పోరుకు ముంబై
-
'ముంబై' చలో హైదరాబాద్
►ఐపీఎల్–10 ఫైనల్లో ముంబై ఇండియన్స్ ►క్వాలిఫయర్–2లో కోల్కతా నైట్రైడర్స్పై ఘనవిజయం ►రేపు హైదరాబాద్లో రైజింగ్ పుణేతో టైటిల్ పోరు ►నాలుగు వికెట్లతో మెరిసిన కరణ్ శర్మ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ముంబై ఇండియన్స్ మరోసారి నిరూపించుకుంది. ఈ సీజన్లో ముచ్చటగా మూడోసారి కేకేఆర్పై నెగ్గిన ముంబై ఐపీఎల్–10 ఫైనల్లో అడుగుపెట్టింది. కరణ్ శర్మ మాయాజాలం... బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు విలవిల్లాడిన గంభీర్ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సునాయాస లక్ష్యాన్ని కాస్త తడబడుతూనే ముంబై ఛేదించగలిగింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ్ల్లో కోల్కతాపై ముంబై ఇండియన్స్కు ఓటమి లేకపోవడం విశేషం. ఇక ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే తుదిపోరులో రైజింగ్ పుణే సూపర్ జెయింట్తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలర్లు రాజ్యమేలిన ఈ తక్కువ స్కోరింగ్ మ్యాచ్లో కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) నిలకడైన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇషాంక్ జగ్గి (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) మాత్రమే కాస్త పోరాడగలిగారు. కరణ్ శర్మ నాలుగు, బుమ్రా మూడు, జాన్సన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి. కరణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలర్ల ధాటికి విలవిల టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాను ముంబై బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఏ దశలోనూ కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. దీంతో ఇదే మైదానంలో పవర్ప్లేలో 105 పరుగులతో రికార్డు సృష్టించిన ఈ జట్టు ఈసారి అవమానకర రీతిలో బ్యాటింగ్ చేసింది. తమ తుఫాన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్న లిన్ (4)ను రెండో ఓవర్లోనే బుమ్రా అవుట్ చేయగా.. నరైన్ (10 బంతుల్లో 10; 1 సిక్స్)ను కరణ్ శర్మ ఐదో ఓవర్లో పెవిలియన్కు పంపించాడు. ఇక తదుపరి ఓవర్లో రాబిన్ ఉతప్ప (1)ను బుమ్రా అవుట్ చేయడంతో పవర్ప్లేలో కోల్కతా జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ప్లేలో ఈ సీజన్లో కోల్కతాకు ఇదే అత్యల్ప స్కోరు. ఏడో ఓవర్లో కరణ్ శర్మ కెప్టెన్ గంభీర్ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), గ్రాండ్హోమ్లను వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చడంతో కోల్కతా 31 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాంక్ జగ్గి జట్టుకు ఆపద్బాంధవ పాత్ర పోషించారు. కృనాల్ వేసిన ఓ ఓవర్లో సిక్స్ బాదిన సూర్యకుమార్ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో జగ్గి కూడా రెండు ఫోర్లు బాదినా 15వ ఓవర్లో అతడిని అవుట్ చేసి కరణ్ శర్మ మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా 17వ ఓవర్లో జాన్సన్.. చావ్లా (2), కూల్టర్నీల్ (6) వికెట్లను తీయగా మరుసటి ఓవర్లో నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్ను బుమ్రా బోల్తా కొట్టించడంతో కోల్కతా భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఆరంభంలో తడబడినా... లక్ష్యం తక్కువగానే ఉన్నా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ అంత సజావుగా ఏమీ సాగలేదు. పవర్ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు మూడు వికెట్లకు 36 పరుగులు... సునాయాసంగా బ్యాటింగ్ చేయగలదనుకున్న ముంబై టాప్ ఆర్డర్ను కోల్కతా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పీయూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిమన్స్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఎల్బీగా వెనుదిరగ్గా ఆ తర్వాతి ఓవర్లో ఉమేశ్.. పార్థివ్ (9 బంతుల్లో 14; 3 ఫోర్లు)ను అవుట్ చేసి ఒక్కసారిగా ఆందోళన పెంచాడు. ఆరో ఓవర్లో చావ్లా... రాయుడు (6)ను కూడా అవుట్ చేయడంతో మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఈ స్థితిలో కెప్టెన్ రోహిత్, కృనాల్ నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటుకు లోనుకాకుండా వీరు జాగ్రత్తగా ఆడారు. 9వ ఓవర్ నుంచి క్రమంగా పరుగుల వేగం పెరిగింది. చావ్లా వేసిన ఆ ఓవర్లో కృనాల్ రెండు ఫోర్లు బాది జోరు కనబరిచాడు. అతడి మరుసటి ఓవర్లోనూ తను రెండు ఫోర్లు రాబట్టగా రోహిత్ ఓ సిక్సర్ సంధించడంతో 16 పరుగులు వచ్చాయి. అయితే ఓ నిర్లక్ష్యపు షాట్కు రోహిత్ అవుట్ కావడంతో నాలుగో వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత పొలార్డ్ (9 నాటౌట్) అండతో కృనాల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టును గట్టెక్కించాడు. -
టైటిల్ పోరుకు ముంబై
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ టైటిల్ పోరుకు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. శుక్రవారం రాత్రి ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. అమీతుమీ పోరులో ఆద్యంతం రాణించిన ముంబై ఇండియన్స్ మరోసారి తమదే పైచేయిగా నిరూపించుకుంది. తొలి క్వాలిఫయర్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ, క్వాలిఫయర్-2లో మాత్రం ఆకట్టుకుని ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కోల్ కతా విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఆదిలోనే సిమన్స్(3),పార్ధీవ్ పటేల్(14), అంబటి రాయుడు(6) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే రోహిత్ శర్మ(26), కృణాల్ పాండ్యా(42 నాటౌట్) లు బాధ్యతాయుతంగా ఆడి గెలుపులో సహకరించారు. తద్వారా ఆదివారం హైదరాబాద్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్(4) భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్(10) దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది. -
'108' కొడితే ఫైనల్కు..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ లిన్ (4), నరైన్(10), గంభీర్(12), రాబిన్ ఉతప్ప(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఇషాంక్ జగ్గి(28), సూర్య కుమార్ యాదవ్(31) కాస్త ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా స్కోరు వంద పరుగులు దాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్ భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్ దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో కోల్ కతా పతనాన్ని శాసించగా, బూమ్రా మూడు వికెట్లు సాధించగా, మిచెల్ జాన్సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
ముంబైతో కేకేఆర్ అమీతుమీ
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ముందుగానే తుది బెర్తును ఖరారు చేసుకోగా, మరో స్థానం కోసం ముంబై ఇండియన్స్- కోల్ కతా నైట్ రైడర్స్ లు పోటీ పడనున్నాయి. శుక్రవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ముంబై ఇండియన్స్ తుది జట్టులో మిచెల్ జాన్సన్ వచ్చి చేరాడు. గత మ్యాచ్ లో మెక్లీన్ గన్ గాయపడటంతో అతని స్థానంలో మిచెల్ జాన్సన్ ను వేసుకున్నారు.మరొకవైపు కోల్ కతా నైట్ రైడర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యూసఫ్ పఠాన్ స్థానంలో అంకిత్ రాజ్ పుత్ ను వేసుకోగా, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కాలిన్ డి గ్రాండ్ హోమ్ ను తీసుకున్నారు. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కోల్ కతాపై ముంబై ఇండియన్స్ దే పైచేయి.ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై తమ ఘనచరిత్రను మరోసారి ఆవిష్కృతం చేసి తుది పోరుకు అర్హత సాధించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ కీలక సమరంలో పైచేయి సాధించాలని నైట్రైడర్స్ కసితో ఉంది. ఎలిమినేటర్లో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్పై సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గంభీర్ బృందం తమలోని లోపాలను సరిదిద్దుకుని ఎదురుదాడికి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్) రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఇషాంక్ జగ్గి, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, అంకిత్ రాజ్ పుత్, కుల్టర్ నీల్, గ్రాండ్ హోమ్ ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), లెండిల్ సిమన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, లసిత్ మలింగా -
దాని గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రను పరిశీలిస్తే కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ అమోఘమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి ఆడిన 20 మ్యాచ్ ల్లో 15 మ్యాచ్ ల్లో ముంబైదే విజయం. ఈ సీజన్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైది పైచేయి. దాంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ట్రాక్ రికార్డు గురించి అస్సలు ఆలోచించడం లేదని అంటున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. కేవలం మ్యాచ్ లో విజయం సాధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో బరిలోకి దిగుతున్నామన్నాడు. ' ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ పై రెండు సార్లు విజయం సాధించామనే ఆలోచన లేదు. కేవలం ఈ రోజు మ్యాచ్ పైనే మా దృష్టి ఉంది. తమదైన రోజున ఎవరైతే బాగా ఆడతారో వారే గెలుస్తారు. అంతేకానీ పాత రికార్డులు ఇక్కడ పని చేయవు. కాకపోతే కోల్ కతాపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాం'అని రోహిత్ పేర్కొన్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి గం.8.00ని.లకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు నాకౌట్ పోరుకు సన్నద్ధమయ్యాయి. -
'నా మొదటి వ్యక్తి ధోనినే'
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ కు చేరడంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సుందర్ మూడు కీలక వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ముంబైకు ఆదిలోనే సుందర్ షాక్ తగలడంతో ఆ జట్టు ఇక తేరుకోలేక ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సుందర్.. మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాడితో కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ' గేమ్ జరిగేటప్పుడు నాకు ఏ సందేహం వచ్చినా నేను మొదటి వెళ్లేది ధోని దగ్గరకే. ప్రధానంగా ధోని వద్దకు వెళ్లి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ గురించి అడిగి తెలుసుకునే వాడిని. ఓ దిగ్గజ ఆటగాడితో కలిసి ఆడటం నా అదృష్టం. ఆ తరహా పెద్ద స్టార్ల సరసన ఆడే అవకాశం అందరికీ రాదు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. పుణె జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ల సహకారం మరవలేనిది. నేను పవర్ ప్లే లో బౌలింగ్ చేయడాన్ని ఛాలెంజ్ గా భావిస్తా. గౌతం గంభీర్, శిఖర్ ధావన్ తరహా ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఒక సవాల్. వారికి బౌలింగ్ చేయడంలో నేను విజయం సాధించానని అనుకుంటున్నా. నేను ఐపీఎల్లో అరంగేట్రం చేసేటప్పుడు రవి చంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగలనని అస్సలు అనుకోలేదు' అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. -
మొత్తం డబ్బులు ఇవ్వలేదు: మెకల్లమ్
కాన్పూర్: తనకు రావాల్సిన మొత్తం సొమ్మును గుజరాత్ లయన్స్ ఇవ్వలేదని అంటున్నాడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రెండన్ మెకల్లమ్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడేటప్పుడు తనకు రూ. 7.5 కోట్లు వచ్చేదని, ఆ మొత్తాన్ని తాజా ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ నుంచి పొందలేదన్నాడు. తనను అదే మొత్తానికి గుజరాత్ లయన్స్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మెకల్లమ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లకు ధనాన్ని చెల్లించే వ్యవహారంలో శాలరీ క్యాప్ పేరు చెప్పి తగ్గించి ఇచ్చారని మెకల్లమ్ స్పష్టం చేశాడు. 2016లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు ఐపీఎల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లుపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వాటిపై రెండేళ్లు నిషేధం పడింది. దాంతో ఆ జట్ల స్థానంలో గుజరాత్, పుణెలు వచ్చి చేరాయి. అదే క్రమంలో చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్లను గుజరాత్, పుణెలు వేలంలో కొనుగోలు చేశాయి. అందులో మెకల్లమ్ ను గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. -
రైజింగ్ పుణె వ్యూహం ఫలించింది..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. ఐపీఎల్ ఆరంభంలో మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ గా తప్పించి పెద్ద సాహసమే చేసింది పుణె. ఆ జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించడంతో పాటు ఫ్రాంచైజీ పేరులో కూడా కొద్ది పాటి మార్పు చేసింది. గతేడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ గా బరిలోకి దిగిన ఆ జట్టు.. ప్రస్తుత సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్గా పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, టోర్నీ ఆరంభంలో ఆడపా దడపా విజయాలతో వెనుకబడినప్పటికీ, చివరికి వచ్చేసరికి ఫైనల్ కు చేరి భళా అనిపించింది. అయితే పుణె తుది పోరుకు చేరడంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో్ జరిగిన క్వాలిఫయర్ -1లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. . నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు సాధించాడు. దాంతో పాటు 16 పరుగులు మాత్రమే ఇచ్చి పటిష్టమైన ముంబైని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 10 మ్యాచ్ లాడిన సుందర్ ఎనిమిది వికెట్లు తీసి పుణె విజయాల్లో తన వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడు. కేవలం ఓ అనామక క్రికెటర్ లా లీగ్ లో కి ప్రవేశించిన సుందర్ ఇప్పుడు స్టార్ బౌలర్ మాదిరి ప్రశంసలు అందుకుంటున్నాడు స్మిత్ వికెట్ పడగొట్టి జట్టులోకి వచ్చాడు.. రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో ఫైనల్కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్రౌండర్ పర్వేజ్ రసూల్తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
కోల్ కతా నెగ్గినా.. షారుక్ ఫీలయ్యారు!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో భాగంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించినా కేకేఆర్ ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నారు. మరికొన్ని నిమిషాలు వర్షం పడితే మ్యాచ్ రద్దయి సన్ రైజర్స్ విజేతగా నిలిచేదని, ముఖ్యమైన ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్) మ్యాచ్లకు కచ్చితంగా రిజర్వ్డ్ డే ఉండాలని హీరో అభిప్రాయపడ్డారు. కేకేఆర్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్లే ఆఫ్స్ లాంటి దశలో జరిగే మ్యాచ్లు ఏదైనా కారణంగా రద్దయితే రిజర్వ్ డే (మరొక రోజు) ఉండాలని ట్వీట్లో రాసుకొచ్చారు షారుక్. నిన్న మరికాసేపు అలాగే వర్షం పడితే కేకేఆర్ కొంప మునిగేదన్నాడు. ప్లే ఆఫ్స్ జరగాల్సిన తీరుపై షారుక్ మాట్లాడారు. ‘ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ను కేవలం 128 పరుగులకే మా బౌలర్లు కట్టడిచేశారు. వర్షం రాకపోయినా కేకేఆర్ విజయం సాధించేది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ ను దాదాపు మూడు గంటలపాటు నిలిపివేశారు. ఓ దశలో కోల్ కతా జట్టు బ్యాటింగ్ చేయదని, అలాంటి సందర్భంలో లీగ్ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన సన్రైజర్స్ ను విజేతగా ప్రకటిస్తారని ముంబై ఇండియన్స్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడతుందని కథనాలు రావడం బాధించిందని’ చెప్పుకొచ్చారు. Glad on the winning side tonite. But play offs need to have an extra day in case of an abandoned match. Ami KKR onwards with @GautamGambhir — Shah Rukh Khan (@iamsrk) 17 May 2017 -
20 ఓవర్ల మ్యాచ్ జరగకపోవడం వల్లే..
బెంగళూరు:కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఆట పూర్తిగా జరగకపోవడమేనని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. వర్షం రాకతో మ్యాచ్ పూర్తిగా సాధ్యం కాలేదని, ఒకవేళ ఆట మొత్తం జరిగిన పక్షంలో సన్ రైజర్స్ విజయం సాధించే అవకాశం ఉండేదన్నాడు. కచ్చితంగా 20 ఓవర్ల పాటు ప్రత్యర్థి జట్టు ఆడుంటే అది తమకు లాభించేదన్నాడు. ' ఈ సీజన్ లో బెంగళూరు పిచ్ ను చూడండి. అక్కడ నమోదైనవన్నీ తక్కువ స్కోర్లే. అక్కడ యావరేజ్ స్కోరు దాదాపు 140 గా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేసి 128 పరుగులు చేశాం. కానీ మరో 10 పరుగులు చేసి ఉండాల్సింది. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే మేము చేసిన పరుగుల్ని కచ్చితంగా కాపాడుకునే వాళ్లం. మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటం, మ్యాచ్ ఫలితాన్ని ఆరు ఓవర్లకు కుదించటం మా అవకాశాల్ని దెబ్బతీసింది. ఓవరాల్ గా చూస్తే మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'అని మురళీధరన్ పేర్కొన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో వర్షం పడటం వల్ల కేకేఆర్ విజయలక్ష్యాన్ని 48 పరుగులకు నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని కోల్ కతా 5.2 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ తో కేకేఆర్ తలపడనుంది. -
తడబడిన సన్ రైజర్స్
► కోల్ కతా లక్ష్యం 128 ► మ్యాచ్ కు వర్షం అడ్డంకి బెంగళూరు: కోల్ కతా నైట్ రైడర్స్ తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. కోల్ కతా బౌలర్ల దాటికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే ధావన్(11) వికెట్ కోల్పోయింది. ముందు నుంచి నెమ్మదిగా ఆడిన సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఏదశలో బ్యాట్ ఝలిపించలేక పోయారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి సన్ రైజర్స్ వికెట్ కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతరువాత కొద్ది వేగం పెంచిన వార్నర్-విలియమ్సన్ జోడి ఎక్కువ సేపు కొనసాగించలేకపోయింది. కౌల్టర్-నిల్ బౌలింగ్ లో విలియమ్సన్(24) క్యాచ్ అవుటవ్వగా, వెంటనే వార్నర్(37) పీయుష్ చావ్లా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ నిలదొక్కుకోలేకపోయారు. కీలక మ్యాచ్ లో యువరాజ్ (9) మరోసారి నిరాశ పర్చాడు. విజయ్ శంకర్(22) వేగంగా ఆడే ప్రయత్నంచేసినా కౌల్టర్-నిల్ మరో సారి దెబ్బకొట్టాడు. అదే ఓవర్లో క్రిస్ జోర్డాన్ డక్ అవుటవ్వడంతో జట్టు 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నమాన్ ఓజా (16) చివరి బంతికి క్యాచ్ అవుటవ్వడంతో కోల్ కతాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కోల్ కతా బౌలర్లలో కౌల్టర్ నిల్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ కు 2 వికెట్లు తీయగా, బౌల్ట్, పీయుష్ చావ్లాకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం ప్రారంభమవడంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లతో గ్రౌండ్ ని కప్పేశారు. -
మన హైదరాబాదీ దూరం
బెంగళూరు: బెంగళూరు: గత మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో జట్టును ప్లే ఆఫ్ కు చేర్చిన లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ ఎలిమినేటర్ మ్యాచ్ కు దూరమయ్యాడు. సన్ రైజర్స్ బిపుల్ శర్మను ఎంపిక చేయడంతో సిరాజ్ స్థానం కోల్పోవల్సి వచ్చింది. గత గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం హైదరాబాదీ అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఈ ఎలిమినేటర్ రసవత్తరపోరుకు చిన్న స్వామి స్టేడియం వేదికవ్వగా, టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-2 లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. టైటిల్ నెగ్గాలంటే ఖచ్చితంగా రెండు మ్యాచ్ లు గెలవాల్సిందే. ఇప్పటికే ఇరు జట్లు లీగ్ దశలో రెండు సార్లు తలపడగా చెరో సారి విజయం సాధించాయి. ఇక బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరు జట్లు బలాలు సమంగా ఉన్నాయి. చేతి వ్రేలి గాయంతో మ్యాచ్ కు దూరం అవుతాడని భావించిన యువరాజ్ ఎట్టకేలకు తుది జట్టులోకి వచ్చాడు. అయితే జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కోల్ కతా టీం లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్య కుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్, పీయుష్ చావ్లా, ఇషాంక్ జగ్గి జట్టులోకి రాగా గాయంతో మనీష్ పాండే దూరం అవ్వగా కుల్దీప్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. .తుది జట్లు కోల్కతా నైట్రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, లిన్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, గ్రాండ్హోమ్, సునీల్ నరైన్, సూర్యకుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్ పీయుష్ చావ్లా, బౌల్ట్, ఉమేశ్ యాదవ్. సన్రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, విజయ్ శంకర్, విలియమ్సన్, యువరాజ్, నమన్ ఓజా, క్రిస్ జోర్డాన్, బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్. -
ఐపీఎల్: ఉప్పొంగిన 'యువ'కెరటాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పది సంవత్సరాలుగా భారత యువ టాలెంట్ కు వేదికైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లకు భవిష్యత్తునిచ్చింది. కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గల్లీ క్రికెటర్లకు సైతం కల్పించింది. ఇలా ప్రతి సీజన్లో ఓ గల్లీ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ అసాధరణ ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాల ప్రదర్శన పై ఓ లుక్కెద్దాం.. నితీష్ రాణా- ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉందంటే నితీష్ రాణా బ్యాట్ ఝలిపించడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో178 పరుగుల చేజింగ్ లో ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా 29 బంతుల్లో 50 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజారత్ పై 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్య చేదనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో ముఖ్యపాత్ర వహించాడు. 13 మ్యాచ్ లు ఆడిన రాణా మూడు అర్ద సెంచరీలతో 333 పరుగులు చేశాడు. బసీల్ తంపి- గుజరాత్ లయన్స్: గుజరాత్ లయన్స్ పేసర్ బసీల్ తంపి గంటకు140 కీ.మీ వేగంతో బంతిని విసరగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగుల ఇవ్వకుండా కట్టడిచేయడంలో దిట్ట. యార్కర్లు, స్టో డెలివరీలు వేస్తు ప్రత్యర్ధులను కట్టిడిచేసిన తంపి 12 మ్యాచుల్లో 3/29 ఉత్తమ ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయిన తన ప్రతిభను చాటుకున్నాడు. రాహుల్ త్రిపాఠి: రైజింగ్ పుణె ఫైనల్ చేరడంలో త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ తో రాబట్టాడు. ఈ సీజన్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇక కోల్ కతా తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 98 పరుగులతో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించాడు. 12 మ్యాచ్ లు ఆడిన త్రిపాఠి 2 అర్ధ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు. రిషబ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్: ఈ సీజన్లో అసాధారణ ప్రతిభతో అభిమానుల మనసు దోచుకున్న యంగ్ క్రికెటర్ గా పంత్ గుర్తింపు పొందాడు. తన ఆట తీరుతో ఏకంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్..వారితో మా ఫ్యూచర్ ధోని రిషబ్ పంతే అనేలా చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటి చేత్తో గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్ ద్రావిడ్ మాత్రం టీం ఇండియా ఫ్యూచర్ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణాంతరం ఐపీఎల్ లో పాల్గొన్న పంత్ బెంగళూరు పై ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులును కదిలించింది.14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్- సన్ రైజర్స్ హైదరాబాద్: కేవలం భారత క్రికెటర్లకే కాకుండా క్రికెట్ ఆడే చిన్నదేశాల ఆటగాళ్లను సైతం వెలుగులోకి తెచ్చింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ సీజన్లో అప్ఘన్ బౌలర్ అసాధరణ ప్రతిభకు క్రికెట్ అభిమానులు దాసోహం అన్నారు. ఐపీఎల్ వేలం అధిక ధర రూ.4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్ ను తీసుకోవడం అందరీని ఆశ్చర్య పరిచింది. కానీ సన్ రైజర్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణించాడు రషీద్. 13 మ్యాచులు ఆడిన అప్ఘన్ బౌలర్ 17 వికెట్లు పడగొట్టాడు. -
ధోనిని పొగడ్తలతో ముంచిన స్మిత్
ముంబై: రైజింగ్ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోని ధనాధన్ షాట్ లతో ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పుణె 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోని 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో జట్టు 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్ మహీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. వాంఖేడే పిచ్ ను బౌలింగ్ పిచ్ గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో మనోజ్, మహీ రాబట్టారన్నాడు. పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న కూడా మహీ పరుగుల రాబట్టడాని స్మిత్ కొనియాడాడు. అజింక్యా రహానే జట్టుకు శుభారంబాన్ని అందించడం కూడా జట్టు విజయానికి కలిసొచ్చిందని స్మిత్ తెలిపాడు. అయితే పుణె 18 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలింది. మెక్లిన్ గన్ వేసిన19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్ ను బౌండరీకి బాది, ఆతరువాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్ చివరి బంతికి మనోజ్ తివారీ రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్ లు బాదడంతో పుణెకు 15 పరుగులు చేరాయి. -
కొనసాగుతున్న ధోని 'లవ్ ఎఫైర్'
ముంబై: వాంఖెడే మైదానంతో ఎంఎస్ ధోని లవ్ ఎఫైర్ కొనసాగుతోంది. ఈ స్టేడియంలో 'మిస్టర్ కూల్' ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నువాన్ కులశేఖర బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీమిండియా వరల్డ్కప్ను కైవసం చేసుకోవడంతో కీలకపాత్ర పోషించాడు. అప్పటివరకు 8 మ్యాచుల్లో 150 పరుగులు మాత్రమే చేసిన ధోని ఫైనల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి వాంఖేడ్తో తన అనుబంధాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. పుణే సూపర్ జెయింట్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మొదటి ప్లేఆఫ్ మ్యాచ్లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోని బ్యాటింగ్కు వచ్చేటప్పటికీ పుణె స్కోరు 89/3గా ఉంది. ధోని ధనాధన్ బ్యాటింగ్తో స్కోరుకు పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 5 సిక్సర్లతో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లో ధోని 2 భారీ సిక్సర్లు బాదాడు. 20 పరుగులతో ముంబైను చిత్తు చేయడంతో ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. తుదిపోరులోనూ ధోని చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఐపీఎల్: హిస్టరీ రిపీట్ అయింది!
ముంబై: ఐపీఎల్ లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు కచ్చితంగా ఫైనల్కు చేరడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పుణే జట్టు దాన్ని రిపీట్ చేసింది. ఐపీఎల్10 సీజన్లో తుది పోరుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేరుకుంది. ఇక్కడి వాంఖేడెలో నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై పుణే నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్లో నెగ్గిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో నెగ్గితేనే ఫైనల్ చేరుతుంది. ఆపై ఈ సీజన్లో ఆడిన మూడుసార్లు తమను ఓడించిన పుణేపై ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఉంటుంది. 2017లో ఐపీఎల్-10లోనూ ఇప్పుడు అదే జరిగింది. క్వాలిఫయర్-1లో పటిష్టమైన ముంబయిని కంగు తినిపించిన స్టీవ్ స్మిత్ సేన ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో నెంబర్ వన్ గా ఉన్న జట్లు 2012, 2016 సీజన్లలో ఫైనల్ చేరలేదు. కానీ ప్రతి సీజన్లోనూ రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే.. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఫైనల్లో టాప్1, 2 జట్లు తలపడితే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న జట్టునే విజయం వరిస్తూ వచ్చింది. 2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ లు నెగ్గి 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. నేడు ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. గెలిచిన జట్టును క్వాలిఫయర్-2లో మట్టికరిపిస్తేనే ముంబై ఫైనల్ చేరుతుంది. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ (క్వాలిఫయర్-2 విన్నర్) ? -
ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో టీమిండియా క్రికెటర్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ -10లో ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో పుణే ఆటగాడు ధోనీ రికార్డు స్థాయిలో ఏడోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్గా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఆ జట్టు తరఫున ఏకంగా ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్ లో భాగస్వామి అయ్యాడు. కెప్టెన్గా రెండుసార్లు చెన్నైకి ఐపీఎల్ కప్ అందించాడు. గత రెండు సీజన్ల నుంచి పుణే జట్టకు ఆడుతున్న ధోనీ ఐపీఎల్-10లో ఫైనల్ ఆడబోతున్న ఆ జట్టులో కీలక ఆటగాడు. నిన్న (మంగళవారం) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో ధోనీ వీర విహారం చేయడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ప్రతి మ్యాచ్లోనూ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు విలువైన సలహాలిస్తూ, అవసరమైనప్పుడు ఫీల్డింగ్ సెట్ చేస్తూ జట్టు విజయంలో ధోనీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎంఎస్ ధోనీ (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓటమిపాలైంది. మూడు వికెట్లు తీసి పుణే విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ (3/16)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే
-
‘సుందరం’... సుమధురం
►ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే ►చెలరేగిన సూపర్ జెయింట్ ►20 పరుగులతో ముంబై చిత్తు ►రాణించిన సుందర్, శార్దుల్ ►ఆకట్టుకున్న ధోని, రహానే, తివారి పుణే సూపర్ ఆటతో ఐపీఎల్–10 ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత ఏడాది అవమానకర రీతిలో ఏడో స్థానంలో నిలిచిన జెయింట్ టీమ్ ఈసారి అదరగొట్టే ప్రదర్శనతో టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రత్యర్థి వేదికపై 162 పరుగుల సాధారణ స్కోరు చేసి కూడా జెయింట్ అద్భుత ఆటతీరుతో ఆ స్కోరును కాపాడుకోగలిగింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ముంబై ఇండియన్స్ ఛేదనలో బోర్లా పడింది. ఫలితంగా రెండు మరాఠా జట్ల పోరులో వరుసగా మూడోసారీ పుణేదే పైచేయి అయింది. బ్యాటింగ్లో రహానే, తివారి అర్ధ సెంచరీలు... ఆపై తన ఫ్రాంచైజీ యజమానులు మునివేళ్లపై నిలబడి చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉండగా ధోని మెరుపు సిక్సర్ల ప్రదర్శన పుణేను మెరుగైన స్థితిలో నిలిపాయి. అనంతరం 17 ఏళ్లు కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ముగ్గురు ముంబై స్టార్ బ్యాట్స్మెన్ను అవుట్ చేసి మ్యాచ్ను పుణే చేతుల్లోకి తెచ్చేశాడు. లీగ్లో రెండో ఏడాదే ఫైనల్ చేరి సత్తా చాటిన స్మిత్ సేన, ఆదివారం హైదరాబాద్లో జరిగే ఫైనల్కు అర్హత సాధించగా, ముంబైకి రెండో క్వాలిఫయర్ రూపంలో టైటిల్ పోరుకు చేరేందుకు మరో అవకాశం ఉంది. ముంబై: సంచలన ఆటతో పుణే సూపర్ జెయింట్ ఐపీఎల్–10 ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్లో పుణే 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. పార్థివ్ పటేల్ (40 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (3/16), శార్దుల్ ఠాకూర్ (3/37) ప్రత్యర్థి పని పట్టారు. నేడు జరిగే ఎలిమినేటర్లో విజేతగా నిలిచే జట్టుతో ముంబై 19న రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. ఆ రెండు ఓవర్లు... ఫామ్లో ఉన్న రాహుల్ త్రిపాఠి తొలి ఓవర్లోనే డకౌట్... రెండో ఓవర్లో స్మిత్ (1) డగౌట్కు... పవర్ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు కేవలం 33 పరుగులు. ఇలాంటి స్థితిలో రెండు కీలక భాగస్వామ్యాలు పుణేకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. ముందుగా రహానే, తివారి మూడో వికెట్కు 65 బంతుల్లో 80 పరుగులు జోడించగా, ఆ తర్వాత తివారి, ధోని కలిసి నాలుగో వికెట్కు 44 బంతుల్లో 73 పరుగులు జత చేశారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో రహానే, తివారి చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో పరుగులు రావడం గగనంగా మారిపోయింది. ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు పూర్తిగా ఆగిపోయాయి. హార్దిక్ వేసిన ఒక ఓవర్లో పుణే 15 పరుగులు రాబట్టినా, ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే, ఐపీఎల్లో 3 వేల పరుగులు కూడా దాటాడు. అయితే చక్కటి బంతితో రహానేను అవుట్ చేసి కరణ్ ఈ జోడీని విడదీశాడు. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ధోని భారీ సిక్సర్ బాదినా... తివారి మాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్న సమయంలో ఒక దశలో 32 బంతుల వ్యవధిలో కేవలం ఒక ఫోర్, ఒక సిక్సర్ మాత్రమే వచ్చాయంటే పరిస్థితి అర్థమవుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి పుణే స్కోరు 121 పరుగులు మాత్రమే. అయితే చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు రాబట్టడం విశేషం. మెక్లీనగన్ వేసిన 19వ ఓవర్లలో ధోని 2 భారీ సిక్సర్లు బాదగా, తివారి 6, 4 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ధోని మరో 2 సిక్సర్లు కొట్టడంతో పుణే 15 పరుగులు సాధించింది. పార్థివ్ మినహా... లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఒకవైపు పార్థివ్ దూకుడుగా ఆడగా, మరో ఎండ్లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఉనాద్కట్ ఒక పరుగే ఇవ్వగా... తర్వాతి మూడు ఓవర్లలో పార్థివ్ ఒక్కో సిక్సర్ బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే దురదృష్టకర రీతిలో సిమన్స్ (5) అవుట్ కావడంతో ముంబై పతనం ప్రారంభమైంది. పార్థివ్ కొట్టిన షాట్ బౌలర్ శార్దుల్ చేతికి తగిలి నాన్స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లను పడేసే సమయంలో సిమన్స్ క్రీజ్ బయటే ఉన్నాడు. తర్వాతి ఓవర్లో సుందర్ ముంబైని పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి బంతికి రోహిత్ (1)ను అవుట్ చేసిన అతను, నాలుగో బంతికి అంబటి రాయుడు (0) ఆట ముగించాడు. తన తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ (7)ను సుందర్ వెనక్కి పంపించగా, కొద్ది సేపటికి హార్దిక్ (14) కూడా అవుటయ్యాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పార్థివ్ క్రీజ్లో ఉండటంతో ముంబై విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే శార్దుల్ వేసిన ఓవర్తో ముంబై పూర్తిగా విజయావకాశాలు కోల్పోయింది. భారీ షాట్లు ఆడే క్రమంలో ఈ ఓవర్ మూడో బంతికి కృనాల్ పాండ్యా (15), చివరి బంతికి పార్థివ్ లాంగాఫ్లో క్రిస్టియాన్కే క్యాచ్లు ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత ముంబై ఆట నామమాత్రమే అయింది. -
ధోని దూకుడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అజింక్యా రహానే(56;43 బంతుల్లో 5 ఫోర్లు 1సిక్స్), మనోజ్ తివారీ(58;;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు, మహేంద్ర సింగ్ ధోని(40 నాటౌట్;26 బంతుల్లో 5 సిక్సర్లు) దూకుడు జత కావడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ త్రిపాఠి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(1) కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో పుణె తొమ్మిదిపరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో రహానే -తివారీల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది.ఈ క్రమంలోనే రహానే 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 80 పరుగులు జత చేసిన తరువాత రహానే మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అప్పుడు తివారీకి ధోని జతకలిశాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పుణె రన్ రేట్ తగ్గింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె స్కోరు బోర్డులో వేగం పెరిగింది. చివరి రెండు ఓవర్లలో ధోని నాలుగు సిక్సర్లు సాధించడం ఇక్కడ విశేషం. దాంతో పుణె నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మలింగా, మెక్లీన్ గన్, కరణ్ శర్మలకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్-10: ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత రైజింగ్ పుణెను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సీజన్ లీగ్ దశలో రైజింగ్ పుణెతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైకి ఓటమి ఎదురైంది. దాంతో అసలు సిసలు సమరంలో పుణెపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై సిద్ధమైంది. మరొకవైపు ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది. అదే సమయంలోముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు. పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. పుణె పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. అతనికి శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్లో ఉండడం అనుకూలాంశం. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే క్రమంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.ఒకవేళ తొలి క్వాలిఫయర్ లో ఓడితే 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. మరి తుది పోరుకు ముందుగా ఎవరు చేరతారో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
నా తొలి ప్రాధాన్యత అదే: ఏబీ
న్యూఢిల్లీ: తాను జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో ఏ ఒక్క మ్యాచ్ ను వదులుకోవడానికి ఇష్టపడనని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే పలు మ్యాచ్ లను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన డివిలియర్స్ దానిపై తాజాగా స్పందించాడు. 'నా తొలి ప్రాధాన్యత జాతీయ జట్టుకే.ఐపీఎల్లో పలు మ్యాచ్ లను మిస్సయి ఉండవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా తరపున ఒక గేమ్ కూడా మిస్ కావడానికి నా దగ్గర ప్రణాళికలు లేవు. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎప్పుడూ వదులుకోను. నా ఫామ్ పై ఎటువంటి ఆందోళన లేదు. మీరు ఆశించినా, ఆశించకపోయినా నా ఫామ్ పై బెంగ లేదు. కొన్ని మంచి షాట్లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తే, ఫామ్ ను అందుకోవడం కష్టం కాదు. నేను సెంచరీ చేయకపోయినప్పటికీ, బంతిని హిట్ చేయడంలో నాది ఎప్పుడు ఒకటే పద్ధతి'అని డివిలియర్స్ పేర్కొన్నాడు. -
ముంబై ఇండియన్స్ కు ఛాన్స్ లేదా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక కేవలం నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సీజన్ కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ దశలో నిలిచిన నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ చరిత్ర ఏం చెబుతుంది అనే దానిపై చర్చ మొదలైంది. ప్రధానంగా లీగ్ దశలో టాప్ ప్లేస్లో నిలిచిన ముంబై ఇండియన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లలో గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉండగా,ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడే అవకాశం ఉంది. ఎలిమినేటర్ రౌండ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-1లో పరాజయం చెందిన జట్టు ఆడుతుంది. దాంతో టాప్ -2లో ఉన్న ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లకు ఇది కచ్చితంగా అదనపు అవకాశంగానే చెప్పొచ్చు. ఇక్కడ 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు గెలిచి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ ల్లో విజయంతో 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. ప్రధానంగా 2011 లో ప్లే ఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాక లీగ్ దశలో తొలి స్థానంలో ఉన్న జట్టు ట్రోఫీని గెలిచిన సందర్భాలు లేవు. దాంతో ప్రస్తుతం టాప్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ట్రోఫీని గెలిచే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ కు ముంబై ఇండియన్స్ చెక్ పెడుతుందో లేదో చూడాలి. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లను పరిశీలిస్తే.. 2011:ఆర్సీబీ(1) వర్సెస్ సీఎస్కే (2)-విజేత సీఎస్కే 2012: కేకేఆర్(2)వర్సెస్ సీఎస్కే(4)-విజేత కేకేఆర్ 2013: సీఎస్కే(1) వర్సెస్ ముంబై ఇండియన్స్(2)- విజేత ముంబై ఇండియన్స్ 2014: కింగ్స్ పంజాబ్(1) వర్సెస్ కేకేఆర్(2) -విజేత కేకేఆర్ 2015:సీఎస్కే(1)వర్సెస్ ముంబై ఇండియన్స్(2)-విజేత ముంబై 2016:ఆర్సీబీ(2) వర్సెస్ ఎస్ఆర్హెచ్(3)- విజేత ఎస్ఆర్హెచ్ -
ఐపీఎల్- ప్లేఆఫ్స్: సన్రైజర్స్కు ఎదురుదెబ్బ
- గాయంతో నెహ్రా ఔట్.. యూవీ ఫిట్నెస్పై డౌట్స్ - హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్పైనే అదనపు భారం.. బెంగళూరు: ప్లేఆఫ్స్ ముంగిట ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురు‘దెబ్బ’! పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్ బౌలర్ ఆశిశ్ నెహ్రా ఇకపై జట్టుకు దూరం కానున్నాడు. అటు, ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఫిట్నెస్పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించారు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గుజరాత్ లయన్స్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ నెహ్రా స్టాండ్స్కే పరిమితమైన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో హైదరాబాదీ స్పీడ్స్టర్ మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటడం, ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న సంగతి తెలిసిందే. నెహ్రా గైర్హాజరీతో సన్రైజర్స్ ఆడబోయే అన్ని ప్లేఆఫ్ మ్యాచ్లలో సిరాజ్కు స్థానం ఖాయమైనట్లే. అయితే ఈ యువ బౌలర్ అదనపు భారాన్ని సునాయాసంగా మోయగడా? లేదా? లైవ్లో చూడాల్సిందే! నేడు యూవీకి పరీక్షలు ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా యువీ చిటికెన వేలికి తీవ్రగాయం కావడం, దాంతో గుజరాత్తో జరిగిన కీలక మ్యాచ్లో అతను ఆడలేకపోవడం తెలిసిందే. బుధవారం యువీ ఫిట్నెస్ పరీక్షల్ని ఎదుర్కొంటాడని, ఫిట్గా ఉన్నట్లు తేలితే తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. ప్లే ఆఫ్స్లో భాగంగా హైదరాబాద్ జట్టు.. 17న(బుధవారం) బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. -
దారుణ వైఫల్యాలపై స్పందించిన క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో అత్యంత దారుణ ప్రదర్శన ఇచ్చిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). గతేడాది ఫైనల్స్ చేరిన జట్టేనా ఇప్పుడు మనం చూస్తున్నది అన్నట్లుగా ఘోరంగా విఫలమై కేవలం మూడు విజయాలతో ఓవరాల్గా 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆర్సీబీ దారుణ వైఫల్యంపై ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఎట్టకేలకే స్పందించాడు. 'వరుస ఓటములతో పూర్తిగా నిరాశచెందాం. ఈ సీజన్ మాకు పాఠం నేర్పించింది. వైఫల్యాలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. జట్టులో లోపాలు తెలుసుకున్నా ఆర్సీబీ సమిష్టిగా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఇంకా చెప్పాలంటే బౌలర్లు, బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరూ రాణించకపోవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది. అలాంటి సమయాలలో సమష్టిగా గేమ్ ప్లాన్ చేసుకుని ఆడాలి. అప్పుడు విజయాల బాట పట్టేవాళ్లం. కానీ ఆర్సీబీ అలా చేయకపోవడంతో చివరికి అట్టడుగున నిలవాల్సి వచ్చింది. వచ్చే సీజన్లో మంచి ప్రదర్శన చేస్తామని' గేల్ ధీమా వ్యక్తం చేశాడు. తమ చివరి మ్యాచ్లో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ పై నెగ్గి విజయంతో సీజన్ను ముగించింది ఆర్సీబీ. క్రిస్గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ స్టార్ ప్లేయర్స్ ఉన్న జట్టు ఓ మ్యాచ్లో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరును నమోదు చేసింది. -
సెహ్వాగ్ పరువు తీసిన 'లంబూ'!
మొహాలీ: గతంలో టీమిండియా పేస్ దళాన్ని నడిపించిన బౌలర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకుని మేనేజ్మెంట్ తప్పిదం చేసింది. ఎందుకంటే ఏ జట్టు అతడిపై నమ్మకం ఉంచలేదు. వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని తీసుకుంది. పంజాబ్ టీమ్ మెంటర్, డైరెక్టర్ గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒత్తిడి తేవడంతోనే ఇషాంత్కు చాన్స్ వచ్చింది. లేనిపక్షంలో ఐపీఎల్-10 సీజన్లో ఇషాంత్ (టీమిండియా క్రికెటర్లు పిలిచేపేరు 'లంబూ')ను చూసేవాళ్లం కాదు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ లాంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ పంజాబ్ పేస్ ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్ శర్మను సెహ్వాగ్ జట్టులోకి తీసుకున్నాడు. ఇషాంత్ను ఎవరైనా కొంటారా అంటూ చిరకాల మిత్రుడు గంభీర్ కామెంట్ చేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇషాంత్ను వెనకేసుకొచ్చాడు. అయితే సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన బౌలర్లలో ఇషాంత్ ముందు వరసలో ఉంటాడు. సెహ్వాగ్ తనపై ఉంచిన నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీశాడు. ఒక్క మ్యాచ్లోనూ రాణించకపోగా.. వరుస మ్యాచ్ల్లో విఫలమవుతూ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్లో అత్యధిక బంతులు (108) వేసి ఒక్క వికెట్ తీయలేని బౌలర్గా అపవాదు మూటకట్టుకున్నాడు. తానాడిన 6 మ్యాచ్లలో 18 ఓవర్లు వేసిన ఇషాంత్ ఒక్క వికెట్ పడగొట్టలేదు. కనీసం ఒక రనౌట్లోనైనా భాగస్వామి కాలేదు, కనీసం ఒక్క క్యాచైనా పట్టి ఒక బ్యాట్స్మెన్ ఔట్ కావడంలోనూ అతడు పాలుపంచుకోలేదు. ప్రస్తుత సీజన్లో తమ చివరి మ్యాచ్లో పుణే చేతిలో దారుణ ఓటమితో ఆ జట్టు కథ ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్ కథ ముగిశాక ఇషాంత్ బౌలింగ్పై సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'మా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడతారు'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో తమ దేశ క్రికెటర్లు పాల్గొనకుండా చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎత్తుగడలు వేస్తుందంటూ వచ్చిన వార్తలను మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తాజాగా పేర్కొన్నాడు. అసలు ఐపీఎల్ కు ఆసీస్ క్రికెటర్లను దూరం చేయాలనే భావన తమ దేశ క్రికెట్ బోర్డుకు లేదన్నాడు. ప్రధానంగా ఐపీఎల్ ను అమితంగా ప్రేమించే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను ఆడనివ్వకుండా చేయడానికి సీఏ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నాడు. 'ఐపీఎల్ అనేది ఒక అద్భుతమైన టోర్నమెంట్. క్రికెటర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా గేమ్ చాలా గొప్పది. డొనాల్డ్ బ్రాడ్ మన్లాంటి దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు తీసుకున్నా గేమ్ ఉంది కదా. ఎవరు వెళుతున్నారు.. ఎవరు ఉంటున్నారు అనేది పెద్ద విషయమే కాదు. వరల్డ్ లో క్రికెట్ అనేది గొప్ప గేమ్. క్రికెట్ ను ప్రేమించే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు ఐపీఎల్లో కచ్చితంగా ఆడతారు' అని క్లార్క్ తెలిపాడు. -
మాది సమష్టి వైఫల్యం:క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తమ జట్టు పేలవ ప్రదర్శనకు సమష్టిగా వైఫల్యమే కారణమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ కుండ బద్ధలు కొట్టాడు.. ఇక్కడ ఏ ఒక్కర్నో నిందించాల్సిన పని లేదని గేల్ అభిప్రాయపడ్డాడు. 'మా ప్రదర్శన మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అన్ని డిపార్ట్మెంట్ల సమష్టి వైఫల్యమే మా ఘోర ఓటములకు కారణం. మా జట్టులో చాలా అతుకులున్నాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ మా ఓవరాల్ ఆట బాగాలేదు. దాంతోనే ముందుగా టోర్నీ నుంచి బయటకు వచ్చేశాం. కాకపోతే తమ జట్టు కొన్ని సందర్భాల్లో బాగానే ఆడిందని గేల్ పేర్కొన్నాడు.ఇది తమకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. -
టీమిండియా ఆశాకిరణం అతను..
న్యూఢిల్లీ: రాబోవు కాలంలో భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రధాన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నాడు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్. ఇటీవల కాలంలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్ .. టీమిండియా ఆశాకిరణంగా ద్రవిడ్ అభివర్ణించాడు. భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయంటూ ద్రవిడ్ జోస్యం చెప్పాడు. ఆ కుర్రాడిలో అసాధారణ ప్రతిభ ఉందనడానికి అతను ఏడాది కాలంగా ఆడిన ఇన్నింగ్స్ లే ఉదాహరణగా పేర్కొన్నాడు. తన తండ్రిని కోల్పోయి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న సమయంలో కూడా ఒక టోర్నీకి దూరం కాకూడదనే రిషబ్ పంత్ చూపించిన తెగువ అతని మానసిక బలాన్ని చూపుతుందని ద్రవిడ్ తెలిపాడు. 'ఈ ఏడాది రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మంచి ఇన్నింగ్స్ లతో సత్తా చాటుకున్నాడు. అతను కచ్చితంగా టీమిండియా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఐపీఎల్ టోర్నీకి ముందు అతను తండ్రి మరణించాడు. అది రిషబ్ కు క్లిష్ట సమయం. తండ్రిని పోగుట్టుకున్న బాధలో కూడా టోర్నమెంట్ కు దూరం కాకూడదనుకున్నాడు. అది అతని మానసిక పరిపక్వతను చూపుతుంది'అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సీజన్ లో ఢిల్లీ ఆరు విజయాలతో సరిపెట్టుకోవడంపై ద్రవిడ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడాది ఏడు మ్యాచ్ ల్లో గెలిస్తే, ఈ ఏడాది ఆరు మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందడం నిరాశపరిచిందన్నాడు. కనీసం ఎనిమిది మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే క్రమంలో తాము పోరాడి ఓడిపోయామన్నాడు. చాలా మ్యాచ్ ల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలుకావడం తమ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. -
ఈ ఐపీఎల్ను మరచిపోదాం..
న్యూఢిల్లీ:తమకు అంతగా కలిసిరాని ఐపీఎల్-10 సీజన్ను రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఎంత తొందరగా మరచిపోతే అంత మంచిదని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఓవరాల్ ఐపీఎల్లో తమపై అత్యంత ప్రభావం చూపిన సీజన్ ఏదైనా ఉందంటే అది ఇదేనని కోహ్లి పేర్కొన్నాడు. ఈ సీజన్ చాయలు ఎక్కడ కనిపించకుండా తదుపరి ఐపీఎల్ కు సిద్ధమవుతామని పేర్కొన్నాడు. 'మా యావత్ జట్టు ప్రదర్శనపై విపరీతమైన ప్రభావం చూపిన ఐపీఎల్ సీజన్ ఇది. ఇది మాకు కచ్చితంగా ఒక గుణపాఠమే. మేము ఎలా విఫమయ్యామో అన్వేషించుకోవడానికి ఈ సీజన్ ఉపయోగపడుతుంది. అదే సమయంలో పునరుత్తేజంతో సన్నద్ధం కావడానికి కూడా దోహదం చేస్తుంది' అని కోహ్లి పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన తరువాత కోహ్లి మీడియాతో మాట్లాడాడు. దీనిలో భాగంగా యువ పేసర్లు హర్షల్ పటేల్(3/43), అవేష్ ఖాన్(1/23)ల ప్రదర్శనపై కోహ్లి పొగడ్తలు కురిపించాడు. వీరిద్దరూ మనసు దోచుకునే విధంగా ఆడారని కొనియాడాడు. ఈ పిచ్ పై వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం చేయలేని పనిని వీరిద్దరూ సమర్ధవంతంగా నిర్వర్తించారంటూ ప్రశంసించాడు. -
'స్పెయిన్లో బీర్లు తాగండి'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10 సీజన్ ను విడిచి ఉన్నపళంగా వచ్చేయమంటూ తమ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదేశించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల వరకూ వారిని అనుమతించకుండా వచ్చేయమనడం వెనుక ఈసీబీ ఉద్దేశమేమిటని పీటర్సన్ ప్రశ్నించాడు. ఇంత ఎంత మాత్రం సరైన చర్య కాదని విమర్శించాడు. ఈ సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, ముంబై ఇండియన్స్ తరపున జాస్ బట్లర్ ఆడుతున్నాడు. అయితే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సిన క్రమంలో వీరిని వచ్చేయమంటూ ఈసీబీ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఐపీఎల్లో పుణె, ముంబై ఇండియన్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐపీఎల్లో ప్లే ఆఫ్ కు చేరడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదిగా పేర్కొన్న పీటర్సన్.. ఆ ఇద్దరి పరిస్థితి చూస్తే మనస్సును కరిగించేదిగా ఉందన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్లు తిరిగి స్వదేశానికి పయనం కావడంపై సెటైర్లు గుప్పించాడు. ' వారిద్దరూ ఐపీఎల్ ను విడిచి వెళ్లడం చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ప్లే ఆఫ్ దశలో వారిద్దరూ వెళ్లిపోవడం ఒకింత బాధగా ఉంది.. అదే సమయంలో వారి పరిస్థితి చూసి జాలి కూడా వేస్తుంది. ఇక్కడ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు ఆడే బదులు స్పెయిన్ కు వెళ్లి బీర్లు తాగండి' అని పీటర్సన్ చమత్కరించాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు సంబంధించి ఇంగ్లండ్ జట్టు స్పెయన్ లో శిక్షణా శిబిరం నిర్వహించనుంది. -
వారివల్లే ఓడాం: సెహ్వాగ్
పుణె: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లపై ఆజట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్, ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని విమర్శించాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్ ఆటతీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి పిచ్లపైనైనా ఆడగల సత్తా ఉండాలి. పిచ్ మందకొడిగా ఉందని చెప్పడం సమంజసం కాదు. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? జట్టులో ప్రధాన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన మాక్స్వెల్, షాన్ మార్ష్, మోర్గాన్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. వారి ఆటతీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. పరిస్థితులకు అనుగుణంగా 10-12 ఓవర్లు ఆడి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత మార్ష్ది. కెప్టెన్గా మాక్స్వెల్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్లో రాణించిన ఆమ్లా జట్టుకు దూరం కావడంతో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. -
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
-
రైజింగ్ పుణెకు ఎదురుదెబ్బ
పుణె: ఐపీఎల్-10లో ప్లే ఆఫ్ కు చేరి మంచి ఊపుమీద ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లే ఆఫ్ కు దూరమవుతున్నాడు. బెన్ స్టోక్స్ ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరికలు జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని కింగ్స్ పంజాబ్ మ్యాచ్ తరువాత పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ప్లే ఆఫ్ కు స్టోక్స్ లేకపోవడం పూడ్చలేని లోటుగా స్మిత్ అభివర్ణించాడు. 'జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. స్టోక్స్ ప్లే ఆఫ్ కు లేకపోవడం పూడ్చలేని లోటు. అయినప్పటికీ మాకున్న అనేక ఆప్షన్లను పరిశీలించి స్టోక్స్ లేని లోటును పూడ్చుకుంటామని ఆశిస్తున్నా. రిజర్వ్ బెంచ్ లో మా జట్టు మెరుగ్గానే ఉంది. దాంతో స్టోక్స్ కు ప్రత్యామ్నాయం వెతుకుతాం' అని స్మిత్ పేర్కొన్నాడు. మరొకవైపు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఇది మాకు చాలా గొప్ప రోజు. మా బౌలర్లు చెలరేగి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు ముగిసే వరకూ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు కొత్త ఆటగాళ్లకు వెలుగులోకి వచ్చారు. దాంతో మా జట్టు సమతుల్యంగా తయారైంది. రెండో విడత మ్యాచ్ ల్లో మా జట్టు అనేక మంచి విజయాల్ని సొంతం చేసుకుంది' అని జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్ లు ఆడిన స్టోక్స్ 316 పరుగులు నమోదు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 నాటౌట్. ఇక బౌలింగ్ లో 12 వికెట్ల తీసి ఫర్వాలేదనిపించాడు.ప్రస్తుతం అతను స్వదేశానికి పయనం కానుండటంతో పుణెకు ప్లే ఆఫ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
డేర్ డెవిల్స్ విజయలక్ష్యం 162
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే విష్ణు వినోద్(3) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ గేల్- విరాట్ కోహ్లిలు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. గేల్ (48;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్సవ్వగా, విరాట్ కోహ్లి(58;45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 66 పరుగుల్ని జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే గేల్ అవుటైన స్వల్ప వ్యవధిలో ట్రావిస్ హెడ్(2)తో పాటు కోహ్లి కూడా నిష్ర్కమించడంతో బెంగళూరు తడబడింది. ఇక చివర్లో పవన్ నేగీ(13 నాటౌట్;5 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, నదీమ్ లు తలో వికెట్ తీశారు. -
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
-
ముంబై ఇండియన్స్ అరుదైన ఫీట్
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది. అయితే ముంబై ఇండియన్స్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. ట్వంటీ 20 క్రికెట్ లో వంద మ్యాచ్ ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా ముంబై అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 176 ట్వంటీ 20 మ్యాచ్ లాడిన ముంబై వంద విజయాలు సాధించగా, 73 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. మరో గేమ్ టైగా ముగియగా, రెండు రద్దయ్యాయి. కాగా, ఐపీఎల్లో మాత్రం ముంబైకు ఇది 89వ విజయం. ఓవరాల్ ఐపీఎల్లో 154 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ 64 మ్యాచ్ ల్లో ఓటమి చెందగా, ఒకటి టైగా ముగిసింది. 2010 నుంచి 2014 వరకూ చాంపియన్స్ లీగ్ లో ముంబై ఇండియన్స్ 11 విజయాల్ని సొంత చేసుకోగా, తొమ్మిది ఓటముల్ని చవిచూసింది. దాంతో మొత్తంగా కలుపుకుని వంద ట్వంటీ 20 విజయాల్ని సాధించిన తొలి జట్టుగా ముంబై సరికొత్త ఘనతను కైవసం చేసుకుంది. -
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, మరో రెండు రోజుల్లో నాకౌట్ పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో గెలిచిన పుణె చివరిగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదిలా ఉంచితే , ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు విజయాలు సాధించగా, ఆర్సీబీ మాత్రం రెండు విజయాల్నే తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఐపీఎల్ -10లో ఇదే చివరి లీగ్ కావడంతో గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. మరొకవైపు చివరి లీగ్ లో గెలుపు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన రసవత్తర పోరులో పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఆకట్టుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తొమ్మిది వికెట్లతో తేడాతో గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ 73 పరుగులోకే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఇది ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ అత్యల్ప స్కోరుగా నమోదైంది. పుణె బౌలర్లు శార్ధుల్ ఠాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కుప్పకూలింది. ఇక ఆపై 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణె భారీ విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (28) వికెట్ కోల్పోయినా మిగతా పనిని అజింక్యా రహానే (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (15 నాటౌట్) లు పూర్తి చేశారు. దాంతో ఇంకా 8 ఓవర్లకు మిగిలి ఉండగానే పుణె విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ లోకి ప్రవేశించిన రైజింగ్ పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. -
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
పుణె: ఐపీఎల్-10లో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అద్భుత కీపింగ్ తో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు శ్యామ్యుల్స్ ను రెప్పపాటులో స్టంప్ అవుట్ చేసి ఔరా అనిపించుకున్నధోని, తాజా కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ను అద్భుతంగా పట్టి ఆశ్చర్య పరిచాడు.. ఉనద్కత్ వేసిన 13 ఓవర్ నాలుగో బంతికి స్వప్నిల్ సింగ్ స్లిప్ లో ఉన్న క్రిస్టియన్ కు క్యాచ్ ఇవ్వగా బంతి అతని వేళ్లకు తగిలి పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన ధోని బంతిని అందుకున్నాడు. 'నీవు వదిలినా నేను వదలను' అన్నట్లు ధోని పట్టిన క్యాచ్ ను చూసిన వారంతా హతాశులయ్యారు. ఇక బెంగళూరు మ్యాచ్ లో డివిలియర్స్ ను స్టంప్ అవుట్ చేసిన విధానం కూడా కీపింగ్ లో ధోనికి ఎవరూ సాటిలేరని నిరూపించింది. ఇలా ఈ సీజన్ లో అంతగా బ్యాట్ ఝులిపించకపోయినా తన కీపింగ్ తో మాత్రం అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 100 మంది అవుట్ చేసిన ఘనతను అందుకున్న ధోని వికెట్ల వెనుకాల చిరుతలా కదులుతూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. -
కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
► ఆఖరి పోరులో విఫలమైన కింగ్స్ పుణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు మధ్య జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 73 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. పుణే బౌలర్లు శార్ధుల్ టాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే గప్టిల్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వృధ్దిమాన్ సాహా, షాన్ మార్ష్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా టాకుర్ మార్ష్(10) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేకపోయాడు. దీంతో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ లో మాక్స్ వెల్, గప్టిల్ డకౌట్ అవ్వగా, అక్సర్(22), సాహా(13), మార్ష్(10), స్వప్నిల్(10) లు మినహా మిగతా అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. దీంతో కింగ్స్ పంజాబ్ 15.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇది ఇరు జట్లకు చివరి లీగ్ కావడంతో పాటు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్ కావడంతో దీనికి అధిక ప్రాధ్యాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో పుణె గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం పుణె నాకౌట్ కు చేరడం కష్టమే. ప్రస్తుతం రన్ రేట్ ప్రకారం కింగ్స్ పంజాబ్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే నాల్గో జట్టుగా నిలుస్తుంది. ఇక్కడ ఇరు జట్లకు గెలుపు అనేది ముఖ్యం కావడంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో ఢిల్లీపై పుణె ఓడిపోవడంతో ఆ జట్టుకు ఇది కీలక మ్యాచ్ గా మారిపోయింది. మరొకవైపు వరుస విజయాలతో కింగ్స్ పంజాబ్ చెలరేగిపోవడంతో పుణెను కలవర పెడుతోంది. కచ్చితంగా గెలవాల్సిన రెండు వరుస మ్యాచ్ ల్లో కింగ్స్ విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
-
ధోని రికార్డు బద్దలు కొట్టిన గంభీర్
కోల్కతా: ఐపీఎల్లో టీమిండియా బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ రికార్డుల వేట కొనసాగుతోంది. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా మరో ఘనత సాధించాడు. ఒక ఫ్రాంచైజీ తరపున కెప్టెన్గా ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్గా ఐపీఎల్లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోని(2986) పేరిట ఉన్న రికార్డును గౌతీ సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో గంభీర్ 21 పరుగులు చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా 3 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్(4088) నాలుగో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 4540 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి(4360), రోహిత్ శర్మ(4156) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 3977 పరుగులతో డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో నిలిచాడు. -
టైటిల్ రేసులో మనోళ్లు..