Tomato
-
టమాటా పడిపోయే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. శివార్లలోని రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తెంపకుండా తోటల్లోనే వదిలేసేందుకు మొగ్గు చూపుతుండగా.. కొందరు మాత్రం మార్కెట్కు తెచి్చనా ధరలు రాకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో నగర మార్కెట్లో కిలో రూ. 15 ఉన్న టమాటా ప్రస్తుతం కిలో రూ. రూ.10కి పడిపొయింది. మార్కెట్లకు దిగుబడులు పోటెత్తడంతో సామాన్యులకు మాత్రం టమాటాలు అందుబాటులోకి వచ్చా యి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా పెరగడంతో ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గాయి. హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.3–8 ఉండగా రిటైల్ మార్కెట్లో ధర కిలో 7–10 పలుకుతోంది. డిమాండ్కు తగిన సరఫరా నగరానికి నిత్యం దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లకు 150 లారీల మేర దిగుమతులు వస్తున్నాయి.దీంతో నగర డిమాండ్ కంటే 30 లారీల టమాటా ఎక్కువగా దిగుమతి అవడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి రోజురోజుకూ దిగుమతులు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 90–120 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. ఈ నెల చివరి వరకు దిగుమతులు ఇలాగే ఉంటాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గుతాయని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. దిగుమతులు తగ్గితే ధరలు పెరిగే అవకాశముంది. -
ఇంటి భోజనం మరింత భారం!
కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.టమోటా ధరలు: డిసెంబర్లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.ఇదీ చదవండి: చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది. -
తమాషా.. టమాట
జీడిమెట్ల: టమాట మొక్క ఏకంగా పన్నెండు అడుగులు పెరిగి అందరినీ అకర్షిస్తోంది. నగరంలోని సుభాష్ నగర్ అదివాసి మెస్ అండ్ కర్రీస్ పాయింట్ వెనుక ఉన్న స్థలంలో ఈమొక్క మొలిచింది. దీనికి అదివాసి మెస్లో పనిచేసేవారు ప్రతిరోజూ నీరు పోస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ మొక్కను పనిగట్టుకుని విత్తినది కాదు. మెస్లో పడేసిన కూరగాయల చెత్తలోని విత్తనం ద్వారా ఈ మొక్క పెరిగిందని వారు చెబుతున్నారు. ఈమొక్క ఇంకా పెద్దగా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. -
‘టాప్’ మోతపై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏడాది ఏదో ఒక సీజన్లో టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఒకేసారి పెరిగి ‘సెంచరీ’కొట్టడం...మనందరి గుండెలు గుభిల్లుమనడం...మళ్లీ ఒక్కసారే వాటి ధరలు పడిపోవడం షరామామూలై పోతున్న విషయం మనకు తెలిసిందే. దక్షిణాదిలో ఈ సమస్య ఉండగా...టమాటా, ఉల్లిగడ్డల ధరల మోతతో పాటు దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ తదితర ప్రాంతాల్లో ఆలుగడ్డల ధరలు బెంబేలెత్తిస్తున్న సంగతి కూడా విదితమే. ఏ యేడాదికి ఆ ఏడాది ఇలా ధరల పిడుగు మనపై పడుతూ, ఉత్పత్తి, సరఫరా సరిగా లేక ఈ సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో ‘కిచెన్ బడ్జెట్’ను కిందా మీదా చేస్తున్నా దీనికి తగిన పరిష్కారమంటూ లభించకపోవడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ పేపర్ సిరీస్లో భాగంగా... డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అక్టోబర్–2024లో విడుదల చేసిన ‘వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా :ఏ స్టడీ ఆఫ్ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో (టాప్)’నివేదికలో వివిధ అంశాలను పొందుపరిచారు. కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (సీపీఐ)లో పెద్దగా ప్రాధాన్యత లేని టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు «వివిధ సందర్భాల్లో అధిక ధరల పెరుగుదల కారణంగా ఆహారపదార్థాలపై ప్రభావం పడటంతో పాటు ద్రవ్యోల్బణం విషయంలో వార్తాపత్రికలు, దృశ్యమాధ్యమాల పతాక శీర్షికలకు కారణమవుతోంది. ఈ నివేదికలో భాగంగా...వివిధ అంశాలను పరిశీలించారు. వాల్యూచెయిన్తో ముడిపడిన అంశాలు తదితరాలపై అధ్యయనం చేశారు. వీటిధరల్లో రైతుల భాగస్వామ్యం అనే విషయానికొస్తే...టమాటాల్లో 33 శాతం, ఉల్లిపాయల్లో 36 శాతం, ఆలుగడ్డల్లో 37 శాతం రైతుల ‘షేర్’ఉన్నట్టుగా పేర్కొన్నారు. వీటి పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం, కూలీల వేతనాలు ఇంకా... సీజనల్ ఆటోరిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ విత్ ఎక్సోజీనోస్ వేరియబుల్ (సారిమాక్స్) ప్రభావితం చేస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే భారత్లోనూ...కరోనా మహమ్మారి అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాల ప్రభావంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా... భారత్లో ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణానికి కన్జూమర్ ప్రైస్ఇండెక్స్ (సీపీఐ)లో ఇవి మూడు అధిక ప్రాధాన్యతను పొందే పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యి, అధికంగా వినియోగించే కూరగాయల్లో ఈ మూడు ఉండటంతో కొరత ఏర్పడినప్పుడు ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి మూడు కూడా ప్రధానంగా స్వల్పకాలిక పంటలు, (షార్ట్ సీజనల్ క్రాప్స్) త్వరగా కుళ్లిపోవడం, కొన్ని ప్రాంతాల్లోనే వీటి ఉత్పత్తి కేంద్రీకృతం కావడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం వీటిపై తీవ్రంగా పడడం వంటి కారణాల వల్ల ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఏర్పడుతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు. సూచించిన పరిష్కారాలు... » నెలవారీగా ఈ మూడింటి సప్లయ్, డిమాండ్ను రూపొందించి, దీనికి తగ్గట్టుగా మార్కెట్ స్పందనలు.. మరీముఖ్యంగా రైతులు, వ్యాపారులు, దిగుమతిదారులు, స్టాకిస్ట్లు, వినియోగదారుల కొనుగోలుతీరును పరిశీలించాలి.» వీటి ధరలు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి స్టాక్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ధరల పెరుగుదలలు స్వల్పంగా ఉండేలా చూసుకోవాలి.» వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ...వచ్చే 12 నెలలకుగాను ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వాటిని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ూ ఈ మూడింటి ధరలు పెరగకుండా జాగరూకతతో వ్యవహరించడంలో భాగంగా వీటికి సంబంధించి వాల్యూ చెయిన్ను అర్థం చేసుకుని, వినియోగదారులు చెల్లించే మొత్తంలో వీటిని పండించే రైతుల వాటాను పెంచేలా చర్యలు చేపట్టాలి. -
Tomato Price: దారుణంగా పడిపోయిన టమాట ధర
-
బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్పాం.. ఉత్పాదకతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధిలో ఉద్యానపంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఏపీ ఉద్యానపంటల హబ్గా మారుతోంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్పాం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండోస్థానంలో ఉందని 2023–24 సామాజిక ఆర్థికసర్వే వెల్లడించింది. 2023–24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానపంటల సాగు చేపట్టినట్లు తెలిపింది.ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్గా తయారవుతోందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుండగా.. అందులో 43 శాతం (19.50 లక్షల ఎకరాల్లో) రాయలసీమలోనే సాగవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉద్యానపంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులుండగా.. అందులో 52 శాతం (189.69 లక్షల మెట్రిక్ టన్నులు) రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించింది. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంపుదల కోసం ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా తోటబడి పేరుతో సలహాలు, సూచనలు ఇస్తోందని, అలాగే విపత్తుల్లో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుందని తెలిపింది. 2023–24లో ఉద్యానపంటలు దెబ్బతిన్న 1.31 లక్షల మంది రైతులకు రూ.139.31 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించినట్లు వెల్లడించింది. ఏపీ ఉద్యానపంటల అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని సర్వే తెలిపింది. ఇప్పటివరకు 1,62,071 మెట్రిక్ టన్నులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. రాయలసీమలో సేకరణ కేంద్రాలను, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించింది. -
టమాటాలకు పోలీసు బందోబస్తు
పట్నా: ఉత్తరప్రదేశ్లోని ఒక వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. बंगलुरू से 1800 किलो टमाटर लेकर दिल्ली जा रहा ट्रक झांसी, यूपी में पलट गया। टमाटर की लूट न हो जाए, इसलिए रातभर पुलिस तैनात रही। मार्केट में टमाटर का रेट 80 से 120 रुपए किलो तक है।@RajuSha98211687 pic.twitter.com/g19jkVgOSs— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2024ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు -
భారీగా పతనమైన టమోటా ధర..
-
సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి. టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది. -
గిట్టుబాటు ధర లేక.. టమాటాలను రోడ్లపై పారబోసిన రైతులు! (ఫొటోలు)
-
టమాటా ధరలు ఢమాల్
-
అంతిమ యాత్రలో అపశ్రుతి.. రూ.5 లక్షలు నష్టం
కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్ ఖాన్) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు. అనంతరం మదనపల్లె పైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది. ∙ -
టమాట మండీ.. అక్రమ వసూళ్లు దండి
సాక్షి టాస్క్ఫోర్స్/రాఫ్తాడు రూరల్: ఓవైపు ఆరుగాలం ఎండనక.. వాననక కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధర కూడా లభించక అన్నదాతలు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు వారి కష్టాన్ని అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు నిలువుదోపిడీ చేస్తున్నారు. అధికారంలో ఉండి రైతులను ఆదుకోవాల్సిన ఆయనే రైతుల నుంచి భారీ ఎత్తున పిండుకుంటున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి సమీపంలోని టమాట మండీలో అక్రమ వసూళ్లకు తెర తీశారు. గతంలో టమాట మండీకి వచ్చే వాహనాల నుంచి పంచాయతీ అధికారులు సుంకం వసూలు చేసేవారు. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ వసూళ్లు నిలిపేశారు. అయితే ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు రంగంలోకి దిగారు. టమాట మండీకి వచ్చే వాహనాలు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. లోడు చేసుకునే పెద్ద వాహనం నుంచి రూ.2,500, చిన్న వాహనం నుంచి రూ. 500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వసూళ్లకు దిగారు. మండీ ఓనర్స్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్, బయ్యర్లు.. ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న వివిధ రకాల వసూళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.నెల రోజులుగా దందా..కక్కలపల్లి టమాట మండీలో అధికార పార్టీ నేత సాగిస్తున్న అక్రమ వసూళ్ల దందా నెల రోజులుగా సాగుతోంది. రోజూ రమారమి 230 వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. ఇందులో 140 దాకా పెద్దవి, 90 దాకా చిన్న వాహనాలు ఉంటున్నాయి. రోజుకు రూ.3,95,000 చొప్పున ఇప్పటిదాకా రూ.1.15 కోట్లకు పైగా వసూలు చేశారు. రోజూ వసూలవుతున్న మొత్తం సాయంత్రానికి అధికార పార్టీ ముఖ్య నేత ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. కూటమి నేతలు అడిగిన కప్పం కట్టడానికి నిరాకరించినవారికి బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ బయ్యర్ కప్పం కట్టేందుకు నిరాకరించడంతో ఆయన్ను బెదిరించి కప్పం కట్టించారు.నోటీసులను లెక్క చేయని అసోసియేషన్“టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్ చేస్తున్న వసూళ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వ అనుమతి లేకుండా పంచాయతీ పరిధిలో ఎలాంటి వసూళ్లు చేయరాదు. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ కక్కలపల్లి పంచాయతీ కార్యదర్శి గత నెల 22న టమాట మండీ ఓనర్స్ అసోసియేషన్కు నోటీసు ఇచ్చారు. వసూళ్ల నిర్వాకంపై స్వయంగా ఈవోఆర్డీ, డీఎల్పీవో, డీపీవోతో పాటు పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఏమాత్రమూ లెక్క చేయకుండా వసూళ్లు చేస్తూనే ఉన్నారు. పైగా ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్ను కూడా తొలగించేశారు.రెండో రోజూ రోడ్డెక్కిన టమాట రైతులు టమాటాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అనంతపురంలో రైతులు రెండో రోజు మంగళవారం కూడా రోడ్డెక్కారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి టమాట మండీల్లో అసోసియేషన్ నాయకులు నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ వసూళ్లను నిరసిస్తూ బయ్యర్లు రెండురోజులుగా కొనుగోలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారి–44పై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అనంతపురం డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులతో మాట్లాడారు. ఏదైనా ఉంటే మండీ అసోసియేషన్, బయ్యర్లతో కూర్చుని మాట్లాడదామని, వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు రోజులుగా రైతులు రోడ్డెక్కుతున్నా ఏమి న్యాయం చేశారంటూ నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే బయ్యర్లు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ టమాట మండీ వద్దకు చేరుకున్నారు. మండీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ప్రతి లోడుకూ రూ.2,500 అదనంగా వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు బయ్యర్లు శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ వసూళ్లపై ఎందుకు స్పందించలేదని ఆయనను నిలదీశారు. కాగా బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మంగళవారం వేలం పాట నిలిచిపోయింది. దీంతో ప్రతి రైతుకూ వేలాది రూపాయలు నష్టం వాటిల్లింది. నెత్తిన గుండేసుకుని చావాలా?బయ్యర్ల నుంచి ప్రతి లోడుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పరిష్కారం అయ్యేదాకా తాము కొనుగోలు చేయబోమని బయ్యర్లు అంటున్నారు. సరుకు తెచ్చిన రైతులు నెత్తిన గుండేసుకుని చావాలా? – తిమ్మప్ప, రాంపురం, ఉరవకొండ మండలంమా గోడు ఎవరికి చెప్పుకోవాలి? నేను 100 బాక్సుల టమాట తీసుకొచ్చా. రేయంతా కాసుకుని కూర్చున్నా. ఉదయమైతే బయ్యర్లు కొనేందుకు ముందుకు రాలేదు. పంట సాగు చేసినప్పటి నుంచి మండీకి తెచ్చేదాకా రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? – మంజునాథ్, కళ్యాణదుర్గం -
సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్ చేస్తే’ : వరల్డ్ రికార్డ్, వైరల్ వీడియో
కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. తాజాగా ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని మరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.చెఫ్ వాంగ్ జూన్ 12న లండన్లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించగా, మా అమ్మ కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్ చేశారు.వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు. ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్ మెస్ట్ రెస్టారెంట్లలో పనిచేశాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు. Can he beat the record? #chef #worldrecord #foodpreparation #canadasgottalent #foodchopper guinessworldrecord Wallace Wong attempts a World Record on Canada's Got Talent! 🥕🔪 pic.twitter.com/FpJPRDJ9WC— Olivia Gran (@GranOlivia) April 21, 2024 -
టమాటాలపై సబ్సిడీ.. ఎన్సీసీఎఫ్ కీలక నిర్ణయం
పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 60 రూపాయల సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో టమాట ధరలు భారీగా పెరగడంతో ఎన్సీసీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో కేజీ టమాట ధర రూ.77 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు రూ. 80 దాటేసింది. ఈ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్సీసీఎఫ్ రేపటి నుంచి (జులై 29) మెగా సేల్ ప్రారంభించనుంది. ఇందులో టమాటాల మీద సబ్సిడీ కూడా లభిస్తుంది.కృషి భవన్, సీజీఓ కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, ఐఎన్ఏ మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్లోని అనేక ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో టమాటాలు సబ్సిడీ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎన్సీసీఎఫ్ వెల్లడించింది.పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్రం సబ్సిడీ ప్రవేశపెట్టింది. సబ్సిడీ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో టమాట ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు కూడా ఎన్సీసీఎఫ్ సబ్సిడీ అందించింది. NCCF has announced retailing tomatoes at Rs 60/kg. This will start from July 29 at various strategic locations across Delhi and NCR. Tomatoes will be retailed at Rs 60/kg at several locations, including Krishi Bhawan, CGO Complex, Lodhi Colony, Hauz Khas Head Office, Parliament… pic.twitter.com/rkDTnaAUoF— ANI (@ANI) July 27, 2024 -
ఆకాశాన్నంటిన ఆహార ధరలు.. అదే ప్రధాన కారణం!
గతేడాది టమాటా ధరలు, ఉల్లి ధరలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాల ధరలు చుక్కలు తాకాయి. ఇప్పడు కూడా టమాటా ధరలు భారీగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ ధర వంద రూపాయలకంటే ఎక్కువ. ఆహార ధరలు పెరగటానికి గల కారణాలను ఆర్ధిక సర్వేలో వెల్లడించారు.వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం, పంట నష్టం వంటివి.. ఆహార ధరలు పెరగటానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ధరల మీద పడుతుందని వివరించింది.పంట దిగుబడి తగ్గితే.. డిమాండ్కు సరిపడా సరఫరా తగ్గుతుంది. దీంతో ధరలు పెనుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆహార ధాన్యాలు, టమాటా, ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణమని ఆర్ధిక సర్వే వెల్లడించింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుంచి FY23లో 6.6 శాతానికి చేరింది. ఇది FY24 నాటికి 7.5 శాతానికి చేరింది.ఉల్లి ధరలు పెరగడానికి గత కోత సీజన్లో వర్షాలు, విత్తడంలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలు కూడా కారణమని తెలుస్తోంది. తక్కువ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల ధరలు పెరిగాయని సర్వే పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాలతో పాటు రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించింది. -
సెంచరీ కొట్టిన టమాటా..
-
కొండెక్కిన టమాటా : బోలెడన్ని ప్రత్యామ్నాయాలు, ట్రై చేశారా?
మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు. వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది. మామిడి కాయ: సీజన్ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్ల లభించే క్యాప్సికమ్ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు. ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.టమాటా ఒరుగులువర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం. -
కొండెక్కిన టమోటా ధరలు: కేజీ ఎంతంటే?
దేశంలో టమోటా ధరలు భారీగా పెరిగాయి. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమోటా రూ. 90 నుంచి రూ. 100 మధ్య ఉన్నాయి. ముంబైలో ఈ ధరలు రూ. 80 నుంచి రూ. 100 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.2024 ఏప్రిల్లో వైజాగ్, విజయవాడ రాష్ట్రాల్లోని హోల్సేల్ మార్కెట్లో 15 కేజీల టమోటాల ధర రూ. 150 నుంచి రూ. 200 మధ్య ఉండేది. అయితే ఇప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 15 కేజీల టమోటాలు ధర రూ. 1100 నుంచి రూ. 1200లకు చేసింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కూడా కేజీ టమోటా ధర రూ. 75 నుంచి రూ. 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.వర్షాకాలంలో కూరగాయల ధరలు సాధారణంగా పెరుగుతాయి. వర్షం వల్ల పంట ఏపుగా పెరిగినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తగ్గుతుంది. దీంతో ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ ఏడాది ఓ వైపు వర్షాలు, మరోవైపు భారీ ఎండలు కారణంగా నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.ఆలస్యమైన రుతుపవనాలు కూడా టమోటా తోటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ - జులై నెలల్లో టమాటో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం.. రుతుపవనాల ఆలస్యం కారణంగా టమోటా సాగును చాలామంది రైతులు వాయిదా వేశారు. టమోటా ధరలు మాత్రమే కాకుండా బంగాళదుంపలు, ఉల్లి వంటి ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. -
మళ్లీ సెంచరీ కొట్టిన టమాటా
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు. వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది. గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది. -
నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలు
-
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్తో యంత్రాలు, షెడ్ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
భారీగా పతనమైన టమాటా రేటు
సాక్షి, అన్నమయ్య: కొండెక్కి రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ. 15, రూ. 20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ మదనపల్లెలో(అన్నమయ్య జిల్లా ఏపీ) కేజీ టమాట రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే. -
టమాటా ఉత్పత్తిలో రాష్ట్రానికి మూడో స్థానం
సాక్షి, అమరావతి: దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలి్చతే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం.. ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడమేనని నాబార్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది. ఈ ఏడాది జూన్లో కిలో టమాటా దాదాపు రూ.30 ఉండగా జూలై చివరి నాటికి రిటైల్ మార్కెట్లో కిలో రూ.130కి పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 10న హోల్సేల్లో కిలో రూ.106.91 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.131.69 ఉందని వెల్లడించింది. -
సండే స్పెషల్..! అంతా టమాటానే!
సండే స్పెషల్.. !టమాటా కర్రీ.. టమాటా చారు..టమాటా పచ్చడి.. టమాటా ఫ్రై..టమాటా.. -
టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత..
గత కొన్ని రోజులకు ముందు టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేజీ రూ. 100 కంటే ఎక్కువ వద్ద లభిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం టమాటాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) 2023 ఆగస్టు 20 నుండి కిలో రూ. 40 రిటైల్ ధరకు టమోటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరలకే ప్రజలకు టమాటాలు అందించిన సందర్భాలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆగస్ట్ 15న ప్రభుత్వం టమాటా ధరలను రూ.50కి తగ్గించింది, తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తూ ప్రకటించింది. ఇదీ చదవండి: ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే? ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏకంగా 15 లక్షల కేజీల టమాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. విక్రయాలు ఢిల్లీలో మాత్రమే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వారణాసి, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా జరిగినట్లు సమాచారం. కేవలం గత 15 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 560 టన్నుల టమోటాలను విక్రయించింది. -
ఊరట: రూ. 50లకు కిలో టమాటా: కేంద్రం ఆదేశం
ఆగస్టు 15 నుంచి కిలోకు రూ. 50 రిటైల్ ధరకు టమోటాలను విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలంలో టమాట ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమన్న నేపథ్యంలో కేంద్రం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)ని ఆదేశించింది. మార్కెట్లో పెరుగుతున్న ధరలు, సరసమైన ధరలో టమాటాలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం ) ఇటీవలి కాలంలో టమాటా ధర క్రమంగా పెరుగుతూ వచ్చి డబుల్ సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో ప్రాంతంలో జూలై 14న టమాటా రిటైల్ విక్రయాలు ప్రారంభం కాగా ఆగస్టు 13 వరకు మొత్తం 15 లక్షల కిలోల పంటను రెండు ఏజెన్సీలు కొనుగోలు చేశాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) -
రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా
-
తొలిసారి తగిలిన లాటరీ.. రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా
సాక్షి, అమరావతి: ఒకప్పుడు కిలో టమాటాలను రూపాయి.. రెండు రూపాయలకు విక్రయించిన రైతులు అనూహ్యంగా లక్షాధికారులుగా మారారు. కొందరైతే కోటీశ్వరులయ్యారు కూడా. ఈ సీజన్లో టమాటా ధరలు పెరగడం రైతుల అదృష్టాన్ని మలుపు తిప్పింది. టమాటా ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తిలేక టమాటా ధరలు జాతీయ స్థాయిలో అనూహ్యంగా పెరిగాయి. మండీలలోనే కిలోకు సగటున రూ.130 నుంచి రూ.150 ధర లభించగా.. ఒక దశలో కిలో రూ.270 వరకు పలికింది. వ్యాపారులు పోటీపడి ధరలు పెంచడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. సుమారు 7 వేల మంది రైతులకు ప్రయోజనం రాష్ట్రంలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగ వుతోంది. ఏటా ఖరీఫ్లో 60 శాతం, రబీలో 30 శాతం, వేసవిలో 10 శాతం విస్తీర్ణంలో సాగవుతుంది. వేసవి పంటను కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, బెంగళూరు రూరల్ జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో సాగు చేస్తుంటారు. ఏపీలో టమాటా రైతులు 70 వేల మంది ఉండగా, వారిలో 5–7 వేల మంది రైతులు మాత్రమే సుమారు 10 వేల ఎకరాల్లో వేసవి పంట సాగు చేస్తుంటారు. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. సాధారణంగా సాగు చేస్తే 15 కోతలు, ట్రెల్లీస్ కింద సాగు చేస్తే 25–30 కోతలు వస్తుంది. హెక్టార్కు ఖరీఫ్లో 60 టన్నులు, రబీలో 65–70 టన్నులు, వేసవిలో 50–60 టన్నులు వస్తుంది. ఎకరాకు గరిష్టంగా రూ.25 లక్షలకు పైగా ఆదాయం గతేడాది వేసవి పంటకు కిలో రూ.100కు పైగా లభించడంతో ఈ ఏడాది అదే స్థాయిలో ధర లభిస్తుందన్న ఆశతో రైతులు వేసవి పంట సాగుకు మొగ్గు చూపారు. సాధారణంగా వేసవి పంట ఫిబ్రవరి–మార్చిలో వేస్తారు. కొద్దిమంది కాస్త ఆలస్యంగా మార్చి–ఏప్రిల్లో పంట వేశారు. ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల ఎకరాకు సగటున 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అనూహ్యంగా పెరిగిన ధర ల ఫలితంగా చిత్తూరు జిల్లాలో 2,500 మంది రైతులు, అన్నమయ్య జిల్లాలో 3,200 మంది రైతులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జించారు. సగటున ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం రాగా, కొంతమందికి ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చింది. సుమారు 10–20 మంది రైతులు రూ.కోట్లలో ఆర్జించా రు. మదనపల్లెలో కిలోకు గరిష్టంగా రూ. 200 పలుకగా, కలికిరిలో రూ.245 పలికింది. ఇక అంగర మార్కెట్లో రూ.215 ధర వచ్చింది. రూ.3 కోట్లు మిగిలింది చిత్తూరు జిల్లా సోమల మండలం కరమండ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు పెసలప్పగారి మురళి. 24 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయంలో టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. సగటున కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ధర పలికింది. కేవలం 45 రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.4 కోట్లకు పైగా ఆదాయం రాగా.. పెట్టుబడి పోనూ రూ.3 కోట్లకుపైగా మిగిలింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల క్రితం 12 ఎకరాల్లో టమాటా సాగుచేసే వాడిని. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 24 ఎకరాల్లో పంట వేశా. ప్రభుత్వం 20 ఎకరాలకు సబ్సిడీపై డ్రిప్తోపాటు మల్చింగ్ షీట్స్ ఇచ్చింది. గతంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేది కాదు. ప్రస్తుతం 9 గంటలు ఇస్తున్నారు. ఇటీవలే మా ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన 4 గంటల్లోనే కొత్త ట్రాన్స్ఫార్మర్ వేశారు. టమాటా రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, మంత్రి పెద్దిరెడ్డికి రుణపడి ఉంటాం’ అని కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు బాసటగా ప్రభుత్వం టమాటా ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. రైతుల నుంచి సగటున కిలో రూ.107.49 చొప్పున రూ.14.65 కోట్ల విలువైన 1,363 టన్నులు సేకరించి రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే సబ్సిడీపై వినియోగదారులకు అందించింది. బుధవారం కూడా కిలో రూ.83 చొప్పున రూ.16.60 లక్షలతో 20 టన్నులు సేకరించి సబ్సిడీపై పంపిణీ చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.125 మధ్య ధర పలుకుతుంటే రైతుబజార్లలో రూ.70 నుంచి రూ.84 మధ్య పలుకుతున్నాయి. అప్పులన్నీ తీర్చేశా రెండెకరాల్లో 15 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా. దిగుబడులు ఘనంగా వచ్చినా మార్కెట్లో ధరలు అంతంతమాత్రంగానే ఉండేవి. పెట్టుబడి పోనూ ఆదాయం పొందిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట వేశా. దిగుబడుల కోసం అధికంగా ఎరువులు వినియోగించడం వల్ల రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. మే 20 నుంచి ఇప్పటిæవరకు 23 కోతలు కోశాను. పెట్టుబడి ఖర్చులు పోనూ రూ.36 లక్షల వరకు ఆదాయం పొందాను. ఈ ఏడాది టమాటాకు వచ్చిన ధర గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఆదాయంతో మాకున్న అప్పులన్నీ తీర్చేశా. – వెంకటేష్ రాయల్, చిప్పిలి, మదనపల్లె -
టమాటాల దండతో రాజ్యసభకు ఆప్ ఎంపీ.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశంలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కిలో టమాటాలు రూ.200 పైనే అమ్ముడుపోయాయి. టమాటా ధరల పెరుగుదల రాజకీయంగా కూడా వార్తల్లో నిలిచింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. అటు పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు టమాటా మంచి ఆయుధంగా కూడా మారింది. తాజాగా రాజ్యసభ సమావేశాలకు వెళ్లి ఆప్ ఎంపీ వినూత్నంగా నిరసన తెలిపారు. టమాట ధరల పెరుగుదలతో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా రాజ్యసభకు సరికొత్తగా నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా టమాటా దండను మెడలో వేసుకుని రాజ్యసభకు వెళ్లారు. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవ మర్యాదలు కాపాడాలని అన్నారు. సదరు సభ్యునిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ग़रीब लोगों का ख़ून चूस रही 'Modi की महंगाई डायन'‼️ Modi सरकार का ध्यान महंगाई की तरफ आकर्षित करने के लिए टमाटर और अदरक की माला पहन कर संसद पहुँचे AAP MP @DrSushilKrGupta pic.twitter.com/FkLEQxQAe7 — AAP (@AamAadmiParty) August 9, 2023 కాగా.. ధరల పెరుగుదలకు నిరసనగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది. ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్.. -
గుడ్న్యూస్: దిగొస్తున్న టమాట ధరలు.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: దేశ వాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ విన్నా టమోట పేరే వినపడుతోంది. ఎక్కడ చూసినా టమాటా చర్చలే. గతంలో ఎన్నడూ లేనంతగా కేజీ టమాటా ధర రూ. 200కి చేరి సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ధరలు పెరిగిపోవడంతో టమాట దొంగతనాలు, పంటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. అయితే దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా దిగుబడి పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం వరకు రూ.4,300 పలికిన 23 కేజీల బాక్సు ధర ప్రస్తుతం రూ. 2,300కి తగ్గింది. నాణ్యతను బట్టి బాక్సు ధర రూ.1500 నుంచి రూ.2,300 వరకు పలుకుతున్నది. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 60-100 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 100-140 మధ్య ఉంది. పది రోజుల క్రితం హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్కు 850 క్వింటాళ్ల టమాటా రాగా సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలతోపాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్కు టమాటాలు వస్తున్నాయి. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరుకు కిలో టమాటా రూ. 50కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాలపై నిఘా కోసం పొలంలో సీసీ కెమెరా ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఓ రైతు ఏకంగా తన టమాట పొలంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్కు చెందిన రైతు శరద్ రాటేకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఒకటిన్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఆ పంటను కాపాడుకోవడానికి పొలంలో డిజిటల్ నిఘాను ఏర్పాటు చేశారు. దానిని ఫోన్కు అనుసంధానించి ఫోన్లో ఎక్కడైనా విజువల్స్ని తనిఖీ చేస్తున్నారు. ఇటీవల టమాటా తోటపై దొంగలు దాడి చేసి 20 నుంచి 25 కిలోల టమాటాలు ఎత్తుకుపోవడంతో తాను ఈ చర్యలు తీసుకున్నానన్నారు. ఈ రోజు అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయ అయిన టమాటాలను కోల్పోవడం తాను భరించలేనని చెప్పారు. 22–25 కిలోల టమాటా ఇప్పుడు రూ.3 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కెమెరా సౌరశక్తితో నడుస్తుందని, దాని విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు తెలిపారు. -
టమాటాల వ్యాను బోల్తా.. ఎగబడ్డ జనం
హజారీబాగ్: టమాటాల లోడుతో వస్తున్న వ్యాను బోల్తా పడగా అందులోని టమాటాల కోసం జనం ఎగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కొంత సరుకును మాత్రం తిరిగి స్వా«దీనం చేసుకోగలిగారు. ఈ ఘటన బిహార్లో జరిగింది. నేపాల్ నుంచి టమాటాల లోడుతో వస్తున్న వ్యాను ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో బిహార్లోని రాంచీ–పట్నా హైవేపై చర్హి వ్యాలీ వద్ద పల్టీ కొట్టింది. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వ్యాను బోల్తా పడి అందులోని టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఇంకేముంది..? టమాటాల ధర కిలో వందల్లో ఉన్న వేళ..ఈ ఘటన సమీప గ్రామస్తులకు అనుకోని వరంలా మారింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. సంచులు, డబ్బాలతో టమాటాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. వ్యాను డ్రైవర్, క్లీనర్ అడ్డుకున్నా వారు లెక్కచేయలేదు. అయితే, ఈ గందరగోళంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గ్రామస్తులు ఎత్తుకెళ్లిన టమాటాల్లో చాలా వరకు తిరిగి రాబట్టారు. -
ఆ దేశంలోని టమాట ధర వింటే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!
రెండు నెలల కిందటి వరకు సామాన్యులకు అందుబాటులోనే ఉన్న టొమాటో ధరలు ఇటీవలి కాలంలో కళ్లుబైర్లు కమ్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టొమాటో ధరలు కిలో వంద రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కిలో రెండువందల యాభై వరకు కూడా పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ధరలకే జనాలు బెంబేలుపడుతుంటే.. ఇంకో రకం టొమాటో ధర వింటే అమ్మ బాబోయ్! అంటారు టొమాటోల్లో ఒక రకానికి చెందిన విత్తనాల ధర బంగారం కంటే ఎక్కువే! ‘హజేరా జెనెటిక్స్’ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ ‘సమ్మర్ సన్’ రకానికి చెందిన టొమాటో విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు (దాదాపు రూ.3 కోట్లు) విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టొమాటోల ధర యూరోప్ మార్కెట్లో కిలో దాదాపు 30 డాలర్ల (సుమారు రూ.2,500) వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టొమాటోలు చౌకగా దొరుకుతున్నట్లే! ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున ఇరవై కిలోల వరకు దిగుబడినిస్తుంది. (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్ హోల్సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
టమాటాలు కేజీ రూ. 70 - ఆర్డర్ చేస్తే ఇంటికే!
How To Buy Tomatoes Rs.70 KG: భారతదేశంలో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటున్నాయి. రైతులు మంచి లాభాలు పొందుతున్నప్పటికీ సామాన్యులకు ఇది పెనుభారంగా మారిపోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 200 దాటినట్లు సమాచారం. భారీ ధర వద్ద లభించే టమాటాలను తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టమాటా ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్లైన్లో సరసమైన ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కేవలం వారం రోజుల్లో ఏకంగా 10,000 కేజీల టమాటాలు అమ్ముడు కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది. రూ. 70కే పేటీఎమ్ భాగస్వామ్యంతో ఓఎన్డీసీ విక్రయిస్తోంది. పేటీఎమ్, మ్యాజిక్ పిన్, మై స్టోర్ వంటి యాప్స్ ద్వారా కూడా టమాటాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒక కస్టమర్ వారానికి కేవలం 2 కేజీల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ పొందవచ్చు. దీనికి ఎటువండి అడిషినల్ ఛార్జెస్ ఉండవు. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. పేటీఎమ్లో ఆర్డర్ చేసే విధానం.. స్మార్ట్ఫోన్లో లోకేష్ ఆన్ చేసుకున్న తరువాత, యాప్లో ఓఎన్డీసీ ఫుడ్ అని సర్చ్ చేయాలి. ఓఎన్డీసీ ఓపెన్ అయిన తరువాత సమీపంలో ఉన్న స్టోర్స్ కనిపిస్తాయి, ఇందులో దాదాపు అన్నీ మీ లొకేషన్కు సమీపంలో ఉన్నవే ఉంటాయి. ఇందులో మీ దగ్గరగా ఉన్న ఒక స్టోర్ ఎంచుకోవాలి, ఆ తరువాత ఆర్డర్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత డెలివరీ పొందాల్సిన అడ్రస్ సెట్ చేసుకుని, ఆ తరువాత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాగే మీరు మ్యాజిక్పిన్ ద్వారా కూడా టమాటాలు ఆర్డర్ చేసుకోవచ్చు. -
టమాట కిలో 264/- నాట్ అవుట్
-
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
200 కేజీల టమాటాల చోరీ
సాక్షి, చైన్నె: తిట్టకుడి మార్కెట్లో 200 కేజీల టమటాలు చోరీకి గురయ్యాయి. బాధిత వ్యాపారులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా తిట్టకుడి మార్కెట్లో పదికి పైగా టమాటా దుకాణాలున్నాయి. శనివారం రాత్రి దుకాణాలను మూసి వేసి ఇళ్లకు వ్యాపారులు వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూడగానే అనేక దుకాణాల తలుపులు పగుల కొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కో దుకాణంలో 20 కేజీలు చొప్పున 200 కేజీల టమాటాలు చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. దీంతో టమాటా దొంగలను పట్టుకునేందుకు ఆ పరిసర్లాలోని నిఘా కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టమాటా ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కిలో టమాటా కొన్నిచోట్ల రూ. 170, మరికొన్ని చోట్ల రూ. 200 ధర పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. -
జాక్ పాట్ కొట్టిన టమోటా రైతు
-
మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్లో సీజన్ పూర్తయితే అనంతపురం, డోన్, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు. -
క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే నల్ల టమాటాల గురించి ఈ విషయాలు తెలుసా?
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడికి భారంగా మారిపోయిన టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం. దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి నల్ల టమాటాల గురించి మీకు తెలుసా? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే ఈ బ్లాక్ టమాటాల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎగబాకాయి. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ ధరలను బ్రేక్ చేస్తూ టమాట కిలో ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతుంది. ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టమాటాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతుంది. ఈ క్రమంలో బ్లాక్ టమాటాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా టమాటా ఎర్రటి రంగులోమెరిసిపోతుంటుంది. కానీ ఈ బ్లాక్ టమాటాల గురించి మీకు తెలుసా? ఎరుపు, ఊదా రంగు విత్తనాలతో ఈ నల్ల టమాటాలను పండిస్తారట. వీటిని ఇండిగో రోజ్ అని కూడా పిలుస్తారు.హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్లలో ప్రస్తుతం ఈ నల్ల టమాటాలను సాగు చేస్తున్నారు. ఈ బ్లాక్ టామాటాలు క్యాన్సర్తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లాక్ టమాటాలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు కూడా చాలా తక్కువ. బ్లాక్ టొమాటోలో ప్రొటీన్, విటమిన్ ఎ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి పోరాడటానికి ఈ బ్లాక్ టమాటాలు దోహదం చేస్తాయి. అందుకే యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ టమాటాలు ధరతో పోలిస్తే కాస్త ఎక్కునేనట. -
టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!!
కర్ణాటక: టమాటా లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డుపక్కన బోల్తాపడగా, స్థానికులు వచ్చి టమాటాలను ఊడ్చుకెళ్లారు. బుధవారం రాత్రి చెన్నపట్టణ తాలూకా సంకలగెరె గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందో తెలియరాలేదు. లారీ పడి ఉండడం, జనం పోటీపడి టమాటాలు తీసుకెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్
జైపూర్: శిఖర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ శాసనసభలో ఎర్ర డైరీ ఒకటి హల్చల్ చేసింది. అది గాని బహిర్గతమైతే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ ఎర్రటి టమాటాలు, సిలిండర్లను వంటగది బడ్జెట్ పెంచేసిన విషయం మాత్రం కానరాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఎమ్మెల్యే మంత్రి రాజేంద్ర సింగ్ గుదా రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేసి, ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ ఇది రాజస్థాన్ సీఎం భవిష్యత్తును తేల్చే భవిష్యవాణి అంటూ సంచలనం సృష్టించారు. ఆ డైరీలో 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన లావాదేవాల వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ వేయడంలో తనదైన మార్క్ ప్రదర్శించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శిఖర్ సభలో ఈ ఎర్ర డైరీ గురించి ప్రస్తావించి సీఎం అశోక్ గెహ్లాట్ కు కౌంటర్ వేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ఎదో కార్యక్రమం చేశారు. అది మొహబ్బత్ కీ దుకాణ్ కాదు "లూటీ కీ దుకాణ్-ఝూటీ కీ దుకాణ్" అని అన్నారు. ప్రజలను లూటీ చేసిన సమాచారం తోపాటు వారు చెప్పిన ఝూటా కబుర్ల గురించిన వివరమంతా ఎర్ర డైరీలో ఉన్నాయి. ఆ నిజాలు బయటకు వస్తే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. लाल डायरी..... अब अच्छे-अच्छे निपट जाएंगे! लाल डायरी का नाम सुनते ही कांग्रेसियों के मुंह में दही जम जाता है?#Rajasthan #AshokGehlot #congrees #NarendraModi#sikar #RajendraGuda pic.twitter.com/fafANrlwlp — Priti charan (@CharanPriti) July 27, 2023 అసలే దుందుడుకు స్వభావి అయిన సీఎం ఈ కామెంట్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. మీకు ఊహాజనితమైన ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ కళ్ళ ముందున్న ఎర్రటి టామాటాలు, ఎర్రటి గ్యాస్ సిలిండర్లు కనిపించవు.. వాటి కారణంగా ఎర్రగా మారిన ప్రజల ముఖాలు కూడా కానరావు. చూస్తూండండి వచ్చే ఎన్నికల్లో జనం మీకు ఎర్రటి జెండా చూపించడం ఖాయమని కౌంటర్ వేశారు. "PM को लाल टमाटर, महंगाई से हुए लोगों के लाल चेहरों पर बात करनी चाहिए" ◆ राजस्थान CM अशोक गहलोत का बयान @ashokgehlot51 #AshokGehlot pic.twitter.com/1F4wdPPlVV#राजस्थान_में_मोदी_मोदी — Nemi saini (@NemiSainiINC) July 27, 2023 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కార్యక్రమంలో తన పేరును తొలగించారన్న కారణంతో ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇలా హాటు హాటుగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం -
ఈ సీజన్లో టమోట సాగుచేస్తే మరింత ఆదాయం
-
కేంద్రం కంటే మిన్నగా..
ఈయన పేరు సోమిశెట్టి రామచంద్రరావు. విజయవాడ ఇందిరా కాలనీలో ఉంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.120–150 పలుకుతుండగా, కృష్ణలంక రైతుబజార్లో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.50కే అందిస్తుండడం మాబోటి వారికి చాలా ఊరటగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగైదుసార్లు వెళ్లి తెచ్చుకున్న ఆయన.. టమాటాలు తాజాగా, నాణ్యతతో ఉంటున్నాయంటూ ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో రైతుబజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. ఆకస్మిక వర్షాలతో మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బతినడంతో ధరలు దేశవ్యాప్తంగా చుక్కలనంటాయి. దాదాపు 40 రోజులు కావస్తున్నా డిమాండ్ సరిపడా నిల్వల్లేక ధరలు అదుపులోకి రాని పరిస్థితి. ధరలు పతనమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే రీతిలో ప్రస్తుతం మార్కెట్లో ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు నెలరోజులుగా ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా సబ్సిడీపై టమాటాలు విక్రయాలను కొనసాగిస్తోంది. రంగంలోకి మార్కెటింగ్ శాఖ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నేటికీ కిలో రూ.120 నుంచి రూ.150కు తగ్గలేదు. ధరలు పెరుగుదల మొదలైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపిన ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి వాటిని రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. రాష్ట్రంలో సబ్సిడీపై టమాటా విక్రయాలు ప్రారంభించిన మూడు వారాల తర్వాత కేంద్రం కూడా ఏపీ బాటలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిం ది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సేకరించి ఉత్తరాదిలోని మండీల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.80 చొప్పున విక్రయాలకు శ్రీకారం చుట్టింది. సబ్సిడీ కోసం రూ.11.82 కోట్లు ఖర్చు.. రోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లలో వ్యాపారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. డిమాండ్ను బట్టి స్థానిక వ్యాపారుల నుంచి కూడా సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.104 చొప్పున రూ.11,82,40,000 ఖర్చుచేసి 1,136.90 మెట్రిక్ టన్నుల టమాటాలను సేకరించింది. రోజూ 40–70 టన్నుల చొప్పున సేకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 ప్రధాన రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా మనిషికి ఒక కిలో చొప్పున విక్రయిస్తోంది. కిలో రూ.123.50 చొప్పున కొనుగోలు.. మంగళవారం సగటున కిలో రూ.123.50 చొప్పున రూ.49.40 లక్షల విలువైన 40 టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిని విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 40 రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేశారు. ఇలా దాదాపు నెలరోజులుగా సబ్సిడీపై టమాటా విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుండడంపట్ల వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటినప్పుడు రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. గతలో ఎన్నడూ ఇలా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భాల్లేవని వినియోగదారులు చెబుతున్నారు. పేదలకు ఊరట టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో నెలరోజులుగా రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే నాణ్యమైన టమాటాలు అందిస్తుండడం మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న టమాటాలను ప్రజలు పొదుపుగా వాడుకుంటే మంచిది. – కె.నాయుడు, కార్మికుడు, సీతమ్మధార, విశాఖపట్నం నాణ్యంగా ఉంటున్నాయి ప్రభుత్వం అండగా నిలవకపోతే ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో మాలాంటివారు కొనే పరిస్థితి ఉండదు. నెలరోజులుగా సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీపై టమాటాలు అందిస్తున్నారు. కాయలు చాలా నాణ్యంగా ఉంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – పైడి రమణమ్మ, పాత వెంకోజీపాలెం, విశాఖపట్నం ధరలు తగ్గే వరకు కొనసాగిస్తాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గత నెల 27న సబ్సిడీపై టమాటాల విక్రయా లకు శ్రీకారం చుట్టాం. సగటున కిలో రూ.104 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్లలో సబ్సిడీ కౌంటర్లు కొనసాగుతాయి. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ -
తాత్కాలికంగా బంద్.. కస్టమర్లు మన్నించాలి.. మెక్డొనాల్డ్, సబ్వే షాకింగ్ నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్వే, మెక్డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత్లో పలు సబ్వే అవుట్లెట్లు తమ సలాడ్స్, శాండ్విచ్ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్లోని ఒక సబ్వే అవుట్లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది. వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్వే అవుట్లెట్లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్లెట్ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్లెట్స్లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్వే, మెక్డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్సీ టమాటాల వాడకం తగ్గించాయి. చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి! -
ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): ప్రస్తుతం భారత్లో గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో ఏదైనా ఉందా అంటే అది టమోటా అనే చెప్పాలి. కొనగోలుదారులకు చుక్కలు చూపిస్తూ, రైతులకు కనక వర్షం కురిపిస్తోంది. ఇక దొంగలు కూడా బంగారం, డబ్బులు వదిలేసి టమోటాలపై పడ్డారు. కర్ణాటకలో ఓ రైతు ఏళ్లుగా సాగు చేసినా ఏనాడు కాసింత లాభాలు కూడా మిగల్చని టమాట పంటనే ఈ పర్యాయం ఆయనపై ధనవర్షం కురిపించనుంది. కొన్ని రోజుల్లో లక్ష్మీదేవి అతని ఇంటి తలుపులు తట్టనుంది. అసలు కథ ఏంటంటే.. చిక్కబళ్లాపురం తాలూకా పట్రేనహళ్లికి చెందిన రైతు దేవరాజు ఐదేళ్లుగా టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు వచ్చినప్పుడల్లా ధరలు నేలచూపు చూశాయి. దీంతో పెట్టుబడులు కూడా దక్కేవి కాదు. అయినప్పటికీ దేవరాజు టమాట సాగు చేయడం మానలేదు. ఈ ఏడాది అర ఎకరాలో సాగు చేయగా ప్రస్తుతం నిండుపూతతో ఉంది. కొద్ది రోజుల్లో పంట కోతకు రానుంది. అర ఎకరాకు రూ.లక్షా50వేలు వ్యయం చేశాడు. ప్రస్తుతం కిలో టమాట ధర 120 పలుకుతోంది. పది రోజుల వరకు ఇవే ధరలు కొనసాగితే రూ.9 నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం వస్తుందని దేవరాజు ధీమాతో ఉన్నాడు. పంటకు తెగుళ్లు, చీడ పీడలు ఆశించాయని, మందులు పిచికారీ చేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రైతు దేవరాజు తెలిపాడు. చదవండి: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి -
గుడ్ న్యూస్.. ఆన్లైన్లో రూ. 70కే కేజీ టమాటలు!
గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎదిగిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ధర రూ. 200 దాటింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్సిసిఎఫ్ టమోటాలను కిలో రూ.70కి అందజేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఓఎన్డీసీ (ONDC) కొనుగోలుదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఆన్లైన్లో రూ. 70కి అందిస్తోంది. దీనికోసం పేటీఎం యాప్ ద్వారా కస్టమర్ ఆర్డర్ చేయవచ్చని, ఒక కస్టమర్ కేవలం 2 కేజీల టమాటలను మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ టి కోశి తెలిపారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గత వారంలో టమాటాలను సబ్సిడీపై విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)లను ఆదేశించింది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదట్లో కేజీ టమాటలను రూ.90కి విక్రయించారు. ఆ తరువాత జులై 16 నుంచి కేజీ రూ.80కి, జూలై 20 నుంచి కిలో రూ.70కి తగ్గించారు. మొత్తం మీద అధిక ధరల నుంచి ప్రజలను కొంత వరకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
టమాటాలకు రక్షణగా నాగుపాము
-
సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
బెంగళూరు: ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి టమాటాను దోపిడీ చేసిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పంటపై ఉండగానే రాత్రికి రాత్రే.. పొలంలోనే టమాటాలను మాయం చేసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. తాజాగా బెంగళూరులో సినిమాని సీన్ని తలపించే ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన దంపతులు పక్కా స్కెచ్తో యాక్సిడెంట్ కట్టుకథ అల్లి.. రైతు దగ్గర నుంచి రూ. 2.5 లక్షల విలువ చేసే 2.5 టన్నుల టమాటా లారీని హైజాక్ చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని ఉరయూరుకు చెందిన వ్యక్తి మల్లేష్. టమాటా లారీ లోడ్ను జులై 8న కొలార్కు తీసుకువెళ్తున్నాడు. లారీ బెంగళూరుకు రాగానే ఓ దంపతులు లారీని అడ్డగించారు. లారీ తమ కారుకు తాకిందని కట్టుకథ సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. దీంతో లారీ నుంచి మల్లేష్ను బయటుకు లాగి లారీతో హుడాయించారు. చేసేదేమీ లేక మల్లేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ వెళ్లిన మార్గాన్ని ట్రాక్ చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను వెల్లూరుకు చెందిన దంపతులు భాస్కర్(28), సింధుజా(26)గా గుర్తించి అరెస్టు చేశారు. వీరు ఓ దారిదోపిడీ దొంగల ముఠాలో సభ్యులుగా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. క్షణాల్లోనే.. -
ఈ రైతు తెలివి మామూలుగా లేదు.. టమోట తోటకు అవే కాపాలా!
మైసూరు: ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోను, విదేశాల్లోనూ టమాటకు భారీ ధర ఉంది. కేజీ వంద రూపాయల దాకా ఉండడంతో రైతులకు కనకవర్షం కురుస్తోంది. కానీ దొంగలు రాత్రిపూట పంటను ఎత్తుకెళ్లడం అక్కడక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం రైతులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని కుప్పె గ్రామంలో నాగేష, కృష్ణ ఆనే ఇద్దరు రైతులు తమ టమాటా తోటలకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగేష 10, కృష్ణ 4 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశారు. ధర ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండుసార్లు తోటల్లో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు రైతులు వాపోయారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దొంగలను అడ్డుకుంటామని రైతులు చెబుతున్నారు. చదవండి పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్మార్కెట్కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
టమాటా దొంగలు అరెస్ట్
కర్ణాటక: టమాటాలతో ఉన్న బోలెరో వాహనంతో పరారైన దంపతులను బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు...చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె నివాసి రైతు మల్లేశ్ ఈ నెల 8న 210 బాక్సుల టమాటాలను లోడ్ చేసుకుని బొలెరో వాహనంలో చెళ్లకెరె నుంచి కోలారు మార్కెట్కు బయలుదేరారు. రాత్రి 10:45 గంటల సమయంలో డ్రైవర్ శివణ్ణతో కలిసి మార్గంమధ్యలోని తుమకూరు రోడ్డు సీఎంటీఐ నుంచి హెబ్బాళ వైపు వెళ్తూ టీ తాగటానికి మల్లేశ్, శివణ్ణలు ఓ హోటల్ వద్ద వాహనం నిలిపారు. ఈ సమయంలో బొలెరో అపహరణకు గురైంది. ఇందుకు సంబంధించి ఆర్ఎంసీ యార్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తమిళనాడుకు చెందిన దంపతులు భాస్కర్ (38), సింధు (36)లను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు సహకారంతో తమిళనాడుకు చెందిన దంపతులు చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టమాటాలను అమ్మగా వచ్చిన రూ.1.5 లక్షలు నగదును ఐదుగురు సమానంగా పంచుకున్నారు. దంపతులను అరెస్ట్ చేయటంతో మిగిలిన ముగ్గురు పరారీ అయ్యారు. నిందితులు కారులో వెంబడించి బులెరో వాహనాన్ని ఢీకొట్టడానికి యత్నించి అది సాధ్యం కానీ పక్షంలో బొలెరోను అపహరించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. -
400 కిలోల టమాటాలు చోరీ
పుణే: టమాటాల ధర ఆకాశాన్నంటుతున్న వేళ ఈ కూరగాయ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ రైతు ఇంట్లో ఉంచిన నాలుగు క్వింటాళ్ల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు షిరూర్ తహశీల్కు చెందిన రైతు అరుణ్ ధోమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తన పొలంలో పండించిన 400 కిలోల టమాటాలను కోసి 20 క్రేట్లలో ఇంటికి తీసుకువచ్చాడు. తెల్లారాక చూస్తే అవి కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఇటీవలి పుణేకే చెందిన ఓ రైతు తను పండించిన 18 వేల క్రేట్ల టమాటాలను రూ.3 కోట్లకు అమ్మి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్సేల్గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్కు చెందిన మహిపాల్రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
డబ్బులు చెట్లకు కాయడం అంటే ఇదే మరి.. టమాటతో లక్షలు సంపాదించొచ్చు!
Tomato Farming Business In India: గత కొన్ని రోజులుగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల ఆశలు చిగురించాయి. టమాటాలు పండించిన రైతులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. కావున ఏదైనా బిజినెస్ చేసి మంచి లాభాలను పొందాలనుకునే వారికి టమాటా సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నేడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే కేవలం కంపెనీలు ప్రారభించడమో, లేకుంటే లెక్కకు మించిన డబ్బు వెచ్చించి ఇతర వ్యాపారాలు చేయడమనేది మాత్రమే ఏకైక మార్గం కాదు.. ఆధునిక కాలంలో వ్యవసాయం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చని కొంతమంది చెబుతున్నారు, మరి కొందరు నిరూపిస్తున్నారు. ఇటీవల టమాటాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న రైతులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. నిజానికి దేని అవసరం ఎప్పుడు ఉంటుందో.. ఉండదో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ప్రతి రోజు టమాటాల అవసరం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం టమాటా కూరలకు మాత్రమే కాకూండా సాస్, పిజ్జా వంటి వాటిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కావున సరైన పద్దతిలో టమాటా సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయన్నది నిజం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది టమాట సాగు చేస్తారు. ఒక హెక్టారులో వివిధ రకాలకు లోబడి 800 నుంచి 1200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సరైన వ్యవసాయ పద్ధతులతో, ఈ పంటను పండించడం ద్వారా బంపర్ లాభాలను పొందవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) టమాట సాగు సంవత్సరానికి రెండు సార్లు చేసుకోవచ్చు. జూలై & ఆగస్టు నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు.. నవంబర్ & డిసెంబర్ నుంచి మొదలై జూన్-జూలై వరకు ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో 15,000 మొక్కలను పెంచవచ్చు. 2 నుంచి 3 నెలల వ్యవధిలో టమాటాలు రావడం మొదలవుతాయి. కొన్ని సార్లు పంట దిగుబడి తగ్గినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఆశించిన లాభాలను పొందవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) ప్రస్తుతం మన దేశంలో కేజీ టమాటాల ధర రూ. 120 వరకు ఉంది. దీంతో రైతులు ఊహకందని మంచి లాభాలను పొందగలుగుతున్నారు. టమాట సాగు చేసే రైతు సగటున కేజీ రూ. 10కి విక్రయిస్తే 1000 క్వింటాళ్లకు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కావున టమాట సాగుతో కూడా తప్పకుండా లాభాలను పొందే అవకాశాలు చాలానే ఉన్నాయి. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
ధరల మంట.. టమాటాలతో తులాభారం.. కూతురు మొక్కు తీర్చుకున్న వ్యాపారి
సాక్షి, అనాకపల్లిటౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం వినూత్నరీతిలో తులాభారం నిర్వహించారు. వ్యాపారవేత్త మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేస్తామని అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. టమాటాలు, బెల్లందిమ్మలు, పంచదార 51 కిలోల చొప్పున తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. వీటితోపాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా అందజేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీను, ఆలయ సిబ్బంది తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. టమాట ధరల మంటతో జనం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. టమాటాల తులాభారం అనేసరికి ఈ వార్త వైరల్గా మారింది. (చదవండి: టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..) -
ఆడి మాస తాంబూలంలో టమాటాలు
వేలూరు: వేలూరు సమీపంలో తమిళ ఆడి మాస వరుస తాంబూలంగా టమాటాలను అమ్మగారింటి నుంచి ఇచ్చిన పంపిన విషయం పలువురిని విస్మయానికి గురిచేసింది. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలోని కామాక్షిమ్మన్పేట గ్రామానికి చెందిన సత్యతో పల్లిగొండకు చెందిన లీలాప్రియకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి ఆడి మాసాన్ని పురస్కరించుకొని అమ్మగారింటి వారు కుమార్తె, అల్లుడిని వరుస తాంబూలం పెట్టి ఇంటికి తీసుకెళ్లడం తమిళ సంప్రదాయం. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో తమిళ ఆడి మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో లీలాప్రియ కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం సుమారు 25 రకాలైన వరుస తాంబూలంగా పెట్టారు. వీటిలో ద్రాక్ష, కొబ్బరికాయ, ఆపిల్, పుష్పాలు, అరటి పండుతో పాటు ప్రస్తుతం ధరలు భారీగా పెరగడంతో వినూత్నంగా టమాటాలను కూడా చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. -
Tomato Prices: టమాట కేజీ రూ. 300?
నెలన్నర గ్యాప్లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది. ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్సర్కిల్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు.. 🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు. 🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు. 🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్లలోనే కాకుండా హోల్సేల్ మార్కెట్లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది. 🍅 జూన్లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది. 🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు. 🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట. 🍅 మొత్తంగా లోకల్సర్కిల్స్ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు. ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు. 🍅 లోకల్ సర్కిల్స్ అనేది ఓ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. -
టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే..
ప్రస్తుతం అత్యంత ఖరీదైన వస్తువుల్లో టమాటా కూడా చేరిపోయింది. కొనుగోలు చేయడానికి ఆలోచిస్తే పరవాలేదు, కొన్నది వండుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ కొనగలమో లేదో అని. టమాట రేటు ఆకాశానికి చేరిన వార్త తెలుసుకుందో ఏమో వంటింట్లో ఉంచిన టమాటాల వద్ద ప్రత్యక్షమైంది ఒక కోడె నాగు. అక్కడే ఉండి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాసింది. పాములు సాధారణంగా ఇళ్లల్లోకి వచ్చినా మనుషుల కంట పడకుండా ఎక్కడో మూల వెలుతురు పడని చోట నక్కి ఉంటాయి లేదా ఏదైనా కలుగులోకి దూరి దాక్కుంటాయి. కానీ ఒక తాచు పామును టమాటాలు ఆకర్షించాయో లేక వాటి ధర ఆకట్టుకుందో గాని ఇంట్లోకి చొరబడి అవి ఉన్న ప్లేటును చుట్టుకుని కాపలాగా కూర్చుంది. ఎవరైనా వాటి జోలికి వస్తే చాలు కాటేసేందుకు పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విశేష స్పందన వచ్చింది. View this post on Instagram A post shared by Mirza Md Arif (@mirzamdarif1) టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. రెండు నెలల క్రితం రూ.20 ఉండే కిలో టమాటా చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపుగా పరుగులు తీస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటి ధర ఇప్పటికే రూ.200 మార్కు అందుకుని రూ. 250 చేరుకునే క్రమంలో ఉంది. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
టొమాటో రైతుకు జాక్పాట్: నెల రోజుల్లో కోటిన్నర
Tomato Tukaram Bhagoji Gayakar earns 1.5 crore: ఇపుడు ఏ నలుగురు కలిసినా ఒకటే టాపిక్.. టొమాటో ధరల మంట. అయితే ఈ డిమాండ్ -సప్లయ్ సంక్షోభంలో సాధారణంగా రైతులకు జరిగే మేలు జరిగే సందర్బాలు చాలా తక్కువ. కానీ మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన రైతు తుకారాం భాగోజీ గయాకర్ అలాంటి అదృష్టం వరించింది. 30 రోజుల్లో కోటిన్నర రూపాయలు సంపాదించడం విశేషంగా నిలిచింది. (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) దేశంలోని పలు ప్రాంతాల్లో టొమాటో ధర మండిపోతున్న సంగతి తెలిసిందే. 12 ఎకరాల భూమిలో టొమాటో సాగు చేస్తున్న సమయంలో తనకు ఇంత అదృష్టం క లిసి వస్తుందని బహుశా తుకారాం అసలు ఊహించి ఉండరు.ఇండియా టుడే నివేదిక ప్రకారం తుకారాం భాగోజీ గయాకర్ టొమాటో సాగు చేశాడు. మంచి దిగుబడి వచ్చింది. నారాయణగంజ్లో తన పంటను విక్రయించడం ద్వారా రైతు రోజుకి రూ.2,100 సంపాదించాడు. దీనికితోడు శుక్రవారం ఒక్కరోజే 900 డబ్బాలను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. మొత్తంగా నెల రోజుల్లో అతని సంపాదన 1.5 కోట్ల రూపాయలకు చేరింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) తుకారాం తన కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహాయంతో నెలలో 13,000 టమోటా డబ్బాలను విక్రయించాడు. 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. ఎరువులు , పురుగుమందులపై అవగాహన, సస్యరక్షణపై అవగాహనతో నాణ్యమైన టమోటాలు పండించామని తుకారాం కుటుంబం చెబుతోంది. ముఖ్యంగా తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, కుమారుడు ఈశ్వర్ సేల్స్, మేనేజ్మెంట్ , ఫైనాన్షియల్ ప్లానింగ్ను నిర్వహిస్తుండగా. గత మూడు నెలలుగా పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని తుకారం కుటుంబం సంబరపడుతోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా చాలామంది రైతులు కోటీశ్వరులైనట్టు తెలుస్తోంది. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టొమాటో విక్రయించారట. కాగా నారాయణగంజ్లో, జున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్లో, నాణ్యమైన (20 కిలోలు)టొమాటో గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. అంటే కిలో రూ.125. ఇది ఇలా ఉంటే కేంద్రం శుక్రవారం టొమాటో కిలో రూ. 90 చొప్పున ప్రజలకు విక్రయించడం ప్రారంభించింది, వాటిని వ్యవసాయ కేంద్రాల నుండి ఢిల్లీ-ఎన్సిఆర్ , లక్నో వంటి నగరాలకు రవాణా చేసింది. -
టమాట వల్ల భర్తను వదిలేసిన భార్య
-
ఆఫర్ అంటే ఇది.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే టమాటాలు ఫ్రీ!
చెన్నై: సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన ఆఫర్లతో పాటు బోలెడు డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఏదేమైనా మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాయి. అందుకే మార్కెటింగ్ పరంగా ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం టమాటా ఊహించని ధర పలుకుతూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ దేశీయ విమాన సంస్థ తమ వద్ద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్ను ప్రకటించాయి. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. వివరాలు.. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
టమాటాతో కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు.. అంతలోనే ఊహించని షాక్!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దేశవ్యాప్తంగా టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేజీ రూ.200తో విక్రయిస్తున్నారు. దీంతో ఆ పంటపై దొంగల కన్ను పడింది. రాత్రికి రాత్రే పంటను దోచుకెళ్తున్నారు. దొడ్డ తాలూకా లక్ష్మిదేవపురం గ్రామంలో రైతు జగదీష్ తన ఎకరా భూమిలో టమాట సాగు చేశాడు. మంచి దిగుబడితోపాటు ధరలు పెరగడంతో తన కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోకి చొరబడి టమాట కాయలు తెంపుకొని ఉడాయించారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన జగదీష్ చెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యాడు. చోరీకి గురైన టమాట విలువ రూ.1.50లక్షలు చేస్తుందని రైతు తెలిపాడు. చదవండి: Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. నగర చరిత్రలో ఆల్టైమ్ రికార్డు -
రైతుబజార్లలో రూ.50.. ధరలు తగ్గే వరకు సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడ తూర్పు): వినియోగదారులపై భారం పడకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై టమాటాల విక్రయాలు చేపట్టిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గే వరకు సబ్సిడీపై టమాటాలను అందజేస్తామని తెలిపారు. ధరలు తగ్గినప్పుడు రైతులకు, విపరీతంగా పెరిగినప్పుడు వినియోగదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. విజయవాడలోని కృష్ణలంక రైతు బజార్లో సబ్సిడీపై టమాటాల విక్రయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో టమాటా పంట దెబ్బతినడం వల్ల దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో ధర రూ.250కు చేరుకోగా.. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లో రూ.98 నుంచి రూ.124 వరకు ఉందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో సబ్సిడీపై టమాటాలను కిలో రూ.50కే విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 600 టన్నుల టమాటాలను రూ.6 కోట్లతో సేకరించామని చెప్పారు. రూ.3 కోట్లకు పైగా సబ్సిడీ భరించి ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రూ.10.26 కోట్ల విలువైన 3,100 టన్నుల టమాటాలను సేకరించి రైతులకు, వినియోగదారులకు అండగా నిలిచామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా టమాటా రైతులను, వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. టీడీపీ పాలనలో టమాటా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయినా చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్పాండే, రైతు బజార్ల సీఈవో నందకిశోర్, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్కుమార్, మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ సీహెచ్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
టమాటాలు అమ్మి రూ. 38 లక్షలు.. రైతు పంట పండింది!
గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!) మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. -
టమాటల కోసం ఏపీ వైపు కేంద్రం చూపు
ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. -
ప్రస్తుతం ట్రెండ్ ఇదే! పుట్టినరోజు ఊహించని బహుమతి.. ఉబ్బితబ్బిబ్బైన మహిళ
ముంబై: ప్రస్తుతం దేశంలో టమాటా ట్రెండింగ్లో ఉంది. గతంలో అర్థసంచరీ కూడా లేని టమాట.. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెంచరీ దాటేసి త్వరలోనే డబుల్ సంచరీ టచ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. అంతేనా టమాటాలు విలువైన వస్తువుల జాబితాలోకి వెళ్లిపోయాయి. ఎంతలా అంటే పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలకు విలువైన వస్తువుగా టామాటాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను బహుమతిగా ఇవ్వడం ఇది హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కళ్యాణ్లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె ఊహించని బహుమతిని అందుకుంది. ఆమె బంధువుల గిఫ్ట్గా 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి ఇచ్చారు. ఈ టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్ కట్ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: నిరుద్యోగ కార్మికుడికి రూ.24. 61 లక్షల పన్ను కట్టమంటూ నోటీసులు.. -
పుట్టినరోజున ప్రత్యేక కానుక.. షాక్ అయిన యువతి
ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. థానె జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్జోయ్ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. -
టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?
ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడులేని రీతిలో వాటితో పోటీపడుతోంది. మరేదో కాదు.. అదేనండీ.. టమాటా. ఎందుకంటే మనకు టమాటా లేకుండా ఏ కూర, పప్పు చేయలేరు. ఒకప్పుడు ఉల్లిగడ్డ ఇతర వాటితో పోటీ పడేది. అదేంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉల్లిగడ్డ ప్లేస్ను టమాటా ఎప్పుడో కబ్జా చేసింది. ఇప్పుడు ఎక్కడా చూసిన టమాటా ధరలపైనే చర్చ నడుస్తోంది. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి అభిమానులు గొప్ప మనసును చాటుకున్నారు. (ఇది చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) తమిళనాడులో పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. తమిళనాడులోని మానవహారం జిల్లా ఆలందూరులో ఈ కార్యక్రమం చేపట్టారు. చెంగల్పట్టు విజయ్ సేతుపతి అభిమానుల సంఘం అధినేత తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) -
టమాటా లేకపోతేనేం.. ఇలా వంటలు చేసుకోండి
చాలామందికి టొమాటో కలపనిదే కూర చేయబుద్ధి కాదు. అయితే ఇటీవల కొద్దికాలం నుంచి సెంచరీ కొట్టినా .. కిందకి దిగనంటోంది టొమాటో. అయినా ఏం పర్వాలేదు, టొమాటో లేకపోయినా కూరలను రుచిగా వండొచ్చని చేసి చూపిస్తోంది ఈ వారం వంటిల్లు.... బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి: మీడియం సైజు వంకాయలు – రెండు వెల్లుల్లి రెబ్బలు – నాలుగు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా.. ♦ వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ♦ ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి. ♦ ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి. ♦ వంకాయ కాలిన తరువాతచల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి. ♦ బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ♦ ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ♦ కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ♦ నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్. -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్ను సమాజ్వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి..
వారణాసి: యూపీలోని ఓ కాయగూరల వ్యాపారి తన షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను నియమించాడు. ఉన్నట్టుండి టమాటాల ధర ఆకాశాన్నంటడంతో కస్టమర్లతో ఇబ్బంది అవుతోందని బౌన్సర్లను పెట్టుకున్నట్లు చెబుతున్నాడు షాపు యజమాని. ఆ కాయగూరల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160కి చేరింది. దీంతో టమాటాలు కొనడానికి వచ్చేవారు ఇక్కడ ఘర్షణలకు పాల్పడుతున్నారు. కొంత మంధైతే టమాటాలను దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని తెలిపాడు. టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.160గా ఉంది. షాపుకి వచ్చేవారు కూడా 50 గ్రాములు, 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని, మా షాపులో టమాటాలు దండిగా ఉన్నందున ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా చూసేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని తెలిపాడు. కూరగాయల షాపు ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారు. VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. "I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux — Press Trust of India (@PTI_News) July 9, 2023 ఇది కూడా చదవండి: మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా? -
మార్కెట్ ధర 150.. సర్కార్ చర్యలు.. రైతుబజార్లలో కిలో రూ.50కే టమాటా
సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీ రేటుకు టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వీటి ధరలు రోజురోజుకూ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కిలో రూ.250లు దాటింది. రాష్ట్రంలో కిలో రూ.150 ఉంది. అయినా సరే ప్రభుత్వం వెనుకాడడంలేదు. దేశంలో మరెక్కడాలేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ గత నెల 28 నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్ల ద్వారా ఈ అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 422 టన్నుల సేకరణ ఈ నేపథ్యంలో.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చుచేసి 422.06 టన్నులు సేకరించింది. ప్రధాన మార్కెట్లలో వ్యాపారులతో పాటు వేలంపాటల్లో పాల్గొని రైతుల నుంచి, వ్యాపారుల నుంచి సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.94.44 చొప్పున గరిష్టంగా కిలో రూ.110 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో మనిషికి కిలో నుంచి రెండు కిలోల వరకు విక్రయిస్తోంది. మరోవైపు.. శుక్రవారం సగటున కిలో రూ.94.34 చొప్పున రూ.61.32 లక్షల విలువైన 65టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిలో 30 టన్నులు పలమనేరు మార్కెట్ నుంచి, 20 టన్నులు మదనపల్లి మార్కెట్ నుంచి, మరో 15 టన్నులు విజయవాడలోని రైతులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేశారు. విశాఖ, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని రైతుబజార్లకు తరలించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటిన సందర్భంలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై టమాటాను విక్రయిస్తున్నాం. ప్రభుత్వంపై ఆరి్థకంగా భారమైనప్పటికీ సగటున కిలో రూ.94.44 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు తగ్గేవరకూ రైతుబజార్లలో సబ్సిడీ టమాటా కౌంటర్లు కొనసాగిస్తాం. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ -
మెక్డొనాల్డ్స్కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?
చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!) రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్టాపిక్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
డబుల్ సెంచరీ కొట్టిన టమాట.. కిలో ఏకంగా రూ. 250.. ఎక్కడంటే
ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ అదే విధంగా కోల్కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్లోని చురులో రూ.31గా ఉన్నది. ఇతర కూరగాయలు కూడా ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ
మార్కెట్లో కూరగాయాల ధరలు ప్రజలను ఠారేత్తిస్తున్నాయి. ఏకంగా సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకాయి ధరలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ.120 పైనే పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అడ్డగోలు ధరలతో టమాట దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. మార్కెట్లో, దుకాణాల్లో నిల్వ చేసిన వాటితోపాటు ఏకంగా తోటలో నుంచి సైతం టమాటలను సైతం చోరీ అవుతున్నాయి. టమాటా తోటకు ఓ రైతు ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఓ రైతు చేనులో నుంచి రూ. 2.5 లక్షల విలువైన టమాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని సోమనహళ్లి గ్రామం మంగళవారం జరిగింది. చదవండి: 12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్ అప్పు తీసుకొని మరీ తనకున్న రెండు ఎకరాల భూమిలో టమాట పంట సాగు చేస్తున్నట్లు మహిళా రైతు ధరణి తెలిపింది. ప్రస్తుతం టమాట ధర బెంగుళూరులో కిలో రూ.120 పలుకుతుండటంతో టమాట పంటను కోసి మార్కెట్కు తరలించాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ మంగళవారం రాత్రే టమాట తోటలో దొంగలు పడ్డారని, 50-60 బ్యాగుల టమాటాను దొంగిలించారని వాపోయింది. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక మిగిలిన పంటనుకూడా దొంగలు ధ్వంసం చేశారని ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హలబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4. A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr — ANI (@ANI) July 6, 2023 కాగా గడిచిన నెలలో ఎండల తీవ్రతోపాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది పోయింది. ఇతరప్రాంతాల నుంచి రవాణా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాట ధర 129 రూపాయలు ఉండగా ఉత్తరప్రదేశ్లోని మోరదాబాద్లో రూ. 150కు చేరింది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీకి అందించాలని కోరుతున్నారు. -
మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ
డోర్నకల్: అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. గాంధీసెంటర్లోని కూరగాయల మార్కెట్లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ ఏర్పాటు చేస్తారు. మార్కెట్కు నైట్వాచ్మన్ లేకపోవడం, ఇటీవల కూరగాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. కర్ణాటకలో టమాటా పంట చోరీ యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు టమాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు. మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు. టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు. -
ప్రజలకు సబ్సిడీపై టమోటోలు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
రైతుబజార్లలో సబ్సిడీ టమాటా
సాక్షి, అమరావతి: చుక్కలనంటుతున్న టమాటా ధరల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతుల నుంచి టమాటాను సేకరించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందిస్తోంది. తొలుత కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటా విక్రయాలు ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారమైనప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి, పలమనేరు తదితర మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.98 నుంచి రూ.104 చొప్పున చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజుల్లో 95 టన్నులు సేకరించారు. శుక్రవారం 36 టన్నులు సేకరించి.. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు 20 టన్నులు, ఎన్టీఆర్ జిల్లాకు ఆరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఐదేసి టన్నుల చొప్పున తరలించి స్థానిక రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున విక్రయించారు. శనివారం నుంచి రోజు 50 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగైదు రోజులు విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు స్థానిక అవసరాలకు తగినట్లు టమాటా నిల్వలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో కూడిన బృందాల ద్వారా తనిఖీలకు శ్రీకారం చుడుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలను సీఎం యాప్ద్వారా నిత్యం సమీక్షిస్తూ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. -
కిలో టమాటా రూ.140
చింతలమానెపల్లి: కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ వారసంతలో శుక్రవారం టమాటా కిలో రూ.140 పలికింది. జూన్ నెల ఆరంభంలో రూ.60 కిలో చొప్పున విక్రయించగా..ఆ తర్వాత రూ.80 నుంచి రూ.100కు చేరింది. టమాటా రూ.140కు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు. టమాటాను ఏపీలోని గుంటూరు, మదనపల్లె, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని నాగ్పూర్, లాతూర్, నాసిక్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు హోల్సేల్ వ్యాపారులు పేర్కొన్నారు. టోకు వ్యాపారుల నుంచి 22 కిలోల టమాటాల పెట్టె రూ.2,400 ధర పలుకుతోందని, దీంతో తాము కిలో రూ.140 చొప్పున విక్రయించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వెల్లడించారు. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
చుక్కలు చూపిస్తున్న టమాటాకు కల్లెం వేసే ప్రయత్నం
-
టమాటా ధరల భారం నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే!
కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ప్రధానంగా టమాట సెంచరీ కొట్టగా.. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కింది. గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాట తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ.100 హోల్సేల్ మార్కెట్లో కిలో నాణ్యమైన టమాట రూ. 80, రీటైల్ మార్కెట్లో కిలో రూ. 100కు మించి పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో టమాట రూ. 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి 120కి వెళ్లింది. అయితే అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు. వర్షాలతో తగ్గిన దిగుబడి దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని స్థానిక మార్కెట్లలో వారం క్రితం కిలో టమాట రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా..ఇప్పుడు కిలో రూ. 100కి అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ. 80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది. అటు ముంబయిలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. ఇతర కూరగాయలు కూడా టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జేబులకు చిల్లులు: ప్రజలు పెరిగిన ధరలతో కూరగాయాలు కొనలేకపోతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయల ధరలు వింటేనే భయమేస్తుందని, ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి తక్కువగా చెప్పడం లేదని పేర్కొన్నారు.. పచ్చిమిర్చి, టమాటలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పులే నయం అన్న భావన కలుగుతుందంటున్నారు. రైతుల్లో సంతోషం టమాట ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషిస్తున్నారు. మార్కెట్లో 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు. 15 రోజుల క్రితం రూ.30, రూ.40 15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు. -
కొండెక్కిన టమాట.. కిలో ఎంతంటే..?
-
ట‘మోత’
సనత్నగర్: టమాటా ఠారెత్తిస్తోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. రైతుబజార్లో కిలో రూ.75 ఉండగా బహిరంగ మార్కెట్లో సెంచరీ దాటేసింది. టమాటా పంట దిగుబడి భారీగా తగ్గడంతో రోజువారీగా హోల్సేల్ మార్కెట్కు రావాల్సిన దాని కంటే తగ్గిపోవడంతో ధరలు ఎగబాకుతున్నాయి. ఎర్రగడ్డ రైతుబజార్కు రోజువారీగా 200 క్వింటాళ్ల టమాటా వస్తోంది. నాలుగైదు రోజులుగా కేవలం 50–60 క్వింటాళ్లకు పడిపోయింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మదనపల్లె, బెంగళూరు నుంచి ఎక్కువగా టమాటా నగరానికి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం టమాటా పంట కోతలు పూర్తయ్యి కొత్త పంట వేశారు. పంట కోతకు రావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు టమాటా ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18న రైతుబజార్లో రూ.39 ఉన్న కిలో టమాటా ధర వారం రోజుల వ్యవధిలోనే రూ.75కు చేరడం గమనార్హం. -
టమాట ధర వింటే నోట మాట రావడం లేదు!
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారుల నోటి నుంచి ట‘మాట’ కా వాలని వినిపించడం లేదు. ప్రస్తుతం కిలో రూ.80 పలకడంతో వామ్మో అంటున్నారు. నెలన్నర క్రితం కిలో టమాట రూ.10–15 రిటైల్గా బాక్స్(25కిలోలు) రూ.250–300 విక్రయించగా.. ప్రస్తుతం రిటైల్ రూ.60–80కుబ బాక్స్ టమాటా రూ.1800కు అమ్ముతున్నారు. ఈధర రూ.2వేల నుంచి 2500వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు తెలిపారు. ధర పెరిగితే కిలో టమాట రూ.100 నుంచి రూ. 120 విక్రయించాల్సి ఉంటుందన్నారు. లక్ష్మీపురం మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారులు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, ముల్కలచెరువు, నెల్లూరు ప్రాంతం నుంచి ఎక్కువగా టమాట దిగుమతి చేసుకుంటారు. అలాగే కర్ణాటకలోని చింతామ ణి, కోలార్ మార్కెట్ల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో పాటు ఉత్తర భారతదేశం నుంచి కూడా హోల్సేల్ వ్యాపారులు మదనపల్లి తదితర ప్రాంతాలకు రావడంతో టమాట ధర అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. సగానికి తగ్గిన దిగుమతి... లక్ష్మీపురం మార్కెట్లో టమాట వ్యాపారులు ని త్యం 10 నుంచి 15 డీసీఎంలలో సుమారు 6వేల బాక్సులను దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తు తం ధరలు ఆకాశాన్నంటుండడంతో దిగుమతి ఒకేసారి 2000బాక్సులకు పడిపోయినట్లు టమాట హోల్సేల్ వ్యాపారి పాపని భాస్కర్ తెలిపారు. తక్కువ తెప్పించినా చిల్లర వ్యాపారులు కొనుగోలు చేయడం లేదన్నారు. సోమవారం బాక్స్ టమాట రూ.1800కు విక్రయించగా మంగళవారం రూ.2వేలకు విక్రయించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అంటే హోల్సేల్ ధర కిలోకు రూ.90 పడుతుందని చిల్లర వ్యాపారులు రూ.120లు కిలో అమ్మాల్సి ఉంటుందన్నారు. కొత్త టమాట వస్తే తప్పా ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
పొలం నుంచి వైఫల్యం వరకు...
దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ‘నేను దాన్ని పెంచాను. నేనే దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది కానీ నేను ఏం చేయగలను? గిట్టుబాటు ధరైనా రాకుంటే..’ అని కూరగాయలు, పండ్లు పండించే రైతు ఆవేదన చెందుతున్నాడు. పంట ఉత్పత్తికి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్ని నాశనం చేయడమనేది రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ‘పొలం నుంచి వైఫల్యం వరకు’ అనే ఈ పునరావృత రైతు గాథ దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నదే. అంతేకాదు... కొన్ని సంవత్సరాలుగా ఈ విఫలగాథ మరింతగా విస్తృతమవుతూ వస్తోంది! ఈ సంవత్సరం క్వింటాల్ బంగాళా దుంపల ధర రూ. 500లకు పడిపోయి నప్పుడు (గత సంవత్సరం రూ. 1,200లు సగటు ధర పలికింది) ఒక రైతు మీడియాతో ఏం చెప్పాడంటే... ‘‘క్వింటాల్ బంగాళా దుంపలను 900 నుంచి 1000 రూపాయల ధరకు తక్కువ అస్సలు అమ్మలేము. ఎందుకంటే ఈ రేటు వద్ద అయితేనే మాకు దిగుబడి ఖర్చులు రావడమే కాకుండా కాస్త లాభం కళ్ల చూడగలం’’ అని. అయితే ఇప్పుడు బంగాళాదుంపల ధర ఏమాత్రం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో రానున్న కాలంలో బంగాళా దుంపల ఉత్పత్తిదారులు గడ్డు కాలాన్నే ఎదుర్కోనున్నారు. పంజాబ్లోనే కాదు, బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా బంగాళాదుంపల ధర ఘోరంగా పతనం కానుంది. క్యాలిఫ్లవర్, క్యాబేజి, టమోటా ధరలు కూడా పడిపోయాయి. కేజీకి 3 రూపాయల ధర కూడా పలకదని గుర్తించక ముందే పంజాబ్లో రైతులు తమ పంటను ఇప్పటికే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ‘నేను దాన్ని పెంచాను. నేను దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏం చేయగలను..’ అని కూరగాయలు పండించే రైతు ఒకరు అన్నారు. వీటి ఉత్పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్నీ నాశనం చేయడమనేది ఈ రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీయకుండా ఉంటుందా?! ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్ జిల్లా ప్రాంతాల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ విరివిగా పండిన టమోటాకి కూడా ఇదే గతి పట్టడం చూశాను. టమోటా పంటను ఎందుకు పండించడం లేదని అడిగాను. నిరాశతో కనిపించిన టమోటా రైతు ఒకరు నాతో మాట్లాడుతూ, మార్కెట్ ధర కిలో టమోటాకు 2 రూపాయలు పలుకుతున్నప్పుడు టమోటాలను బుట్టల్లో సర్దడం, వాటిని రవాణా చేయడం వంటివాటికి అదనపు ఖర్చు పెట్టాలని తానను కోవడం లేదని చెప్పాడు. ‘మీకు ఎన్ని టమోటాలు కావాలంటే అన్నీ తీసుకోండి’ అని అతను నిస్పృహతో అన్నాడు. ‘పొలం నుంచి వైఫ ల్యానికి’ సంబంధించిన ఈ గాథను నేను ప్రతి చోటా చూస్తున్నాను. దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలో చిస్తున్నట్లు లేదు. నేను ఎందుకిలా చెబుతున్నానంటే, ఛత్తీస్గఢ్ నుంచి పక్షం రోజుల క్రితం ఒక నివేదిక వచ్చింది. మహాసముండ్కి చెందిన ఒక రైతు రాయపూర్ మండీకి వంకాయ పంటను తీసుకెళితే అతడికి రూ. 1,475 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కింద అదనంగా 121 రూపాయలను రైతే చెల్లించాల్సి వచ్చిందనీ ఆ వార్త తెలిపింది. అంతకు ముందు నెల రోజుల క్రితం వెల్లుల్లి రైతులు తమ పంట మొత్తాన్ని స్థానిక నదుల్లో కలిపేశారన్న వార్తలు మీడియాలో రాజ్యమేలాయి. తర్వాత ఉల్లి పాయల సాగుదార్ల వ్యధలకు సంబంధించిన వార్తలు కూడా బయటికి వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, దేశంలో ఈ పరిస్థితి రోజువారీ కార్యక్రమంలా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, పొలం నుంచి వైఫల్యానికి సంబంధించిన గాథ మరింతగా విస్తృతమవుతూ వచ్చింది. పొలంలో రైతు చిందిస్తున్న రక్తం మీడియాలో పేజీలకు మాత్రమే పరిమితమవుతోంది. స్టాక్ మార్కెట్లో రక్త పాతాన్ని దేశం చూస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి తీవ్ర స్పందన రైతుల వ్యధల పట్ల కలగడం లేదు. ఇది చాలదన్నట్లుగా, మార్కెట్లో జోక్యం చేసుకునే వ్యవస్థ (ఎమ్ఐఎస్)ను మరింతగా బలోపేతం చేయడంలో ఎలాంటి ప్రయో జనాన్నీ మన ఆర్థిక మంత్రి చూడడం లేదు! సమృద్ధిగా పంటలు పండి ధరలు పడిపోయినప్పుడు లేదా పంటలు చేతికొచ్చిన సమయంలో ఉత్పత్తి ధరకంటే తక్కువ ధరకు పడిపోయినప్పుడు ఎమ్ఐఎస్ రంగంలోకి దిగుతుందన్నది తెలిసిందే. 2023 బడ్జెట్ ఖర్చుల కింద, ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), ఎమ్ఐఎస్లకు కేటా యింపులను బాగా తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎమ్ఐఎస్కి బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం దాన్ని కేవలం లక్ష రూపాయలకు కోసిపడేశారు. బడ్జెట్లో పొందుపర్చిన ఈ కేటాయింపు, కొద్దిమంది వెల్లుల్లి ఉత్పత్తిదారులకు కలిగిన నష్టాలను పూరించడానికైనా సరిపోతుందని నేను భావించడం లేదు. 2018–19 బడ్జెట్లో రూ. 500 కోట్ల కేటాయింపుతో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్ను గుర్తుంచుకోండి. టమోటో, ఉల్లి పాయలు, బంగాళాదుంపలు మామూలుగా ఎదుర్కొంటున్న అస్థిర ధరల నియంత్రణకు ఉద్దేశించినట్లు చూపించినప్పటికీ అవసరమైన దానికంటే తక్కువగా బడ్జెటరీ కేటాయింపులు చేశారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాతిపదికన, కనీసం ఈ మొత్తాన్నయినా ప్రకటించారు. ఈ పథకాన్ని అన్ని పండ్లు, కూరగాయలకు వర్తింపచేస్తూ, ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ని మరింతగా విస్తరించింది. కానీ 2023 నాటికి ఈ పథకాన్ని దాదాపుగా విస్మరించేశారు. కూరగాయల ధరలు (పండ్ల విషయంలో కూడా) పడిపోయిన ప్రతి సందర్భంలోనూ నేను ట్వీట్ చేసినప్పుడు, ఇవి పాడైపోయే సరకులు అని సాధారణ పల్లవి పాడుతూ వచ్చేవారు. సాధారణ ప్రజానీకం నుంచి ఈ మాటలు వింటే వాటిని సులువుగా పక్కనపెట్టేయవచ్చు కానీ విధాన నిర్ణేతలు ఇంత భిన్నంగా ఉండ టానికి ఇది కారణం కాకూడదు. అమెరికాలో కూడా, ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్ట పోకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చారు. పాలధరలు పడి పోయిన సమయాల్లో స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్లలో పొందు పరిచేలా రైతులు మరింత చీజ్ని తయారు చేయాలని రైతులను కోరే యంత్రాంగాన్ని అమెరికా రూపొందించింది. అలాగే స్ట్రాబెర్రీ ధరలు పతనం అయే సమయాల్లో ఇదే విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతిదీ సజావుగా ఉంటుందని చెప్పలేం కానీ, వ్యవ సాయ క్షేత్రాల నష్టాలను తగ్గించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగు తున్నాయి. భారత్లో తగిన ఉష్ణోగ్రతా నియంత్రిత నిల్వ సౌకర్యాలు, ప్రాసె సింగ్పై ఆధారపడి ఉండే వాల్యూ ఛెయిన్ని పునర్నిర్మించడానికి, స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయ త్నాలు చేపట్టాలి. ధరల క్షీణత పథకాన్ని అమలు చేసే యంత్రాంగం ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ మధ్యప్రదేశ్లో గతంలో స్కీమ్ పైఫల్యం చెందడం అనేది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అయితే మరింత ముఖ్యంగా ధరల అస్థిరత్వాన్ని అధిగమించడానికి రైతుల కోసం గ్యారంటీ ధరకు హామీ పడటం మార్గదర్శక స్ఫూర్తిగా ఉండాలి. కూరగాయల పెంపకందార్లకు గ్యారంటీ ధరను అందిస్తున్న కేరళ స్కీమ్ నుంచి వెలికివచ్చిన పాఠాలను నేర్చుకోవలసి ఉంటుంది. రైతుల కోసం భవిష్యత్తులో పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడంలోనే కాదు.. వైవిధ్యభరితమైన పంటల వైపు మారే విషయంలో వారికి సహకారం అందివ్వడంలో ఆపరేషన్ గ్రీన్స్ కి అతి పెద్ద సవాలు ఎదురవుతోంది. వినియోగదారులు ఇప్పటికే అత్యధిక మార్కెట్ ధరను చెల్లిస్తున్నారు. కానీ భారీగా ఆర్గనైజ్ అయివుండే వ్యాపారంలో కూడా జరిగే బేరసారాల్లో రైతులే నిండా మునిగి పోతున్నారు. కాబట్టి పొలం నుంచి వైఫల్యానికి చెందిన గాథ మారాల్సి ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ దుఃస్థితికి గాను సప్లయ్ – డిమాండును మాత్రమే మనం నిందిస్తూ కూర్చోలేము. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
Recipe: టొమాటో, అటుకులు.. వడియాలు తయారు చేసుకోండిలా!
టొమాటో, అటుకులతో వడియాలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►నువ్వులు – 50 గ్రాములు ►టొమాటోలు – పావు కేజీ ►అటుకులు – ఒక కప్పు ►మిరప్పొడి – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►జీలకర్ర – టీ స్పూన్ ►పచ్చిమిర్చి– 3 ►ఉల్లిపాయలు – 3 (తరగాలి) ►కరివేపాకు – నాలుగు రెమ్మలు. తయారీ: ►నువ్వులను కడిగి వడపోసి ఆరబెట్టాలి. ►టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలో వేయాలి ►పచ్చిమిర్చి, జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి టొమాటో ప్యూరీలో కలపాలి. ►ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలిపి పది నిమిషాల సేపు నాననివ్వాలి. ►చివరగా నువ్వులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ►తడి వస్త్రం మీద లేదా పాలిథిన్ పేపర్ మీద ఒక్కో గోళీని వడల్లా వత్తి ఎండబెట్టాలి. ►రెండు రోజులు ఎండిన తర్వాత మూడవ రోజు ఉదయం క్లాత్ నుంచి ఒలిచి రెండవ వైపు ఎండబెట్టాలి. -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
ఇంట్లో ఇవి ఉంటే చాలు.. రుచికరమైన, ఆరోగ్యానిచ్చే ఉడిపి సాంబార్ రెడీ!
రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►కందిపప్పు – అరకప్పు (కడిగి అరగంటసేపు నానబెట్టాలి) ►పసుపు– అర టీ స్పూన్ ►ఉప్పు– రుచికి తగినంత ►బీరకాయ ముక్కలు– 300 గ్రాములు ►టొమాటో ముక్కలు – కప్పు. సాంబార్ పేస్ట్ కోసం: ►మినప్పప్పు– టేబుల్ స్పూన్ ►గుంటూరు మిర్చి– 8 ►పొట్టి మిరపకాయలు – 6 ►ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు ►యాలకులు – 2 ►లవంగాలు – 3 ►దాల్చిన చెక్క– అంగుళం ముక్క ►జీలకర్ర – టీ స్పూన్ ; పచ్చి కొబ్బరి ముక్కలు– అర కప్పు ; గసగసాలు– టీ స్పూన్. సాంబార్ పోపు కోసం: ►నూనె : టేబుల్ స్పూన్ ►మెంతులు – చిటికెడు ►ఆవాలు– అర టీ స్పూన్ ►ఇంగువ పొడి – చిటికెడు ►కరివేపాకు– 2 రెమ్మలు ►చింతపండు– 70 గ్రాములు (300 మి.లీ రసం చేయాలి) ►నీరు– ముప్పావు లీటరు ►ఉప్పు – తగినంత. గార్నిష్ చేయడానికి: ►నూనె – 2 టీ స్పూన్లు ►వేరుశనగ పప్పు – 4 టేబుల్ స్పూన్లు ►ఆవాలు – అర టీ స్పూన్ ►ఎండు మిర్చి– 2 ►కొత్తిమీర తరుగు – కప్పు తయారీ: ►కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి. ►చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ►మందపాటి బాణలి వేడి చేసి సాంబార్ పేస్టు కోసం తీసుకున్న దినుసులను సన్నమంట మీద వేయించి చల్లారిన తరవాత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ►బీరకాయ ముక్కల్లో కొద్దిగా నీటిని చిలకరించి మీడియం మంట మీద ఒక మోస్తరుగా ఉడికించాలి. ►మరీ మెత్తగా ఉడకకూడదు. ►మందపాటి పాత్రలో నూనె వేడి చేసి పోపు కోసం తీసుకున్న దినుసులను వేసి వేయించి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►తర్వాత చింతపండు రసం పోసి కలిపి అందులో సాంబార్ పేస్ట్, బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్ వేసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ►చిన్న బాణలిలో నూనె వేసి గార్నిష్ చేయడానికి తీసుకున్న దినుసులను వేయించి ఉడుకుతున్న సాంబార్లో వేసి దించేయాలి. ►ఇది అన్నంలోకి చక్కటి రుచినిస్తుంది. రోటీ చపాతీల్లోకి చేసేటప్పుడు నీటి మోతాదు తగ్గించుకుని చిక్కగా చేసుకోవాలి. చదవండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ -
మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
సాక్షి, మహబూబాబాద్: కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్ కొట్టే కత్తితో కొడుకు మహేందర్ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
Hyderabad: దిగివచ్చిన ఆకుకూరలు, కూరగాయలు.. 50-80 శాతం తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది. నేరుగా కాలనీలు, బస్తీల్లోకే.. కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. -
Beauty Tips: నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా కావాలంటే ఇలా చేయండి!
Beauty Tips In Telugu: మేని నిగారింపుకు, చర్మ లావణ్యాన్ని ఇనుమడింపచేసుకోవడానికి దోహదం చేసే కొన్ని సహజసిద్థమైన క్లెన్సర్లు, ప్యాక్లను ఇంట్లో మనం రోజూ వాడే వాటితోనే చేసుకోవచ్చు. ►గుడ్డులోని తెల్లసొనలో తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల ఎండకు నల్లబడిన ముఖచర్మం తిరిగి మామూలవుతుంది. ►బార్లీ పొడిలో తేనె, పెరుగు, బాదం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ►టొమాటో రసానికి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ►శనగపిండిలో క్యారట్ రసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ►రెండు టీ స్పూన్ల టొమాటో రసానికి నాలుగు టీ స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ►రెండు టీ స్పూన్ల క్యాబేజ్ రసంలో చిటికెడు ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మేని మెరిసిపోతుంది. మెడ నల్లగా ఉందా? ముఖం, మెడ మీద చర్మం నల్లగా, జిడ్డుగా అనిపిస్తే ఇంట్లోనే ఇలా క్లెన్సర్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడతాయి. మృతకణాలను తొలగించడంలోనూ ఉపకరిస్తాయి. కాబట్టి ఈ రెండింటితో తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్లా పనిచేస్తుంది. టొమాటోను గుజ్జు చేయాలి. దీనిని పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి ఒత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి.. పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. నోట్: పొడి, సున్నితమైన చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. చదవండి: Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్ లక్షణాలు.. నివారణ ఇలా.. -
టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ► హ్యాండ్, ఫుట్, మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది. ► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. ► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. ► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు. ► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. ► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి ► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి. ► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. ► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. -
భారత్లో టమాటో ఫ్లూ కలకలం...హెచ్చరించిన లాన్సెట్ నివేదిక
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీతో పోరాడుతూ... ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నాం అనుకునేలోపే మరో వింత వ్యాధి కలకలం రేపింది. ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు. సుమారు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. (చదవండి: Tomato Flu In Kerala: ‘టమాటో ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లో శరవేగంగా వ్యాపిస్తున్న వైనం) -
ట‘మాట’ ప్రకారం రైతన్నకు అండగా
సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: తెలుగుదేశం హయాంలో ఏనాడూ టమాటా రైతుల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రైతు సమస్యల పట్ల పూర్తి అవగాహన, వారికి మంచి చేయాలన్న తపన ఉన్న ముఖ్యమంత్రి జగన్... తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అవసరమైనపుడల్లా టమాటా రైతుల్ని ఆదుకుంటూనే వస్తున్నారు. ధరలు పతనమైన ప్రతిసారి అండగా నిలుస్తున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులను ఆదుకుంటున్నారు. రైతన్నకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో టమాటా పండే జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. నేడు 14 రాష్ట్రాలకు.. రాష్ట్రంలో ఏటా 22.16 లక్షల టన్నుల టమాటా దిగుబడులు వస్తుండగా 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. ఇందులో మూడొంతులు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గతంలో ఐదారు రాష్ట్రాలకే ఎగుమతులు జరగ్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా 14 రాష్ట్రాలకు పెరిగాయి. గతేడాది నవంబర్లో టమాటా ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకింది. మార్కెట్లో కిలో రూ.100కిపైగా పలికింది. ఈ సమయంలో రైతుల నుంచి సుమారు వంద టన్నుల వరకు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో రూ.60 చొప్పున విక్రయాలు చేపట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని నియంత్రించింది. ఎన్నడూలేని రీతిలో గత మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540.34 టన్నుల టమాటాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క అనంతపురం మార్కెట్లోనే 250 టన్నులు కొనుగోలు చేసింది. మహిళాభివృద్ధి సంస్థ ద్వారా రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. పైనాపిల్ రైతులను కూడా ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. కాయ రూ.10 చొప్పున 200 టన్నులకు పైగా సేకరించి సబ్సిడీపై మహిళా సంఘాల సభ్యులకు రూ.5కే అందచేసింది. అనాస రైతులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించి ఒక్కో కాయ రూ.12–15 వరకు గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ ‘ఈనాడు’ కథనంలో ప్రస్తావించకపోవటం గమనార్హం. అది.. డెమో యూనిట్ ‘ఈనాడు’ వార్తలో పేర్కొన్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్... అనంతపురం జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్యార్డులో ఈ ఏడాది మార్చి 26న ప్రారంభించినది. అది కేవలం డెమో కోసమే ఏర్పాటైంది. కుటీర పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. మైసూరుకు చెందిన ఢిపెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్ఆర్ఎల్) దీనికి సాంకేతిక సహకారం అందించింది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.7.50 లక్షలు, మార్కెటింగ్ శాఖ తరపున రూ.2.50 లక్షలతో కలిపి మార్కెట్యార్డు గోదాములో ఈ డెమో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలు వేదభూమి అనే రైతు ఉత్పత్తి దారుల సంఘానికి (ఎఫ్పీవో) అప్పగించారు. ఇక్కడ రోజుకు 200 కిలోల టమాటా ద్వారా 40 కిలోల వరకు పల్ప్, సాస్ తయారు చేస్తున్నారు. కిలో సాస్ తయారీకి ఖర్చు రూ.130 కాగా మార్కెట్లో రూ.170 వరకు విక్రయించేలా నిర్ణయించారు. డెమో ప్లాంట్లో సాంకేతిక లోపాలను సవరించి నాలుగైదు రోజుల్లో పునఃప్రారంభిస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి చెప్పారు. నంద్యాలలో రూ.174.20 కోట్లతో, అన్నమయ్య జిల్లా పీలేరులో రూ.250 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నాయి. అనంత మార్కెట్లో గరిష్టంగా కిలో రూ.20 ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 2,500 హెక్టార్లలో టమాటా పంట ఉంది. ఇక్కడ నుంచి నాణ్యమైన టమాటాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నాగపూర్, కలకత్తా, బంగ్లాదేశ్ తదితర చోట్లకు ఎగుమతి అవుతుంటాయి. అనంతపురం కక్కలపల్లి మండీకి (ప్రైవేట్ మార్కెట్) రోజూ 6 వేల టన్నుల వరకు వస్తున్నాయి. వర్షాలతో కాయలు తడిచి రవాణాకు అనువుగా లేకపోవడంతో ధరలు తగ్గాయి. సీఎం యాప్ ద్వారానే కాకుండా రైతుల నుంచి అందిన అభ్యర్థన మేరకు మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకొని కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. అనంతపురం మార్కెట్ పరిధిలో కిలో రూ.11 చొప్పున ఇప్పటి వరకు 600 క్వింటాళ్లు (60 టన్నులు) కొనుగోలు చేసి కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరు రైతు బజార్లకు తరలించారు. బుధవారం అనంతపురం మార్కెట్లో గరిష్టంగా కిలో రూ.20 ధర పలికింది. చంద్రబాబు హయాంలో ధరలు పతనమైనప్పుడు ‘ఈనాడు’ ఏనాడూ స్పందించకపోవటం ప్రస్తావనార్హం. ఆర్బీకేకి సమాచారమిస్తే చాలు... ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540 టన్నుల టమాటాలు కొనుగోలు చేశాం. గతంలో ఎప్పుడూ ఇలా కొనలేదు. అనంతపురంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ధర ఏమాత్రం తగ్గినా సమీపంలోని ఆర్బీకేకి సమాచారం అందిస్తే చాలు.. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు -
విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని
ముంబై: ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని పశ్చిమ మలాడ్లోని మార్వే రోడ్డు పాస్కల్ వాడీలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని అరెకట్టేందుకు రేఖాదేవి నిషద్(27) రెండు రోజుల క్రితం టమాటాలకు ఎలుకలమందు పూసి ఉంచింది. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన రేఖాదేవి రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. అయితే ప్రతిరోజు రేఖాదేవికి టీవీ చూసే అలవాటుంది. ఈ క్రమంలో శుక్రవారం టీవీ చూస్తూ ఎలుకల కోసం మందు పెట్టిన టమాటాలను నూడుల్స్ తయారు చేసుకునేందుకు కట్ చేసింది. మందు రాసిన విషయాన్ని మర్చిపోయి టమాటాలను నూడుల్స్లో వేసుకొని తినేసింది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అసలు విషయం చెప్పడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. చదవండి: గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు -
కోనసీమకు రూ.3 లక్షల విలువైన టమాటాలు
పుంగనూరు: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కోనసీమలోని వరద బాధితుల కోసం రూ.3 లక్షల విలువ చేసే టమాటాలు విరాళంగా పంపించారు. శనివారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో టమాటా మండి వ్యాపారులంతా ప్రత్యేక లారీలో టమాటాలను తరలించారు. చైర్మన్ నాగరాజారెడ్డి మాట్లాడుతూ సుమారు 270 బాక్సుల టమాటాలను అందరి సహకారంతో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించామన్నారు. టమాటా మండి వ్యాపారులు రెడ్డెప్పరెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
టొమాటో కిలో రూ.150, క్యారెట్ కిలో రూ. 490
కొలంబో: శ్రీలంక సంక్షోభం చరిత్రలో ఒక గుణపాఠంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక, రాజకీయ సంక్షోభం అక్కడి ప్రజలను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. మునుపెన్నడూ లేని విధంగా కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక సామాన్యులు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు పెట్రోలు సంక్షోభం పట్టి పీడిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘1990’ అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది. కిలో ఉల్లి శ్రీలంక రూపాయల్లో 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు శ్రీలంక రూపాయల్లో 220కి విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490కి, పావుకిలో వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తున్నారు. సరఫరా కొరతతోపాటు, రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని కూరగాయల విక్రయదారులు వాపోతున్నారు. ఫైల్ ఫోటో కాగా 1948లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ద్వీపం దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ ఇంధనం లాంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడం, ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టడం లాంటి పరిణామాలు తెలిసినదే. -
మార్కెట్కు 1,656 టన్నుల టమాట రాక
మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్కు రైతులు రికార్డుస్థాయిలో టమాటను తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సీజన్లో అత్యధికంగా బుధవారం 1,656 మెట్రిక్టన్నుల టమాటను తీసుకువచ్చారు. జూన్ 1న మార్కెట్కు 342 మెట్రిక్టన్నుల టమాట వస్తే కేవలం 28రోజుల వ్యవధిలో ఐదురెట్లు రెట్టింపు సంఖ్యలో దిగుబడులు రావడం విశేషం. గత రెండేళ్లలో టమాట ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడులు అధికంగా వచ్చినా సరుకుకు డిమాండ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పెట్టుబడులు, నారు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల సమస్య అధికంగా ఉండటంతో ఈ సీజన్కు రైతులు పంటసాగుకు వెనుకంజ వేశారు. అయితే ఊహించనిరీతిలో మార్చి, ఏప్రిల్లో టమాటకు అధిక ధరలు పలకడంతో గంపెడాశతో అప్పులు చేసి సాగుకు పూనుకున్నారు. వాతావరణం అనుకూలించడం, కొత్త వంగడాలతో అధిక దిగుబడులు రావడంతో ఒక్కసారిగా మార్కెట్కు టమాటలు పోటెత్తాయి. మదనపల్లె మార్కెట్ నుంచి టమాట ఎగుమతులు జరిగే మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా టమాట సాగుచేయడంతో బయటి వ్యాపారులు ఎవరూ రాలేదు. దీంతో ధరలు నెలరోజులతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి లభిస్తున్న ధరలు రైతులకు ఆశాజనకంగానే ఉన్నాయి. మదనపల్లె మార్కెట్కు అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా, అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, కర్నాటక శ్రీనివాసపురం, చింతామణి, వడ్డిపల్లె, కోలారు తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటను తీసుకువస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ, పాండిచ్చేరి, మహరాష్ట్ర బీజాపూర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు టమాట ఎగుమతులు జరుగుతున్నాయి. బుధవారం మదనపల్లె మార్కెట్లో మొదటిరకం టమాట కిలో రూ.12–16, రెండోరకం టమాట కిలో రూ.7–11.60 మధ్య ధరలు నమోదయ్యాయి. దిగుబడులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తట్టి శారదమ్మ, కార్యదర్శి అభిలాష్ తెలిపారు. -
టమాట కెచప్ ప్రియులకు చేదువార్త!
టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా. ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది. 2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు. పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
Super Tomatoes: ఇవి మామూలు టొమాటోలు కావు.. కోడిగుడ్డు కంటే ఎక్కువే!
టొమాటోలు సహజసిద్ధంగానే కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. టొమాటోల్లోని పోషకాలు మరింత సమర్థంగా పనిచేసేలా బ్రిటిష్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి ద్వారా రూపొందించారు. జన్యుమార్పిడి ద్వారా పండించిన ఈ టొమాటోలను వారు ‘సూపర్ టొమాటోలు’ అని అంటున్నారు. 👉🏾ఈ సూపర్ టొమాటోల విశేషమేమిటంటే, వీటిలో కోడిగుడ్ల కంటే రెట్టింపు స్థాయిలో విటమిన్–డి3 ఉంటుంది. 👉🏾సాధారణ టొమాటోల్లో ఉండే ‘ప్రో విటమిన్’ కొంత కొలెస్ట్రాల్గా రూపాంతరం చెందుతుంది. 👉🏾‘సీఆర్ఐఎస్పీఆర్’ అనే జీన్ ఎడిటింగ్ పద్ధతిలో, ‘ప్రో విటమిన్’ కొలెస్ట్రాల్గా రూపాంతరం చెందేలా చేసే జన్యువులో మార్పు తీసుకొచ్చారు. 👉🏾ఫలితంగా ‘ప్రోవిటమిన్’ మరింత విటమిన్–డి3గా మారేలా చేశారు. 👉🏾నార్విచ్లోని జాన్ ఇన్నెస్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. 👉🏾విటమిన్–డి3 పుష్కలంగా ఉండే ఈ టొమాటోలు డెమెన్షియా, పార్కిన్సన్, కేన్సర్ వంటి వ్యాధులను సమర్థంగా నివారించగలవని వారు చెబుతున్నారు. చదవండి👉🏾Heart Can Repair Itself: భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
Health: విటమిన్ ‘ఏ’ లోపిస్తే సంతానలోపం సహా పలు సమస్యలు.. ఇవి తింటే!
Vitamin A Deficiency Symptoms Problems: కొందరిలో ఎన్ని చర్యలు తీసుకున్నా, మొటిమలు తగ్గవు. అలాగే గాయాలు త్వరగా మానవు. కొందరు చిన్నారులలో అయితే ఎదుగుదల సరిగా ఉండదు. విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో ఈ సమస్యలన్నీ కనిపిస్తాయి. మీ పిల్లలు సరిగా ఎగకపోతున్నా, మీకు అయిన గాయాలు త్వరగా మానకపోతున్నా విటమిన్ ఎ లోపించినట్లు భావించాలి. విటమిన్ ఎ లోపిస్తే ఇంకా ఏమేం సమస్యలు వస్తాయి, దానిని భర్తీ చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసుకుందాం. కొందరిలో నిత్యం గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్ ఏ లోపం కారణమై ఉండొచ్చు. చిన్నారుల్లో విటమిన్ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమం. ►విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్ ఎ తగినంత ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు. ►విటమిన్ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తించాలి. ►కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ►విటమిన్ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్ ఏ లోపమని గుర్తించాలి. ►పైన చెప్పుకున్న లక్షణాలన్నీ విటమిన్ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇప్పుడు విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేమిటో చూద్దాం! క్యారట్లు: విటమిన్ ఏ కి ఉత్తమ ఆహారం క్యారట్లు. క్యారట్ హల్వా అందరికీ ఇష్టమే కానీ, క్యారట్స్ లో ఉన్న పోషకాలు మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. తక్కువ మోతాదులో పచ్చివి తిన్నా మంచిదే. ఆకు కూరలు: ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకు కూరలే తినమనేవాళ్ళు కూడా. అయితే, ఆకు కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. గుమ్మడికాయ: తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. పాలు: మనందరం చిన్న పిల్లలకి రెగ్యులర్ గా ఒక గ్లాస్ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్ నించి రక్షింపబడతాం. టొమాటో: టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్ధమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టొమాటో ఉంటే వచ్చే రుచే వేరు. పైగా ఇవన్నీ కేవలం టొమాటో తోనే కూడా చేసుకోవచ్చు. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటో లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలం గా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. ►విటమిన్ ఎ ను పొందడం కోసం ట్యాబ్లెట్లు, ఇతర సప్లిమెంట్లపై ఆధార పడటం కన్నా, అది మెండుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. చదవండి: Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ జరిగేది ఇదే.. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు! -
టమాటా కిలో రూ.100
మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల మార్కెట్లో సోమవారం టమాటా కిలో రూ.100 చొప్పున విక్రయించారు. మార్చిలో కిలో రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం ధర భారీగా పెరిగింది. 20కిలోల బాక్సు గత నెల రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. సోమవారం రూ.1600 పలికింది. ఎండలతో రెండు మూడు కిలోల వరకు పాడైపోతున్నాయి. దీంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు కూరగాయల వ్యాపారి ఎల్లమ్మ తెలిపింది. -
భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర
టమాట ధర ఠారెత్తిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా పెరుగుతూ బహిరంగ మార్కెట్లో వినియోగదారుడిని భయపెడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు వాటివైపు చూసేందుకే ఆలోచించాల్సిన పరిస్థితి తయారైంది. నిజామాబాద్ (డిచ్పల్లి) : సమయానికి ఏ కూరగాయలు అందుబాటులో లేకపోతే కనీసం నాలుగు టమాటలైనా వండొచ్చుగా.. సాధారణంగా ప్రతీ మధ్య తరగతి కుటుంబాల్లో విన్పించే మాట ఇది. కానీ ఇప్పుడు అదే మాట వంటింట్లో మంట రేపుతోంది. నెల కిత్రం కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం కిలో రూ.80కి చేరింది. రోజురోజుకూ టమాట ధర సామాన్యులకు భారంగా మారింది. టమాట వండుకోవడం మాట అటుంచితే కనీసం వాటి గురించి కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కోసారి రూ.1కి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక రోడ్లపై పారబోసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేమో ధరలు భగ్గుమంటున్నాయి. గత మూడురోజుల్లో నే ఏకంగా రోజుకు రూ.10 చొప్పున పెరుగుతూ వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యాసంగిలో.. జిల్లాలో ఈ సారి యాసంగి టమాట ఉత్పత్తి తగ్గింది. సాధారణం కంటే ఎండలు అధికంగా ఉండటంతో పూత రాక పంట తగ్గింది. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలులకు టమాట పంటకు నష్టం వాటిల్లింది. దీంతో హోల్సేల్ వ్యాపారులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి టమాటను తెప్పించి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు షేడ్ నెట్లలో టమాటను సాగు చేస్తుంటారని, దీంతో ఎండ వేడమి నుంచి రక్షణ లభించి పంట దిగుబడి అధికంగా వస్తుందని వ్యాపారులు తెలిపారు. స్థానికంగా సరైన పంట ఉత్పత్తి లేకపోవడంతో టమాట ధరకు రెక్కలొచ్చాయి. ఏప్రిల్ 15వ తేదీ వరకు కిలో రూ. 10కి లభించిన టమాట ప్రస్తుతం కిలో రూ.80కి చేరింది. ధర పెరగడంతో సామాన్య, మద్య తరగతి ప్రజలు టమాట కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఈ ధరలు జూన్, జూలై వరకు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఉద్యాన శాఖాధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. -
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
Tomato Flu: చిన్నారుల్లో అంతుచిక్కని ‘టమాటో ఫ్లూ’ కలకలం
మరో అంతుచిక్కని వ్యాధి కలకలం మొదలైంది. కేరళలో వెలుగు చూసిన టమాటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన వ్యాపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్.. ఇప్పటిదాకా సుమారు 80 మంది చిన్నారులకు పైనే సోకింది. కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టమాటో ఫ్లూ అంటే.. ఇది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది. లక్షణాలు.. టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. సరిహద్దులో నిఘా.. ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు. అలాగే వలయార్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
Beauty Tips: ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం!
కొంతమంది ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉంటారు. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కనిపించి ఉస్సురనిపిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇదేమీ వ్యాధి కాదు కానీ, ఇలా మచ్చలు ఉన్న వారు ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం! ►తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. ►పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. ►జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. ►పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. ► పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, ఆ ముక్కలతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖ వర్చస్సు పెరుగుతుంది. ►అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్ టొమాటో రసం, టీ స్పూన్ గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ►రోజ్ వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. ►బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండటం. ఆత్మన్యూనత వల్ల, బిడియం వల్ల పదిమందిలో కలవలేకపోవడం, కలిసినా, ముఖాన్ని చేతులతో కవర్ చేసుకోవడం వంటి వాటి వల్ల అందరి దృష్టి పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. చదవండి👉🏾 Sugarcane Juice: చెరుకు రసం తరచుగా తాగుతున్నారా.. అయితే -
Beauty Tips: కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గాలంటే...
ముఖం మెరిసిపోవాలి అంటే తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. వీటిలో తగినన్ని నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే వారంలో చక్కటి ఫలితం కనిపిస్తుంది. ►కొన్ని కొన్ని కాంబినేషన్లను మనం అసలు ఊహించలేం. అలాంటి వాటిలో టమాటా... సీ సాల్ట్ ఒకటి. ►ఈ రెంటినీ కలిపి సౌందర్య సాధనంగా ఉపయోగించడమే గమ్మత్తు. ఒక టమాటా తీసుకుని దానిని కట్ చేసి.. దాని నుంచి రసం వేరుచేసుకుని ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సున్నితంగా ముఖంపై అప్లై చేయాలి.. ఇది ముఖంపై సహజ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. మృతకణాల్ని తొలగిస్తుంది. ముఖం మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు, చర్మం ఉబ్బరించడాన్ని కూడా ఉప్పు నివారిస్తుంది. ఇక బాదం పప్పును నానబెట్టి ఒలిచి హల్వాల్లో వేసుకుంటాం. ఆ పొట్టును పారేస్తుంటాం. అలా కాకుండా ఆ పొట్టును ఒంటికి రుద్దుకుంటే శరీరం మెరుపు సంతరించుకుంటుంది. బంగాళదుంపతో ఇలా.. ►బంగాళదుంప తురుముని ఐస్ వాటర్లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి. ►రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
అయ్యో.. రూ.75 వేల టమాటా చెత్త కుప్పల్లో...
సాక్షి,అశ్వాపురం(ఖమ్మం): అశ్వాపురానికి చెందిన ఓరుగంటి భిక్షమయ్య రెండు ఎకరాల్లో టమాటా తోట సాగు చేయగా.. ఇటీవల వర్షాలతో కాయలకు నీటి బుడగలు వచ్చి పూర్తిగా పాడయ్యాయి. దీంతో చేసేదేం లేక మంగళవారం కూలీలను పెట్టి కోయించి 200 బాక్సుల టమాటాలు చెత్త కుప్పలో పారబోయించారు. ఈ టమాటాలు మంచిగా ఉండి మార్కెట్కు తరలిస్తే రూ.75 వేల ఆదాయం వచ్చేదని భిక్షమయ్య వెల్లడించారు. రెండు ఎకరాల్లో సాగుకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చు చేయగా.. తోటలో కాత మంచిగా ఉన్న సమయాన వర్షాలు కురిసి తీరని నష్టం వచ్చిందని వాపోయాడు. ఇంకా 100 బాక్సుల టమాటాలు పాడైపోయి ఉన్నాయని... సుమారు 100 బాక్సులు మాత్రమే మంచి టమాటా లభించే అవకాశముందని తెలిపాడు. మొత్తంగా రెండు ఎకరాల పేరిట రూ.50 వేల ఆదాయం కూడా అవకాశం లేదని... తనలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భిక్షమయ్య కోరాడు. చదవండి: శంషాబాద్ ఎయిర్పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా.. -
సూర్యాపేటలో మేఘ గర్జన
సాక్షి నెట్వర్క్: సూర్యాపేట, నల్లగొండ జిల్లాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికే వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ వర్షాలకు కుదేలయ్యారు. సూర్యాపేట జిల్లాలో, ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో శనివారం రాత్రినుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా దాదాపు పదిగంటల పాటు వర్షం కురిసింది. దీంతో సద్దుల చెరువు కట్ట అలుగు తెగిపోయింది. దీని కారణంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల కార్లు కూడా నీటమునిగాయి. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా రోడ్డుపైకి భారీగా నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరిలో ఈదురుగాలులకు 11 కేవీ విద్యుత్ స్తంభాలు 8 నేలకూలాయి. నెల్లిబండతండాలో వడగళ్ల వర్షానికి 30 ఎకరాల్లో టమాట, మిర్చి, ఇతర కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. నూతనకల్,మోతెలో ఏరిన మిర్చి వరదలో కొట్టుకుపోయింది. ఆత్మకూర్–ఎస్ మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయానికి సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు సరాసరి 226.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేటలో 145 మి.మీ.వర్షం పడింది.నల్లగొండ జిల్లా కట్టంగూరు, నకిరేకల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ, మొండ్రాయి, నల్లబెల్లి, నార్లవాయి గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి మిర్చి, మొక్కజొన్న, కంది, టమాటా, బొప్పాయి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల, ఆత్మకూరు, నడికూడ తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం, అందుకుతండా, వెంచరామి, వరికోల్పల్లి గ్రామాల్లో వర్షానికి మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రెడ్యాతండా, కోమటికుంటతండా, బొత్తలతండాల్లో రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిలో కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం కొండాయి, మల్యాల గ్రామాల్లో మిర్చి, మినుము, పెసర, బొబ్బెర, జనుముల పంట నీటి పాలైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగడంతో నీరంతా పంట చేలల్లోకి చేరింది. వెంకటాపురం మండల పరిధిలోని పాలెం ప్రాజెక్టుకు గండిపడింది. -
Health Tips: అలర్జీలు, ఆస్తమాను తగ్గించే ఆహారాలు ఇవే! టొమాటో, బ్రాకలీ ఇంకా
Winter Season: Asthma Diet Tips By Doctor What To Eat In Telugu: చలికాలం వచ్చిందంటే చాలు.. అలర్జీ, ఆస్తమా బెడద ఎక్కువవుతుంది. నిజానికి ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరు కాదు. ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. మనకు ఏదైనా మనకు సరిపడని పదార్థం లోనికి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ! ఈ క్రమంలో ఒక్కోసారి... దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. మరి చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించే ఆహారాలు, వంట ప్రక్రియల గురించి తెలుసుకుందాం! అలర్జీ.... ఆస్తమాగా ఎప్పుడు మారుతుందంటే...? అలర్జీతో తొలుత ఏమవుతుందో అర్థం చేసుకోడానికి కళ్లను ఉదాహరణగా తీసుకుందాం. కళ్లలో దుమ్ముపడితే ఎర్రబారి, నీళ్లుకారినట్టుగా... నులుముకోవాలన్నంత దురదలాంటి ఫీలింగ్ వచ్చినట్లుగానే... సాధారణంగా అలర్జీ కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న అప్పర్ ఎయిర్వేలోనూ అక్కడి సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. స్రావాలు వెలువడతాయి. ముక్కు , కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట పెట్టడం వంటివి కనిపిస్తాయి. ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికి మాత్రమే అలర్జీ పరిమితమైనప్పుడు దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు. అదే అలర్జీ తీవ్రతరమై లోవర్ ఎయిర్వేస్తో పాటు ఊపిరితిత్తులూ, గాలిగదులు ఎర్రబారడం... గాలి పీల్చుకునే నాళాలు (బ్రాంకై) వాచి, బాగా సన్నబారిపోయి శ్వాసతీసుకోవడం కష్టం అయ్యే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో ఊపిరి అందని ఆయాసపడే స్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే... అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. అప్పుడు ఆస్తమాకు గురైన వారి శరీరం నీలంగా మారిపోయి, వారు స్పృహ కోల్పోయే పరిస్థితి రావచ్చు. అలర్జీ / ఆస్తమా చికిత్స : ►అలర్జీ అయినా, ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కూ, ‘ఇరిటెంట్స్’కు దూరంగా ఉండటం మేలు. అలర్జీకి చికిత్సగా మందులు వాడాల్సి వస్తే... దాని తీవ్రతను తగ్గించేందుకు యాంటీ హిస్టమైన్స్, మాంటెలుకాస్ట్ లాంటి మందులు వాడతారు. ఇక ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని అరికట్టే ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడటం తెలిసిందే. కొందరు ఈ ఇన్హేలర్స్ హానికరం అనుకుంటారుగానీ అవి పూర్తిగా సురక్షితమైనవి. ►ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలూ అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ను తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు. ►అలర్జీల విషయానికి వస్తే ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తోడు అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలూ విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండకపోవచ్చు. అయితే అవి తీవ్రమైన ఆస్తమాతో బాధపడే కొందరిపైన ప్రభావపూర్వకంగానే పనిచేస్తాయి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే ఆహారాలు ►టొమాటో ►కాలీఫ్లవర్ ►బెల్పెప్పర్స్ ►బ్రాకలీ ►కివీ ఫ్రూట్స్, ►స్ట్రాబెర్రీలు ►అయితే నిమ్మజాతి పండ్లు సాధారణ వ్యక్తుల్లో అలర్జీలను తగ్గించి, ఆస్తమా వంటి వాటిని ఎదుర్కొనేలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే కొందరికి నిమ్మజాతి పండ్లలో ఉండే పులుపుతోనే అలర్జీ వస్తుంది. అదే ఆస్తమాను ప్రేరేపిస్తుంది. అలాంటివారు మాత్రం నిమ్మజాతి పండ్లకు దూరంగా ఉండాలి లేదా చాలా పరిమితంగా తీసుకోవాలి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే వంట ప్రక్రియలు ఆయిలీ ఫుడ్స్, నూనెలో బాగా వేయించే వేపుళ్లు (డీప్ ఫ్రైడ్, రోస్టెడ్) పదార్థాలు, మసాలాలు చాలా ఎక్కువగా ఉపయోగించి చేసే ఆహారపదార్థాలు చాలామందిలో అలర్జీ కలిగించడం కంటే ఆస్తమాను నేరుగా ప్రేరేపిస్తాయి. అందుకే ఉప్పు, మసాలాలూ, నూనెలు తక్కువగా ఉండేలాగా... అలాగే వేపుళ్లు కాకుండా ఉడికించి వండేవాటితో అలర్జీలు/ ఆస్తమాను చాలావరకు నివారించవచ్చు. --డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
మళ్లీ పెరిగిన టమాట ధరలు
మదనపల్లె సిటీ: టమటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్కు సరుకు తక్కువగా వస్తుండడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధర గరిష్టంగా కేజీ రూ.104 పలికింది. కేవలం 92 మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మార్కెట్కు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో టమాటాకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. -
నిన్నా మొన్నటి దాకా కిలో వంద.. టమాట ధర తగ్గుముఖం..
సాక్షి, హైదరాబాద్: నిన్నా మొన్నటి దాకా కిలోకు దాదాపు వంద రూపాయలు పలికిన టమాట ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం బోయిన్పల్లి మార్కెట్లో రూ. 25 నుంచి రూ.28 వరకు పలకడమే ఇందుకు నిదర్శనం. దీంతో రిటైల్ మార్కెట్లో ధరల తగ్గుదల నమోదైంది. టమాటా ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో రూ.30 –40 వరకు.. రిటైల్గా మాత్రం రూ.50– 60 పలుకుతోంది. అలాగే ఈ వారం టమాటా దిగుమతులు పెరగనుండటం గమనార్హం. ఆదివారం నగరంలోని వివిధ మార్కెట్లకు సుమారు 400 టన్నుల టమాటా దిగుమతి అయినట్లు మార్కెటింగ్ అధికారులు చెప్పారు. ఇదే మోతాదులో నిత్యం ఇలాగే దిగుమతి అయితే ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా. వచ్చే ఆదివారం వరకు కేజీ టమాటా రూ.20కి చేరుతుందని వ్యాపారులు అంటున్నారు. చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్ గుండె -
భారీగా తగ్గిన టమాటా ధర.. కిలో రూ.20 మాత్రమే, ఎక్కడంటే?
ములకలచెరువు (చిత్తూరు జిల్లా): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్కు వచ్చిన టమాటా ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. 30 కిలోల బాక్సు రూ.600 పలికింది. రెండు రోజుల క్రితం వరకు అదే బాక్సు ధర రూ.3 వేలు దాటింది. బయటి రాష్ట్రాల నుంచి పలువురు వ్యాపారులు ఇక్కడికి టమాటాలను తెప్పించడంతోనే ధరలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. (చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..) -
హైదరాబాద్లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం
సాక్షి, హైదరాబాద్: టమాట ధర రోజురోజుకు పెరిగిపోతోంది. పేద, మధ్యతరగతి వర్గాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాటా ధర మార్కెట్లలో రూ.130కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎర్రగడ్డ ప్రధాన రహదారిలో ఓ వ్యాపారి ఆటోలో టమాటలు నింపుకొని వచ్చి కిలో రూ.50 కే విక్రయించాడు. దీంతో జనం ఇలా ఎగబడ్డారు. – సాక్షి, స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మరోవైపు టమాట ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. చదవండి: ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’? దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. -
టమాట, ఉల్లి ధరలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరలపై కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’
ధరల మోతతో కూరగాయాల మార్కెట్కు వెళ్లేందుకు సామాన్యులు జంకుతున్నారు. ముఖ్యంగా టమాటా ధర చుక్కలను తాకడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలతో భారీగా పెరిగిన టమాటా ధరలను దించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు టమాటా ధరల పెరుగుదలపై #tomatopricehike హ్యాష్టాగ్తో సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. సరదా ఫొటోలు, మీమ్స్, వీడియోలను నెటిజనులు ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ‘మీరు మార్కెట్ నుంచి టమాటా కొనుగోలు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం పాన్ కార్డును అడుగుతుంది. కూరగాయల వ్యాపారులు సైతం పాన్కార్డు జిరాక్స్ కాపీని అడుగుతున్నారు’ అంటూ ఈ నెటిజన్ సైటర్ వదిలారు. (చదవండి: హైదరాబాద్లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’) జనం తమను టమాటాలతో కొడతారన్న భయంతోనే పాలకులు వాటి ధరను భారీగా పెంచేశారని మరొకరు హాస్యమాడారు. ఇప్పుడు ఖరీదైన ఉంగరం ఇదే అంటూ టమాటాతో ఉన్న ఉంగరం ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు టమాటా ఇప్పుడు కొత్త మాణిక్యం (న్యూ రూబీ) అంటూ వెరైటీ నిర్వచనాలు ఇస్తున్నారు. టమాటా ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతున్నాయని పేర్కొంటూ ఉసేన్ బోల్ట్ పరుగు పందెం ఫొటోను షేర్ చేశారు. ఈ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. కాస్త కనిపెట్టండి అంటూ పాత ట్వీట్ను వెలికితీశారు మరో నెటిజన్. టమాటా ధరలు ఎంత పెరిగినా ఫర్వాలేదు. ఇలా చేయండి అంటూ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అదేంటో మీరూ చూడండి.. Tomato price hike ?, No problem, Here is the solution 👇🤣🤣🤣#tomatopricehike pic.twitter.com/DqsKgeDuCA — S℘ıɖɛყ🕸 (@Spidey_e) November 25, 2021 -
హైదరాబాద్లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు టమాటా రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ఆరేడు క్వింటాళ్లకు మించకపోవంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడం, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నగరంలోని బహిరంగ మార్కెట్లో ట‘మోత’ మోగుతోంది. ప్రస్తుతం సైజు, కలర్ను బట్టి కేజీ ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. (చదవండి: Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?) రైతుకు నష్టం.. కొనుగోలు కష్టం.. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,173.05 ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. ఇందులో 5,827.03 ఎకరాల్లో టమాటా వేశారు. ఇటీవల ఏకధాటి వర్షాలతో పంట చేలోనే కుళ్లిపోయింది. టమాటా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోయే ప్రమాదం ఉండటంతో వచ్చిన పంటను వచ్చినట్లే మార్కెట్కు సరఫరా చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో ప్రస్తుతం ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. అవసరం కొండంత.. దిగుబడి గోరంత.. ► గ్రేటర్లో రోజుకు సగటున 350 నుంచి 380 టన్నుల టమాటా అవసరమవుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రంగారెడ్డి సహా ఇతర శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఆధించిన స్థాయిలో దిగుమతి కావడం లేదు. నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట, ఎర్రగడ్డ, ఎల్బీనగర్ మార్కెట్లకు రోజుకు సగటున 150 నుంచి 180 టన్నులకు మించి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► కేవలం టమాటా మాత్రమే కాదు బీర, కాకర, బెండ, మిర్చి, దోస, సోర వంటి కూరకాయలు, పాలకూర, తోటకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర్ వంటి ఆకుకూరల దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఫలితంగా ఆయా కూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. నవంబర్ మొదటివారంలో కేజీ కాయకూరల ధరలు సగటున రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60పైగా ఉంది. ఆకుకూరలు రూ.10కి నాలుగు నుంచి అయిదు కట్టలు ఇస్తే.. ప్రస్తుతం అంతే మొత్తానికి రూ.20కిపైగా చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే) అర కేజీతో సరిపెట్టుకుంటున్నాం.. మార్కెట్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ రూ.10 నుంచి రూ.20కే వచ్చేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ఈ ధరను పెట్టి కొనడం కష్టం. తాత్కాలికంగా వినియోగాన్ని తగ్గించాం. గతంలో వారానికి రెండు కేజీలు కొంటే..ప్రస్తుతం అరకేజీతో సరిపెట్టుకుంటున్నాం. – చౌహాన్ లక్ష్మి, బడంగ్పేట్ పంట చేతికొచ్చే దశలోనే.. నేను రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని భావించాను. తీరా కాయ కోతకొచ్చే దశలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చెట్టుకున్న కాయలు నేలకు ఆనుకుని ఉండటంతో వాటికి మచ్చలు ఏర్పడ్డాయి. బూజు పట్టి పాడైపోయాయి. చేను మొత్తం వెతికి ఏరినా ఒక డబ్బా నిండటం లేదు. తెంపిన కాయకు కూడా మచ్చలు ఉండటంతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – యాట అంజయ్య, జాపాల గ్రామం -
Tomato Price Hike: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: టమాటా ధరల కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలోని మార్కెట్లలో కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. కొన్నిరోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పటికే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్లో టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ టమాట ధర రూ.100 దాటింది. వైఎస్సార్ కడప జిల్లాలో మార్కెటింగ్శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని సామాన్యులకు భారం కాకుండా టమాటను బయటి ప్రాంతం నుంచి తెప్పించింది. కడప రైతు బజార్లో బుధవారం కిలో ధర రూ. 65 చొప్పున విక్రయాలను చేపట్టారు. చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది -
Viral Video: అరె ఏంట్రా ఇది.. మట్టిలో టమాటాలను వేయించి..
Delhi Street Food Vendor Roast Tomato In Sand Video Goes Viral Watch: నోరూరించే.. ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పానీపూరీ, వడాపావ్.. కరకరలాడే బజ్జీలు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే జిలేబి.. ఇలా చెప్పుకొంటూ పోతే లిస్టు పెద్దదే. మరి... జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు కదా! అందరిలా ఆలోచిస్తే ప్రత్యేకత ఏముంటుంది? కొత్త కొత్త వంటకాలు ట్రై చేయాలి అనుకున్నాడో ఏమో.. ఓ యువకుడు కాస్త వెరైటీ ఫుడ్ ఐటమ్తో ముందుకు వచ్చాడు. సాధారణంగా టమాటాలతో మనం కూర, చట్నీ, చారు.. మహా అయితే టమాటా బాత్ వంటి వంటకాలు చేసుకుంటాం! కానీ... తూర్పు ఢిల్లీలోని చిత్రవిహార్కు చెందిన ఈ అబ్బాయి మాత్రం.. నూనెతో పని లేకుండానే.. పొయ్యి మీద మూకుడులో మట్టిపోసి.. దాంట్లోనే టమాటాలను వేయిస్తున్నాడు. ఆ తర్వాత నీటిలో వాటి శుభ్రంగా కడిగి... ముక్కలు చేసి.. అందులో మసాలాలు.. చట్నీ వేసి తన దగ్గరికి వచ్చిన కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుడ్ లవర్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలని భావించేవాళ్లు.. వీలైతే ఓసారి ట్రై చేయండి! అసలే టమాటా ధర కిలో వంద దాటింది అని మండిపోతుంటే.. మీ ఉచిత సలహా ఏంటని తిట్టుకోకండి! మర్లేం పర్లేదు ధర తగ్గిన తర్వాతే.. మట్టిలో టమాటాలను వేయించుకుని తినండి! చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! View this post on Instagram A post shared by CHATORE_BROOTHERS (@chatore_broothers) -
కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి
Vegetable Prices List In Hyderabad: వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు బయట మార్కెట్లోనే అనుకుంటే...ఇప్పుడు రైతుబజార్లో సైతం కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.100కు చేరింది. అదే బాటలో బెండకాయ, వంకాయ, దొండ, చిక్కుడు, గోకరకాయ, క్యారెట్, బీన్స్...ఇలా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో కిలో కొనేచోట అర, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతుబజార్ ధరలే బెంబేలెత్తిస్తుంటే ఇక బయట ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. (చదవండి: గిన్నిస్ బుక్లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది) వర్షాలు బాగా కురిసినప్పటికీ.. నిన్న మొన్నటివరకు వర్షాలు బాగానే కురిసినప్పటికీ కూరగాయల ధరల దిగుబడి మాత్రం పెరగకపోవడంతో ధరలకు రెక్కాలొచ్చాయి. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో నిన్నటి వరకు కురిసిన భారీ వరదలకు రోడ్లు దెబ్బతినటంతో కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలు లేకపోవటంతో ధరలు పెరిగాయి. మండు వేసవిలో ఉన్న ధరల కంటే అధికంగా ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. డిమాండ్కు, ఉత్పత్తికి మధ్య ఎనలేని వ్యత్యాసం ఉంటుండడంతో వ్యాపార వర్గాలు ధరలు పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భరత్నగర్ కాలనీ కూరగాయల మార్కెట్లో కూడా ధరలు అధికంగా ఉన్నాయి. కర్రీ పాయింట్లలో సైతం.. పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరల కారణంగా కర్రీ పాయింట్ల నిర్వాహకులు సైతం ధరలు పెంచేశారు. నిన్నటివరకు రూ.10– 12లుగా ఉన్న కనీస ధర (ఒక కర్రీ)ను రూ.20లకు పెంచేశారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉంది. మరోవైపు పెరిగిన కూరగాయల ధరలతో కొనడమే మానేసిన చాలా మంది కర్రీ పాయింట్లను ఆశ్రయించడంతో ఆయా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆదే అదునుగా నిర్వాహకులు కర్రీ పాయింట్లపై ఆధారపడ్డ యువత, బ్యాచ్లర్స్, కుటుంబాలపై సైతం అదనపు భారం వేస్తున్నారు. (చదవండి: ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే) ఎన్నడూ లేనంత ధరలు పలుకుతున్నాయి.. గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయల ధరలు మండుతున్నాయి. అదీ, ఇదీ అని కాకుండా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నెలవారీ బడ్జెట్పై అదనపు భారం తప్పడం లేదు. టమాట గతంలో 10 నుంచి 20 దాకా ఉండేది. ఒకేసారి 100కు చేరటం, మిగతా కూరగాయలు కూడా 60 రూపాయలు దాటి ఉండటం వినియోగదారుల నడ్డి విరుగుతోంది. – అనిత, మూసాపేట గడిచిన నెలలో పెరిగిన కూరగాయల ధరలు, రైతుబజార్ ధరల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి -
Health Tips: టొమాటో, వాల్నట్స్, నేరేడు పండ్లు.. తరచుగా తిన్నారంటే....
ఆడుతు పాడుతు పని చేస్తే అలుపూ సొలుపేమున్నది అని ఓ పాట ఉంది. అలాగే నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దాం... టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే. వాల్నట్స్: ముఖ్యంగా వాల్నట్స్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. గ్రీన్ టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. యోగర్ట్ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది. బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు. బెర్రీస్... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఆకుకూరలు ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
జామపండు.. ఆరోగ్య ఖజానా!!
Health Benefits of Guava fruit: వ్యాధినిరోధకతను సమకూర్చే ప్రాథమిక పోషకం ‘విటమిన్–సి’ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది కావాలంటే మనందరికీ గుర్తొచ్చే పండ్లు నిమ్మజాతికి చెందిన ఒకింత పుల్లటి–తియ్యటి పండ్లు. కానీ... నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్–సి’ యే ఎక్కువ. అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది. అంతేకాదు... టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. ‘లైకోపిన్’ అనే అద్భుత పోషకం... ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే... లైకోపిన్ ఉన్నందున ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది. కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది. అలా వేళకు విసర్జన జరిగే ఈ ఒక్క జీవనశైలి మంచి అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. ఇలాంటి అనేక గుణాలున్నందున దీన్ని ఆరోగ్యానికి ఖజానాగా పిలిచినా అది అతిశయోక్తి కాబోదు. -
world record: వామ్మో! ఒకే మొక్కకి 839 టమాటాలా!!
సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి, సైజును బట్టి ఒక టమాట మొక్కకి పెద్దవైతే 10-30, కాస్త చిన్నవైతే సుమారుగా 20 నుంచి 90 వరకు టమాటాలు కాస్తాయి. అయితే లండన్లో ఒక టమాటా మొక్కకి ఏకంగా 839 టమాటాలు కాసి గిన్నీస్ రికార్డులో స్థానం దక్కించుకుంది. లండన్కి చెందిన ఐటీ మేనేజర్ డగ్లస్ స్మిత్ మార్చి నెలలో తన గార్డెన్లో చెర్రీ టమాటా (చిన్న టమాటా) విత్తనాలు నాటాడు. వారానికి 2-3 గంటల పాటు వాటి పోషణ, సంరక్షణలకు కేటాయించేవాడట. మొక్క ఎదిగి, టమాటాలు కాశాక లెక్కిస్తే దిమ్మతిరిగిపోయే రేంజిలో 839 టమాటా తేలాయి. ఇంకేముంది మనోడు గిన్నీస్ బుక్ అధికారులకు సమాచారం అందించాడు. 2010లో ఒక టమాటా మొక్కకు 448 టమాటాలు కాయించిన గ్రహం టాంటెర్ పేర ఉన్న రికార్డును డగ్లస్ స్మిత్ బద్దలుకోట్టి ప్రపంచ రికార్డును దక్కించుకున్నాడు. గతంలో కూడా 3.1 కేజీల అతిపెద్ద టమాటాను కాయించి గిన్నీస్లో చోటు దక్కించుకున్న డగ్లస్ తాజా పరిణామంతో మరోసారి వార్తల్లో కెక్కాడు. చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా.. -
‘కర్నూలు టమాటా’కు మంచి రోజులు
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయా పారీ్టలు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇచ్చే హామీల్లో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు తప్పక ఉంటుంది. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా.. హామీ మాత్రం బుట్ట దాఖలవుతూనే వచి్చంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కలగా ఉన్న హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేర్చుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాట ప్రధాన పంటగా సాగవుతోంది. ఏటా రాష్ట్రంలో టమాట 50 వేల ఎకరాల్లో సాగవుతుంటే కర్నూలు జిల్లాలోనే దాదాపు 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అయితే ఏటా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. కిలో టమాటకు రూపాయి ధర కూడ లభించక రోడ్లపై పారబోసిన సంఘటనలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టమాటకు ధరలు పడిపోయినపుడు మార్కెటింగ్ శాఖ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతుల్లో కొంతవరకు భరోసా నింపింది. ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టింది. మరుగున పడిన టమాట జ్యూస్ ఇండస్ట్రి ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. 25 ఏళ్ల రైతుల కలను నెరవేర్చేందుకు ముందుకు వచి్చంది. ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో టమాట పల్ప్(గుజ్జు) ప్రాసెసింగ్ ఇండస్ట్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల రైతులకు మేలు జరిగే విధంగా రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న మెట్టుపల్లి గ్రామం పరిధిలో టమాట పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే 15 ఎకరాల భూములను కూడా గుర్తించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలో టమాట ఎక్కువగా సాగు చేసే ప్యాపిలి, డోన్, దేవనకొండ, పత్తికొండ, పెద్దకడుబూరు, హాలహరి్వ, హొళగొంద, ఓర్వకల్, వెల్దుర్తి, కృష్ణగిరి, కోడుమూరు, సీ.బెళగల్ తదితర పాంత్రాల రైతుల కష్టాలు తొలగిపోనున్నాయి. డీపీఆర్ సిద్ధం? జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టమాట గుజ్జు పరిశ్రమకు సంబంధించి డీటైల్ ప్రాజెక్టు రిపోర్టును నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాప్కాన్ సిద్ధం చేస్తోంది. నాప్కాన్ నుంచి ప్రత్యేక టీమ్ ఇటీవల ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి వచ్చి భూములను పరిశీలించింది. డీటైల్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తోంది. మరోవైపు ఎంటర్ప్రెన్యూర్ కోసం ఆంధ్రప్రదేశ్ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎక్స్ప్రెసెన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) జారీ చేసింది. టమాట గుజ్జుతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల్లో పండించే టమాటకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఏర్పడింది. టమాట గుజ్జు ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటును జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది. గుజ్జు పరిశ్రమ జిల్లాకు వరమే మెట్టుపల్లిలో టమాట పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ 15 ఎకరాలు కేటాయించారు. కన్సల్టెన్సీగా ప్రభుత్వం నాప్కాన్ను ఎంపిక చేసింది. ఇప్పటికే నాప్కాన్ ప్రతినిధులు గ్రామానికి వచ్చి సర్వే చేశారు. డీపీఆర్ సిద్ధం అవుతోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇప్పటికే ఎంటర్ప్రెన్యూర్ కోసం ఈవోఐ జారీ చేసింది. ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల టమాట రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఇక్కడ టమాట పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రభుత్వం నెలకొల్పనుంది. – ఉమాదేవి, జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
భారీ ట్రాఫిక్, 20 టన్నుల టమోటా నాశనం
సాక్షి, ముంబై:మహారాష్ట్రలో అనుకోని రోడ్డు ప్రమాదం, భారీ ట్రాఫిక్ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. భారీ టమోటా లోడ్తో వస్తున్నట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 టన్నుల టమోటా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అధికారులు బుల్డోజర్ల సాయంతో టమోటాలను తొలగించి మరీ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటన రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. ట్రక్ బోల్తా పడిన ఈ ఘటనలో ఒకరు గాయపడగా, ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్టర్న్ఎక్స్ప్రెస్ హైవేపై థానేలోని కోపారి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో టమోటా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడు. మరోవైపు పంటను మార్కెట్ చేసుకునే అవకాశాలూ అంతంత మాత్రమే. దీంతో అమ్ముకునే దారిలేక నడిరోడ్డుపై టమాటా, క్యాలిఫవర్ లాంటి పంటలను స్వయంగా రైతులే ధ్వంసం చేసిన ఘటనలు గతంలో అనేక చూశాం. One person was injured after a truck overturned near Kopari, Thane on Eastern Express Highway at around 2 am, today. The injured has been shifted to the nearest hospital: Thane Municipal Corporation pic.twitter.com/j9jrQY8WXX — ANI (@ANI) July 16, 2021 #WATCH | Thane, Maharashtra: Around 20 tonnes of tomatoes, scattered on Eastern Express Highway, being removed amid a huge traffic jam on both lanes of the Highway One person was injured after a tomato-laden truck overturned near Kopari, Thane on the Highway at around 2 am today pic.twitter.com/GPOmfgd1nO — ANI (@ANI) July 16, 2021 -
దారుణంగా పడిపోయిన టమోట ధర
సాక్షి, కర్నూలు : నిన్న మొన్నటి వరకు 50-20 రూపాయల మధ్యలో చక్కర్లు కొట్టిన టమోట ధర ప్రసుతం దారుణంగా పడిపోయింది. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమోట ధర రూపాయి నుంచి రెండు రూపాయలు పలుకుతోంది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టమోటకు మద్దతు ధర కల్పించటానికి ముందుకొచ్చింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోట కొనుగోలు చేపట్టనుంది. -
టమాట @ 70
భువనగిరి : టమాట ధర రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో కిలో రూ. 56లకు విక్రయిస్తుంటే.. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో టమాట రూ.70 పలుకుతోంది. రైతు బజార్లో టమాట తక్కువ ధరకు వస్తోంది. అక్కడ వెంటనే అమ్ముడు పోవడం..తద్వారా అక్కడ టమాట లేకపోవడంతో విని యోగదారులు బహిరంగ మార్కెట్ వైపు మళ్లుతున్నారు. దీంతో రైతు బజార్లో ఉన్న ధర కంటే బహిరంగ మార్కెట్లో సుమారు రూ.8నుంచి రూ.15 వరకు అధికంగా పెంచివిక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా గాని.. తప్పనిసరి పరిస్థితుల్లో టమాట కొనుగోలు చేయక తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి.. జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఉంది. ఇందులో 69 స్టాల్స్ ఉన్నాయి. వీటిల్లో కూరగాయలను విక్రయిస్తుంటారు. చౌక ధరలకే ఇక్కడ కూరగాయల లభ్యమవుతాయి. ఈ రైతు బజార్కు భువనగిరి పరిసర ప్రాంతాలైన బొమ్మలరామారం, తుర్కపల్లి, వలిగొండ, ఆత్మకూర్(ఎం) వంటి మండలాల రైతులు పండించిన కూరగాయలను ఇక్కడికే తీసుకొస్తారు. ప్రస్తుతం జిల్లాలో టమాట పంట సాగు లేకపోవడంతో ఇక్కడి వ్యాపారులు హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇదికూడా అరకొరగానే దిగుమతి కావడం.. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజురోజుకూ ధర పెరుగుతోంది. అయితే టమాట కిలో ధర గతవారం రూ.16ఉంటే ప్రస్తుతం రైతు బజార్లో రూ.56 ఉంది. ఇదే టమాట బహిరంగ మార్కెట్లో రూ.70 ధర పలకడం గమనార్హం. ఇతర కూరగాయల ధరలు ఇలా.. ప్రస్తుతం టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రైతు బజార్లో కిలో క్యాప్సికం రూ 44, చిక్కుడుకాయ రూ.34, ఆలుగడ్డ రూ.32, క్యారెట్ రూ.38, పచ్చిమిర్చి రూ.34, బీరకాయ రూ.30ల వరకు ఉంది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో రూ.5ల నుంచి రూ.8ల వరకు అ ధికంగా పెంచి విక్రయిస్తున్నారు. అయితే ని త్యం ఈ రైతు బజార్లో భువనగిరితోపాటు ప రిసరాల ప్రాంతాల నుంచి సుమారు 3వేల మంది వరకు వినియోగదారులు కూరగాయల ను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ప్ర స్తుతం కరోనా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతూ కూరగాయలను అధిక ధరలకు కొనుగోలు చేయలేకపోతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. -
ఢిల్లీలో పెరుగుతున్న టమాటో ధరలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ సీజన్ వల్ల సరఫరా తక్కువ ఉండటంతో టమాటో ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జూన్ 1 నుంచి టమాటో ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూరగాయల మార్కెట్లలో టమాటో కిలో రూ. 70కి పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణ కూరగాయల మార్కెట్లలోనే కాకుండా.. మదర్ డైరీ జౌట్లెట్స్, బిగ్బాస్కెట్లో కూడా టమోటో ధరలు భారీగానే ఉన్నాయి. (తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు) ఆదివారం రోజున బిగ్బాస్కెట్లో కిలో టమాటోను రూ. 60 నుంచి 66 వరకు విక్రయించారు. టమాటో ఉత్పత్రి చేస్తున్న రాష్ట్రాల నుంచి తక్కువ మొత్తంలో దిగుమతి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూరగాయల వ్యాపారులు తెలిపారు. టమాటో పండిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంతో అది టమాటో పెంపకంపై ప్రభావం చూపెడుతోందని అంటున్నారు.(రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్) -
టమాటో ఛాలెంజ్తో రైతులకు ఊరట
ఓ రైతు ఆవేదన వారిని కదిలించింది. ఎక్కడో సుదూరతీరాలలో ఉన్న నలుగురు యువకులు టమాటో రైతుల వేదనకు కరిగిపోయారు. వాట్సాప్లో చెక్కర్లు కొట్టిన ఓ వీడియో అమెరికా వరకు చేరింది. అది ఓ రైతు తన నాలుగెకరాల టమాటో పంట లాక్డౌన్ మూలంగా నాశనం అవుతోందని ఆవేదనతో రికార్డు చేసిన వీడియో. ఖండాంతరాలను దాటి వృత్తి రీత్యా డాక్టరైన వాసుదేవ రెడ్డి అనే యువకుని దృష్టిలో పడింది. వీడియోలో టమాటో పంటను అమ్ముకోలేక పారవేసే దృశ్యం అతనిని కదిలించివేసింది. దీనికి పరిష్కారం కనుగొనాలని భావించి ‘టమాటో ఛాలెంజ్’ పేరుతో ఓ పోస్టును తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతని స్నేహితులైన సుబ్బారెడ్డి, వెంకట్ కల్లూరి, డా. ప్రభాకర్లు సహకరించడంతో వారి టమాటో ఉద్యమం ఊపందుకుంది. అలా మొదలైంది ! ఆంద్రప్రదేశ్లో ఉన్నవారి స్నేహితుడు ప్రేమ్ కళ్యాణ్ కృషితో వారు చేసిన ఛాలెంజ్ గ్రామాలకు చేరింది. వారు నలుగురు పోగుచేసిన సొమ్ముతో పాటు విరాళాలుగా వచ్చిన దాదాపు రూ.50 లక్షల మొత్తాన్ని వారు ముందుగా టమాటో రైతులకు ఊరట కలిగించాలని భావించారు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభం కావడంతో ఛాలెంజ్ ఉద్యమంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ ఛాలెంజ్లో భాగంగా రైతులను నేరుగా సంప్రదించి వారివద్ద నుండి మార్కెట్ ధరకు టమాటోను కొనుగోలుచేసి వాటిని ఉచితంగా పేదలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. లాక్డౌన్ మూలంగా ఎవరూ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో పేదలకు ఇది వరంగా మారింది. తమ పంట పాడైపోకుండా ఉంటే చాలని రైతన్నలు భావించే కాలంలో ఈ ఛాలెంజ్ వారికి ఉరటకలిగించింది. మొత్తానికి ఈ ఉద్యమం గ్రామాలకు పాకింది. వాలంటీర్ల వ్యవస్థకు పునాది కూరగాయల రవాణా సాధారణ రోజుల్లోనే ఒక ఛాలెంజ్. అలాంటిది లాక్డౌన్ కఠినంగా అమలువుతున్న రోజుల్లో అది మరీ కష్టం. ఈ వ్యవస్థను రెండుగా విభజించి పంట సేకరణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పంపిణీకి రెండవ బృందాన్ని సన్నధ్ధం చేశారు. పంటలు పండే ప్రాంతాలనుంచే రవాణా వాహనాలను సిద్ధంచేసి వాటికి ‘‘ఉచిత కూరగాయలు’’ అనే ఫ్లెక్సీలను కట్టి సరఫరాను ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైనా రోజులు గడిచే కొద్దీ రవాణా సులువుగా మారిందని, రైతులను పంట చేలల్లోనే నగదు ఇచ్చేవిధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదని, స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకులతో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామని, టమాటో ఛాలెంజ్ నిర్వహకులు ప్రేమ్ కళ్యాణ్ చెప్పారు. టమాటోతో మొదలై అన్ని కూరగాయలకు! ముందుగా టమాటో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో మొదలైన ఛాలెంజ్ కరోనా కష్టకాలంలో అన్ని రకాల కూరగాయలు తోడయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, కొత్తకోట మండలాల్లో టమాటో కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజీ, చిలకడదుంప, వంకాయలు, పచ్చి మిర్చి, మామిడి పండ్లు, బత్తాయిలు లాంటి పంటలను సైతం ఈ ఛాలెంజ్లో భాగంగా సేకరించి ఉచిత పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలోని వింజమూరు తదితర మండలాలు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సైతం కూరగాయాలను కొనుగోళ్లు చేసి లాక్డౌన్ సమయం నెలన్నర రోజుల పాటు నిత్యం సరఫరా చేయడం ఈ ఎన్నారై బృందం కృషికి నిదర్శనం. మా పంట పండింది! ‘‘నా రెండకరాల పొలంలో పండించిన టమాటో పంట కొనే నాదుడు లేక పారబోయలేక సతమతం అవుతున్నసందర్భంలో టమాటో ఛాలెంజ్ సభ్యులు నన్ను సంప్రదించారు. నేను చెప్పిన ధరకే నా పంట కొనుగోలు చేసి ఆ మరునాడే పంట దిగుబడి సిద్ధంచేసి వారికి అందించాను. కరోనా కష్టకాలంలొ పొలంలోనే నాకు పంట సొమ్ము చేతికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను’’అని తంబళ్లపల్లికి చెందిన రైతు జీ. హరినాథ్ అన్నారు. మొత్తం 400 టన్నుల కూరగాయాలను కొనుగోలు చేసి పేదలకు ఆయా జిల్లాలోని దాదాపు లక్ష మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. దాదాపు 13 టన్నుల చిలకడ దుంప, 40 టన్నుల టమాటో, 2 టన్నుల క్యాబేజీ, 3 టన్నుల వంకాయలు, 5 టన్నుల క్యారెట్ పంటలను చిత్తూరు జిల్లా రైతుల నుంచే కొనుగోలు చేయటం విశేషం. వీటిని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఉచితంగా పంపిణీ చేసినట్టు, నిర్వహకులు ప్రేమ్ కళ్యాణ్ వెల్లడించారు. టమాటో ఛాలెంజ్ను సేవగా భావించిన యువకులు వారివారి జిల్లాలలో ఉచిత కూరగాయల పంపిణీని చేపట్టారు. దాదాపు 200 మంది రైతలు ఈ ఛాలెంజ్ ద్వారా తమపంటను సరైన ధరకు అమ్ముకోగలిగారని సాధారణంగా మొదలైన ఈ ఛాలెంజ్ ఈ స్థాయిలో విజయవంతం కావడం ఆనందంగా ఉందని అమెరికాలో నివాసం ఉంటున్న డా.వాసుదేవ రెడ్డి అన్నారు. ఈ విజయం అందుకున్న తర్వాత రైతులకు అండగా నిలిచేందుకు అమెరికన్ తెలుగు అసోసేషన్ ఫర్ ఫార్మర్స్ (ఏటీఏఎఫ్ఎఫ్) అనే సంస్థను ప్రారంభించినట్టు వాసుదేవ్ చెప్పారు. ఈ స్వచ్ఛంధ సంస్థ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలన్న యోచనలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది తొలి విజయం.. ఈ విజయం మరిన్ని విజయాలకు పునాది అవుతుందని విశ్వశిస్తున్నాం,’’ అని ఈ యువ వైద్యులు చెబుతున్నారు. -
టమాటో చాలెంజ్..
నెల్లూరు, మనుబోలు: లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఆదుకునేందుకు ఎన్నారైలు వినూత్న యత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు నష్టపోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వారు ఓ చాలెంజ్ విసిరారు. నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. భారీ ఎత్తున వాటిని కొనుగోలు చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న ఇతర జిల్లాల వాసులకు కూడా ఉచితంగా పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని మనుబోలులో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. లాక్డౌన్ సమయంలో గిట్టుబాటు ధర లభించకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు ఇబ్బందులు పడుతున్న అంశం సోషల్ మీడియాలో వైరలైంది. ఈ క్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఫార్మర్స్ (ఏటీఏఎఫ్ఎఫ్) సభ్యులు టమాటో రైతుల కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకునేందుకు ఓ చాలెంజ్ విసిరారు. దీనికి పలువురు ఎన్నారైలు స్పందించారు. చిత్తూరు జిల్లాలో రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీటిని ప్రజల అవసరాల మేరకు ఇతర జిల్లాలకు కూడా తరలించి పేదలను ఆదుకుంటున్నారు. టమాటోలతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్, వంకాయలను కలిపి నాలుగు టన్నుల కూరగాయలను మనుబోలులోని రైతుభరోసా కేంద్రానికి తరలించారు. వీటిని ప్యాకింగ్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో స్థానిక సీఎం నగర్, ఎరుకల కాలనీ, అరుంధతీయవాడల్లో ఉచితంగా పంపిణీ చేశారు. పొదలకూరు మండలంలోనూ కూరగాయలను అందజేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని తెచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎన్నారైలు తెలిపారు. జిల్లాకు చెందిన ఎన్నారైలు చింతగుంట సుబ్బారెడ్డి, ప్రేమ్కల్యాణ్రెడ్డి కూరగాయల కొనుగోలు, పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, చల్లా రవీంద్ర, నవకోటి, భాస్కర్గౌడ్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
150 కిలోల టమాటాలకు కిలో మటన్
సాక్షి, ఇందల్వాయి: 150 కిలోల టమాటాలకు కిలో మటన్ ఏమిటీ అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన టమాట రైతు నోముల శ్రీనివాస్ రెడ్డి తన పొలంలో పండిన 150 కిలోల టమాటాలను ఇందల్వాయి మార్కెట్లో ఆదివారం హోల్సేల్గా విక్రయిస్తే అతనికి వచ్చింది కేవలం రూ.500 మాత్రమే వచ్చాయి. ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తీసుకెళ్దామని అక్కడే ఉన్న మటన్ దుకాణానికి వెళ్తే కిలో మటన్ రూ.550 ఉండటంతో మరో రూ.50 వేసి కొనాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా టమాటాలు కొనేవారు కరువయ్యారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. (టమాట రైతులకు కన్నీళ్లే గిట్టుబాటు!) -
కన్నీళ్లే గిట్టుబాటు!
టమాట రైతులను కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. మూడు నెలలపాటు శ్రమిస్తే.. వారికి నష్టాలే మిగిలాయి. టమాటను తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులూ వెళ్లని దుర్భరస్థితి. కరోనా కాటు నేపథ్యంలో విధించిన లాక్డౌన్.. టమాట రైతుల పొట్టకొడుతోంది. ఎంతో ఆశతో పంట సాగుచేసిన రైతులు ధరలు లేక దిగాలు చెందుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: కూరగాయల సాగుకు జిల్లాకు పెట్టింది పేరు. ముఖ్యంగా టమాట గణనీయంగా సాగవుతోంది. రబీ సీజన్లో సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను రైతులు చేశారు. ఇందులో ఎక్కువ భాగం టమాటదే. 7,752 ఎకరాల్లో ఆరు వేల మంది రైతులు టమాట సాగు చేశారు. గరిష్టంగా 8 టన్నుల దిగుబడి వస్తుంది. కనిష్టంగా ఆరు టన్నుల పంట తీయవచ్చు. ఇలా ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 62 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం పెద్ద ఎత్తున పంట మార్కెట్కు వస్తోంది. అయితే, ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. కిలో టమాటకు కనీసం రూ.3 కూడా దక్కడం లేదు. 25 కిలోలు ఉండే బాక్సును మార్కెట్లోకి తీసుకెళ్తే.. కనీసం రూ.40 కూడా దక్కని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. రూ.40 వేల పెట్టుబడి పెట్టి ఒక్కో ఎకరాలో సాగు చేసిన రైతుకు.. పెట్టుబడుల్లో కనీసం నాలుగో వంతు కూడా రావడం లేదు. తెంపిన కూలీ, మార్కెట్కు రవాణా ఖర్చులు కూడా వెళ్లడం లేదు. దీంతో చాలా మంది రైతులు తెంపకుండా పంటను వదిలేశారు. షాబాద్ మండలం కేశవగూడలో చేనులోనే వదిలేసిన టమాటాలు ఎందుకీ పరిస్థితి..? సాధారణంగా వేసవిలో టమాటకు చెప్పుకోదగ్గ రీతిలో ధర ఉంటుంది. లాక్డౌన్ కొనసాగుతుండటమే ధరలు లేదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో వచ్చిన దిగుబడిలో 50 శాతం నగరంలోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, కొత్తపేట రైతుబజార్, ఎన్టీఆర్ నగర్ మార్కెట్కి వెళ్తుంది. ఇక్కడ నగర అవరాలకుపోను మిగిలింది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. మిగిలిన 50 శాతం పంటలో కొంత జిల్లా ప్రజల అవసరాలకుపోను.. తక్కింది నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు రైతులు తీసుకెళ్తారు. లాక్డౌన్ కావడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. నగరంలో నివసించే వారిలో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లారు. అలాగే శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. అంతేగాక గత రబీ సీజన్తో పోల్చితే ఈ సారి దాదాపు 1,300 ఎకరాల్లో అధికంగా పంట సాగైంది. దీంతో డిమాండ్ తక్కువగా ఉండి.. దిగుబడి ఎక్కువైంది. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు చేవెళ్ల: చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామానికి చెందిన రైతు వీరేశం ఎకరం విస్తీర్ణంలో వంకాయలు, రెండు ఎకరాల్లో టమాట పంట సాగుచేశాడు. రూ.50వేలకు పైగానే పెట్టుబడికింద ఖర్చు చేశాడు. వేసవి కాలం పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయని, ఈ సీజన్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించాడు. బోరుబావిలో నీళ్లు తగ్గుతున్నా రోజు విడిచి రోజు ఎంతో కష్టపడి పంటలను బతికించుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. కానీ, మార్కెట్లో ధరలు లేవు. వంకాయ కిలో రూ.5లోపే పలుకుతోంది. టమాటలు సైతం కిలో రూ.3 నుంచి రూ.5 పలుకుతున్నాయి. కూరగాయలను మార్కెట్కు తీసుకువస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. లాక్డౌన్ కారణంగా కూరగాయలు బయట మార్కెట్లకు పోవటం లేదు. వ్యాపారులు కూడా రావటం లేదు. స్థానిక మార్కెట్లో కొంత మంది రైతులవి చిరువ్యాపారులు కొంటున్నారు. దీంతో కొన్ని మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఎంతో కష్టపడి పంట సాగుచేస్తే ఖర్చులు కూడా రావడం లేదని వీరేశం ఆవేదన వ్యక్తం చేశాడు. బాక్స్ ధర రూ.150 పలికితేనే రైతుకు ఊరట చేవెళ్ల: నందిగామ మండలం శ్రీనివాసులగూడెం గ్రామానికి చెందిన రైతు ఎల్.మల్లారెడ్డి రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ప్రస్తుతం దిగుబడి వస్తోంది. చేవెళ్ల మార్కెట్కు గురువారం 57 టమాట బాక్స్లను తీసుకొచ్చాడు. మార్కెట్లో ఒక బాక్స్(25కిలోలు) రూ.60కి అమ్ముడుపోగా.. మార్కెట్ ఫీజులు, హమాలీపోను ఆయన చేతికి రూ.3వేలు వచ్చాయి. ఇంకా ఆటో కిరాయి వెయ్యి రూపాయలు, టమాటలు తెంపిన కూలీలకు వెయ్యి రూపాయలు పోతే మిగిలింది చివరకు ఆయన మిగిలింది వెయ్యి రూపాయలే. రెండు ఎకరాల టమాట పంటను సాగు చేసేందుకు దాదాపు 30 వేలకుపైగా ఖర్చుచేశాడు. ఇవే ధరలు ఉంటే అతని చేతికి వచ్చేది దాదాపు 5వేలే. ఈ ఐదు వేలలో.. తాను పెట్టిన పెట్టుబడులు రావాలి, కుటుంబం గడవాలి. ఎలా సాధ్యమవుతుందని మల్లారెడ్డి వాపోయాడు. బాక్స్ టామాట ధర కనీసం రూ.150 పలికితే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయని అన్నాడు. -
తాజాగా తినండి
మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నుంచి కొద్దిగా ముందుకు వెళితే, జనంతో కిటకిటలాడుతూ ‘తాజా కిచెన్’ కనిపిస్తుంది. ఎంతోమంది విద్యార్థులకు అదొక అక్షయపాత్రలాంటిది. అతి తక్కువ ధరకే మూడు పూటలా కడుపు నింపుతుంది. అక్కడకు బెంజ్, ఆడి కార్లతోపాటు, మున్సిపల్ ఉద్యోగులు కూడా వస్తుంటారు. కడుపు నింపుకుని, సంతృప్తిగా త్రేన్చి వెళ్తుంటారు. అదే ‘తాజా కిచెన్’ ‘మా దగ్గరకు రకరకాల వారు వచ్చి టిఫిన్లు తిని వెళ్తుంటారు. రుచి పరీక్షించడం కోసం కార్లలో వస్తుంటే, కడుపు నింపుకోవటం కోసం సామాన్య ఉద్యోగులు వస్తుంటారు. అందరూ చాలా బాగుందని మెచ్చుకుని వెళ్తుంటారు’ అంటారు బిఎస్సి చదువుకున్న ‘తాజా కిచెన్’ యజమాని విఘ్నేశ్. బెంగళూరులో ‘తాజా తిండి’ (తిండి అంటే కన్నడలో టిఫిన్ అని అర్థం) పేరున సుమారు పది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆలోచన నుంచి ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభమైంది. విదేశాలలో పర్యటించిన శ్రీనివాస్ భారతదేశంలో అతి తక్కువ ధరకు పరిశుభ్రమైన ఆహారం అందించాలనుకున్నారు. అలా ప్రారంభమైంది ‘తాజా తిండి’. అదే పద్ధతిలో హైదరాబాద్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించడం కోసం ‘తాజా కిచెన్’ను ప్రారంభించారు. ‘వంద మందికి ఎక్కువ ధరలకు టిఫిన్ పెట్టి, ఎక్కువ లాభం సంపాదించటం కంటె, వెయ్యి మందికి తక్కువ ధరకు అందించి అదే లాభాన్ని సంపాదించటం న్యాయం అనిపించింది. ఆరోగ్యకరమైన పదార్థాలను, అతి తక్కువ ధరలకు అందించటమే మా లక్ష్యం’ అంటారు విఘ్నేష్. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశపు శాకాహార వంటకాలను అందిçస్తూ, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు వీరు. అందమైన అలంకారాలతో కూడిన వాతావరణంలో మనసుకి ఆహ్లాదం కలిగించేలా పచ్చటి వెదురు చెట్ల నీడన ఫలహారాలు అందిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన వాళ్లకి మెనూ కార్డు ఇవ్వవలసిన అవసరం ఉండదు. బోర్డు మీద వాటి పేర్లు, ధరలతో పాటు, పక్కనే ఉన్న టీవీలో వాటి తయారీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ వచ్చిన వారిలో కొందరు అల్లం చట్నీ లేదని, సాంబారు లేదనీ గొడవ పడుతుంటారు. బెంగళూరులోని వందేళ్లనాటి ‘బ్రాహ్మిన్స్ కాఫీ బార్’ లో మాత్రమే తయారయ్యే చట్నీలను తయారు చేస్తున్నాం. పాతతరం సంప్రదాయ చట్నీలను మాత్రమే తయారుచేసి, అందిస్తామని అర్థమయ్యేలా చెబుతాం. చట్నీ మారు వడ్డించుకోవాలంటే, కౌంటర్ దాకా వెళ్లి నిరీక్షించాల్సిన పని లేదు. అది కూడా వారికి అందుబాటులో ఉంచుతాం. ఏ పదార్థమూ, వస్తువూ వృధా కాకుండా జాగ్రత్తపడతాం. ఆయా టిఫిన్లకి అనుకూలమైన విధంగా ప్లేట్లు తయారుచేయించాం. ప్లేట్లను ఎప్పటికప్పుడు డిష్ వాషర్లో వేడి నీళ్లతో శుభ్రం చేస్తాం. ప్లాస్టిక్ వాడకానికి పూర్తి వ్యతిరేకం. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాం. మంచినీళ్ల బాటిల్స్ అమ్మకం పూర్తిగా నిషేధం. అన్నిటినీ స్టిరైల్ చేసి వాడతాం. – అనంత్, మేనేజర్ ఇక్కడ మేం ఈ సెంటర్ ప్రారంభించాలనుకున్నప్పుడు ‘కర్ణాటక ఫుడ్ ఎవరు తింటారు?’ అని నిరుత్సాహపరిచారు. మిగిలిన అంతర్జాతీయ పదార్థాలను తింటున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు తినరు అని పట్టుదలగా ప్రారంభించాం. అందరూ ఆదరిస్తున్నారు. వంటవారిని కర్ణాటక నుంచి తీసుకువచ్చాం. వడ్డించిన పదార్థాలు ప్లేటులో నుంచి కిందకు పడిపోకుండా, చేతులు కాలకుండా ఉండాలనే లక్ష్యంతో మందంగా ఉండే ప్లేట్లు తయారుచేయించాం. కృత్రిమ పదార్థాలను అస్సలు ఉపయోగించం. మాది ఓపెన్కిచెన్. లోపలకు వచ్చి ఎవ్వరైనా చూసుకోవచ్చు. టైమింగ్స్ విషయంలో కరెక్ట్గా ఉంటాం. లేదంటే కిచెన్ క్లీనింగ్ కుదరదు. పేరుకి తగ్గట్లుగా అన్నీ తాజా వస్తువులే ఉపయోగిస్తాం. హైదరాబాద్లో.. టిఫిన్ కోసం నిలబడి, టోకెన్ తీసుకుని, ఆనందంగా తినటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ప్రముఖ సినీ దర్శకులు ఏ.ఎం. రత్నం, క్రిష్, తరుణ్భాస్కర్ వంటి వారంతా ‘తాజా కిచెన్’ టిఫిన్లను రుచి చూసి ప్రశంసించారు. – విఘ్నేష్, యజమాని -
టొమాటో మాటున ఆరోగ్యం
ప్రాచీన భారతదేశీయ వైద్యమైన ఆయుర్వేదంలో టొమాటో ప్రస్తావన లేదు. ఇది మన దేశపు పంట కాకపోవటమే ఇందుకు కారణం. మౌలికంగా ఇది అమెరికా సీమకు చెందినది. క్రీ.శ. 7వ శతాబ్దంలో పెరూ, చిలీ, బొలీవియా దేశాలలో ఈ పంట ప్రారంభమైంది. అనంతరం 16వ శతాబ్దం లో ఐరోపా వాసులకు పరిచయమైంది. తదనంతరం పోర్చుగీసు వారి ద్వారా భారతదేశానికి సంక్రమించింది. ఈ పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రక్త వర్ణానికి భయపడి ప్రారంభదశలో దీనిని విషతుల్యంగా భావించి తినేవారు కాదు. క్రమేణా దీని రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించటం మొదలైంది. వాస్తవానికి ఈ చెట్టు కాండంలోనూ, ఆకులలోనూ ఉండే సొలానిన్ అనే పదార్థం దుర్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే ఏ జంతువూ ఈ చెట్ల జోలికి పోదు. దీంట్లో ప్రధానంగా పులుపు, తీపి రుచులు ఉంటాయి. కొద్దిగా లవణ రసం (ఉప్పగా) కూడా ఉంటుంది. కనుక ఏ కూరగాయలతో దీనిని కలిపి వండినా, పచ్చిగా సేవించినా వాటి రుచి మరింత పెరుగుతుంది. వాతహరంగా ఉపకరిస్తుంది. ఆధునికశాస్త్రరీత్యా పోషక విలువలు సుమారుగా ఒక కప్పు (150 గ్రా.) టొమాటో పండ్లలోని పోషక విలువల శాతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. క్యాలరీలు (శక్తి) 1%, పిండి పదార్థాలు 2%, ఆహారపు పీచు 7%, శర్కర 2.8%, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్ 3%. విటమిన్లు ఎ – 25%, సి – 32%, ఇ – 4%, కె –15%, బీ కాంప్లెక్సు – సరాసరి 4% ఖనిజ లవణాలు (మినరల్స్) క్యాల్షియం– 1%, ఐరన్ – 4%, మెగ్నీషియం – 4%, ఫాస్ఫరస్ – 4% జింక్ – 2%, కాపర్ – 4%, మాంగనీసు – 8%, పొటాషియం–10%. లైకోపిన్, ల్యూటిన్, బీటాకొరెటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఉండనివి (శూన్యం) కొలెస్టరాల్, స్టార్చ్, సోడియం, సెలీనియం (విషం), విటమిన్ డి అండ్ బి12. ప్రయోజనాలు: వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి, కంటి చూపు మెరుగుపడతాయి. కేశాలు దృఢంగా పెరుగుతాయి. గుండెకు బలం, కండరాల శక్తి పెరుగుతాయి. అధిక రక్త్తపీడనం (అధిక బీపీ) అదుపులోకి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి రోగాలను దరిచేరనీయదు. బరువు తగ్గేవారికి ఇదిమంచి ఆహారం. శరీరానికి నీటి శాతం పుష్కలంగా అందుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకోలీతో టొమాటోను కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్, పాంక్రియాసిస్ క్యాన్సర్లు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. గమనిక: దీంట్లో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక ‘మూత్రపిండాలలో రాళ్లు’ వ్యాధిగ్రస్తులు దీనిని సేవించరాదు. -
టేస్టీ టొమేటి
టొమాటో కొనకుండా కూరగాయలు కొనటం పూర్తి కాదు. ఏ వంటలోనైనా పడక తప్పని కాయగూర టొమాటో. కాని టొమాటోకే ఒక అస్థిత్వం ఉంది. దానికంటూ కొన్ని రెసిపీలున్నాయి. అది చేసే కొన్ని మేళ్లు ఉన్నాయి. అది చూపే కొన్ని రుచులు ఉన్నాయి. పిజ్జా సాస్, టొమాటో సాస్, టొమాటో షోర్బా, టొమాటో ఖజూర్ చట్నీ, టొమాటో చోకా... వీటిని ప్రయత్నించండి, టొమాటోనే మేటి అనండి. టొమాటో చోకా కావలసినవి: టొమాటోలు – 200 గ్రా; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; ఆవ నూనె – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడిగా ఉన్న గ్రిల్ మీద ఉంచి కాల్చాలి (పెనం మీద కూడా వేడి చేసుకోవచ్చు) ∙బాగా కాలే వరకు ముందుకి, వెనక్కు తిప్పుతూ కాల్చి తీసేసి, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక తొక్కలు తీసేసి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఆవ నూనె, నిమ్మ రసం జత చేయాలి ∙ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి ∙పరాఠా, చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. పిజ్జా సాస్ కావలసినవి: టొమాటో ముక్కలు – 3 కప్పులు; వెల్లుల్లి తరుగు – టీ స్పూను; పుదీనా – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – తగినంత. తయారీ ►టొమాటోలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి గుజ్జు చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి నాలుగైదు నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి ►గుజ్జు బాగా ఉడికిన తరవాత, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి జత చేసి, దింపేయాలి ►పిజ్జా మీద సాస్ వేసి సర్వ్ చేయాలి. టొమాటో సాస్ కావలసినవి: టొమాటోలు – రెండున్నర కిలోలు; వెల్లుల్లిరెబ్బలు – 15; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; కిస్మిస్ – అర కప్పు; వైట్ వెనిగర్ – అర కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక కప్పు; సోడియం బెంజోట్ – పావు టీ స్పూను. తయారీ: ∙టొమాటోలను నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి ∙స్టౌమీద పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి, ఎండు మిర్చి, కిస్మిస్, వైట్ వెనిగర్, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలియబెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) టొమాటో గుజ్జు బాగా ఉడికి చిక్కబడ్డాక దింపి (సుమారు అరగంట సమయం పడుతుంది) చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి, జల్లెడ పట్టాలి ∙ఈ గుజ్జును ఒక పెద్ద పాత్రలో వేసి మరోమారు స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూను నీళ్లు, పావు టీ స్పూను సోడియం బెంజోట్ వేసి కరిగేవరకు కలిపి, తయారైన కెచప్లో వేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక జాడీలోకి తీసుకుని భద్రపరచుకోవాలి ∙ఫ్రిజ్లో ఉంచి, రెండు రోజుల తరవాత వాడుకోవాలి. టొమాటో ఖజూర్ చట్నీ కావలసినవి: ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; పాంచ్ పోరన్ (మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, సోంపు) – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; అల్లం తురుము – అర టీ స్పూను; టొమాటోలు – పావు కేజీ; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేడి చేశాక, పాంచ్ పోరన్ జత చేసి వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙అల్లం తురుము జత చేసి, కొద్దిసేపు వేయించాలి ∙టొమాటో తరుగు జత చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి, మూత ఉంచి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి ∙మెత్తగా ఉడికిన తరవాత కిస్మిస్, ఖర్జూరాల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార, ఆమ్చూర్ పొడి జత చేసి మరోమారు కలిపి, మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపి, చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి (ఫ్రిజ్లో ఉంచితే సుమారు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది). టొమాటో షోర్బా కావలసినవి: టొమాటో తరుగు – 2 కప్పులు; నూనె – అర టేబుల్ స్పూను; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత. తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙టొమాటో గుజ్జు, బిర్యానీ ఆకు జత చేసి బాగా కలపాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ∙రెండు కప్పుల నీళ్లు జత చేయాలి ∙మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఉప్పు జత చేయాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి దింపేయాలి ∙ఇది వెజ్ పులావు, కాజూ రైస్, జీరా రైస్లతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. -
వంట చేను
బంగాళదుంప, పాలకూర, కీరదోస, టొమాటో, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, యాపిల్... ప్రతి కూరగాయ, పండు.. పొలం నుంచి మన ఇంటికి వచ్చే లోపు ఎన్నో మజిలీలు తీసుకుంటుంది. ప్రతి దశలోనూ ఈ కూరగాయలు నేలను తాకుతాయి, మట్టిలో ఈదుతాయి. పండ్ల మీద పురుగులు దాడి చేస్తుంటాయి. పంట చేనులో మొదలయ్యే కల్మషం వంట చేను వరకు ప్రయాణిస్తుంది. కాౖయెనా, ఆకైనా, పండైనా మన కడుపులోకి వెళ్లే ముందు వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా శుభ్రం చేయడానికి జాతీయ, అంతర్జాతీయ పోషకాహార నిపుణులు సూచించిన ఓ ఐదు రకాల పద్ధతులను చూద్దాం. చన్నీటి ధార కింద కడగడం ఇది అత్యంత సులువైన పద్ధతి. కూరగాయలను ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని నింపాలి. నాలుగైదు నిమిషాల తర్వాత వాటిని ఆ నీటిలో నుంచి తీసి నీటి ధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. ఇలా కడిగిన వాటిని మళ్లీ ఒకసారి పాత్రలో నిండుగా నీరు పోసి కడిగి ఆ నీటిని వంపేయాలి. పండ్లు అయినా ఇదే పద్ధతి. పుట్ట గొడుగులను నీటి ధార కింద పెట్టి కడిగితే అవి నలిగిపోతాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత వాటిని తడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత నీటిలో ముంచి తేలిగ్గా వేళ్లతో రుద్ది కడగాలి. వెనిగర్ నీటితో కడగడం ఒక లీటరు నీటిలో పది మిల్లీలీటర్ల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంలో కూరగాయలను నానబెట్టి, ఇరవై నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచి నీటిలో ముంచి కడగాలి. ఉప్పు నీటితో పండ్లను, కూరగాయలను వెనిగర్ నీటికి బదులుగా ఉప్పు నీరు లేదా బేకింగ్ సోడా నీటితో కూడా శుభ్రం చేయవచ్చు. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ ఉప్పు కానీ కలపాలి. ఆ నీటిలో కూరగాయలను ఐదు నిమిషాల సేపు ఉంచాలి. పండ్లు అయితే అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత తిరిగి మంచి నీటితో కడగాలి. బ్లాంచింగ్ ఇది వేడి నీటితో శుభ్రం చేసే ప్రక్రియ. వెడల్పు పాత్రలో నీటిని మరిగించి స్టవ్ ఆపేసి కూరగాయలను వేయాలి. రెండు లేదా మూడు నిమిషాల లోపే వాటిని తీసి చన్నీటి పాత్రలో వేయాలి. వెనిగర్ స్ప్రే దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. ఉపయోగించే ముందు బాటిల్ను బాగా కదిలించి కొద్ది మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని కూరగాయలకు, పండ్లకు పట్టించి ఒక నిమిషం పాటు రుద్ది తర్వాత చన్నీటితో కడగాలి. జీర్ణవ్యవస్థలో ఎదురయ్యే అనేక అసౌకర్యాలకు కారణం కూరగాయలు, పండ్లను సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోవడమే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు. -
పొట్టకు హుచారు
పండగ హడావుడి ముగిసింది. అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా సాగి ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్ టేబుల్ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి. నిమ్మరసం – కొత్తిమీర రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు (తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి); పసుపు – పావు టీ స్పూను. పొడి కోసం: కొత్తిమీర – అర కప్పు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5 పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఎండు మిర్చి – 2; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నిమ్మ రసం – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేయాలి ►మిక్సీలో అర కప్పు కొత్తిమీర, రెండు టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, రెండు పచ్చి మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, అర టీ స్పూను ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►కొత్తిమీర మిశ్రమం జత చేయాలి ∙ఇంగువ, పసుపు జత చేసి మరోమారు కలపాలి ►పప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాక, దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి కలియబెట్టాలి ►కొత్తిమీరతో అలంకరించాలి. మైసూర్ రసం కావలసినవి: పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్లు ; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టొమాటో తరుగు – అర కప్పు; చింతపండు రసం – ఒక కప్పు (పల్చగా ఉండాలి); కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; బెల్లం పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ముప్పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించి మరోమారు వేయించాలి ►కొబ్బరి తురుము జత చేసి మరి కాసేపు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో ముందుగా టొమాటో గుజ్జు, చింతపండు రసం వేసి ఉడికించాలి ►కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి జతచేసి బాగా కలిపి మరిగించాలి ►ఉడికించిన కందిపప్పు, నీళ్లు జత చేసి కొద్దిసేపు మరిగించాలి ►తయారుచేసి ఉంచుకున్న మైసూర్ రసం పొడి జత చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, మరుగుతున్న రసంలో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. మిరియాలు జీలకర్ర రసం కావలసినవి: మిరియాలు – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 7. చింతపండు – అర టేబుల్ స్పూను (అర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి); టొమాటో తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు –పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ►చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి ►మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి ►కరివేపాకు, మిరియాల పొడి మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ►చింతపండు రసం, నీళ్లు, ఉప్పు జత చేసి, బాగా కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►సుమారు పావు గంట సేపు మరిగించాక దింపేయాలి. పైనాపిల్ రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు; నీళ్లు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనా పిల్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; రసం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. పొడి కోసం: జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు –ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 పోపు కోసం: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపి, పప్పు గుత్తితో మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ►మిక్సీలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు (పొడి కోసం చెప్పిన వస్తువులు) వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి, తీసి పక్కన ఉంచాలి ►అర కప్పు పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►పావు కప్పు టొమాటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి, తీసి పక్కనుంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర టేబుల్స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►మిరియాల పొడి మిశ్రమం జత చేసి కొద్దిసేపు వేయించాలి ►కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి బాగా వేయించాలి ►పైనాపిల్ గుజ్జు జత చేసి రెండు నిమిషాల పాటు వేయించాక, ఉడికించిన పప్పు జతచేసి బాగా కలపాలి ►పైనాపిల్ తరుగు, టొమాటో తరుగు, ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి, బాగా కలపాలి ►రెండు టీ స్పూన్ల రసం పొడి వేసి బాగా కలియబెట్టాలి ►పదినిమిషాల పాటు మరిగించాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పన్నీర్ రసం కావలసినవి: చింత పండు – నిమ్మకాయంత; నీళ్లు – 3 కప్పులు; రోజ్ వాటర్ (పన్నీరు) – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 3; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; రోజ్ పెటల్స్ – కొన్ని ; ఉప్పు – తగినంత; పంచదార – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను. తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాక, ఉడికించిన పప్పు నీళ్లు జత చేయాలి ►తగినంత ఉప్పు, పంచదార వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె/నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చింతపండు రసం జత చేయాలి ►రెండు నిమిషాల పాటు మరిగాక దింపేసి, రోజ్ వాటర్ జత చేయాలి ►కొత్తిమీర, గులాబీ రేకలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. టొమాటో చారు చారుకావలసినవి: బాగా పండిన టొమాటో తరుగు – 2 కప్పులు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); నీళ్లు – 2 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 4; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; బెల్లం పొడి – అర టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను పొడి కోసం: ఎండు మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక పచ్చి సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, మిరియాలు జత చేసి బాగా వేయించాక, జీలకర్ర జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే, చారు పొడి సిద్ధమైనట్లే. ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడం మొదలయ్యాక, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ►కరివేపాకు జత చేసి ఒక నిమిషం వేయించాక, టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో గుజ్జు బాగా మెత్తబడ్డాక, వెల్లుల్లి తరుగు, చింత పండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ►నీళ్లు పోసి మరిగించాక, మంట బాగా తగ్గించి, రసం పొడి జత చేయాలి ►కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి, మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది ►సూప్లా తాగినా కూడా రుచిగానే ఉంటుంది. -
క్యాలీ ఫ్లేవర్
క్యాలీ ఫ్లవర్ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కూర పువ్వు ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయండి. క్యాలీఫ్లవర్ బటర్ మసాలా కర్రీ కావలసినవి: – క్యాలీఫ్లవర్ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్ – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; జీడిపప్పు పలుకులు – 12; కసూరీ మేథీ – అర టీ స్పూను; తాజా క్రీమ్ – పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నీళ్లు, పసుపు వేసి మరిగించాలి ►క్యాలీఫ్లవర్ తరుగును జత చేసి కొద్దిగా ఉడికించి, క్యాలీఫ్లవర్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►స్టౌ మీద పాన్లో బటర్ వేసి కరిగాక క్యాలీఫ్లవర్ తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి మూత ఉంచి పది నిమిషాలు ఉడికించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త బటర్ వేసి కరిగాక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం వేసి టొమాటో తరుగు ఉడికేవరకు కలిపి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక నూనె వేసి కాగాక, ఈ మసాలా ముద్దను అందులో వేసి బాగా కలిపి, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు జత చేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►తాజా క్రీమ్, కసూరీ మేథీ జత చేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి. ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1 (మీడియం సైజు); నూనె – 6 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; బంగాళ దుంప – 1 (పెద్దది, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టే బుల్ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ ►గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, పసుపు, బంగాళ దుంప ముక్కలు వేసి బాగా వేయించి, ముక్కలు మెత్తపడేవరకు మూత ఉంచాలి ►క్యాలీ ఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మూత ఉంచాలి ►క్యాప్సికమ్ తరుగు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి (ముక్కలు మరీ మెత్తగా అవకూడదు) ►మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి ►టొమాటో తరుగు జత చేసి మరోమారు కలిపి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►కొత్తిమీర తరుగు జత చేసి దింపేయాలి ►గోబీ ధాబా స్టయిల్ కూర రెడీ అన్నం, రోటీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఫ్రై కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – 3 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; సోంపు – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి ►క్యాలీఫ్లవర్ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలియబెట్టాలి (నీళ్లు పోయకూడదు) మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీ ఫ్లవర్ తోరణ్ (కేరళ స్టయిల్) కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1; ఉల్లి తరుగు – ఒక కప్పు; కొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్ను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర వేసి వేయించాలి ►మినప్పప్పు వేసి మరోమారు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, పసుపు, కరివేపాకు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, క్యాలీఫ్లవర్ మెత్తబడే వరకు ఉడికించాలి ►కొబ్బరి తురుము వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచి దింపేయాలి అన్నంలో రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కుర్మా కావలసినవి: –క్యాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు; క్యారట్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 2; టొమాటో గుజ్జు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; కరివేపాకు – రెండు రెమ్మలు; పల్చటి కొబ్బరి పాలు – ఒక కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – అర కప్పు ; ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – 10; నూనె – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద ఒక పెద్ద పాత్రలో నీళ్లు, క్యాలీ ఫ్లవర్ తరుగు, క్యారట్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి ఉడికించాక, దింపి నీళ్లు ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు, మిరప కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి ►పల్చటి కొబ్బరి పాలు, ఉప్పు, కూరముక్కలు వేసి ఉడికించాలి ►ఐదారు నిమిషాల తరవాత బాగా ఉడికిందనుకున్న తరవాత చిక్కటి పాలు, జీడిపప్పు పలుకులు జత చేసి కలిపి దింపేయాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి ►రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది. గోబీ మసాలా కావలసినవి: – క్యాలీఫ్లవర్ – చిన్నది (ఒకటి); పసుపు – అర టీ స్పూను; ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; బిర్యానీ ఆకు – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టీ స్పూన్లు + ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; గరం మసాలా – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; టొమాటో గుజ్జు – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; జీడిపప్పు ముక్కలు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►క్యాలీఫ్లవర్ను చిన్నచిన్నగా విడదీసి పక్కన ఉంచాలి ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడిగి బయటకు తీసేయాలి ►ఒక పాత్రలో క్యాలీఫ్లవర్ తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల తరవాత తీసేయాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మంట కొద్దిగా తగ్గించి నూనె వేసి, కాగాక అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►ఆ బాణలిలో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు, రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, టొమాటో గుజ్జు అన్నీ వేసి బాగా కలియబెట్టాలి ►వేయించిన ఉల్లి తరుగు, మిరప కారం, ఒక కప్పు నీళ్లు జత చేసి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాల తరవాత తాజా క్రీమ్, గరం మసాలా పొడి, నెయ్యి వేసి కలియబెట్టాలి ►జీడిపప్పులతో అలంకరించి తందూరీ రోటీతో కాని, అన్నంతో కాని వేడివేడిగా అందించాలి ►ఈ కూర మనమే తయారుచేసుకుంటే ఇంక రెస్టారెంట్ మీద ఆధారపడక్కర లేదు. మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్ కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; లవంగాలు – 2; ఏలకులు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – 1; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిక్స్డ్ స్ప్రౌట్స్ – ఒక కప్పు (పెసలు, సెనగలు, పల్లీలు... నచ్చినవన్నీ); చెన్నా మసాలా – అర టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – మూడున్నర కప్పులు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పుదీనా – కొద్దిగా. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా వేయించాలి ►చెన్న మసాలా, చాట్ మసాలా, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరవాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి, ఉడికించాలి ►కొద్దిగా ఉడికిన తరవాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికించాలి పావు గంట తరవాత మూత తీసి, ప్లేట్లోకి తీసుకోవాలి ►వేడివేడిగా అందించాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ముఖ కాంతికి పెరుగు, క్యారెట్
సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్ ప్యాక్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది. ►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది. ►రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ►రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది. -
దాహంగా లేదా? అయినా తాగాలి
వర్షాకాలం చర్మ సమస్యలు తరచూ బాధిస్తుంటాయి. అయితే వంటగదిలో వాడే కొన్ని దినుసులు, పదార్థాలతో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం. ►వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీటితో ముఖాన్ని తప్పక శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునేముందు రోజ్వాటర్ని దూదితో అద్దుకొని ముఖమంతా తుడిచి, నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తల వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మ కాంతి పెరుగుతుంది. ►ఈ కాలం ఫౌండేషన్, పౌడర్లను ఎంత తక్కువ వాడితే చర్మానికి అంత మంచిది. నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్లను కూడా తగ్గించాలి. తరచూ నీళ్లలో తడవడం వల్ల చర్మంపై పోర్స్ (రంధ్రాలు) తెరుచుకుంటాయి. ఇలాంటప్పుడు ఫౌండేషన్, పౌడర్ పోర్స్లోకి వెళ్లిపోయి ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, యాక్నె సమస్యలు తలెత్తుతాయి. ►టొమాటో రసం ముఖానికి, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మంపై జిడ్డు తగ్గుతుంది. పైనాపిల్, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు లేదా జ్యూస్లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ►ఓట్స్లో తేనె, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసి ముఖానికి చేతులకు, పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మకాంతి పెరుగుతుంది. ►తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు సమపాళ్లలో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని పదినిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. పొడి చర్మానికి ఇది మేలైన ప్యాక్. పొడి చర్మం గలవారు బాదంపప్పు పొడి, తేనె కలిపి కూడా వాడుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారైతే ఆరెంజ్ ఆయిల్, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ►ఈ కాలం రకరకాల అలర్జీలు తలెత్తుతుంటాయి. ఇవి చర్మం సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లు గల సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ►ఈ కాలం దాహంగా అనిపించదు. కానీ, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడడం సమస్య దరిచేరదు. చర్మం పొడిబారి జీవం లేకుండా ఉంటే పైపైన మాయిశ్చరైజర్ వాడాలి. జిడ్డు చర్మం అయితే రోజుకు రెండు సార్లు తప్పక శుభ్రపరుచుకోవాలి. -
ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు
బ్రిటన్లోని ప్రతి ఇంటి వంటింటి కంబోర్డుల్లో నిగనిగలాడుతున్న ఎర్రటి ఇటలీ టమోటాలు మెరిసిపోతుంటాయి. వండకుండానే వాటిని అలాగే నమిలి తినేయాలనిపిస్తుంది. వాటి పక్కనే రకరకాల ఫ్లేవర్లు కలిగిన టమోటా సాస్లు, పేస్ట్లు నోరూరిస్తుంటాయి. కానీ అవన్నీ మానవ రక్తంతో ఎరుపెక్కాయని తెలిస్తే...వాటి వెనకాల బానిస కూలీల ఆకలి కేకలు ఉన్నాయని, వారి ప్రాణ త్యాగంతో అవి ఫలించాయని తెలిస్తే....ఇది ముమ్మాటికి నిజం. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న టమోటాల్లో 80 శాతం ఇటిలీ నుంచి ఎగుమతి అవుతున్నవే. ఇక ఎగుమవుతున్న టమోటా ఉత్పత్తుల్లో ఐదోవంతు ఇటలీ నుంచి వస్తున్నవే. దక్షణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో టమోటాలను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండించే టమోటా పంట కోతకొచ్చినప్పుడు పనిచేసే కార్మికులంతా ఆఫ్రీకా నుంచి వలస వచ్చిన బానిస కూలీలే. ఇటలీ చట్టం ప్రకారం వారికి రోజుకు కనీస వేతనంగా 45 యూరోలు చెల్లించాలి. వారికి చెల్లించేది కేవలం మూడున్నర యూరోలు లేదా 30 కిలోల టమోటాలు మాత్రమే. అందుకు కారణం వారంతా ఇటలీ మాఫియా నెట్వర్క్ కింద పనిచేయడమే. కాదని ఎదురు తిరిగితే అది కూడా దక్కదు. ఇటలీ బానిస కూలీలను సరఫరా చేసే మాఫియా పేరు ‘ఎన్డ్రాంగేటా’. ఇది ఒక్క ఇటలీకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా విస్తరించింది. (ఇటలీ నుంచే అమెరికాకు ‘గాడ్ ఫాదర్’ వ్యవస్థ విస్తరించిన విషయం తెల్సిందే) ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల నుంచి కూలీలను సరఫరా చేసే కాంట్రాక్టులకు ఎక్కువగా ఈ మాఫియానే రకరకాల పద్ధతిలో కొట్టేస్తుంది. ‘సెపరలాటో’లుగా పిలిచే గ్యాంగ్ లీడర్లను బానిస కార్మికులు నివసించే తాత్కాలిక షెడ్లకు పంపిస్తుంది. అక్కడ ఆ గ్యాంగ్ లీడర్లు అవసరమైనంత మంది కూలీలను ఎంపిక చేసుకొని సైట్కు తీసుకెళతారు. టమోటా తోటల్లో అయితే వారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాలి. ఉదయం ఇంటి వద్దనే తిని రావాలి. సాయంత్రం ఇంటికి వెళ్లాకే తినాలి. మధ్యలో ఆకలి భరించలేకపోతే పండిపోయి పడేయాల్సిన టమోటాలను మాత్రమే తిని కడుపు నింపుకోవాలి. కాస్త కునుకు తీసేందుకు ప్రయత్నిస్తే, కాపలాకాసే గూండా చేతిలో ఉన్న కొరడా వచ్చి వీపును చుర్రుమనిపిస్తుంది. మాఫియాకు 300 కోట్ల యూరోలు ఈ పుంగ్లీ ప్రాంతంలో మాఫియా నెట్వర్క్ గుప్పిట్లో దాదాపు 90 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వారు చాలి చాలని కూలీతో పనిచేస్తుంటే వారి మీద మాఫియాకు ఏటా 300 కోట్ల యూరోలు లాభంగా వస్తున్నాయని ఇటలీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి బోర్గేస్ మీడియాకు తెలిపారు. ఈ మాఫియా దేశం మొత్తంగా వ్యవసాయ కూలీల ద్వారా ఏటా 2,200 కోట్ల యూరోల రెవెన్యూను కూడగడుతోందని ‘అబ్జర్వేటరీ ఆఫ్ క్రైమ్ ఇన్ అగ్రికల్చర్, ది ఫుడ్ చెయిన్’ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఇతర వ్యవసాయ రంగాల్లో పనిచేసే కూలీలకు టమోటా కూలీలకన్నా ఈ మాఫియా కొద్దిగా ఎక్కువ చెల్లిస్తోంది. రోజుకు 45 యూరోలు చెల్లించాల్సి ఉండగా, అందులో మూడో వంతును మాత్రమే చెల్లిస్తుంది. వాటిలోనూ రాను, పోను రవాణా చార్జీలను కూడా పట్టుకుంటుంది. వర్క్ పర్మిటి వస్తుందన్న ఆశతో కూలీలు ఎదురు తిరిగేందుకు సాహసించలేరు. వర్క్ పర్మిట్లున్నా లాభం లేదు వర్క్ పర్మిట్లున్న కార్మికులకు కూడా ఈ మాఫియా 35 యూరోలకు మించి చెల్లించడం లేదు. అందులో రవాణా, మంచినీళ్ల చార్జీలను వసూలు చేస్తుంది. వర్క్ ప్లేస్కు సమీపంలో ఊరవతల కూలీల కోసం చిన్న గుడారాలు వేయిస్తుంది. అందులోనే వారు మగ్గిపోవాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇంతలో అక్కడ అక్రమంగా గుడారాలు వెలిశాయన్న విషయం తెల్సిన వెంటనే స్థానిక ఇటలీ అధికారులు వచ్చి వారి గుడారాలను కూల్చేస్తారు. వారు అక్కడి నుంచి కట్టుబట్టలతో చెట్టూ పుట్టా పట్టుకొని వెళ్లాల్సిందే. 2016లో కార్మిక చట్టం బలోపేతం కూలీల నిలువు దోపిడీ, బానిస కూలీల వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ఇటలీ ప్రభుత్వం 2016లో దేశ కార్మిక, వలస కార్మిక చట్టాల నిబంధనలు కఠినతరం చేసింది. దేశం నుంచి టమాటో ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రముఖ బ్రాండులైన సిరియో, టెస్కో, నార్దో లాంటి కార్పొరేట్ సంస్థలకే కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యతను అప్పగించింది. కూలీల వ్యవస్థలో దోపిడీని నిర్మూలించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంతోమంది కూలీల మృతి టమాటోలు తెంపుతున్న సమయంలో గుండె పోటుతో చనిపోతున్న వయస్సు మళ్లిన వారు ఎంతో మంది ఉంటున్నారు. వారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు అందుబాటులో అంబులెన్స్లను కూడా మాఫియా ఏర్పాటు చేయడం లేదు. టమోటాల ఒవర్ లోడ్తో వెళుతున్న వాహనాలపైనే కూలీలను ఎక్కించడం వల్ల ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. బ్రిటన్కు ఎక్కువగా టమోటాలను, వాటి ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ‘నార్దో’ బ్రాండ్ పరిధిలో ఇలా ఎక్కువ మంది మరణించారు.