Vicky Kaushal
-
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్గా వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్ఫ్లిక్స్లో(Netflix) 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్ను క్రియేట్ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025 -
మోదీ కోసం ఛావా స్పెషల్ స్క్రీనింగ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ చిత్రం ‘ఛావా’’(Chhaava)ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.మార్చి 27న పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యూస్18 తన కథనంలో పేర్కొంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. ఛావా సక్సెస్పై గతంలోనే ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు. -
టాటా కార్లకు బ్రాండ్ అంబాసిడర్గా ‘ఛావా’ హీరో
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ వెల్లడించింది. తమ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి ప్రచారానికి ఆయన తోడ్పడనున్నట్లు తెలిపింది.ఐపీఎల్ సీజన్ సందర్భంగా కొత్త టాటా కర్వ్ ప్రచార కార్యక్రమంతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుందని వివరించింది. ఇందుకోసం 20 సెకన్ల నిడివితో ‘టేక్ ది కర్వ్’ పేరిట ప్రకటనలు రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.ఈ నేపథ్యంలో టాటా మోటర్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో కౌశల్ కంపెనీ తాజా కారు కర్వ్ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్ట్ లో "ఉత్తమ కథలు ట్విస్ట్ లతో నిండి ఉంటాయి.. విక్కీ కౌశల్తో టాటా మోటార్స్ కొత్త శకానికి స్వాగతం'' అంటూ రాసుకొచ్చింది. -
ఛావాను వదలని కేటుగాళ్లు.. కేసు నమోదు
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితంగా ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు వసూళ్లు సాధించింది.అయితే గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సూపర్ హిట్ సినిమా ఛావాను కూడా పైరసీ చేశారు కేటుగాళ్లు. దీంతో ఛావా మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆగస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రజత్ రాహుల్ హక్సర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే పలు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో ఛావాను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేకర్స్. నిర్మాణ సంస్థ మడ్హాక్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ ఏజెన్సీ పైరసికీ సంబంధించిన ఇంటర్నెట్ లింకులను పోలీసులకు సమర్పించింది. దీనిపై ముంబయిలోని సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఛావా రిలీజైన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్లో ఛావా రూ.22 కోట్లు రాబట్టగా.. గతేడాది విడుదలైన స్త్రీ-2 రూ.16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప-2 రూ.14 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.కాగా.. ఈ చిత్రం ఇప్పటికే రణబీర్ కపూర్ చిత్రం యానిమల్ను దాటేసింది. ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. మాడాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దినేష్ విజన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?
గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
Chhaava Movie: ఇండియాలోనే 500 కోట్లు దాటిన కలెక్షన్లు
-
చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్ను కూడా!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది. -
'ఛావా' తెలుగులో కలెక్షన్స్ రికార్డ్.. క్లైమాక్స్ మేకింగ్ వీడియో చూశారా..?
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఫైనల్గా రూ. 20 కోట్ల మార్క్ను ఛావా టాలీవుడ్లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.ఛావా క్లైమాక్స్ మేకింగ్ఛావా సినిమాలో సంగమేశ్వర్ వద్ద జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా కీలకంగా ఉంటుంది. మూవీకి అత్యంత బలాన్ని ఇచ్చే ఈ సీన్ను ఎలా తెరకెక్కించారో ప్రేక్షకులకు చూపారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ను ఎలా రెడీ చేశారో చూపారు. శంభాజీ మహారాజ్గా కనిపించేందుకు తాను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ కౌశల్ ఇప్పటికే చెప్పారు. రోజుకు ఆరు నుంచి 8 గంటలకు పైగానే శిక్షణ కోసమే కేటాయించానని ఆయన అన్నారు. ఆయనలా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీల వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే. -
‘ఛావా’ క్లైమాక్స్లో కన్నీళ్లు వచ్చాయి: బన్నీ వాసు
‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు. విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్ ఎమోషన్. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్’’ అని నటుడు వినీత్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్ సీఎఫ్ఓ దివ్యాంశ్ గోయల్ అన్నారు. ఈ థ్యాంక్స్ మీట్లో తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడారు. -
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
‘ఛావా’ తెలుగు వెర్షన్కి ఊహించని ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సంపాదించుంది. మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. టాలీవుడ్లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విక్కీ కౌశల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లలే రాబట్టింది. (ఛావా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి తొలి రోజు 3.03 కోట్ల రూపాయలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను రాబట్టింది.ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
టైటిల్: ఛావానటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్ తదితరులునిర్మాత: దినేష్ విజన్దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్సంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి (ISc)ఎడిటర్: మనీష్ ప్రధాన్తెలుగు రిలీజ్: గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్విడుదల తేది: మార్చి 7, 2025(తెలుగులో)ఛావా.. ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో రిలీజై.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తే బాగుండేదని చాలా మంది అనుకున్నారు. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. నేడు(మార్చి 7) తెలుగు భాషలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘ఛావా’ అనేది మారాఠా రాజు శంభాజీకి సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావాని తెరకెక్కించాడు. శంభాజీ గురించి పూర్తిగా చెప్పకుండా.. స్వాతంత్రం కోసం, మారాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. శంభాజీ చరిత్ర తెలిసివాళ్లు కూడా తెరపై ‘ఛావా’ చూస్తే ఎంటర్టైన్తో పాటు ఎమోషనల్ అవుతారు.రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? అనేది బాహుబలితో పాటు పలు చారిత్రాత్మక సినిమాల్లో చూశాం. ‘ఛావా’ కథ కూడా అదే. అందుకే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్లతో కథనాన్ని నడిపించాడు. శంభాజీ చరిత్ర తెలియని వాళ్లకు కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను తీర్చిదిద్దాడు. ఓ భారీ యుద్దపు సన్నివేశంతో హీరో ఎంట్రీని ప్లాన్ చేసి.. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు ఇలానే సాగుతుంది. కథ ఊహకందేలా సాగడం.. శంభాజీని అంతం చేసేందుకు ఔరంగాజేబు చేసే కుట్రలు రొటీన్గా ఉండడంతో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లను మరింత ఎమోషనల్గా చూపించే ఆస్కారం ఉన్నా..దర్శకుడు ఆ సీన్లను సింపుల్గా కట్ చేశాడు. ఇక సెకండాఫ్ మాత్రం చాలా పకడ్భంధీగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఔరంగాజేబు సైన్యాన్ని ఎదుర్కొనుందుకు శంభాజీ చేసే ప్రయత్నం..ఈ క్రమంలో వచ్చే యుద్దపు సన్నివేశాలు అదిరిపోతాయి. సంగమేశ్వరలో ఉన్న శంభాజీపై మొగల్ సైన్యం దాడి చేసే సీన్లు.. వారిని ఎదుర్కొనేందుకు శంభాజీ చేసే పోరాట ఘట్టాలు ప్రేక్షకుడికి గూస్బంప్స్ తెప్పిస్తాయి. ‘జై భవానీ’, ‘హర హర మహదేవ్’ అంటూ ఢిల్లీ సైన్యంపై మారాఠ సైన్యం విరుచుకుపడుతుంటే.. థియేటర్స్లో విజిల్స్ పడతాయి. ఇక శంభాజీ బంధీగా మారడం.. మొగల్ సైన్యం అతన్ని చిత్రహింసలు పెడుతుంటే.. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. బరువెక్కిన గుండెతో థియేటర్ బయటకు వచ్చేస్తాం. ఎవరెలా చేశారంటే.. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. వార్, యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడు. క్లైమాక్స్లో నట విశ్వరూపం చూపించాడు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించాడు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశాడు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
తెలుగువారి ప్రేమకు కృతజ్ఞతలు– విక్కీ కౌశల్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్గా రూపొందిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నేడు విడుదల చేస్తోంది. ‘‘ఛావా’ తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో 550కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘‘ఛావా’ పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది... అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ బిగ్ స్క్రీన్పై ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ విక్కీ కౌశల్ ఓ వీడియో విడుదల చేశారు. -
మంచి సినిమాలివ్వడానికి ముందుంటాం: నిర్మాత ‘బన్నీ’ వాసు
ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్గా రూపొందిన హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie). విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యేసుబాయి భోంస్లే పాత్రను రష్మికా మందన్న పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ నెల 7న తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ‘బన్నీ’ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ– ‘‘ఛావా’ హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో ఆందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. భాష ఏదైనా మంచి సినిమా అయితే తెలుగులో తీసుకురావడానికి మా గీతా ఆర్ట్స్ ముందుంటుంది. ఇక ‘ఛావా’ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టించింది. అద్భుతమైన క్యాలిటీతో తెలుగులో డబ్ చేశాం. ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
Chhaava : తెలుగు ట్రైలర్ బ్లాక్ బస్టర్..
-
బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగు ట్రైలర్ రిలీజ్
గతనెలలో హిందీ రిలీజైన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)'ఉరి', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విక్కీ కౌశల్.. 'ఛావా'లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడిగా నటించాడు. రష్మిక హీరోయిన్. పీరియాడికల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. తెలుగులో ఛావా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. మార్చి 7న అంటే ఈ వీకెండ్ లో మూవీ రిలీజ్. 3 నిమిషాలున్న ట్రైలర్.. మంచి పవర్ ఫుల్ గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా') -
తెలుగులో ఛావా.. వర్కౌట్ అవుతుందా..!
-
రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది.తెలుగు ప్రేక్షకుల డిమాండ్సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఛావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఛావావిక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. The epic tale of India’s courageous son, #Chhaava is now all set to roar in Telugu by popular demand⚔️❤️🔥Witness the biggest spectacle #Chhaava in Telugu from March 7th💥👑#ChhaavaTelugu Grand Release by #GeethaArtsDistributions 🔥@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna… pic.twitter.com/awm4MAq4J6— Geetha Arts (@GeethaArts) February 26, 2025 చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్ -
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్బస్టర్. దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్కు స్పెషల్గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
ఛావా 'ఆయా రే తుఫాన్'.. పవర్ఫుల్ సాంగ్ చూశారా..?
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలోని "ఆయా రే తూఫాన్" పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోసల్మీడియాలో ఈ పాట బీజీఎమ్తో ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సాంగ్ను లైవ్లో ఏ.ఆర్.రెహమాన్, మరాఠీ సింగర్ వైశాలి సామంత్(Vaishali Samant) పాడారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.బాలీవుడ్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయా రే తుఫాన్ సాంగ్తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు.ఛావా కలెక్షన్స్ప్రపంచవ్యాప్తంగా ఛావా 8 రోజుల్లోనే రూ. 297 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో తొలి హిట్గా ఛావా నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. త్వరలో రూ. 500 కోట్ల మార్క్ను సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలంటూ ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషలలో విడుదల చేస్తే బాగుండేదని తెలుపుతున్నారు. అదే జరిగింటే ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ దాటేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
శంబాజీ మహారాజ్గా విక్కీ కౌశల్.. ఆ లుక్ కోసం ఏం చేశాడంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్కి వేలాది మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇటీవల విడుదలైన 'ఛావా'మూవీతో తనలో ఉన్న అసాధారణమైన నటుడిని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఈ మూవీ బాక్స్ఫిస్ వద్ద కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతోంది. ఆ మూవీలో చత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. అచ్చం మహారాజు మాదిరి అతడి ఆహార్యం అందర్నీ కట్టిపడేసింది. మరాఠా రాజుల కాలంలోకి వెళ్లిపోయేలా అతడి ఆహార్యం నటన ఉన్నాయి. ఇందుకోసం 80 కిలోల మేర బరువున్న అతడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకున్నాడని తెలుస్తోంది. విక్కీ ఇలా యోధుడిలా శరీరాన్ని మార్చుకునేందుకు ఎలాంటి ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్ ప్లాన్లు అనుసరించాడంటే..హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల ఫిట్నెస్ గురువు క్రిస్ గెథిన్.. విక్కీ కౌశల్కి తన శరీరాన్ని మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చాడు. మహారాజు మాదిరిగా ఎగువ శరీరం బలోపేతంగా ఉండేలా కండలు తిరిగిన దేహం కోసం విక్కీ చేత కార్డియో వంటి వ్యాయామాలు చేయించాడు. భారీ బరువులు ఎత్తించి మంచి విశాలమైన ఛాతీతో రాజు మాదిరి ధీరుడిలా కనిపించేలా చేశాడు. ఆయను విక్కీకి ఇచ్చిన ఫిట్నెస్ శిక్షణలేంటంటే..ఫంక్షనల్ వ్యాయామాలు: యుద్ధ తాళ్లు, స్లెడ్ పుష్లు, టైర్ ఫ్లిప్లు.కార్డియో: స్టామినా కోసం హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT).ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ: గాయాలను నివారించడానికి స్ట్రెచింగ్ మొబిలిటీ డ్రిల్స్.ఈ ఫిట్నెస్ శిక్షణలన్నీ బాడీ నిర్మాణానికి సరిపోతుంది అంతే.. మంచి అందమైన లుక్ కోసం కీలంగా ఉండేది డైట్ ప్లాన్ మాత్రమే. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) అవేంటంటే..ప్రోటీన్ పవర్: సోయా ముక్కలు, పనీర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులు.శక్తిని పెంచేవి: బీట్రూట్ టిక్కీలు, చిలగడదుంపలు.క్లీన్ ఈటింగ్: కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సమతుల్య మాక్రోలు. చీట్ మీల్స్ వంటివి దరిచేరనీయలేదు. ఇలాంటి కఠినతరమైన ఫిటెనెస్ శిక్షణతో మహారాజు మాదిరి లుక్తో ఆకట్టుకున్నాడు విక్కీ. ఇక ఒక ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ..అవిశ్రాంత శిక్షణ, క్రమ శిక్షణతో కూడిన ఆహారం తదితరాలే శంభాజీ మహారాజ్ మాదిరి బలాన్ని ప్రతిబింబించడానికి సహాయపడిందని చెప్పారు. ఇంతలా కష్టపడటం వల్లే చక్కటి శరీరాకృతితో తెరపై కనిపించే శంభాజీ మాహారాజు పాత్రకు ప్రాణం పోశాడు విక్కీ. గమనిక: ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం, స్లిమ్గా అవ్వడం వంటివి సెలబ్రిటీలు చేస్తుంటారు. వాటిని వాళ్లు ప్రత్యేక నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుని ప్రయ్నత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి దుష్ఫ్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల అనుకరించే మందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులు సలహాలు సూచనలతో అనుసరించడం ఉత్తమం.(చదవండి: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ Vs ఎలోన్ మస్క్: ఒకరిది పోరాటం మరొకరిది..!) -
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025 -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్ ప్రశ్న
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.ఆకాశ్ చోప్రా ట్వీట్పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు. Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty. Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!! We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025 -
చావా హిట్తో మరింత పెరిగిన నేషనల్ క్రష్ క్రేజ్..
-
'ఛావా' సినిమా చూసి కన్నీళ్లతో ప్రేక్షకులు.. వీడియోలు వైరల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) జోడీగా నటించిన చిత్రం 'ఛావా'.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన భార్యగా, మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ. 86 కోట్లు రాబట్టింది.1689 సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరం గజేబు మరాఠా సామ్రాజ్యంపై దండెత్తిన సమయంలో తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారు చూపిన ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చూసిన ప్రేక్షకుల కంటతడి పెట్టుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా తమ అభిప్రాయాన్ని సోషల్మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మూవీ చూసిన వారిలో ఎక్కువ భాగం కన్నీళ్లతోనే బయటకు వస్తున్నారు. థియేటర్లోనే శంభాజీ మహరాజ్ను గుర్తు చేసుకుంటూ కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా ఛావా సినిమాపై భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మికల నటన పట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. చివరి 40 నిమిషాలు సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లారంటూ మెచ్చుకుంటున్నారు. బుక్మైషోలో రోజుకు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్లో ఎక్కడ చూసిన కూడా హోస్ఫుల్ బోర్డులతో థియేటర్స్ కనిపిస్తున్నాయి.Ek Maratha sherni ka garjan🔥#ChhatrapatiSambhajiMaharaj #Chaava pic.twitter.com/E1249nucNc— Peddoda🔱🚩 (@_peddodu) February 15, 2025Chaava is not just a movie it's an emotion,pain ,our HISTORY It is difficult to watch on screen imagine how much our Raje tolerated n suffered... #Chaava #ChaavaReview pic.twitter.com/Vv5YtD4hX9— Harsha Patel 🇮🇳 (@harshagujaratan) February 15, 2025Just watched #Chaava, a powerful tribute to Sambhaji's bravery & struggle for Hindutva. A must-know chapter in Indian history! Jai Hind! #IndianHistory #Hindutva pic.twitter.com/Cudc1u4t78— Neha Chandra (@nehachandra800) February 15, 2025The most unfortunate thing about being a south indian the I'd not be able to feel these goosebumps in real with all theses doomed circle.of mine 😭 #Chaava #VickyKaushal#HarHarMahadevॐpic.twitter.com/MTNwYkvZkY— AlteredO (@AlteredDrift)When the audience of a film is giving it a standing ovation even after it's ended, then that film doesn't need anyone's review or rating. #Chhaava has won people's hearts. @iamRashmika @vickykaushal09 @MaddockFilms #AkshayKhanna #RashmikaMandanna ❤️ #VickyKaushal ❤️ pic.twitter.com/bqbuN1qWj5— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 15, 2025ref_src=twsrc%5Etfw">February 16, 2025 Yesterday when I went to a movie theater there was a poster of Chhava movie and some young boys were taking pictures on that poster when I looked at them they had no slippers on their feet and they were taking pictures. @vickykaushal09 @iamRashmika #chavaa #VickyKaushal #Chhaava pic.twitter.com/PhTXmh7ama— Sumit kharat (@sumitkharat65) February 15, 2025 -
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్కి అందుకుంది. విక్కీ యాక్టింగ్తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి. -
'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ఛావా (Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. లక్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ శంభాజీ మహారాజ్గా, అతడి భార్య మహారాణి ఏసుబాయిగా రష్మికా మందన్నా నటించారు.భారీ బడ్జెట్తో దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాకు వస్తున్న స్పందన ఏంటో తెలియాలంటే ఎక్స్ (ట్విటర్) రివ్యూ చూసేయండి..'విక్కీ కౌశల్.. గొప్ప నటుడు అని ఛావాతో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్కు ఈ సినిమా ఒక నివాళి' అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.#ChhaavaInCinemasEvery frame & every tear is a tribute to the #ChhatrapatiSambhajiMaharaj 🔥Every Hindu should watch #Chhaava#VickyKaushal has proven he is one of the best Actor in Bollywood, way ahead of Khans pic.twitter.com/D0SOlTQHMN— Hemir Desai (@hemirdesai) February 14, 2025 ఛావా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఫుల్ ఎమోషనల్ అయ్యా అని ఓ తెలుగు యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.#chhaava movie chala bagundi 🔥Full Emotional ayya climax lo 🥺😔Jai Sambhu Raje 🚩— 𝐒𝐫𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐏𝐒𝐏𝐊™🚩 (@Srikanth_OG) February 14, 2025నిజమైన సూపర్ హీరో ఎవరనేది ప్రపంచానికి చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ సర్కు ధన్యవాదాలు. పాత్రకు ప్రాణం పోసిన విక్కీ కౌశల్కు థాంక్స్. షేర్ శంభాజీ మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాడు అని మరో యూజర్ పేర్కొన్నాడు.Thank you Laxman Utekar sir✨You showed world about the real superhero.Thank you @vickykaushal09 for the justice to the role.Sher sambhaji lives on✨ #Jagdamb💖#Chhaava #ChhatrapatiSambhajiMaharaj— Manifest For Good 💫 (@SHUBHAMGAIKAR14) February 14, 2025 Kindness & valour were Chhatrapati Sambhaji Maharaj's strongest virtues. #VickyKaushal knew all that & more thus raising the bar once more with precision & accuracy. To see this guy mould into something which only could’ve read & heard about is beyond awards & ratings.#Chhaava pic.twitter.com/De7eQ5JuEo— Amar Singh Rathore (@amarsr_1990) February 14, 2025Real Bollywood magic!Vicky Kaushal's performance is mind-blowing, giving pure goosebumps. Housefull at 5:45 AM show🎥🔥#Chhaava #ChhaavaInCinemas #ChhaavaOn14Feb pic.twitter.com/mpRkGabPr0— Mr. Perfect (@DS24IN) February 14, 2025The film is good, but Vicky is EXCEPTIONAL!!! What a performance! The end will leave you numb. Took me a while to get up from my seat when the credits rolled. Please watch it in theatres! Phone, laptop, tv pe wo feel nahi ayegi. ⭐️⭐️⭐️⭐️ Detailed review soon! #Chhaava… pic.twitter.com/VZgZT5grpj— OCD Times (@ocdtimes) February 14, 2025#VickyKaushal shines in #Chhaava, but other actors are just okay. The film feels long, and the BGM doesn’t fit the era. Still, it’s decent. The last 20 minutes hit hard & stay with you. 💔 Highly recommend watching in theaters! 🎬🔥 #ChhaavaReview pic.twitter.com/TLEu3kxteP— Movies Talk Official (@moviestalkhindi) February 14, 2025My Final Verdict: Chhaava is a gripping, performance-driven historical drama that shines through its stellar cast. The second half takes the intensity to another level. Vicky Kaushal delivers a career-defining act while Akshaye Khanna as Aurangzeb is chillingly ruthless#Chhaava pic.twitter.com/pURGeZfBkf— Cinema Fable (@cinemafable1) February 14, 2025Chhaava is blockbuster 😊vicky is absolute charm born to play this role, rashmika brings best out of her, akshay khanna take a bow man , maddcok films is the top production house in india they should enter into south for sure. 🎶 & direction super #Chhaava #VickyKaushal pic.twitter.com/cYDbY4SbWI— @Politics& Popcorn 📖 (@Political_star1) February 14, 2025ChhaavaInCinemas #Chhaava Every frame & every tear is a tribute to the Maratha pride🫡💥#VickyKaushal fierce portrayal makes u feel his pain, power, & unbreakable will🙏🏻😍@iamRashmika is heartbeat of the story😍 Animal, Pushpa & now this. #Chhaava pic.twitter.com/AixrmULfw5— 🖤⃝ 𝐑𝐚𝐯𝐚𝐧😂🖤🫀 (@RavanDJ1210) February 14, 2025 -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
ట్రెండింగ్లో రష్మిక మందన్న 'ఛావా' సాంగ్
రష్మిక మందన్న- విక్కీ కౌశల్ కాంబినేషన్లో రానున్న హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్తో నెట్టింట వైరల్ అవుతుంది. సాంగ్లో విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. మొగల్ షెహన్షా ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.తాజాగా ఛావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అయితే, నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఈవెంట్లో పాల్గొనడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈవెంట్లో కూడా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
వీల్చైర్లో ప్రమోషన్స్కు రష్మిక ‘ఛావా’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
వీల్చైర్లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్ బ్రేక్ పడింది. జిమ్లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్కు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. ఆమె సహకారంతో అతడు.. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్కు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడాడు. అటు రష్మిక డెడికేషన్ను, ఇటు విక్కీ కౌశల్ మంచిగుణాన్ని అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. బిజీగా ఉన్నా, డేట్స్ కుదర్లేదంటూ ప్రమోషన్స్కు డుమ్మా కొట్టేవాళ్లే చాలామంది.. కానీ రష్మిక గాయంతో బాధపడుతున్నా సరే ఈవెంట్కు రావడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.రష్మిక కెరీర్..‘చూసీ చూడంగానే నచ్చేశావే..’ అని రష్మికాను ఉద్దేశించి పాట పాడుకున్నారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా ఆకట్టుకుందామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ది గాళ్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి డైరెక్షన్ చేయనున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ తనే హీరోయిన్. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ రష్మిక భాగమైంది.అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాంబాజీని చావా (మరాఠీలో పులి బిడ్డ అని అర్థం) అని పిలుస్తారు. చావా మొదటి భార్య యేసుబాయ్గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. The dedication with which #RashmikaMandanna is promoting this movie will be remembered in the future, showing how serious she is about her work. Despite her current condition, she came to promote the movie in a wheelchair. I'm confident that the pairing of #VickyKaushal and… pic.twitter.com/E4aM1EQ19P— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 31, 2025చదవండి: శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. -
పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లలో మెరిసింది. మరో వారం రోజుల్లో పుష్ప-2 విడుదల కానుండగా మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక టాలీవుడ్తో పాటు బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది యానిమల్ మూవీలో మెరిసిన ముద్దుగుమ్మ.. ఛావా అనే చిత్రంలో నటిస్తోంది.బాలీవుడ్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా ఛావా మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఒక్క రోజు ముందే డిసెంబర్ 5న పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.పోటీనుంచి తప్పుకున్న ఛావాదీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్ప-2తో పోటీపడడం కంటే వాయిదా వేయడమే మేలని భావించారు. అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా పోటీపడి నిలవడం కష్టమేనని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ ఖాయమని మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అందుకే ఛావాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.ఫిబ్రవరిలోనే ఎందుకంటే?తాజాగా ఛావా మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.VICKY KAUSHAL - RASHMIKA - AKSHAYE KHANNA: 'CHHAAVA' NEW RELEASE DATE ANNOUNCEMENT... #Chhaava is now set for a theatrical release on 14 Feb 2025... The release date holds special significance since it coincides with Chhatrapati Shivaji Maharaj Jayanti on 19 Feb 2025.Produced… pic.twitter.com/kDMrY7RDqN— taran adarsh (@taran_adarsh) November 27, 2024 -
ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్నైట్లో స్టార్డమ్ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కెరీర్లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ. అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు. అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు. (చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!) -
పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్!
ఐఫా-2024 అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సినీతారలంతా సందడి చేస్తున్నారు. సౌత్తో పాటు బాలీవుడ్ అగ్ర సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈవెంట్లో హోస్ట్లుగా వ్యవహరించిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ సందడి చేశారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.అయితే వేదికపై వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్కు స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్పై క్లారిటీ!)కాగా.. ఈ అవార్డ్స్ వేడుకల్లో షారూఖ్ ఖాన్కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కించుకున్నారు. సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సమంతా రూత్ ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సందడి చేశారు. Yeh tho asli FIRE hey 🔥🔥KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024 -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్బీర్ కపూర్ సోలో సీన్స్తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్బీర్ – విక్కీ కౌశల్ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
'తోబా తోబా' పాట.. హీరో విక్కీ కౌశల్పై ఆమె అసంతృప్తి
రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో 'తోబా తోబా' అనే ఓ హిందీ పాట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మూవీలోని సాంగ్ ఇది. రీల్స్, షార్ట్స్లో ఊపేస్తున్న ఈ పాట దాదాపు అందరికీ నచ్చింది. కానీ ఓ మహిళ మాత్రం ఈ పాట మీరు చేసుండాల్సింది కాదని చెప్పారని విక్కీ కౌశల్ అన్నాడు. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా అనాల్సి వచ్చిందో కూడా వివరించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన)బాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో విక్కీ కౌశల్ ఒకడు. గతేడాది చివర్లో 'సామ్ బహుదూర్' అనే సినిమా చేశాడు. గతంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా విధులు నిర్వర్తించిన ఈయన.. దేశ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. 'యానిమల్' మూవీతో పాటు రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఇందులో సామ్ మాణిక్ షా పాత్రలో విక్కీ కౌశల్ పరకాయ ప్రవేశం చేశాడు.అయితే తాను చేసిన 'తోబా తోబా' పాట అందరికీ నచ్చింది గానీ సామ్ మాణిక్ షా కూతురు మాయకు మాత్రం నచ్చలేదని విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'ఓ రోజు మాయ (సామ్ మాణిక్ షా కూతురు).. ఎవరతడు? అని మెసేజ్ చేశారు. ఏమైందని అడ్గగా.. ఐదు నెలల క్రితం మీరు నాకు నాన్నలా అనిపించారు. మీరు ఈ టైంలో ఇలాంటివి చేసుండాల్సింది కాదు అని అన్నారు. అయితే నటన అనేది నా జాబ్ లాంటిది అని చెప్పి నవ్వేశా. కానీ ఆమెకు తన తండ్రిలా నేను కనిపించడం అనేది అతిపెద్ద ప్రశంస' అని విక్కీ కౌశల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?) -
Vicky-Rashmika: విక్కీ కౌషల్తో రష్మిక మందన్న ఫోజులు.. ఫోటోలు వైరల్
-
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లేతోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్లో ప్రధాన పాత్రధారులు ఇద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ) -
తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్.. సెన్సార్ అభ్యంతరం
విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్యాడ్న్యూజ్'. సినిమా టైటిల్కు తగ్గుట్టాగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఇదీ ‘బ్యాడ్ న్యూస్’ అని చెప్పవచ్చు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కించారు. జులై 19న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.'బ్యాడ్న్యూజ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, ఇందులో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి మద్య ఉన్న మూడు ఇంటిమేట్ సీన్స్ను CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) తొలగించింది. వారిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు కాస్త మితిమీరినట్లు తెలుస్తోంది. అందుకే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కానీ వారిద్దరి కెమిస్ట్రీని కొందరు ప్రశంసించగా, మరికొందరు అభ్యంతరంగా ఉన్నాయిని భావించారు. సెన్సార్ కట్ లిస్ట్ ప్రకారం.. మూడు సన్నివేశాలలో ఒకటి 9 సెకన్లు, రెండవది 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు మొత్తంగా 27 సెకన్ల లిప్లాక్ సీన్లను CBFC మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత, బాడ్ న్యూజ్ సినిమాకు CBFC నుండి U/A సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ సర్టిఫికేట్లో సూచించిన విధంగా సినిమా నిడివి 142 నిమిషాలు, ఇది 2 గంటల 22 నిమిషాలకు సమానం. -
కత్రినా కైఫ్ బర్త్డే.. ఇష్టమైన ఫోటోలు షేర్ చేసిన విక్కీ కౌషల్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
కత్రినా లేకుండానే ఫంక్షన్కు.. నటితో హీరో స్టెప్పులు..
అంబానీ ఇంట పెళ్లి అనగానే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఎన్నో నెలల నుంచే మొదలైన సందడి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ ఫంక్షన్కు హాజరై స్టెప్పులేస్తూ సంతోషంగా గడిపారు.వదిన రాలేదా?అయితే హీరో విక్కీ కౌశల్ మాత్రం భార్య కత్రినా కైఫ్ లేకుండా ఈవెంట్కు హాజరయ్యాడు. ఇది చూసిన కొందరు ఫోటోగ్రాఫర్లు.. అదేంటి? వదిన రాలేదా? అని అడిగారు. కత్రినా కైఫ్ను వదినగా సంబోధించారు. వారి ప్రశ్నలు విన్న విక్కీ సమాధానమివ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మేము కత్రినాను మిస్ అవుతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. విక్కీ ఎప్పటిలాగే..అయినా తను చాలా ఏళ్లుగా కష్టపడి పని చేస్తూనే ఉంది. ఇప్పుడైనా కొంత బ్రేక్ తీసుకుని ఇంట్లోవారితో కలిసుంటే బాగుంటుంది. విక్కీ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కత్రినా ప్రెగ్నెంట్, అందుకే రాలేదేమో అని మరికొందరు అభిప్రాపయడ్డారు. కాగా సంగీత్లో విక్కీ.. నటి షెహనాజ్ గిల్తో కలిసి స్టెప్పులేశాడు. ఈయన సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన బ్యాడ్ న్యూస్ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Shehnaz x Vicky #TaubaTauba 🕺💃#ShehnaazGill #VickyKaushal pic.twitter.com/0EB0xlCSn1— $@M (@SAMTHEBESTEST_) July 6, 2024 చదవండి: ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ -
భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన స్టార్ హీరో!
బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్పోర్ట్లో కత్రినా వదులుగా ఉన్న అవుట్ఫిట్లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన క్లారిటీ ఇచ్చారు.విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్ న్యూజ్ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం' అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్లో భర్త విక్కీ కౌశల్తో కత్రినా కైఫ్ వేకేషన్కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్లతో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనున్నారు.Vicky Kaushal finally reacts to reports of Katrina Kaif's pregnancy during the trailer launch event of Bad Newz#VickyKaushal #KatrinaKaif #Vikkat #BadNewz pic.twitter.com/aFQOXoq8bQ— Ria Sharma (@RiaSharma1125) June 28, 2024 -
అలాంటి డ్రెస్లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్పోర్ట్లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో లండన్ వెకేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్మెంట్కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్లో జత చేసింది. ఆ క్యాప్షన్కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ! -
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామన్లు వారిని క్లిక్మనిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ పక్షులు కనిపించారంటే వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరినీ ఫాలో అవుతూ తమ కెమెరాలకు పని చెప్తుంటారు. కత్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్లో అయితే మరీనూ.. అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట!ఫోటోలు తీయొద్దుఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ వెల్లడించారు. 'ఒకసారి కత్రినా.. తమ ఫోటోలు తీయొద్దని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత యష్ రాజ్ స్టూడియోస్కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశల్తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది. మిగతావి డిలీట్ చేయమని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చదవండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్.. అంతేకాదు! -
పెళ్లై మూడేళ్లు.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు తల్లి కావడం ఆనందంగా ఉంది. దీపికా పదుకొణె తాను గర్భవతి అనే శుభవార్తను పంచుకుంది. ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ గర్భవతి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఇంటికి త్వరలో ఒక చిన్న గెస్ట్ వస్తాడని నెటిజన్లు అంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడకు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంటగా వెళ్లారు. ఆ సమయంలో ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో పదేపదే దాచుకోవడం కెమెరాల కంట పడింది. ఆ విడీయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీంతో కత్రినా, విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు అంటున్నారు. దీపికా పదుకొనే తర్వాత కత్రినా కైఫ్ కూడా స్వీట్ న్యూస్ ఇస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. విక్కీ , కత్రినా 2021 డిసెంబర్ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంటే వారి పెళ్లి జరిగి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పుడు వారిద్దరూ తల్లితండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే వారిద్దరూ రియాక్ట్ కావాల్సిందే. -
Vicky-Katrina: కత్రినా-విక్కీ పెళ్లి వార్షికోత్సవ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అలాంటి సీన్స్లో నటించిన భార్య.. భర్త రియాక్షన్ ఇదే
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జోడీగా నటించిన భారీ యాక్షన్ చిత్రం టైగర్- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్పై యూనివర్స్లో భాగంగా గత రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్లో కత్రినా కైఫ్పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ చిత్రంలో కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు. -
సామ్ బహదూర్ టీజర్ రిలీజ్.. చాలా కష్టపడ్డానంటున్న హీరో
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్ బహదూర్. భారతీయ మొట్ట మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 'యుద్ధంలో చనిపోవడమే సైనికుడి పని అని ఇందిరా గాంధీ అంటే.. ప్రత్యర్థి వైపున్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి అసలైన కర్తవ్యం', 'నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆర్మీయే నా ప్రాణం' అని విక్కీ కౌశల్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి సామ్ మానెక్షా ఏ విధంగా సారథ్యం వహించారు? సైనికులకు ఎలాంటి శిక్షణ అందించాడనేది ఈ చిత్రంలో చూపించారు. తాజాగా విక్కీ కౌశల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సామ్ మానెక్షా అని రాసి ఉన్న ఆర్మీ యునిఫామ్ ధరించడమే పెద్ద బాధ్యత. ఈ విషయంలో నేను ఏడీజీపీఐ(అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్)కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిని కలిసినప్పుడల్లా ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలని చెప్పేవారు. కాబట్టి సినిమా చేస్తున్నంతసేపూ ఆ ఒత్తిడి నాపై ఉంది. నాకు సాధ్యమైనంతవరకు బాగా చేయడానికే ప్రయత్నించాను. చిత్రయూనిట్ అంతా కష్టపడ్డాం. నిజానికి సామ్ యుక్తవయసులో ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి మనవడిని అనేకసార్లు కలిశాం. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. దీనిద్వారా ఆయన మాట్లాడే తీరు, నడకతీరు తెలుసుకుని దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. చదవండి: బిగ్బాస్ షాకింగ్ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్! -
విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!
ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాలంటే కంటెంట్ తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాల్లో హీరో స్టార్ డమ్తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం చూస్తుంటాం. మరికొన్ని సార్లు చిన్న సినిమా అయినా సరే కంటెంట్ వల్ల కాసుల వర్షం కురవాల్సిందే. కేవలం భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించడమే కాదు.. కథ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. అలా బాక్సాఫీస్ను షేక్ చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు చాలా తక్కువే ఉన్నాయి. వాటిలో దంగల్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, బాహుబలి-2, పఠాన్ అత్యధిక వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. (ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?) కానీ తక్కువ బడ్జెట్తో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాలు కూడా చాలా తక్కువే. అందులో మొదట వినిపించే పేరు యూరి: ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన ఈ చిత్రం.. భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కథాంశంగా తెరకెక్కించారు. ఈ మూవీతో ఆదిత్య ధర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. విక్కీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్లో వార్, కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఇప్పుడు సౌత్పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !) విక్కీ మాట్లాడుతూ.. 'నేను మొదట ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత నటనలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో ఓ ప్రొడక్షన్ కంపెనీలో ప్రొడక్షన్ బాయ్గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా మొదటి వేతనం నెలకు కేవలం రూ.1500 రూపాయలే. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది. బాంద్రా స్టేషన్లో కూర్చుని విక్కీ కౌశల్ అని ముద్రించిన రూ. 1,500 చెక్కును అలా చూస్తునే ఉన్నా.' అని చెప్పారు. ఇటీవలే జరా హాట్కే జరా బచ్కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్ జంటగా కనిపించింది. -
రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?
Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?) 2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిస్తే.. సారా అలీ ఖాన్తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. -
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
టవల్ కోసం అన్ని డబ్బులు తగలేస్తావా? అని ఒకటే తిట్టుడు..
సెలబ్రిటీల లైఫ్స్టయిల్ ఎలా ఉంటుందంటే.. చిన్న వస్తువు కోసం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవి వందలు, వేలు, లక్షలు, కొన్నిసార్లైతే కోట్లల్లో కూడా ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హుందాగా ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా సింపుల్గా ఉండాలనుకుంటారు. హీరోయిన్గా, సహాయ నటిగా మెప్పించిన ఒకప్పటి బాలీవుడ్ సీనియర్ నటి అమృత సింగ్ కూడా ఏదైనా భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎంత భారీగా అంటే ముఖం తుడుచుకునే టవల్ కూడా వేలు పోసి కొంటుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బయటపెట్టాడు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ ఆన్స్క్రీన్ జంట ద కపిల్ శర్మ షోలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విక్కీ కౌశల్. 'ఒక రోజు సెట్లో సారా తన తల్లి అమృత మేడమ్ను తిడుతోంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా ఓకేనా? అని అడిగా. దానికామె.. మా అమ్మ రూ.1600 పెట్టి కొత్త టవల్ తీసుకుంది. అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. తను జోక్ చేస్తుందేమో అనుకున్నాను. నిజం చెప్పు? అని అడిగితే నిజమే చెప్తున్నానని అరిచింది. నేను షాకయ్యాను.. రూ.1600 పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతలో సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్లో ఉన్న ఫ్రీ టవల్స్ వాడుకోవచ్చుగా' అని పేర్కొంది. చదవండి: నిశ్చితార్థం జరిగిందంటూ అనుపమ పోస్ట్ -
మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్తని అవమానించిన సల్మాన్ ఖాన్
-
కత్రినా కైఫ్ భర్తను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్..
-
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్పై బాడీగార్డ్స్తో పాటు సల్మాన్ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్ బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్ఖాన్ బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్ అవుతున్నారు. -
‘జరా హట్కే జరా బచ్ కే’ మూవీ ప్రమోషన్స్లో సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ (ఫొటోలు)
-
‘జరా హట్కే జరా బచ్ కే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!
మహారాణిగా నిర్ణయాలు తీసుకోనున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఛావా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశాల్ పోషించనున్నారు. శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ నచ్చి రష్మికా మందన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా. యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్లో రాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్ను రెడీ చేశారట లక్ష్మణ్. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారని టాక్. ఇక ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసిన రష్మికా మందన్నా ప్రస్తుతం రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందు తున్న ‘పుష్ప: ది రూల్’లో రష్మికా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదు: విక్కీ కౌశల్
బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట ఒకటి. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విక్కీ-కత్రినా తరచూ తమ క్యూట్ క్యూట్ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోలేదనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఓ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాడ్లో కలిసి నటించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విక్కీ కౌశల్ మాట్లాడుతూ భార్య కత్రినా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. కాగా కొంతకాలం పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021 డిసెంబర్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘నేను నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేనెప్పుడు పర్ఫెక్ట్ అని అనుకోను. ఓ భర్తగా, కొడుకుగా, నటుడిగా ఎందులోనూ నేను కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నన్ను నేను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. పూరిపూర్ణంగా ఉండడమే లక్ష్యంగా పని చేస్తుంటాను’ అన్నాడు. చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో అలాగే ఆదర్శవంతమైన భర్తనని కూడా తాను అనుకోనవడం లేదన్నాడు. కానీ, నిన్నటి కంటే రేపు ఉత్తమంగా ఉండేందుకు ట్రై చేస్తానన్నాడు. తనని తాను సరిచేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అనంతరం భార్య కత్రినా గురించి మాట్లాడుతూ.. ‘కత్రినా నా లైఫ్లోకి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. అంతా ఒక్కసారిగా మారిపోయింది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్గా ఎదగడానికి తను నాకు ఎంతో సహకరిస్తోంది’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. -
కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? వైరల్గా మారిన ఫోటోలు
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా మారిన కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఇటీవలె ఓ ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈ బ్యూటీ వదులుగా ఉన్న దుస్తులతో కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో కత్రినా తల్లి కాబోతుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు పదేపదే కత్రినా తన పొట్టభాగాన్ని కవర్ చేసుకుంటూ కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు క్షణాల్లో వైరల్గా మారాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై కత్రినా స్పందించలేదు. 2021 డిసెంబర్9న కత్రినా- విక్కీ కౌశల్ల వివాహం రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ యాడ్ షూట్లో సందడి చేసిన వీరిద్దరు బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లు కత్రినా నిజంగానే ప్రెగ్నెంటా అన్నది త్వరలోనే తెలియనుంది. -
ప్రేక్షకుల అభిరుచి మారింది.. అలాంటి చిత్రాలనే ఆదరిస్తారు:విక్కీ కౌశల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే ‘గోవిందా నామ్ మేరా అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విక్కీ కౌశల్ ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల బాలీవుడ్ చిత్రాలు సక్సెస్ కాకపోవడం పట్ల ఆయన స్పందించారు. విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా దర్శకుడు శశాంక్ కొవిడ్కు ముందు కథ చెప్పారు. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వాళ్లని కాస్త నవ్విద్దామనుకున్నా. కథ వినగానే ఓకే చేశా. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. కథ బాగుంటే.. ఏభాషైనా సరే ఆదరిస్తున్నారు. కేజీయఫ్2, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ' అని అన్నాడు. ఈ ఏడాది విడుదలైన అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం2’ మినహాయిస్తే బాలీవుడ్ సినిమాలు విఫలమైన విషయం తెలిసిందే. -
ఎకానమీ క్లాస్లో బాలీవుడ్ జంట.. మరీ ఇంత చీప్గానా..!
ఎల్లప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తారలు.. వెకేషన్కు టైం కేటాయిస్తూనే ఉంటారు. సెట్స్, షూటింగ్లంటూ బిజీబిజీగా గడుపుతూ అలిసిపోతుంటారు. అందుకే తీరిక దొరికినప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా రిఫ్రెష్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు అప్పటికప్పుడు బ్యాగు సర్దేసుకుని విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా రొటీన్గా జరిగేదదైనా ఈ ట్రిప్లో కాస్త వెరైటీ కూడా ఉందండోయ్. అదేంటంటే ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం. అది చూసిన జనాలు అదేంటి? వీళ్లు ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలు అయి ఉండి ఎకానమీ క్లాస్లో వెళ్లడం గ్రేట్ అని కొందరంటుంటే.. మరీ చీప్గా కాకుండా బిజినెస్ క్లాస్ లేదంటే ఫస్ట్ క్లాస్లో అయినా వెళ్లాల్సిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోలో కత్రినా తన గుర్తు పట్టకుండా ఉండేందుకు బ్లాక్ క్యాప్తో పాటు.. మాస్క్ను ధరించి ఉంది. అంతే కాకుండా ఈ క్లిప్లో స్టార్ జంట పక్కపక్కనే కూర్చుని వారి వారి మొబైల్స్లో నిమగ్నమైపోయారు. ఇక వీడియో మొదట్లో కత్రినా మాస్క్ తొలగించి ఫోన్లో బిజీగా ఉండగా.. ఓ అభిమాని సీక్రెట్గా రికార్డ్ చేశారు. అది గమనించిన కత్రినా వెంటనే మాస్క్ ధరించింది. ఈ వీడియోను చూస్తే వీరిద్దరూ ఏదో సీక్రెట్ వెకేషన్ వెళ్తున్నట్లు అర్థమవుతోంది. తమని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఇలా ఎకానమీ క్లాస్లో వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారని కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి.. వారి ప్రైవసికి భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ జంట హాలిడే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విక్కీ కౌశల్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
నా పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగింది: కత్రినా
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ గతేడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. షూటింగ్ గ్యాప్ దొరికితే ఇద్దరూ కలిసి ఎంచక్కా విహార యాత్రలకు లేదా డిన్నర్ డేట్స్కు వెళ్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో ఒకరి సీక్రెట్స్ గురించి మరొకరు చెప్పుకోవడానికి అస్సలు వెనుకాడరు. అయితే ఈసారి కత్రినా ఓ పెద్ద విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆనందంగా సాగిపోతుందనుకున్న తన పెళ్లిలో కొందరు చెప్పులతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటా? అని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు ఉన్నారు. చివరగా ఆ ఫైట్లో ఎవరు గెలిచారనేది మాత్రం అడగడమే మర్చిపోయా' అని చెప్పుకొచ్చింది క్యాట్. కాగా రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు విక్కీ, కత్రినా. వీరి సినిమాల విషయానికి వస్తే కత్రినా టైగర్ 3, మేరీ క్రిస్మస్, జీలె జరా సినిమాలు చేస్తోంది. విక్కీ.. గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్ చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఈ విషయంలో విశ్వక్సేన్దే తప్పు: డైరెక్టర్ -
పెళ్లికి పిలవలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది: కరణ్ జోహార్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజాగా ఫినాలే ఎపిసోడ్లో కరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి పిలవకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. పదమూడో ఎపిసోడ్లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు. ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదాగా సాగింది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ల వివాహానికి పిలవకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఈ సందర్భంగా కరణ్ వెల్లడించారు. (చదవండి: ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్) కరణ్ జోహార్ మాట్లాడుతూ 'విక్కీ, కత్రినా వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది. ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఈ విషయంలో చాలామందికి నాపై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా ప్రశ్నించారు. విక్కీ-కత్రినా వివాహానికి అనురాగ్ కశ్యప్ను కూడా ఆహ్వానించలేదని తెలుసుకున్నప్పుడు కాస్త ఉపశమనం లభించింది' అని అన్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
పెళ్లి తర్వాత తొలిసారి అలా.. కత్రినా, విక్కీ ఫోటోలు వైరల్.. !
బాలీవుడ్ రొమాంటిక్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో వివాహబంధంతో ఒక్కటైన ఈ ప్రేమజంట త్వరలోనే తెరపై కనువిందు చేయనున్నారు. పెళ్లి తర్వాత స్క్రీన్పై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో ఇద్దరు కలిసి నటించనుండగా ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరలయ్యాయి. They should go get married! 💘🤣#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/vyo78G7hDe — Nush (@tanyeahok) September 13, 2022 (చదవండి: అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది) అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కత్రినా కైఫ్, భర్త విక్కీ కౌశల్తో అనుబంధాన్ని వివరించింది. తామిద్దరం డేటింగ్ చేయలేదని ఆమె వెల్లడించింది. మీడియాలో తమపై వస్తున్న కథనాలు చూస్తే చాలా తమాషాగా అనిపిస్తుందని తెలిపింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్తాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు. I'm so excited for the ad🤩 My babies🫶🏻🫶🏻🫶🏻#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/kVHCxtPLxB — Merve (@itsewrem) September 13, 2022 -
అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె ఇటీవల హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరూ గతేడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ, పెళ్లి విషయంలో కత్రినా-విక్కీలు చాలా గొప్యత పాటించారు. తాజాగా దానికి గల కారణమేంటో వివరించింది కత్రినా. ఇటీవల జరిగిన వోల్ఫ్777 ఫిలింఫేర్ ఆవార్డు ఫంక్షన్లో విక్ట్రీనా దంపతులు మెరిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కత్రినా జూమ్ టీవీతో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో గొప్యత పాటించడం వెనుక అసలు కారణం చెప్పింది. ‘కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. అందరు కరోనా బారిన పడ్డారు. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్గా మారిన సూసైడ్ నోట్ వారి విషయంలో మరో చాన్స్ తీసుకోవాలని అనుకొలేదు. మళ్లీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మా వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చాం. మా పెళ్లి సీక్రెట్గా జరగడానికి అదే కారణం. అలాంటి పాండమిక్లో కూడా మా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరం(నేను, విక్కి) చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. చదవండి: హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా? -
‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ను సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మన్వీందర్ సింగ్గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్ సింగ్.. కత్రినాకు వీరాభిమాని. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడట. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతను నిరాశకు లోనయ్యాడు. చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న మన్వీందర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తన ఇన్స్టాగ్రామ్లో కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్ హీరోయిన్ల ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్ చేసి ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ దీనికి ‘నేటికి మా పెళ్లి జరిగి మూడు నెలలు.. నా భార్య కత్రినా కైఫ్’ వీడియోను ఎడిట్ చేశాడు. అంతేకాదు కత్రినా-విక్కీ జంటగా ఉన్న ఫొటోలకు విక్కీ ఫొటోలకు తన ముఖం ఉండేలా ఎడిట్ చేసి పలు వీడియాలు, పోస్ట్లు కూడా షేర్ చేశాడు. ఇలా కొద్ది రోజులుగా నిందితుడు కత్రినా-విక్కీని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.కాగా నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా- విక్కీ కౌశల్ గతేడాది పెళ్లిపీటలెక్కారు.ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్-3లో క్యాట్ హీరోయిన్గా నటిస్తుండగా.. గోవింద్ నామ్ మేరా, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) -
IIFA Awards 2022: ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు..
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్ 4) రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్, మనీష్ పాల్ హోస్ట్గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్, నోరా ఫతేహీలా డ్యూయెట్ సాంగ్ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్ గ్రీన్ కార్పెట్లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్ తమ గ్లామర్తో కట్టిపడేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది. ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ) ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా) ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్ (సర్దార్ ఉద్ధమ్) ఉత్తమ నటి: కృతి సనన్ (మిమి) ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్ శెట్టి (తడప్ 2) ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (లూడో) ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నటియాల్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్ కౌర్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ కథ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో) ఉత్తమ కథ (అడాప్టెడ్): (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ ఐసీసీ వరల్డ్ కప్ 1983 ఆధారంగా వచ్చిన 83) సాహిత్యం: కౌసర్ మునీర్ (లెహ్రే దో పాట-83) -
భర్త విక్కీ కౌశల్కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్డే విషెస్
Katrina Kaif Sweetest Birthday Wishes To Hubby Vicky Kaushal: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బర్త్డే సందర్భంగా ఆయన భార్య, హీరోయిన్ కత్రీనా కైఫ్ స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ అమెరికాలో వేకేషన్ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (మే 16) విక్కీ కౌశల్ బర్త్డే సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. అలాగే పెళ్లి అనంతరం విక్కీ తొలి బర్త్డే సందర్భంగా కత్రీనా భర్తకు స్వీటెస్ట్ బర్త్డే విషెస్ తెలిపింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఎదుటే బికినీలో బర్త్డే పార్టీ, ట్రోలర్స్ నోర్మూయించిన ఐరా నేపథ్యంలో భర్తతో క్లోజ్గా ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘న్యూయార్క్ వాలా బర్త్డే మై లవ్.. ఏ విషయాన్నైనా నువ్వు ఉత్తమమైనదిగా చేస్తావు..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలో విక్కీ కౌశల్, కత్రీనాను వెనకనుంచి హగ్ చేసుకుని ఆమెకు ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక కత్రీనా పోస్ట్ చూసిన ఈ జంట ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ జంటపై అభిమానం కురిపిస్తూ విక్కీకి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు. చదవండి: 'ఖుషి' టైటిల్తో వస్తున్న విజయ్, సామ్ కాగా గతేడాది రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు. ఎప్పుడు ఈ జంట మీడియా ముందు బయట పడలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియా ముందు మాత్రం దూరం పాటించేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ను గోప్యంగా ఉంచారు విక్ట్రీనా. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కత్రీనా ప్రెగ్నెంటా? క్లారిటీ ఇచ్చిన ఆమె టీం!
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్పోర్ట్లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పింక్ కలర్ చుడిదార్లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది. -
కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్..
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇటీవలే హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ ! నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అది ఇల్లీగల్ కాదు.. విక్కీ కౌశల్ మీద వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు
Police Clarify On Indore Resident Complaint Against Vicky Kaushal : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్పై ఇండోర్కు చెందిన జైసింగ్ యాదవ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విక్కీ, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న లుకా చుప్పి 2. ఈ సినిమా చిత్రీకరణలో వాడిన బైక్ నంబర్ ప్లేట్ తనదే అని పోలీసులను ఆశ్రయించాడు. 'విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో నడిపే ద్విచక్రవాహనానికి ఉన్న నంబర్ వాస్తవానికి నాది. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నంబర్ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా' అని తెలిపాడు. జైసింగ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే సినిమా షూటింగ్లో విక్కీ ఉపయోగించిన నంబర్ ప్లేట్కు బోల్ట్ బిగించడం వల్ల పొరపాటు జరిగిందని పోలీసులు తెలిపారు. యాదవ్ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు సినిమా సెట్స్కు చేరుకున్న బంగంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ 'ఈ దర్యాప్తులో నంబర్ ప్లేట్పై అమర్చిన బోల్ట్ వల్ల పొరపాటు జరిగింది. బోల్ట్ను గట్టిగా బిగించడంతో 1 నంబర్ 4 లాగా కనిపిస్తుంది. అందుకే జైసింగ్ అపార్థం చేసుకున్నాడు. సినిమా సీన్లో ఉపయోగించిన ఆ నంబర్ ప్లేట్ మూవీ ప్రొడక్షన్ వారికి చెందినది. కాబట్టి ఇందులో చట్ట విరుద్దం ఏం లేదు.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 'హీరో వాడిన బైక్ నంబర్ నాది' పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు -
'నా నంబర్ ప్లేట్ ఎలా వాడతారు?' హీరో విక్కీ కౌశల్పై ఫిర్యాదు
యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్ను బైక్పై తీసుకెళ్తున్నాడు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. కారణం.. విక్కీ నడుపుతున్న బైక్ నంబర్ ప్లేట్ తనదే కావడంతో చిత్రయూనిట్పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్ ప్లేట్ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఆ బైక్ సీన్లో వాడిన నంబర్ ప్లేట్ నాది. ఈ విషయం సదరు చిత్రయూనిట్కు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నా అనుమతి తీసుకోకుండా అలా నంబర్ ప్లేట్ వాడుకోవడం మాత్రం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు' అని యాదవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో చూడాలి! -
మాల్దీవ్స్లో విక్ట్రీనా హనీమూన్.. ఫొటో షేర్ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...
పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాల్దీవ్స్లో వాలిపోయారు. డిసెంబర్ 9న రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. హనీమూన్ను మాల్దీవ్స్లో ప్లాన్ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్గ్రౌండ్లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్ చేసింది. లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అన్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్గా’ అని ఒక నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. ఫొటో షేర్ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. (చదవండి: ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
పెళ్లైన పది రోజులకేనా.. కత్రినా ఎక్కడ?
బాలీవుడ్కి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్షిప్ను గోప్యంగా ఉంచిన వీరిద్దరు ఎట్టకేలకు ఈ పెళ్లితో ఇటీవలే ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో కొద్ది మంది సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి హంగామ అయ్యాక ఈ క్యూట్ కపుల్ ముంబైకి రావడంతో పాటు మీడియా ముందుకు కూడా వచ్చింది. అయితే వీరి వివాహం జరిగి వారం అయ్యిందో లేదో అప్పుడే కొత్త పెళ్లికొడుకు విక్కీ కౌశల్ వెడ్డింగ్ మూడ్కి ప్యాకెప్ చెప్పి షూటింగ్కు పయనమయ్యాడు. కాగా ఈ విషయాన్ని చెబుతూ విక్కీ తన ఇన్స్టాలో ఓ ఫోటో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్గా.. ముందు టీ.. ఆ తర్వాత షూటింగ్ అని పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పోస్ట్ చూసిన నెటిజన్లు విక్కీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివాహం జరిగిన వారానికే షూటింగ్కు బిజీనా.. మరి కత్రినా ఎక్కడ? కత్రినా కైఫ్తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టు.. అని ఒకరు కామెంట్ చేయగా, పెళ్లై పది రోజులు కూడా కాలేదు అప్పుడే షూటింగా? హనీమూన్ ప్లాన్ చేయలేదా అని మరొకరు, హల్వా ఎలా ఉందని, మరీ ఇంత వర్క్ డెడికేషన్ ఏంటని మరో యూజర్ కామెంట్ చేశారు. చదవండి: Vicky Kaushal: కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్ -
కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్
Vicky Kaushal Reaction On Katrina Kaifs First Halwa After Wedding: బీటౌన్ కొత్త జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ క్యూట్ కపుల్ ఇటీవలె ముంబై చేరుకున్నారు. ఇక పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్షిప్ను అత్యంత సీక్రెట్గా ఉంచిన విక్ట్రీనా జంట వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా పెళ్లి తర్వాత అత్తగారింట్లో కత్రినా తొలిసారి వంట వండిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భర్త విక్కీ..ఇప్పటివరకు తిన్నవాటిలో బెస్ట్ హల్వా ఇదేనంటూ శ్రీమతిపై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశాడు. -
కొత్త పెళ్లికూతురు కత్రినా వండిన తొలి వంట ఏంటో తెలుసా?
Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది. చదవండి: మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
కత్రినాపై విక్కీ కౌశల్ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
విక్కీ కౌశల్ కజిన్ ఉపాసన వోహ్రా కత్రినా కైఫ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో లైవ్చాట్ నిర్వహించిన ఆమె కత్రినా-విక్కీల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా యూజర్ల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఉపాసన ఓహ్ర ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కత్రినా కుటుంబం ఎలా ఉందని అడగ్గా.. తన కుటుంబ సభ్యులంతా చాలా బాగున్నారని, వారిది అద్భుతమైన వ్యక్తిత్వం’ అని చెప్పింది. చదవండి: నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కత్రినా పంజాబీ మాట్లాడుతుందా? అని మరో నెటిజనల్ ప్రశ్నించగా.. ‘తను చాలా బాగా పంజాబీ మాట్లాడుతుంది. పెళ్లిలో విక్కీతో పాటు మా కుటుంబ సభ్యులతో కూడా కత్రినా పూర్తిగా పంజాబీలోనే మాట్లాడింది. అతి తక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడేది. ఈ క్రమంలో తనతో మాకు బాగా చనువు ఏర్పడింది. ఇక అందరి పేర్లను క్యాట్ చాలా బాగా గుర్తుపెట్టుకుంది. ఆ మూడు రోజుల మేమంత ఒమేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్పోర్టు దాడి: విజయ్ సేతుపతికి కోర్టు సమన్లు కాగా హాంకాంగ్లో పుట్టిన కత్రినా కైఫ్ లండన్లో పెరిగింది. కాబట్టి ఆమె మదర్ టంగ్ ఇంగ్లీష్. అయితే బాలీవుడ్లోకి అడుగుపెట్టాక హిందీ నేర్చుకున్న కత్రినా మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో చాలా వరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే మాట్లాడుతుంది. ఇక భర్త విక్కీ కౌశల్ పంజాబీ కుటుంబానికి చెందిన వాడు కావడంతో క్యాట్ పంజాబీ భాషను నేర్చుకుందట. కాగా రాజస్థాన్లో వివాహం అనంతరం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ దంపతులు నిన్న(డిసెంబర్ 14) తిరిగి ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు తమ ప్రేమబంధంపై ఎంతో గోప్యత పాటించిన ఈ నవ దంపతులు ముంబై ఎయిర్ పోర్టులో ఒకరిచేయి ఒకరు పట్టుకుని మరీ కెమెరాలకు స్టిల్ ఇచ్చారు. -
నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్లో హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. తొలిసారి భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఈ సందర్భంగా కత్రినా నుదిటన సింధూరం, తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్లో ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే విక్కీ ఫార్మల్ లుక్లో కనిపించాడు. ఇలా కత్రినా, విక్కీలు భార్య భర్తలుగా చూడముచ్చటగా కనిపించారు. ఇక తమ అభిమాన జంటను తొలిసారి భార్యభర్తలుగా చూసిన విక్ట్రీనా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. -
భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్లో చిన్న హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. చదవండి: సల్మాన్,రణ్బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా? దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కత్రినా చుడిదార్ ధరించి నుదుట తిలకంతో కనిపించగా, విక్కీ ఫార్మల్ లుక్లో ఉన్నాడు. చూడటానికి ఈ జంట చాలా అందంగా కనిపించారు. వీరిద్దరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని మీడియాను పలకరించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కత్రినా నవ్వూతూ చాలా సంతోషంగా కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ ‘చాలా రోజుల తర్వాత క్యాటీ మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నా’, ‘క్యూట్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్గా ప్రేమ వ్యవహరం సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జంట కత్రినా, విక్కీలు ఎప్పుడు మీడియా ముందుకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియ ముందు విడివిడిగా ఉండేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ విషయంలో గొప్యంగా ఉంచిన విక్ట్రీనా.. తొలిసారి పక్కపక్కనే ఒకరి చేయి ఒకరు పట్టుకుని భార్యభర్తలు కనిపించడంతో వారి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సల్మాన్,రణ్బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా?
Katrina Kaif Ex Boyfriends Salman Khan, Ranbir Kapoor Sends Costly Gifts On Her Wedding: ప్రస్తుతం బి-టౌన్లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి హాట్టాపిక్గా మారింది. పెళ్లి వరకు గొప్యత పాటించిన ఈ జంట అనంతరం వరసపెట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలంటూ’ విక్ట్రీనాలు పోస్ట్లు షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా రాజస్థాన్లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి ఎంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న దానిపై స్పష్టత లేదు. చదవండి: కాజల్పై బిగ్బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్లు ఉండటం ఆసక్తినెలకొంది. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రణ్బీర్ కపూర్ 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చినట్టు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో కత్రినా సల్మాన్ ఖాన్తో ప్రేమ వ్యవహరం నడపగా వీరిద్దరి బ్రేకప్ అనంతరం రణ్బీర్ కపూర్తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ అంతేకాదు ముంబైలో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ రణ్బీర్, కత్రినాలు ఎడాది పాటు కలిసి ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్, రణ్బిర్తో పాటు అలియా భట్ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని, రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్ పంపించారని సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్ను ఇవ్వగా, హృతిక్ రోషన్.. విక్కీకి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్ను ఇచ్చాడట. ఇక తాప్సీ కూడా విక్కీకి 1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్లెట్ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. -
విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్
Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ని వివాహం ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కత్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్.. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్ కలర్ మ్యాచింగ్ కాస్టూమ్స్తో ఫర్ఫెక్ట్ లుక్స్తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్ ఎంతో రొమాంటిక్గా కనిపిస్తున్నాయి. చదవండి: వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ... ఓ అందమైన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేలా ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు.. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే..
Katrina Kaif And Vicky Kaushal Wedding Reception Hamper Goes Viral: బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు పెళ్లి అనంతరం తమ హల్ది ఫంక్షన్ ఫొటోలను షేర్ చేశారు విక్ట్రీనా. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది. కాగా ప్రముఖులకు విక్ట్రీనా రిసెప్షన్కు ఆహ్వానం పంపించినట్లు జోరుగ ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్లో కొద్దిమంది బంధువులు, కుటుంబసభ్యులు, కొద్ది మంది వీఐపీల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలందరికి, ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ఈ నేపథ్యంలో బి-టౌన్ సెలెబ్రెటీలకు, సినీ ప్రముఖులకు విక్ట్రీనా ఆహ్వానం పింపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ విక్ట్రీనా వెడ్డింగ్ రెసెప్షన్ ఇన్విటేషన్ హాంపర్ ఇదేనంటూ పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ ఇన్విటేషన్ హాంపర్ పూర్తిగా పింక్ కలర్ పూలతో నిండి ఉంది. ఇక ఇందులో నెయ్యితో చేయించిన స్పెషల్ లడ్డు ఇతర స్వీట్స్తో పాటు డ్రైఫ్రూట్స్తో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కళ్లే చెదిరేలా ఉన్న ఈ హాంపర్తో విక్ట్రీనాలు పలువురికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇది విక్ట్రీనాలకు సంబంధించిందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు
Katrina Kaif And Vicky Kaushal Haldi Function Photos Goes Viral: బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు ఒక్కటయ్యారు. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా(విక్కీ కౌశల్-కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగే వారకు దీనికి సంబంధించిన ఏ అప్డేట్స్ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్, పెళ్లి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సీక్రెట్గా ఉంచారు. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ అయితే ఏదో విధంగా అవి పుకార్లుగా బయటకు వచ్చాయి. చివరికి అవే నిజమవుతూ వారి వివాహం జరిగింది. అనంతరం విక్ట్రీనాలు తామిద్దరం ఒక్కటయ్యామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే సెలబ్రెటీల పెళ్లి అంటే దానికి ముందు జరిగే సెలబ్రెషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. వారి హల్దీ ఫంక్షన్, సింగీత్లను వేడుకలా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో వారు చేసే సందడి మామూలుగా ఉండదు. చూస్తే కళ్లు చెదిరెలా అట్టహాసంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటారు. అందుకే వాటిని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. కానీ విక్ట్రీనా పెళ్లి వేడుకల్లో ఇవేవి బయటకు రాలేదు. చదవండి: ఆ షాట్తో చరణ్, తారక్ల బాండింగ్ అర్థమైంది: రాజమౌళి దీంతో వారి ఫ్యాన్స్ అంతా నిరాలో ఉన్నారు. ఇదిలా ఉంటే వివానంతరం ప్రకటన ఇచ్చిన విక్ట్రీనా మెల్లిమెల్లిగా ఫొటోలను బయటకు వదులుతున్నారు. ఇప్పటికే వారి పెళ్లి ఫొటోలను షేర్ చేయగా తాజాగా హల్ది ఫంక్షన్కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ హల్ది ఫంక్షన్లో ఈ జంట నవ్వుతూ సంతోషంగా కనిపించడంతో వారి ఫ్యాన్స్, ఫాలోవర్స్ మురిసిపోతున్నారు. ‘క్యూట్ కపుల్’ అంటూ వారి ఫొటోలకు కామెంట్స్ చేస్తూ వారి ఫొటోలను వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
Virushka: విరుష్క పొరుగింట్లోకి కత్రినా- విక్కీ.. హమ్మయ్య మీకు పెళ్లైంది.. ఇప్పటికైనా!
Anushka Sharma Welcomes Neighbours Katrina Kaif and Vicky Kaushal: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. విరుష్క జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయవంతమైన సారథిగా కోహ్లి తనదైన ముద్ర వేస్తే.. బాలీవుడ్ హీరోయిన్, నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందీ జంట. ఇక విరుష్కలు తమ కూతురు వామికతో కలిసి ముంబైలోని జుహులో గల విలాసవంతమైన అపార్టుమెంటులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పక్క బిల్డింగులోకి మరో సెలబ్రిటీ జంట రాబోతుందట. వాళ్లెవరో కాదు.. విక్ట్రినా.. అదేనండి.. బాలీవుడ్ కొత్త దంపతులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. రాజస్తాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరుష్క వీరికి శుభాభినందనలు తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే తమ పక్క అపార్టుమెంటులో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. చదవండి: Virat Kohli: అబ్బో ఇంత తొందరగా.. ఇప్పుడే తెల్లారిందా మీకు! తనే మాకు కింగ్! ఈ మేరకు..‘‘అందమైన జంటకు శుభాభినందనలు! జీవితాంతం ఇలాగే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ... ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి! హమ్మయ్య ఇప్పటికైనా మీ పెళ్లి జరిగింది... ఇక కొత్త ఇంటికి రావడమే తరువాయి! ఇప్పుడైనా.. పక్కింట్లో నుంచి వచ్చే శబ్దాలు(నిర్మాణంలో ఉన్నందున) తగ్గుతాయేమో’’ అంటూ తమ పొరిగింటి వారికి ఫన్నీగా స్వాగతం పలికారు. కాగా పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కత్రినా- విక్కీ పలు ఆలయాల సందర్శించడం సహా కొన్ని రోజుల పాటు విహార యాత్రలు చేసి.. ఆ తర్వాత జుహులోని అపార్టుమెంటులోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. సముద్ర ముఖంగా ఉండే ఈ ఫ్లాట్ను ఏరికోరి సెలక్ట్ చేసుకున్నారట ఈ అందమైన జంట. చదవండి: Vicky Kaushal-Katrina Kaif Wedding: సమంత బాటలో కత్రినా.. సేమ్ సీన్ రిపీట్ -
Samantha-Katrina: సమంత బాటలో కత్రీనా.. సేమ్ సీన్ రిపీట్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో.. అత్యంత సన్నిహితులు సమక్షంలో గురువారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం విక్ట్రీనా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో అందంగా.. మేడ్ ఫర్ ఇచ్ అదర్లా ఉన్నారు ఇద్దరు. ముఖ్యంగా కత్రీనా సబ్యసాచి డిజైన్ చేసిన ఎరుపు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. వివాహ తంతు జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న వేళ.. పట్టరాని సంతోషంతో కత్రినా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విక్కీ జీవితాంతం ఆమె చేతిని వీడనంటూ.. గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతోంది. (చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..) దీన్ని చూసిన నెటిజనులు సమంతను గుర్తు చేసుకున్నారు. చైతూతో వివాహం జరుగుతున్న వేళ సమంత కూడా ఇలానే పట్టరాని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. విక్ట్రీనా వివాహంలో కూడా ఇదే సీన్ రిపీట్ కావడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. (చదవండి: పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్, ఇదిగో ప్రూఫ్..) ఇక నూతన దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఫోటోలు
-
ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన
హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడడుగులు వేశారు. గురువారం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం ఇంతకాలం తమ ప్రేమ, పెళ్లిపై నోరు విప్పని ఈ జంట ఎట్టకేలకు స్పందించారు. వివాహం అనంతరం తమ బంధాన్ని అధికారికం చేశారు. కాగా కల్యాణ మండపాన్ని ఎల్లో, ఆరెంజ్, పింక్ కలర్ పరదాలతో, రకరకాల పువ్వులతో అలంకరించారని సమాచారం. అద్దాలు పొదిగిన పల్లకిలో పెళ్లి కూతురు కత్రినా కల్యాణ మండపానికి చేరుకున్నారట. ఎరుపు రంగు లెహెంగాలో కత్రినా, తెలుపు రంగు షేర్వానీలో విక్కీ మెరిసిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఏడడుగులు వేశాక, విక్ట్రీనా నాలుగు లక్షల ఖరీదైన కేక్ను కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారట. చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే.. ఇటలీ చెఫ్ ఈ కేక్ను ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే విందు విషయంలోనూ విక్ట్రీనా ఏమాత్రం తగ్గలేదు. అతిథుల కోసం ఎన్నో పసందైన వంటకాలను చేయించారట. రాజస్థానీ వంటకాలు ఈ వెడ్డింగ్ స్పెషల్ అని బీ టౌన్ ఖబర్. విక్ట్రీనా పెళ్లి వేడుకలను ఓ ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ దక్కించుకుందని భోగట్టా.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ పెళ్లి స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ టాక్. బాలీవుడ్ నుంచి కబీర్ ఖాన్, ఆయన సతీమణి మినీ మాధుర్, విజయ్కృష్ణ ఆచార్య, నేహా ధూపియా, ఆమె భర్త అంగద్ బేడీ తదితరులు హాజరయ్యారని సమాచారం. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..
బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా పెళ్లి వేడుకలకు వేదికగా మారింది. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్ను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమ పెళ్లి విషయాన్ని ఈ కపుల్ గోప్యంగానే ఉంచుతున్నారు. ఇక పెళ్లి అనంతరం వీక్కీ, కత్రినాలా వెడ్డింగ్కు సంబంధించిన తొలి ఫోటో సోషల్ తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఓ ఫ్యాన్ పేజ్ ఈ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో కోటపై భార్యభర్తలుగా నిల్చున్న వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. చదవండి: నా కల నిజమైంది, లోబో ఎమోషనల్ ఇక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ నిర్వహించారు. వెడ్డింగ్ ప్లానర్లు ముఖ్య అతిథుల కోసం 8 నుంచి 10 టెంట్లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట. చదవండి: అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు? View this post on Instagram A post shared by Rohan (@rohankbohara) -
Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్తోపాటు, అంబానీ ఫ్యామిలీ
Katrina Kaif Vicky Kaushal Marriage Date: బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ల వివాహం ముచ్చటే ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్లోని విలాస వంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఇప్పటికే కత్రినా, విక్కీ కౌశల్ మెహందీ వేడుక పూర్తి చేసుకున్నారు కూడా. మూడుముళ్ల వేడుక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ అనంతరం డిసెంబర్ 9, గురువారం మధ్యాహ్నం సిక్స్ సెన్సెస్ బార్వారా ఫోర్ట్ వేదికగా సెహ్రా బంద్ వేడుక తర్వాత ఏడు అడుగులు వేసేందుకు ఈ జంట సిద్ధమవుతోంది.పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్ను ఘనంగా నిర్వహించనున్నారు. వెడ్డింగ్ ప్లానర్లు ముఖ్య అతిథుల కోసం 8 నుండి 10 టెంట్లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట. ముఖ్య అతిథులు విక్కీ-కత్రినా వివాహానికి వీవీఐపీలతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు ముఖేశ్ అంబానీ కుటుంబం, ఆయన సోదరుడు అనిల్ అంబానీ కుటుంబం కూడా ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు సమాచారం. ఒబెరాయ్ హోటల్లో వారి కోసం 5 గదులు కూడా రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదితర తారలతోపాటు, క్రికెటర్ విరాట్-అనుష్కతో ఈ వివాహానికి రావచ్చని అంచనా. అయితే ఆహ్వానితులకు సెక్యూరిటీ కోడ్ లేకుండా ఎంట్రీ లేదట. అయితే నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు, సినీ దర్శకుడు కబీర్ ఖాన్ , ఆమె భార్య మినీ మాథుర్, నటి శార్వారీ బాగ్, రోహిత్ శెట్టి ఇప్పటికే వెడ్డింగ్ డెస్టినేషన్కు చేరుకున్నారు. మరోవైపు గూగుల్ విక్కీ భార్య కత్రినాగా గూగుల్ పేర్కొనడం విశేషం. ఓటీటీ దిగ్గజంతో డీల్: రూ. 100 కోట్లు ఆఫర్ సాధారణంగా సెలబ్రిటీలు తమ వివాహ ఫుటేజీలు, ఫోటోలను, మ్యాగజైన్లకు కొన్నిసార్లు ఛానెళ్లకు విక్రయించడం ఇపుడు ట్రెండ్. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ దిగ్గజం పింక్ విల్లా పెళ్లికి సంబంధించిన ఫుటేజీ హక్కుల కోసం కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్లకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by PHONEBHOOT ON 15 july 2022 (@katrinakaifinspiration) -
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
కాబోయే వధూవరులు విక్కీ-కత్రీనాలపై రాజస్థాన్లో కేసు
Case File Against Katrina Kaif and Vicky Kaushal In Rajasthan: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సీక్రెట్గా బాలీవుడ్ లవ్బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను ఈ జంట గోప్యంగా ఉంచినప్పటికీ ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని టాక్. ఇప్పటికే మెహందీ, సంగీత్లో భాగంగా ఈ జంట రాజస్థాన్కు పయనమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమచారం. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ రాజస్తాన్లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలకు షాకిచ్చారు. రాజస్థాన్కు చెందిన ఓ అడ్వకేట్ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రాజస్థాన్లో చౌత్మాత మందిర్ ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిన విషయమే. నిత్యం భక్తులతో ఈ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ మందిర్కు వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన పెళ్లి వేడుకలో భాగంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో పాటు జిల్లా కలెక్టర్పై ఫిర్యాదు చేశాడు. అయితే విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేవలం అమ్మవారి టెంపుల్ దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. అంతేగాక వెంటనే ఆ దారిని తిరిగి తెరవాల్సిందిగా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరారు. -
కత్రీనా కారు ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. తర్వాత ?
Katrina Kaif Car Stopped By Traffic Police In Mumbai: బీటౌన్లో అత్యంత ట్రెండింగ్ టాపిక్ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ వివాహం. డిసెంబర్ 7 నుంచి 10 వరకు వారి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. మంగళవారం సంగీత్, తర్వాత మెహందీ, అనంతరం 9న విక్కీ, కత్రీనాల వివాహం కానుండగా, 10న రిసెప్షన్ జరగనుందని సమాచారం. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అధికారికంగా ఎప్పుడూ ప్రకటిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆ సమయంలో డిసెంబర్ 5న కత్రీనా, విక్కీ సాధారణంగా ముంబై రోడ్లపై దర్శనమిచ్చారు. జిమ్కు కలిసి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కత్రీనాకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో కత్రీనా కారును ట్రాఫిక్ పోలీసు ఆపి, తనిఖీ చేయడానికి ముందుకు వస్తాడు. డ్రైవింగ్ సీటు దగ్గరికి వస్తూ కిటికిలోంచి లోపలికి చూస్తాడు. ఒక్కసారిగా కత్రీనా చూసి షాక్ అయిన పోలీసు డ్రైవర్తో మాట్లాడి ఓకే చేసి కారు పంపిస్తాడు. అయితే కత్రీనా పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు కారు తనిఖీ చేయడాన్ని చూసి జనం చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోపై కూడా నెటిజన్లు కామెంట్స్ చేశారు. కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లి గురించి సరదాగా కామెంట్స్ చేస్తూ, వివాహ కబురు త్వరగా చెప్పాలని కోరారు. అలాగే మరొక వీడియోలో ఓ అభిమానితో కత్రీనా సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. అభిమాని కోరిక మేరకు క్యాట్ ఏమాత్రం వెనుకాడకుండా సెల్ఫీ దిగడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆమె మంచి స్వభావాన్ని తెగ ఇష్టపడుతూ.. 'అందమైన మనసున్న వధువు' అని ఓ నెటిజన్ ప్రశంసించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ?
OTT Offers 100 Crores For Katrina And Vicky Marriage Footage: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ వారి గురించి ఏం వార్త వస్తుందో అని ఎదురుచూస్తుంటారు. డేటింగ్ తర్వాత షాదీకి సిద్ధమైన హీరోహీరోయిన్లకు అభిమానుల్లో, వ్యాపార వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ పెళ్లి వేడుకలను వ్యాపారంగా మార్చుకున్న బిజినెస్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఎవరైనా బాలీవుడ్ స్టార్ కపుల్స్ అనుమతిస్తే పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేస్తామని ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇక వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలకు మంచి బిజినెస్ ఉంటుందని చెప్పొచ్చు. తాజాగా కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతోందని సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ స్టార్ సెలబ్రిటీకి దక్కని రేంజ్లో వీరికి ఈ బంపరాఫర్ ఇవ్వడం విశేషం. అందుకే మొబైల్స్ ఫోన్స్ తీసుకురాకుండా పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు కూడా కఠినమైన ఆంక్షలు విధించినట్లు బీటౌన్లో టాక్. ఏ ఒక్క ఫొటో, వీడియో బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు భోగట్టా. అయితే కత్రీనా గతంలోనే సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంటుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఎమోషనల్గా వారి మధ్య బ్రేకప్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కత్రీనా మరొక హీరోను పెళ్లి చేసుకోబోతోంది అనడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్గా మారింది. అందుకే జనాలు కచ్చితంగా చూస్తారని ఫుటేజ్ కోసం పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? -
విక్ట్రీనా..వేడుకలు షురూనా
పెళ్లి వేడుక ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని చాలామంది కోరుకుంటారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్లు కూడా అలానే అనుకున్నట్లున్నారు. అందుకే తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ ప్రేమికుల వివాహం రాజస్థాన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరగనుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్లో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడీకి ఫ్యాన్స్ పెట్టిన పేరు)ల వివాహ వేడుకలు జరగనున్నాయని బాలీవుడ్ టాక్. మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్ జరగనున్నాయట. కోటలో విక్కీకి ‘రాణా మాన్సింగ్’ పేరున్న సూట్ని, కత్రినాకు ‘రాణి పద్మావతి’ పేరున్న సూట్ని బుక్ చేశారని వినికిడి. ఒక్కో గది అద్దె రోజుకి దాదాపు 7 లక్షల రూపాయలని సమాచారం. సోమవారం వధూవరుల కుటుంబం ఫోర్ట్లో చెకిన్ అయ్యారు. 11న చెక్ అవుట్ అవుతారు. అలాగే అతిథుల కోసం కూడా విలాసవంతమైన గదులను బుక్ చేశారట. ఒక్కో గది అద్దె రోజుకి 70 వేల రూపాయలని టాక్. దాదాపు 120 మంది అతిథిలు ఈ వేడుకల్లో పాల్గొంటారని బాలీవుడ్ అంటోంది. పెళ్లికి హాజరయ్యేవారందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకుని ఉండాలి లేదా ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలి. అలాగే సెల్ఫోన్కు అనుమతి లేదని కాబోయే వధూవరులు అతిథులకు విన్నవించుకున్నారట. వేడుకలకు హాజరయ్యేవారందరూ ప్రముఖులు కాబట్టి రక్షణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సుమారు వంద మంది బౌన్సర్లను నియమించారట. ఓటీటీలో పెళ్లి వేడుక: వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఓ ఓటీటీ ప్లాట్ఫామ్ భారీ ఆఫర్తో విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. అందుకే వేడుకలకు సంబంధించి ఒక్క ఫొటో కానీ, చిన్న వీడియో కానీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. మాజీలకు ఆహ్వానం లేదు... మరోవైపు విక్ట్రినా పెళ్లికి హాజరయ్యే బాలీవుడ్ ప్రముఖల జాబితాలో కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, రణ్బీర్ కపూర్ పేర్లు ఉన్నాయా? లేవా? అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. కానీ తమకు ఆహ్వానం అందలేదని సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే విక్కీ మాజీ ప్రేయసి హర్లీన్ సేథీని కూడా ఆహ్వానించలేదని భోగట్టా. వివాహానికి వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కరణ్ జోహార్, కబీర్ ఖాన్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్ ధావన్ పేర్లు వినిపిస్తున్నాయి. -
నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
Kiara Advani Comments On Katrina And Vicky Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం ప్రస్తుతం బీటౌన్ హాట్ టాపిక్ అని తెలిసిన సంగతే. వీరిద్దరూ డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో పెళ్లి చేసుకోబోతునట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం కోసం ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాహం గురించి ఇటు కత్రీనా, అటు విక్కీ అధికారికంగా పెదవి విప్పలేదు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే వీరి షాదీకి హాజరయ్యేవారు ఎవరెవరూ అనేది ఇంకో టాపిక్గా మారింది. అయితే క్యాట్, విక్కీ వివాహంపై బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 3) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారి పెళ్లి గురించి అడిగితే కియార మొదట ఆశ్చర్యపోయింది. 'నిజంగానా ? వార్తలు విన్నాను, కానీ నాకేం తెలీదు. నన్నైతే ఇప్పటివరకు ఆహ్వానించలేదు.' అని చెప్పుకొచ్చింది 'కబీర్ ఖాన్' ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరీమణులు అల్విరా, అర్పిత, వారి కుటుంబ సభ్యులు కత్రీనా, విక్కీల వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. వారికి కూడా ఇంతవరకూ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మాధోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారని సమాచారం. డిసెంబర్ 4 నుంచి 12 మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందట. డిసెంబర్ 7న 'సంగీత్', మరుసటి రోజు 'మెహందీ' కాగా పెళ్లి తర్వాత ఈ నెల 10న ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకకు సుమారు 120 మంది బాలీవుడ్ పెద్దలు అతిథులుగా విచ్చేయనున్నారని సమాచారం. ఇదీ చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..! -
విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..!
ప్రస్తుతం బాలీవుడ్లో అనే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం ఏంటంటే బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ల పెళ్లి ముచ్చట. గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. గెస్ట్ లిస్ట్, వివాహ వేదిక తదితర వివరాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత వరకు విక్కీ, కత్రినలు ఈ వార్తలపై స్పందించలేదు.. అలా అని ఖండించలేదు. మౌనంగా ఉన్నారు. అంటే అర్థాంగీకరామేమో మరి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2021, డిసెంబర్ 9 విక్కీ-కత్రినాల వివాహం అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్తాన్లోని సవాయి మాధోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ వేడుకకు వేదికగా మారనుందట. సరే వారిద్దరి వివాహం అయిననాడు తప్పకుండా అందరికి తెలుస్తుంది. అయితే ఈలోపు నెటిజనులు మరో పనిలో పడ్డారు. విక్కీ-కత్రినాల వివాహం నాడు సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తూ.. బోలెడన్ని మీమ్స్ క్రియేట్ చేశారు. అంతటితో ఆగక #VickyKatrinaWedding పేరుతో ఈ మీమ్స్ని ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక వీటిని చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. వాటిపై మీరు ఓ లుక్కెయండి. (చదవండి: ఇప్పట్లో రకుల్ పెళ్లి లేనట్లే.. అసలు నిజం చెప్పేసిన బ్యూటీ) #VickyKatrinaWedding Selmon bhoi at their wedding pic.twitter.com/zC4QUR1zaF — Yuvraj Pratap Rao 🇮🇳 (@yuvrajuv444) December 2, 2021 #VickyKatrinaWedding Salman be like: pic.twitter.com/Kjge0ZpoEo — Aksha (@Aksha00786) December 2, 2021 #VickyKatrinaWedding Reactions after Vicky Kat wedding : pic.twitter.com/p6UGFGvUDj — Ctrl C + Ctrl Memes 🇦🇫 ♥️ 🇮🇳 (@Ctrlmemes_) December 2, 2021 #VickyKatrinaWedding Somewhere is parallel universe pic.twitter.com/fNzhkNHd6j — Tweetera🐦 (@DoctorrSays) December 2, 2021 ఇక విక్కీ-కత్రినాల వివాహానికి సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదట. సల్మాన్ కుటుంబానికి ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ తెలియజేశారు. ‘విక్కీ, కత్రినా వివాహానికి సంబంధించి మాకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు’ అని తెలిపారు. (చదవండి: డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!) సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తొలిసారిగా 2005లో ‘మైనే ప్యార్ క్యున్ కియా’లో కలిసి నటించారు. ఆ తర్వాత వారు భారత్, యువరాజ్ వంటి చిత్రాలలో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ టైగర్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం టైగర్ 3 లో కలిసి నటిస్తున్నారు. చదవండి: ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం! -
సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్
Katrina Kaif And Vicky Kaushal Wedding Date: హీరోయిన్ల పెళ్లి కబురంటే ఆ సందడే వేరు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనేది బజింగ్ టాక్. అయితే మీడియాకు దూరంగా ఈ వేడుకనుఎంతో రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు ఈ లవ్బర్డ్స్. కానీ బీటౌన్ ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు. అతిరథ మహా రథులట, ఎగ్జోటిక్ సెర్మనీ, టైగర్ సఫారీ అట, అంతేకాదండోయ్ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్కు హాజరయ్యే అతిథులకు బోలెడన్ని కండిషన్లట. 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్న ఈ స్టార్ జంట ఈ రోజో రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద తమ పెళ్లిని నమోదు చేసుకోనున్నారు. ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ ఎగిరి పోనున్నారు. హాట్ టాపిక్గా నిలుస్తోన్న క్యాట్-విక్కీ వెడ్డింగ్ అంచనాలపై ఓ లుక్కేద్దాం. View this post on Instagram A post shared by Six Senses Fort Barwara (@sixsensesfortbarwara) -
విక్కీ-కత్రినా పెళ్లిలో సెల్ఫోన్ల బ్యాన్పై నటుడు స్పందన, పోస్ట్ వైరల్
Actor Gajrajrao Objects Mobiles Ban In Vicky Kaushal-Katrina Kaif Marriage: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ల పెళ్లి వార్తలు హాట్టాపిక్గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించి అప్డేట్స్ను ఈ జంట గొప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Katrina Kaif-Vicky Kaushal Marriage: డిసెంబర్ మొదటి వారంలోనే పెళ్లి, ఫస్ట్ కోర్టులో వివాహం! కాగా డిసెంబర్ 9వ తేదీకి వీరి పెళ్లి ముహుర్తం ఖారారైందని, రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ మహోత్సవం జరగనుందంటూ వార్తలు వస్తున్నాయి. అంతేగాక వీరి పెళ్లికి ముబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేసినట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై ప్రముఖ నటుడు గజ్రాజ్ రావు వ్యంగ్యంగా స్పందించాడు. ఇన్స్టాగ్రామ్లో ఆయన విక్కీ-కత్రినాల ఫొటోను షేర్ చేస్తూ వివాహ సమయంలో సెల్ఫోన్లు బ్యాన్ చేశారు. ‘సెల్ఫీ తీసుకోవడానికి కూడా వీలు లేదంటే నేను పెళ్లికి రాను’ అంటూ సరదాగా పోస్ట్ షేర్ చేశాడు. చదవండి: మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం దీంతో ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పోస్టుతో వారి పెళ్లిపై వస్తున్న వార్తలకు స్పష్టత వచ్చిందంటున్నారు నెటిజన్లు. సెల్ఫోన్లు బ్యాన్ చేస్తే కష్టమని, విక్కీ-కత్రినాలు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా రాజస్థాన్ పయనమయ్యే ముందు ముంబైలో విక్కీ-కత్రినాలు కోర్టు వివాహం చేసుకొన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లతో బిజీగా ఉన్నారట ఇరు కుటుంబ సభ్యులు. అయితే పెళ్లి కేవలం 200 మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. -
ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం!
Katrina Kaif And Vicky Kaushal Marriage Date: కొద్ది రోజులుగా బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ల పెళ్లి వార్తలు హాట్టాపిక్గా నిలుస్తున్నాయి. మొదటి నుంచి వీరి రిలేషన్ను గోప్యంగా ఉంచుతూ వస్తున్న ఈ జంట దీపావళి పండుగ సందర్భంగా సీక్రేట్ రోకా ఫంక్షన్ జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వరుసగా వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి వివాహనికి సంబంధించిన అప్డేట్స్ను కూడా ఈ జంట సీక్రెట్గా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో విక్కీ-కత్రినాల పెళ్లి తేదీ ఖరారైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్లో ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా? తాజా వీరి వివాహని ముహుర్తం కూడా ఖరారైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో ఈ జంట వివాహ మహోత్సవ వేడుకను జరనుందని బి-టౌన్ జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రోజే విక్కీ-కత్రినా పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కత్రినా కైఫ్ సన్నిహితులు చెబుతున్నారు. రాజస్థాన్లో జరిగే వీరి వివాహ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో సంగీత్, మెహందీ వేడుక జరగనున్నాయట. ఇక 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలు, సెలబ్రెటీలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! వెడ్డింగ్కు 200 మంది అతిధులు హాజరు కానున్నారని కూడా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి ఎవరు మొబైల్స్ తీసుకురావొద్దనే కండీషన్ పెట్టారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే వివాహానికి జైపూర్ పయనమయ్యే ముందు విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. చదవండి: కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? -
కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?
The Specialty Of Katrina Kaif Wedding Mehndi: పెళ్లి అంటే ఎన్నెన్నో కలలు కంటారు అమ్మాయిలు. ఆ వేడుకలో జరిగే ప్రతీ తంతు ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. మెహందీ నుంచి హనీమూన్ దాకా, కాలి మెట్టెల నుంచి నుదిటిపై పాపడ బిళ్ల వరకు విభిన్నంగా, ఆసక్తికరంగా చేయాలని కోరుకుంటుంది మగువల మనసు. మరీ ఇక సెలబ్రిటీల విషయానికస్తే..! ప్రతీ ఫంక్షన్లో కొత్తగా కనపించేందుకు ఆరాటపడుతుంటారు. కొన్నిసార్లు సీనీ సెలబ్రిటీలు ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహాలు చేసుకున్న కూడా సందర్భాలు ఉన్నాయి. అలా ఏ అధికారిక ప్రకటన లేకుండా జరుగుతుందే బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం. ఈ వేడుకల్లో కత్రీనా కైఫ్ వేసుకునే మెహందీ ప్రత్యేకత, దానికి ఎంత ఖర్చువుతుందే తెలుసుకుందాం. ఇది చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..? రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో కత్రీనా, విక్కీ కౌశల్ వివాహం జరగనుందని తెలిసిందే. అధికారికంగా వెల్లడవని ఈ వేడుకలు డిసెంబర్ 7 నుంచి 12 వరకు జరగనున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం కత్రీనా తన కాళ్లు, చేతులకు వేసుకునే మెహందీ (హెన్నా) రాజస్థాన్లో ప్రసిద్ధిచెందిన 'సోజత్ మెహందీ'తో తయారు చేయబడిందట. సోజత్లోని కళకారులు ఎలాంటి రసాయనాలు లేకుండా చేతితో తయారు చేస్తారట. దీని విలువ సుమారు రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం. ఇది చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? అలాగే పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి సుమారు 125 మంది వీఐపీ అతిథులు హాజరవనున్నారు. ముంబై నుంచి ప్రయాణించే గెస్ట్లు మొదట జైపూర్లో దిగుతారు. వారికోసం భారీ లగ్జరీ బస్సులు, కార్లు కూడా బుక్ అయ్యాయని సమాచారం. ఈ పెళ్లిలో ప్రముఖ రాజస్థానీ వంటకాలు వడ్డించనున్నారట. ప్రత్యేకంగా 'కేర్ సంగ్రీ' వంటకం కూడా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వంటకాల కోసం వేడుక నిర్వాహకులు సవాయ్ మాధోపూర్లోని ప్రముఖ మిథైవాలా దుకాణంలో పనిచేసే కైలాశ్ శర్మ సహాయం తీసుకున్నారు. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ జంట తమ వివాహంలో ఏస్ డిజైనర్ సభ్యసాచి వస్త్రాలను ధరించనున్నారని తెలిసిందే. ఇది చదవండి: విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా? -
పెళ్లి పీటలు ఎక్కబోతోన్న మరో బాలీవుడ్ ప్రేమ జంట
Tara Sutaria And Aadar Jain Tie Knot Soon: ఈ ఏడాది బాలీవడ్ లవ్బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే హీరో రాజ్ కుమార్ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖను పెళ్లి చేసుకోగా.. త్వరలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రణ్బీర్ కపూర్-అలియా భట్ ఈ డిసెంబర్లో బ్యాచ్లర్ లైఫ్కు గుడ్బై చెప్పబోతున్నట్లు కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి తారా సుతారియా, నటుడు ఆదార్ జైన్ల వివాహం త్వరలోనే జరగనుందంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆదార్ జైన్ ఎవరో కాదు రణ్బీర్ కపూర్కు కజిన్. చదవండి: మెగా డాటర్ శ్రీజ పోస్ట్పై సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఆసక్తికర కామెంట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘మర్ జవాన్’ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారా సుతారియా, నటుడు ఆదార్ జైన్లు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మిగతా ప్రేమ జంటల మాదిరిగా ఈ జంట తమ రిలేషన్ను సీక్రెట్గా ఉంచకుండ ఎప్పటికప్పుడు బయటకు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తరచూ సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలను ఒకరు షేర్ చేసుకోవడం, విందులు వినోదాలకు కలిసి వెళ్లడం, జంటగా హాలీడే వెకేషన్స్కు వెళ్లడమే కాకుండా అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు.అంతేగాక ఇటీవల జరిగిన ఆదార్ జైన్ సోదరుడి వివాహా వేడుకకు తారా సుతారియా కూడా హజరైంది. చదవండి: పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..? ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా త్వరలో ఒక్కటవ్వాలనుకుంటున్నారట. అందుకే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో కూడా చెప్పడంతో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో కత్రీనా-విక్కీ, రణ్బీవర్-అలియా మాదిరిగా వచ్చే ఏడాది సమ్మర్లోగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రణ్బిర్-అలియాల పెళ్లి కంటే ముందు వీరి పెళ్లి జరిగేలా ఉందంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం తారా సుతారియా ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ తడప్ చిత్రంతోపాటు హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది. -
పెళ్లి తర్వాత కత్రీనా పేరు మార్చుకుంటుందా..?
Katrina Kaif Will Change Her Name After Wedding: బాలీవుడ్ జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం జరిగింది. ఇక ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి రాబోయే మరో గ్రాండ్ బాలీవుడ్ కపుల్ వెడ్డింగ్కు సిద్ధమవ్వండి. హా.. అదే కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. ఇప్పటికే కత్రీనా తన వివాహం కోసం దుస్తులను ఎంచుకోవడం ప్రారంభించింది. విక్కీ కౌశల్ వారి వివాహం తర్వాత ఉండటం కోసం ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేశారు. అయితే వివాహం తర్వాత కత్రీనా కైఫ్ తన పేరును కత్రీనా కైఫ్ కౌశల్గా మార్చుకుంటుందా అని తాజాగా చర్చ జరుగుతోంది. పేరు మార్చుకునే అవకాశం ఉందని బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అలా అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' చిత్రం పోస్టర్లు, ట్రైలర్లో కత్రీనా కైఫ్ కౌశల్ అని వస్తుందేమో చూడాలి. డిసెంబర్లో రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో కత్రీనా, విక్కీ వివాహం కానుందని ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందే. ఈ షాదీ వివరాలు మెలిమెల్లిగా పాకి టైగర్ 3 సెట్స్లో ఓ ప్రశ్న తలెత్తిందట. కత్రీనా కైఫ్ తన పెళ్లి తర్వాత కత్రీనా కైఫ్ కౌశల్గా పేరు మార్చుకుంటుందా అని. కత్రీనా పేరులోని మొదటి అక్షరాలు కెకె (KK) అయితే, వివాహం తర్వాత కౌశల్ పేరులోని కె (K) జతగా మారి కెకెకె (KKK) అని కౌగిలించుకున్నట్లు అవుతుందని ఆమె స్నేహితులు చమత్కరిస్తున్నారట. అయితే ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా ఆమెదే అని కత్రీనా సన్నిహితులు చెబుతున్నారు. కత్రీనా పేరు మార్చుకోవాలనుకుంటే టైగర్ 3 పోస్టర్లు, ట్రైలర్పై మేకర్స్ కత్రీనా కైఫ్ కౌశల్గా క్రెడిట్ ఇస్తారు. ఇంతకుముందు కరీనా కపూర్ తలాష్లో కరీనా కపూర్ ఖాన్గా మార్చుకున్నారు. ఐశ్వర్య రాయ్ కూడా, ఐశ్వర్య రాయ్ బచ్చన్గా పేరు మార్చుకున్నారు. దీపికా పదుకొణె మాత్రం తన పేరును మార్చుకోలేదు. చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? -
విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..?
Vicky And Katrina Wedding: బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కైషల్ వివాహం రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 7-12 తేదీల మధ్య వీరి వివాహ వేడుకలు నిర్వహించనున్నారట. ఈ హోటల్లో బుకింగ్ కూడా పూర్తయిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వీఐపీల వివాహలను నిర్వహించడానికి చాలా ఈవెంట్ కంపెనీలు కలిసి పని చేస్తాయి. వేర్వేరు ఈవెంట్ల కోసం రకరకాల కంపెనీలను ఎంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈవెంట్ కంపెనీల ప్రతినిధులు సవాయ్ మాధోపూర్లోని వివిధ హోటళ్లలో గదులు వెతుకుతున్నారట. మరోవైపు కత్రీనా, విక్కీల బృందాలు కూడా పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాయని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృంద మంగళవారం సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుంది. హోటల్ యాజమాన్యం నుంచి అందిన సమాచారం ప్రకారం పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆ టీమ్ పర్యవేక్షిస్తుంది. వరుడు గుర్రం మీద కూర్చొని ఏ ప్రదేశం నుంచి వస్తాడు, మెహందీ ఎక్కడ నిర్వహిస్తారు మొదలైనవాటిని బృందం రెక్కీ చేస్తుందట. అయితే కత్రీనా, విక్కీ వివాహం చేసుకుంటున్న సిక్స్ సెన్సెస్ హోటల్ బర్వార్కు ప్రాచీన చరిత్ర ఉందట. ఇది 14వ శతబ్దంలో నిర్మించినట్లు చెప్పబడే చిత్రాలు ఇక్కడ ఉన్నాయని సమాచారం. ప్యాలెస్లో 48 లగ్జరీ సూట్లు ఉన్నాయి. ఇవి సుమారు 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతిని వర్ణిస్తాయి. సమకాలీన రాజస్థానీ స్టైల్లో రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతను సూక్ష్మంగా పొందుపరిచారు. 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతి చిత్రాలను అక్కడ చూడవచ్చు. హోటల్ టెర్రస్ నుంచి పలు తోటలు, బార్వార గ్రామీణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. విక్కీ కౌషల్, కత్రినా కైఫ్తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ను విక్కీ గానీ కత్రీనా గానీ తిరస్కరించలేదు, ధ్రువీకరించలేదు. -
డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!
Katrina Kaif Forced Vicky Kaushal To Have A Wedding In December: ఏడువందల ఏళ్ల నాటి కోట సాక్షిగా హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ ఏడడుగులు వేయనున్నారన్నది బాలీవుడ్ తాజా టాక్. కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటివారు కావాలనుకుంటున్నారన్నది ప్రచారంలో ఉన్న వార్త. ఈ విషయం గురించి ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు కానీ పెళ్లి పనులు మాత్రం జోరుగా జరుగుతున్నాయట. వివాహ వేదికగా రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాని ఫిక్స్ చేశారని సమాచారం. ఇది దాదాపు ఏడువందల ఏళ్ల చరిత్ర ఉన్న కోట. ఈ కోటలోని లగ్జరీ హోటల్లో విచ్చేసే అతిథుల కోసం గదులు బుక్ చేయడం, వారిని పికప్ చేసుకోవడానికి కార్లు బుక్ చేయడం కూడా జరిగిపోయిందని భోగట్టా. వచ్చే నెల 7 నుంచి 9 లోపు వివాహం జరుగుతుందట. మెహందీ, సంగీత్ వంటి వేడుకలను ఆ కోటలోనే ప్లాన్ చేశారని బాలీవుడ్ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం వచ్చే ఏడాది మేలో పెళ్లి చేసుకోవాలని విక్కీ అనుకున్నారట. కానీ వేసవి వెడ్డింగ్ కత్రినాకి నచ్చలేదట. ఎంచక్కా వింటర్లో కూల్ కూల్గా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని విక్కీతో అన్నారట. అందుకే డిసెంబర్లో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారని టాక్. -
విక్కీ కౌషల్ కాబోయే భార్యకు ఈ లక్షణాలు ఉండాలట..
ప్రస్తుతం బీటౌన్లో విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ, పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్. వారిద్దరూ సీక్రెట్గా వివాహ కార్యక్రమాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తనకు ఎలాంటి భార్య కావాలో, ఆమెకు ఉండే లక్షణాలేంటో చెప్పాడు విక్కీ. ఇటీవల 'ఇన్ టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' పోగ్రామ్లో అతిథిగా హాజరైన విక్కీ కౌషల్ తన కాలేజ్ డేస్ను గుర్తు చేసుకున్నాడు. అలాగే తన మూలాల గురించి, తన వివాహ ప్రణాళికల గురించి షోలో చెప్పుకొచ్చాడు. విక్కీ వివాహ ప్రణాళికల గురించి అడిగినప్పుడు ఇలా చెప్పాడు. 'జీవితంలో ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతాను. నాకు కాబోయే భార్య ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుభూతి చెందాలి. మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి అవగాహన ఉండాలి. ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. ఇద్దరి ప్లస్లు మైనస్లను ప్రేమించాలి. ఒకరినొకరం బెస్ట్గా మార్చుకోవాలి.' అయితే కత్రీనా, విక్కీ వివాహ వేడుకలు, ప్రణాళికల గురించి మాత్రం పెదవి విప్పలేదు విక్కీ కౌషల్. కత్రీనా, విక్కీ వివాహం రాజస్థాన్లో ఉన్న సవాయ్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో జరగనుందని సమాచారం. వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 వరకు జరుగుతాయని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్లో వేడుకల ఏర్పాటు అనేక కారణలున్నాయట. పెళ్లిలో వేసుకునే రాజామాన్ సింగ్ సూట్ అత్యంత ఖరీదనైది. దీని విలువ వైబ్సైట్ ప్రకారం నివాసం, పెళ్లి తేదీలు, లభ్యతను బట్టి రూ. 64,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందట. మరోవైపు కత్రీనా, విక్కీ కౌషల్ బృందాలు వివాహానికి సన్నాహాలు మెదలు పెట్టాయని సమాచారం. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈ టీమ్స్ పర్యవేక్షిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ
బాలీవుడ్ నటులు విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయన్న సంగతి తెలిసిందే. వారు సీక్రెట్గా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో రోకా చేసుకున్నారని కూడా విన్నాం. తాజాగా వారి వివాహ వేడుకలు డిసెంబర్ 7, 9 మధ్య రాజస్థాన్లో జరుగుతాయని సమాచారం. ఆ వేడుకలకు వధూవరులు సబ్యసాచి ఔట్ఫిట్స్ ధరించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయాలపై విక్కీ కౌషల్ మాజీ ప్రేయసీ హర్లీన్ సేథీ స్పందించింది. కత్రీనా, విక్కీ కౌషల్ ప్రేమాయణం పుకార్లపై తనకు ఎలాంటి స్పష్టత లేదంది. వారి రిలేషన్షిప్ గురించి తనకు ఎలాంటి బాధలేదని హర్లీన్ చెప్పిందట. హర్లీన్ ఇప్పుడు మూవ్ ఆన్ అయిందని, తన పనిలో మునిగిపోయిందని ఆమె సన్నిహితులు ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్ తీస్తున్న 'ది టెస్ట్ కేస్ 2' గురించి ఎక్జైటింగ్గా ఉందని చెప్పారు. ఈ సిరీస్లో హార్లిన్ చుట్టు కథ తిరుగుతుందని తెలిపారు. అయితే విక్కీ ప్రేమ వ్యవహారం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు తనను అందులోకి లాగొద్దు అని చెప్పిందని సమాచారం. చదవండి: విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా? ఇంతకుముందు ఓ ఇంటర్యూలో విక్కీ ఒంటరిగా ఉన్నానని చెప్పాడు. 2019లో తన ఇన్స్టాగ్రామ్లో విక్కీని హర్లీన్ అన్ఫాలో చేయడంతో వీరిద్దరు విడిపోయారనే పుకార్లు మొదలయ్యాయి. కత్రీనా కైఫ్తో విక్కీ సన్నిహితంగా ఉండటం కూడా వారి బ్రేకప్కు కారణమట. కత్రీనా గతంలో హీరో రణ్బీర్ కపూర్తో రిలేషన్షిప్లో ఉండగా, విక్కీ హర్లీన్ సేథీతో డేటింగ్ చేశాడు. -
అభిమాని నుంచి సమోసా పావ్ తీసుకున్న బ్యూటీ.. ఎంత క్యూట్గా నవ్విందో
Sara Ali Khan Took Samosa From Her Fan: బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్(Sara Ali Khan) తరచుగా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ముంబైలో తన ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో తన అభిమాని నుంచి ఆమెకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా పావ్ను తీసుకుంటున్నట్టు కనిపించింది. సమోసా తీసుకొని, క్యూట్గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పిందీ కూలీ నెం 1 హీరోయిన్. వీడియోలో సారా వెంట హీరో విక్కీ కౌషల్ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టా గ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల కేదార్నాథ్ సందర్శన కోసం వెళ్లిన సారా అలీ ఖాన్ ట్రోల్కు గురైంది. ఈ నెలలో తన తల్లిదండ్రుల డైవర్స్ గురించి కూడా మాట్లాడింది సారా. ఓ ఇంటర్వ్యూలో మీ తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కష్టంగా ఉందా అని అడిగిన హోస్ట్ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. ' నా వయసులో ఇతరుల కంటే కొంచెం ఎక్కువ పరిపక్వం చెందే ధోరణి నాకు ఎప్పుడూ ఉంటుంది. తొమ్మిదేళ్ల వయసులో కూడా అలాగే ఉన్నాను. మా ఇంట్లో కలిసి జీవించే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా లేరని అనిపించింది. తర్వాత వారు రెండు వేర్వేరు కొత్త ఇళ్లల్లో సంతోషంగా గడపడం చూశాను. పదేళ్లలో ఒక్కసారైన మా అమ్మ నవ్విందని నేను అనుకోను, అలాంటింది అకస్మాత్తుగా సంతోషంగా ఉంది. అలా ఇద్దరు వేర్వేరు ఇళ్లల్లో సంతోషంగా ఉంటారంటే నేను ఎందుకు సంతోషంగా ఉండను'. సారా అలీ ఖాన్ చివరిసారిగా వరుణ్ ధావన్ నటించిన కూలీ నెం 1లో నటించింది. ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం 'ఆత్రంగి రే'లో అక్షయ్ కుమార్, ధనుష్తో కలిసి యాక్ట్ చేయనుంది. -
విక్కీ కౌషల్, కత్రీనా ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా?
బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్, విక్కీ కౌషల్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వారు ప్రేమలో మునిగితేలుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఐదు రోజుల క్రితం కత్రీనా కైఫ్కు సన్నిహితుడైన ఏక్ థా టైగర్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో వీరిద్దరికి రోకా జరిగిందని అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ హీరో హీరోయిన్లు వారి రిలేషన్ను ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీరికి సంబంధించి ఇంకో గాసిప్ బయటికొచ్చింది. విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ వారి వివాహం తర్వాత అపార్ట్మెంట్లోకి మారనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అందుకు ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్లో మరో పాపులర్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఉంటున్నట్లు సమాచారం. జుహులోని రాజ్మహల్ అల్ట్రా లగ్జరీ భవనంలో ఓ ఫ్లాట్ను ఐదేళ్లకు రెంట్కు తీసుకున్నట్లు రియల్ ఎస్టేట్ వెబ్ హెడ్ వరుణ్ సింగ్ చెప్పాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే కత్రీనా కైఫ్ తన ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంతకుముందు చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఈ అల్లరి పిడుగు హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్తో లవ్ ఎఫైర్ నడిపారు. సుమారు ఏడేళ్ల క్రితం ఈ రిలేషన్ పీక్స్లో సాగింది. అయితే ఈ విషయాన్ని కత్రీనా కైఫ్ గానీ, సల్మాన్ ఖాన్ గానీ బయటపెట్టలేదు. అనంతరం బ్రేకప్ కూడా జరిగింది. రణ్బీర్ కపూర్తోనూ సీరియస్గా లవ్ ట్రాక్ నడిపిందని ప్రచారం సాగింది. పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ బంధం కూడా ఎన్నో రోజులు నిలువలేదు. అక్షయ్ కుమార్తో పలు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. అప్పుడు వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అలాగే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించడం, పలు ప్రైవేట్ పార్టీల్లో కలిసి పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ అమ్మడి ప్రేమ వ్యవహారాలేవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించకపోవడం విశేషం. -
ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా!
Katrina Kaif And Vicky Kaushal Had Roka Ceremony : ఇటీవల దీపావళి పండగతో పాటు అదే రోజున విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ల జీవితాల్లో మరో వేడుక కూడా జరిగిందని బాలీవుడ్ టాక్. ఆ వేడుక ఏంటంటే ‘రోకా’. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో ఇదొకటి. నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి–అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి మాట్లాడుకోవడమే ‘రోకా’ ఫంక్షన్. ఉత్తరాదిన ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తారు. దీపావళి రోజు కత్రినా–విక్కీ కుటుంబ సభ్యులు ఇవే మాట్లాడుకున్నారట. దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగిందట. కబీర్ దర్శకత్వంలో ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ చిత్రాల్లో నటించారు కత్రినా. ఆయన్ను సోదరుడిలా భావిస్తారు. అందుకే రోకా వేడుకకు ఆయన ఇల్లు వేదిక అయిందట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న విక్కీ–కత్రినాల పెళ్లికి వేళయిందని, డిసెంబర్లో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారని బాలీవుడ్ అంటోంది. మరి.. ఇయర్ ఎండింగ్లో విక్కీ బ్యాచిలర్ లైఫ్కి, కత్రినా బ్యాచిలరెట్ లైఫ్కీ ఎండ్ కార్డ్ వేస్తారా? వేచి చూడాలి. -
లవ్బర్డ్స్ పెళ్లి, ఆహ్వానాలు అందుకే పంపడం లేదట!
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి వార్త మరోసారి గుప్పుమంది. గత కొద్ది రోజులుగా కత్రినా, తన ప్రియుడు విక్కీ కౌశల్తో ఏడడుగులు వేయనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు పెళ్లిపై పలు రూమర్లు కొనసాగుతుండగానే ఈ దీపావళి వేడుకల్లో ప్రొడ్యూసర్ ఆర్తీ శెట్టి నివాసం వద్ద ఈ జంట కంటబడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా నివేదికల ప్రకారం త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారనీ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా రహస్యంగా చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. అందుకే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఇంకా ఎవరికీ పంపడం లేదని టాక్. అంతేకాదు కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. దీంతో విక్కీ కుటుంబం నుంచి కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ బీటౌన్లో వీరి వివాహానికి సంబంధించిన ఊహాగానాలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ జంట డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో రాజస్థాన్లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇంకా వివాహ ఆహ్వానాలను కూడా ఇంకా ఎవరికి పంపలేదట. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండే కత్రినా ఇటీవల తమ వెడ్డింగ్ ప్లేస్పై మీడియాలు వార్తలు రావడంపై చాలా అసహనంగా ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే మరింత లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు తాజా లీకుల నేపథ్యంలో పెళ్లి వేదికను కూడా మార్చే ప్లాన్లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఈ 15 ఏళ్ల నుంచి తన పెళ్లి వార్తలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి..నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు అంటూ ఇటీవల కత్రినా మండి పడినప్పటికీ ఈ బ్యూటీ పెళ్లి వార్త బజింగ్గానే నిలుస్తోంది. మరి ఈ విషయంపై విక్కీ-కత్రినా అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్కు తెరపడదు. -
‘విరుష్క’ పొరుగింటికి మారనున్న కత్రినా, విక్కీ?
అందాల తార కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్షిప్ కొన్నిరోజులుగా హిందీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకూ వారికి నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారు చేయగా.. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే వారు జంటగా కొత్త ఇల్లు తీసుకోబోతున్నారని. గతేడాది విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట ముంబైలోని జుహులో కొత్త ఇల్లు తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఇంటిని విక్కీ, కత్రినా (అభిమానులు విక్యాట్గా పిలుస్తుంటారు) జంట కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైందని రూమర్స్ వస్తున్నాయి. ఆ ఇంటిని రెండు నెలల క్రితమే ఈ కపుల్ సందర్శించినట్లు, అది వారికి బాగా నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే డిసెంబర్లో రాజస్థాన్లో వారి వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా అనుష్క, కత్రినాకి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ‘జబ్ తక్ హై జాన్’కి ఇద్దరూ కలిసి పని చేశారు. గతంలో కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’కి ఇద్దరు భామలు అతిథులుగా వచ్చి తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు. దీంతో విక్యాట్ల పెళ్లి గురించి, కొత్త ఇల్లు గురించి ఉన్నవి రూమర్స్ కాదని, జరగబోయే నిజాలని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. చదవండి: కత్రినా కైఫ్తో ఎంగేజ్మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్ -
ఆస్కార్కి ఎంపిక కాకపోవడంపై ‘సర్దార్ ఉద్దం’ నటుడి స్పందనేంటో తెలుసా?
Vicky Kaushal On Sardar Udham Oscar Rejection: ‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ సర్కార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సర్దార్ ఉద్ధం’. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ మూవీ ఆస్కార్ 2022కి వెళ్లేందుకు షార్ట్లిస్ట్ అయిన 14 చిత్రాల్లో నిలిచింది. కానీ ఆస్కార్ బరిలో మాత్రం నిలవలేకపోయింది. ‘సర్దార్ ఉద్ధం’లో బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే ఈ మూవీని ఆస్కార్కి సెలెక్ట్ చేయలేదని జ్యూరీ సభ్యుడు ఒకరు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సినిమా నటుడు విక్కీ కౌశల్ తాజాగా స్పందించాడు. ‘ప్రతి ఒక్కరికీ వారి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. మనకు సినిమా నిపుణులతో కూడిన జ్యూరీ ఉంది. వారి నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవించాలి. నేను తమిళ చిత్రం ‘కూజంగల్’ని చూడలేదు, కానీ సుజిత్ చూసి బావుందని చెప్పాడు. గ్లోబల్ ప్లాట్ఫారమ్లో భారతీయ సినిమా ఎలివేట్ అయ్యేందుకు ఇది ఉత్తమ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం మనకు కీర్తిని తెస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మా సినిమాని బావుందని ప్రశంసిస్తూ, చూడామని మరొకరికి రిఫర్ చేస్తున్నారు అంతకంటే ఏ కావాలని తెలిపాడు. చదవండి: వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే.. ‘సర్దార్ ఉద్ధం’ని ఆస్కార్కి సెలెక్ట్ చేయలేదు -
Oscars 2022: వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే.. ‘సర్దార్ ఉద్ధం’ని సెలెక్ట్ చేయలేదు
ఆస్కార్ 2022కి ఇండియా నుంచి తమిళ చిత్రం ‘కూజంగల్’ ఎంట్రీ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 14 సినిమాలు నామినేట్ కాగా ఈ సినిమాని సెలెక్ట్ చేసింది 15 మంది సభ్యుల జ్యూరీ బృందం. అయితే అందులో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉదమ్ సింగ్ జీవితకథతో తెరకెక్కిన ‘సర్దార్ ఉద్దం’ కూడా ఉంది. బాలీవుడ్ కుర్ర హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సినిమాని 94వ అకాడమీ అవార్డ్స్కి పంపకపోవడానికి కారణాన్ని తెలిపాడు జ్యూరీ సభ్యుడు ఇంద్రదీప్ దాస్గుప్త. ‘సర్దార్ ఉద్దం’ బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది కథ. అందుకే ఈ చిత్రాన్ని ఆస్కార్స్ నామినేషన్స్కి పంపేందుకు జ్యూరీ అంగీకరించదని ఇంద్రదీప్ తెలిపాడు. చరిత్ర మరిచిపోయిన ఓ పోరాట యోధుడి కథతో వచ్చిన ఈ సినిమా ఎంతో బావుందని, అయినప్పటికీ ప్రస్తుత గ్లోబలైజేషన్ శకంలో ద్వేషాన్ని ప్రతిబింబించటం అంత మంచిది కాదని ఆయన ఈ జ్యూరీ సభ్యుడు తెలిపాడు. అయితే ఆస్కార్ బరిలో నిలిచిన ‘కూజంగల్’ సినిమాని వినోద్ దర్శకత్వంలో నటి నయన తార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ నిర్మించారు. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో -
కత్రినా కైఫ్తో ఎంగేజ్మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్
టాలెంటెడ్ యాక్టర్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న కొద్దిమందిలో ఒకరు విక్కీ కౌశల్. ఆయన నటి కత్రినా కైఫ్తో డేటింగ్ చేస్తున్నాడని ఎప్పుటి నుంచో రూమర్స్ వినిపిస్తుండగా.. ఇటీవల ఏకంగా వారు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ కుర్ర హీరో తాజా చిత్రం ‘సర్దార్ ఉద్ధం’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో విడుదలై మంచి విజయాన్ని టాక్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో ఇచ్చిన ఇంటర్వూలో ఈ రూమర్స్ పై ఆయన స్పందించాడు. విక్కీ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘క్యాట్తో ఎంగేజ్మెంట్ జరిగిందని రూమర్స్ ఆ రోజు ఉదయం వచ్చాయి. అప్పుడు షూట్ మధ్యలో ఉన్నాను. మళ్లీ సాయంత్రానికి చూస్తే అవన్నీ వట్టి పుకార్లేనని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజా నిజాలేంటో తెలిసిపోవడంతో వాటి స్పందించలేదని’ తెలిపాడు. ఇలాంటి గాసిప్స్ విన్నప్పుడు నవ్వుకుని, పనిలో పడిపోతుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ నటుడు చెప్పాడు. అయితే ఇటీవల ‘సర్దార్ ఉద్దం’ సినిమా స్పెషల్ స్కినింగ్ సమయంలో వీరిద్దరూ టైట్ హగ్ చేసుకున్న వీడియో నెట్టింట హల్చల్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: విక్కీతో కత్రినా టైట్ హగ్.. వీడియో వైరల్ -
ఛాన్స్లు లేవు ఛీ పొమ్మన్నారు.. ఇప్పుడు కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు
Vicky Kaushal Life And Success Story: ఏ రంగంలో అయినా పోటీతత్వం.. దానికి సమాంతర కోణంలో ఎదురుదెబ్బలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదురవ్వడం సహజం. అన్నింటిని తట్టుకుని నిలబడిన వాళ్లే ఆయా రంగాల్లో రాణించిన సందర్భాలూ చూస్తుంటాం కూడా. సినీ పరిశ్రమ అందుకు అతీతం కాదు. అలాగే ఆ లిస్ట్లో విక్కీ కౌశల్ అనే పేరునూ నిరభ్యంతరంగా చేర్చొచ్చు. ‘సర్దార్ ఉదమ్’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈమధ్యే రిలీజ్ అయిన బయోపిక్ డ్రామా. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు సర్దార్ ఉదమ్ సింగ్ జీవితం ఆధారంగా దర్శకుడు సూజిత్ సర్కార్ తీసిన మూవీ ఇది. 1919-జలియన్ వాలాబాగ్ దుశ్చర్యకు కారకుడైన జనరల్ ఓ డయ్యర్ను ఉదమ్ సింగ్ చంపేసే సీక్వెన్స్ ఆధారంగా మాత్రమే తీసిన మూవీ ఇది. ఇప్పటిదాకా వచ్చిన బయోపిక్లకు భిన్నంగా కేవలం సెంటర్ ఆఫ్ పాయింట్ మీద నడిచిన డ్రామా కావడం, అందులో విక్కీ కౌశల్ నటన అమోఘంగా ఉండడంతో పాజిటివ్ రివ్యూలు, ప్రశంసలు దక్కించుకుంటోంది ఈ సినిమా. Sardar Udham సినిమా ముందుదాకా బాలీవుడ్లో సుమారు రూ. 3 నుంచి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతలు.. ఇప్పుడు విక్కీ కౌశల్కి ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్ల దాకా ఆఫర్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఐటీ జాబ్ వదిలేసి.. సూపర్ టాలెంటెడ్ యాక్టర్.. పట్టుమని పదిహేను సినిమాలు కూడా చేయని విక్కీ కౌశల్ను ముద్దుగా సినీ అభిమానులు పిల్చుకుంటున్న పేరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన విక్కీ కౌశల్.. ముంబై ఆర్జీఐటీలో ఇంజినీరింగ్ చదివాడు. అయితే తండ్రి శ్యామ్ కౌశల్ స్టంట్ మాస్టర్ కావడం వల్లనో ఏమో ఐటీ జాబ్లో ఇమడలేకపోయాడు విక్కీ. కిషోర్ నమిత్ కపూర్ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించాడు. వేల కొద్ది అడిషన్స్కు హాజరైనప్పటికీ.. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కొన్నిచోట్ల ఛీదరించుకుని వెళ్లగొట్టారట. ఆ అవమానం తన కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతోందని తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించాడు విక్కీ. ఇక సెలక్ట్ అయిన పది అడిషన్ల అవకాశాలూ.. కెమెరా ముందుకు తీసుకెళ్లలేకపోయాయట. దీంతో కొద్దిపాటి పరిచయాలతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ సిరీస్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. ఇందుకుగానూ కౌశల్ అందుకున్న జీతం నెలకు రూ.4,500. మసాన్ నుంచి.. మోడలింగ్ కుర్రాడిలా ఉండడం విక్కీకి తర్వాతి కాలంలో కలిసొచ్చింది. ఓ సినిమాలో చిన్న రోల్, ఓ షార్ట్ ఫిల్మ్ తర్వాత ‘బాంబే వెల్వెట్’లో ఛాన్స్ ఇచ్చాడు అనురాగ్ కశ్యప్. ఇందుకోసం పదివేల రెమ్యునరేషన్ అందుకున్నాడు విక్కీ. ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా ‘మసాన్’ నుంచి విక్కీ కౌశల్ హవా మొదలైంది. ‘రామన్ రాఘవ 2.0, రాజీ, లస్ట్స్టోరీస్, సంజూ’ చిత్రాలు విలక్షణ నటుడిగా విక్కీకి పేరు తెచ్చాయి. రాజ్కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి టాలెంటెడ్ నటులతో పోటీపడేలా చేశాయి. ఇక ‘ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్స్’ విక్కీ కౌశల్కు జాతీయ అవార్డుతో పాటు స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు సర్దార్ ఉదమ్ ఏకంగా టాప్ లీగ్లోకి చేర్చేసింది. విక్కీ కౌశల్ తర్వాతి చిత్రం ‘షామ్ బహదూర్’ కూడా ఫీల్డ్ మార్షల్ షామ్ మానెక్షా బయోపిక్. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు ఎవరైతే అడిషన్స్ నుంచి అవమానకరంగా వెళ్లగొట్టారో.. వాళ్లలో కొందరు ఇప్పుడు కాల్షీట్స్ కోసం క్యూ కడుతుండడం తన సక్సెస్ తీవ్రత ఏంటో చెబుతోందని అంటున్నాడు విక్కీ కౌశల్. బ్రాండ్ కౌశల్ ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్స్.లో నటన విక్కీ కౌశల్ను దేశం మొత్తానికి దగ్గర చేసింది. ఈ క్రేజ్ను వాడుకునేందుకు పెద్ద కంపెనీలకే కాదు.. లోకల్ ప్రొడక్టులు సైతం విక్కీని బ్రాండ్ అంబాసిడర్గా మార్చేసుకున్నాయి. రియలన్స్ ట్రెండ్లాంటి బడా బ్రాండ్తో పాటు బౌల్ట్ ఆడియో బ్రాండ్, హవెల్స్ ఇండియా, ఒప్పో లాంటి బ్రాండ్లకు ఎండార్స్మెంట్లు ఉన్నాయి. ప్రతీ బ్రాండ్ ఎండార్స్మెంట్కు 2 నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇక తాజాగా రష్మిక మందానతో విక్కీ కౌశల్ తీసిన అండర్వేర్ యాడ్ విమర్శలు-ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ.. మూస పద్దతులకు భిన్నంగా సాగిందన్న కోణంలోనూ చర్చ నడిచింది. చదవండి: కత్రినాతో డేటింగ్.. ఏం మాయచేశావే! -
విక్కీ- కత్రినా డేటింగ్: నిశ్చితార్థానికి రెడీ అంటున్న హీరో
Vicky Kaushal Engagement With Katrina Kaif: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే! పార్టీలలో కలిసి సందడి చేయడమే కాక పండగల టైంలో ట్రిప్కు కూడా వెళ్తుందీ ప్రేమ జంట. అంతేకాదు, వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు తరచూ వెళుతుంటారు. తాజాగా వారిద్దరూ ఓ ఫంక్షన్లో గట్టిగా హగ్గులిచ్చుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విక్కీ తన పెళ్లి గురించి మాట్లాడిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది. కత్రినాతో నిశ్చితార్థం జరుపుకుంటున్నారా? అన్న ప్రశ్నకు విక్కీ నవ్వుతూ.. 'ఈ వార్తలు మీడియానే ప్రసారం చేస్తోంది. సరైన సమయం వస్తే త్వరలోనే నేను నిశ్చితార్థం చేసుకుంటాను. కాకపోతే అందుకు మంచి టైం కుదరాలంతే!' అని చెప్పుకొచ్చాడు. కానీ తను వేలు పట్టుకుని నడిచే అమ్మాయి పేరు మాత్రం వెల్లడించలేదు. కాగా ఆగస్టులో విక్కీ, కత్రినాకు పెళ్లి కుదిరిందని, వారిది రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు నెట్టింట వార్తలలు ప్రసారమయ్యాయి. అయితే కత్రినా తరపు బంధువులు ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. -
విక్కీతో కత్రినా కైఫ్ టైట్ హగ్.. వీడియో వైరల్
‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరు కూడా వారి రిలేషన్షిప్పై స్పందించలేదు. తాజాగా వారిద్దరూ టైట్ కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. విక్కీ హీరోగా చేసిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. ఆ సినిమా ప్రీమియర్ షోకి గెస్ట్గా వచ్చింది కత్రినా. ఆ షో అయిపోయిన తర్వాత క్యాట్, ఆమె రూమర్డ్ బాయ్ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఈ వీడియోని వారిద్దరి ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. దీంతో వారి రిలేషన్షిప్ గాసిప్కి ఇంక బలం చేకూరినట్లయింది. ఈ విషయమై ఎవరైన రెస్పాండ్ అవుతారెమో వేచి చూడాలి. చదవండి: కత్రినా కైఫ్తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్ View this post on Instagram A post shared by VickyKatrina16 (@vickykatrina16) -
కత్రినా కైఫ్తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్ టీస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’. దానికి కపిల్ శర్మ హోస్ట్. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ వచ్చారు. విక్కీ, క్యాట్ డేటింగ్లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ టీజ్ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్కి సంబంధించిన వీడియోని నెట్లో పెట్టడంతో అది వైరల్గా మారింది. విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్కి కూడా వెళ్లారు. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో -
అండర్వేర్ యాడ్: ఛీఛీ ఇదేం పనంటూ రష్మికపై ట్రోల్స్
సౌత్ ఇండియాలో అన్ని చిత్ర ప్రరిశ్రమల్లో క్రేజ్ ఉన్న హీరోయిన్స్లో రష్మిక మందన్నా ఒకరు. త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్కి సైతం పరిచయం కానుంది. అంతా పాపులారిటీ ఉన్న ఆమె ఎన్నో రకాల బ్రాండ్ల యాడ్స్లోనూ నటిస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్తో కలిసి ఆమె చేసిన అండర్వేర్ యాడ్ విమర్శల పాలైంది. అందులో రష్మిక యోగా ఇన్స్ట్రక్టర్గా ఉండగా, విక్కీ యోగా చేస్తుంటాడు. ఆ సమయంలో షర్ట్ పైకి లేవడంతో అతని అండర్వేర్ పట్టీ బయటికి కనిపిస్తుంది. అది గమనించిన నటి ఇంప్రెస్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. అది అండర్గార్నమెంట్ బ్రాండ్ మాకోకి సంబంధించిన ప్రకటన. ఇలాంటి చీప్ యాడ్ ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రష్మిక నుంచి ఇలాంటి చౌకబారు ప్రకటన ఊహించలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, అండర్ వేర్ దుస్తుల కంపెనీలు ఎందుకు ఇలాంటి అర్థం పర్ధం లేని యాడ్స్ తీస్తున్నారు అని మరొకరు కామెంట్ పెట్టాడు. అసలు ఈ అండర్ వేర్, డియోడరెంట్ కంపెనీలు ఇలాంటి ప్రకటనలతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని తిట్టిపోశారు. అమ్మాయిలను తక్కువగా చూపించే ఇలాంటి యాడ్స్ని రష్మిక నటి చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. చదవండి: త్వరలో తమిళ సినిమా చేయనున్న సిద్ధార్థ్ మల్హోత్రా? One of the cheapest ads I have seen in recent times... Actresses like @iamRashmika might be ruining it for gals out there... I don't think any gal will get so excited to see someone's macho... https://t.co/GcOVdb4lDu — Vivek Nair - The Thrifty Marketer (@vivektweetsso) September 25, 2021 -
ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో
బాలీవుడ్లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్ స్టోరీస్, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్ ఉద్దం’. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో ఓటీటీలో రిలీజ్కి సిద్ధమయ్యిన ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబరు 30న విడుదలయింది. ఆ ట్రైలర్ చూస్తే అందులో నటుడి ముఖంపై గాట్లు కనపడతాయి. మామూలుగా అయితే వాటిని చూసి ఎవరైన సినిమాలో క్యారెక్టర్ కోసం పెట్టినవి అనుకుంటాం కానీ అవి నిజమైనని విక్కీ తెలిపాడు. సినిమా గురించి యంగ్ హీరో మాట్లాడుతూ.. ‘2019లో ‘ది బూత్ హంటెడ్ షిప్’ అనే సినిమా చేశాను. అందులో భాగంగా తీసిన ఓ సీన్లో అనుకోకుండా ఓ డోర్ ఫేస్పై పడింది. దీంతో గాయమై 13 కుట్లు పడ్డాయ’న్నాడు. కాగా 1919లో అమృత్సర్లో ఉన్న జలియన్ వాలాబాగ్లో జరిగిన కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కొల్పోయారు. దానికి ప్రతీకారంగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దం సింగ్ తన ఐడెంటీటీ మార్చుకుని లండన్కి వెళ్లి, కాల్పులకు కారణమైన మైకేల్ ఓ డయ్యర్ హత్య చేశాడు. ఆయన జీవిత ఆధారంగానే ‘సర్దార్ ఉద్దం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షాన్ స్కాట్, స్టీఫెన్ హొగన్, బనితా సంధు, కిర్సీ అవెర్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: బాలీవుడ్లో పాగా వేసిన తెలంగాణ నటుడు పైడి జైరాజ్ -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కత్రినా-విక్కీ కౌశల్?
Katrina Kaif -Vicky Kaushal: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారంటూ కొంత కాలంగా బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. కానీ తాజాగా జరిగిన రోకా ఫంక్షన్లో కత్రినా- విక్కీ ఉంగరాలు మార్చుకున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘ఫీలింగ్ సారీ ఫర్ సల్మాన్ ఖాన్’ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కత్రినా-విక్కీ ఎంగేజ్మెంట్పై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తుండటంతో ఆమె టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'రోకా వేడుక జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా అతి త్వరలోనే ‘టైగర్-3’ షూట్ కోసం విదేశాలకు వెళ్తున్నారు' అని పేర్కొన్నారు. కాగా దాదాపు రెండేళ్లుగా విక్కీ-కత్రినా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ పార్టీకి మాల్దీవులకు వెళ్లడం, కలిసి ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొనడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఓ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ కూడా కత్రినా-విక్కీ కౌశల్ రిలేషన్ షిప్లో ఉన్నారంటూ బాంబు పేల్చాడు. దీంతో ఇక వీరు ఏడడుగులు వేయడమే తరువాయి అంటూ బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. చదవండి : katrina kaif : కత్రినా కైఫ్ పెళ్లిపై సల్మాన్ ఖాన్ మేనేజర్ హింట్ లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం -
మరోసారి కెమెరాకు చిక్కిన లవ్బర్డ్స్, వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయాణం నడుస్తోందని కొంతకాలంగా బి-టౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్తల వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఈ లవ్బర్డ్స్ స్పష్టత ఇవ్వలేదు. వారి రిలేషన్పై నోరు కూడా విప్పడం లేదు. కానీ వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. తాజాగా ఈ రూమర్డ్ లవ్బర్డ్స్ సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ మరోసారి కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఇందులో విక్కీ, కత్రినాలు మీడియాను చూడగానే ఒకరికొకరికి సంబంధం లేనట్లుగా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘వికాట్, నోటంకి కపుల్’, అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ నటించిన షేర్షా మూవీ రేపు విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. మంగళవారం (అగష్టు 10) ఈ మూవీ స్క్రినింగ్ను పూర్తి చేసుకుంది. షెర్షా స్క్రినింగ్కు విక్కీ, కత్రినాలు కూడా హజరయ్యారు. ఈ సినిమా స్క్రినింగ్ ముగిశాక థియేటర్ నుంచి ముందుగా విక్కీ బయటకు రాగా అతడి వెనకాలే కత్రినా వచ్చింది. అయితే కత్రినా మాత్రం కెమెరాలను చూసి అక్కడే ఆగిపోయింది . ఇక ముందుకు నడుచుకుంటూ వచ్చిన విక్కీ మరో డోర్ దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి కత్రినా వంక చూస్తూ నవ్వాడు. కత్రినా కూడా నవ్వూతూ కనిపించింది. తన చెల్లలు ఇజబెల్లా వచ్చే వరకు అక్కడే ఆగిన కత్రినా తను రాగానే కలిసి బయటకు నడిచింది. ఇదిలా ఉండగా వీరిద్దరి రిలేషన్ గురించి ఇటీవల సూపర్ స్టార్ అనిల్ కపూర్ తనయుడు, నటుడు హర్షవర్థన్ కపూర్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఛానల్కు ఇచ్చిన జూమ్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ రూమర్డ్ కపుల్గా పిలవబడుతున్న ఆ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారని వెల్లడించాడు. దీంతో హోస్ట్ వెంటనే మీరు విక్కీ కౌశల్, కత్రినా గురించి చెబుతున్నారా? అని అడగ్గానే.. అవును అని సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయం తాను బయట పెట్టినందుకు ఇబ్బందుల్లో పడతానేమో తెలియదు? కానీ వాళ్లిద్దరూ దీనిపై స్పష్టం ఉన్నారని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
యంగ్ హీరోతో త్వరలోనే కత్రినా వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లికూతురిగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. ఇటీవలె కత్రినా 38వ బర్త్డే సందర్భంగా ఆమె పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టయిలిస్ట్ యాష్లె షేర్ చేసిన ఓ పోస్ట్ మరింత బలం చేకూరుస్తుంది. కత్రినా పుట్టినరోజు సందర్భంగా ఆమె పెళ్లి డ్రెస్లో ఉన్న ఫోటోను షేర్ చేసిన యాష్లె..త్వరలోనే ఇది నిజం కావాలంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి కత్రినా కూడా 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. కానీ తమ లవ్ కహానీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి కన్ఫార్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా 40లోపు పెళ్లిచేసుకోవాలని కత్రినా భావిస్తుందని, దీంతో త్వరలోనే ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రియుడు విక్కీ కౌశల్తోనే కత్రినా త్వరలోనే ఏడడుగులు వేస్తుందని, ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సల్మాన్ ఖాన్, రణ్బీర్ కపూర్లతో కత్రినా ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. రణ్బీర్తో పెళ్లిదాకా వెళ్లిన రిలేషన్ అనుకోకుండా బ్రేక్ అయ్యింది. మరోవైపు రణ్బీర్ సైతం ఆలియాను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by deluxeBollywood (@deluxebollywood__) -
కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు విక్కీ ఏకంగా ఆమె ఇంటికి కూడా వెళ్లడంతో అది నిజమేనని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే ఆ మధ్య విక్కీని కత్రినాతో నీ పెళ్లెప్పుడు? అంటే అలాంటిదేం లేదని సమాధానమిచ్చాడు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని తానింకా సింగిలే అని చెప్పుకొచ్చాడు. కానీ ఇదంతా పచ్చి అబద్ధమంటున్నాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'విక్కీ, కౌశల్ ప్రేమించుకుంటున్నారు. ఇదే నిజం అని కుండ బద్ధలు కొట్టేశాడు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టినందుకు బహుశా నాకు ఇబ్బందులు తప్పవేమో! అదంతా ఏమో కానీ త్వరలోనే వారు కూడా దీని గురించి స్పందిస్తారని భావిస్తున్నాను' అని తెలిపాడు. ఇక జూన్ 7న విక్కీ కౌశల్ ప్రియురాలు కత్రినా ఇంటికి వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి వెళ్లిన విక్కీ రాత్రి 8.30 గంటలకు ప్రియురాలికి వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ కపుల్ లవ్ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇదిలా వుంటే కత్రినా చివరిసారిగా 'భారత్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె 'సూర్యవంశీ', 'ఫోన్ బూత్' చిత్రాల్లో నటిస్తోంది. 'భూత్ పార్ట్ 1'లో చివరిసారిగా కనిపించిన విక్కీ కౌశల్ ప్రస్తుతం 'ద ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' సినిమాలతో పాటు ఓ బయోపిక్ చేస్తున్నాడు. చదవండి: ‘ఇద్దరితో బ్రేకప్.. అతడిని ఎలా లవ్ చేస్తున్నావ్?’ -
ఆదిపురుష్: లక్ష్మణుడు దొరికేశాడు!
ఏకకాలంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్ హీరో ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ పూర్తి చేయగా ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రీకరణలో భాగమయ్యాడు. తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్లో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా దర్శనమివ్వనున్నాడు. ఇతడితో ఢీ కొట్టేందుకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా రెడీ అవుతున్నాడు. ఇక సీత ఎవరన్నదానిపై పలువురి పేర్లు వినిపించగా చివరికి కృతి సనన్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోను పట్టుకొస్తున్నట్లు సమాచారం. విక్కీ కౌశల్ ప్రభాస్ పాత్రకు తమ్ముడిగా నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు అతడి పేరునే ఖాయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన విక్కీ కౌశల్ ప్రస్తుతం "అశ్వత్థామ" చేస్తున్నాడు. మహాభారతంలో మరణమనేదే లేని వరాన్ని పొందిన అశ్వత్థామ కథను ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆదిపురుష్లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి హేమ మాలిని నటించనుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: ఇలాంటి అభిమాని ఉంటే ఇంకేం కావాలి: హీరో -
బాలీవుడ్ హీరో ఆకలి తీర్చిన అభిమాని!
పైన ఫొటో చూశారా? బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సమోసా తింటున్నాడు. అందులో వింతేముంది? అంటారా? అక్కడికే వస్తున్నాం.. ఇండోర్కు చెందిన హర్షిత అనే యువతికి విక్కీ కౌశల్ అంటే వీరాభిమానం. అతడిని ఎలాగైనా కలవాలని ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి వచ్చింది. నటుడి కోసం వేడివేడి సమోసా, జిలేబీలు కూడా తీసుకొచ్చింది. వాటిని చూడగానే ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది విక్కీకి. ఇంకేముందీ, ఆవురావురుమంటూ సమోసా తింటున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. (చదవండి: హార్ట్ సర్జరీ! బిగ్బాస్ విన్నర్ అభ్యర్థన) 'నాకు ఆకలిగా ఉందని తెలిసి తినడానికి ఇవన్నీ పట్టుకొచ్చే అభిమాని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. ఇండోర్ సమోసా రుచికరంగా ఉందని చెప్పుకొచ్చాడు. మహిళా అభిమానులు విక్కీ మీద ఇలా ప్రేమ కురిపించడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్లోనూ అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా విక్కీ నటించిన బాక్సాఫీస్ హిట్ చిత్రం ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ విడుదలై జనవరి 11 నాటికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా విక్కీ నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వత్థామ' ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా వుంటే విక్కీ ప్రస్తుతం సర్దార్ ఉద్దమ్ సింగ్తో పాటు, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు. (చదవండి: బొమ్మ పడితే యాక్ట్ చేస్తా.. లేదంటే) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) (చదవండి: ఫస్ట్ లుక్: ఆయనకు మరణమే లేదు! -
ఫస్ట్ లుక్: ఆయనకు మరణమే లేదు!
"ఉరి: ద సర్జికల్ స్టైక్".. కశ్మీర్లోని ఉరి స్టెకార్లలో 2016లో భారత ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్హరి తదితరులు పోషించారు. రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.342 కోట్లు రాబట్టింది. బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రిలీజై నేటికి సరిగ్గా రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశాడు. ఇందులో అశ్వత్థామ తనను ప్రార్థించమని శివుడిని కోరగానే ఆయన ప్రత్యక్షమై ఓ ఖడ్గాన్ని బహుకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఓరకమైన భక్తితో ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఫస్ట్ లుక్ వైరల్గా మారింది. (చదవండి: రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్) ఇక ఉరిని తెరకెక్కించిన ఆదిత్య ధరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా గురించి విక్కీ మాట్లాడుతూ.. ఆదిత్య కలలు గన్న ప్రాజెక్ట్ అశ్వత్థామ. ఇది కచ్చితంగా నటుడిగా నాకు మరింత గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. దీనికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు ద్రోణాచార్య కుమారుడే అశ్వత్థామ. తండ్రి చేత మరణమనేదే లేని వరాన్ని ఎలా పొందాడు? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అన్న విషయాలను ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి) -
అర్థరాత్రి ముసుగులో కత్రినా ఇంటికి హీరో!
ముంబై: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యువహీరో విక్కీ కౌశల్ మధ్య ఏదో ఉందనే వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఒకానొక టైమ్లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను విక్కీ తోసిపుచ్చారు. తాను సింగిల్లే అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ విక్కీ కత్రినాతో మింగిల్ అవుతూనే ఉన్నాడని బీటౌన్ కోడై కూస్తోంది. అది నిజమే అనేలా అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రేమాయణాన్ని ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కూడా ఏదో రకంగా బయటికి వస్తూనే ఉంది. (చదవండి : ఆయుష్మాన్పై కంగన ఫైర్) తాజాగా అర్థరాత్రి వేళ ముసుగు వేసుకొని కత్రినా ఇంటికి వెళ్లిన విక్కీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని కత్రినా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కంటా పడకుండా హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందనే వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. View this post on Instagram #vickykaushal spotted at #katrinakaif house today😍😍❤️❤️ #Vickat ❤️ pic credit : PINKVILLA article (thanks @pinkvilla 🙌😍❤️) . #victrina #vicky #katrina #bollywoodcouple #vickykatrina #bollywoodsongs #bollywooddance #mrandmrskaushal #vickykaushalfans #katrinakaiffans #sooryavanshi #sushantsinghrajput #sardarudhamsingh #sammanekshaw #phonebhoot #takht #aliabhatt #priyankachopra #ranbirkapoor #deepikapadukone #ranveersingh #salmankhan #sharukhkhan #shraddhakapoor #koffeewithkaran #kapilsharmashow A post shared by Vicky Katrina (@vickykatrina__) on Aug 9, 2020 at 2:23am PDT -
ఈ బర్త్డే బాయ్ను గుర్తు పట్టారా !
బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ ఈ రోజు(మే 16) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. శనివారంతో విక్కీ 33వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ శుభ సందర్భంగా నటుడికి సెలబ్రిటీలు, అభిమానుల నుంచి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. 2015లో నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన మసాన్ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టాడు.. ఈ సినిమా తన కెరీర్కు మంచి ఆరంభాన్ని అందించగా కేన్స్ యఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులను అందుకుంది. ఇదే జోష్లో బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఉరి: ది సర్జికల్ స్ల్రైక్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. (ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా ) కుర్ర హీరో పుట్టిన రోజు సందర్భంగా విక్కీ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు పట్టలేకపోతున్నారు. ఈ ఫోటోలలో తన చాకొలెట్ లుక్స్ ప్రతి ఒక్కరి మనుసు దోచుకుంటున్నాయి. ముఖంపై చెరగని చిరునవ్వ..ముసిముసి నవ్వలు పలుకుతున్నాయి. చిన్నప్పుడు, ఇప్పుడు ఒకేలా, అందంగా, క్యూట్గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక విక్కీకి అబ్బాయిల కంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (కరోనా : చైనాను దాటిన భారత్ ) ‘ప్లీజ్.. ఇలాంటి వార్తలు ప్రచారం చేయకండి’ -
‘ప్లీజ్.. ఇలాంటి వార్తలు ప్రచారం చేయకండి’
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించలేదని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పేర్కొన్నారు. అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ను అతిక్రమించి పోలీసులకు పట్టుబడ్డాడని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను విక్కీ కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విక్కీ ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. ‘లాక్డౌన్ను ఉల్లంఘించానని పోలీసుల చేతిలో తన్నులు తిన్నానని వస్తున్నవార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి అవి అవాస్తవాలు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటినుంచి కాలు బయట పెట్టలేదు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి అబద్దపు వార్తలు ప్రచారం చేయకండి’. అంటూ ట్వీట్ చేశాడు. (కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు) There are baseless rumours suggesting that I broke the lockdown and got pulled up by the cops. I've not stepped out of my house since the lockdown started. I request people not to heed the rumours. @MumbaiPolice — Vicky Kaushal (@vickykaushal09) April 23, 2020 భారత్లో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విక్కీ తన కుటుంబంతో ముంబైలో క్వారంటైన్లో ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అలుపెరగకుండా, నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు విక్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇంట్లో సరదాగా వంటలు చేస్తున్న ఫోటోలను, సోదరుడు సన్నీ కౌశల్ సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేస్తున్నారు. అలాగే కరోనా పోరుకు ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి కోటి రూపాయల విరాళం అందజేశారు. (ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు : సంపూ ) ఫ్యాన్ శుభ్రం చేయడానికి స్టూల్ అవసరమా: హీరో View this post on Instagram Make way for the latest entrant in the elite club of #TheOmeletteFlippers ! 🍳🏆 #chotikhushiyaan A post shared by Vicky Kaushal (@vickykaushal09) on Apr 5, 2020 at 5:53am PDT -
ఆరోజు మళ్లీ తిరిగొస్తే బాగుండు : తాప్సీ
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్లు వాయిదా పడడంతో ఇంటికే పరిమితమైన సినీ నటులు సరదాగా గడుపుతున్నారు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన తాప్సీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా 2018లో తాప్సీ నటించిన హిందీ చిత్రం 'మన్మారిజియన్' షూటింగ్ లోకేషన్లో తీసిన ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో తాప్సీ ఒక వైట్ స్కూటీపై కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఆమె వెనకాల కెమెరామెన్ షూటింగ్కు సంబందించి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.(అనుష్క శర్మ వెబ్ సిరీస్ టీజర్ విడుదల) 'ఈ ఫోటో నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది.. ఎందుకంటే ఆరోజు షూటింగ్ లొకేషన్లో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. బైక్పై ఉన్న నేను నా వెనకాల అసలు ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. నేను ఆలోచిస్తూ కూర్చుంటే.. కెమెరామెన్లు మాత్రం నా బైక్పై కెమెరాలు పెట్టి వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నేను నా భావోద్వేగంతో పాటు బండి బరువును కూడా బ్యాలెన్స్ చేసుకున్నానా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నాకు ఆ గందరగోళం మళ్లీ తిరిగి వస్తే బాగుంటుందనిపించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ఉన్నంతవరకు తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటా అని తప్సీ తెలిపింది. కాగా 2018లో విడుదలైన మన్మారిజియన్ సినిమాను అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌషల్లు హీరోలుగా నటించారు. -
హాయిగా పనులు చేసుకుంటూ..
-
ఫ్యాన్ శుభ్రం చేయడానికి స్టూల్ అవసరమా: హీరో
ముంబై : లాక్డౌన్ కష్టాలు సామాన్యులకే కాకుండా, సెలబ్రిటీలను కూడా వెంటాడుతున్నాయి. ఎక్కడివారు అక్కడ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటి పనులు చేయడానికి సెలబ్రిటీలు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం షూటింగ్లతో సతమతమయ్యే తారలు ఇంట్లో వంట, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ పనులు చేయడానికి వారు ఏ మాత్రం చిరాకు పడటం లేదు. హాయిగా పనులు చేసుకుంటూ.. వాటిని వీడియో తీసి మరి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే కత్రినా, మలైకా, సల్మాన్, సన్నీ లియోన్, అనుష్క శర్మ వంటి వారు ఈ పనులను చేయగా తాజాతా మరో బాలీవుడ్ హరో విక్కీ కౌశల్కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. (బిగుతు దుస్తులు వద్దన్నారు: ప్రియాంక) విక్కీ కౌశల్.. హాయిగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ను శుభ్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోలను శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అంతేగాక ఈ వీడియోలో ‘ఫ్యాన్ శుభ్రం చేయడానికి స్టూల్ ఏం అవసరమా’ అని చెబుతున్నాడు. ‘ఈ రోజు నా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతానని అనుకున్నాను. క్వారంటైన్ లైఫ్’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తాము ఆరాధించే హీరో యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇలాంటి పనులు కూడా చక్కగా చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. (కత్రినా తన క్రష్ కాదంటున్న విక్కీ) ఇక 2015లో ‘మాసాన్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టిన విక్కీ కౌశల్.. రాజీ, లస్ట్ స్టోరీస్, సంజు వంటి హిట్ చిత్రాల్లోనటించారు. కాగా గతేడాది విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఉరి దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించనున్న మరో సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో మహాభారతంలోని ఆశ్వత్థామా పాత్రలో నటించనున్నారు. (జోడీ కుదిరిందా?) -
ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన విక్కీ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అందాల భామ కత్రినా కైఫ్ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించిన విక్కీ తన ఫస్ట్ లవ్ కత్రినా కాదని బాంబు పేల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఈ హీరో ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఎలాంటి విసుగు ప్రదర్శించకుడా తీరికగా సమాధానమిచ్చాడు. దొరికిందే చాన్సు అనుకున్న అభిమానులు హీరో నుంచి వీలైనన్ని సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బాలీవుడ్లో మీరు తొలుత ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అభిమాని ప్రశ్నించగా విక్కీ.. ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫొటోతో సహా సమాధానమిచ్చాడు. అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ అంటే ఇష్టమంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న ప్రశ్నకు కుటుంబంతో గడుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడప్పుడు అమ్మతో యోగా, ఫ్రెండ్స్తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నానన్నాడు. ఈ "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" హీరో కరోనాపై పోరుకు రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా స్వాతంత్ర్య సమర యోధుడు "సర్దార్ ఉద్ధమ్ సింగ్ "బయోపిక్లో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. (నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని) -
అసలు ఆ షిప్లో ఏం జరిగింది?
ఉడి, మన్మర్జియాన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్కీ కౌశల్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘‘భూత్: ది హాంటెడ్ షిప్’’. ఈ సినిమాలో విక్కీ సర్వేయింగ్ ఆఫీసర్ పృథ్వీగా కనిపించనున్నాడు. భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ట్రైలర్ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ముంబై సముద్రతీరంలో మిస్టరీగా ఉన్న సీ బర్డ్ అనే షిప్నకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు పృథ్వీ ఒంటరిగా అందులోకి వెళ్లడంతో మొదలైన ట్రైలర్.. సీ బర్డ్లో చోటుచేసుకునే భయంకరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. షిప్లో ఆత్మలు సంచరించడం... హీరోను చుట్టుముట్టి అతడిని ఈడ్చిపడేయడం వంటి సన్నివేశాలు భీతిగొల్పుతాయి. ఇక ఇప్పటికే భూత్ ప్రమోషన్లను ముమ్మరం చేసిన చిత్ర బృందం ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. -
మరోసారి కెమెరాకు చిక్కిన కత్రినా, కౌశల్
బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్, నలుడు విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని బీటౌన్ కోడై కూస్తోంది. ఈ రహస్య జంట దీపావళీ సందర్భంగా ఓ స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీకి కలిసి రావడంతో.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ ఫోటోలు అప్పట్లో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరా చేతికి చిక్కారు. విక్కీ సోదరుడు సన్నీ కౌశల్ స్వతహాగా సినిమాలపై ఆసక్తి ఉన్నావాడు.దీంతో ఆయన సొంతగా ఇటీవల ఓ ఫిల్మి డాక్యూమెంటరీని రూపొందించాడు. దీని విడుదలకు కత్రినా కైఫ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు విక్కీ కౌశల్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని అమ్మడు.. వెంటనే సరే అని డాక్యూమెంటరీ మూవీని ఆవిష్కరించింది. అనంతరం విక్కీ కుటుంబంతో కలిసి డిన్నర్ పార్టీలో ఎంజాయ్ చేసింది. అయితే దీనిపై బాలీవుడ్ అభిమానులు రకరకలుగా గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. కాగా కత్రినా, విక్కీ జంటగా కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు వస్తున్నప్పటికిని కత్రినా, విక్కీ మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతానికి వీరు సింగిల్ అని, డేటింగ్ చేయడం లేదని వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
వారిద్దరి మధ్య ఏముంది?
ముంబై: బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ కలిసి ఓ స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీకి రావడంతో.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీకి వీరిద్దరూ కలిసి వచ్చినా.. చివర్లో మాత్రం ఎవరికివారు యమునా తీరే అన్నట్లు ఎవరి కార్లలో వారు వెళ్లిపోయారు. అయితే వీరిద్దరూ జంటగా దీపావళి పార్టీ నుంచి బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పార్టీలో విక్కీ తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు షెర్వానీ ధరించగా.. కత్రినా రెడ్ కలర్ ఘాగ్రా - చోళిలో తళుక్కుమని మెరిశారు. కత్రినా, విక్కీ జంటగా కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు వస్తున్నప్పటికిని కత్రినా, విక్కీ మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతానికి వీరు సింగిల్ అని, డేటింగ్ చేయడం లేదని వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. దీపావళి పార్టీకి వీరిరువురూ జంటగా రావడంతో.. వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. View this post on Instagram #happydiwali #ManavManglani A post shared by Manav Manglani (@manav.manglani) on Oct 27, 2019 at 12:54pm PDT -
దట్టించిన మందుగుండు
నటనలో ప్రతిభ ఉంటే రూపం రెండవస్థానంలోకి నెట్టబడుతుంది. ఓంపురి, నసిరుద్దీన్షా వంటి వారు ప్రతిభతో రాణించారు. రూపంతో కాదు. విక్కీకౌశల్ చూడ్డానికి ‘గ్లామరస్’గా కనిపించడు. కాని అతడు ఏ పాత్ర వేసినా ఆ పాత్రలా మారిపోతాడు. కెమెరా ముందు అతడు దట్టించిన మందు గుండులా పేలతాడు. గురి తాకుతాడు. 2016 సెప్టెంబర్ 18న ‘ఉరి అటాక్స్’ జరిగాయి. బారాముల్లా జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ‘ఉరి’ అనే ప్రదేశంలోని భారతీయ సైనిక బలగాల మీద ఉగ్రదాడి జరిగింది. నలుగురు ఉగ్రవాదులు మూడు నిమిషాల వ్యవధిలో 17 గ్రెనేడ్లను సైనిక గుడారాల మీద విసరడంతో 17 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 30 మంది సైనికులు గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ చేతులు ముడుచుకుని కూచోదలుచుకోలేదు. ఇందుకు కారణమైన ఉగ్ర శిబిరాల మీద ప్రతీకారం తీర్చుకోదలిచింది. దానికి మార్గంగా ‘సర్జికల్ స్ట్రయిక్’ను ఎంచుకుంది. ఉరి దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 29న భారతదళాలు రహస్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి అక్కడి ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టాయి. ఇదంతా మిలట్రీ కార్యక్రమం. సామాన్య ప్రజలకు ఇది ఎలా జరిగి ఉంటుందో ఊహకు అందే విషయం కాదు. కాని జరిగింది దేశ ప్రజలకు చూపాలనే ఉద్దేశ్యంతో ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’ పేరుతో సినిమా నిర్మితమైంది. జనవరి 2019న విడుదలైంది. 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యి 342 కోట్లు సంపాదించింది. ఇంత ముఖ్యమైన సినిమాకు వెన్నముకలా నిలిచి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన నటుడు విక్కీ కౌశల్. సినిమాలో మేజర్ విహాన్ సింగ్ షేర్గిల్గా నటించి అతడు దేశంలోని కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న విక్కీ ప్రయాణం కూడా ఒక సైనికుడి పోరాటంలాంటిదని చెప్పక తప్పదు. స్టంట్మెన్ కుమారుడు విక్కీ కౌశల్ తాత తండ్రులది హర్యాణ. విక్కీ వాళ్ల తాత హర్యాణలో ఒక చిన్న కిరాణాషాపు నడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక విక్కీ తండ్రి శ్యామ్ కౌశల్ ముంబై వచ్చి సినీ పరిశ్రమలో స్టంట్మెన్గా చేరాడు. ఆ తర్వాత స్టంట్ కోఆర్డనేనటర్గా ఎదిగాడు. తండ్రి సినిమా రంగంలో ఉన్నా ఇంటికి ఆ వాతావరణాన్ని తెచ్చేవాడు కాదు. ఉన్న ఇద్దరు కొడుకులు బాగా చదువుకోవాలని అనుకునేవాడు. పెద్ద కొడుకు విక్కీ చదువులో బాగున్నాడు కనుక ఏదైనా కాలేజ్లో ప్రొఫెసర్ అయితే నెలనెలా దిగుల్లేని జీతం అందుతుందని అతని ఆలోచన. కాని ముంబై రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి.టెక్ చేరాక ఈ చదువు తనకు పనికి రాదని అనిపించింది. చదువుతూనే ఒకసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్లి చూసి ఇలాంటి ఉద్యోగం కూడా తనకు పనికి రాదని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేయడం, పాటలు పాడటం, గెంతడం చేసేవాడు కనుక నటుడు కావాలని అనిపించింది. బి.టెక్ను పూర్తి చేసి తండ్రికి ఈ విషయం చెప్తే వారించలేదుకానీ నీ ఇష్టం అన్నాడు. శిక్షణ తీసుకొని... నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని ముంబైలోని ఒక శిక్షణాలయంలో నటన తర్ఫీదు కోసం చేరడం. ‘ఆ శిక్షణా సమయంలో నేను అందుకు పనికి వస్తానో రానో తేలిపోతుంది. ఆ తర్వాత కావాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు’ అనుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ శిక్షణ పని చేసింది. అది అతణ్ణి నటనకు మరింత ఆకర్షితుణ్ణి చేసింది. ఆ శిక్షణాలయం నుంచి బయటకు వచ్చాక దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఆ సినిమాలో మనోజ్ బాజ్పాయ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పీయుష్ మిశ్రా లాంటి గొప్ప నటులు పని చేశారు. అయితే వారంతా థియేటర్ నుంచి వచ్చినవారు. మంచి నటులు కావాలంటే నాటకానుభవం అవసరం అని విక్కీకి అనిపించింది. ఆ సినిమా అయ్యాక అతడు థియేటర్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించాడు. దాదాపు నాలుగేళ్లు అతడికి ఏ అవకాశమూ రాలేదు. కాని ప్రతిభకు వైఫల్యం ఉండదు. అపజయమూ ఉండదు. కాకపోతే విజయం రాకడ కాస్త ఆలస్యం కావచ్చు అంతే. ‘మసాన్’తో... ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్’కు మరో సహాయ దర్శకుడిగా పని చేసిన మన హైదరాబాద్ కుర్రాడు నీరజ్ ఘేవన్ వారణాసి ఘాట్లలో పని చేసే కాటికాపరుల జీవితాలపై సినిమా తీయదలిచాడు. ఆ సినిమా పేరు ‘మసాన్’. అందులో హీరోగా విక్కీని ఎంచుకోవడంతో విక్కీ కౌశల దశ తిరిగింది. చదువుకున్న కాటికాపరిగా నటించేందుకు విక్కీ మూడు వారాల ముందే వారణాసి చేరుకుని అక్కడి జీవితాలను అధ్యయనం చేశాడు. ‘మసాన్’ (శ్మశానం) విడుదలయ్యాక అతడికి విపరీతమైన పేరు వచ్చింది. అవార్డులు వచ్చాయి. ‘నటనను’ సీరియస్గా పరిగణించే చాలామంది నటులు అతడిని గుర్తించారు. సంజు... సంజయ్ దత్ ఆటోబయోగ్రఫీగా వచ్చిన ‘సంజు’లో సంజయ్ దత్ స్నేహితుడు ‘కమ్లేష్’గా నటించి విక్కీ కౌశల్ పాపులర్ సినిమాలలో కూడా తన ముద్ర వేయగలడని నిరూపించాడు. సంజు విజయంలో రణ్బీర్ కపూర్కు ఎంత పేరు వచ్చిందో విక్కీకి కూడా అంతే పేరు వచ్చింది. ఆ తర్వాత ఉరితో అతడి కెరీర్ ఒక పదేళ్ల వరకూ ఢోకా లేనట్టుగా స్థిరపడింది. వినమ్ర ప్రయాణం... విక్కీ కౌశల్ తన సక్సెస్ను ఎంజాయ్ చేయడం కంటే దానినొక బాధ్యతగా తీసుకుంటున్నాడు. మంచి మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాడు. కరణ్ జోహర్ నిర్మాణంలో వస్తున్న ‘భూత్’ అతని రాబోయే సినిమా. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ‘సర్దార్ ఉధమ్సింగ్’ బయోపిక్లో కూడా అతడు నటించబోతున్నాడు. విక్కీ నుంచి మనం మరిన్ని మంచి సినిమాలు ఆశించవచ్చు.