Vicky Kaushal
-
Chhaava : తెలుగు ట్రైలర్ బ్లాక్ బస్టర్..
-
బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగు ట్రైలర్ రిలీజ్
గతనెలలో హిందీ రిలీజైన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)'ఉరి', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విక్కీ కౌశల్.. 'ఛావా'లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడిగా నటించాడు. రష్మిక హీరోయిన్. పీరియాడికల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. తెలుగులో ఛావా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. మార్చి 7న అంటే ఈ వీకెండ్ లో మూవీ రిలీజ్. 3 నిమిషాలున్న ట్రైలర్.. మంచి పవర్ ఫుల్ గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా') -
తెలుగులో ఛావా.. వర్కౌట్ అవుతుందా..!
-
రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది.తెలుగు ప్రేక్షకుల డిమాండ్సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఛావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఛావావిక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. The epic tale of India’s courageous son, #Chhaava is now all set to roar in Telugu by popular demand⚔️❤️🔥Witness the biggest spectacle #Chhaava in Telugu from March 7th💥👑#ChhaavaTelugu Grand Release by #GeethaArtsDistributions 🔥@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna… pic.twitter.com/awm4MAq4J6— Geetha Arts (@GeethaArts) February 26, 2025 చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్ -
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్బస్టర్. దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్కు స్పెషల్గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
ఛావా 'ఆయా రే తుఫాన్'.. పవర్ఫుల్ సాంగ్ చూశారా..?
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలోని "ఆయా రే తూఫాన్" పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోసల్మీడియాలో ఈ పాట బీజీఎమ్తో ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సాంగ్ను లైవ్లో ఏ.ఆర్.రెహమాన్, మరాఠీ సింగర్ వైశాలి సామంత్(Vaishali Samant) పాడారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.బాలీవుడ్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయా రే తుఫాన్ సాంగ్తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు.ఛావా కలెక్షన్స్ప్రపంచవ్యాప్తంగా ఛావా 8 రోజుల్లోనే రూ. 297 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో తొలి హిట్గా ఛావా నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. త్వరలో రూ. 500 కోట్ల మార్క్ను సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలంటూ ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషలలో విడుదల చేస్తే బాగుండేదని తెలుపుతున్నారు. అదే జరిగింటే ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ దాటేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
శంబాజీ మహారాజ్గా విక్కీ కౌశల్.. ఆ లుక్ కోసం ఏం చేశాడంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్కి వేలాది మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇటీవల విడుదలైన 'ఛావా'మూవీతో తనలో ఉన్న అసాధారణమైన నటుడిని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఈ మూవీ బాక్స్ఫిస్ వద్ద కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతోంది. ఆ మూవీలో చత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. అచ్చం మహారాజు మాదిరి అతడి ఆహార్యం అందర్నీ కట్టిపడేసింది. మరాఠా రాజుల కాలంలోకి వెళ్లిపోయేలా అతడి ఆహార్యం నటన ఉన్నాయి. ఇందుకోసం 80 కిలోల మేర బరువున్న అతడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకున్నాడని తెలుస్తోంది. విక్కీ ఇలా యోధుడిలా శరీరాన్ని మార్చుకునేందుకు ఎలాంటి ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్ ప్లాన్లు అనుసరించాడంటే..హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల ఫిట్నెస్ గురువు క్రిస్ గెథిన్.. విక్కీ కౌశల్కి తన శరీరాన్ని మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చాడు. మహారాజు మాదిరిగా ఎగువ శరీరం బలోపేతంగా ఉండేలా కండలు తిరిగిన దేహం కోసం విక్కీ చేత కార్డియో వంటి వ్యాయామాలు చేయించాడు. భారీ బరువులు ఎత్తించి మంచి విశాలమైన ఛాతీతో రాజు మాదిరి ధీరుడిలా కనిపించేలా చేశాడు. ఆయను విక్కీకి ఇచ్చిన ఫిట్నెస్ శిక్షణలేంటంటే..ఫంక్షనల్ వ్యాయామాలు: యుద్ధ తాళ్లు, స్లెడ్ పుష్లు, టైర్ ఫ్లిప్లు.కార్డియో: స్టామినా కోసం హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT).ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ: గాయాలను నివారించడానికి స్ట్రెచింగ్ మొబిలిటీ డ్రిల్స్.ఈ ఫిట్నెస్ శిక్షణలన్నీ బాడీ నిర్మాణానికి సరిపోతుంది అంతే.. మంచి అందమైన లుక్ కోసం కీలంగా ఉండేది డైట్ ప్లాన్ మాత్రమే. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) అవేంటంటే..ప్రోటీన్ పవర్: సోయా ముక్కలు, పనీర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులు.శక్తిని పెంచేవి: బీట్రూట్ టిక్కీలు, చిలగడదుంపలు.క్లీన్ ఈటింగ్: కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సమతుల్య మాక్రోలు. చీట్ మీల్స్ వంటివి దరిచేరనీయలేదు. ఇలాంటి కఠినతరమైన ఫిటెనెస్ శిక్షణతో మహారాజు మాదిరి లుక్తో ఆకట్టుకున్నాడు విక్కీ. ఇక ఒక ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ..అవిశ్రాంత శిక్షణ, క్రమ శిక్షణతో కూడిన ఆహారం తదితరాలే శంభాజీ మహారాజ్ మాదిరి బలాన్ని ప్రతిబింబించడానికి సహాయపడిందని చెప్పారు. ఇంతలా కష్టపడటం వల్లే చక్కటి శరీరాకృతితో తెరపై కనిపించే శంభాజీ మాహారాజు పాత్రకు ప్రాణం పోశాడు విక్కీ. గమనిక: ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం, స్లిమ్గా అవ్వడం వంటివి సెలబ్రిటీలు చేస్తుంటారు. వాటిని వాళ్లు ప్రత్యేక నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుని ప్రయ్నత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి దుష్ఫ్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల అనుకరించే మందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులు సలహాలు సూచనలతో అనుసరించడం ఉత్తమం.(చదవండి: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ Vs ఎలోన్ మస్క్: ఒకరిది పోరాటం మరొకరిది..!) -
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025 -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్ ప్రశ్న
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.ఆకాశ్ చోప్రా ట్వీట్పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు. Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty. Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!! We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025 -
చావా హిట్తో మరింత పెరిగిన నేషనల్ క్రష్ క్రేజ్..
-
'ఛావా' సినిమా చూసి కన్నీళ్లతో ప్రేక్షకులు.. వీడియోలు వైరల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) జోడీగా నటించిన చిత్రం 'ఛావా'.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన భార్యగా, మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ. 86 కోట్లు రాబట్టింది.1689 సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరం గజేబు మరాఠా సామ్రాజ్యంపై దండెత్తిన సమయంలో తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారు చూపిన ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చూసిన ప్రేక్షకుల కంటతడి పెట్టుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా తమ అభిప్రాయాన్ని సోషల్మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మూవీ చూసిన వారిలో ఎక్కువ భాగం కన్నీళ్లతోనే బయటకు వస్తున్నారు. థియేటర్లోనే శంభాజీ మహరాజ్ను గుర్తు చేసుకుంటూ కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా ఛావా సినిమాపై భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మికల నటన పట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. చివరి 40 నిమిషాలు సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లారంటూ మెచ్చుకుంటున్నారు. బుక్మైషోలో రోజుకు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్లో ఎక్కడ చూసిన కూడా హోస్ఫుల్ బోర్డులతో థియేటర్స్ కనిపిస్తున్నాయి.Ek Maratha sherni ka garjan🔥#ChhatrapatiSambhajiMaharaj #Chaava pic.twitter.com/E1249nucNc— Peddoda🔱🚩 (@_peddodu) February 15, 2025Chaava is not just a movie it's an emotion,pain ,our HISTORY It is difficult to watch on screen imagine how much our Raje tolerated n suffered... #Chaava #ChaavaReview pic.twitter.com/Vv5YtD4hX9— Harsha Patel 🇮🇳 (@harshagujaratan) February 15, 2025Just watched #Chaava, a powerful tribute to Sambhaji's bravery & struggle for Hindutva. A must-know chapter in Indian history! Jai Hind! #IndianHistory #Hindutva pic.twitter.com/Cudc1u4t78— Neha Chandra (@nehachandra800) February 15, 2025The most unfortunate thing about being a south indian the I'd not be able to feel these goosebumps in real with all theses doomed circle.of mine 😭 #Chaava #VickyKaushal#HarHarMahadevॐpic.twitter.com/MTNwYkvZkY— AlteredO (@AlteredDrift)When the audience of a film is giving it a standing ovation even after it's ended, then that film doesn't need anyone's review or rating. #Chhaava has won people's hearts. @iamRashmika @vickykaushal09 @MaddockFilms #AkshayKhanna #RashmikaMandanna ❤️ #VickyKaushal ❤️ pic.twitter.com/bqbuN1qWj5— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 15, 2025ref_src=twsrc%5Etfw">February 16, 2025 Yesterday when I went to a movie theater there was a poster of Chhava movie and some young boys were taking pictures on that poster when I looked at them they had no slippers on their feet and they were taking pictures. @vickykaushal09 @iamRashmika #chavaa #VickyKaushal #Chhaava pic.twitter.com/PhTXmh7ama— Sumit kharat (@sumitkharat65) February 15, 2025 -
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్కి అందుకుంది. విక్కీ యాక్టింగ్తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి. -
'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ఛావా (Chhaava Movie). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. లక్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ శంభాజీ మహారాజ్గా, అతడి భార్య మహారాణి ఏసుబాయిగా రష్మికా మందన్నా నటించారు.భారీ బడ్జెట్తో దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాకు వస్తున్న స్పందన ఏంటో తెలియాలంటే ఎక్స్ (ట్విటర్) రివ్యూ చూసేయండి..'విక్కీ కౌశల్.. గొప్ప నటుడు అని ఛావాతో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్కు ఈ సినిమా ఒక నివాళి' అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.#ChhaavaInCinemasEvery frame & every tear is a tribute to the #ChhatrapatiSambhajiMaharaj 🔥Every Hindu should watch #Chhaava#VickyKaushal has proven he is one of the best Actor in Bollywood, way ahead of Khans pic.twitter.com/D0SOlTQHMN— Hemir Desai (@hemirdesai) February 14, 2025 ఛావా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఫుల్ ఎమోషనల్ అయ్యా అని ఓ తెలుగు యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.#chhaava movie chala bagundi 🔥Full Emotional ayya climax lo 🥺😔Jai Sambhu Raje 🚩— 𝐒𝐫𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐏𝐒𝐏𝐊™🚩 (@Srikanth_OG) February 14, 2025నిజమైన సూపర్ హీరో ఎవరనేది ప్రపంచానికి చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ సర్కు ధన్యవాదాలు. పాత్రకు ప్రాణం పోసిన విక్కీ కౌశల్కు థాంక్స్. షేర్ శంభాజీ మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాడు అని మరో యూజర్ పేర్కొన్నాడు.Thank you Laxman Utekar sir✨You showed world about the real superhero.Thank you @vickykaushal09 for the justice to the role.Sher sambhaji lives on✨ #Jagdamb💖#Chhaava #ChhatrapatiSambhajiMaharaj— Manifest For Good 💫 (@SHUBHAMGAIKAR14) February 14, 2025 Kindness & valour were Chhatrapati Sambhaji Maharaj's strongest virtues. #VickyKaushal knew all that & more thus raising the bar once more with precision & accuracy. To see this guy mould into something which only could’ve read & heard about is beyond awards & ratings.#Chhaava pic.twitter.com/De7eQ5JuEo— Amar Singh Rathore (@amarsr_1990) February 14, 2025Real Bollywood magic!Vicky Kaushal's performance is mind-blowing, giving pure goosebumps. Housefull at 5:45 AM show🎥🔥#Chhaava #ChhaavaInCinemas #ChhaavaOn14Feb pic.twitter.com/mpRkGabPr0— Mr. Perfect (@DS24IN) February 14, 2025The film is good, but Vicky is EXCEPTIONAL!!! What a performance! The end will leave you numb. Took me a while to get up from my seat when the credits rolled. Please watch it in theatres! Phone, laptop, tv pe wo feel nahi ayegi. ⭐️⭐️⭐️⭐️ Detailed review soon! #Chhaava… pic.twitter.com/VZgZT5grpj— OCD Times (@ocdtimes) February 14, 2025#VickyKaushal shines in #Chhaava, but other actors are just okay. The film feels long, and the BGM doesn’t fit the era. Still, it’s decent. The last 20 minutes hit hard & stay with you. 💔 Highly recommend watching in theaters! 🎬🔥 #ChhaavaReview pic.twitter.com/TLEu3kxteP— Movies Talk Official (@moviestalkhindi) February 14, 2025My Final Verdict: Chhaava is a gripping, performance-driven historical drama that shines through its stellar cast. The second half takes the intensity to another level. Vicky Kaushal delivers a career-defining act while Akshaye Khanna as Aurangzeb is chillingly ruthless#Chhaava pic.twitter.com/pURGeZfBkf— Cinema Fable (@cinemafable1) February 14, 2025Chhaava is blockbuster 😊vicky is absolute charm born to play this role, rashmika brings best out of her, akshay khanna take a bow man , maddcok films is the top production house in india they should enter into south for sure. 🎶 & direction super #Chhaava #VickyKaushal pic.twitter.com/cYDbY4SbWI— @Politics& Popcorn 📖 (@Political_star1) February 14, 2025ChhaavaInCinemas #Chhaava Every frame & every tear is a tribute to the Maratha pride🫡💥#VickyKaushal fierce portrayal makes u feel his pain, power, & unbreakable will🙏🏻😍@iamRashmika is heartbeat of the story😍 Animal, Pushpa & now this. #Chhaava pic.twitter.com/AixrmULfw5— 🖤⃝ 𝐑𝐚𝐯𝐚𝐧😂🖤🫀 (@RavanDJ1210) February 14, 2025 -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
ట్రెండింగ్లో రష్మిక మందన్న 'ఛావా' సాంగ్
రష్మిక మందన్న- విక్కీ కౌశల్ కాంబినేషన్లో రానున్న హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్తో నెట్టింట వైరల్ అవుతుంది. సాంగ్లో విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. మొగల్ షెహన్షా ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.తాజాగా ఛావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అయితే, నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఈవెంట్లో పాల్గొనడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈవెంట్లో కూడా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
వీల్చైర్లో ప్రమోషన్స్కు రష్మిక ‘ఛావా’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
వీల్చైర్లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్ బ్రేక్ పడింది. జిమ్లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్కు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్చైర్లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. ఆమె సహకారంతో అతడు.. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్కు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడాడు. అటు రష్మిక డెడికేషన్ను, ఇటు విక్కీ కౌశల్ మంచిగుణాన్ని అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. బిజీగా ఉన్నా, డేట్స్ కుదర్లేదంటూ ప్రమోషన్స్కు డుమ్మా కొట్టేవాళ్లే చాలామంది.. కానీ రష్మిక గాయంతో బాధపడుతున్నా సరే ఈవెంట్కు రావడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.రష్మిక కెరీర్..‘చూసీ చూడంగానే నచ్చేశావే..’ అని రష్మికాను ఉద్దేశించి పాట పాడుకున్నారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా ఆకట్టుకుందామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ది గాళ్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి డైరెక్షన్ చేయనున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ తనే హీరోయిన్. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ రష్మిక భాగమైంది.అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాంబాజీని చావా (మరాఠీలో పులి బిడ్డ అని అర్థం) అని పిలుస్తారు. చావా మొదటి భార్య యేసుబాయ్గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. The dedication with which #RashmikaMandanna is promoting this movie will be remembered in the future, showing how serious she is about her work. Despite her current condition, she came to promote the movie in a wheelchair. I'm confident that the pairing of #VickyKaushal and… pic.twitter.com/E4aM1EQ19P— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 31, 2025చదవండి: శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
సక్సెస్ కోసం ఆ విషయాల్లో రాజీ పడ్డాను : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. -
పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లలో మెరిసింది. మరో వారం రోజుల్లో పుష్ప-2 విడుదల కానుండగా మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక టాలీవుడ్తో పాటు బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది యానిమల్ మూవీలో మెరిసిన ముద్దుగుమ్మ.. ఛావా అనే చిత్రంలో నటిస్తోంది.బాలీవుడ్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా ఛావా మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఒక్క రోజు ముందే డిసెంబర్ 5న పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.పోటీనుంచి తప్పుకున్న ఛావాదీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్ప-2తో పోటీపడడం కంటే వాయిదా వేయడమే మేలని భావించారు. అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా పోటీపడి నిలవడం కష్టమేనని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ ఖాయమని మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అందుకే ఛావాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.ఫిబ్రవరిలోనే ఎందుకంటే?తాజాగా ఛావా మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.VICKY KAUSHAL - RASHMIKA - AKSHAYE KHANNA: 'CHHAAVA' NEW RELEASE DATE ANNOUNCEMENT... #Chhaava is now set for a theatrical release on 14 Feb 2025... The release date holds special significance since it coincides with Chhatrapati Shivaji Maharaj Jayanti on 19 Feb 2025.Produced… pic.twitter.com/kDMrY7RDqN— taran adarsh (@taran_adarsh) November 27, 2024 -
ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్నైట్లో స్టార్డమ్ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కెరీర్లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ. అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు. అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు. (చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!) -
పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్!
ఐఫా-2024 అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సినీతారలంతా సందడి చేస్తున్నారు. సౌత్తో పాటు బాలీవుడ్ అగ్ర సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈవెంట్లో హోస్ట్లుగా వ్యవహరించిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ సందడి చేశారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.అయితే వేదికపై వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ పుష్ప సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్కు స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్పై క్లారిటీ!)కాగా.. ఈ అవార్డ్స్ వేడుకల్లో షారూఖ్ ఖాన్కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కించుకున్నారు. సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సమంతా రూత్ ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సందడి చేశారు. Yeh tho asli FIRE hey 🔥🔥KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024 -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్బీర్ కపూర్ సోలో సీన్స్తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్బీర్ – విక్కీ కౌశల్ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
'తోబా తోబా' పాట.. హీరో విక్కీ కౌశల్పై ఆమె అసంతృప్తి
రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో 'తోబా తోబా' అనే ఓ హిందీ పాట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మూవీలోని సాంగ్ ఇది. రీల్స్, షార్ట్స్లో ఊపేస్తున్న ఈ పాట దాదాపు అందరికీ నచ్చింది. కానీ ఓ మహిళ మాత్రం ఈ పాట మీరు చేసుండాల్సింది కాదని చెప్పారని విక్కీ కౌశల్ అన్నాడు. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా అనాల్సి వచ్చిందో కూడా వివరించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన)బాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో విక్కీ కౌశల్ ఒకడు. గతేడాది చివర్లో 'సామ్ బహుదూర్' అనే సినిమా చేశాడు. గతంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా విధులు నిర్వర్తించిన ఈయన.. దేశ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. 'యానిమల్' మూవీతో పాటు రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఇందులో సామ్ మాణిక్ షా పాత్రలో విక్కీ కౌశల్ పరకాయ ప్రవేశం చేశాడు.అయితే తాను చేసిన 'తోబా తోబా' పాట అందరికీ నచ్చింది గానీ సామ్ మాణిక్ షా కూతురు మాయకు మాత్రం నచ్చలేదని విక్కీ కౌశల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'ఓ రోజు మాయ (సామ్ మాణిక్ షా కూతురు).. ఎవరతడు? అని మెసేజ్ చేశారు. ఏమైందని అడ్గగా.. ఐదు నెలల క్రితం మీరు నాకు నాన్నలా అనిపించారు. మీరు ఈ టైంలో ఇలాంటివి చేసుండాల్సింది కాదు అని అన్నారు. అయితే నటన అనేది నా జాబ్ లాంటిది అని చెప్పి నవ్వేశా. కానీ ఆమెకు తన తండ్రిలా నేను కనిపించడం అనేది అతిపెద్ద ప్రశంస' అని విక్కీ కౌశల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?) -
Vicky-Rashmika: విక్కీ కౌషల్తో రష్మిక మందన్న ఫోజులు.. ఫోటోలు వైరల్
-
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లేతోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్లో ప్రధాన పాత్రధారులు ఇద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ) -
తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్.. సెన్సార్ అభ్యంతరం
విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్యాడ్న్యూజ్'. సినిమా టైటిల్కు తగ్గుట్టాగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఇదీ ‘బ్యాడ్ న్యూస్’ అని చెప్పవచ్చు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కించారు. జులై 19న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.'బ్యాడ్న్యూజ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, ఇందులో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి మద్య ఉన్న మూడు ఇంటిమేట్ సీన్స్ను CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) తొలగించింది. వారిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు కాస్త మితిమీరినట్లు తెలుస్తోంది. అందుకే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కానీ వారిద్దరి కెమిస్ట్రీని కొందరు ప్రశంసించగా, మరికొందరు అభ్యంతరంగా ఉన్నాయిని భావించారు. సెన్సార్ కట్ లిస్ట్ ప్రకారం.. మూడు సన్నివేశాలలో ఒకటి 9 సెకన్లు, రెండవది 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు మొత్తంగా 27 సెకన్ల లిప్లాక్ సీన్లను CBFC మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత, బాడ్ న్యూజ్ సినిమాకు CBFC నుండి U/A సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ సర్టిఫికేట్లో సూచించిన విధంగా సినిమా నిడివి 142 నిమిషాలు, ఇది 2 గంటల 22 నిమిషాలకు సమానం. -
కత్రినా కైఫ్ బర్త్డే.. ఇష్టమైన ఫోటోలు షేర్ చేసిన విక్కీ కౌషల్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
కత్రినా లేకుండానే ఫంక్షన్కు.. నటితో హీరో స్టెప్పులు..
అంబానీ ఇంట పెళ్లి అనగానే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఎన్నో నెలల నుంచే మొదలైన సందడి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ ఫంక్షన్కు హాజరై స్టెప్పులేస్తూ సంతోషంగా గడిపారు.వదిన రాలేదా?అయితే హీరో విక్కీ కౌశల్ మాత్రం భార్య కత్రినా కైఫ్ లేకుండా ఈవెంట్కు హాజరయ్యాడు. ఇది చూసిన కొందరు ఫోటోగ్రాఫర్లు.. అదేంటి? వదిన రాలేదా? అని అడిగారు. కత్రినా కైఫ్ను వదినగా సంబోధించారు. వారి ప్రశ్నలు విన్న విక్కీ సమాధానమివ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మేము కత్రినాను మిస్ అవుతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. విక్కీ ఎప్పటిలాగే..అయినా తను చాలా ఏళ్లుగా కష్టపడి పని చేస్తూనే ఉంది. ఇప్పుడైనా కొంత బ్రేక్ తీసుకుని ఇంట్లోవారితో కలిసుంటే బాగుంటుంది. విక్కీ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే హ్యాండ్సమ్గా ఉన్నాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కత్రినా ప్రెగ్నెంట్, అందుకే రాలేదేమో అని మరికొందరు అభిప్రాపయడ్డారు. కాగా సంగీత్లో విక్కీ.. నటి షెహనాజ్ గిల్తో కలిసి స్టెప్పులేశాడు. ఈయన సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన బ్యాడ్ న్యూస్ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Shehnaz x Vicky #TaubaTauba 🕺💃#ShehnaazGill #VickyKaushal pic.twitter.com/0EB0xlCSn1— $@M (@SAMTHEBESTEST_) July 6, 2024 చదవండి: ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ -
భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన స్టార్ హీరో!
బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల కత్రినా కైఫ్ గర్భం దాల్చిందంటూ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్పోర్ట్లో కత్రినా వదులుగా ఉన్న అవుట్ఫిట్లో కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన రాబోయే చిత్రం బాడ్ న్యూజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన క్లారిటీ ఇచ్చారు.విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఏదైనా శుభవార్త ఉంటే మీతోనే మొదట చెబుతా. ప్రస్తుతం మీరు మా బ్యాడ్ న్యూజ్ సినిమాను ఎంజాయ్ చేయండి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపై మాట్లాడుకుందాం' అని అన్నారు. కాగా.. ఈ జంట త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు టాక్ నడిచింది. ఒక నెల క్రితం లండన్లో భర్త విక్కీ కౌశల్తో కత్రినా కైఫ్ వేకేషన్కు వెళ్లగా అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. విక్కీ, కత్రినా రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో యానిమల్ బ్యూటీ ట్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత విక్కీ ఛావాలో ఛత్రపతి శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రణబీర్ కపూర్, అలియా భట్లతో కలిసి లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనున్నారు.Vicky Kaushal finally reacts to reports of Katrina Kaif's pregnancy during the trailer launch event of Bad Newz#VickyKaushal #KatrinaKaif #Vikkat #BadNewz pic.twitter.com/aFQOXoq8bQ— Ria Sharma (@RiaSharma1125) June 28, 2024 -
అలాంటి డ్రెస్లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్పోర్ట్లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో లండన్ వెకేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్మెంట్కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్లో జత చేసింది. ఆ క్యాప్షన్కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ! -
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామన్లు వారిని క్లిక్మనిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ పక్షులు కనిపించారంటే వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరినీ ఫాలో అవుతూ తమ కెమెరాలకు పని చెప్తుంటారు. కత్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్లో అయితే మరీనూ.. అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట!ఫోటోలు తీయొద్దుఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ వెల్లడించారు. 'ఒకసారి కత్రినా.. తమ ఫోటోలు తీయొద్దని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత యష్ రాజ్ స్టూడియోస్కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశల్తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది. మిగతావి డిలీట్ చేయమని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చదవండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్.. అంతేకాదు! -
పెళ్లై మూడేళ్లు.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు తల్లి కావడం ఆనందంగా ఉంది. దీపికా పదుకొణె తాను గర్భవతి అనే శుభవార్తను పంచుకుంది. ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ గర్భవతి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఇంటికి త్వరలో ఒక చిన్న గెస్ట్ వస్తాడని నెటిజన్లు అంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడకు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంటగా వెళ్లారు. ఆ సమయంలో ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో పదేపదే దాచుకోవడం కెమెరాల కంట పడింది. ఆ విడీయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీంతో కత్రినా, విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు అంటున్నారు. దీపికా పదుకొనే తర్వాత కత్రినా కైఫ్ కూడా స్వీట్ న్యూస్ ఇస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. విక్కీ , కత్రినా 2021 డిసెంబర్ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంటే వారి పెళ్లి జరిగి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పుడు వారిద్దరూ తల్లితండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే వారిద్దరూ రియాక్ట్ కావాల్సిందే. -
Vicky-Katrina: కత్రినా-విక్కీ పెళ్లి వార్షికోత్సవ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అలాంటి సీన్స్లో నటించిన భార్య.. భర్త రియాక్షన్ ఇదే
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జోడీగా నటించిన భారీ యాక్షన్ చిత్రం టైగర్- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్పై యూనివర్స్లో భాగంగా గత రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్లో కత్రినా కైఫ్పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ చిత్రంలో కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు. -
సామ్ బహదూర్ టీజర్ రిలీజ్.. చాలా కష్టపడ్డానంటున్న హీరో
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్ బహదూర్. భారతీయ మొట్ట మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 'యుద్ధంలో చనిపోవడమే సైనికుడి పని అని ఇందిరా గాంధీ అంటే.. ప్రత్యర్థి వైపున్న జవాన్లను అంతమొందించడమే సైనికుడి అసలైన కర్తవ్యం', 'నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, ఆర్మీయే నా ప్రాణం' అని విక్కీ కౌశల్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి సామ్ మానెక్షా ఏ విధంగా సారథ్యం వహించారు? సైనికులకు ఎలాంటి శిక్షణ అందించాడనేది ఈ చిత్రంలో చూపించారు. తాజాగా విక్కీ కౌశల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సామ్ మానెక్షా అని రాసి ఉన్న ఆర్మీ యునిఫామ్ ధరించడమే పెద్ద బాధ్యత. ఈ విషయంలో నేను ఏడీజీపీఐ(అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్)కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిని కలిసినప్పుడల్లా ఈ పాత్రను సమర్థవంతంగా పోషించాలని చెప్పేవారు. కాబట్టి సినిమా చేస్తున్నంతసేపూ ఆ ఒత్తిడి నాపై ఉంది. నాకు సాధ్యమైనంతవరకు బాగా చేయడానికే ప్రయత్నించాను. చిత్రయూనిట్ అంతా కష్టపడ్డాం. నిజానికి సామ్ యుక్తవయసులో ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి మనవడిని అనేకసార్లు కలిశాం. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. దీనిద్వారా ఆయన మాట్లాడే తీరు, నడకతీరు తెలుసుకుని దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. చదవండి: బిగ్బాస్ షాకింగ్ నిర్ణయం.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్! -
విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!
ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాలంటే కంటెంట్ తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాల్లో హీరో స్టార్ డమ్తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం చూస్తుంటాం. మరికొన్ని సార్లు చిన్న సినిమా అయినా సరే కంటెంట్ వల్ల కాసుల వర్షం కురవాల్సిందే. కేవలం భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించడమే కాదు.. కథ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. అలా బాక్సాఫీస్ను షేక్ చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు చాలా తక్కువే ఉన్నాయి. వాటిలో దంగల్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, బాహుబలి-2, పఠాన్ అత్యధిక వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. (ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?) కానీ తక్కువ బడ్జెట్తో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాలు కూడా చాలా తక్కువే. అందులో మొదట వినిపించే పేరు యూరి: ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన ఈ చిత్రం.. భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కథాంశంగా తెరకెక్కించారు. ఈ మూవీతో ఆదిత్య ధర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. విక్కీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్లో వార్, కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఇప్పుడు సౌత్పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !) విక్కీ మాట్లాడుతూ.. 'నేను మొదట ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత నటనలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో ఓ ప్రొడక్షన్ కంపెనీలో ప్రొడక్షన్ బాయ్గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా మొదటి వేతనం నెలకు కేవలం రూ.1500 రూపాయలే. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది. బాంద్రా స్టేషన్లో కూర్చుని విక్కీ కౌశల్ అని ముద్రించిన రూ. 1,500 చెక్కును అలా చూస్తునే ఉన్నా.' అని చెప్పారు. ఇటీవలే జరా హాట్కే జరా బచ్కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్ జంటగా కనిపించింది. -
రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?
Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?) 2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిస్తే.. సారా అలీ ఖాన్తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. -
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
టవల్ కోసం అన్ని డబ్బులు తగలేస్తావా? అని ఒకటే తిట్టుడు..
సెలబ్రిటీల లైఫ్స్టయిల్ ఎలా ఉంటుందంటే.. చిన్న వస్తువు కోసం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవి వందలు, వేలు, లక్షలు, కొన్నిసార్లైతే కోట్లల్లో కూడా ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హుందాగా ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా సింపుల్గా ఉండాలనుకుంటారు. హీరోయిన్గా, సహాయ నటిగా మెప్పించిన ఒకప్పటి బాలీవుడ్ సీనియర్ నటి అమృత సింగ్ కూడా ఏదైనా భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎంత భారీగా అంటే ముఖం తుడుచుకునే టవల్ కూడా వేలు పోసి కొంటుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బయటపెట్టాడు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ ఆన్స్క్రీన్ జంట ద కపిల్ శర్మ షోలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విక్కీ కౌశల్. 'ఒక రోజు సెట్లో సారా తన తల్లి అమృత మేడమ్ను తిడుతోంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా ఓకేనా? అని అడిగా. దానికామె.. మా అమ్మ రూ.1600 పెట్టి కొత్త టవల్ తీసుకుంది. అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. తను జోక్ చేస్తుందేమో అనుకున్నాను. నిజం చెప్పు? అని అడిగితే నిజమే చెప్తున్నానని అరిచింది. నేను షాకయ్యాను.. రూ.1600 పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతలో సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్లో ఉన్న ఫ్రీ టవల్స్ వాడుకోవచ్చుగా' అని పేర్కొంది. చదవండి: నిశ్చితార్థం జరిగిందంటూ అనుపమ పోస్ట్ -
మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్తని అవమానించిన సల్మాన్ ఖాన్
-
కత్రినా కైఫ్ భర్తను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్..
-
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్పై బాడీగార్డ్స్తో పాటు సల్మాన్ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్ బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్ఖాన్ బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్ అవుతున్నారు. -
‘జరా హట్కే జరా బచ్ కే’ మూవీ ప్రమోషన్స్లో సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ (ఫొటోలు)
-
‘జరా హట్కే జరా బచ్ కే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!
మహారాణిగా నిర్ణయాలు తీసుకోనున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఛావా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశాల్ పోషించనున్నారు. శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ నచ్చి రష్మికా మందన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా. యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్లో రాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్ను రెడీ చేశారట లక్ష్మణ్. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబరులో ఆరంభించాలనుకుంటున్నారని టాక్. ఇక ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసిన రష్మికా మందన్నా ప్రస్తుతం రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందు తున్న ‘పుష్ప: ది రూల్’లో రష్మికా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదు: విక్కీ కౌశల్
బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట ఒకటి. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విక్కీ-కత్రినా తరచూ తమ క్యూట్ క్యూట్ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోలేదనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఓ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాడ్లో కలిసి నటించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విక్కీ కౌశల్ మాట్లాడుతూ భార్య కత్రినా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. కాగా కొంతకాలం పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021 డిసెంబర్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాను పర్ఫెక్ట్ హజ్బెండ్ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘నేను నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేనెప్పుడు పర్ఫెక్ట్ అని అనుకోను. ఓ భర్తగా, కొడుకుగా, నటుడిగా ఎందులోనూ నేను కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నన్ను నేను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. పూరిపూర్ణంగా ఉండడమే లక్ష్యంగా పని చేస్తుంటాను’ అన్నాడు. చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో అలాగే ఆదర్శవంతమైన భర్తనని కూడా తాను అనుకోనవడం లేదన్నాడు. కానీ, నిన్నటి కంటే రేపు ఉత్తమంగా ఉండేందుకు ట్రై చేస్తానన్నాడు. తనని తాను సరిచేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అనంతరం భార్య కత్రినా గురించి మాట్లాడుతూ.. ‘కత్రినా నా లైఫ్లోకి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. అంతా ఒక్కసారిగా మారిపోయింది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్గా ఎదగడానికి తను నాకు ఎంతో సహకరిస్తోంది’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. -
కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? వైరల్గా మారిన ఫోటోలు
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా? పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా మారిన కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఇటీవలె ఓ ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈ బ్యూటీ వదులుగా ఉన్న దుస్తులతో కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో కత్రినా తల్లి కాబోతుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు పదేపదే కత్రినా తన పొట్టభాగాన్ని కవర్ చేసుకుంటూ కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు క్షణాల్లో వైరల్గా మారాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై కత్రినా స్పందించలేదు. 2021 డిసెంబర్9న కత్రినా- విక్కీ కౌశల్ల వివాహం రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ యాడ్ షూట్లో సందడి చేసిన వీరిద్దరు బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లు కత్రినా నిజంగానే ప్రెగ్నెంటా అన్నది త్వరలోనే తెలియనుంది. -
ప్రేక్షకుల అభిరుచి మారింది.. అలాంటి చిత్రాలనే ఆదరిస్తారు:విక్కీ కౌశల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే ‘గోవిందా నామ్ మేరా అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విక్కీ కౌశల్ ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల బాలీవుడ్ చిత్రాలు సక్సెస్ కాకపోవడం పట్ల ఆయన స్పందించారు. విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా దర్శకుడు శశాంక్ కొవిడ్కు ముందు కథ చెప్పారు. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వాళ్లని కాస్త నవ్విద్దామనుకున్నా. కథ వినగానే ఓకే చేశా. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. కథ బాగుంటే.. ఏభాషైనా సరే ఆదరిస్తున్నారు. కేజీయఫ్2, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ' అని అన్నాడు. ఈ ఏడాది విడుదలైన అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం2’ మినహాయిస్తే బాలీవుడ్ సినిమాలు విఫలమైన విషయం తెలిసిందే. -
ఎకానమీ క్లాస్లో బాలీవుడ్ జంట.. మరీ ఇంత చీప్గానా..!
ఎల్లప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తారలు.. వెకేషన్కు టైం కేటాయిస్తూనే ఉంటారు. సెట్స్, షూటింగ్లంటూ బిజీబిజీగా గడుపుతూ అలిసిపోతుంటారు. అందుకే తీరిక దొరికినప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా రిఫ్రెష్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు అప్పటికప్పుడు బ్యాగు సర్దేసుకుని విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా రొటీన్గా జరిగేదదైనా ఈ ట్రిప్లో కాస్త వెరైటీ కూడా ఉందండోయ్. అదేంటంటే ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం. అది చూసిన జనాలు అదేంటి? వీళ్లు ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలు అయి ఉండి ఎకానమీ క్లాస్లో వెళ్లడం గ్రేట్ అని కొందరంటుంటే.. మరీ చీప్గా కాకుండా బిజినెస్ క్లాస్ లేదంటే ఫస్ట్ క్లాస్లో అయినా వెళ్లాల్సిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోలో కత్రినా తన గుర్తు పట్టకుండా ఉండేందుకు బ్లాక్ క్యాప్తో పాటు.. మాస్క్ను ధరించి ఉంది. అంతే కాకుండా ఈ క్లిప్లో స్టార్ జంట పక్కపక్కనే కూర్చుని వారి వారి మొబైల్స్లో నిమగ్నమైపోయారు. ఇక వీడియో మొదట్లో కత్రినా మాస్క్ తొలగించి ఫోన్లో బిజీగా ఉండగా.. ఓ అభిమాని సీక్రెట్గా రికార్డ్ చేశారు. అది గమనించిన కత్రినా వెంటనే మాస్క్ ధరించింది. ఈ వీడియోను చూస్తే వీరిద్దరూ ఏదో సీక్రెట్ వెకేషన్ వెళ్తున్నట్లు అర్థమవుతోంది. తమని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఇలా ఎకానమీ క్లాస్లో వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారని కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి.. వారి ప్రైవసికి భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ జంట హాలిడే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విక్కీ కౌశల్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
నా పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగింది: కత్రినా
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ గతేడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. షూటింగ్ గ్యాప్ దొరికితే ఇద్దరూ కలిసి ఎంచక్కా విహార యాత్రలకు లేదా డిన్నర్ డేట్స్కు వెళ్తుంటారు. అలాగే ఇంటర్వ్యూలలో ఒకరి సీక్రెట్స్ గురించి మరొకరు చెప్పుకోవడానికి అస్సలు వెనుకాడరు. అయితే ఈసారి కత్రినా ఓ పెద్ద విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆనందంగా సాగిపోతుందనుకున్న తన పెళ్లిలో కొందరు చెప్పులతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుంచి గట్టిగట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటా? అని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు ఉన్నారు. చివరగా ఆ ఫైట్లో ఎవరు గెలిచారనేది మాత్రం అడగడమే మర్చిపోయా' అని చెప్పుకొచ్చింది క్యాట్. కాగా రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు విక్కీ, కత్రినా. వీరి సినిమాల విషయానికి వస్తే కత్రినా టైగర్ 3, మేరీ క్రిస్మస్, జీలె జరా సినిమాలు చేస్తోంది. విక్కీ.. గోవిందా నామ్ మేరా, సామ్ బహదూర్ చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఈ విషయంలో విశ్వక్సేన్దే తప్పు: డైరెక్టర్ -
పెళ్లికి పిలవలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది: కరణ్ జోహార్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజాగా ఫినాలే ఎపిసోడ్లో కరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి పిలవకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. పదమూడో ఎపిసోడ్లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు. ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదాగా సాగింది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ల వివాహానికి పిలవకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఈ సందర్భంగా కరణ్ వెల్లడించారు. (చదవండి: ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్) కరణ్ జోహార్ మాట్లాడుతూ 'విక్కీ, కత్రినా వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది. ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఈ విషయంలో చాలామందికి నాపై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా ప్రశ్నించారు. విక్కీ-కత్రినా వివాహానికి అనురాగ్ కశ్యప్ను కూడా ఆహ్వానించలేదని తెలుసుకున్నప్పుడు కాస్త ఉపశమనం లభించింది' అని అన్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
పెళ్లి తర్వాత తొలిసారి అలా.. కత్రినా, విక్కీ ఫోటోలు వైరల్.. !
బాలీవుడ్ రొమాంటిక్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో వివాహబంధంతో ఒక్కటైన ఈ ప్రేమజంట త్వరలోనే తెరపై కనువిందు చేయనున్నారు. పెళ్లి తర్వాత స్క్రీన్పై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో ఇద్దరు కలిసి నటించనుండగా ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరలయ్యాయి. They should go get married! 💘🤣#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/vyo78G7hDe — Nush (@tanyeahok) September 13, 2022 (చదవండి: అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది) అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కత్రినా కైఫ్, భర్త విక్కీ కౌశల్తో అనుబంధాన్ని వివరించింది. తామిద్దరం డేటింగ్ చేయలేదని ఆమె వెల్లడించింది. మీడియాలో తమపై వస్తున్న కథనాలు చూస్తే చాలా తమాషాగా అనిపిస్తుందని తెలిపింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్తాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు. I'm so excited for the ad🤩 My babies🫶🏻🫶🏻🫶🏻#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/kVHCxtPLxB — Merve (@itsewrem) September 13, 2022 -
అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె ఇటీవల హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరూ గతేడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ, పెళ్లి విషయంలో కత్రినా-విక్కీలు చాలా గొప్యత పాటించారు. తాజాగా దానికి గల కారణమేంటో వివరించింది కత్రినా. ఇటీవల జరిగిన వోల్ఫ్777 ఫిలింఫేర్ ఆవార్డు ఫంక్షన్లో విక్ట్రీనా దంపతులు మెరిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కత్రినా జూమ్ టీవీతో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో గొప్యత పాటించడం వెనుక అసలు కారణం చెప్పింది. ‘కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. అందరు కరోనా బారిన పడ్డారు. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్గా మారిన సూసైడ్ నోట్ వారి విషయంలో మరో చాన్స్ తీసుకోవాలని అనుకొలేదు. మళ్లీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మా వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చాం. మా పెళ్లి సీక్రెట్గా జరగడానికి అదే కారణం. అలాంటి పాండమిక్లో కూడా మా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరం(నేను, విక్కి) చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. చదవండి: హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా? -
‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ను సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మన్వీందర్ సింగ్గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్ సింగ్.. కత్రినాకు వీరాభిమాని. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడట. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతను నిరాశకు లోనయ్యాడు. చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న మన్వీందర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తన ఇన్స్టాగ్రామ్లో కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్ హీరోయిన్ల ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్ చేసి ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ దీనికి ‘నేటికి మా పెళ్లి జరిగి మూడు నెలలు.. నా భార్య కత్రినా కైఫ్’ వీడియోను ఎడిట్ చేశాడు. అంతేకాదు కత్రినా-విక్కీ జంటగా ఉన్న ఫొటోలకు విక్కీ ఫొటోలకు తన ముఖం ఉండేలా ఎడిట్ చేసి పలు వీడియాలు, పోస్ట్లు కూడా షేర్ చేశాడు. ఇలా కొద్ది రోజులుగా నిందితుడు కత్రినా-విక్కీని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.కాగా నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా- విక్కీ కౌశల్ గతేడాది పెళ్లిపీటలెక్కారు.ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్-3లో క్యాట్ హీరోయిన్గా నటిస్తుండగా.. గోవింద్ నామ్ మేరా, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) View this post on Instagram A post shared by King Aditya Rajput🇮🇳VVIP (@kingbollywoodceo) -
IIFA Awards 2022: ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు..
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్ 4) రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్, మనీష్ పాల్ హోస్ట్గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్, నోరా ఫతేహీలా డ్యూయెట్ సాంగ్ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్ గ్రీన్ కార్పెట్లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్ తమ గ్లామర్తో కట్టిపడేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది. ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ) ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా) ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్ (సర్దార్ ఉద్ధమ్) ఉత్తమ నటి: కృతి సనన్ (మిమి) ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్ శెట్టి (తడప్ 2) ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (లూడో) ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నటియాల్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్ కౌర్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ కథ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో) ఉత్తమ కథ (అడాప్టెడ్): (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ ఐసీసీ వరల్డ్ కప్ 1983 ఆధారంగా వచ్చిన 83) సాహిత్యం: కౌసర్ మునీర్ (లెహ్రే దో పాట-83) -
భర్త విక్కీ కౌశల్కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్డే విషెస్
Katrina Kaif Sweetest Birthday Wishes To Hubby Vicky Kaushal: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బర్త్డే సందర్భంగా ఆయన భార్య, హీరోయిన్ కత్రీనా కైఫ్ స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ అమెరికాలో వేకేషన్ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (మే 16) విక్కీ కౌశల్ బర్త్డే సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెళ్లువెత్తున్నాయి. అలాగే పెళ్లి అనంతరం విక్కీ తొలి బర్త్డే సందర్భంగా కత్రీనా భర్తకు స్వీటెస్ట్ బర్త్డే విషెస్ తెలిపింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఎదుటే బికినీలో బర్త్డే పార్టీ, ట్రోలర్స్ నోర్మూయించిన ఐరా నేపథ్యంలో భర్తతో క్లోజ్గా ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘న్యూయార్క్ వాలా బర్త్డే మై లవ్.. ఏ విషయాన్నైనా నువ్వు ఉత్తమమైనదిగా చేస్తావు..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలో విక్కీ కౌశల్, కత్రీనాను వెనకనుంచి హగ్ చేసుకుని ఆమెకు ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక కత్రీనా పోస్ట్ చూసిన ఈ జంట ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ జంటపై అభిమానం కురిపిస్తూ విక్కీకి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు. చదవండి: 'ఖుషి' టైటిల్తో వస్తున్న విజయ్, సామ్ కాగా గతేడాది రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు. ఎప్పుడు ఈ జంట మీడియా ముందు బయట పడలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియా ముందు మాత్రం దూరం పాటించేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ను గోప్యంగా ఉంచారు విక్ట్రీనా. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
కత్రీనా ప్రెగ్నెంటా? క్లారిటీ ఇచ్చిన ఆమె టీం!
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్పోర్ట్లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పింక్ కలర్ చుడిదార్లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది. -
కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్..
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇటీవలే హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ ! నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అది ఇల్లీగల్ కాదు.. విక్కీ కౌశల్ మీద వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు
Police Clarify On Indore Resident Complaint Against Vicky Kaushal : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్పై ఇండోర్కు చెందిన జైసింగ్ యాదవ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విక్కీ, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న లుకా చుప్పి 2. ఈ సినిమా చిత్రీకరణలో వాడిన బైక్ నంబర్ ప్లేట్ తనదే అని పోలీసులను ఆశ్రయించాడు. 'విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో నడిపే ద్విచక్రవాహనానికి ఉన్న నంబర్ వాస్తవానికి నాది. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నంబర్ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా' అని తెలిపాడు. జైసింగ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే సినిమా షూటింగ్లో విక్కీ ఉపయోగించిన నంబర్ ప్లేట్కు బోల్ట్ బిగించడం వల్ల పొరపాటు జరిగిందని పోలీసులు తెలిపారు. యాదవ్ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు సినిమా సెట్స్కు చేరుకున్న బంగంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ 'ఈ దర్యాప్తులో నంబర్ ప్లేట్పై అమర్చిన బోల్ట్ వల్ల పొరపాటు జరిగింది. బోల్ట్ను గట్టిగా బిగించడంతో 1 నంబర్ 4 లాగా కనిపిస్తుంది. అందుకే జైసింగ్ అపార్థం చేసుకున్నాడు. సినిమా సీన్లో ఉపయోగించిన ఆ నంబర్ ప్లేట్ మూవీ ప్రొడక్షన్ వారికి చెందినది. కాబట్టి ఇందులో చట్ట విరుద్దం ఏం లేదు.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 'హీరో వాడిన బైక్ నంబర్ నాది' పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు -
'నా నంబర్ ప్లేట్ ఎలా వాడతారు?' హీరో విక్కీ కౌశల్పై ఫిర్యాదు
యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్ను బైక్పై తీసుకెళ్తున్నాడు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. కారణం.. విక్కీ నడుపుతున్న బైక్ నంబర్ ప్లేట్ తనదే కావడంతో చిత్రయూనిట్పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్ ప్లేట్ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఆ బైక్ సీన్లో వాడిన నంబర్ ప్లేట్ నాది. ఈ విషయం సదరు చిత్రయూనిట్కు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నా అనుమతి తీసుకోకుండా అలా నంబర్ ప్లేట్ వాడుకోవడం మాత్రం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు' అని యాదవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో చూడాలి! -
మాల్దీవ్స్లో విక్ట్రీనా హనీమూన్.. ఫొటో షేర్ చేసిన నవ వధువు.. 21 గంటల్లోనే...
పెళ్లి బంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాల్దీవ్స్లో వాలిపోయారు. డిసెంబర్ 9న రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు వాళ్లకు సంబంధించిన వార్తలు బీటౌన్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఇక వివాహ అనంతరం నూతన వధువు కత్రినా తొలిసారిగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. హనీమూన్ను మాల్దీవ్స్లో ప్లాన్ చేసుకుందీ కొత్త జంట. మెహందితో ఉన్న చేతులు, బ్యాక్గ్రౌండ్లో సముద్రతీరం ఉన్న ఫొటోను కత్రినా షేర్ చేసింది. లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అన్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మీ రెండు చేతులు చూపిస్తూ ఫొటో ఉంది. ఫొటో విక్కీయే తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ‘నన్ను వదిలేసి వెళ్లావ్గా’ అని ఒక నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. ఫొటో షేర్ చేసిన 21 గంటల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. (చదవండి: ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
పెళ్లైన పది రోజులకేనా.. కత్రినా ఎక్కడ?
బాలీవుడ్కి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్షిప్ను గోప్యంగా ఉంచిన వీరిద్దరు ఎట్టకేలకు ఈ పెళ్లితో ఇటీవలే ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో కొద్ది మంది సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి హంగామ అయ్యాక ఈ క్యూట్ కపుల్ ముంబైకి రావడంతో పాటు మీడియా ముందుకు కూడా వచ్చింది. అయితే వీరి వివాహం జరిగి వారం అయ్యిందో లేదో అప్పుడే కొత్త పెళ్లికొడుకు విక్కీ కౌశల్ వెడ్డింగ్ మూడ్కి ప్యాకెప్ చెప్పి షూటింగ్కు పయనమయ్యాడు. కాగా ఈ విషయాన్ని చెబుతూ విక్కీ తన ఇన్స్టాలో ఓ ఫోటో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్గా.. ముందు టీ.. ఆ తర్వాత షూటింగ్ అని పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పోస్ట్ చూసిన నెటిజన్లు విక్కీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివాహం జరిగిన వారానికే షూటింగ్కు బిజీనా.. మరి కత్రినా ఎక్కడ? కత్రినా కైఫ్తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టు.. అని ఒకరు కామెంట్ చేయగా, పెళ్లై పది రోజులు కూడా కాలేదు అప్పుడే షూటింగా? హనీమూన్ ప్లాన్ చేయలేదా అని మరొకరు, హల్వా ఎలా ఉందని, మరీ ఇంత వర్క్ డెడికేషన్ ఏంటని మరో యూజర్ కామెంట్ చేశారు. చదవండి: Vicky Kaushal: కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్ -
కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్
Vicky Kaushal Reaction On Katrina Kaifs First Halwa After Wedding: బీటౌన్ కొత్త జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ క్యూట్ కపుల్ ఇటీవలె ముంబై చేరుకున్నారు. ఇక పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్షిప్ను అత్యంత సీక్రెట్గా ఉంచిన విక్ట్రీనా జంట వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా పెళ్లి తర్వాత అత్తగారింట్లో కత్రినా తొలిసారి వంట వండిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భర్త విక్కీ..ఇప్పటివరకు తిన్నవాటిలో బెస్ట్ హల్వా ఇదేనంటూ శ్రీమతిపై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశాడు. -
కొత్త పెళ్లికూతురు కత్రినా వండిన తొలి వంట ఏంటో తెలుసా?
Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది. చదవండి: మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
కత్రినాపై విక్కీ కౌశల్ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
విక్కీ కౌశల్ కజిన్ ఉపాసన వోహ్రా కత్రినా కైఫ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో లైవ్చాట్ నిర్వహించిన ఆమె కత్రినా-విక్కీల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా యూజర్ల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఉపాసన ఓహ్ర ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కత్రినా కుటుంబం ఎలా ఉందని అడగ్గా.. తన కుటుంబ సభ్యులంతా చాలా బాగున్నారని, వారిది అద్భుతమైన వ్యక్తిత్వం’ అని చెప్పింది. చదవండి: నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కత్రినా పంజాబీ మాట్లాడుతుందా? అని మరో నెటిజనల్ ప్రశ్నించగా.. ‘తను చాలా బాగా పంజాబీ మాట్లాడుతుంది. పెళ్లిలో విక్కీతో పాటు మా కుటుంబ సభ్యులతో కూడా కత్రినా పూర్తిగా పంజాబీలోనే మాట్లాడింది. అతి తక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడేది. ఈ క్రమంలో తనతో మాకు బాగా చనువు ఏర్పడింది. ఇక అందరి పేర్లను క్యాట్ చాలా బాగా గుర్తుపెట్టుకుంది. ఆ మూడు రోజుల మేమంత ఒమేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్పోర్టు దాడి: విజయ్ సేతుపతికి కోర్టు సమన్లు కాగా హాంకాంగ్లో పుట్టిన కత్రినా కైఫ్ లండన్లో పెరిగింది. కాబట్టి ఆమె మదర్ టంగ్ ఇంగ్లీష్. అయితే బాలీవుడ్లోకి అడుగుపెట్టాక హిందీ నేర్చుకున్న కత్రినా మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో చాలా వరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే మాట్లాడుతుంది. ఇక భర్త విక్కీ కౌశల్ పంజాబీ కుటుంబానికి చెందిన వాడు కావడంతో క్యాట్ పంజాబీ భాషను నేర్చుకుందట. కాగా రాజస్థాన్లో వివాహం అనంతరం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ దంపతులు నిన్న(డిసెంబర్ 14) తిరిగి ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు తమ ప్రేమబంధంపై ఎంతో గోప్యత పాటించిన ఈ నవ దంపతులు ముంబై ఎయిర్ పోర్టులో ఒకరిచేయి ఒకరు పట్టుకుని మరీ కెమెరాలకు స్టిల్ ఇచ్చారు. -
నుదుటిన సింధూరం.. తాళి బొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్లో హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. తొలిసారి భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఈ సందర్భంగా కత్రినా నుదిటన సింధూరం, తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్లో ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే విక్కీ ఫార్మల్ లుక్లో కనిపించాడు. ఇలా కత్రినా, విక్కీలు భార్య భర్తలుగా చూడముచ్చటగా కనిపించారు. ఇక తమ అభిమాన జంటను తొలిసారి భార్యభర్తలుగా చూసిన విక్ట్రీనా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. -
భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్
బాలీవుడ్ నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్లో చిన్న హానీమూన్ ట్రిప్ ముగించుకుని మంగళవారం(డిసెంబర్ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. చదవండి: సల్మాన్,రణ్బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా? దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కత్రినా చుడిదార్ ధరించి నుదుట తిలకంతో కనిపించగా, విక్కీ ఫార్మల్ లుక్లో ఉన్నాడు. చూడటానికి ఈ జంట చాలా అందంగా కనిపించారు. వీరిద్దరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని మీడియాను పలకరించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కత్రినా నవ్వూతూ చాలా సంతోషంగా కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ ‘చాలా రోజుల తర్వాత క్యాటీ మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నా’, ‘క్యూట్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్గా ప్రేమ వ్యవహరం సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జంట కత్రినా, విక్కీలు ఎప్పుడు మీడియా ముందుకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియ ముందు విడివిడిగా ఉండేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్ విషయంలో గొప్యంగా ఉంచిన విక్ట్రీనా.. తొలిసారి పక్కపక్కనే ఒకరి చేయి ఒకరు పట్టుకుని భార్యభర్తలు కనిపించడంతో వారి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సల్మాన్,రణ్బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా?
Katrina Kaif Ex Boyfriends Salman Khan, Ranbir Kapoor Sends Costly Gifts On Her Wedding: ప్రస్తుతం బి-టౌన్లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి హాట్టాపిక్గా మారింది. పెళ్లి వరకు గొప్యత పాటించిన ఈ జంట అనంతరం వరసపెట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలంటూ’ విక్ట్రీనాలు పోస్ట్లు షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా రాజస్థాన్లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి ఎంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న దానిపై స్పష్టత లేదు. చదవండి: కాజల్పై బిగ్బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్లు ఉండటం ఆసక్తినెలకొంది. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రణ్బీర్ కపూర్ 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చినట్టు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో కత్రినా సల్మాన్ ఖాన్తో ప్రేమ వ్యవహరం నడపగా వీరిద్దరి బ్రేకప్ అనంతరం రణ్బీర్ కపూర్తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ అంతేకాదు ముంబైలో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ రణ్బీర్, కత్రినాలు ఎడాది పాటు కలిసి ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్, రణ్బిర్తో పాటు అలియా భట్ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని, రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్ పంపించారని సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్ను ఇవ్వగా, హృతిక్ రోషన్.. విక్కీకి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్ను ఇచ్చాడట. ఇక తాప్సీ కూడా విక్కీకి 1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్లెట్ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. -
విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్
Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ని వివాహం ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం కత్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్.. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్ కలర్ మ్యాచింగ్ కాస్టూమ్స్తో ఫర్ఫెక్ట్ లుక్స్తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్ ఎంతో రొమాంటిక్గా కనిపిస్తున్నాయి. చదవండి: వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే.. ఈ ఫోటోలను షేర్ చేస్తూ... ఓ అందమైన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఇచ్ అదర్ అనేలా ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు.. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
వైరల్ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్ రిసెప్షన్ హాంపర్, అందులో ఏం ఉన్నాయంటే..
Katrina Kaif And Vicky Kaushal Wedding Reception Hamper Goes Viral: బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ షేర్ చేశారు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు పెళ్లి అనంతరం తమ హల్ది ఫంక్షన్ ఫొటోలను షేర్ చేశారు విక్ట్రీనా. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది. కాగా ప్రముఖులకు విక్ట్రీనా రిసెప్షన్కు ఆహ్వానం పంపించినట్లు జోరుగ ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్లో కొద్దిమంది బంధువులు, కుటుంబసభ్యులు, కొద్ది మంది వీఐపీల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలందరికి, ప్రముఖుల కోసం ముంబైలోని ఓ స్టార్ హోటల్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ఈ నేపథ్యంలో బి-టౌన్ సెలెబ్రెటీలకు, సినీ ప్రముఖులకు విక్ట్రీనా ఆహ్వానం పింపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ విక్ట్రీనా వెడ్డింగ్ రెసెప్షన్ ఇన్విటేషన్ హాంపర్ ఇదేనంటూ పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ ఇన్విటేషన్ హాంపర్ పూర్తిగా పింక్ కలర్ పూలతో నిండి ఉంది. ఇక ఇందులో నెయ్యితో చేయించిన స్పెషల్ లడ్డు ఇతర స్వీట్స్తో పాటు డ్రైఫ్రూట్స్తో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కళ్లే చెదిరేలా ఉన్న ఈ హాంపర్తో విక్ట్రీనాలు పలువురికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇది విక్ట్రీనాలకు సంబంధించిందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు
Katrina Kaif And Vicky Kaushal Haldi Function Photos Goes Viral: బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్లు ఒక్కటయ్యారు. గురువారం(డిసెంబర్ 9) రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా(విక్కీ కౌశల్-కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతి కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగే వారకు దీనికి సంబంధించిన ఏ అప్డేట్స్ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహుర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్, పెళ్లి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సీక్రెట్గా ఉంచారు. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ అయితే ఏదో విధంగా అవి పుకార్లుగా బయటకు వచ్చాయి. చివరికి అవే నిజమవుతూ వారి వివాహం జరిగింది. అనంతరం విక్ట్రీనాలు తామిద్దరం ఒక్కటయ్యామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే సెలబ్రెటీల పెళ్లి అంటే దానికి ముందు జరిగే సెలబ్రెషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. వారి హల్దీ ఫంక్షన్, సింగీత్లను వేడుకలా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో వారు చేసే సందడి మామూలుగా ఉండదు. చూస్తే కళ్లు చెదిరెలా అట్టహాసంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటారు. అందుకే వాటిని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. కానీ విక్ట్రీనా పెళ్లి వేడుకల్లో ఇవేవి బయటకు రాలేదు. చదవండి: ఆ షాట్తో చరణ్, తారక్ల బాండింగ్ అర్థమైంది: రాజమౌళి దీంతో వారి ఫ్యాన్స్ అంతా నిరాలో ఉన్నారు. ఇదిలా ఉంటే వివానంతరం ప్రకటన ఇచ్చిన విక్ట్రీనా మెల్లిమెల్లిగా ఫొటోలను బయటకు వదులుతున్నారు. ఇప్పటికే వారి పెళ్లి ఫొటోలను షేర్ చేయగా తాజాగా హల్ది ఫంక్షన్కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ హల్ది ఫంక్షన్లో ఈ జంట నవ్వుతూ సంతోషంగా కనిపించడంతో వారి ఫ్యాన్స్, ఫాలోవర్స్ మురిసిపోతున్నారు. ‘క్యూట్ కపుల్’ అంటూ వారి ఫొటోలకు కామెంట్స్ చేస్తూ వారి ఫొటోలను వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
Virushka: విరుష్క పొరుగింట్లోకి కత్రినా- విక్కీ.. హమ్మయ్య మీకు పెళ్లైంది.. ఇప్పటికైనా!
Anushka Sharma Welcomes Neighbours Katrina Kaif and Vicky Kaushal: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ.. విరుష్క జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయవంతమైన సారథిగా కోహ్లి తనదైన ముద్ర వేస్తే.. బాలీవుడ్ హీరోయిన్, నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందీ జంట. ఇక విరుష్కలు తమ కూతురు వామికతో కలిసి ముంబైలోని జుహులో గల విలాసవంతమైన అపార్టుమెంటులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పక్క బిల్డింగులోకి మరో సెలబ్రిటీ జంట రాబోతుందట. వాళ్లెవరో కాదు.. విక్ట్రినా.. అదేనండి.. బాలీవుడ్ కొత్త దంపతులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. రాజస్తాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరుష్క వీరికి శుభాభినందనలు తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే తమ పక్క అపార్టుమెంటులో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. చదవండి: Virat Kohli: అబ్బో ఇంత తొందరగా.. ఇప్పుడే తెల్లారిందా మీకు! తనే మాకు కింగ్! ఈ మేరకు..‘‘అందమైన జంటకు శుభాభినందనలు! జీవితాంతం ఇలాగే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ... ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి! హమ్మయ్య ఇప్పటికైనా మీ పెళ్లి జరిగింది... ఇక కొత్త ఇంటికి రావడమే తరువాయి! ఇప్పుడైనా.. పక్కింట్లో నుంచి వచ్చే శబ్దాలు(నిర్మాణంలో ఉన్నందున) తగ్గుతాయేమో’’ అంటూ తమ పొరిగింటి వారికి ఫన్నీగా స్వాగతం పలికారు. కాగా పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కత్రినా- విక్కీ పలు ఆలయాల సందర్శించడం సహా కొన్ని రోజుల పాటు విహార యాత్రలు చేసి.. ఆ తర్వాత జుహులోని అపార్టుమెంటులోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. సముద్ర ముఖంగా ఉండే ఈ ఫ్లాట్ను ఏరికోరి సెలక్ట్ చేసుకున్నారట ఈ అందమైన జంట. చదవండి: Vicky Kaushal-Katrina Kaif Wedding: సమంత బాటలో కత్రినా.. సేమ్ సీన్ రిపీట్