Axar Patel
-
IPL 2025: ఆ ఓవర్ స్టబ్స్కు ఎందుకు ఇచ్చావని ఇప్పుడు ఎవరూ నన్ను తిట్టరు: అక్షర్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలిచింది. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా చివరికి విజయం సాధించింది. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్లు ఆడి ఢిల్లీని గెలిపించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీని అశుతోష్.. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ సాయంతో గెలిపించాడు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్లో గెలుపుకు 6 పరుగులు కావాలి. తొలి బంతికి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మోహిత్ శర్మ స్టంపింగ్ను మిస్ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న ఢిల్లీ ఆ తర్వాత మూడో బంతిని అశుతోష్ సిక్సర్గా మలచడంతో సంబరాలు చేసుకుంది. ఐపీఎల్లో ఇంత భారీ లక్ష్యాన్ని (210) ఛేదించడం ఢిల్లీకి ఇదే మొదటిసారి. ఐపీఎల్లో ఓ జట్టు లక్నోపై 200 ప్లస్ టార్గెట్ను ఛేదించడం కూడా ఇదే మొదటిసారి.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఎందుకో తెలీదు నా కెప్టెన్సీలోనే ఇలా జరుగుతుంది. పరిస్థితులు అప్ అండ్ డౌన్గా ఉంటాయి. మొత్తానికి మేం గెలిచాం. ఇప్పుడు ఆ ఓవర్ స్టబ్స్కి ఎందుకు ఇచ్చావని జనాలు నన్ను తిట్టరు. చివరిసారిగా ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఎప్పుడు చూశానో గుర్తులేదు.మొదటి ఆరు ఓవర్లలో వాళ్ళు (మార్ష్, పూరన్) ఆడిన తీరు చూస్తే ఈజీగా 240 పైచిలుకు పరుగులు సాధిస్తారని అనుకున్నా. మా బౌలర్లు చాలా ఎక్కువ పరుగులు ఇచ్చారని అనిపించింది. మొదట్లో మేము కొన్ని క్యాచ్లు కూడా వదిలేశాము. అయినా తిరిగి ఆటలోకి రాగలిగాము. విప్రాజ్ సామర్థ్యం గురించి మాకు ముందే తెలుసు.కాగా, ఈ మ్యాచ్లో అక్షర్ ట్రిస్టన్ స్టబ్స్తో 13వ ఓవర్ వేయించాడు. అప్పటికే శివాలెత్తిపోయిన పూరన్ స్టబ్స్ బౌలింగ్లో మరింత రెచ్చిపోయి వరుసగా నాలుగు సిక్సర్లు, బౌండరీ సహా 28 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ ఆ సమయంలో స్టబ్స్తో ఎందుకు బౌలింగ్ చేయించాడో ఎవరికీ అర్దం కాలేదు. -
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానుల సందడే సందడి (ఫొటోలు)
-
DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?
ఐపీఎల్-2025 (IPL)లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)- లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య సోమవారం పోటీ జరుగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది రెండో హోంగ్రౌండ్ అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఢిల్లీకి గతేడాది సారథ్యం వహించిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్ అయ్యాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంఛైజీ కొనుక్కోగా.. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే తన పాత జట్టుపై ఈ వికెట్ కీపర్ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు.పంత్ వర్సెస్ అక్షర్!మరోవైపు.. పంత్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోస్టును టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఈ జట్టులో మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కూడా కీలకం కానున్నాడు. అయితే, లక్నోతో మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.గాయాల బెడదఇదిలా ఉంటే.. లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్లుఓకి వచ్చాడు. అయితే, కీలక పేసర్లు మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాల బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.ఇలా స్టార్ పేసర్లంతా గాయపడటం లక్నో తుదిజట్టు కూర్పుపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. మరోవైపు.. ఢిల్లీ రాహుల్ సేవలను కోల్పోయినా జేక్ ఫ్రేజర్-మెగర్క్తో పాటు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం.. ఆ జట్టుకు సానుకూలాంశంగా పరిణమించింది. అంతేకాదు ప్రపంచస్థాయి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టుతో ఉండటం ఢిల్లీకి కలిసి రానుంది.లక్నోదే పైచేయిఇక లక్నో మిచెల్ మార్ష్తో అర్షిన్ కులకర్ణిని ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పంపే సూచనలు ఉన్నాయి. పంత్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపించనుండగా.. నికోలస్ పూరన్ స్పెషలిస్టు బ్యాటర్గా అందుబాటులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాశ్ సింగ్ లేదంటే షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా ఢిల్లీ- లక్నో జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడగా.. ఢిల్లీ రెండుసార్లు, లక్నో మూడుసార్లు గెలిచాయి.వర్షం ముప్పు?ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో ఆకాశం మేఘావృతమైంది. ఇక హైదరాబాద్లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుండగా.. విశాఖలోనూ వాన పడితే ఢిల్లీ- లక్నో మ్యాచ్పై ప్రభావం పడనుంది.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో తుదిజట్లు (అంచనా)ఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, టి.నటరాజన్ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మలక్నోఅర్షిణ్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, రవి బిష్ణోయి, షమార్ జోసెఫ్ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ సింగ్/షాబాజ్ అహ్మద్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!Captains 👍Match-day rivals 🆚Friends through & through 🤝𝗠. 𝗢. 𝗢. 𝗗 Axar & Rishabh as we gear up for tonight's #DCvLSG clash 👌👌#TATAIPL | @DelhiCapitals | @LucknowIPL | @akshar2026 | @RishabhPant17 pic.twitter.com/mI2RI3WHYF— IndianPremierLeague (@IPL) March 24, 2025 -
కొత్త వ్యూహంతో.. అక్షర్పై ఆశలతో ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకటి. గత సీజన్లో వరుసగా పరాజయ పరంపరతో ప్రారంభించి మొదటి అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి చవిచూసి.. చివరికి ఆరో స్థానంతో ముగించింది ఢిల్లీ. అయితే, ఈసారి జట్టు స్వరూపాన్నే మార్చేసింది. గత సీజన్ కెప్టెన్ భారత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రికార్డు స్థాయిలో రూ 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కనుగోలు చేసిన తర్వాత కొత్త వ్యూహానికి తెరతీసింది.అనుభవజ్ఞుడైన భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul), దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్లను కొనుగోలు చేసింది. కానీ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్కి కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో రాణించిన మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్లోనూ మార్పులుఢిల్లీ బ్యాక్రూమ్ సిబ్బందిలో కూడా మార్పులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో భారత్ మాజీ ఆల్ రౌండర్ హేమాంగ్ బదానీని ప్రధాన కోచ్గా నియమించారు. భారత మాజీ బ్యాటర్ విశాఖపట్నంకి చెందిన వై వేణుగోపాలరావు కొత్త క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ను మెంటార్గా, మాథ్యూ మోట్ను అసిస్టెంట్ కోచ్గా, మునాఫ్ పటేల్ను బౌలింగ్ కోచ్గా నియమించారు.సీనియర్లకు మళ్ళీ జట్టులో చోటుఅయితే ఢిల్లీ జట్టులో చాలా మంది గత సీజన్ ఆటగాళ్లు మళ్లీ జట్టు లో కొనసాగుతున్నారు. గత సీజన్ లో ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లను రెటైన్ చేసారు. వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ను తిరిగి కొనుగోలు చేశారు. పేసర్ ముఖేష్ కుమార్ కూడా గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కూడా గతంలో ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.గత సీజన్లో తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్తో ఢిల్లీ సమస్యలను ఎదుర్కొంది. ఈ కారణంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ 11.75 కోట్లు), టి నటరాజన్ (రూ 10.75 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ 8 కోట్లు) , మోహిత్ శర్మ (రూ 2.20 కోట్లు)లను తీసుకువచ్చారు. ఇక స్పిన్ విభాగం లో కుల్దీప్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జట్టు నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ని కొంత దెబ్బతీసింది. అయితే ఢిల్లీ కొత్త జట్టు కొత్త కెప్టెన్, కొత్త వ్యూహం తో ఈసారి రంగ ప్రవేశం చేస్తోంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (సోమవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్ తో తమ ఐపీఎల్ 2025 సీజన్ని ప్రారంభిస్తుంది. విశాఖపట్నం ని తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ తన మొదటి రెండు హోమ్ మ్యాచ్లను ఇక్కడే ఆడుతుంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్ళుజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ఆస్ట్రేలియా కి చెందిన జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ 2023 నుండి టీ20లలో పవర్ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్ (168.04) ఉన్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (184.8), అభిషేక్ శర్మ (181.47) ల తర్వాత మూడో స్థానం లో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 234.04 స్ట్రైక్ రేట్తో 330 పరుగులు సాధించాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిని కొనుగోలు చేసింది.కెఎల్ రాహుల్మాజీ లక్నౌ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లో తన అసాధారణ ప్రతిభతో భారత్ జట్టుకి విజయాలు చేకూర్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ లో బాగా నిలకడ రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా పేరు పొందిన రాహుల్ 132 మ్యాచ్లు ఆడి 135 స్ట్రైక్ రేట్తో 37 అర్ధ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 4,683 పరుగులు సాధించాడు.ఫాఫ్ డు ప్లెసిస్అపార అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఈ సీజన్ లో ఓపెనర్ గాను, ఢిల్లీ క్యాపిటల్స్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఫాఫ్ 145 ఐపీఎల్ మ్యాచ్లలో ఆడాడు. 140 స్ట్రైక్ రేట్తో 37 అర్ధ సెంచరీ లతో 4571 పరుగులు చేశాడు.కరుణ్ నాయర్దేశవాళీ క్రికెట్ లో సెంచరీలతో రికార్డుల మోత మోగించిన కరుణ్ నాయర్ మళ్ళీ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విదర్భ రంజీ ట్రోఫీ విజయంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్లో 120 , 80 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది మ్యాచ్ల్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 76 ఐపీఎల్ మ్యాచ్లతో, దాదాపు 130 స్ట్రైక్ రేట్తో 10 అర్ధ సెంచరీలతో 1,496 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అతని స్థిరత్వం ఢిల్లీ కి కీలకం.అక్షర్ పటేల్కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ తన జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరపున బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించిన అక్షర్ పటేల్ కి కెప్టెన్ గా పెద్ద అనుభవం లేదు. అయితే తన నైపుణ్యంతో రాణించగల సామర్థ్యముంది. అక్షర్ ఇంతవరకు 150 ఐపీఎల్ మ్యాచ్లలో, 130 స్ట్రైక్ రేట్తో మూడు అర్ధ సెంచరీలతో 1,653 పరుగులు చేశాడు. 8 కంటే తక్కువ ఎకానమీతో 123 వికెట్లతో సాధించిన అక్షర్ జట్టుకు సరైన సమతుల్యతను ఇస్తాడనడంలో సందేహం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మిచెల్ స్టార్క్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్ రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ. -
‘అక్షర్తో పోలిస్తే అతడికి కాస్త కష్టమే.. కోహ్లి సూపర్స్టార్డమ్తో పోటీ’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్కతా నైట్ రైడర్స్కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్లకు ఐపీఎల్లో కెప్టెన్గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్తో పోలిస్తే అక్షర్పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్లను పోల్చి చూస్తే అక్షర్కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్కు సానుకూలాంశం.రజత్కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.కోహ్లి నీడలో కాకుండా.. అయితే, నాకు తెలిసి రజత్కు ఆర్సీబీ మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.ముఖ్యంగా రజత్పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది. అయితే, ఐపీఎల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్కతా- బెంగళూరు మధ్య మ్యాచ్తో మొదలుకానుంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
IPL 2025 : విశాఖలో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (ఫొటోలు)
-
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్గా డుప్లెసిస్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ను ఢిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్ను బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది. ఈ సీజన్లో ఫాఫ్ అక్షర్కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్గా, సౌతాఫ్రికా కెప్టెన్గా ఫాఫ్కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్ కెప్టెన్సీ అనుభవం ఈ సీజన్లో అక్షర్ పటేల్కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఫాఫ్ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్ తన ఐపీఎల్ కెరీర్లో 145 మ్యాచ్లు ఆడి 136.37 స్ట్రయిక్రేట్తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ ఈ సీజన్లో ఢిల్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్తో ఫాఫ్ జోడీ కట్టవచ్చు. కాగా, ఢిల్లీ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించకముందు ఈ సీజన్లోనే తమతో చేరిన కేఎల్ రాహుల్ను కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ ఆఫర్ను రాహుల్ తిరస్కరించాడని సమాచారం. రాహుల్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో రాహుల్, డుప్లెసిస్తో పాటు ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీతో జతకట్టాడు. ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్మెంట్ స్టార్క్కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ను ఈ సీజన్లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్ లక్నో కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
Axar Patel: ‘ఆర్మ్ బౌలర్’ కప్ అందిస్తాడా?
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ రెడీ అవుతోంది. పొట్టి ఫార్మాట్లో క్రికెట్ లవర్స్ను బాగా ఆకట్టుకున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతోంది. 10 టీమ్లు బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయాయి. మధ్యలో వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇంకా టైటిల్ దక్కించుకోలేదు. కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న ఈ నాలుగు జట్లు ఈసారైనా ఐపీఎల్ కప్ అందుకుంటాయా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.న్యూ రోల్లో రాణిస్తాడా?టోర్నమెంట్కు వారం రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ కెప్టెన్ (Team Captain) ఎవరనేది ప్రకటించింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్టు అధికారికంగా వెల్లడించింది. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్షర్ పటేల్కు అరుదైన అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆల్రౌండర్గా రాణించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్.. జట్టు నాయకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడనేది చూడాలి. ఆటగాడిగా తానేంటో నిరూపించుకున్న అక్షర్ కెప్టెన్గా జట్టును ఎలా నడిపిస్తాడేనన్నది ఆసక్తికరంగా మారింది.పొట్టి ఫార్మాట్లో రాణిస్తూ..గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ (Axar Patel) స్థిరంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందడమే కాకుండా మెప్పు పొందేలా ఆడాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ జట్టుకు ప్రయోజనకరంగా మారాడు. చాంపియన్స్ ట్రోఫీలో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 109 పరుగులు చేసి తన విలువ చాటుకున్నాడు.ఐపీఎల్లో అదుర్స్2014లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 మ్యాచ్లు ఆడాడు. 21.47 సగటు, 130.88 స్టైక్ రేటుతో 1653 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు. గత ఐపీఎల్లో 235 పరుగులు చేయగా, 2023లో 283 పరుగులు సాధించాడు. ఈ రెండు ఎడిషన్లలోనూ 11 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫీల్డింగ్లోనూ చురుకుదనం ప్రదర్శించాడు. బౌలింగ్కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ వికెట్లు చేజిక్కించుకోవడం అక్షర్ పటేల్ స్పెషాలిటీ. తన మ్యాజిక్తో ఈ ఐపీఎల్లో ఎలాంటి ఫలితం రాబతాడో చూడాలి మరి.చదవండి: 'అక్షరా'ల అమూల్యం., టీమిండియాలో స్థానం సుస్థిరంక్యాపిటల్స్కు కప్ తెస్తాడా?ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఎంపికైన అక్షర్ పటేల్ ముందు ఇప్పుడు పెద్ద లక్షమే ఉంది. ఇప్పటివరకు డీసీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2020లో దుబాయ్లో జరిగిన టోర్నమెంట్లో ఫైనల్ వరకు చేరుకుని ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. గత సీజన్లో ఆరో స్థానానికి పరిమితమైంది. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ను (Delhi Capitals) అక్షర్ పటేల్ అంతకంటే మెరుగైన స్థానంలో ఉంచుతాడా, టైటిల్ గెలుస్తాడా అనేది వేచి చూడాల్సిందే. -
కంగ్రాట్స్ బాపు.. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది: రాహుల్
ఐపీఎల్-2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్గా నియమించింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత కేఎల్ రాహల్ను కెప్టెన్గా ఎంపిక చేయాలని భావించింది.కానీ అందుకు రాహుల్ సుముఖత చూపకపోవడంతో అక్షర్కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ యాజమాన్యం అప్పగించింది. ఐపీఎల్లలో అక్షర్ పటేల్ ఓ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. కాగా అక్షర్ 2019 నుంచి డీసీ జట్టుతో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి అక్షర్ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అతడికి బీసీసీఐ సెలక్టర్లు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంలో అక్షర్ది కీలక పాత్ర. . టీమిండియా తరఫున అక్షర్ పటేల్ 71 టీ20 మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ 535 పరుగులతో పాటు, 71 వికెట్లు కూడా తీసుకున్నాడు. 150 ఐపీఎల్ మ్యాచ్లలో 1653 పరుగులు చేసి 123 వికెట్లు తీసుకున్నాడు.రాహుల్ విషెస్..ఇక కెప్టెన్గా ఎంపికైన అక్షర్ పటేల్కు తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్కు అభినందనలు తెలిపాడు. "కంగ్రాట్స్ బాపు(అక్షర్ పటేల్). ఈ సరికొత్త ప్రయాణంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా వంతు సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది" అని రాహుల్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్కు నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్ను లక్నో ఫ్రాంచైజీ విడుదల చేసింది. అతడి స్ధానంలో డైనమిక్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్సీ అప్పగించింది.చదవండి: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు సారథిగా పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ఆధికారిక ప్రకటన చేసింది.తొలుత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ మెనెజ్మెంట్ భావించినప్పటికీ.. అతడు అందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ను తమ జట్టు సారథిగా ఢిల్లీ ఫ్రాంచైజీ నియమించింది. కాగ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ అక్షర్ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. 31 ఏళ్ల అక్షర్ పటేల్.. 2019 ఐపీఎల్ సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్లో భాగంగా ఉన్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్లో గుజరాత్ జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం అక్షర్కు ఉంది.అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సూర్యకుమార్ డిప్యూటీగా అక్షర్ వ్యవహరించాడు. ఆ సిరీస్లో పటేల్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.ఐపీఎల్లో కూడా అతడికి అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అక్షర్.. 1653 పరుగులతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. ఇక కెప్టెన్గా ఎంపికైన అనంతరం అక్షర్ పటేల్ తొలిసారి స్పందించాడు."ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా ఎంపికవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమానులకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్తో నాకు బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యునిగా ఉంటూనే ఒక క్రికెటర్గా నేను అత్యున్నతస్ధాయికి చేరుకున్నాను. ఈ జట్టును ముందుకు నడిపించేందుకు సిద్దంగా ఉన్నాను. మా కోచ్లు, స్కౌట్లో మెగా వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మా జట్టు ఇప్పుడు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. మా జట్టులో కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు"అక్షర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ 13వ కెప్టెన్ కావడం గమనార్హం. గత సీజన్ వరకు తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను ఢిల్లీ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది.ఢిల్లీ క్యాపిట్సల్ కెప్టెన్లు వీరే...1 వీరేంద్ర సెహ్వాగ్2 గౌతమ్ గంభీర్3 దినేష్ కార్తీక్4 జేమ్స్ హోప్స్5 మహేల జయవర్ధనే6 రాస్ టేలర్7 డేవిడ్ వార్నర్8 కెవిన్ పీటర్సన్9 JP డుమిని10 జహీర్ ఖాన్11 కరుణ్ నాయర్12 శ్రేయాస్ అయ్యర్13 రిషబ్ పంత్14 అక్షర్ పటేల్చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్ -
అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్రిచ్ లీగ్ సీజన్లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేశాయి.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.నో చెప్పిన రాహుల్..ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.రేసులో డుప్లెసిస్..అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్మెంట్ డుప్లెసిస్ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్కు కెప్టెన్గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా డుప్లెసిస్ వ్యవహరించాడు. అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం -
కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడని సమాచారం. కెప్టెన్సీ చేపట్టే విషయంలో డీసీ యాజమాన్యం రాహుల్ను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్ మేనేజ్మెంట్కు స్పష్టం చేశాడట. దీంతో డీసీ యాజమాన్యం అక్షర్ పటేల్ పేరును కెప్టెన్గా ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళో రేపో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అనంతరం డీసీ మేనేజ్మెంట్ అక్షర్ విషయంలో చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అక్షర్ను డీసీ మేనేజ్మెంట్ మెగా వేలానికి ముందు రూ. 16.5 కోట్లకు రీటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్కు టీమిండియాతో పాటు ఐపీఎల్లో పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్ కెప్టెన్గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్టైమ్ కెప్టెన్గా తొలి అసైన్మెంట్ అవుతుంది. అక్షర్కు దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది.అక్షర్ గత సీజన్లో రిషబ్ పంత్ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించారు. అక్షర్ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్తోనే కొనసాగుతున్నాడు. అక్షర్ తన ఐపీఎల్ కెరీర్లో 150 మ్యాచ్లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్లు తీశాడు. అక్షర్ బ్యాటింగ్ స్ట్రయిక్రేట్ 130.88గా ఉండగా.. బౌలింగ్ ఎకానమీ 7.28గా ఉంది. అక్షర్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా కూడా పని చేశాడు. కాగా, గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ను ఢిల్లీ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొన్న పంత్ను లక్నో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.పలు మ్యాచ్లకు దూరం కానున్న రాహుల్..?ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్లో జరిగే పోరులో ఢిల్లీ..లక్నోతో తలపడనుంది. కాగా, ఈ సీజన్లో తొలి రెండు, మూడు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని తెలుస్తుంది. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ కారణంగానే రాహుల్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ వద్ద పర్మిషన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రాహుల్-అతియాల వివాహాం 2023 జనవరిలో జరిగింది. ఈ జంట గతేడాది నవంబర్లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడగా.. కివీస్కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వాడిన పిచ్నే భారత్- కివీస్ ఫైనల్కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్మెన్కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
Axar Patel: ‘అక్షరా’లా అమూల్యం.. భారత జట్టులో స్థానం సుస్థిరం
అక్షర్ పటేల్ భారత జట్టు తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే పదేళ్ల కాలంలో కేవలం 14 టెస్టులు, 57 వన్డేలు, 60 టి20లు మాత్రమే ఆడగలిగాడు. తనలాంటి లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కలగలిసిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా నీడలోనే అతను ఎక్కువ కాలం ఉండిపోవడమే అందుకు కారణం. జడేజా ఏదో కారణంతో జట్టుకు దూరమైతే తప్ప అక్షర్కు అవకాశం దక్కకపోయేది. కానీ గత ఏడాది కాలంలో పరిస్థితి మారింది. వన్డేలు, టి20ల్లో చక్కటి ప్రదర్శనలతో అతను జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. జడేజాతో పోలికలు వచ్చినా సరే... తనదైన శైలిలో రెండు విభాగాల్లోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు... 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్లో కోహ్లిలాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజాలాంటి ఆల్రౌండర్లను కాదని అక్షర్పై నమ్మకంతో కోచ్ ద్రవిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లితో కలిసి అక్షర్ నాలుగో వికెట్కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లి 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే... అక్షర్ ఒక ఫోర్, 4 సిక్స్లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ చాంపియన్గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది. 2021లో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్కు వచ్చింది. ఈ సిరీస్లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, టి20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు. అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, టి20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీని వల్ల కొన్నిసార్లు బ్యాటర్కు భారీ షాట్ ఆడే అవకాశం వచ్చినా... అదే ఉచ్చులో ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్కు అవకాశం ఉంటుంది. ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్లో మరింత సాధన చేశాడు. పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నింటికి మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, టి20ల్లో మరిన్ని అవకాశాలు కల్పించింది. టి20 వరల్డ్ కప్లో అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్తో మ్యాచ్లో మార్ష్ క్యాచ్ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్తో టి20ల్లో అతని స్థానం సుస్థిరమైంది. బ్యాటర్గానే తన కెరీర్ మొదలు పెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్ను గత కొంత కాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతని దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతనికి అలాంటి అవకాశం ఇచ్చింది. వాటిని చాలా వరకు అక్షర్ సమర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు అవసరాలరీత్యా అతనికి ఐదో స్థానంలో ఆడే అవకాశం దక్కుతోంది. వన్డేల్లో రాహుల్కే కీపర్గా తొలి ప్రాధాన్యత లభిస్తుండటంతో పంత్కు చోటు ఉండటం లేదు. దాంతో టాప్–6లో అంతా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్షర్ను మేనేజ్మెంట్ ఐదో స్థానంలో పంపిస్తోంది. అది చక్కటి ఫలితాలను కూడా అందించింది. అక్షర్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ అంశం అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే తీరు. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్తో అతను పెద్ద సంఖ్యలో పరుగులు రాబడుతున్నారు. అలవోకగా సిక్స్లు కొడుతున్న అతని నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్లో అతను తొలిసారి ఐదో స్థానంలో ఆడాడు. అక్షర్ వరుసగా 44, 52, 41 నాటౌట్, 8, 42, 27 పరుగులు సాధించాడు. ఒక బ్యాటర్గా చూస్తే ఇవన్నీ అద్భుత గణాంకాలు కాకపోయినా... ఆల్రౌండర్ కోణంలో, పైగా తక్కువ స్కోర్ల మ్యాచ్లలో ఈ స్కోర్లన్నీ అమూల్యమైనవే. ఇప్పుడు టీమిండియాలో అన్ని విధాలా ఆధారపడదగ్గ ప్లేయర్గా మారిన అక్షర్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు. -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తర్వాత మిడిలార్డర్కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్గా.. మిడిలార్డర్ బ్యాటర్గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాహుల్కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్తో మ్యాచ్లో మళ్లీ రాహుల్ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి గ్రూప్-‘ఎ’ టాపర్గా సెమీ ఫైనల్కు చేరింది భారత్. దుబాయ్లో మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకువెళ్లింది.నిరాశపరిచిన రోహిత్ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్లో ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నాలుగో స్థానానికిఇదిలా ఉంటే.. ఆసీస్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆసీస్తో మ్యాచ్లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ అక్షర్ పటేల్ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. శుబ్మన్ గిల్(ఇండియా)- 791 రేటింగ్ పాయింట్లు2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 770 రేటింగ్ పాయింట్లు3. హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా)- 760 రేటింగ్ పాయింట్లు4. విరాట్ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్ పాయింట్లు5. రోహిత్ శర్మ(ఇండియా)- 745 రేటింగ్ పాయింట్లు.చదవండి: శుబ్మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లి.. వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా.. లీగ్ స్టేజిని ఆజేయంగా ముగించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్లో న్యూజిలాండ్ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో విజయోత్సహంతో సెమీస్కు భారత్ సన్నద్దమైంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. కివీస్తో జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కాళ్లును మొక్కబోయాడు. అవును మీరు విన్నది నిజమే. కోహ్లి ఎందుకు అలా చేశాడో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) , హార్దిక్ పాండ్యా(45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. టీమిండియా స్పిన్నర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. అయితే న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి కేన్ విలియమ్సన్ మాత్రం భారత్కు కొరకరాని కొయ్యగా మారాడు. మిగితా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడితే కేన్ మాత్రం సమర్ధవంతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అక్షర్ పటేల్.. విలియమ్సన్ వికెట్ను భారత్కు అందించాడు. కివీస్ ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. అద్బుతమైన బంతితో కేన్ను బోల్తా కొట్టించాడు. అక్షర్ సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగ్గాఇ అంచనా వేయలేకపోయిన విలియమ్సన్ స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. అక్షర్ తన 10 ఓవర్ల స్పెల్ చివరి బంతికి వికెట్ తీయడం గమనార్హం. దీంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి వేగంగా అక్షర్ వద్దకు వెళ్లి అతడు కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్షర్ వెంటనే కిందకూర్చుని నవ్వుతూ కోహ్లిని ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15— voodoo mama juju (@ayotarun) March 2, 2025 -
కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నాను: అక్షర్ పటేల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆజేయ శతకంతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.అయితే కోహ్లి తన 51 వ వన్డే సెంచరీని అందుకునే క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. మైదానంలోనూ, టీవీల ముందు అభిమానులు కూడా కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అనేదాని గురించే ఆసక్తిగా ఎదురు చూశారు.వీరి పరిస్థితి ఇలా ఉంటే క్రీజ్లో మరోవైపు ఉన్న అక్షర్ పటేల్ పరిస్థితి ఎలా ఉంది! భారత్ విజయానికి 19 పరుగులు, కోహ్లి సెంచరీకి 14 పరుగులు కావాల్సిన స్థితిలో అక్షర్ బ్యాటింగ్కు వచ్చాడు. అతను ఒక్క పెద్ద షాట్ ఆడి బౌండరీ సాధించినా లెక్క మారిపోయేది. అందుకే అతను పరుగులు తీయరాదనే అందరూ కోరుకున్నారు.తాను కూడా ఇలాగే భావించినట్లు, కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నట్లు అక్షర్ వెల్లడించాడు. ‘మ్యాచ్ చివరికి వచ్చేసరికి నేను కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాను. బంతి నా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కూడా వెళ్లరాదని కోరుకున్నాను. ఆ సమయంలో అంతా సరదాగా అనిపించింది.ఇంత తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్లో విరాట్ సెంచరీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ ఇన్నింగ్స్ను చాలా ఆస్వాదించాను. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత వికెట్ల మధ్య అతను పరుగెత్తిన తీరు విరాట్ ఫిట్నెస్కు తార్కాణం’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో తలపడనుంది. -
IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్బౌలర్ షాహిన్ ఆఫ్రిది(Shaheen Afridi) అనుసరించిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా అతడి ఆటకు వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఆఖర్లో అతడు వైడ్లు వేసిన తీరు ఇందుకు కారణం. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా రిజ్వాన్ బృందం.. ఆదివారం రోహిత్ సేనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థుల(India vs Pakistan) పోటీని చూసేందుకు భారత సినీ, క్రీడా తారలు దుబాయ్ స్టేడియానికి విచ్చేయగా.. వారికి టీమిండియా పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేసి.. దాయాదిని 241 పరుగులకు కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.36 ఓవర్లు ముగిసే సరికిఇక లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది... 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి.కానీ మరో వైపు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు!ఇక పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ పటేల్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతి(42.3 ఓవర్)కి ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి.ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడంతోఅయితే, టీమిండియా ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ ఖుష్దిల్ వేయగా.. అంతకంటే ముందు ఓవర్లో షాహిన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది. అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేసిన షాహిన్.. కోహ్లి శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహిన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లి శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.లూజర్.. లూజర్ అంటూఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్.. లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కూడా స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి నుంచి నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. అతడి 51వ వన్డే శతకాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. షాహిన్ ఆఫ్రిది వైడ్ బాల్స్ అనే కోరల నుంచి తప్పించుకుని సూపర్ సెంచరీ చేశాడు’’ అని బాలీవుడ్, టాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ షాహిన్ ఆఫ్రిదిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశాడు.చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
ఆ ముగ్గురు అద్బుతం.. కోహ్లి గురించి చెప్పేదేమీ లేదు: రోహిత్ శర్మ
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్తో పాటు సౌద్ షకీల్ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
అక్షర్ పటేల్ బుల్లెట్ త్రో.. పాక్ ఓపెనర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ సంచలన త్రోతో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ను పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లో బాబర్ ఆజం రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే ఇమామ్ ఉల్ హక్ దూరదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రెండో బంతికి ఇమామ్ మిడాన్ దిశగా ఆడాడు. షాట్ ఆడిన వెంటనే ఇమామ్ నాన్స్టైకర్ ఎండ్వైపు సింగిల్ కోసం ప్రయత్నించాడు.కానీ మిడాన్లో ఉన్న అక్షర్ పటేల్ డైరక్ట్త్రోతో స్టంప్స్ను గిరాటేశాడు. ఇమామ్ డైవ్ చేసినప్పటికి ఫలితం మాత్రం లేకపోయింది. దీంతో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఇమామ్ పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అదేవిధంగా ఓ క్యాచ్ను అక్షర్ ఈ మ్యాచ్లో అందుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs PAK: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Bapu, tari fielding kamaal chhe...!!! 🔥 pic.twitter.com/uL1YObjwvJ— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025 -
ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్(Bangladesh) కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా.. ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్ను సాధించలేకపోయాడు.అసలేం జరిగిందంటే..?బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్కు పంపాడు. దీంతో అక్షర్కు తొలి హ్యాట్రిక్ సాధించే అవకాశం లభించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ క్లోజ్ ఫీల్డ్ను సెట్ చేశాడు.ఆ ఓవర్లో నాలుగో బంతిని అక్షర్.. అలీకి ఔట్సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మొదటి స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ ఈజీ క్యాచ్ను జారవిడిచాడు. అందరూ రోహిత్ అందుకున్నాడని భావించినప్పటికి ఆఖరి నిమిషంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది. అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంటనే అక్షర్కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్.. 31 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్ అలీకి రెండు ఛాన్స్లు లభించాయి. భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్కప్ వరకు అతడే కెప్టెన్’This moment could have put Axar's name in the record books for decades. But Rohit Sharma successfully ruined it 😒 pic.twitter.com/zDnFk83r0D— Mark. (@CheekuGang) February 20, 2025 -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో మ్యాచ్పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్తో పాటు ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్ను తప్పించి మూడో సీమర్ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపింది. ఈ క్రమంలో నాగ్పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్క్లాస్ ప్లేయర్గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది.నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో నాగ్పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్కు బ్యాటింగ్కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్పూర్లో గురువారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్రౌండర్ను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లు ఆడి టీమ్ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్గా సంజూ శాంసన్! నితీశ్కు చోటు? -
CT 2025: గంభీర్కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్రౌండర్ వ్యాఖ్యానించాడు. -
IPL 2025: కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే..!
భారత మాజీ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్కే ఢిల్లీ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్బజ్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ను టీమిండియా వైస్ కెప్టెన్గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ అక్షర్కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్గా కూడా అక్షర్కు అనుభవం ఉంది. అక్షర్కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.డీకే ఏ ఆధారంగా అక్షర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్లో డీసీ కెప్టెన్గా సేవలందించాడు. మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరించాడు.సాధారణ ఆటగాడిగా రాహుల్..?అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు!
ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్దీప్ సింగ్తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.సూపర్స్టార్పై వేటు!మరోవైపు.. సూపర్స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్తో ఐదు టీ20లుకోల్కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్కోట్లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. అందుకే ఆసీస్ టూర్కు దూరం
టీమిండియా స్టార్ క్రికెటర్ అక్షర్ పటేల్(Axar Patel) తండ్రయ్యాడు. అతడి భార్య మేహా పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అక్షర్ పటేల్ మంగళవారం(డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫోటోను ఈ గుజరాతీ షేర్ చేశాడు. డిసెంబర్ 19న తమ మొదటి బిడ్డకు బిడ్డకు స్వాగతం పలికినట్లు అక్షర్ వెల్లడించాడు. అదే విధంగా తమ బిడ్డకు హక్ష్ పటేల్ అని పేరు పెట్టినట్లు భారత ఆల్రౌండర్ చెప్పుకొచ్చాడు.కాగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఈ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మిగిలిన రెండు టెస్టులకు అతడి స్ధానాన్ని అక్షర్ పటేల్తో భర్తీ చేస్తారని అంతా భావించారు. కానీ అతడు పితృత్వ సెలవులో ఉండడంతో సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.ఈ విషయాన్ని బాక్సింగ్ డే టెస్ట్కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ధ్రువీకరించాడు. ఇక అశ్విన్ స్ధానాన్ని ముంబై ఆల్రౌండర్ తనుష్ కోటియన్తో భర్తీ చేశారు. అక్షర్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు.He's still figuring out the off side from the leg, but we couldnt wait to introduce him to all of you in blue. World, welcome Haksh Patel, India's smallest, yet biggest fan, and the most special piece of our hearts.19-12-2024 🩵🧿 pic.twitter.com/LZFGnyIWqM— Axar Patel (@akshar2026) December 24, 2024 -
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్లలో (2012 ఇంగ్లండ్తో, 2024 న్యూజిలాండ్తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్లపై ప్రధాన స్పిన్నర్గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్రౌండర్గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్స్పిన్నర్ తనుశ్ కొటియాన్కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
శివాలెత్తిన అక్షర్ పటేల్.. ఒకే ఓవర్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది. AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్పై గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్పై అక్షర్తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్గా అక్షర్ పటేల్ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై అక్షర్ పటేల్కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
సౌతాఫ్రికాతో టీ20లు.. తిలక్ రీ ఎంట్రీ.. ఆర్సీబీ స్టార్ అరంగేట్రం!
టీమిండియా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన విజయాలు సాధించాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్లతోనే శ్రీలంక పర్యటనలో పొట్టి సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. సొంతగడ్డపై బంగ్లాదేశ్పై 3-0తో వైట్వాష్ చేసి సత్తా చాటాడు.సఫారీ పిచ్లపై అంత ఈజీ కాదుఅయితే, సౌతాఫ్రికా టూర్ రూపంలో సూర్యకు అసలు సిసలు సవాలు ఎదురుకానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్లను క్లీన్స్వీప్ చేసినంత సులువుగా సౌతాఫ్రికాను పడగొట్టడం సాధ్యం కాదు. సొంత పిచ్లపై చెలరేగే సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం కత్తిమీద సాములాంటిదే.పైగా టీ20 ప్రపంచకప్-2024లో స్వల్ప తేడాతో టీమిండియా చేతిలో ఓడి తొలి టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది సౌతాఫ్రికా. అందుకు ఈ సిరీస్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అలాంటపుడు యువ జట్టుతో ప్రొటిస్ టీమ్ను ఎదుర్కోవడం సూర్యకు బిగ్ చాలెంజ్ అనడంలో సందేహం లేదు.తిలక్ వర్మ పునరాగమనం ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆడిన ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్ సౌతాఫ్రికా టూర్కు వెళ్లే జట్టులో లేరు. వీరిలో నితీశ్, సుందర్ ఆస్ట్రేలియా పర్యటనతో బిజీ కానున్నారు. ఈ క్రమంలో 11 నెలల తర్వాత హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ పునరాగమనం ఖాయం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ అరంగేట్రం కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.ఈసారి ఛాన్స్ పక్కా ఈ ఇద్దరితో పాటు.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్షర్ ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టులు ఆడిన జట్లలో సభ్యుడే. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే, సౌతాఫ్రికా సిరీస్లో అక్షర్ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రొటిస్తో తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లను తుదిజట్టులో ఆడించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే యశ్ దయాళ్ ఎంట్రీ ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలి రిటెన్షన్స్లో భాగంగా ఆర్సీబీ యశ్ను రూ. 5 కోట్లకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.సౌతాఫ్రికాతో తొలి టీ20- భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, ఆవేశ్ ఖాన్.చదవండి: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్.. పూర్తి వివరాలు -
న్యూజిలాండ్తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్తో జరుగబోయే మూడో టెస్ట్లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్కు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్దీప్పై వేటు పడుతుంది. ఆకాశ్దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్తో మూడో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ -
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్మెషీన్కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఉండనున్న ముగ్గురు స్పిన్నర్లు వీరే..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నాయి. బంగ్లాదేశ్తో పోలిస్తే భారత్ ఇంకాస్త ఎక్కువగా శ్రమిస్తుంది. టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడి చాన్నాళ్లు కావడంతో ఈ ఫార్మాట్కు అలవాటు పడేందుకు చెమటోడుస్తుంది. సెప్టెంబర్ 13 నుంచే చెన్నైలో భారత శిక్షణా శిబిరం మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు లయను అందుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మ్యాచ్ ప్రారంభానికి మరో రెండు రోజులే ఉండటంతో భారత తుది జట్టు కూర్పుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తుది జట్టులో వారుండబోతున్నారు.. వీరుండబోతున్నారంటూ సోషల్మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత మేనేజ్మెంట్ నుంచి మాత్రం తుది జట్టు విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీటీఐ నుంచి వస్తున్న సమాచారం మేరకు బంగ్లాతో తొలి టెస్ట్లో భారత స్పిన్ విభాగం ఖరారైనట్లు తెలుస్తుంది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనున్నారని సమాచారం. అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఓ బెర్త్ మినహా బెర్త్లు అన్నింటి విషయమై క్లారిటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, వన్డౌన్లో శుభ్మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఐదో స్థానం కోసం కేఎస్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నప్పటికీ.. రాహుల్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఆతర్వాతి స్థానాల్లో జడేజా, అశ్విన్, కుల్దీప్ అనుకుంటే తొమ్మిది బెర్త్లు ఖరారైపోయినట్లే. ఇక మిగిలింది పేస్ విభాగం. ఈ కేటగిరీలో బుమ్రా స్థానం ఖరారు కాగా.. మరో పేసర్ కోటాలో అనుభవజ్ఞుడు సిరాజ్కు ఛాన్స్ ఇస్తారా లేక ఆకాశ్దీప్, యశ్ దయాల్లలో ఎవరో ఒకరివైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.బంగ్లాతో తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్చదవండి: ముమ్మర సాధనలో... -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్లో.. రెండో ఇన్నిం గ్స్లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఇండియా-డి జట్టు కెప్టెన్గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో షాట్కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
Duleep Trophy 2024: అక్షర్ ఆల్రౌండ్ షో..
సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1. భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0. -
Duleep Trophy 2024: ఆదుకున్న అక్షర్ పటేల్
దులీప్ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇండియా-సితో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు. THE SHOW OF AXAR PATEL. 🔥He smashed an excellent fifty when his team was 8 down on just 76 runs - AXAR PATEL, THE CRISIS MAN. 👏pic.twitter.com/ezWupOFTKQ— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ (4) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఇండియా-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్కుమార్ వైశాఖ్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ఇండియా-డి: దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్కీపర్), అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే -
విశ్వ విజేతలకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఇంగ్లండ్తో సెమీఫైనల్.. టీమిండియా గెలుపుకు పునాది వేసిన అక్షర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కష్టతరమైన పిచ్పై ఈ స్కోర్ ఫైటింగ్ స్కోర్గా చెప్పవచ్చు. ఈ స్కోర్ను ఛేదించే క్రమంలో దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్కు టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. 20 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు (బట్లర్, మొయిన్ అలీ, బెయిర్స్టో) తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు.అక్షర్ రెచ్చిపోవడంతో డిఫెన్స్లో పడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అక్షర్తో పాటు మరో ఎండ్లో కుల్దీప్ యాదవ్ (4-0-19-3), బుమ్రా (2.4-0-12-2) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 2022 ఎడిషన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనానికి పునాది వేసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
T20 WC 2024: సెమీస్లో ఇంగ్లండ్ చిత్తు.. ఫైనల్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..సెమీస్కు టీమిండియా (ఫొటోలు)
-
అక్షర్, బుమ్రాతో నేను కలిసి క్రికెట్ ఆడాను: అమెరికా కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2024లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అమెరికా జట్టు ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా పటిష్టమైన టీమిండియాను అమెరికా ఢీ కొట్టనుంది. పాక్పై విజయం సాధించి మంచి ఊపులో ఉన్న ఆతిథ్య అమెరికా.. భారత్పై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాను అడ్డుకునేందుకు యూఎస్ఎ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్.. భారత ఆటగాళ్లు అక్షర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రాతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ తను ఒకే పట్టణం నుంచి వచ్చామని మోనాంక్ పటేల్ తెలిపాడు."అండర్-19, అండర్-15 మ్యాచ్ల్లో గుజరాత్ తరపున అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నేను ఒకే గ్రామం నుంచి క్రికెట్ కెరీర్ వైపు అడుగులు వేశాము. అక్షర్ మా ఊరిలో చాలా యువకులకు ఆదర్శంగా నిలిచాడు. అంతేకాకుండా వారికి క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు అన్నిరకాలగా అక్షర్ మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు బుమ్రా, అక్షర్ భారత జట్టులో కీలక ఆటగాళ్లగా కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫిరెన్స్లో మోనాంక్ పటేల్ పేర్కొన్నాడు. కాగా మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడం గమనార్హం.ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్లోని ఆనంద్లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్..
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు."ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్లో మా జట్టు కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా చాలా అనుభవం ఉంది. గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాంటింగ్ పేర్కొన్నాడు. -
వరల్డ్కప్ బెర్త్ కోసం ఇద్దరితో పోటీపడుతున్న అక్షర్ పటేల్..!
టీ20 వరల్డ్కప్ 2024 జట్ల ప్రకటన కోసం మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని దేశాల సెలెక్షన్ ప్యానెల్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు కూడా తమ జట్టుకు తుది రూపు తెచ్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. టీమిండియా విషయంలో సెలెక్టర్లు ఇదివరకే ఓ అంచనాతో ఉన్నప్పటికీ ఒకట్రెండు బెర్తుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. హార్దిక్ బెర్త్ కన్ఫర్మ్..?ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మధ్య పోటీ ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సెలెక్టర్లు పాండ్యావైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. శివమ్ దూబేకు ఐపీఎల్లో బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం అతనికి మైనస్ అవుతుంది. దూబే బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నా ఆల్రౌండర్ కోటా కాబట్టి సెలెక్టర్లు రెండు విభాగాలను పరిగణలోకి తీసుకుంటారు. హార్దిక్కు గత అనుభవం కూడా కలిసొస్తుంది. పంత్ ఫిక్స్.. సంజూ వర్సెస్ రాహుల్రిషబ్ పంత్ టీ20 వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో ప్రదర్శనల ఆధారంగా పంత్ ఎంపిక జరుగనున్నట్లు సమాచారం.సెకెండ్ ఛాయిస్ వికెట్కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. రాహుల్వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.అక్షర్ వర్సెస్ ఆవేశ్ వర్సెస్ బిష్ణోయ్బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ బెర్త్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఒక్క బెర్త్ విషయంలో సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలుపట్టుకున్నారు. వరల్డ్కప్ వేదికలు స్లో ట్రాక్స్ కావడంతో అక్షర్కు మెరుగైన అవకాశాలు ఉండచ్చు. -
తెలివిగా వ్యవహరిస్తున్న హార్దిక్.. పాపం శివం దూబే! నిజంగా నష్టమేనా?
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది. ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్ను.. బౌలింగ్ వీక్గా ఉంటే బౌలర్ను తెచ్చుకుంటారు. అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన? ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించవచ్చు. ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత.. ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్కు దూరమవుతాడు. కనీసం సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ విదేశీ ప్లేయర్ని తీసుకుంటే? నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్ట్యూట్లలో ఒకరిగా విదేశీ ప్లేయర్ను నామినేట్ చేయాలి. జట్టులో ఎంతమంది? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్నే ఎక్కువగా సబ్ట్యూట్గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్ అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది. ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చూసుకుంటే కష్టమే ఆల్రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్రౌండర్కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే! -
Ind vs Eng: బ్యాటింగ్లో విఫలమైనా.. అద్భుత క్యాచ్తో మెరిసి..
India vs England, 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి డైవ్ చేసి మరీ ఒడిసిపట్టి భారత శిబిరంలో నవ్వులు నింపాడు. కాగా హైదరాబాద్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో రెండో మ్యాచ్లో తలపడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. బ్యాటింగ్లో విఫలం అయితే, ఈ మ్యాచ్లో బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. తద్వారా జట్టుతో పాటు అభిమానులనూ నిరాశపరిచాడు. అయితే, రెండో రోజు ఆటలో భాగంగా శనివారం సూపర్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. డైవ్ చేసి.. క్యాచ్ పట్టి అతడి బౌలింగ్లో రెండో బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిష్ ఓపెనర్ జాక్ క్రాలే.. మరుసటి బాల్కు కూడా షాట్ ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరుగెత్తి.. డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలే కథ ముగిసింది. రెండో వికెట్ దక్కడంతో టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘బ్యాటింగ్తో కాకపోయినా.. ఫీల్డింగ్తోనైనా జట్టులో చోటిచ్చినందుకు కనీస న్యాయం చేస్తున్నావు’’ అంటూ సెటైరికల్గా ప్రశంసిస్తున్నారు. చదవండి: Ind vs Eng: పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: గిల్కు మాజీ కోచ్ వార్నింగ్ 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄 That was a ripper of a catch! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @ShreyasIyer15 | @IDFCFIRSTBank pic.twitter.com/JSAHGek6nK — BCCI (@BCCI) February 3, 2024 -
Day 3: భారత బౌలర్లకు 6 వికెట్లు.. పోప్ సెంచరీ.. హైలైట్స్ ఇవే
India vs England 1st Test Day 3 Updates: టీమిండియాతో తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్లో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 77 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. మూడో రోజు హైదరాబాద్ టెస్టు ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆరంభంలో టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లండ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపే మొగ్గు చూపినా.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పోరాడడంతో ఆ జట్టుకు 126 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సరికి పోప్ 148, రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో 316/6 స్కోరు చేసిన ఇంగ్లండ్ ప్రస్తుతం భారత జట్టు కంటే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ డౌన్.. 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్ను.. అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రెహాన్ ఆహ్మద్ వచ్చాడు. అతడితో పాటు ఓలీ పోప్(125) పరుగులతో ఉన్నాడు. ఒలీ పోప్ టాప్ క్లాస్ సెంచరీ 60.2: జడేజా బౌలింగ్లో మూడు పరుగులు తీసి శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్. ఇంగ్లండ్ స్కోరు: 245/5 (61) 200 పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 52 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 200-5 ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 5 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో పోప్(81), బెన్ ఫోక్స్(10) పరుగులతో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 172/5 (42) ఒలీ పోప్ 67, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుబడి ఉంది. స్టోక్స్ అవుట్ 36.5: అశ్విన్ బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్(6). ఇంగ్లండ్ స్కోరు: 163/5 (36.5). టీమిండియా ఇంకా 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్ స్థానంలో బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 60 పరుగులతో ఆడుతున్నాడు. 28.3: పోప్ హాఫ్ సెంచరీ నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 27.4: .జడేజా బౌలింగ్లో బెయిర్స్టో బౌల్డ్(10). బెన్స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 140/4 (27.4) 27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 136/3 బెయిర్ స్టో ఆరు, పోప్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఆధిక్యం 54 పరుగులు ఇంగ్లండ్ స్కోరు: 122/3 (24).. టీమిండియాకు 68 పరుగుల ఆధిక్యం బెయిర్స్టో 3, ఒలీ పోప్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. దెబ్బకు దెబ్బ కొట్టిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బెయిర్స్టో క్రీజులోకి వచ్చాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3. కాగా అంతకు ముందు రూట్ బుమ్రాను బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా మ్యాజిక్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 18.5: బుమ్రా బౌలింగ్లో బెన్ డకెట్(47) క్లీన్బౌల్డ్. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 113/2 (18.5). టీమిండియాకు ఇంకా 77 పరుగుల ఆధిక్యం నిలకడగా ఆడుతున్న డకెట్, పోప్ 16.3: డకెట్, పోప్ కలిసి 43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు: 97-1(17). టీమిండియా ఆధిక్యం 93 రన్స్. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 89/1 (15) ఒలీ పోప్ 16, బెన్ డకెట్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 67/1 డకెట్ 30, పోప్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలే దూకుడుకు బ్రేక్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే. 33 బంతుల్లోనే 31 పరుగులతో జోరు మీదున్న క్రాలేకు అశూ అడ్డుకట్ట వేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 45/1 (9.2) 7 ఓవర్లలో స్కోరు: 33-0 క్రాలే 25, డకెట్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన క్రాలే 5.5: అశ్విన్ బౌలింగ్లో ఫోర్ బాదిన క్రాలే 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 13-0 ఓపెనర్లు జాక్ క్రాలే 10, బెన్ డకెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 177 పరుగులు వెనుకబడి ఉంది. హైలైట్స్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 246 టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 436 టీమిండియా ఆలౌట్.. ఓవరాల్గా 190 పరుగుల ఆధిక్యం 120.6: రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ బౌల్డ్. పదో వికెట్ కోల్పోయిన టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు: 436 (121). మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్లు తీయగా... రెహాన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చీ రాగానే బుమ్రా బౌల్డ్ 119.4: జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన బుమ్రా జో రూట్ బౌలింగ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 436/9 (120). 190 పరుగుల ఆధిక్యంలో టీమిండియా జడ్డూ అవుట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 119.3: జో రూట్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన రవీంద్ర జడేజా. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా ఆధిక్యం 190 రన్స్ 118.6: ఫోర్ బాదిన అక్షర్ 179 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 113: జడేజా 84, అక్షర్ పటేల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య మొదలైన మూడో రోజు ఆట రవీంద్ర జడేజా 83, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 423-7(112). రెండో రోజు హైలైట్స్ ►శుక్రవారం నాటి ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు: 421/7 ►కేఎల్ రాహుల్(86), జడేజా అర్ధ సెంచరీలు ►రాణించిన కేఎస్ భరత్(41), అక్షర్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల విజృంభణతో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన ప్రస్తుతం 175కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. చదవండి: మొదటి టెస్టు మన చేతుల్లోకి... -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, బౌలింగ్లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో నిన్న ముగిసిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
T20 WC: ప్రపంచకప్ జట్టులో కుల్దీప్నకు నో ఛాన్స్! ఆ ముగ్గురే..
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్తో స్వదేశంలో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్లలో చైనామన్ బౌలర్ కుల్దీప్నకు తుదిజట్టులో చోటు దక్కలేదు. రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్పై ప్రశంసలు కురిపించాడు. బంతితోనూ, బ్యాటింగ్తోనూ రాణించగల ఈ ఆల్రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు. చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్లో అఫ్గన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
Tilak Varma: క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే: అక్షర్ పటేల్
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో చెమటోడుస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే మరో టీమిండియా స్టార్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లోనూ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
ఆవేశ్ ఖాన్కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టాపార్డర్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్డౌన్లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
జడ్డూ వైస్ కెప్టెన్ అయితే ఏంటి? సెలక్టర్లు ఒక్కసారి వద్దనుకుంటే..
South Africa vs India, 3rd T20I: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భవితవ్యం గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు ప్రమాదం పొంచి ఉందన్నాడు. టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే జడ్డూ బ్యాట్ ఝులిపించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ఏ క్షణమైనా సెలక్టర్లు జడేజాపై వేటు వేయడానికి వెనుకాడరని పేర్కొన్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో వైస్ కెప్టెన్ అన్న ట్యాగ్ అతడిని కాపాడుతుందనుకుంటే పొరబడ్డేనని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సమం చేసి పరువు నిలుపుకోవాలని కాగా సౌతాఫ్రికా పర్యటనలో భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండగా.. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇక మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటిది వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ క్రమంలో సిరీస్ సమం చేసి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్.. మూడో టీ20లో పలు మార్పులతో బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు పోటీ ‘‘రింకూ సింగ్ మరోసారి మంచి స్కోరు సాధించాలని కోరుకుంటున్నా. జితేశ్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జడ్డూ ఇంకాస్త మెరుగ్గా ఆడాలి. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో అతడికి గట్టి పోటీ ఉంది. కేవలం వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన జడ్డూ తుదిజట్టులో ఉంటాడన్న నమ్మకం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో టీమిండియా వైస్ కెప్టెన్ పదవికి పెద్దగా విలువేమీ ఉండటం లేదు. అప్పుడు అజింక్య రహానే.. మొన్న అయ్యర్ ఆస్ట్రేలియాతో సిరీస్లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అంతకు ముందు టెస్టుల్లో అజింక్య రహానే కూడా టెస్టు జట్టు సారథికి డిప్యూటీగా వ్యవహరించాడు. ఈ మధ్య సెలక్టర్లు ఆటగాళ్లపై వేటు వేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు. అది వైస్ కెప్టెన్ అయినా.. ఇంకెవరైనా సరే! ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అంతుపట్టడం లేదు’’ అంటూ గురువారం నాటి మూడో టీ20 ఆరంభం నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే రెండో టీ20లో రింకూ సింగ్ 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సూర్య 56 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20కి జొహన్నస్బర్గ్ వేదిక. చదవండి: #AusVsPak: పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! ఆ తప్పిదం వల్ల నో వికెట్! -
అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య
టీమిండియా టీ20 కెప్టెన్గా వ్యవహరించిన తొలి సిరీస్లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో అటు బ్యాటర్గా.. ఇటు సారథిగా తన పాత్రను సమర్థవంతంగా పోషించి.. భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కీలక ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టుతో ఆసీస్పై పైచేయి సాధించగలిగాడు. కాగా ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో గెలుపొందడం ద్వారా టీమిండియా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. రింకూ సింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. అక్షర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రవి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన పేసర్ దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్ కూడా ఒక వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన మాథ్యూ వేడ్ బృందం 154 పరుగులకే ఆట ముగించి.. భారత్కు సిరీస్ను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు టాస్ తప్ప అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. మా కుర్రాళ్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్ గెలిపించారు. వాళ్లు ఇలా బాధ్యతగా ఆడటమే మాకు అన్నిటికన్నా ముఖ్యం. మ్యాచ్కు ముందే మేమంతా సమావేశమైన సమయంలో.. ‘మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుత అవకాశం. ప్రతి ఒక్కరు భయం లేకుండా ఆడాలి’ అని చెప్పాం. నిజానికి అక్షర్ పటేల్ను ఒత్తిడిలోకి నెట్టడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంత ప్రెజర్ పెడితే అతడు అంత గొప్ప స్పెల్స్ వేస్తాడు. ఇక డెత్ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’’ ప్రణాళికను సరిగ్గానే అమలు చేశాం’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఆసీస్తో మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మిగిలిన నామమాత్రపు మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరుగనుంది. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. The moment #TeamIndia recorded their third win of the series 👌 Celebrations and smiles all around in Raipur 😃#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BxRiBbSzCz — BCCI (@BCCI) December 1, 2023 -
Rishabh Pant, Axar Patel: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఇవాళ (నవంబర్ 3) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఈ ఇద్దరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. Pant & Axar visited Lord Balaji Temple at Andhra Pradesh.pic.twitter.com/VzYQVgRiD9 — Johns. (@CricCrazyJohns) November 3, 2023 కాగా, గాయాల కారణంగా పంత్, అక్షర్లు ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లో కార్ యాక్సిడెంట్కు గురైన పంత్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉండగా.. అక్షర్ ఇటీవలే వరల్డ్కప్కు ఎంపికయ్యాక గాయపడ్డాడు. అక్షర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఏడింట విజయాలు సాధించి సెమీస్కు అర్హత సాధించింది. నిన్ననే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ రికార్డు స్థాయిలో 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఎడిషన్లో భారత్ లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లు (సౌతాఫ్రికా, నెదర్లాండ్స్) ఆడాల్సి ఉంది. -
వరల్డ్కప్కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్కప్కు దూరమైన అక్షర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం జరగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ జట్టు తరుపున అక్షర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరగులు చేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
అక్షర్ పటేల్ సంచలన పోస్టులు.. వరల్డ్కప్ నుంచి కావాలనే తప్పించారా!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వరల్డ్కప్ 2023కు ఆఖరి నిమిషంలో దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అక్షర్ ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేడని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా అతడి స్ధానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వన్డే వరల్డ్ కప్ నుంచి తనను తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అక్షర్ పటేల్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. " కామర్స్ కు బదులుగా సైన్స్ సబ్జెక్స్ తీసుకుని ఉండాల్సి ఉంది. మంచి పీఆర్ ను నియమించుకోవాల్సిందని" తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అక్షర్ రాసుకొచ్చాడు. అదే విధంగా మరో స్టోరీలో ఓ అస్తి పంజరం కత్తెరతో గుండెను కోసేస్తున్నట్లు ఉన్న ఎనిమిషేన్ ఫోటోను అక్షర్ షేర్ చేశాడు. అయితే వెంటనే తన చేసిన పోస్టులను అక్షర్ డిలీట్ చేశాడు. కానీ నెటిజన్లు అప్పటికే స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అతడి పోస్టులను చూస్తే.. గాయం చిన్నదే అయినప్పటికీ కావాలనే తనను పక్కన పెట్టినట్లు అక్షర్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. "అక్షర్ ఇటువంటి పోస్టులు ఏమీ చేయలేదని, అవన్నీ ఫేక్ స్క్రీన్ షాట్లు" అని మరి కొంత మంది సోషల్ మీడియాలో కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అక్షర్ పటేల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
భారత వరల్డ్కప్ జట్టులో కీలక మార్పు
భారత వరల్డ్కప్ జట్టులో అందరూ ఊహించినట్లుగానే కీలక మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు అక్షర్ పటేల్ ఆసియా కప్-2023 సందర్భంగా గాయం బారిన పడి, పూర్తిగా కోలుకోలేని కారణంగా వరల్డ్కప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా, ముందుగా ప్రకటించిన జట్టే యధాథంగా కొనసాగించబడింది. జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో భారత సెలక్టర్లు హుటాహుటిన మార్పు విషయాన్ని అనౌన్స్ చేశారు. కాగా, ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటం.. ఆసీస్తో సిరీస్కు అశ్విన్ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం (2 మ్యాచ్ల్లో 5 వికెట్లు).. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్కు అశ్విన్ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్లకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్తో.. అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడుతుంది. వరల్డ్కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో వార్మప్ గేమ్.. టీమిండియాతో అశ్విన్.. వరల్డ్కప్ జట్టులోకి వచ్చినట్లేనా..?
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి రావడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్తో జరిగే వార్మప్ మ్యాచ్లో ఆశ్విన్ ఆడటం ఖాయమైపోయిందని సమాచారం. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇవాళ (సెప్టెంబర్ 28) గౌహతికి చేరగా అశ్విన్ జట్టుతో పాటు కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అశ్విన్ వరల్డ్కప్ జట్టులోకి రావడం ఖాయమైపోయిందని అభిమానులు అనుకుంటున్నారు. Exclusive visuals: Team India arrives in Guwahati for first warm up match against England. Ravichandran Ashwin travels with the squad, no Axar Patel. @ThumsUpOfficial @cricketworldcup @CricSubhayan @debasissen pic.twitter.com/nkNQppcXjO — RevSportz (@RevSportz) September 28, 2023 కాగా, ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటం.. ఆసీస్తో సిరీస్కు అశ్విన్ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం.. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్కు అశ్విన్ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి. Virat Kohli And #TeamIndia Arrived In Guwahati For The 1st Warm Up Game Against England ahead of World Cup 2023.🇮🇳💙#ViratKohli #CWC2023 @imVkohli pic.twitter.com/LdHrWWucv0— virat_kohli_18_club (@KohliSensation) September 28, 2023 తాజాగా ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు అక్షర్ జట్టుతో కనిపించకపోవడం.. అశ్విన్ జట్టుతో పాటు ప్రయాణించడం చూస్తుంటే ప్రపంచకప్ జట్టుకు అశ్విన్ ఎంపిక లాంఛనమేనని తెలుస్తుంది. మరి సెలెక్టర్లు అశ్విన్ను అక్షర్కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తారో లేక యాష్ను జట్టుతో పాటు అదనపు సభ్యుడిగా కొనసాగిస్తారో వేచి చూడాలి. తొలుత అక్షర్ వార్మప్ మ్యాచ్ల సమయానికంతా గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అక్షర్ గాయం విషయంలో ఆశించిన పురోగమనం లేకపోవడంతో అతని ప్రత్యామ్నాయంగా అశ్విన్ను జట్టులోకి ఎంపిక చేసినట్లు తేటతెల్లమవుతుంది. వరల్డ్కప్ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో మరికాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్లకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్తో.. అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడుతుంది. భారత వరల్డ్కప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
ICC WC 2023: అక్షర్ పటేల్ అవుట్.. ప్రపంచకప్ జట్టులో అశ్విన్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ వన్డే వరల్డ్కప్-2023లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతడికి మార్గం సుగమమయ్యే ఛాన్స్ ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు అతడు దూరమయ్యాడు. తొలి రెండు మ్యాచ్లు ఆడలేకపోయినప్పటికీ.. రాజ్కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత దృష్ట్యా కుదరడం లేదని సమాచారం. ఇక వన్డే వరల్డ్కప్ టోర్నీకి మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అక్షర్ గనుక కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్ జట్టులో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే! సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో పునరాగమనం చేసిన అశ్విన్.. రెండు మ్యాచ్లలో కలిపి 4 వికెట్లు తీశాడు. వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో నామమాత్రపు మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు అశూ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘అతడు క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్లతో తన బౌలింగ్ స్థాయి ఏమిటో చాటిచెప్పాడు. అతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. వన్డే వరల్డ్కప్నకు ముందు మాకు అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. మా బ్యాకప్ ప్లేయర్లందరూ సంసిద్ధంగా ఉండటం సంతోషంగా ఉంది’’ అని రోహిత్ సమాధానమిచ్చాడు. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో రోహిత్ మాటల్ని బట్టి అశ్విన్ ప్రపంచకప్ ఆడే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. అక్షర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబరు 5 నుంచి ఐసీసీ టోర్నీ ఆరంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్
ఈనెల 27న రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నామమాత్రపు చివరి వన్డేకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడి, ఆసీస్తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక ఆసీస్తో జరిగే మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్లో ఉన్న అక్షర్ గాయం నుంచి కోలుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత సెలక్టర్లు ఆసీస్తో మూడో వన్డేకు అక్షర్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్షర్ వరల్డ్కప్కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అక్షర్ వరల్డ్కప్ సన్నాహక మ్యాచ్ల సమయానికంతా కోలుకుంటాడని చెబుతున్నాయి. మరోవైపు వరల్డ్కప్లో అక్షర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్తో సిరీస్లో జోరును ప్రదర్శిస్తూ సెలెక్టర్లకు సవాలు విసిరాడు. యాష్ ఆసీస్తో తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వరల్డ్కప్లో స్పిన్ ఆల్రౌండర్గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వరల్డ్కప్ సమయానికి అక్షర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. అక్షర్, అశ్విన్లలో ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలెక్టర్లు సతమతమవుతుంటే, వాషింగ్టన్ సుందర్ నేను కూడా లైన్లో ఉన్నానంటూ సవాలు విసురుతున్నాడు. మరి ఉన్న ఒక్క స్పిన్ ఆల్రౌండర్ పోజిషన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా, వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల బృంధాన్ని అన్ని జట్లు సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. నిన్న జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్కు ముందుగా వాళ్లు అశ్విన్కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్లు ఆడి రిథమ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్తో సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
ప్రపంచకప్ జట్టులో అశ్విన్..!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రపంచకప్-2023 జట్టుకు ఎంపికయ్యేందుకు ఇంకా దారులు మూసుకుపోలేదు. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు వరల్డ్కప్కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్ -2023 ముగిసిన అనంతరం క్లూ ఇచ్చాడు. ముందుగా ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ హుటాహుటిన జట్టులో చేరి ఆసియా కప్ ఫైనల్ ఆడాడు. అక్షర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్కప్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అక్షర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్తో పోలిస్తే అశ్విన్ అనుభవజ్ఞుడు కావడంతో అతనికే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్షర్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. భారత సెలెక్టర్లు ఒకవేళ అశ్విన్ను ప్రపంచకప్ జట్టులో చేర్చుకోవాలని భావిస్తే, ఆసీస్ సిరీస్ కోసం ఇవాళ ప్రకటించే భారత జట్టులో అతని చోటు ఇస్తారు. కాగా, ముందుగా ప్రకటించిన భారత ప్రొవిజనల్ వరల్డ్కప్ స్క్వాడ్లో స్పిన్ బౌలర్లుగా అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఈ ప్రొవిజనల్ జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎవరైనా ఆటగాడు గాయం బారిన పడితే, అతని స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో ఈ నెల 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన అక్షర్ స్థానంలో సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ ముగిశాక అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా వరల్డ్కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఢీకొంటుంది. -
టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..
Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ఈ స్పిన్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. లంకకు బయల్దేరిన యువ క్రికెటర్ ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. వాషీని ఎయిర్పోర్టులో చూశానన్న డీకే అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు. ‘‘ఎయిర్పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అక్షర్ పోరాటం కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్లో 9 ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సుందర్ గణాంకాలు ఇక యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు.. -
అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
Asia Cup 2023- Ind Vs Ban: Rohit Sharma Comments On Loss: ‘‘భవిష్యత్తు మ్యాచ్లు.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావించాం. అందుకే బంగ్లాదేశ్తో మ్యాచ్లో మార్పుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. వరల్డ్కప్ ఆడాల్సిన కొంతమంది ఆటగాళ్లను పరీక్షించేందుకు జట్టులోకి తీసుకున్నాం. అక్షర్ పటేల్ అద్భుతం ఈరోజు అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అయితే, ఆఖరి వరకు అతడు పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(34 బంతుల్లో 42 పరుగులు)ను ప్రశంసించాడు. బంగ్లాదేశ్ చేతిలో భంగపాటు అదే విధంగా.. బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు బౌలర్లదే కీలక పాత్ర అన్న రోహిత్... వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్-2023 ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకున్న తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. స్టార్లు లేకుండా బరిలోకి దిగి ప్రాధాన్యం లేని మ్యాచ్ కావడంతో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా అనూహ్య రీతిలో బంగ్లా చేతిలో ఓడి పరాభవం మూటగట్టుకుంది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్లతో పాటు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. షకీబ్ బృందం చేతిలో భంగపాటుకు గురైంది. అందుకే వాళ్లకు అవకాశాలు కాగా బంగ్లాతో మ్యాచ్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ(5) వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్ యాదవ్(26) కూడా చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా.. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2023కు ముందు ఆటగాళ్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మ్యాచ్లో వీరికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. రాజీపడేది లేదు ఆటలో గెలుపోటములు సహజమని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపం లేదని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో శతకం(121)తో ఆకట్టుకున్న శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గిల్ అద్బుతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. గిల్ ఫామ్లో ఉన్నాడు.. సెంచరీతో అతడి నుంచి మేము ఏం కోరుకుంటున్నామో అదే చేసి చూపించాడు. జట్టు కోసం ఏమేం చేయాలో అంతా చేశాడు. గతేడాది కాలంగా గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. కొత్త బంతితో బౌలర్లు అటాక్ చేసినపుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. హార్డ్వర్క్తో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్నాడు’’ అని రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ డకౌట్ అయ్యాడు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: టాస్: టీమిండియా.. బౌలింగ్ బంగ్లా స్కోరు: 265/8 (50) టీమిండియా స్కోరు: 259 (49.5) విజేత: 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షకీబ్ అల్ హసన్(80 పరుగులు సహా.. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్). చదవండి: క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కాదని.. ఆల్రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్రౌండర్ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్ను బెంచ్కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
అందుకే అక్షర్ను తీసుకున్నాం..ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు! మేము క్లియర్గానే ఉన్నాం!
India World Cup 2023 squad: ‘‘జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరికి నిరాశ కలగడం సహజం. సమతూకం కోసమే శార్దుల్, అక్షర్లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్తో సమస్య ఎదుర్కొన్నాం. 8వ, 9వ స్థానాల్లో ఆడేవారు కూడా కొన్ని పరుగులు చేయడం అవసరం. వారికి ఆ విషయం స్పష్టంగా చెప్పాం కూడా. పాకిస్తాన్తో మ్యాచ్లో హార్దిక్ ఆట చూస్తే అతను ఎంత కీలకమో అర్థమవుతుంది. ఫైనల్తో కలిపితే 11 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. టి20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. అందుకే అక్షర్కు చోటు అన్ని రకాలుగా ఈ టీమ్ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించి, ఎంతో ఆలోచింతాం. ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు సమతూకం కోసం ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ పేరును చేర్చినట్లు వెల్లడించాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి రోహిత్ మంగళవారం.. వన్డే వరల్డ్కప్-2023 జట్టును ప్రకటించాడు. నాడు రోహిత్ను కాదన్న ధోని ఈ సందర్భంగా టీమ్లో స్థానం దక్కదని వాళ్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్న హిట్మ్యాన్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. కాగా 2011 వరల్డ్కప్ సమయంలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లు సూచించినప్పటికీ.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పీయూశ్ చావ్లా కోసం అతడిని పక్కన పెట్టాడని ఇటీవలే మాజీ సెలక్టర్ రాజా వెంకట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఆఫ్ స్పిన్నర్ ఆలోచన విరమించుకున్నాం: అగార్కర్ జట్టులో ఇప్పుడు ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేవు. అందరూ పూర్తిగా కోలుకున్నారు. ఎన్సీఏలో జరిగిన క్యాంప్లో రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు కీపింగ్ కూడా చేశాడు. కాబట్టి అతని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆఫ్స్పిన్నర్పై చర్చ జరిగింది. అయితే జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థంగా బౌలింగ్ చేయగలరని నమ్ముతున్నాం. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టి ఆఫ్స్పిన్నర్ ఆలోచనను పక్కన పెట్టాం’’ అని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ ఎంపికలను సమర్థించుకున్నాడు. కాగా 2011 నాటి వరల్డ్కప్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అదే విధంగా సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనా రూపంలో మంచి ఆప్షన్లు ఉండేవి. ఇక 2019 నాటికి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఉపఖండ పిచ్పై ఆఫ్ స్పిన్నర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండటంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్ -
WC 2023: వరల్డ్కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్కు ప్రధాన జట్టులో చోటిస్తే బాగుంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. ఇషాన్ కిషన్ను కూడా ఆడించాలని సూచించాడు. ప్రపంచకప్ పోటీలో పది జట్లు కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో పాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ ట్రోఫీ కోసం పోటీలో నిలిచాయి. అనుకున్న ఫలితం రావాలంటే ఇక సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉండటం సహజం. ఈ నేపథ్యంలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి సరైన సమయంలో రాణిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదు. పుష్కరకాలం తర్వాత మరోసారి స్వదేశంలో ప్రపంచ విజేతగా నిలవగలదు. ఈ నేపథ్యంలో వరల్డ్కప్నకు ఎంపిక చేసే జట్టు సెలక్టర్లకు సవాలుగా మారింది. ఇక ఆసియా కప్ ఈసారి.. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న తరుణంలో ఈ ఈవెంట్లో ఆడే జట్టే ప్రపంచకప్ ప్రొవిజినల్ టీమ్ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చెప్పాడు. సంజూకు ఛాన్స్.. వాళ్లిద్దరికీ షాక్ ఈ క్రమంలో ఆసీస్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్టార్ స్పోర్ట్స్ షోలో భారత జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లో మణికట్టు స్పిన్నర్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈవెంట్కు తాను ఎంచుకున్న 15 మంది జట్టులో రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్కు స్పిన్నర్లుగా స్థానం కల్పించాడు. మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్లకు షాకిచ్చాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ను హెడెన్ తన జట్టుకు ఎంపిక చేయడం విశేషం. అదే సమయంలో సీనియర్లకే పెద్దపీట వేసిన ఆసీస్ లెజెండ్ యువ సంచలనం తిలక్ వర్మను విస్మరించాడు. కాగా ఈ వరల్డ్కప్లో టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023కి మాథ్యూ హెడెన్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్. చదవండి: అలా అయితే.. 2011 వరల్డ్కప్ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: కోహ్లి A champion’s touch! 🏆 Former Aussie WC winner, @HaydosTweets has unveiled his #TeamIndia squad for the #CWC2023! 🌟 Would you make any changes to this dream team? 👀 Tune-in to the #WorldCupOnStar October 5, 2 PM onwards | Star Sports Network & Disney+ Hotstar#Cricket pic.twitter.com/lAxvbPJLgi — Star Sports (@StarSportsIndia) August 26, 2023 -
అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్..
India Asia Cup 2023 squad: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న అతడి ఆటిట్యూడ్తో అభిమానుల మనసు గెలవడం విశేషం. ఆసియా కప్-2023లో పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్లోనూ? వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు ప్రొవిజినల్ టీమ్గా భావిస్తున్న ఈ జట్టులో స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్వైపే మొగ్గు చూపింది మేనేజ్మెంట్. ఈ చైనామన్ స్పిన్నర్తో పాటు స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లకు చోటిచ్చింది. క్రిప్టిక్ ట్వీట్తో చహల్ ఈ నేపథ్యంలో నిరాశకు గురైన యుజీ చహల్ క్రిప్టిక్ ట్వీట్తో ముందుకు వచ్చాడు. మబ్బుల్లో దాగిన సూర్యుడు... మళ్లీ ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీలతో క్యాప్షన్ ఏమీ లేకుండానే పోస్ట్ చేశాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న అర్థంలో నర్మగర్భ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ‘‘అవును.. నువ్వు చెప్పిందే నిజమే భాయ్. మళ్లీ నీకు మంచి రోజులు వస్తాయి’’ అని బదులిస్తున్నారు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ చహల్ను జట్టు నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై నో కుల్-చా! చోటు లేదు గనుకే అతడిని ఎంపిక చేయలేదని, అయితే.. వన్డే వరల్డ్కప్లో చహల్ దారులు మూసుకుపోలేదని హిట్మ్యాన్ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి జట్టులో చూసే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు జట్టులో చోటివ్వలేమని.. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో చైనామన్ బౌలర్కే ఓటు వేశామని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. అప్పుడు రోహిత్ సైతం.. ఇక గతంలో జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ సైతం.. ‘‘సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. 2018లో టెస్టుల్లో అతడికి స్థానం లేకపోవడంతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే రీతిలో చహల్ సైతం తన బాధను వ్యక్తపరుస్తూనే.. మళ్లీ తిరిగివస్తాననే ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ ⛅️——> 🌞 — Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023 Sun will rise again tomorrow 😊 — Rohit Sharma (@ImRo45) July 18, 2018 -
అవకాశం ఇవ్వలేదు అంటారు.. ఇస్తే ఇలా చేస్తారు..! అయ్యో పాపం!
West Indies vs India, 2nd ODI- Sanju Samson: రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్. వెస్టిండీస్తో రెండో వన్డేలో సంజూకు న్యాయం జరిగిందంటూ సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. కాగా విండీస్ పర్యటన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఈ కేరళ బ్యాటర్ వన్డే జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, మొదటి వన్డేలో వికెట్ కీపర్గా సంజూను కాదని ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు కల్పించారు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్కు ప్రాధాన్యం ఇచ్చి అతడిని పక్కనపెట్టారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్.. అర్ధ శతకంతో అదరగొట్టి తన ఎంపిక సరైందేనని మరోసారి నిరూపించాడు. అయితే, సంజూకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్ మేనేజ్మెంట్ తీరుపై మండిపడ్డారు. ఈ మాత్రం దానికి జట్టుకు ఎంపిక చేయడం లాంటి కంటితుడుపు చర్యలు ఎందుకని నెట్టింట ట్రోల్ చేశారు. అదే విధంగా.. వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ను ఆడించిన నేపథ్యంలో ముంబై బ్యాటర్ల కోసం సంజూను బలిచేస్తున్నాడంటూ రోహిత్ శర్మను తప్పుబట్టారు. ఈ క్రమంలో రెండో వన్డేలో రోహిత్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్లకు జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరు విఫలం కావడం గమనార్హం. వన్డౌన్లో వచ్చిన సంజూ 19 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. నాలుగో నంబర్లో అతడిని ఆడించిన మేనేజ్మెంట్ నిర్ణయం తప్పని నిరూపించాడు. ఇదిలా ఉంటే.. 24వ ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(7) నాలుగో వికెట్గా వెనుదిరగగా.. 25వ ఓవర్ మొదటి బంతికే సంజూ అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వర్షం పడటంతో 24.1 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చేటప్పటికి టీమిండియా స్కోరు: 113/5. ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు.. ‘‘అవకాశం ఇవ్వలేదు అంటారు.. ఇస్తే ఇలా చేస్తారు’’ అంటూ సంజూను ట్రోల్ చేస్తున్నారు. చదవండి: కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? Samson & Pandya depart leaving #TeamIndia reeling at 113/5 🫣 Can SKY open up his boundaries? Don't miss #WIvIND 2nd ODI, LIVE NOW & streaming FREE in 11 languages only on #JioCinema.#SabJawaabMilenge pic.twitter.com/RSDaSlzwSc — JioCinema (@JioCinema) July 29, 2023 -
ఇషాన్ మరోసారి! 8 బంతులు.. ఒక్క పరుగు! మంచి ఛాన్స్ మిస్ చేశావు పో!
West Indies vs India, 2nd ODI: వెస్టిండీస్తో రెండో వన్డేలో టీమిండియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ముందుగా బ్యాటింగ్కు పంపడం జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. కాగా బార్బడోస్లో శనివారం నాటి మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్, కోహ్లి లేకుండానే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వగా.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. వీరిద్దరి స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఇక బార్బడోస్లో మొదటి వన్డే మాదిరే రెండో మ్యాచ్లోనూ ఇషాన్, కిషన్, శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేశారు. మరోసారి ఇషాన్ హాఫ్ సెంచరీ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ మరోసారి అర్ధ శతకం(55)తో సత్తా చాటగా.. వరుస వైఫల్యాల నేపథ్యంలో గిల్(49 బంతుల్లో 34) ఈసారి పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో వన్డౌన్లో సంజూ శాంసన్ బ్యాటింగ్కు రాగా.. నాలుగో స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించారు. 18వ ఓవర్ మూడో బంతికి రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ కాగా.. అక్షర్ క్రీజులోకి వచ్చాడు. బెడిసికొట్టిన ప్రయోగం ఇక ఆ ఓవర్లో షెఫర్డ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా పరుగుల ఖాతా తెరవలేకపోయిన అతడు.. మరుసటి ఓవర్లో అల్జారీ జోసఫ్ బౌలింగ్లో సింగిల్ తీశాడు. అయితే 20 ఓవర్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. విండీస్ పేసర్ షెఫర్డ్ సంధించిన షార్ట్ బాల్ను తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. వికెట్ కీపర్ షాయీ హోప్నకు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజూ సైతం.. మొత్తంగా 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసిన అక్షర్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. ‘‘మంచి ఛాన్స్ను మిస్ చేశావు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 113 పరుగులు చేసింది. సంజూ శాంసన్(9), హార్దిక్ పాండ్యా(7) కూడా పూర్తిగా నిరాశపరిచారు. ఇక ఇప్పటికే తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందున్న సంగతి తెలిసిందే. చదవండి: కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? Ishan Kishan gets to his fifty. Can he make it a big one here? . .#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/FlqtTjBImC — FanCode (@FanCode) July 29, 2023 -
సంచలన స్పెల్.. కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ నుంచి ఊహించని రిప్లై!
West Indies vs India, 1st ODI: ‘‘గతంలో చాలా సార్లు నాకిలా జరిగింది. పరిస్థితులు, జట్టు కూర్పునకు అనుగుణంగా మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకునే క్రమంలో నాకు ఆడే అవకాశం రాలేదు. జట్టులోకి రావడం, వెళ్లడం.. ఇప్పుడిదంతా సర్వసాధారణమైపోయింది. ఎన్నో ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. దాదాపు ఆరేళ్లకు పైనే అయింది. ఇవన్నీ అత్యంత సాధారణ విషయాలు’’ అని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ చైనామన్ స్పిన్నర్ టీమిండియాకు ఎంపికవుతున్నా అప్పుడప్పుడు మాత్రమే తుదిజట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నాడు. టెస్టు క్రికెట్లో కాస్త వెనుకబడ్డాడు! ముఖ్యంగా టెస్టు క్రికెట్లో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన, రవీంద్ర జడేజాలు పాతుకుపోగా.. వీరితో పాటు ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కూడా దూసుకుపోతున్నాడు. దీంతో గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమైన కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. సంచలన స్పెల్తో మెరిసి బార్బడోస్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కుల్దీప్ యాదవ్కు జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం గురించి ప్రశ్న ఎదురుకాగా పైవిధంగా స్పందించాడు. ఇక ఇప్పుడు కూడా తన దృష్టి కేవలం వికెట్లు తీయడంపై ఉండదని.. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో పొదుపుగా బౌలింగ్ చేయడమే ముఖ్యమని భావిస్తానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
Ind Vs WI: అందుకే జడ్డూను కాదని అతడికి జట్టులో చోటు! అంతేతప్ప..
Ind Vs WI 2023: వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లకు చోటు దక్కింది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి.. ఇద్దరు లెఫార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టీ20 జట్టులో స్థానం సంపాదించారు. విండీస్ గడ్డపై మ్యాచ్కు సెలక్టర్లు ఈ మేరకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు. కరేబియన్ దీవిలో ప్రస్తుతం స్లో, టర్నింగ్ పిచ్లు ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాడు. ఇక విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు చోటు ఇవ్వకపోవడంపై కూడా ఆకాశ్ చోప్రా స్పందించాడు. అందుకే జడ్డూ జట్టులో లేడు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్తో టీ20 జట్టులో నలుగురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజీ చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయికి సెలక్టర్లు చోటిచ్చారు. రవీంద్ర జడేజా లేడు కాబట్టి ఆల్రౌండర్ స్థానంలో అక్షర్ పటేల్కు తప్ప మరొకరికి స్థానం లేదు. నా అభిప్రాయం ప్రకారం.. కేవలం జడ్డూపై పని ఒత్తిడి తగ్గించడానికి మాత్రమే అతడిని పక్కన పెట్టి ఉంటారు. నిజానికి టీ20 ఫార్మాట్లో రవీంద్ర జడేజా ప్రదర్శనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, అతడు కరేబియన్ గడ్డపై టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది. పాండ్యా సారథ్యంలో కాబట్టి జడ్డూకు విశ్రాంతినిచ్చే క్రమంలో మాత్రమే అతడి స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. అంతేతప్ప జడ్డూను జట్టు నుంచి తప్పించినట్లు కాదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఆగష్టు 3- 13 వరకు టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. విండీస్తో టి20 సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ రింకూ సింగ్కు గుడ్ న్యూస్.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా -
విండీస్ పర్యటనకు జట్ల ఎంపిక పూర్తి.. నలుగురు మాత్రం వెరీ వెరీ స్పెషల్
త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక పూర్తయ్యింది. విండీస్ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్ల సిరీస్లు ఆడనుంది. ఈ మూడు సిరీస్ల కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. అయితే ఈ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన ఆటగాళ్లలో సెలెక్టర్లు నలుగురికి పెద్ద పీట వేశారు. వారు తమకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించారు. రోహిత్, కోహ్లిల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హిట్మ్యాన్, రన్ మెషీన్లను టీ20 జట్టులోకి తీసుకోని సెలెక్టర్లు.. మూడు ఫార్మాట్ల జట్లలో ఆ నలుగరుని ఎంపిక చేసి, వన్డే వరల్డ్కప్ కోసం వారిని సిద్దం చేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆ నలుగురు ఎవరంటే.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్. ఈ నలుగరు క్రికెటర్లు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయమని తెలుస్తుంది. గిల్ సూపర్ ఫామ్ దృష్ట్యా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్కీపర్ లేనందున ఇషాన్ కిషన్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒకవేళ సంజూ శాంసన్ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే, ఇషాన్ బ్యాటర్గానైనా కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్ల్లో జడేజాకు అవకాశం ఇచ్చినా.. వన్డే, టీ20ల్లో అక్షర్ పటేల్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఈ నలుగురిలో మోస్ట్ లక్కీ ఎవరంటే ముకేశ్ కుమారేనని చెప్పాలి. షమీ గైర్హాజరీలో స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్ కోటాలో ముకేశ్ జాక్పాట్ కొట్టాడు. ఈ నలుగురు విండీస్ పర్యటన పరిమిత ఓవర్ల సిరీస్లలో రాణిస్తే, వరల్డ్కప్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని పేరు..
మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్గా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొనసాగుతున్న తెలిసిందే. గతేడాది విరాట్ కోహ్లి నుంచి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ స్వీకరించాడు. కెప్టెన్సీ పరంగా రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీస్లలో సఫలమైనప్పటికీ.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములును టీమిండియా చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్ వారసుడును తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని పలువరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కాగా భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ కోసం ఇద్దరు ఆటగాళ్ల పేర్లను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. వారిద్దరూ ఎవరో కాదు.. ఒకరు టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. మరొకరు ఆల్రౌండ్ అక్షర్ పటేల్. వారిని ఇప్పటి నుంచి జట్టు పగ్గాలు చేపట్టే విధంగా భారత సెలక్టర్లు తాయారు చేయాలని గవాస్కర్ అన్నాడు. "శుబ్మన్ గిల్, అక్షర్ పటేల్కు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్లు అయ్యే ఛాన్స్ ఉంది. గిల్ ఇప్పటికే తానుంటో నిరూపించుకోగా.. అక్షర్ రోజు రోజుకు మరింత మెరుగవుతున్నాడు. వీరిద్దని వేర్వేరు ఫార్మాట్లలో భారత జట్టు వైస్ కెప్టెన్లుగా నియమించాలి. ఇప్పటి నుంచే జట్టు పగ్గాలు చేపట్టే విధంగా తాయారుచేసుకోవాలి. నావరకు అయితే వీరిద్దరిని ఫ్యూచర్ కెప్టెన్లుగా సిద్దం చేసుకుంటే చాలు. ఇక టెస్టుల్లో అజింక్య రహానెను వైస్ కెప్టెన్గా చేయడం ఏ మాత్రం తప్పులేదు. కానీ ఒక యువ ఆటగాడిని నాయుకుడిగా తీర్చిదిద్దే అవకాశాన్ని సెలక్టర్లు కోల్పోయారు. టెస్టుల్లో భవిష్యత్తు కెప్టెన్గా ఎవరో ఒకరిని అనుకుని వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి ఉంటే బాగుండేది" అని స్పోర్ట్స్ టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్! -
WTC: ఐపీఎల్-2023 సమయంలోనూ డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేశాం.. ఎందుకంటే..
WTC Final 2021-23: ‘‘ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనూ మేము రెడ్బాల్తో ఎలా బౌలింగ్ చేయాలన్న అంశంపై చర్చించాం. మా దగ్గర రెడ్బాల్స్ ఉండేవి. అప్పుడప్పుడు మేము వాటితో ప్రాక్టీస్ చేసేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా నెట్స్లో కసరత్తులు చేసేవాళ్లం. నిర్విరామంగా రెండేసి నెలల పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి వెంటనే టెస్టు ఫార్మాట్కు మారడం అంటే కొంచెం కష్టమే. మానసికంగా సిద్ధపడితేనే ఒత్తిడి అధిగమించగలం’’ అని టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. బీజీటీ-2023లో గెలిచి ఐపీఎల్-2023 సమయం నుంచే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సిద్ధమయ్యే పనిలో పడ్డామని వెల్లడించాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఆసీస్ను మట్టికరిపించిన భారత్.. కంగారూలతో పాటు తుదిమెట్టుపై అడుగుపెట్టింది. ఈ క్రమంలో జూన్ 7-11 మధ్య ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆసీస్ ఐసీసీ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ ఐసీసీతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ సందర్భంగా డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ ‘‘ఐపీఎల్ సమయంలో మేము డ్యూక్ బాల్స్ ఆర్డర్ చేశాం. వాటితో ప్రాక్టీస్ చేశాం. మ్యాచ్ జరిగేది ఇంగ్లండ్లో! కాబట్టి డ్యూక్ బంతులతో ఆడటం అలవాటు చేసుకోవాలని ఇలా చేశాం. నిజానికి వైట్ బాల్ నుంచి రెడ్ బాల్కు మారడం.. ఎస్జీ బాల్స్ నుంచి డ్యూక్ బాల్స్కు మారడం వంటిదే. అయితే, ఇలాంటి సమయాల్లోనే మన నైపుణ్యాలకు పదునుపెట్టాల్సి వస్తుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలగాలి. ఎలాంటి బాల్ అయినా సరే.. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయగలగాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్లో జరుగబోతోంది. భారత్తో పోల్చుకుంటే అక్కడ పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’’ అని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. PC: TOI కాగా భారత్ వేదికగా జరిగిన బీజీటీ-2023లో బంతి కంటే కూడా బ్యాట్తోనే అక్షర్ రాణించాడు. ఆసీస్తో ఈ టెస్టు సిరీస్లో 264 పరుగులు సాధించాడు. ఉస్మాన్ ఖవాజా(333), విరాట్ కోహ్లి (297) తర్వాతి స్థానంలో నిలిచాడు. డ్యూక్ బాల్స్.. 1760లో డ్యూక్ కుటుంబం క్రికెట్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీని ప్రారంభించింది. 1987లో ఈ కంపెనీని భారత వ్యాపారవేత్త దిలీప్ జజోడియా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ తయారు చేసే బాల్స్ డ్యూక్ బాల్స్గా పేరొందాయి. వీటిని ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్లలో ఉపయోగిస్తారు. ఎస్జీ బాల్ను బారత్లో వాడతారు. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్! కారణమిదే.. -
ఐపీఎల్-2023లో అత్యంత చెత్త బౌలర్ ఎవరు..?
ఐపీఎల్లో బ్యాటర్లు రాజ్యమేలే ఆనవాయితీ ఈ సీజన్లోనూ కొనసాగింది. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి బౌలర్ను బ్యాటర్లు చితకబాదారు. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ లాంటి బౌలర్లు వికెట్లయితే పడగొట్టారు కానీ, పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ లాంటి బౌలర్లు ఒక మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (5/5) నమోదు చేసి, ఆ మరుసటి మ్యాచ్లోనే (4-0-52-1) తేలిపోయారు. ఇలాంటి ఘటనలు 73 మ్యాచ్ల్లో చాలా సందర్భాల్లో రిపీటయ్యాయి. ఐపీఎల్-2023లో కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి, అత్యంత చెత్త ఎకానమీ నమోదు చేసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం.. ఉమ్రాన్ మాలిక్.. 4 కోట్లు పెట్టి సన్రైజర్స్ తిరిగి దక్కించుకున్న ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్.. ఈ సీజన్లోకెల్లా అత్యంత చెత్త ఎకానమీ (8 మ్యాచ్ల్లో 10.85 ఎకానమీతో 5 వికెట్లు) కలిగిన బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్ (6 మ్యాచ్ల్లో 10.77 ఎకానమీతో 3 వికెట్లు) ఉన్నాడు. ఈ ముంబై పేసర్ ఆడిన ప్రతి మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని తన జట్టు ఓటములకు ప్రధాన కారకుడిగా నిలిచాడు. విజయ్కుమార్ వైశాక్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఆర్సీబీ పేసర్ 7 మ్యాచ్ల్లో 10.54 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ పేసర్ 10 మ్యాచ్ల్లో 10.52 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది వేలానికి ముందు భారీ ధరకు ట్రేడ్ అయిన ఈ కేకేఆర్ ఆల్రౌండర్ ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 10.48 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో చెత్త ఎకానమీ కలిగిన టాప్-5 బౌలర్లంతా పేసర్లే కాగా.. బెస్ట్ ఎకానమీ కలిగిన టాప్-4 బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి ఐపీఎల్ 2023 బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ (14 మ్యాచ్ల్లో 7.19 ఎకానమీతో 11 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (14 మ్యాచ్ల్లో 7.37 ఎకానమీతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (15 మ్యాచ్ల్లో 7.42 ఎకానమీతో 19 వికెట్లు), కృనాల్ పాండ్యా (15 మ్యాచ్ల్లో 7.45 ఎకానమీతో 9 వికెట్లు) టాప్-4లో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్గా గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ (16 మ్యాచ్ల్లో 28 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రషీద్ ఖాన్ (16 మ్యాచ్ల్లో 27 వికెట్లు), మోహిత్ శర్మ (13 మ్యాచ్ల్లో 24 వికెట్లు) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2023లో టాప్-3 బౌలర్లంతా గుజరాత్కు చెందిన వారే కావడం విశేషం. వీరి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. చదవండి: ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..? -
అదే మా కొంపముంచింది.. అందుకే అక్షర్ను ముందు పంపలేదు: వార్నర్
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఓటమి చవి చూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్లు ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో వికెట్ వికెట్ నష్టానికి 112 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ వరుస క్రమంలో వీరిద్దరూ ఔట్ కావడంతో ఫలితం తారుమారైంది. అయితే ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత అక్షర్ పటేల్కు బ్యాటింగ్ పంపించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ 29 పరుగులు చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. అందుకే అక్షర్ను పంపలేదు.. "మేము బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మిచిల్ మార్ష్ మాత్రం ఇక్కడి పరిస్థితులకు తగట్టు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మాకు కీలక ఆటగాడు. కానీ విజయానికి కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోవడం మమ్మల్ని చాలా నిరాశపరిచింది. పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంది. మంచు ప్రభావం కూడా పెద్దగా లేదు. మాకు మంచి ఆరంభం లభించింది. కానీ మధ్యలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అదే మా కొంపముంచింది. మిడిల్ ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక అక్షర్ పటేల్ మంచి టచ్లో ఉన్నాడని మాకు తెలుసు. అతడు స్నిన్నర్లను మంచిగా ఎదుర్కొంటాడు,. కానీ మా జట్టులో నాతో కలిపి ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఈ క్రమంలో అక్షర్ బ్యాటింగ్ చాలా కీలకం అని భావించాం. అందుకే అక్షర్ను కాదని గార్గ్, సర్ఫరాజ్ను పంపించాం. అక్షర్ ఆఖరిలో మ్యాచ్ను పూర్తి చేస్తాడని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. అయితే అక్షర్ను కొచెం ముందుగా బ్యాటింగ్కు పంపి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదేమో" అని డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. చదవండి: Mitchell Marsh: సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! అనవసరంగా.. -
చేజేతులా ఓటమి.. అక్షర్ పటేల్ను ముందే పంపించి ఉంటే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్ల ఇన్నింగ్స్ కొనసాగింది. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. వీరి తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా కనీసం క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపండం కూడా ఢిల్లీ ఓటమికి మరో కారణం. సాల్ట్ ఔటైన తర్వాత అక్షర్ పటేల్కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చి నాలుగో స్థానంలో పంపి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదే. ఎందుకంటే ఆఖరిదశలోనూ అక్షర్ పటేల్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించాడు. 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అక్షర్పటేల్ క్రీజులోకి వచ్చేసరికి ఓవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో అతను కూడా ఏం చేయలేకపోయాడు. ఒక రకంగా ఇది కెప్టెన్ వార్నర్ తప్పు. ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను కాదని మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్లను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించడం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఈ సీజన్లో అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 211 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక బౌలింగ్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ఔట్ అనుకుంటా! -
IPL 2023: సన్రైజర్స్ను ఓడించి, ఢిల్లీని గెలిపించింది అతనే..!
ఐపీఎల్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న (ఏప్రిల్ 24) మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో (34 బంతుల్లో 34, 4-0-21-2) రాణించినందుకు గాను జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అక్షర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించినప్పటికీ, ఢిల్లీని గెలిపించింది మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముకేశ్ కుమారేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిలో చివరి ఓవర్ బౌల్ చేసిన ముకేశ్ అద్భుతమైన యార్కర్ బంతులను సంధించి, సన్రైజర్స్ను గెలవనీయకుండా చేశాడని అంటున్నారు. ఆఖరి ఓవర్లో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని (13 పరుగులు) ముకేశ్ అద్భుతంగా డిఫెండ్ చేశాడని (5 పరుగులు మాత్రమే ఇచ్చాడు), ఢిల్లీపై ఫీల్డింగ్ పెనాల్టీ (30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి) అమల్లో ఉన్నా ఎంతో పరిణితితో బౌలింగ్ చేశాడని ముకేశ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 29 ఏళ్ల ముకేశ్ (బిహార్) ఎంతో అనుభవం ఉన్న బౌలర్లా ఆఖరి ఓవర్లో పరిస్థితులను హ్యాండిల్ చేశాడని, ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేలే అయినా తమ హీరో మాత్రం ముకేశేనని ఢిల్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సైతం ముకేశే తమను గెలిపించాడని, ఒత్తిడిలో అతడు పరిస్థితులను హ్యాండిల్ చేసిన తీరు అమోఘమని ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముకేశ్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25), మనీశ్పాండే (34), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టారు. కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. ఇషాంత్ శర్మ (1/18), నోర్జే (2/33), ముకేశ్ (0/27), అక్షర్ (2/21), కుల్దీప్ (1/22) ధాటికి చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
IPL 2023 DC VS MI: ముంబై గెలుపు.. కనుమరుగైన అక్షర్ మెరుపు
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) మరో రసవత్తర మ్యాచ్ జరిగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన థ్రిల్లర్ గేమ్లో ముంబై ఇండియన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది. ఈ సీజన్లో ఇది వరుసగా మూడో లాస్ట్ బాల్ విక్టరీ మ్యాచ్ కావడం విశేషం. అంతకుముందు రింకూ సింగ్ ఊచకోతతో (ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) కేకేఆర్, ఆ తర్వాత స్టోయినిస్, పూరన్ విధ్వంసంతో లక్నో, తాజాగా రోహిత్, తిలక్ వర్మ మెరుపులతో ముంబై ఆఖరి బంతికి విజయం సాధించాయి. ముంబై గెలుపుకు ఆఖరి ఓవర్లో కేవలం 5 పరుగులు చేయాల్సి ఉండినప్పటికీ, నోర్జే కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. అయితే, ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ 2 పరుగులు తీయడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్ల తర్వాత విజయం సాధించడంతో ఢిల్లీ ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్ మరుగునపడిపోయింది. ఈ మ్యాచ్లో క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు దిగిన అక్షర్.. ఆకాశమే హద్దుగా చెలరేగి 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి డీసీ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న అక్షర్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరిపూర్ణమైన బ్యాటర్గా గర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్పై 11 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 16 పరుగులు చేసిన అక్షర్.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్పై 36 పరుగులు (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో), రాజస్థాన్ రాయల్స్పై 2 పరుగులు చేశాడు. ఐపీఎల్కు ముందు అక్షర్ అంతర్జాతీయ టీ20ల్లో కూడా అద్భుతంగా రాణించాడు. శ్రీలంకతో సిరీస్లో తొలి మ్యాచ్లో 20 బంతుల్లో 31 పరుగులు చేసిన అక్షర్.. రెండో టీ20లో 31 బంతుల్లో 65, మూడో టీ20లో 9 బంతుల్లో 21 పరుగులు స్కోర్ చేశాడు. బ్యాటింగ్ విషయంలో దినదినాభివృద్ధి చెందుతున్న అక్షర్.. టీమిండియాతో పాటు తన ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా కీలక ఆటగాడిగా మారాడు. -
అక్షర్ సిక్సర్ దెబ్బ.. సూర్యకు గాయం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్ సూర్యను గాయపరిచింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన అక్షర్ నాలుగో బంతిని కూడా లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈసారి సూర్య బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేతి నుంచి పట్టుజారిన బంతి సూర్య కుడి కంటి పైభాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కంటికి చిన్న గాయమైంది. ఫిజియో వచ్చి పరీశీలించి డగౌట్కు తీసుకెళ్లాడు. కంటి పైభాగంలో ఏర్పడిన గాయానికి కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి సూర్య గాయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కాస్త ఆందోళన రేపింది. ఇక మ్యాచ్లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 24 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటైన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. Suryakumar Yadav seems to have hurt himself while attempting that catch of Axar Patel! #DCvMI #IPL2023 pic.twitter.com/0m06aQKbFy — Mohsin Kamal (@64MohsinKamal) April 11, 2023 -
అందుకే అక్షర్కి బౌలింగ్ ఇవ్వలేదు..SRH మాజీ కెప్ట్న్ క్లారిటీ
-
అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37), సర్ఫరాజ్ ఖాన్(30) మినహా మిగతా వాళ్లు విఫలమైన వేళ అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. ఈ స్పిన్ ఆల్రౌండర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ను సాయి సుదర్శన్(62), డేవిడ్ మిల్లర్ (31) ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు. దీంతో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్-2023లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గుజరాత్తో మ్యాచ్లో అక్షర్ చేతికి వార్నర్ బంతినివ్వకపోవడం చర్చనీయాంశమైంది. అందుకే అక్షర్ చేతికి బంతినివ్వలేదు.. అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ భాయ్.. తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘మ్యాచ్ ఆరంభంలోనే గుజరాత్ సీమర్లను చూసి నేను ఆశ్చర్యపోయాననుకోకండి. నిజానికి ఊహించిన దానికంటే బంతి మరింత ఎక్కువగా స్వింగ్ అయింది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లు(గుజరాత్) చూపించారు. ఇంకా ఇక్కడ మరో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆరంభ ఓవర్లలో బంతి ఇలాగే స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆఖరి వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉండింది. అయితే, సాయి అద్బుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. ఇక మిల్లర్ గురించి చెప్పేదేముంది. అతడు ఏం చేయగలడో అదే చేశాడు. నిజానికి డ్యూ(తేమ) ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట 180-190 వరకు స్కోర్ చేస్తేనే మ్యాచ్ను కాపాడుకోగలం. అంతేగానీ అతడికి(అక్షర్ను ఉద్దేశించి) బౌలింగ్ ఇవ్వకపోవడం వల్ల కాదు’’ అని వార్నర్ తెలిపాడు. సీమర్లకు అనుకూలించే వికెట్పై స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేతికి బంతినివ్వలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులు ఇచ్చాడు. చదవండి: IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్తో పాటు టీమిండియాలో కూడా! Double delight for @gujarat_titans 🙌🙌 They win their second consecutive game of #TATAIPL 2023 and move to the top of the Points Table. Scorecard - https://t.co/tcVIlEJ3bC#DCvGT pic.twitter.com/WTZbIZTQmm — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
IPL 2023: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్! ఇక అక్షర్ పటేల్..
IPL 2023- Delhi Capitals New Captain: ఐపీఎల్-2023 సీజన్కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు సారథి పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను కెప్టెన్గా నియమించినట్లు తెలిపింది. అతడికి డిప్యూటీగా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గతేడాది ఘోర రోడ్డుప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక సిరీస్లతో పాటు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అనువభవజ్ఞుడైన వార్నర్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించనున్నాడు. కాగా గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా సేవలు అందించిన వార్నర్ 2016లో ఆ జట్టును చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. ఇక గతేడాది పద్నాలుగింట ఏడు మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరకపోయినప్పటికీ మెరుగైన ప్రదర్శనతో పర్వాలేదనిపించింది. అయితే, ఈసారి మాత్రం పంత్ రూపంలో కెప్టెన్తో పాటు కీలక బ్యాటర్ సేవలు కోల్పోవడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చదవండి: WTC Final: నంబర్ 1 బౌలర్ అశూ.. నంబర్ 1 ఆల్రౌండర్ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే! LLC 2023: క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్ -
WTC Final: అశ్విన్ లేదా జడేజా.. ఇద్దరిలో ఒక్కరికే తుదిజట్టులో చోటు!
WTC Final- India Vs Australia: ‘‘గతంలోనే తుది జట్టు ఎంపిక విషయంలో మేనేజ్మెంట్ తప్పు చేసింది. ఇద్దరు స్పిన్నర్లను ఆడించి మూల్యం చెల్లించింది. అక్కడ ఆడాల్సింది ఒకే ఒక్క మ్యాచ్. కాబట్టి జట్టు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. టెస్టు చాంపియన్షిప్ సైకిల్లో ఆఖరి మ్యాచ్ అయినందున చాలా మంది ఆటగాళ్లకు కూడా అదే చివరి మ్యాచ్ అవుతుంది. కాబట్టి తుది జట్టు కూర్పుపై స్పష్టత ఉంటేనే అత్యుత్తమ టీమ్ ఎంపిక సాధ్యమవుతుంది. గతంలో మాదిరి ఈసారి పొరపాట్లు దొర్లకుండా ఉండాలంటే అశ్విన్ లేదంటే జడేజాలలో ఎవరో ఒకరిని తప్పించాలి. నా అభిప్రాయం ప్రకారం వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంటే కచ్చితంగా జడేజా వైపే మొగ్గు ఉంటుంది. ఎందుకంటే అతడు అశ్విన్ కంటే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు. ఇక వీళ్లిద్దరు ఫిట్గా ఉన్నారంటే అక్షర్ పటేల్కు కచ్చితంగా జట్టులో స్థానం దక్కదు. నాకు తెలిసి అతడికి బదులు శార్దూల్ జట్టులోకి వస్తాడు’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అక్షర్కు నో చాన్స్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత తుది జట్టు కూర్పుపై ఈ మేరకు క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ కంటే రవీంద్ర జడేజాకే తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఇక మరో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు జట్టులో స్థానం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలవడంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో అశ్విన్, జడ్డూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. అక్షర్ బ్యాట్ ఝులిపించి రోహిత్ సేన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకున్న టీమిండియా ఇంగ్లండ్ వేదికగా జూన్ 7- 11 వరకు టెస్టు మ్యాచ్ ఆడనుంది. కాగా విదేశాల్లో.. ముఖ్యంగా పేస్కు అనుకూలించే పిచ్లపై తుదిజట్టులో సీమర్లకే అవకాశాలు ఎక్కువన్న నేపథ్యంలో డీకే ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నంబర్ 1 అశూ, జడ్డూ ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో అశ్విన్, జడేజా ఇద్దరూ ఆడారు. అశూ 4 వికెట్లు తీసి 29 పరుగులు చేయగా.. 31 పరుగులు చేసిన జడ్డూ.. ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో బౌలర్ల జాబితాలో నంబర్1గా ఉండగా.. జడ్డూ ఆల్రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: LLC 2023: క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్ WPL 2023: హమ్మయ్య,.. మొత్తానికి ఆర్సీబీ గెలిచింది -
నంబర్ 1, 2.. టీమిండియా ఆల్రౌండర్ల హవా! స్టోక్స్ను వెనక్కినెట్టిన అక్షర్
ICC Test All Rounders Rankings- Axar Patel: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెటరన్ స్పిన్నర్ అశూ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తే.. జడ్డూ ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ బ్యాట్తో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఈ ప్రతిష్టాత్మక నాలుగు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలవగా.. జడేజా 22 వికెట్లు తీయడంతో పాటు 135 పరుగులు సాధించాడు. ముఖ్యంగా మొదటి, రెండు టెస్టుల్లో టీమిండియా విజయాల్లో జడేజాదే ప్రధాన పాత్ర. ఈ క్రమంలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న జడ్డూ ఓవరాల్గా అశ్విన్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ ఈ ఆసీస్తో టెస్టు సిరీస్ తొలి మ్యాచ్లో విలువైన 84 పరుగులు సాధించాడు. ఒక వికెట్ తీయగలిగాడు. బ్యాట్ ఝులిపించిన అక్షర్ పటేల్ ఇక ఢిల్లీ టెస్టులో 74 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. ఇండోర్ టెస్టులో 27 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. నిర్ణయాత్మక అహ్మదాబాద్ టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మండలి బుధవారం ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 44వ స్థానానికి చేరుకున్న అక్షర్.. ఆల్రౌండర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక ఇప్పటికే రవీంద్ర జడేజా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా అక్షర్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఇంగ్లండ్ సారథి బెన్స్టోక్స్ను వెనక్కినెట్టి నాలుగో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్-5లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్ల సత్తా.. టాప్-5లో ఉన్నది వీళ్లే! 1. రవీంద్ర జడేజా- ఇండియా- 431 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 359 పాయింట్లు 3. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 329 పాయింట్లు 4. అక్షర్ పటేల్- ఇండియా- 316 పాయింట్లు 5. బెన్ స్టోక్స్- ఇంగ్లండ్- 307 పాయింట్లు. చదవండి: Rishabh Pant: వైరల్గా మారిన రిషబ్ పంత్ చర్య Ind Vs Aus ODIs: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు -
Ind Vs Aus: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశూ వల్ల కానిది..
India vs Australia, 4th Test- Axar Patel Reocrd: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అదే విధంగా.. టెస్టుల్లో రికార్డుల రాజు, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను వెనక్కినెట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఆఖరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ను బౌల్డ్ చేసిన అక్షర్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. బుమ్రా రికార్డు బద్దలు.. అశూ వల్ల కానిది! ఈ క్రమంలో బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్.. అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్న హెడ్ను అవుట్ చేసి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆసీస్తో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులు సాధించిన అక్షర్.. జట్టును పటిష్ట స్థితిలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్లు 1. అక్షర్ పటేల్- 2205 బంతుల్లో 2. జస్ప్రీత్ బుమ్రా- 2465 బంతుల్లో 3. కర్సన్ ఘావ్రి- 2534 బంతుల్లో 4. రవిచంద్రన్ అశ్విన్- 2597 బంతుల్లో . చదవండి: Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఇలా! టీమిండియాకు.. India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺 The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT — BCCI (@BCCI) March 13, 2023 Milestone 🚨 - Congratulations @akshar2026 who is now the fastest Indian bowler to take 50 wickets in terms of balls bowled (2205). Travis Head is his 50th Test victim.#INDvAUS #TeamIndia pic.twitter.com/yAwGwVYmbo — BCCI (@BCCI) March 13, 2023 -
ఎట్టకేలకు వికెట్.. అక్షర్ కెరీర్లోనే అతి పెద్ద గ్యాప్
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వికెట్ సాధించాడు. అదేంటి అతను ఒక బౌలర్.. వికెట్ సాధించడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అక్షర్ తొలి మూడు టెస్టులు కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టిన అక్షర్ పటేల్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్గా ఉన్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 185 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్రౌండర్ అనే ట్యాగ్ ఉన్న అక్షర్ బ్యాట్తో రాణించినప్పటికి బంతితో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్కు మూలస్తంభంలా నిలిచిన ఉస్మాన్ ఖవాజా(180 పరుగులు) వికెట్ను అక్షర్ దక్కించుకోవడం విశేషం. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఖవాజా ఎల్బీగా వెనుదిరిగాడు. మొత్తంగా ఈ సిరీస్లో 47.4 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ తన టెస్టు కెరీర్లో ఒక వికెట్ తీయడం కోసం ఎదుర్కొన్న అతిపెద్ద గ్యాప్ ఇదే. చివరగా బంగ్లాదేశ్తో రెండో టెస్టులో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. Axar Patel gets the BIG WICKET! 🙌 Usman Khawaja goes for 180(422) 👏#IndvsAus #BGT2023 #UsmanKhawaja #Cricket pic.twitter.com/7j2PfVKFxf — OneCricket (@OneCricketApp) March 10, 2023 చదవండి: డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా? -
Axar Patel Latest Photos: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
BGT 2023: మూడో టెస్టు పిచ్ ఎలా ఉండబోతోంది? ఫొటో వైరల్
Australia tour of India, 2023: భారత్ వేదికగా జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే.. నాగ్పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు పిచ్ల గురించి రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ తదితరులు నాగ్పూర్ను పిచ్ను పరిశీలిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. పిచ్పై ఆసీస్ నిందలు ఇందుకు తోడు.. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ‘డాక్టర్డ్ పిచ్’ అంటూ ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా రూపొందించుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్ల విజృంభణతో టీమిండియా గెలుపొందడం వారి అసహనాన్ని మరింత పెంచింది. అయితే, భారత స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బ్యాట్తోనూ రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వేళ.. ఆసీస్ స్టార్ బ్యాటర్లు వార్నర్, ఉస్మాన్ ఖవాజా వంటి వాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో పిచ్పై నిందలు వేసే పనిలో పడి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆటపై దృష్టి పెట్టలేకపోయారంటూ విమర్శల పాలయ్యారు. అలా అయితే నయమే! ఈ క్రమంలో మూడో టెస్టుకు సంబంధించి ఎలాంటి పిచ్ను రూపొందిస్తారా అన్న అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇండోర్లోని హోల్కర్ స్టేడియం పిచ్ తయారీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని గమనిస్తే పిచ్ ఎలాంటి పగుళ్లూ లేకుండా, కాస్త పచ్చగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయానికి ఇలాగే ఉంటే బ్యాటర్లకు కాస్త అనుకూలిస్తుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు భారీ స్కోర్లు నమోదు కాలేదన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ(120) చేయగా.. మిగతా వాళ్లలో ఎవరూ 100 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఇరు జట్ల స్పిన్నర్లు మొత్తంగా తొలి టెస్టులో 24.. రెండో టెస్టులో 28 వికెట్లు పడగొట్టారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు! Pitch for 3rd Test between India vs Australia. pic.twitter.com/I91HxQ7s8b — Johns. (@CricCrazyJohns) February 27, 2023 -
రెండు రోజుల్లో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి.. డ్యాన్స్ అదిరిపోయిందిగా! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి మితాలీ పారుల్కర్ ఫిబ్రవరి 27న (సోమవారం) శార్దూల్ మనువాడనున్నాడు. ముంబైలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. వీరిద్దరి వివాహానికి 250 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో జరగబోయే వీరి పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ముగిశాయి. హల్దీ వేడుకలో శార్దూల్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పెళ్లికూతురు మిథాలీ స్వయంగా వారిద్దరి పెళ్లి గురించి ప్రస్తావించింది. 2021 నవంబర్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి వివాహం టీ20 ప్రపంచకప్-2022 అనంతరం జరగాల్సింది. కానీ వివిధ కారణల వలన వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ వివాహం కాగా..అక్షర్ పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్ను పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Shardul Thakur FC🔵 (@shardulthakur16) చదవండి: Dinesh Karthik: 'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్లో అదరగొడతాడు' -
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరంటే..? అక్షర్ పటేల్కు బంపర్ ఆఫర్
David Warner: మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 2023 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్ను ఎంపిక చేసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం బెడ్ రెస్ట్లో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ ఎంపిక అనివార్యమైంది. పంత్ గైర్హాజరీలో డీసీ సారధ్య బాధ్యతలను ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మోయనున్నట్లు డీసీ యాజమాన్యం కన్ఫర్మ్ చేసింది. ఈ విషయాన్ని డీసీ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మేనేజ్మెంట్లోని ఓ కీలక వ్యక్తి ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్కు తెలిపారు. కెప్టెన్గా డేవిడ్ వార్నర్ను ఎంపిక చేసుకున్న యాజమాన్యం.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అక్షర్ పటేల్ను ఎంచుకున్నట్లు సదరు వ్యక్తి కన్ఫర్మ్ చేశాడు. స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో అక్షర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో అతనికి ఈ పదవి దక్కినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ రేసులో వార్నర్తో పాటు రోవమన్ పావెల్, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ల పేర్లు వినిపించినప్పటికీ.. యాజమాన్యం అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్పై నమ్మకముంచింది. వార్నర్ గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రిపల్ పటేల్, మనీశ్ పాండే, రిలీ రొస్సో, రోవమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, యశ్ ధుల్, ఫిల్ సాల్ట్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, అమన్ హకీం ఖాన్, లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మన్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, విక్కీ ఓస్వాల్ -
భారీ జంప్ కొట్టిన అక్షర్ పటేల్, పడిపోయిన కేఎల్ రాహుల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన వీరు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ల విభాగంలో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. ఇదే సిరీస్లో తొలి టెస్ట్లో సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంక్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హిట్మ్యాన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్సిడెంట్ కారణంగా గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ రిషబ్ పంత్ 6వ ర్యాంక్ను కాపాడుకున్నాడు. ఈ విభాగంలో లబూషేన్ టాప్లో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్, బాబర్ ఆజమ్ రెండు, మూడు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ సిరీస్లో రెండు అర్ధసెంచరీలతో(84, 74) చెలరేగిన అక్షర్ పటేల్.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ విభాగంలో 61వ ప్లేస్కు చేరుకున్నాడు. కోహ్లి 16వ స్థానంలో, జడేజా 33వ స్థానంలో కొనసాగుతుండగా.. పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాలు కోల్పోయి 27కు, మయాంక్ అగర్వాల్ ఓ స్థానం కోల్పోయి 28కి, కేఎల్ రాహుల్ 7 స్థానాలు కోల్పోయి 58వ ప్లేస్కు పడిపోయారు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (866).. పాట్ కమిన్స్ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకోగా.. అశ్విన్ (864) ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్తో టెస్ట్ సిరీస్ ఆడనప్పటికీ బుమ్రా 5వ స్థానాన్ని కాపాడుకోగా.. జడేజా (763) 6 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. ఆల్రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాళ్లు ఆల్టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చారు. 460 రేటింగ్ పాయింట్లతో జడ్డూ భాయ్, 376 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా.. అక్షర్ పటేల్ 2 స్థానాలు మెరుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు. -
BGT 2023: ఆ ఇద్దరు సూపర్.. టీమిండియాను ఓడించడమా!: పాక్ మాజీ ప్లేయర్
India vs Australia- Test Series- BGT 2023: ‘‘పెర్త్ లేదంటే బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా ఉపఖండ జట్లతో ఎలా మ్యాచ్లు ముగిస్తుందో ఇప్పుడు వారి పరిస్థితి కూడా అలాగే తయారైంది. వరుస ఓటములు చూస్తుంటే వారి సన్నద్ధత ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఇండియాకు వచ్చే ముందు వాళ్లు అస్సలు ప్రిపేర్ అవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. భారత గడ్డపై టీమిండియాను ఓడించడం అసాధ్యం. స్పిన్నర్లను ఆడటంలో ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఒకే సెషన్లో తొమ్మిది వికెట్లు పడ్డాయంటే వాళ్ల బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు. వాళ్లిద్దరు సూపర్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రదర్శనపై పెదవి విరిచిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లపై ప్రశంసలు కురిపించాడు. జడ్డూ బంతితో మాయ చేస్తే.. అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. కాగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా.. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా గెలుపొందడంలో ఆల్రౌండర్లు జడేజా, అక్షర్ కీలక పాత్ర పోషించారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జడ్డూ రెండు మ్యాచ్లలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి సత్తా చాటాడు. ఇక ఈ సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లను రెండున్నర రోజుల్లోనే ముగించి 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. చెత్త బ్యాటింగ్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అక్షర్ పటేల్ బ్యాటింగ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆస్ట్రేలియా ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ అశ్విన్తో కలిసి అతడు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 60- 70 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా మానసికంగా బలహీనపడిపోయింది. టెక్నికల్గానూ వారి ఆటలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆసీస్ బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్లో ఎలా ఆడారో చూశాం కదా! షాట్ల ఎంపికలో పొరపాట్లు స్పష్టంగా కనిపించాయి. స్వీప్ షాట్లు కొంపముంచాయి. చెత్త బ్యాటింగ్తో భారీ మూల్యం చెల్లించారు’’ అని పాక్ మాజీ ఆటగాడు రమీజ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..! KL Rahul: వైస్ కెప్టెన్ హోదా తొలగింపు.. అతడికి లైన్ క్లియర్.. ఇక దేశవాళీ క్రికెట్ ఆడితేనే.. In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/Ebpi7zbPD0 — BCCI (@BCCI) February 19, 2023 -
టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..!
క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టు మహారాష్ట్ర క్రికెటర్లతో, ప్రత్యేకించి ముంబై క్రికెటర్లతో నిండి ఉండేదన్నది జగమెరిగిన సత్యం. రుస్తొంజీ జంషెడ్జీ, లాల్చంద్ రాజ్పుత్, గులాబ్రాయ్ రాంచంద్, ఏక్నాథ్ సోల్కర్, బాపు నాదకర్ణి, ఫరూక్ ఇంజనీర్, దిలీప్ సర్దేశాయ్, పోలీ ఉమ్రిగర్.. ఆతర్వాత 70,80 దశకాల్లో అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, బల్విందర్ సంధూ, రవిశాస్త్రి.. 90వ దశకంలో సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. 2000 సంవత్సరానికి ముందు ఆతర్వాత జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా దశకానికి కొందరు చొప్పున టీమిండియా తరఫున మెరుపులు మెరిపించారు. వీరిలో గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దిగ్గజ హోదా పొందారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారత క్రికెట్కు మహారాష్ట్ర కాంట్రిబ్యూషన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టులో సగం ఉన్న మహా క్రికెటర్ల సంఖ్య రానురాను ఒకటి, రెండుకు పరిమితమైంది. మహారాష్ట్ర తర్వాత టీమిండియాకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత ఢిల్లీకి దక్కుతుంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి మోహిందర్ అమర్నాథ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్లు టీమిండియా తరఫున మెరిశారు. వీరిలో కోహ్లి విశ్వవ్యాప్తంగా పాపులారిటీ పొంది క్రికెట్ దిగ్గజంగా కొనసాగుతున్నాడు. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత టీమిండియాకు అత్యధిక మంది స్టార్ క్రికెటర్లను అందించిన రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందింది. 90వ దశకంలో ప్రత్యేకించి 1996వ సంవత్సరంలో టీమిండియాలో కర్ణాటక ప్లేయర్ల హవా కొనసాగింది. ఆ ఏడాది ఒకానొక సందర్భంలో ఏడుగురు కర్ణాటక ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, దొడ్డ గణేష్, డేవిడ్ జాన్సన్ టీమిండియాకు ఒకే మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించారు. 1996-2004, 2005 వరకు టీమిండియాలో కర్ణాటక ఆటగాళ్ల డామినేషన్ కొనసాగింది. ప్రస్తుతం అదే హవాను గుజరాత్ ఆటగాళ్లు కొనసాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కర్ణాటక ఆటగాళ్లు సగానికిపై టీమిండియాను ఆక్రమిస్తే.. ఇంచుమించు అదే రేంజ్లో ప్రస్తుతం గుజరాతీ ఆటగాళ్ల డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్.. టెస్ట్ స్టార్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా, ప్రస్తుతం రెస్ట్లో ఉన్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ హర్షల్ పటేల్, లేటు వయసులో సంచలన ప్రదర్శనలతో టీమిండియా తలుపు తట్టిన వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ గుజరాత్ ప్రాంతవాసులే. వీరిలో కొందరు దేశావాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ ప్రాంతం గుజరాత్ కిందకే వస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 కోసం, ఆతర్వాత ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ కోసం తాజాగా ఎంపిక చేసిన భారత జట్టును ఓసారి పరిశీలిస్తే.. టెస్ట్ జట్టులో నలుగురు (పుజారా, జడేజా, అక్షర్, ఉనద్కత్), వన్డే జట్టులో నలుగురు (హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్, ఉనద్కత్) గుజరాతీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో హార్ధిక్ టీమిండియా వైస్ కెప్టెన్ కాగా.. మిగతా ముగ్గురు స్టార్ క్రికెటర్ల హోదా కలిగి ఉన్నారు. -
నా అద్భుత ఫామ్కు కారణం అతడే: అక్షర్ పటేల్
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్పటేల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో అర్దసెంచరీతో చెలరేగిన అక్షర్.. ఇప్పుడు రెండో టెస్టులోనే కీలక ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్తో కలిసి అక్షర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ 115 బాల్స్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 74 రన్స్ చేయగా అశ్విన్ ఐదు ఫోర్లతో 31పరుగులు చేశాడు. వీరిద్దరి కీలక ఇన్నింగ్స్ ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. ఇక తన అద్భుత ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం అక్షర్పటేల్ స్పందించాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపడడంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు అని అతడు తెలిపాడు. "ఐపీఎల్లో మా జట్టు(ఢిల్లీ క్యాపిటల్స్) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపడడంలో రికీ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా భారత జట్టులో కూడా చాలా మంది బ్యాటర్ల నుంచి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాను. నా జట్టు కోసం 100 శాతం ఎఫక్ట్ పెడతాను. ఆల్రౌండర్గా బ్యాట్తో బాల్తో రాణించడమే నా లక్క్ష్యం. నేను సాధించే 30, 40 పరుగులను మ్యాచ్ విన్నింగ్ స్కోర్లుగా మలచాలి అనుకున్నాను. రాబోయే మ్యాచ్ల్లో కూడా నా మైండ్ సెట్ ఈ విధంగానే ఉంటుంది" అని ఎన్డీడివీతో పేర్కొన్నాడు. చదవండి: IND Vs AUS 2nd Test: అక్షర్ లేకపోయుంటే.. వాళ్లకు పట్టిన గతే మనకూ! -
అక్షర్ లేకపోయుంటే.. వాళ్లకు పట్టిన గతే మనకూ!
IND Vs AUS 2nd Test Day-2 Analaysis.. ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. పిచ్ మనకు అనూకూలంగా ఉంటుందనుకుంటే రెండో రోజు ఆటలో అంతా రివర్స్ అయింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ మరోసారి తన మ్యాజిక్ చూపెట్టాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అటు కెప్టెన్ రోహిత్ కూడా పెద్దగా ఆడలేదు. ఇక వందో టెస్టు ఆడుతున్న పుజారా ఇరగదీస్తాడనుకుంటే డకౌట్ అయ్యాడు. టాపార్డర్లో మళ్లీ అదే పరిస్థితి కనిపించింది. ఇక మిడిలార్డర్ విషయానికి వస్తే కోహ్లి కాస్త పర్వాలేదనిపించాడు. 44 పరుగులతో జట్టులో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లి ఔట్ కాదని అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడని తర్వాత తేలింది. ఒకవేళ కోహ్లి ఔట్ కాకపోయుంటే సెంచరీ చేసేవాడేమో. సూర్య స్థానంలో వచ్చిన అయ్యర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. తొలి టెస్టు హీరో జడేజా కూడా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చూస్తుంటే తొలి టెస్టులో ఆస్ట్రేలియా పరిస్థితే మనకు వచ్చినట్లుగా అనిపించింది. అయితే ఈ దశలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తానున్నానంటూ ఆపద్భాందవుడిలా వచ్చాడు. అక్షర్కు అశ్విన్ తోడయ్యాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమైన చోట అక్షర్ మాత్రం చక్కగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్లో విఫలమైనప్పటికి తనలో మంచి బ్యాటర్ దాగున్నాడని మరోసారి చూపించాడు. బౌండరీలు కొట్టడానికి భయపడిన చోట అక్షర్ సిక్సర్లు బాదాడు. సిక్సర్తోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అశ్విన్ కూడా పరిణితితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇద్దరు స్వల్ప వ్యవధి తేడాలో ఔట్ కావడంతో టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్కు కేవలం ఒక్క పరుగు ఆధిక్యం మాత్రమే లభించింది. చివరికి ఆట ఆఖరికి వచ్చేసరికి కష్టాల్లో ఉన్న భారత్ను ఆదుకొని అక్షర్ పటేల్ మ్యాచ్ రెండో రోజు హీరోగా నిలిచాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్తో టీమిండియాలో ఒక లోటు తీరిపోయింది. కొన్నాళ్లుగా టీమిండియా బలహీనంగా ఉన్న లోయర్ ఆర్డర్ సమస్య తీరిపోయింది. ఇప్పుడు టీమిండియా ఒకటో నెంబర్ నుంచి ఎనిమిదో నెంబర్ దాకా బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు ఉండడం సానుకూలాంశం. -
బ్యాటర్లకు సాధ్యం కాలేదు.. అక్షర్, అశ్విన్లు చూపించారు
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలిసారి వంద పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంలో ఇరుజట్ల బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లు చేసి చూపించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అక్షర్, అశ్విన్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందుకున్నారు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్కు ఇద్దరు కలిసి 114 పరుగులు జోడించారు. తద్వారా సిరీస్లో తొలి వంద పరుగుల భాగస్వామ్యం అందుకున్న జంటగా నిలిచారు. అంతేకాదు ఈ జంట ఒక అరుదైన రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో టీమిండియా తరపున ఎనిమిదో స్థానంలో సెంచరీ పరుగుల భాగస్వామ్యం అందుకున్న నాలుగో జంటగా అశ్విన్, అక్షర్ నిలిచారు. ఇక తొలి టెస్టులో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు వంద పరుగుల పార్ట్నర్షిప్కు దగ్గరి వరకు వచ్చి ఆగిపోయారు. ఆ మ్యాచ్లో ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 88 పరుగులు జోడించారు. ఇక రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. ఒక దశలో 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్, అశ్విన్లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించి టీమిండియా పరువును కాపాడారు. అక్షర్ పటేల్ 74 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కోహ్లి 44, అశ్విన్ 37 పరగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. చదవండి: సిక్సర్తో ఫిఫ్టీ.. పూర్తిస్థాయి బ్యాటర్గా మారిపోయాడు -
BGT 2023: అంపైర్ నిర్ణయానికి బలైన కోహ్లి.. ఆదుకున్న అక్షర్
India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఢిల్లీ మ్యాచ్లో విరాట్ కోహ్లి(44) మినహా.. మిగతా కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ను కట్టడి చేయాలనుకున్న ఆస్ట్రేలియాకు కేవలం ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 17) రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల విజృంభణతో తొలి రోజే 263 పరుగులు చేసి ఆలౌట్ అయి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో టీమిండియా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది. నాథన్ దెబ్బ.. ఈ క్రమంలో శనివారం రెండో రోజు ఆట మొదలెట్టిన టీమిండియా నాథన్ లియోన్ దెబ్బకు వరుసగా ఓపెనర్లు కేఎల్ రాహుల్(17), రోహిత్ శర్మ(32), వన్డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా(0) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి 84 బంతుల్లో 44 పరుగులు చేయగా.. ఐదో స్థానంలో దిగిన శ్రేయస్ అయ్యర్(4) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, అంపైర్ నిర్ణయానికి కోహ్లి బలైపోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అక్షర్-అశూ అద్భుతం ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా 26 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. శ్రీకర్ భరత్(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. అశ్విన్(37) అతడికి తోడయ్యాడు. వీరిద్దరు కలిసి 100కు పైగా పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ప్రదర్శన చేయడంతో టీమిండియా 262 పరుగులు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్లు నాథన్ లియోన్కు అత్యధికంగా ఐదు, టాడ్ మర్ఫీకి రెండు, అరంగేట్ర స్పిన్నర్ కుహ్నెమన్కు రెండు, పేసర్ ప్యాట్ కమిన్స్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. అంపైర్ నిర్ణయానికి బలి.. బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు -
సిక్సర్తో ఫిఫ్టీ.. పూర్తిస్థాయి బ్యాటర్గా మారిపోయాడు
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మరోసారి ఆపద్భాంధవుడయ్యాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ తానున్నాంటూ మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ టెస్టులో మరో అర్థసెంచరీ నమోదు చేశాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట అక్షర్ 95 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అతని ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తన స్కోరు 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్ కుహ్నేమన్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్థసెంచరీ మార్క్ను అందుకోవడం విశేషం. తొలి టెస్టులోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు అక్షర్ పటేల్ 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమిండియా 400 పరుగులు దాటగిలిగిందంటే అదంతా అక్షర్ పటేల్, జడేజాల చలువే. ఆ తర్వాత అశ్విన్, జడ్డూ స్పిన్ మాయాజాలంతో టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్లో విఫలమైనా బ్యాటింగ్లో మెరిసి జట్టు విజయంలో అక్షర్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. అయితే కెరీర్ మొదట్లో అక్షర్ పటేల్ కేవలం బౌలింగ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో మాత్రం అక్షర్ పటేల్లో పూర్తిస్థాయి బ్యాటర్ కనిపిస్తున్నాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట ఆసీస్ బౌలర్లను పరీక్షిస్తూ బ్యాటింగ్ కొనసాగించిన అక్షర్ ఇన్నింగ్స్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే మూడో స్పిన్నర్గా జట్టులో ఉన్న అక్షర్ పటేల్కు బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా దక్కడం లేదు. అశ్విన్, జడేజాలు ప్రభావం చూపిస్తున్న చోట అక్షర్ మాత్రం తన బౌలింగ్ పదును చూపించడంలో విఫలమవుతున్నాడు. అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ బౌలర్.. జడేజా కూడా లెఫ్టార్మ్ బౌలరే.. మరి జడ్డూ వికెట్లు తీస్తుంటే అక్షర్ మాత్రం ఎందుకు తీయలేకపోతున్నాడనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే బౌలింగ్లో విఫలమైనప్పటికి బ్యాటర్గా రాణిస్తుండడంతో అక్షర్ పటేల్ స్థానం జట్టులో ప్రస్తుతానికి పదిలంగానే కనిపిస్తుంది. కానీ మూడో స్పిన్నర్ ప్రభావం చూపాలని జట్టు మేనేజ్మెంట్ యోచన చేస్తే మాత్రం అక్షర్ పటేల్పై వేటు పడే అవకాశం ఉంది. Dilli dhamaaka ft. Axar 🎇😎#INDvAUS #AxarPatelpic.twitter.com/yUE4xcIDLy — SunRisers Hyderabad (@SunRisers) February 18, 2023 5⃣0⃣ & counting ✅@akshar2026 smacks a MAXIMUM to bring up his half-century in style 👌🏻👌🏻 Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8…#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/noVvVrEbAX — BCCI (@BCCI) February 18, 2023 చదవండి: IND VS AUS 2nd Test Day 2: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు -
BGT 2023: మూడు రోజుల్లోనే ఖతం.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
India vs Australia, 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాగ్పూర్లో మ్యాచ్లో భారీ విజయం సాధించి నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. భారత స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే మొదటి టెస్టు ముగిసిపోయింది. మ్యాచ్ సాగిందిలా.. విదర్భ క్రికెట్ స్టేడియంలో గురువారం(ఫిబ్రవరి 9)న మొదలైన టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మొదటి వికెట్ తీసి భారత పేసర్ మహ్మద్ సిరాజ్ శుభారంభం అందించగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపం ప్రదర్శించారు. వీరికి తోడు షమీ కూడా రాణించాడు. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజే సంపూర్ణ ఆధిపత్యం ఓవర్నైట్ స్కోరు 77/1తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ను కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించాడు. ‘నైట్ వాచ్మన్’ బ్యాటర్ అశ్విన్ (62 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. రెండో వికెట్ భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో కొత్త స్పిన్నర్ మర్ఫీ మాయాజాలం జట్టును ఇబ్బంది పెట్టింది. అశ్విన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మర్ఫీ... స్వల్ప వ్యవధిలో వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (14 బంతుల్లో 7; 1 ఫోర్)ను కూడా బోల్తా కొట్టించాడు. దీంతో రోహిత్కు కోహ్లి జతయ్యాడు. జట్టు స్కోరు 151/3 వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లారు. రోహిత్ సెంచరీ రెండో సెషన్ మాత్రం కష్టాలతో మొదలైంది. స్పిన్కు కలిసొచ్చిన పిచ్పై మర్ఫీ తొలి బంతికే కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆట ముగించాడు. లెగ్స్టంప్కు ఆవల వేసిన బంతిని కోహ్లి ఫ్లిక్ చేయాలనుకున్నాడు. కానీ అదికాస్తా బ్యాట్ అంచును తాకుతూ కీపర్ క్యారీ చేతికి చిక్కింది. 151 స్కోరు వద్ద నాలుగో వికెట్ పడగా... ఈ 4 వికెట్లు మర్ఫీనే పడగొట్టాడు. క్రీజులో పాతుకొనిపోయిన రోహిత్ 171 బంతుల్లో (14 ఫోర్లు, 2 సిక్స్లు) టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తొలి టెస్టు ఆడుతున్న మెరుపుల బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) నిరాశపరిచాడు. లయన్ బంతికి క్లీన్బౌల్డయ్యాడు. తర్వాత జడేజా అండతో భారత స్కోరును 200 పరుగులు దాటించాడు. రోహిత్, జడేజా జోడీ ముందు ఆసీస్ స్పిన్ పనిచేయలేదు. మర్ఫీ, లయన్ అలసిపోయారే తప్ప జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. 226/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. జడేజా, అక్షర్... ఫిఫ్టీ–ఫిఫ్టీ స్పిన్ వల్ల కాకపోవడంతో కంగారూ సారథి కమిన్స్ రంగంలోకి దిగాడు. మూడో సెషన్ ఆరంభంలో భారత ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచిన రోహిత్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆరో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యానికి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ శ్రీకర్ భరత్ (10 బంతుల్లో 8; 1 ఫోర్)కు నిరూపించుకునేకుందేకు చక్కని అవకాశం వచ్చినా... మర్ఫీ స్పిన్ ఉచ్చులో పడి తొందరగానే నిష్క్రమించాడు. 240 పరుగుల వద్ద ఏడో వికెట్ కూలింది. ఈ దశలో జడేజాకు అక్షర్ పటేల్ జతయ్యాడు. క్రీజులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లే కావడంతో అవతలి వైపు స్పిన్ ఉచ్చు తేలిపోయింది. ఆఖరి సెషన్లో ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు జతచేయడంతో ఆలౌట్ కావాల్సిన జట్టు 300 పైచిలుకు పరుగుల్ని అవలీలగా చేసింది. చూడచక్కని బౌండరీలతో స్కోరును పెంచారు. ఈ క్రమంలో మొదట జడేజా 114 బంతుల్లో (7 ఫోర్లు), సెషన్ ముగిసేదశలో అక్షర్ 94 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు ఇద్దరు కలిసి 81 పరుగులు జోడించారు. మూడో రోజు ఖతం మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే జడేజా(70)ను మర్ఫీ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో అక్షర్కు జతైన మహ్మద్ షమీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మర్ఫీ బౌలింగ్లో భారత పేసర్ షమీ వరుస సిక్సర్లు బాదాడు. 42 బంతుల్లో 36 పరుగులు చేసి.. అక్షర్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, మర్ఫీ బౌలింగ్లోనే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్(84) కమిన్స్ బౌలింగ్లో అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్కు తెరపడింది. 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అశ్విన్ విశ్వరూపం ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత స్పిన్నర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. అశ్విన్ వరుస విరామాల్లో వికెట్లు తీసి తన పవరేంటో చూపించాడు. జడేజా రెండు, షమీ 2 వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బౌలర్ల విజృంభించడంతో 91 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా. దీంతో.. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా(70 పరుగులు, 7 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు స్కోర్లు భారత్- 400 ఆస్ట్రేలియా- 177 & 91 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND vs AUS: ఏమైంది కోహ్లి? ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన విరాట్! వీడియో వైరల్ IND vs AUS: అశ్విన్ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్గా -
Ind vs Aus: ఆకట్టుకున్న అక్షర్, షమీ.. 400 పరుగులకు టీమిండియా ఆలౌట్
India vs Australia, 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆసీస్ను 177 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 400 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీంతో మూడో రోజు ఆటలో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఈ మేరకు స్కోరు చేసి ఆలౌట్ అయింది. రోహిత్, జడ్డూ, అక్షర్ అదుర్స్ ఇక రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ(120) అద్భుత సెంచరీతో చెలరేగగా.. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విలువైన అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇక మూడో ఆట ఆరంభమైన కాసేపటికే జడ్డూ(70)ను ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ పెవిలియన్కు పంపగా.. అక్షర్(84)తో కలిసి మహ్మద్ షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. మర్ఫీకి మరుపురాని టెస్టు ఆస్ట్రేలియా బౌలర్లలో అరంగేట్ర బౌలర్ టాడ్ మర్ఫీకి అత్యధికంగా 7 వికెట్లు దక్కాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్ను అవుట్ చేయడం ద్వారా తొలి వికెట్ తీసిన మర్ఫీ.. అశ్విన్, పుజారా, కోహ్లి, జడేజా, శ్రీకర్ భరత్.. ఆఖర్లో షమీని పెవిలియన్కు పంపాడు. తద్వారా తన కెరీర్లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ కమిన్స్కు రెండు, నాథన్ లియోన్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు IND vs AUS: రోహిత్ శర్మకి సారీ చెప్పిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ 🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted. 👏 A splendid knock from @MdShami11! 📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu — The Bharat Army (@thebharatarmy) February 11, 2023 -
'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్
నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా.. ఆస్ట్రేలియాపై పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. జడేజా (66 పరుగులు), అక్షర్ పటేల్(52 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. 144 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడోరోజు ఆటలో 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే మ్యాచ్పై పట్టు సాధించినట్లే. అంతకముందు రోహిత్ శర్మ అద్భుత శతకంతో అలరించాడు. రెండోరోజు ముగిసిన తర్వాత అక్షర్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా మీడియాకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. నాగ్పూర్ పిచ్పై ఆసీస్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించడంపై స్పందించిన అక్షర్.. '' మేం రేపు పొద్దున బ్యాటింగ్ చేసేవరకు పిచ్ మాకు అనుకూలంగానే ఉంటుంది.. ఆ తర్వాత బౌలింగ్కు వచ్చేసరికి ఏదో ఒక దారి వెతుక్కుంటాం'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. ఆ తర్వాత అక్షర్ మాట్లాడుతూ..'' ఇక మ్యాచ్లో అనవసర ఒత్తిడికి గురి కాకుండా స్ట్రైక్ రొటేషన్ మీద ఫోకస్ చేయమని జడేజా సూచనలు ఇచ్చాడు. అదే పాటించాను పరుగులు రాబట్టాను. ఇక ఏడాది నుంచి నా బ్యాటింగ్లో మార్పు వచ్చింది. బ్యాటింగ్లో టెక్నిక్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బ్రేక్ దొరికిన సమయంలో దానిని మెరుగుపరుచుకున్నా. కోచింగ్ స్టాఫ్ వద్ద మరిన్ని మెళుకువలు నేర్చుకొని ఎబిలిటీ పెంచుకున్నా. ఇది కొనసాగించడానికి ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: దిగ్గజ ఆల్రౌండర్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు
IND Vs AUS Day-2 Analaysis.. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. విశ్లేషణ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో మొదట ఆస్ట్రేలియాదే ఆధిపత్యంలా కనిపించినప్పటికి చివరాఖరికి టీమిండియాదే పైచేయి. తొలి రెండు సెషన్లలో ఆస్ట్రేలియా ఆధిక్యం కనబరిచినప్పటికి రోహిత్ సెంచరీతో ఆసీస్ ఆధిపత్యం ఒక సెషన్కు పరిమితమైనట్లే. ఎందుకంటే చివరి సెషన్లో జడేజా, అక్షర్ పటేల్ల ఆటతో టీమిండియా నిలదొక్కుక్కుంది. నిలదొక్కుకోవడమే కాదు టీమిండియాకు భారీ ఆధిక్యం కట్టబెట్టేలా కనిపిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఈ ఇద్దరు లంచ్ వరకు నిలబడితే చాలు.. మ్యాచ్ టీమిండియాదే అవుతుంది. ఒకవేళ ఆధిక్యం 200 పరుగులు దాటినా మ్యాచ్ టీమిండియావైపే మొగ్గి ఉంటుంది. మొదటి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మూడో రోజుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. ఆకట్టుకున్న ఆసీస్ కుర్రాడు.. ఇక రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా ఏదైనా లాభపడిందంటే టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో రాణించడం. 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం అంటే మాములు విషయం కాదు. తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో మొదటిరోజే కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టిన టాడ్ మర్ఫీ.. రెండోరోజు ఆటలో తన మ్యాజిక్ బౌలింగ్తో కోహ్లి, పుజారా, అశ్విన్, శ్రీకర్ భరత్లను బుట్టలో వేసుకొని పెవిలియన్ చేర్చాడు. అయితే తొలి టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రభావం చూపిస్తాడని అనుకున్నారు.. కానీ ఎవరు ఊహించని విధంగా టాడ్ మర్ఫీ తన బౌలింగ్తో హైలైట్ అయ్యాడు. అతని బౌలింగ్లో స్టీవ్ ఓ కఫీ(2017లో టీమిండియాను తొలి టెస్టులో శాసించిన బౌలర్) బౌలింగ్ శైలి కొట్టొచ్చినట్లు కనిపించింది. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు.. తొలి టెస్టులో స్టీవ్ ఓ కఫీ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్లో ఆసీస్ 333 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో ఓ కఫీ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు. 2014లోనే అరంగేట్రం చేసినప్పటికి స్టీవ్ ఓ కఫీ బౌలింగ్ టీమిండియా బ్యాటర్లకు కొత్త. అందుకే అతని కొత్త బౌలింగ్ శైలిలో ఇబ్బందులు పడి వికెట్లు చేజార్చుకొని మ్యాచ్ ఓటమిపాలయ్యారు. అయితే ఇదే స్టీవ్ ఓ కఫీ బౌలింగ్ను తర్వాతి మ్యాచ్ల్లో చీల్చి చెండాడారు. ఆ దెబ్బకు ఓ కఫీ మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా టాడ్ మర్ఫీ కూడా అతని బౌలింగ్ శైలినే అనుకరిస్తుండడంతో అభిమానులు మరో స్టీవ్ ఓ కఫీ వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఐదు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే చివరి సెషన్లో జడేజా, అక్షర్ పటేల్లు అర్థశతకాలతో రాణించి టీమిండియాను నిలబెట్టారు. మర్ఫీ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికి జడ్డూ, అక్షర్ పటేల్లు తమ బ్యాటింగ్తో అతన్ని తొక్కేశారని అభిమానులు సరదాగా పేర్కొన్నారు. చదవండి: IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్లో ఇరగదీసిన అక్షర్ పటేల్ -
IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్లో ఇరగదీసిన అక్షర్ పటేల్
Axar Patel: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా అప్కమింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో అక్షర్ బంతితో విఫలమైనా, కీలక తరుణంలో బ్యాటింగ్కు వచ్చి అర్ధసెంచరీతో మెరిశాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా సహకారంతో జట్టుకు కీలక పరుగులు సమకూర్చిన అక్షర్.. కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు 94 బంతులు ఆడిన అక్షర్ 8 ఫోర్లు బాదాడు. జట్టు స్కోర్ 240 వద్ద నుండగా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్.. బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు అత్యంత కీలకమై లీడ్ను అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన అక్షర్ బ్యాట్తో మెరుగ్గా రాణిస్తూ.. జట్టు బ్యాటింగ్ డెప్త్ ప్రత్యర్ధికి తెలిసేలా చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 321/7గా ఉంది. అక్షర్ (52), రవీంద్ర జడేజా (66) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ (120) సెంచరీ సాధించి స్కోర్కు బలమైన పునాది వేయగా.. జడేజా, అక్షర్ జోడీ అజేయమైన 81 పరుగులు జోడించి, టీమిండియా ఆధిక్యాన్ని 144 పరుగులకు చేర్చారు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (20), అశ్విన్ (23) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. పుజారా (7), కోహ్లి (12), సూర్యకుమార్ యాదవ్ (8), కేఎస్ భరత్ (8) దారుణంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 5 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయోన్, పాట్ కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. జడేజా (5/47), అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాశించారు. సిరాజ్, షమీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
BGT 2023: ఆసీస్తో తొలి టెస్ట్.. అక్షర్, సూర్యకుమార్లకు నో ఛాన్స్..!
Wasim Jaffer Playing XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాడు. ఈ జట్టులో జాఫర్ రెండు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఊహించిన విధంగానే తొమ్మిది మందిని ఎంపిక చేసిన జాఫర్.. ఎన్నో అంచనాలను మోస్తున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్, టెస్ట్ అరంగేట్రంకు సిద్ధంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్లను బెంచ్కే పరిమితం చేశాడు. My India XI for First Test: 1. Rohit (c) 2. KL 3. Pujara 4. Virat 5. Shubman 6. Bharat (wk) 7. Jadeja 8. Ashwin 9. Kuldeep 10. Shami 11. Siraj Hard to leave out Axar but Kuldeep brings variety as a wrist spinner. What's your XI? #INDvAUS #BorderGavaskarTrophy — Wasim Jaffer (@WasimJaffer14) February 6, 2023 అక్షర్ను బెంచ్పై కూర్చొబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉందని కామెంట్ చేసిన జాఫర్.. సూర్యకుమార్ విషయాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్షర్కు బదులుగా తాను ఎంపిక చేసుకున్న కుల్దీప్ రిస్ట్ స్పిన్నర్గా వైవిధ్యాన్ని ప్రదర్శించగలడని జాఫర్ తన ఎంపికను సమర్ధించుకున్నాడు. బ్యాటింగ్ లైనప్ విషయంలోనూ జాఫర్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యువ సంచలనం శుభ్మన్ గిల్ను ఓపెనర్గా కాకుండా ఐదో స్థానం కోసం ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్ వికెట్కీపర్ అవసరమని భావించిన జాఫర్.. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్కు తన ఓటు వేశాడు. భరత్కు స్థానం కల్పించడంతో సూర్యకుమార్ను తప్పించి ఉంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కాగా, గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్పూర్లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్ను మొదలుపెట్టింది. సీఏ చేసిన 39 ఆలౌట్ వ్యాఖ్యలకు వసీం జాఫర్ తనదైన శైలీలో రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. భారత్-ఆసీస్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్లు గెలిచాయి. 5 సిరీస్లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
ఆసీస్తో తొలి టెస్ట్.. భారత తుది జట్టు.. సూర్య ఉంటాడా, అక్షర్కు అవకాశం ఉంటుందా..?
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. నెట్టింట దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఎవరికి తోచిన విధంగా వారు తమ తమ తుది జట్లను ప్రకటిస్తున్నారు. ఈ అంశంపై విశ్లేషకులు, మాజీలు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంచి, భారత తుది జట్టులో ఎవరెవరు ఉండే అస్కారముందో ఓసారి పరిశీలిస్తే.. ప్రస్తుతమున్న భీకర ఫామ్ దృష్ట్యా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ స్థానం ఖాయంగా తెలుస్తోంది. అతనిపై ఎలాంటి నెగిటివ్ నిర్ణయం తీసుకునే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా గిల్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం పక్కా. వన్డౌన్ విషయానికొస్తే.. ఈ స్థానం నయా వాల్ పుజారా కోసం ఎప్పటి నుంచో రిజర్వై ఉంది. ఇక నాలుగో ప్లేస్లో కోహ్లి రావడంపై కూడా ఎలాంటి అనుమానులు లేవు. సమస్య వచ్చేదంతా ఇక్కడి నుంచే. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వాలా లేక సూర్యకుమార్వైపు మొగ్గు చూపాలా అన్న విషయంపై టీమిండియా యాజమాన్యం తర్జనభర్జన పడుతుండవచ్చు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా శ్రేయస్ అయ్యర్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోదు. వికెట్కీపర్గా శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైనట్టే. ఒకవేళ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ చేత కీపింగ్ చేయించాలని భావిస్తే సూర్యకుమార్కు అవకాశం వస్తుంది. ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను ఆడించాలా లేక అక్షర్ పటేల్ వైపు చూడాలా అన్న అంశం కూడా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో అశ్విన్, కుల్దీప్ స్థానాలు పక్కా కాగా.. పేసర్ల కోటాలో మహ్మద్ షమీ, సిరాజ్ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమేనని చెప్పవచ్చు. ఒకవేళ ముగ్గురు పేసర్లను ఆడించాలని యాజమాన్యం భావిస్తే.. ఉనద్కత్, ఉమేశ్ యాదవ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్/ సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్/ రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ -
ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. అశ్విన్ లాంటి బౌలర్!? ఇంతకీ ఎవరీ కుర్రాడు?
India Vs Australia Test Series- Who is Mahesh Pithiya: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఇప్పటికే ఫైనల్ చేరింది ఆస్ట్రేలియా. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచిన కంగారూ జట్టు ఫుల్ జోష్లో ఉంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు కంటే ముందు టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ అయితే, భారత గడ్డపై అదీ ఎక్కువగా స్పిన్ బౌలర్లకు అనుకూలించే పిచ్లపై టీమిండియాతో సిరీస్ అంటే ఆషామాషీ కాదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా సొంతగడ్డపై అశూ ఎలా రెచ్చిపోతాడో ఆసీస్ బ్యాటర్లకు గతానుభవమే! అందుకే అచ్చం అశూ మాదిరే బౌలింగ్ చేయగల గుజరాత్ బౌలర్తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సన్నద్ధమయ్యే క్రమంలో నెట్స్లో ‘అశూ డూప్లికేట్’ను ఎదుర్కొంటున్నారు. View this post on Instagram A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_) ఎవరీ మహేశ్ పితియా?! ఆ వ్యక్తి పేరు మహేశ్ పితియా. గుజరాత్లోని జునాగఢ్కు చెందిన మహేశ్ స్పిన్ బౌలర్. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్ దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్తో రంజీల్లో ఎంట్రీ(డిసెంబరులో) ఇచ్చిన అతడు ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. PC: Instagram ఉత్తరప్రదేశ్, హిమాచల్, బెంగాల్, నాగాలాండ్ జట్లతో మ్యాచ్లలో మహేశ్ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టడంతో పాటు 116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 52. ఇంచుమించు అశ్విన్లాగే సేమ్ హైట్లో బాల్ డెలివరీ చేసే మహేశ్.. బంతి విసరడానికి ముందు అతడిలాగే జంప్ చేస్తాడు కూడా! View this post on Instagram A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_) అశూనే రోల్ మోడల్ నిజానికి అశ్వినే తన రోల్ మోడల్ అట. సాధారణ కుటుంబానికి చెందిన మహేశ్, 11 ఏళ్ల వయసు వచ్చే వరకు వాళ్ల ఇంట్లో టీవీ లేని కారణంగా అశ్విన్ బౌలింగ్ను ఒక్కసారి కూడా చూడలేదట. అయితే, 2013లో వెస్టిండీస్తో అశూ ఆడిన మ్యాచ్ చూసినప్పటి నుంచి అతడు తన ఆరాధ్య క్రికెటర్గా మారిపోయాడట. అచ్చం అశూ మాదిరే ఇక టీమిండియాతో సిరీస్తో నేపథ్యంలో మహేశ్ గురించి తెలుసుకున్న ఆస్ట్రేలియా మేనేజ్మెంట్.. అతడిని సంప్రదించింది. క్రిక్బజ్ కథనంలో పేర్కొన్న ప్రకారం.. బెంగళూరులో ఆసీస్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్లోనే అతడు కూడా ఉన్నాడు. PC: Instagram అంతేకాదు.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వరల్డ్ నంబర్ 1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్లతో పాటు కలిసి ప్రస్తుతం ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు వారికి అందబాటులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆలూర్లోని కేఎస్సీఏ గ్రౌండ్లో స్మిత్, మ్యాట్ రెన్షాలు మహేశ్ బౌలింగ్లో ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ‘‘ఈ అబ్బాయి అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసించారు. ఇక స్మిత్కు మహేశ్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Steve Smith practiced Mahesh Pithiya bowling who's a quite similar bowler like Ashwin. #BorderGavaskarTrophy#INDvsAUS #INDvAUSpic.twitter.com/BVVadbk6RV — Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 3, 2023 నాడు 21 వికెట్లతో చెలరేగిన అశ్విన్ 2017లో ఆస్ట్రేలియా చివరిగా సారిగా భారత్లో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈసారి అశూతో పాటు రవీంద్ర జడేజాకు.. వీరిద్దరికి తోడు అద్భుత ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ రూపంలో ఆసీస్ బ్యాటర్లకు ముప్పు ఎదురుకానుంది. అప్పుడు టీమిండియాదే సిరీస్ ఇక నాటి సిరీస్లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా.. బెంగళూరు మ్యాచ్లో భారత్ 75 పరుగులతో విజయం సాధించింది. ఇక రాంచి వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియగా.. ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ధర్మశాల మ్యాచ్లో జయకేతనం ఎగురవేయడం ద్వారా సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ -2023 నేపథ్యంలో.. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో కోచింగ్ బృందంలో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ఇప్పటికే డానియెల్ వెటోరీకి చోటు కల్పించింది. ఇలా పక్కా ప్రణాళికతో టీమిండియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Shubman Gill: శుబ్మన్తో జోడీ కలపండి ప్లీజ్! ఆ ఛాన్స్ లేదు.. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది! Joginder Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో -
గిల్, కోహ్లి, అశ్విన్ కాదు.. ఆసీస్ ఆ టీమిండియా ఆటగాడి పేరు చెబితే వణికిపోతుంది..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు ఓ టీమిండియా ఆటగాడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడట. ఆ ఆటగాడు భీకరఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్లో లేక రన్మెషీన్ విరాట్ కోహ్లినో లేక స్టార్ వెటరన్ స్పిన్నర్ అశ్వినో లేర సిరాజ్ మియానో అనుకుంటే పొరపాటు. పటిష్టమైన ఆసీస్ను అంతలా వణికిస్తున్న ఆ ఆటగాడు ఎవరంటే..? ఇటీవలే పెళ్లి చేసుకున్న స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఈ విషయాన్ని ప్రముఖ ఆసీస్ పత్రిక మార్నింగ్ హెరాల్డ్ ఓ నివేదికలో పేర్కొంది. భారత పిచ్లపై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న అక్షర్ పేరు వింటే ఆసీస్ బ్యాటర్లకు చెమటలు పడుతున్నాయట. ఇందుకు కారణం అతను ఇటీవలికాలంలో స్వదేశంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన తీరు. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్లను గతంలోనే పలు మార్లు ఎదుర్కొన్న ఆసీస్ బ్యాటర్లకు వీరి బౌలింగ్పై ఓ అవగాహణ ఉంది. అయితే అక్షర్ను ఇంత వరకు సుదీర్ఘ ఫార్మాట్లో ఎదుర్కొని ఆసీస్ బ్యాటర్లు.. ఇతని నుంచే తమకు ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే స్పిన్ ట్రాక్లపై కఠోర సాధనతో పాటు అక్షర్ పటేల్ గతంలో బౌలింగ్ చేసిన వీడియోలు తెప్పించుకుని మరీ వీక్షిస్తున్నాట. స్పిన్ను అనుకూలించే ఉపఖండపు పిచ్లపై అక్షర్ ప్రదర్శన చూసి తాము భయపడుతున్నది నిజమేనని వారంగీకరించినట్లు సమాచారం. అసలే సుదీర్ఘకాలంగా భారత్లో టెస్ట్ సిరీస్ గెలవలేదన్న అపవాదు మోస్తున్న ఆ జట్టుకు తాజాగా అక్షర్ భయం పట్టుకుందట. 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ భారత్లో పర్యటించినప్పుడు అక్షర్ 3 మ్యాచ్ల సిరీస్లో ఏకంగా 27 వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఈ సిరీస్కు సంబంధించిన వీడియోలను ఆసీస్ బ్యాటర్లు అధికంగా చూస్తున్నారట. కాగా, ఇంగ్లండ్ సిరీస్ ద్వారానే టెస్ట్ అరంగేట్రం చేసిన అక్షర్..ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 8 మ్యాచ్లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన ఐదుసార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి ఉంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
Axar Patel Wedding : టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి ఫొటోలు
-
న్యూట్రీషనిష్టుతో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పెళ్లి.. వీడియో వైరల్
Axar Patel- Meha Patel Wedding: టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్ను వివాహమాడాడు. వడోదరలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మెహాతో ఏడడుగులు నడిచాడు. గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి నేపథ్యంలో సెలవు తీసుకున్న అక్షర్ పటేల్ న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఆల్రౌండర్గా సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. మెహాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అక్షర్ పటేల్ గతేడాది తన పుట్టినరోజున ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు మెహాను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కాగా మెహా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లికి అక్షర్ స్నేహితుడు, క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ కుటుంబంతో హాజరయ్యాడు. ఇదిలా ఉంటే టీమిండియా మరో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జనవరి 23న బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడిన విషయం తెలిసిందే. మూడు రోజుల(జనవరి 26) తర్వాత అక్షర్ కూడా ఈవిధంగా శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. Axar Patel married to me, took seven rounds with his meha in Vadodara... #axarpatel #mehapatel pic.twitter.com/yimPDvfUaD — Meha Patel (@Meha_Patela) January 27, 2023 Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k — Meha Patel (@Meha_Patela) January 26, 2023 -
పెళ్లి పీటలెక్కనున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్.. అమ్మాయి ఎవరంటే?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అక్షర్ తన ప్రియురాలైన మేహా పటేల్ను ఈ నెలలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్కు దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా గత కొంత కాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. గతేడాది అక్షర్ పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మేహా పటేల్ వృత్తిపరంగా ఒక న్యూట్రిషనిస్ట్. మరోవైపు భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తన ప్రేయసి అతియా శెట్టిని రాహుల్ జనవరి 23న వివాహం ఆడనున్నాడు. ఈ క్రమంలో రాహుల్ కూడా న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్ -
వారెవ్వా అక్షర్! గాల్లోకి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో.. కరుణరత్నే పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం అక్షర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3 — BCCI (@BCCI) January 12, 2023 చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ -
Ind Vs SL: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్ పటేల్!
India vs Sri Lanka, 2nd T20I - Rahul Tripathi: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కల 31 ఏళ్ల వయసులో నెరవేరింది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్... గురువారం నాటి రెండో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. గత కొన్నాళ్లుగా వివిధ సిరీస్లకు ఎంపికైనప్పటికీ పుణె వేదికగా లంకతో జరిగిన మ్యాచ్లో తుది జట్టులో అతడు చోటు దక్కించుకోగలిగాడు. సంజూ శాంసన్ మోకాలి గాయంతో దూరం కావడంతో త్రిపాఠి అరంగేట్రానికి లైన్ క్లియర్ అయింది. Congratulations to Rahul Tripathi who is all set to make his T20I debut for #TeamIndia 🇮🇳👏#INDvSL @mastercardindia pic.twitter.com/VX1y83nOsD — BCCI (@BCCI) January 5, 2023 విఫలమైన త్రిపాఠి అయితే, ఈ మ్యాచ్లో భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన వేళ వన్డౌన్ బ్యాటర్గా త్రిపాఠి ఎంట్రీ ఇచ్చాడు. ఎదుర్కొన్న రెండో బంతినే ఫోర్గా మలిచిన అతడు.. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే తీసి పెవిలియన్ చేరాడు. దిల్షాన్ మధుషంక బౌలింగ్లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్కు సులువైన క్యాచ్ ఇచ్చి 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అతడి ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. అద్భుత క్యాచ్ ఇదిలా ఉంటే.. అరంగేట్ర మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి అందుకున్న క్యాచ్ మ్యాచ్ హైలైట్స్లో ఒకటిగా నిలిచింది. లంక ఇన్నింగ్స్లో 12వ ఓవర్ వేసిన టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. ఓపెనర్ పాతుమ్ నిసాంకకు షార్ట్బాల్ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న నిసాంక డీప్ మిడ్వికెట్ మీదుగా షాట్ బాదాడు. దీంతో అక్కడే ఉన్న త్రిపాఠి అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి అతడు కిందపడటంతో కాస్త గందరగోళం నెలకొంది. నిశిత పరిశీలన తర్వాత ఎట్టకేలకు థర్డ్ అంపైర్ నిర్ణయం భారత్కు అనుకూలంగా రావడంతో నిసాంక నిరాశగా వెనుదిరిగాడు. అయితే, క్యాచ్ పట్టిన తర్వాత త్రిపాఠి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంతిని చేతిలో పట్టుకుని.. సిక్సర్ సిగ్నల్ చూపిస్తూ అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు. అవుటా? సిక్సరా? ఏంటిది? దీంతో కాస్త తికమకపడ్డ బౌలర్ అక్షర్.. త్రిపాఠిని అనుకరిస్తూ.. ‘సిక్స్ అంటున్నాడేంటి’’ అన్నట్లుగా నవ్వుతూ సహచరులకు సైగ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘హే రాహుల్.. భయపెట్టావు. అసలే అది అవుటో కాదో అని కంగారు పడుతుంటే.. నువ్వేమో సిక్సర్ అన్నావు. ఏదేమైనా తొలి మ్యాచ్లో మంచి క్యాచ్ అందుకున్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో భాంగ్రా స్టెప్తో త్రిపాఠి సెలబ్రేట్ చేసుకుంటూ ఇటు బౌలర్.. అటు అంపైర్ను కన్ఫ్యూజ్ చేశాడని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఓడిన టీమిండియా 1-1తో సిరీస్ సమం కావడంతో మూడో టీ20లో చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. కాగా రెండో టీ20లో 2 వికెట్లు తీయడం సమా 65 పరుగులతో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. చదవండి: Ind Vs SL: చెత్త బౌలింగ్తో విమర్శల పాలు; ‘నెట్స్లో నేను సిక్స్లు బాదడం చూసే ఉంటారు!’ IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi Signalling SIX after Taking a Catch 😂#INDvsSL #RahulTripathi #IndianCricketTeam pic.twitter.com/lN6x43rnNe — Tanay (@tanay_chawda1) January 5, 2023 #RahulTripathi 🔥 debut #IndianCricketTeam #INDvsSL #INDvSL #UmranMalik #HardikPandya #Cricket pic.twitter.com/JeYJDiFLh7 — Indresh kumar 🇮🇳 (@TheIndresh_IND) January 5, 2023 -
Ind Vs SL: చెత్త బౌలింగ్..! ‘నెట్స్లో నేను సిక్స్లు బాదడం చూసే ఉంటారు!’
India vs Sri Lanka, 2nd T20I: శివం మావి... శ్రీలంకతో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఈ యువ పేసర్ అరంగేట్రంలోనే 4 వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. కానీ... ఆ తర్వాతి మ్యాచ్లోనే సీన్ రివర్స్ అయింది. లంకతో పుణె వేదికగా జరిగిన రెండో టీ20లో మావి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అతడు ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. అయితే, అదే సమయంలో తన బ్యాటింగ్ స్కిల్స్తో ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ.. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో మెరుపులు అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య అవుట్ కావడంతో క్రీజులోకి శివం మావి వచ్చాడు. అప్పటికే జోరు మీదున్న అక్షర్కు స్ట్రైక్ రొటేట్ చేసి నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండిపోతాడేమో అనుకుంటున్న తరుణంలో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హుడా, మావి, చహల్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. మధుషంక బౌలింగ్లో 18వ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్లో వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో.. శివం మావి మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. నెట్స్లో నేను కొట్టే సిక్స్లు చూసే ఉంటారు! బీసీసీఐ టీవీ గత ఇంటర్వ్యూలో శివం మావి మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా బ్యాటింగ్పై దృష్టి సారించాను. నెట్స్లో నేను కొట్టే సిక్స్లు చూసే ఉంటారు. నా ఫీల్డింగ్ బాగుంది. బౌలింగ్ కూడా బాగానే చేస్తున్నా. అందుకే బ్యాటింగ్పై ఫోకస్ చేసి ఇంకాస్త మెరుగుపడితే బాగుంటుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ శివం మావి ఆల్రౌండ్ ప్రతిభతో మెరుస్తూంటాడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ మావిని ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా సారథ్యంలో మావి అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇక లంకతో రెండో టీ20లో టీమిండియా 16 పరుగులతో ఓడగా సిరీస్ 1-1తో సమమైంది. చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ IND Vs SL 2nd T20: అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ గవాస్కర్ -
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్
పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు. యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు. కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్ వేదికగా జరుగనుంది. -
IND VS SL: రికార్డులతో పాటు అందరి మనసులను కొల్లగొట్టిన అక్షర్ పటేల్
Axar Patel: పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. లంక నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల ఈ సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్ వేదికగా జరుగనుంది. కాగా, ఈ మ్యాచ్లో ఏడో స్థానంలో బరిలోకి దిగి అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన అక్షర్ పటేల్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఓటమి ఖాయం అనుకున్న దశలో బరిలో దిగిన ఈ గుజరాత్ ఆల్రౌండర్.. పోరాడితే పోయేదేమీ లేదన్న రీతిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడి, వారి చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. సూర్యకుమార్ అండతో పేట్రేగిపోయిన అక్షర్ కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్ధి వెన్నులో వణుకు పుట్టించాడు. కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ జట్టును గెలిపించలేనప్పటికీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. ఈ క్రమంలో అక్షర్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక పరుగులు (65) చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రవీంద్ర జడేజా (44 నాటౌట్) పేరిట ఉండేది. అలాగే ఈ మ్యాచ్లో అక్షర్ బాదిన అర్ధసెంచరీ టీమిండియా తరఫున ఐదో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా (20 బంతుల్లో) రికార్డుల్లోకెక్కింది. దీంతో పాటు భారత్ తరఫున ఏడు అంతకంటే తక్కువ స్థానాల్లో బరిలోకి దిగి అత్యధిక సిక్సర్లు (6) బాదిన రికార్డును కూడా అక్షర్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దినేశ్ కార్తీక్ పేరిట ఉండేది. డీకే ఏడో స్థానంలో బరిలోకి దిగి 4 సిక్సర్లు బాదాడు. -
IND vs SL: రెండో టీ20.. ఉత్కంఠపోరులో శ్రీలంక విజయం (ఫొటోలు)
-
Axar Patel: లంక వెన్నులో వణుకు పుట్టించాడు
శ్రీలంకతో జరిగిన రెండో టి20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఓడినా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తన బ్యాటింగ్తో లంక వెన్నులో వణుకు పుట్టించాడు. ఆల్రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్తో మెరిశాడు అక్షర్ పటేల్. ఒక దశలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన టీమిండియాను సూర్యకుమార్తో కలిసి అక్షర్ ఇన్నింగ్స్ ఆడిన విధానం మ్యాచ్కే హైలైట్ అని చెప్పొచ్చు. కళ్లముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా సూర్యకుమార్ అండతో అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ నుంచి తప్పించుకున్న అక్షర్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. మొదట తీక్షణ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సిక్స్, ఫోర్ సహా 12 పరుగులు రాబట్టిన అక్షర్ పటేల్ ఆ తర్వాత 14వ ఓవర్ వేసిన హసరంగాకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదగా.. సూర్య మరో సిక్సర్తో చెలరేగడంతో మొత్తంగా 26 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే కరుణరత్నే బౌలింగ్లో మరో సిక్సర్ బాదిన అక్షర్ పటేల్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. టీమిండియా తరపున ఏడో నెంబర్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్గా అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. ఇంతవరకు జడేజా పేరిట ఆ రికార్డు ఉంది. 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో జడేజా 23 బంతుల్లో 44 నాటౌట్ ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అక్షర్ పటేల్ దానిని బద్దలుకొట్టాడు. దీంతో పాటు మరో రికార్డు కూడా అక్షర్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున ఒక టి20 మ్యాచ్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అర్థసెంచరీ బాదిన తొలి బ్యాటర్గా అక్షర్ పటేల్ రికార్డులకెక్కాడు. మొత్తానికి జడేజా లేని లోటును తీరుస్తున్న అక్షర్పటేల్ అంతకముందు బౌలింగ్లోనూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉంటే మాత్రం అక్షర్ పటేల్ పేరు మారుమోగిపోయేది. ఇప్పుడు కూడా అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ను తీసిపారేయాల్సిన అవసరం లేదు. బహుశా ఈ ఇన్నింగ్స్ అతనికి మరో 10 మ్యాచ్ల వరకు జట్టు నుంచి పక్కనబెట్టకుండా చేసిందని చెప్పొచ్చు. -
అక్షర్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన టీమిండియా
పుణే: భారత్ విజయలక్ష్యం 207 పరుగులు... ఒక దశలో స్కోరు 57/5... మిగిలిన 65 బంతుల్లో మరో 150 పరుగులు చేయాలి...భారీ ఓటమి ఖాయమనిపించింది...అయితే ఈ దశలో అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అనూహ్యంగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్కు ముందు ఒకే ఒక్కసారి 30కి పైగా పరుగులు (గత మ్యాచ్లోనే) చేసిన అతను ఈ సారి విధ్వంస ప్రదర్శనతో చెలరేగిపోయాడు. మరో వైపునుంచి సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో భారత్ గెలుపు ఆశలు పెరిగాయి. వీరిద్దరు 40 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. అయితే 26 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య వెనుదిరగడంతో ఛేదన కష్టంగా మారిపోగా... అక్షర్ ఆఖరి ఓవర్ మూడో బంతికి అవుట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచి శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (22 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (31 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడింది. మెరిపించిన మెండిస్ ఓపెనర్లు కుశాల్ మెండిస్, నిసాంక లంక ఇన్నింగ్స్ను వేగంగా నడిపించారు. 27 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించిన మెండిస్ను చహల్ అవుట్ చేశాడు. అసలంక (19 బంతుల్లో 37; 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝళిపించాడు. 17వ ఓవర్ ముగిసేసరికి కూడా షనక (7 బంతుల్లో 6) పది పరుగులైనా చేయలేదు. కానీ ఆఖరి మూడు ఓవర్లలో అతను విధ్వంసం సృష్టించాడు. అర్ధ సెంచరీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) సాధించి లంక తరఫున టి20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్గా షనక రికార్డులకెక్కాడు. చెత్త బౌలింగ్ లంక 200 పైచిలుకు స్కోరులో భారత బౌలర్లు శివమ్ మావి (0/53), ఉమ్రాన్ (3/48) ఇద్దరే 101 పరుగులు సమరి్పంచుకోవడం విశేషం. అర్‡్షదీప్ కేవలం 2 ఓవర్ల స్పెల్ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. ఏకంగా 5 నోబాల్స్ వేయడం కూడా లంక భారీ స్కోరుకు అవకాశమిచి్చంది. దీంతో పాటు మరో 2 నోబాల్స్ కలిపి మొత్తం ‘7 నోబాల్’లు చివరకు భారత్ ఓటమిలో కీలకంగా నిలిచాయి. టాపార్డర్ విఫలం... భారత్ ముందు కొండంత లక్ష్యం వుంటే టాపార్డర్ 21 పరుగులకే డగౌట్ చేరింది. ఇషాన్ (2), గిల్ (5), త్రిపాఠి (5) చెత్త షాట్లతో అవుటయ్యారు. కెప్టెన్ పాండ్యా (12; 1 ఫోర్, 1 సిక్స్) పవర్ప్లేలోనే వెనుదిరిగాడు. కాసేపటికి దీపక్ హుడా (9) అవుట్ కావడంతో 57 పరుగులకే సగం వికెట్లు కూలాయి. ఆశలు రేపిన అక్షర్ సిక్సర్లు... పదో ఓవర్లో అక్షర్ వచ్చీ రాగానే హసరంగ ఓవర్లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కరుణరత్నే బౌలింగ్లో బౌండరీ కొట్టిన అక్షర్ 13వ ఓవర్ వేసిన తీక్షణ బౌలింగ్లో బౌండరీ, భారీ సిక్సర్ బాదాడు. దీంతో లంక కెపె్టన్ తమ స్టార్ స్పిన్నర్ హసరంగను దించితే అక్షర్ చుక్కలు చూపించాడు. స్వీప్, స్లాగ్స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో ‘హ్యాట్రిక్’ సిక్సర్లు బాదాడు. తర్వాత పరుగు తీసివ్వగా, సూర్యకుమార్ ఐదో బంతిని ఎక్స్ట్రా కవర్ దిశగా సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. తర్వాత కరుణరత్నేకు ఇద్దరు సిక్సర్లతో తమ ధాటిని చూపెట్టారు. 20 బంతుల్లోనే అక్షర్ (2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ కూడా భారీ సిక్సర్తో (33 బంతుల్లో; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీని అధిగమించాడు. శివమ్ మావి (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) త్రిపాఠి (బి) అక్షర్ 33; కుశాల్ (ఎల్బీ) (బి) చహల్ 52; రాజపక్స (బి) ఉమ్రాన్ 2; అసలంక (సి) శుబ్మన్ (బి) ఉమ్రాన్ 37; ధనంజయ (సి) హుడా (బి) అక్షర్ 3; షనక నాటౌట్ 56; హసరంగ (బి) ఉమ్రాన్ 0; కరుణరత్నే నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–80, 2–83, 3–96, 4–110, 5–138, 6–138. బౌలింగ్: హార్దిక్ 2–0–13–0, అర్ష్దీప్ 2–0–37–0, శివమ్ మావి 4–0–53–0, అక్షర్ 4–0–24–2, చహల్ 4–0–30–1, ఉమ్రాన్ 4–0–48–3. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (బి) రజిత 2; గిల్ (సి) తీక్షణ (బి) రజిత 5; త్రిపాఠి (సి) మెండిస్ (బి) మదుషంక 5; సూర్యకుమార్ (సి) హసరంగ (బి) మదుషంక 51; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 12; హుడా (సి) ధనంజయ (బి) హసరంగ 9; అక్షర్ (సి) కరుణరత్నే (బి) షనక 65; మావి (సి) తీక్షణ (బి) షనక 26; ఉమ్రాన్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–12, 2–21, 3–21, 4–34, 5–57, 6–148, 7–189, 8–190. బౌలింగ్: మదుషంక 4–0–45–2, రజిత 4–0–22–2, కరుణరత్నే 4–0–41–1, హసరంగ 3–0–41–1, తీక్షణ 4–0–33–0, షనక 1–0–4–2. -
Ind VS SL: ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే అలా చేశా: పాండ్యా
India vs Sri Lanka, 1st T20I - Hardik Pandya- Axar Patel: ‘‘ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినా ఫర్వాలేదనుకున్నా. కీలక మ్యాచ్లు, టోర్నీల్లో రాణించాలంటే జట్టును ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకతప్పదు. ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియా మెరుగ్గా ఆడుతోంది. అందుకే ఈరోజు ఇలాంటి సవాలును స్వీకరించేందుకు జట్టును సిద్ధం చేశాను. నిజం చెప్పాలంటే.. ఈరోజు యువ ఆటగాళ్లంతా కలిసి కఠిన పరిస్థితులను అధిగమించి జట్టును ఓటమి గండం నుంచి గట్టెక్కించారు’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్లో ఘన విజయంతో కొత్త ఏడాదిని ఆరంభించాలనుకున్న భారత జట్టు గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది. వాళ్లే గెలిపించారు అయితే, తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న యువ జట్టు.. ఆసియా చాంపియన్ లంకను ఓడించగలిగింది. బ్యాటింగ్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్ రాణించగా.. బౌలింగ్ విభాగంలో అరంగేట్ర బౌలర్ శివం మావికి తోడు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించారు. అందుకే ఆఖరి ఓవర్లో అక్షర్ చేతికి బంతి ఇదిలా ఉంటే, ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగుల అవసరమైన తరుణంలో పాండ్యా బౌలింగ్ చేస్తాడనుకుంటే.. అనూహ్యంగా బంతిని అక్షర్ చేతికి ఇచ్చాడు. ఈ క్రమంలో సారథి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్షర్ ఆరంభంలో కాస్త తడబడ్డా తన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగాడు. ఈ ఓవర్లో అతడు నమోదు చేసిన గణాంకాలు వరుసగా వైడ్, 1, 0, 6, 0, వికెట్, వికెట్. దీంతో రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్కు ఇవ్వడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కఠిన పరిస్థితులను జయిస్తేనే.. మెగా టోర్నీల్లో రాణించగలమనే తన ఆలోచనను ఈ మ్యాచ్ సందర్భంగా అమలు చేసినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్ను కూడా! Surprised to see Axar bowling the final over? Here's Captain @hardikpandya7 revealing the reason behind the move. #INDvSL #TeamIndia @mastercardindia pic.twitter.com/dewHMr93Yi — BCCI (@BCCI) January 3, 2023 -
దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్ హుడా(41), ఇషాన్ కిషన్(37), అక్షర్ పటేల్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్ పటేల్ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(7) కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? -
Ind Vs Ban: అదరగొట్టిన అక్షర్ పటేల్... పుజారా, గిల్ సైతం..
ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో అక్షర్ 20 స్థానాలు పురోగతి సాధించి 18వ స్థానానికి చేరుకున్నాడు. కాగా బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ ప్రస్తుతం 650 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. కుల్దీప్ సైతం మరోవైపు.. ఈ టెస్టులో రాణించిన మరో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 19 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్లో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ ఖాతాలో ప్రస్తుతం 455 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్లో, అశ్విన్ ఐదో ర్యాంక్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. అదరగొట్టిన పుజారా, గిల్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో ఛతేశ్వర్ పుజారా, శుబ్మన్ గిల్ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్ల్లో నిలిచారు. బంగ్లాతో మొదటి టెస్టు సందర్భంగా గిల్ సెంచరీ చేయగా... పుజారా సైతం అజేయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జాబితాలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాపర్గా ఉన్నాడు. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కెప్టెన్గా విఫలమైనా బ్యాటర్గా ఆకట్టుకున్న బాబర్ ఆజం కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. చదవండి: ENG vs PAK: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్పై వేటు! బాబర్ కూడా.. Lionel Messi FIFA Winning Photo: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ! -
బంగ్లాతో రెండో టెస్ట్.. భారీ రికార్డులపై కన్నేసిన పుజారా, అక్షర్
IND VS BAN 2nd Test: మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును ఊడ్చేయాలని భావిస్తుంది. బంగ్లాను క్లీన్స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ను చాలా సీరియస్గా తీసుకోనుంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ నవ్దీప్ సైనీ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండరని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ను సైతం గాయాల బెడద వేధిస్తుంది. వారి కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లా తుది జట్లు కూర్పు ఎలా ఉన్నా.. రాహుల్ సేన మాత్రం ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్కు ముందు టీమిండియా కీలక ఆటగాళ్లను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. తొలి టెస్ట్లో అదరగొట్టిన చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ భారీ మైల్స్టోన్స్పై కన్నేశారు. రెండో టెస్ట్లో నయా వాల్ పుజారా మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్గా, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. పుజారా ఇప్పటి వరకు 97 టెస్ట్ల్లో 44.43 సగటున 6984 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్ట్లో అక్షర్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్.. 9 టెస్ట్ల్లో ఈ ఘనత సాధించగా.. అక్షర్కు 8వ టెస్ట్లోనే అశ్విన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఖాతాలో 44 వికెట్లు (7 టెస్ట్ల్లో 13 సగటున) ఉన్నాయి. పుజారా, అక్షర్లతో పాటు ఇదే మ్యాచ్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టినా.. బుమ్రా పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమిస్తాడు. ఈ ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి 39 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా కొనసాగుతుండగా.. అన్నే వికెట్లు పడగొట్టిన సిరాజ్ బంగ్లాతో రెండో టెస్ట్లో మరో వికెట్ పడగొడితే బుమ్రా రికార్డును బద్దలు కొడతాడు. -
బంగ్లాతో తొలి టెస్ట్.. విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా
IND VS BAN 1st Test Day 4: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 513 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసి, విజయానికి 241 పరుగుల దూరంలో ఉంది. ఓపెనర్ జకీర్ హసన్ (100) సెంచరీతో కదం తొక్కగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ షాంటె (67) అర్ధసెంచరీతో రాణించాడు. యాసిర్ అలీ (5), లిటన్ దాస్ (19), ముష్ఫికర్ రహీం (23), నురుల్ హసన్ (3) నిరాశ పరిచారు. ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో రాణించగా.. ఉమేశ్, అశ్విన్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (110), పుజారా (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకే ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే. -
అందుకే కుల్దీప్ స్థానంలో ఉమ్రాన్ను ఆడిస్తున్నాం: రోహిత్ శర్మ
Ind Vs Ban 2nd ODI Playing XI: బంగ్లాదేశ్లో పర్యటనలో భాగంగా అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్ కుల్దీప్ సేన్ రెండో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కశ్మీర్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు యువ పేసర్ కుల్దీప్ సేన్. ఢాకా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ మధ్యప్రదేశ్ బౌలర్.. 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లతో పోలిస్తే పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మద్ను తప్పించి అక్షర్కు స్థానం ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్లో పోటీలో నిలవాలంటే బుధవారం నాటి మ్యాచ్లో రోహిత్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కుల్దీప్ సెలక్షన్కు అందుబాటులో లేడని.. అందుకే అతడి స్థానాన్ని ఉమ్రాన్తో భర్తీ చేసినట్లు పేర్కొన్నాడు. కారణమిదే! మొదటి వన్డే సందర్భంగా వెన్నునొప్పితో కుల్దీప్ సేన్ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో అతడు సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ప్రకటన విడుదల చేసింది. బంగ్లాతో రెండే వన్డే- భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ A look at our Playing XI for the 2nd ODI. Kuldeep Sen complained of back stiffness following the first ODI on Sunday. The BCCI Medical Team assessed him and has advised him rest. He was not available for selection for the 2nd ODI.#BANvIND pic.twitter.com/XhQxlQ6aMZ — BCCI (@BCCI) December 7, 2022 -
Ind Vs Ban: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్దే
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI Updates: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్దే బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. బారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. గాయం కారణంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరిలో బ్యాటింగ్కు వచ్చి పోరాడనప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్స్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్ రెండు, ముస్తిఫిజర్, మహ్మదుల్లా తలా వికెట్ సాధించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 213 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్(20), సిరాజ్ ఉన్నారు. 46 ఓవర్ వేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్లో రెండు సిక్స్లు, ఫోర్ సాయంతో 16 పరుగలు రాబట్టాడు. గాయంతో రోహిత్ బాధపడుతన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. భారత విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 189 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ వికెట్ను భారత్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన అయ్యర్.. మెహదీ హసన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. భారత విజయానికి 90 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. అయ్యర్ హాఫ్ సెంచరీ ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం పోరాడతున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని కూడా అయ్యర్ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(50), అక్షర్ పటేల్(21) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రాహుల్.. మెహదీ హసన్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(11), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్:34/2 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(12), వాషింగ్టన్ సుందర్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 13 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ధావన్.. ముస్తిఫిజర్ రెహ్మన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. భారత్కు బిగ్ షాక్.. విరాట్ కోహ్లి ఔట్ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లి వికెట్ను భారత్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోహ్లి ఎబాదత్ హోస్సేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రాణించిన మిరాజ్, మహ్మదుల్లా టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ ఆదుకున్నారు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ 4పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్కు రెండు, సుందర్కు మూడు, ఉమ్రాన్కు రెండు వికెట్లు దక్కాయి. ఏడో వికెట్ డౌన్ 46.1: చాలా సమయం తర్వాత భారత్కు వికెట్ లభించింది. అద్బుత ంగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ జోడీని ఉమ్రాన్ మాలిక్ విడదీశాడు. ఉమ్రాన్ బౌలింగ్లో మహ్మదుల్లా(77) రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. నాసూమ్ అహ్మద్, మిరాజ్ క్రీజులో ఉన్నారు. బంగ్లా స్కోరు: 231/7 (47) మెరిసిన మహ్మదుల్లా మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు- 178-6 మిరాజ్ అర్ధ శతకం రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్ మిరాజ్ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా మహ్మదుల్లా(46) రాణిస్తున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో 39 ఓవర్లలో బంగ్లా 167 పరుగులు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లను మార్చినా ఏ ఒక్కరు కూడా ఈ జోడీని విడదీయలేకపోతున్నారు. నిలకడగా మిరాజ్ మిరాజ్ నిలకడగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మహ్మదుల్లా(35)తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు. 35 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు-149/6 30 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 124/6 మహ్మదుల్లా 26, మిరాజ్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి వన్డేలో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మిరాజ్.. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా 21, మిరాజ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎట్టకేలకు 100 పరుగుల మార్కు భారత బౌలర్ల విజృంభణతో టాప్, మిడిలార్డర్ కుదేలు కాగా.. బంగ్లా 26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టపోయి 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇప్పటి వరకు సుందర్కు మూడు, సిరాజ్కు రెండు, ఉమ్రాన్కు ఒక వికెట్ దక్కాయి. సుందర్ మ్యాజిక్! 18.6: వాషింగ్టన్ సుందర్ అద్భుతం చేశాడు. ముష్ఫికర్ను పెవిలియన్కు పంపిన మరుసటి బంతికే అఫిఫ్ హొసేన్ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 19 ఓవర్లలో బంగ్లా స్కోరు: 69-6 ఐదో వికెట్ ఢమాల్ 18.5: ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్.. ధావన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సుందర్కు ఇది రెండో వికెట్. షకీబ్ అవుట్! 16.6: భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ రెండు వికెట్లు కూల్చగా.. ఉమ్రాన్ అద్భుత బంతితో షాంటోను బౌల్డ్ చేశాడు. ఇక 17వ ఓవర్ చివరి బంతికి షకీబ్(8)ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ సైతం ఖాతా తెరిచాడు. దీంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లలో బంగ్లా స్కోరు: 66-4 మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 52 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల చేసిన షాంటోను ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్చేశాడు. వారెవ్వా సిరాజ్ బంగ్లాతో రెండో వన్డేలో భారత బౌలర్లు ఆది నుంచి కట్టడిగా బౌలింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ వికెట్.. పదో ఓవర్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ను బౌల్డ్ చేశాడు. మరోవైపు.. తన మొదటి 2 ఓవర్లలో శార్దూల్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపక్ చహర్ 3 ఓవర్లు బౌల్ చేసిన 12 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. రెండో వికెట్ డౌన్ 9.2: సిరాజ్ మరోసారి బంగ్లాను దెబ్బకొట్టాడు. కెప్టెన్ లిటన్ దాస్(7)ను బౌల్డ్ చేసి రెండో వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. షకీబ్, షాంటో క్రీజులో ఉన్నారు. ►ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 23/1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా 1.5: అనముల్ హక్ రూపంలో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో అనముల్(11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షాంటో క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ లిటన్ దాస్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 11-1 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను బంగ్లాదేశ్ టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు... బుధవారం నాటి మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. రోహిత్ సేనను ఫీల్డింగ్కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా కుల్దీప్ మొదటి వన్డేతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్- టీమిండియా ఢాకా వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా.. కచ్చితంగా గెలిచి స్వదేశంలో గత సిరీస్ ఫలితాన్ని పునరావృతం చేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు! -
సెమీస్కు ముందు టీమిండియాను వేధిస్తున్న ఆ నలుగురి సమస్య..!
నవంబర్ 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు నలుగురు ప్లేయర్ల ఫామ్ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. ఆ నలుగురిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత వరల్డ్కప్లో రోహిత్తో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్లకు వరుసగా అవకాశలు ఇచ్చినా, సామర్ధ్యం మేరకు రాణించలేక ఘోర వైఫల్యాలు చెందడం మేనేజ్మెంట్తో పాటు అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. రోహిత్ను మినహాయించి సెమీస్లో పై ముగ్గురిని తప్పించాలన్నా టీమిండియాకు ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది. ప్రపంచకప్-2022లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 89 పరుగులు (4, 53, 15, 2, 15) మాత్రమే చేసి పేలవ ఫామ్లో ఉండగా, దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్లోనూ వికెట్కీపింగ్లోనూ దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఫినిషర్ కోటాలో జట్టుకు ఎంపికైన డీకే.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోగా, బ్యాటింగ్ ఓనమాలు కూడా మరిచి వరుస వైఫల్యాల బాటపట్టాడు. వరల్డ్కప్లో అతనాడిన 4 మ్యాచ్ల్లో కేవలం 14 పరుగులు (1, 6, 7), 4 క్యాచ్లు మాత్రమే అందుకుని అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో సెమీస్లో డీకేకు తిప్పించి పంత్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ల విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. ఆల్రౌండర్ కోటాలో 4 మ్యాచ్లు ఆడే అవకాశం దక్కించుకున్న అక్షర్.. అవకాశం వచ్చినా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ (3 వికెట్లు) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో పాటు ధారళంగా పరుగులు సమర్పించుకోవడం మరింత కలవరానికి గురి చేస్తుంది. స్పిన్నర్ విషయంలో టీమిండియాకు చహల్ రూపంలో మరో చాయిస్ ఉన్నా మేనేజ్మెంట్ దాన్ని ఉపయోగించుకునేందుకు సాహసించలేకపోయింది. వీరిద్దరి వైఫల్యాలపై నజర్ వేసిన యాజమాన్యం.. స్పిన్కు అనుకూలించే అడిలైడ్ పిచ్పై (సెమీస్చ వేదిక) ఏ మేరకు మార్పులు చేస్తుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం.. స్పిన్ పిచ్ అంటున్నారు కాబట్టి అశ్విన్ను కొనసాగించి, అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇంగ్లండ్తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు. వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు!
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. టీ20 ప్రపంచకప్(సూపర్-12)లో భాగంగా బుధవారం(నవంబర్2)న ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. టీమిండియాలో మూడు మార్పులు ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు దూరమైన అక్షర్ పటేల్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో దినేష్ కార్తీక్ గాయం బారిన పడ్డాడు. దీంతో బంగ్లాదేశ్తో మ్యాచ్కు అతడి స్థానంలో పంత్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు ఆడిలైడ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి అదనపు పేసర్తో భారత్ బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ క్రమంలో అశ్విన్ స్థానంలో పేసర్ హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో ఆడిన దీపక్ హుడా బెంచ్కే పరిమితం కానున్నాడు. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? -
జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. ఇలా: ఆసీస్ కోచ్
Australia tour of India, 2022- Ind Vs Aus 3rd T20- Hyderabad: టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్తో సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాకు బలహీనతగా మారుతుందనుకుంటే.. అక్షర్ రూపంలో వారికి మంచి ప్రత్యామ్నాయం దొరికిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడింది. 2-1తో ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ జడేజా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అదరగొట్టిన అక్షర్ పటేల్.. ఆసీస్ కోచ్ ప్రశంసలు ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందుకు తగ్గట్టుగా రాణించాడు ఈ బౌలింగ్ ఆల్రౌండర్. మొదటి మ్యాచ్లో 3, రెండో మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్.. నిర్ణయాత్మక మూడో టీ20లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆండ్రూ మెక్డొనాల్డ్(PC: CA) ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అక్షర్ పటేల్పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ సిరీస్లో అక్షర్ అదరగొట్టాడు. జడ్డూ లేకుంటే భారత జట్టు బలహీనపడుతుందని భావిస్తే అక్షర్ ఆ లోటును పూడ్చాడు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని.. ప్రపంచకప్ టోర్నీలో అతడు ప్రమాదకర బ్యాటర్గా మారి సవాల్ విసరగలడని పేర్కొన్నాడు. కాగా ఆఖరి టీ20లో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Ind Vs Aus: మ్యాచ్కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్కప్ ఫైనల్ అయితే! -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
ఇప్పటికే మునిగారు.. ఇకనైనా జాగ్రత్త పడండి
ఆసియా కప్ 2022లో టీమిండియా సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా ఓడింది అంటే బౌలర్ల వైఫల్యం, ఫేలవ ఫీల్డింగ్ వల్లే అని చెప్పొచ్చు. అంతేకాదు ఆల్రౌండర్ జడేజా లేని లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పుజారా మాట్లాడాడు. ''ఆసియాకప్ టోర్నమెంట్లో టీమిండియాకు ప్రస్తుత కాంబినేషన్ సరిగ్గా పని చేయడం లేదు. జట్టుకు మరో బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకుంటునే మంచిది. లెగ్ స్పిన్తో పాటు బ్యాటింగ్లోనూ పరుగులు చేయగల సమర్థుడు.ఇప్పటికే మునిగాం.. ఇకనైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కనీసం అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో గెలిస్తే విజయంతో టోర్నీని ముగించినట్లు అవుతుంది. ఇక రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తిక్కు అవకాశం ఇవ్వాల్సిందే. బహుశా టి20 ప్రపంచకప్ తర్వాత దినేశ్ కార్తిక్ క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి జట్టులో ఉన్నప్పుడే అతనికి అవకాశాలు ఇవ్వడం సమజసం. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. పేస్ ఆల్ రౌండర్ను పూర్తి కోటా బౌలింగ్ వేసేలా అన్ని టైంలలో ప్రయోగించలేము. ఇక 6 నుంచి 15 ఓవర్ల మధ్య సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోతుంది. ఇక స్లాగ్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్ల వరకు సరైన బ్యాటర్లు లేరు. కాబట్టి దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో చాహర్ ఎంట్రీ..! -
లంకతో సమరం.. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను టీమిండియా ఆటగాళ్లు చేజేతులా జారవిడిచి ప్రత్యర్ధికి చేతికి అప్పగించారు. తొలుత బ్యాటింగ్లో అత్యుత్సాహం (పంత్, హార్ధిక్ చెత్త షాట్ సెలెక్షన్), అనంతరం బౌలింగ్ (భువీ, హార్ధిక్, చహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం), ఫీల్డింగ్లో (కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్ జారవిడచడం) అనవసర తప్పిదాలు టీమిండియా పుట్టి ముంచాయి. పాక్ చేతిలో ఈ ఊహించని పరాభవం నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సూపర్-4 దశలో తదుపరి జరిగే మ్యాచ్ల్లో వికెట్కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ చహల్లపై వేటు వేయడం ఉత్తమమని టీమిండియా యాజమాన్యాన్ని సూచిస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పంత్, చహల్లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్లను ఆడించాలని కోరుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కోటాలో ఎంపిక చేసిన పంత్.. రైట్ హ్యాండర్లా షాట్ ఆడేందుకు ప్రయత్నించి (రివర్స్ స్వీప్) వికెట్ పారేసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చహల్ సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు. వీరిద్దరిని తీసేసి డీకే, అక్షర్లకు అవకాశం ఇస్తే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! లేదంటే మనం ఇంటికే! -
ఇషాన్ కిషన్పై సీరియస్ అయిన అక్షర్ పటేల్!
హారారే వేదికగా జింబాబ్వే- టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. జింబాబ్వే ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన దీపక్ హుడా బౌలింగ్లో.. బర్ల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ఇషన్ కిషన్ వెగంగా పరిగెత్తుకుంటూ బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకున్న కిషన్ మిడ్వికెట్ దిశగా త్రో చేశాడు. ఈ క్రమంలో మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ బంతి తనకు ఎక్కడ తగులుతుందన్న భయంతో తలపై చేతులు పెట్టుకుని కింద కూర్చోని పోయాడు. అయినప్పటికీ కిషన్ విసిరిన బంతి అక్షర్కు తగిలింది. అక్షర్ వెంటనే కిషన్వైపు తిరిగి సీరీయస్గా చూశాడు. అయితే కిషన్ కూడా అక్షర్కు క్షమాపణ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు చేలరేగడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. జింబావ్వే ఇన్నింగ్స్లో షాన్ విలియమ్స్ 42 పరగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్ధీప్ యాదవ్, హుడా,ప్రసిద్ధ్ కృష్ణ తలా వికెట్ సాధించారు. pic.twitter.com/0hPz8OOg9r — Richard (@Richard10719932) August 20, 2022 చదవండి: IND vs ZIM: టీమిండియాపై జింబాబ్వే అత్యంత చెత్త రికార్డు.. -
కాబోయే భార్యతో సాగర తీరాన టీమిండియా ఆల్రౌండర్.. ఫొటోలు వైరల్
Axar Patel- Meha Photos: టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ హాలిడే మూడ్లో ఉన్నాడు. కాబోయే భార్య మెహా పటేల్తో కలిసి రొమాంటిక్ డేట్కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సాగర తీరాన బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కాబోయే భర్త అక్షర్ను హత్తుకుని ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘నువ్వు అలవి కాదు.. ఆ సముద్రంలోని భాగానివి’’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 20న అక్షర్ పటేల్- మేహా పటేల్ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్మెంట్! చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించిన అక్షర్ తన 28వ పుట్టినరోజున ఆమె వేలికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల బ్యాటింగ్తోనూ రాణిస్తున్న అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ ప్రతిభతో టీమిండియా విజయాల్లో కీలక భాగస్వామిగా మారాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండో వన్డేల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. తద్వారా కరేబియన్ గడ్డపై విండీస్ను క్లీన్స్వీప్ చేసిన జట్టుగా శిఖర్ ధావన్ సేన నిలవడంలో తన వంతు సాయం చేశాడు. అయితే, ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో అక్షర్ పటేల్కు నిరాశే ఎదురైంది. ఈ బౌలింగ్ ఆల్రౌండర్కు జట్టులో చోటు దక్కలేదు. స్టాండ్బైగా అక్షర్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. Trent Boult: న్యూజిలాండ్ క్రికెట్కు భారీ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్ View this post on Instagram A post shared by Dt.Meha patel (@meha2026) -
Asia Cup: అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు.. నేనైతే: టీమిండియా మాజీ కెప్టెన్
Asia Cup 2022- India Squad Announced: ఆసియా కప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి స్థానం లేకపోవడం పట్ల టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తానే గనుక ప్రస్తుత సెలక్టన్ టీమ్ చైర్మన్ అయి ఉంటే కచ్చితంగా షమీకి జట్టులో చోటు ఇచ్చేవాడినని ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. నలుగురు స్పిన్నర్లను తీసుకునే బదులు ఈ వెటరన్ పేసర్ను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. స్టార్ల పునరాగమనం! కాగా ఆగష్టు 27న ఆరంభం కానున్న ఆసియా కప్-2022 ఈవెంట్ నేపథ్యంలో బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా.. ఇన్నాళ్లు గాయంతో దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పునరాగమనం చేశాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి సహా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజకు కూడా చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా భువనేశ్వర్ కుమార్ సహా యువ ఫాస్ట్ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లు జట్టులో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కచ్చితంగా అతడికి జట్టులో స్థానం ఉండేది! ఈ మేరకు.. ‘‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటు ఉంటుంది. నేను గనుక ఇప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండి ఉంటే అతడిని ఎంపిక చేసేవాడిని. రవి బిష్ణోయిని పక్కన పెట్టి షమీకి చోటిచ్చేవాడిని. నిజానికి అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండాల్సింది. అయితే, అశ్విన్- అక్షర్ పటేల్లలో ఎవరంటే సీనియర్కే నా ఓటు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ(PC: BCCI) ఏదేమైనా జట్టు ఎంపిక బాగానే ఉందని.. ఇది టీ20 వరల్డ్కప్-2022 టోర్నీకి బ్లూ ప్రింట్ లాంటిదని చిక్కా అభిప్రాయపడ్డాడు. కేవలం అక్షర్ పటేల్ విషయంలోనే తాను చింతిస్తున్నానన్న శ్రీకాంత్... ఆస్ట్రేలియా పిచ్లపై రాణించగల ఈ బౌలింగ్ ఆల్రౌండర్కు ప్రపంచకప్ జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీపక్ హుడా సైతం బ్యాట్, బాల్తో రాణించగలడని.. అందుకే జట్టులో స్థానం దక్కిందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు అలా.. ఐపీఎల్-2022లో ఇలా! గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో మహ్మద్ షమీ.. ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు ఆడిన షమీ.. అరంగేట్ర సీజన్లోనే జట్టు విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున అతడికి పొట్టి ఫార్మాట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఈవెంట్కు షమీ ఎంపిక కాకపోవడం గమనార్హం. ఆసియా కప్-2022కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో.. CWG 2022: కోవిడ్ అని తేలినా టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ ఆల్రౌండర్ -
అక్షర్ పటేల్ రికార్డు బద్దలు కొట్టి.. నరేంద్ర హిర్వానికి చేరువై..!
పాక్తో జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ కెరీర్లో తొలి మూడు మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ లెగ్ స్పిన్ బౌలర్ నరేంద్ర హిర్వాని (31 వికెట్లు, తొలి టెస్ట్లోనే విండీస్పై 16 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ప్రభాత్ (29) ఆస్ట్రేలియా మాజీ బౌలర్ చార్లెస్ టర్నర్ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. Most wickets after three Tests in career:31 - Narendra Hirwani (Ind)29 - PRABATH JAYASURIYA* (SL)29 - Charles Turner (Aus)27- Axar Patel (Ind)27 - Rodney Hogg (Aus)#SLvsPAK pic.twitter.com/tubvpRY9mF— Lalith Kalidas (@lal__kal) July 28, 2022 ఈ క్రమంలో ప్రభాత్.. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (27) రికార్డును కూడా అధిగమించాడు. పాక్తో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాత్.. మరో రికార్డను కూడా సంయుక్తంగా షేర్ చేసుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్ల్లో నాలుగు 5 వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్గా అక్షర్ పటేల్తో సమంగా నిలిచాడు. 4th 5 wicket haul in 6 innings for Prabath Jayasuriya. Amazing performance so far.Very similar to how Axar Patel started out for India. He too had 4 5-wkt hauls in his first 6 innings.— Gurkirat Singh Gill (@gurkiratsgill) July 28, 2022 అరంగేట్రం టెస్ట్లో 12 వికెట్లు (6/118, 6/59) నేలకూల్చి లంక తరఫున డెబ్యూ మ్యాచ్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు నెలకొల్పిన ప్రభాత్.. ఆ తర్వాత పాక్తో జరిగిన తొలి టెస్ట్లో 9 వికెట్లు (5/82, 4/135), తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో తన జట్టును రెండు సార్లు గెలిపించిన ప్రభాత్.. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ బ్యాటర్లందరినీ (రూట్ మినహా) ఔట్ చేశాడు. Sri Lanka's Prabath Jayasuriya has now dismissed:No. 2 ranked Test Batter Marnus Labuschagne, twice.No.3 ranked Test Batter Babar Azam twice, that too in his first 5 bowling inns. No. 4 ranked Test Batter Steve Smith, once. (for a duck) #SLvPAK #GalleTest #BabarAzam pic.twitter.com/z5kQYinLtg— Haseeb Khan 🇵🇰 (@HaseebkhanHk7) July 28, 2022 వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ లబూషేన్ను రెండుసార్లు, నంబర్ 3 ఆటగాడు బాబర్ ఆజమ్ను రెండుసార్లు, స్టీవ్ స్మిత్ను ఒక్కసారి (డకౌట్) పెవిలియన్కు పంపాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. వికెట్లు సాధించడంతో పాటు జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషిస్తూ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్గా మారాడు. Prabath Jayasuriya in Test cricket:6 for 118 vs Australia.6 for 59 vs Australia.5 for 82 vs Pakistan.4 for 135 vs Pakistan.3 for 80 vs Pakistan.5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn— Johns. (@CricCrazyJohns) July 28, 2022 చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్ను మట్టికరిపించిన లంకేయులు