Department of Agriculture
-
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
చేతులు కాలినా విధానాలు మారవా?
పంజాబ్ రైతులు పత్తిలో భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2 రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి గ్లైఫోసేట్)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్ ప్రాజెక్ట్లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).గతంలోనూ ఇలాగే చెప్పారు!రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది. పంజాబ్ రైతులు భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్గార్డ్ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్ అని భావించాలి. ఇంతకుముందు మోన్ శాంటోను కొనుగోలు చేసిన బేయర్ కంపెనీ వెబ్సైట్లో, బోల్గార్డ్–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్ లతో మీ పత్తి మొక్కలను బోల్వార్మ్ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్నోట్లలో పెట్టేశారు. ‘నేచర్ ప్లాంట్స్ జర్నల్’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్ పూర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన గ్లెన్ డేవిస్ స్టోన్ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్ పుట్ల పెరుగుదల కారణంగా జరిగిందే.పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్మ్యాప్ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్ దిగ్గజం బేయర్తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.జంట వ్యూహంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్ అయిన భారత్ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). ఇథనాల్ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా కలెక్టివ్ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లోని ఒక ప్రొఫె సర్కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు! వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
50 లక్షల టన్నుల సన్నాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’ రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్– 15048, హెచ్ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు. బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన సన్నాల సాగు..సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. -
‘ఫసల్ బీమా’లో కొత్త పద్ధతి!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు. బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. » ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
పత్తి కాదు..వరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది. సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. వరి వైపు రైతుల మొగ్గు రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది. తాజా సీజన్లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తగ్గిన పప్పు ధాన్యాల సాగు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. -
6 లక్షల ఎకరాల్లో పంట నష్టం?
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి నల్లగొండ/సాక్షి మహబూబాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగగా, అందులో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి 4.15 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటికి పంట నష్టం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, ములుగు తదితర జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే పొలాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు అంచనాలను వేగవంతం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయో పరిశీలిస్తున్నారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో బీమా ఇక అనుమానమే? పంట నష్టం జరిగినప్పుడు బీమా రైతులకు ధీమా ఇస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూ డా అనుమతి లభించింది. అనంతరం ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు. అయినా మార్గదర్శకాలు విడుదల చే యడంలోనూ... అమలు చేయడంలో వ్యవసాయశాఖ విఫల మైంది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందునుంచే వ్యవసాయ డైరెక్టర్ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలు తావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత వెంటనే అమలు చేసినట్లయితే ఇప్పటికే బీమా అమల్లోకి వచ్చేది. ఒక కీలక ప్రజాప్రతినిధి పంటల బీమా విషయంలో అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు వానాకాలం సీజన్ ముగుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికిప్పుడు బీమాను అమలు చేసే పరిస్థితి ఉండబోదని అధికారులు అంటున్నారు. 550 ఎకరాల్లో కొట్టుకుపోయిన వరి మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రావి రాల గ్రామంలోని పెద్ద చెరువు, కోమటి చెరువు తెగిపోయాయి. వీటి కింద 420 మంది రైతులు సాగుచేసే 550 ఎకరాల వరి మొత్తం కొట్టుకుపోయింది. 200 ఎకరాలు ఇసుక, రాళ్లతో నిండిపోయాయి. ఎకరానికి రూ.50 వేల నష్టం జరిగిందనుకున్నా, ఈ ఒక్క గ్రామంలోనే రూ.2.75 కోట్ల పంటనష్టంతో పాటు పొలం మరమ్మతు చేయాలంటే మరో రూ. కోటికి పైగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పొలం నిండా ఇసుక మేటలు నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైదం వెంకన్న అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు, దున్నడం, నాట్లు మొదలైన ఖర్చుల కోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. భారీ వర్షం కారణంగా పడమటిగూడెంలోని గుండ్ల చెరువు తెగడంతో వరద నీరు కొమ్ముల వంచ పాత చెరువు మత్తడి తెగింది. దీంతో కింద ఉన్న వెంకన్న పొలంపై ఇసుక మేటలు కట్టా యి. పంటపోయింది. పెట్టుబడి పోయింది. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ఇసుక మేటలు తొలగిస్తే కానీ పొలం చేతికిరాదు.ఆనవాలే లేకుండా పోయిన పొలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామానికి చెందిన గుగులోతు లోక్యాకు జానకీనగర్ రోడ్డులో రెండెకరాల భూమి ఉంది. అందులో 20 రోజుల కిందట వరినాట్లు వేశారు. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి పొలమంతా ఇసుక మేట వేసింది. పొలం ఆనవాళ్లే లేకుండా పోయింది. తిరిగి నాటు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అప్పు చేసి రూ.40 వేల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నాడు. -
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు. ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు. తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం.. రేషన్కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్కార్డులో తప్పులు, రేషన్కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. రుణమాఫీపై అర్థంలేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండిఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచనసాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.ఆధార్, పాస్బుక్, రేషన్కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది. అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. -
తగ్గిన ‘సాగు’పై అధికారుల ఆరా
మహబూబ్నగర్ (వ్యవసాయం): ‘సాగు ఢమాల్.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం’శీర్షికన ‘సాక్షి’మెయిన్లో శనివారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలను ఆరా తీయడంకోసం వ్యవసాయశాఖ.. మహబూబ్నగర్ జిల్లాలోని రైతు వద్దకు సంబంధిత అధికారులను పంపి వివరాలు సేకరించింది. ‘సాక్షి’కి తన అభిప్రాయాన్ని తెలియజేసిన మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మాచన్పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్రెడ్డి వద్దకు ఏఈఓ ఎండీ హనీఫ్ వెళ్లి ఆయన పొలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తనకు సొంతంగా నాలుగున్నర ఎకరాల పొలం ఉందని, దాంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటానని, ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో కేవలం మూడున్నర ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశానని, మిగతా 17 ఎకరాల్లో పంట సాగు చేయడానికి భారీ వర్షాలు రాకపోవడమే కాకుండా బోర్లలో సరిపడా నీరు ఇంకా పెరగలేదని ఆ రైతు ఏఈఓకు వివరించారు. 17 ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉందని, భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. కాగా మహబూబ్నగర్ జిల్లాలో పంటల సాగు ఇంత అధ్వానంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెదవి విరిచినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారులను రైతుల వద్దకు పంపినట్లు తెలిసింది. -
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడే లక్ష రుణమాఫీ.. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఆన్లైన్లో రైతులతో మాట్లాడనున్నారు. కొన్ని గ్రామాల్లో గందరగోళం రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. -
రాష్ట్రంలో డీఏపీ కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు. జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్ను ఆదేశించారు. -
46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు. అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 13.07 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలిసన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మలగతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
పాత పద్ధతిలోనే రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన. సీజన్కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది. మార్గదర్శకాలపై కసరత్తు రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. -
అపరాలలోనూ విత్తన మార్పిడి
సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది. ఖరీఫ్లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్లో కందులులో ఎల్ఆర్జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా, ఎల్ఆర్జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా విస్తరణ డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్ గ్రూప్ల ద్వారా వివరిస్తారు. మినుములో ప్రత్యామ్నాయ రకాలు » పీయూ–31కు బదులుగా ఖరీఫ్ సీజన్లో ఎల్బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్8, ఎల్జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. » తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్బీజీ 904 రకం » ఎల్బీజీ 752కు బదులుగా ఖరీఫ్లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్ 8, ఎల్బీజీ 904, జీబీజీ1, ఎల్బీజీ 787 » టీ–9కు బదులుగా రెండు సీజన్లలో ఎల్బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్బీజీ 904 రకం ఏపీ సీడ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్ సీడ్ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: » ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 574, ఎల్జీజీ 607,ఎల్జీజీ 630 ఎల్జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు » ఎల్జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 607 రకాలు, ఎల్జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్జీజీ 630, ఎల్జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్ఆర్జీ 52 స్థానంలో ఖరీఫ్లో టీఆర్జీ 59 (తిరుపతి కంది), ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33, పీఆర్జీ 176 రకాలను, రబీలో ఎల్ఆర్జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. » ఎల్ఆర్జీ 41 స్థానంలో ఖరీఫ్లో పీఆర్జీ 158, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33 (సౌభాగ్య), పీఆర్జీ 176, ఎల్ఆర్జీ 52 రకాలను, రబీలో ఎల్ఆర్జీ 105 రకాలు » ఐసీపీహెచ్ 2740, ఐసీపీఎల్ 87119, పీఆర్జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్ఆర్జీ 105 రకం » ఐసీపీహెచ్ 87063 కు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. శనగలో ప్రత్యామ్నాయ రకాలు శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్బీఈజీ 776 రకాలు, ఎన్ఈజీ 452 (నంద్యాల గ్రామ్ 452), ఎన్బీఈజీ 810 (నంద్యాల గ్రామ్ 810), ఎన్బీఈజీ 857 (నంద్యాల గ్రామ్) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు -
కాడి.. మేడి.. ఖరీఫ్కు రెడీ
సాక్షి, అమరావతి: మృగశిర కార్తె మొదలైంది. వ్యవసాయ పనిముట్లయిన కాడిమేడిలకు పూజలు చేస్తున్న రైతులు సాగు కోసం భూమిని రైతన్నలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల దుక్కిదున్ని పచ్చి రొట్ట వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఏజెన్సీ జిల్లాల్లో వరి పంట విత్తుకుంటున్నారు. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు పలకరించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపింది. పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్టుగా చెబుతున్నారు. ఆర్బీకేల వద్ద అన్నదాతల సందడి ఎన్నికలలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోకుండా రైతులు విత్తుకునేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు ఆర్బీకేల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతం కట్టి నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చి0ది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీ జోరందుకుంది. వరి సహా ఇతర విత్తనాలను సైతం ఆర్బీకేల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం తమ వివరాల నమోదు కోసం వస్తున్న రైతులు, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు విత్తనాల కోసం వస్తుండటంతో ఆర్బీకేల్లో సందడి మొదలైంది. పరిహారం ఆదుకుంది గత ఖరీఫ్లో ఏర్పడిన కరువుకు సంబంధించిన పరిహారంతో పాటు రబీలో మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్ల పెట్టుబడి రాయితీ కౌంటింగ్కు ముందే జమ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.45 కోట్లు జమైంది. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్కు ముందు జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చి0ది.ఇప్పటికే 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో వరి 39.07 లక్షల ఎకరాలు, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 6.35లక్షల ఎకరాల్లో కందులు, 3.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకోసం 6.32 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 3.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశారు. 3.09 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం 4.84 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. 3.52 లక్షల మంది రైతులు 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకెళ్లారు. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 10 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 5 లక్షల బాటిళ్ల నానో యూరియా, 2 లక్షల బాటిళ్ల నానో డీఏపీ ఇఫ్కో ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. కనీసం 5.60 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే మే, జూన్ నెలల్లో రూ.7,500 చొప్పున రైతులు తొలివిడత పెట్టుబడి సాయం అందుకునేవారు. ఈ సొమ్ములు ఖరీఫ్లో విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడేవి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తమకు ఈపాటికే పెట్టుబడి సాయం అంది ఉండేదని రైతులు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
సాగు సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరికాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం, వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లేనని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విత్తన ప్రణాళిక ఖరారు సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అందులో అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేయగా, మరికొందరు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్ఫెడ్ వెల్లడించింది. వ్యవ‘సాయానికి’సన్నాహాలు ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సాయం అందజేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని, సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు. 33 మందిపై కేసులు: మంత్రి తుమ్మల అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2 కోట్ల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వా«దీనం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టామని వెల్లడించారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ అ«దీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు, మోసగాళ్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటివరకు 84.43 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేశామని, అందులో రైతులు ఇప్పటికే 25.10 లక్షల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేశారని వివరించారు. -
కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: రైతులు కల్తీల బారిన పడి నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తయారీ, పంపిణీ, సరఫరాపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచడంతోపాటు గ్రామస్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా నాన్సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా అధికారులకు విస్తృత అధికారాలు ఖరీఫ్ సీజన్కు 3 నెలల ముందే పత్తి, మిరప ఇతర విత్తనాలను సాగు విస్తీర్ణానికి తగినట్టుగా సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను సిద్ధం చేసింది. ముఖ్యంగా పత్తి విత్తనం 29 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. ఇలా ఇతర విత్తనాలనూ సిద్ధం చేసింది. గతంలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత నమూనాలు సేకరించి, నిషేధిత హెచ్టీ విత్తనాలను గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం విత్తన తయారీ నుంచే నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రొసెసింగ్ ప్లాంట్లపై నిరంతర నిఘా ఉంచారు. డీలర్ల నుండి విత్తన నమూనాలతో పాటు ప్యాకింగ్, ధ్రువీకరణ, లేబులింగ్ వంటి వివిధ దశల్లో విత్తన నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత హెచ్టీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా వ్యవసాయాధికారులకు విస్తృత అధికారాలు ఇచ్చారు. వీరి పర్యవేక్షణలో సీడ్ ఇన్స్పెక్టర్లతో కూడిన క్షేత్ర స్థాయి ప్రత్యేక నిఘా బృందాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు, స్టోరేజీ పాయింట్లు, డీలర్లు, రిటైల్ షాపులు, డెలివరీ యూనిట్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ‘సీడ్ మానటరింగ్ సెల్’ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ‘సీడ్ రెగ్యులేషన్ సెల్’ (ఫోన్ నెం 8331056032), రైతు సమీకృత సమాచార కేంద్రం (టోల్ ఫ్రీ నెం. 155251)కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేశారు. రూ.2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరçప, కూరగాయల విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలు సరి్టఫై చేసిన నాణ్యమైన పత్తి, మిరప, ఇతర నాన్సబ్సిడీ విత్తనాలను జూన్ రెండో వారం నుంచి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందు కోసం ఆయా కంపెనీలతో ఏపీ సీడ్స్ అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో పరీక్షిస్తారు. శుద్ధి చేసిన విత్తనాన్ని ప్యాకింగ్ చేసి రైతులకు పంపిణీ చేసే ముందు ఆర్బీకేల్లో పరీక్షిస్తారు. ఆర్బీకే ఇన్చార్జితో పాటు గ్రామంలోని కొంతమంది రైతులతో కలిసి గ్రామ స్థాయిలో మరోసారి నాణ్యతను పరీక్షిస్తారు. కల్తీ విత్తనాలపై నిఘా పెంచాం గతంలో 2, 3 పత్తి విత్తన రకాలకు మాత్రమే డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అనేక కంపెనీలు నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. సర్టిఫై చేసిన పత్తి విత్తనాలను ఎమ్మార్పి కి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలిచ్చాం. తీవ్రతనుబట్టి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ఆర్బీకేల ద్వారా అవగాహన నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాల ఎంపికపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరి్టఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెస్తున్నాం. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ కల్తీ విత్తనాల విక్రేతలపై ఫిర్యాదుకు ఈ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు.. సీడ్ రెగ్యులేషన్ సెల్– 8331056032రైతు సమీకృత సమాచార కేంద్రం – 155251 (టోల్ ఫ్రీ నంబర్) -
కొత్త విత్తనాలు వేద్దాం
వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి: వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరి ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్డీఎల్ఆర్ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్జీఎల్ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం ఖరీఫ్లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దశలవారీగా విస్తరణ.. వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్ సీడ్ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. ఆర్బీకేల ద్వారా అవగాహన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యంరాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన కొత్త రకాల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పత్తి విత్తనాల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దురైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాంఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
సాగుకు చక్కనైన సాయం
ఎన్నికలు ముగిసినా ఇంకా ఈనాడు దుగ్ధ తీరలేదు. ఏదోలా ప్రభుత్వంపైనా... అనుసరిస్తున్న విధానాలపైనా లేనిపోని విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు అందిస్తూ పైశాచికానందం పొందుతోంది. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా, పశు మత్స్యదర్శిని మ్యాగజైన్స్పైనా తన అక్కసును వెళ్లగక్కింది. దురుద్దేశంతో ఇచ్చిన ఈ కథనాన్ని ప్రభుత్వాధికారులు నిర్ద్వందంగా ఖండించారు. వారి ఆరోపణలను తిప్పి కొట్టారు.సాక్షి, అమరావతి: వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమగ్రంగా... సచిత్రంగా ఆకర్షణీయంగా అందించేందుకు రైతు భరోసా, పశుమత్స్య దర్శిని మ్యాగజైన్స్ను ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో మూస పద్ధతిలో బ్లాక్ అండ్ వైట్ కలర్లో నాణ్యత లేని మెటీరియల్తో ‘పాడి పంటలు’ పేరిట వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటికీ కలిపి ఒకే మాస పత్రిక అందించేవారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గతం కంటే మెరుగ్గా... ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయిల్ ప్రింట్ కవర్, అన్ని పేజీలు రంగుల్లో 44 పేజీలతో కూడిన ఈ మ్యాగజైన్ను ముద్రిస్తూ కేవలం రూ.25లకే అందిస్తున్నారు. గన్నవరం సమీకృత రైతు సమాచార కేంద్ర పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి దాదాపు పది మంది పర్యవేక్షణలో ఈ మ్యాగజైన్ రూపొందుతోంది.ఆర్బీకేలకు ఉచితంగా సరఫరావ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచే సాగు ఉత్పాదకాల వివరాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో పంటల వారీగా మెలకువలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలతో విభిన్న కథనాలను అందిస్తున్నారు. 2020 జూలైలో ఈ మ్యాగజైన్కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల దాదాపు 14,300 ప్రతులను ముద్రించి ఆర్బీకేలకు వ్యవసాయ శాఖ అధికారులకు ఉచితంగా ఇస్తున్నారు. లక్షన్నర మంది చందాదారులుఆర్బీకే పరిధిలో 400–500 మంది రైతులు ఉండగా ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీలో ఒక మాస పత్రిక మాత్రమే ఉంచడం వల్ల మెజారిటీ రైతులు చదవలేకపోతున్నారు. వీరి కోసం ఓ వైపు వ్యవసాయ, అనుబంధ శాఖల వెబ్సైట్లలో ఈ పత్రికను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ మెజార్టీ రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు స్వచ్ఛందంగా చందాదారులుగా చేరుతున్న వారికి నేరుగా మ్యాగజైన్స్ అందజేస్తున్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉచితకాపీలు ఏ ధరతో ముద్రిస్తున్నారో అదే ధరకు రైతులకు అందిస్తున్నారు. చందాదారులుగా చేరగోరే రైతుల నుంచి మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం ఈ పత్రికల చందాదారులు లక్షన్నరకు పైగా ఉన్నారు. ఉన్నతాశయంతో నిర్వహిస్తున్న ప్రభుత్వంపై ఈనాడు బురద జల్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.స్వచ్ఛందంగానే చేరుతున్నారుఈ మాసపత్రికల కోసం రైతులు స్వచ్ఛందంగానే చందాదారులుగా చేరుతున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. వీటి ప్రాముఖ్యతపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించాం. చందా దారులంతా ఆర్బీకే పరిధిలో ఉండే రైతులే కాబట్టి, వారికి ప్రతీ నెలా ఈ మాసపత్రికలు అందజేసే బాధ్యతను అప్పగించాం. చందాదారులుగా చేర్పించేందుకు ఆర్బీకే సిబ్బందిపై ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
సన్న విత్తనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వానాకాలం సీజన్కు ముందు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ సన్న రకాల విత్తనాలను రైతులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు సన్నాలతో పాటు రైతులకు వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం (24న) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మేళాలో వ్యవసాయ వర్సిటీతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఓఆర్, ఐఐఎంఆర్,ఐఐఆర్ఆర్, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖలు టీఎస్ఎస్డీసీ, ఎన్ఎస్సీ, టీఎస్ఎస్ఓసీఏలు పాల్గొననున్నాయి. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు (జగిత్యాల, పాలెం, వరంగల్) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహించనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభం కానుంది. విత్తనాలతో పాటు వర్సిటీ రూపొందించిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి. మొత్తం 16 పంటలకు సంబంధించిన 67 రకాల విత్తనాలు కూడా ఉంటాయి. మేళాలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించటానికి వీలుగా వ్యవసాయ, అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా 24న నిర్వహిస్తున్నారు. ఈ 19 రకాలకే బోనస్? విత్తన మేళాలో వ్యవసాయ వర్సిటీలో రూపొందించిన 19 రకాల సన్న వరి విత్తనాలు విక్రయిస్తారు. బి.పి.టి. 5204, డబ్ల్యూ.జి.ఎల్–44, డబ్ల్యూ.జి.ఎల్ –962, డబ్ల్యూ.జి.ఎల్. 1119, డబ్ల్యూ.జి.ఎల్.1246, డబ్ల్యూ.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎం 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్– 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్.15435, ఆర్.ఎన్.ఆర్– 2465, ఆర్.ఎన్.ఆర్– 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 రకాలు అందబాటులో ఉంటాయి. అయితే ఈ 19 రకాల సన్న రకం విత్తనాలకే రూ. 500 బోనస్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. పైగా ఇవి వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేసినవి కావడంతో ప్రభుత్వం వీటినే సిఫారసు చేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. రైతులను సన్నాల వైపు మళ్లించాలన్న ఆలోచనతోనే బోనస్ ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. 8 రకాల దొడ్డు విత్తనాలు దొడ్డు గింజలకు సంబంధించి 8 రకాలు.. ఆర్.ఎన్.ఆర్–28361, ఆర్.ఎన్.ఆర్. 15459, కె.ఎన్.ఎం 118, ఎమ్.టి.యు. 1010, డబ్ల్యూ.జి.ఎల్– 915, జె.జి.ఎల్ 24423, జె.జి.ఎల్ 28639 అందుబాటులో ఉంచుతారు. సువాసన కలిగిన రకం ఆర్.ఎన్.ఆర్–2465 కూడా విక్రయిస్తారు. ఇక మొక్కజొన్నలో 5 హైబ్రిడ్లు డి.హెచ్.యం 117, డి.హెచ్.యం 121, బి.పి.సి.హెచ్. 6, కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క–1 ఉంటాయి. జొన్నలో పి.వై.పి.ఎస్–2, సి.ఎస్.వి–41, రాగిలో పి.ఆర్.ఎస్.38, ఆముదంలో పి.సి.హెచ్. 111, నువ్వుల్లో జె.జి.యస్–1020, వేరుశనగలో ధరణి విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. అలాగే అపరాలకు సంబంధించి పెసరలో డబ్ల్యూ.జి.జి 42, ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 347, ఎమ్.జి.జి 385, మినుములో యం.బి.జి. 1070, కందిలో 8 రకాలు.. హనుమ, డబ్ల్యూ.ఆర్.జి.ఇ– 97, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–93, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–121, డబ్ల్యూ.ఆర్.జి.ఇ–255, పి.ఆర్.జి–176, టి.డి.ఆర్.జి–59, ఆశ అందుబాటులో ఉంచుతారు. సోయా చిక్కుడులో 4 రకాలు.. బాసర, కె.డి.ఎస్–726, ఎం.ఎ.యు.యస్–612, ఎ.ఐ.ఎస్.బి–50తో పాటు పశుగ్రాస పంటల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. -
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. -
బోనస్ అంటే తెలియనోళ్లు మొరుగుతున్నారు
ఖమ్మం వన్టౌన్: కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పద్ధతి ప్రకారం పరిహారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా టంఛన్గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.ఈ క్రమంలో రబీ సీజన్లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు కరువు మండలాల్లో ఆ సీజన్లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఈసీని పలుమార్లు అభ్యర్థించాం.. ⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్లో పలుమార్లు ఎన్నికల కమిషన్ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు.. ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ -
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. » గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి. » గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు. » వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది. » అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. » పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
రైతుబంధు సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకే వచ్చిపడుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్కు సంబంధించి వేసిన రైతుబంధు సొమ్ము వేలాదిమంది రైతులకు వెళ్లకుండానే వెనక్కి రావడంపై వారు భగ్గుమంటున్నారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే 19 వేల మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. అనేకమంది రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయశాఖ అధికారులు, వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతుబంధు చెల్లింపులు చేయకపోవడంపైనా విమర్శలు ఉన్నాయి. అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి... » వ్యవసాయశాఖ అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. » ఇంటిపేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోకుండా నంబర్లలో తప్పులు దొర్లడం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి. » ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి వెనక్కి వేస్తున్నాయి. » కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలు కూడా రైతుబంధు సొమ్ము తిరిగి వెనక్కి రావడానికి కారణంగా ఉంటుందని ఒక వ్యవసాయ ఉన్నతాధికారి తెలిపారు. » వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా, పూర్తిస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. » సాంకేతిక సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. » బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగిలో ఐదెకరాలకే రైతుబంధు పరిమితం... రైతుభరోసా పథకం వచ్చే వానాకాలం నుంచి ప్రారంభిస్తామని, అప్పటివరకు గత రైతుబంధు మార్గదర్శకాలనే అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు మార్గదర్శకాల ప్రకారం భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతుబంధు సొమ్ము వేయాలి. కానీ ఇప్పటివరకు ఐదు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతుబంధు సొమ్ము అందజేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.కాగా, కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకే ఉన్నా తమకు అందలేదంటున్నారు. దీనిపై కొంత గందరగోళం నెలకొంది. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు సొమ్ము విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేయాలి. ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు మాత్రమే రూ. 5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. -
యాసంగికి పంట గోస.. తగ్గనున్న ధాన్యం దిగుబడి
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేక ఎండిపోవడం, అకాల వర్షాలు, వడగళ్ల నష్టం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత యాసంగిలో వరి దిగుబడి 1.20 కోట్ల టన్నులుకాగా.. ఈసారి 1.06 కోట్ల టన్నులకు తగ్గుతుందని.. అంటే 14 లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. అలాగే మొక్కజొన్న గత యాసంగిలో 17.20 లక్షల టన్నుల దిగుబడి వస్తే.. ఈసారి 15.37 లక్షల టన్నులే వస్తుందని అంచనా. దీని దిగుబడి 1.83 లక్షల టన్నుల మేర తగ్గిపోనుంది. వేరుశనగ కూడా గత యాసంగిలోని 2.32 లక్షల టన్నుల కంటే 59వేల టన్నులు తగ్గి.. ఈసారి 1.73 లక్షల టన్నులకే పరిమితం కానుంది. ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 2.70 లక్షల టన్నులుకాగా.. ఇప్పుడు 61వేల టన్నులు తక్కువగా 2.09 లక్షల టన్నులకు పడిపోనుంది. మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ఏడాది సాగు రికార్డులు.. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్ల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ చరిత్రలోనే ఆల్టైం రికార్డు నమోదైంది. ఆ రెండు సీజన్లలో కలిపి ఏకంగా 2.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ఆ ఏడాది వానాకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో సాగుకాగా.. యాసంగిలో 72.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. అది రెండింతలకు దగ్గరగా రావడం గమనార్హం. 2014–15లో రాష్ట్రంలో రెండు సీజన్లు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020–21 నాటికి 2.03 కోట్ల ఎకరాలకు, 2022–23 నాటికి 2.08 కోట్ల ఎకరాలకు చేరాయి. కానీ ఈసారి రెండు సీజన్లు కలిపి 1.93 కోట్ల ఎకరాలకే సాగు పరిమితమైంది. అలాగే 2022–23 వరకు వరి సాగులో రికార్డుల మోత మోగింది. 2014–15లో రెండు సీజన్లకు కలిపి 35 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా.. 2022–23 నాటికి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలకు పెరగడం విశేషం. అదే ఇప్పుడు 2023–24లో వరి సాగు 1.14 కోట్ల ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది. సన్న బియ్యానికి డిమాండ్ యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గనున్న నేపథ్యంలో రోజువారీ ఆహారంగా తీసుకునే సన్న బియ్యానికి డిమాండ్ పెరగనుంది. దీన్ని గుర్తించిన మిల్లర్లు, వ్యాపారులు నేరుగా పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కొంత మేర ధాన్యం ఆ కేంద్రాలకు వస్తోంది. సన్నబియ్యం పండించే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు. పొలాల వద్దకే మిల్లర్లు, వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా కోటి టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తే.. అందులో 7 లక్షల నుంచి 10 లక్షల టన్నుల మేర మాత్రమే సన్నధాన్యం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో సన్నరకాలను మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల నుంచే కొనుగోలు చేసుకొని పోతున్నారు. రాష్ట్ర మిల్లర్లు, వ్యాపారులతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఏపీలకు చెందిన వ్యాపారులు వచ్చి క్వింటాలుకు రూ.2,300 నుంచి రూ.3,000 వరకు చెల్లించి పచ్చి ధాన్యాన్ని కొంటున్నారు. కాస్త మెరుగైన ధరే కావడంతో.. రైతులు కూడా విక్రయిస్తున్నారు. – నిజామాబాద్ జిల్లాలో గంగ, కావేరి సన్న రకాలను 2.30 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక మహబూబ్నగర్లో కృష్ణా తీరం వెంట సన్నాలను పండించారు. ఇక్కడి రైతులు పండించిన సన్న ధాన్యాన్ని మిల్లర్లే కొనేస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. దొడ్డు రకాల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా.. దిగుబడి తగ్గిన నేపథ్యంలో 50 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సన్న బియ్యం ధరలు పెరిగే చాన్స్ మేలు రకం సన్న బియ్యానికి ఖరీఫ్ సీజన్లోనే క్వింటాల్ రూ.6,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాలకు.. నాణ్యతను బట్టి రూ.6,500 నుంచి రూ.8,500 వరకు ధర పలుకుతోంది. యాసంగిలో తగ్గిన దిగుబడి, బియ్యం కొరత కారణంగా ఈసారి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. మార్కెట్లో ధరలు తగ్గడం లేదని, ఇప్పుడు తగ్గిన దిగుబడితో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి. పొట్టదశలో ఎండిన వరి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో రైతు బంటు లక్ష్మయ్యకు చెందిన పొలంలో ఎండిపోయిన వరి ఇది. లక్ష్మయ్య తనకున్న మూడెకరాల భూమిలో వరి వేశాడు. బోరు వట్టిపోయి నీరు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది. – మిర్యాలగూడ తొమ్మిదెకరాల్లో.. ఒక్క ఎకరమూ మిగల్లేదు.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం జయరాంతండాలో ఎండిపోయిన వరి పొలం ఇది. ఈ తండాకు చెందిన రైతు రమావత్ కీమా తనకున్న ఆరు ఎకరాలతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని యాసంగిలో వరి సాగుచేశాడు. మూడు బోర్లు ఉన్నా భూగర్భజలాలు అడుగంటి ఎండిపోయాయి. దాంతో మరో బోర్ వేయించినా లాభం లేకపోయింది. మొత్తం తొమ్మిదెకరాల్లో వరి ఎండిపోయింది. దీంతో ఆ వరి కోయించి.. పశువులకు గ్రాసంగా వేస్తున్నాడు. – పెద్దవూర పంటను పశువులకే వదిలేసి... వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు కొయ్యడ బొందయ్య రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇరవై రోజుల నుంచి నీళ్లు లేక వరి పంట అంతా ఎండిపోయింది. చేసేదేం లేక వరి పంటను ఇలా పశువులకు వదిలేశాడు. -
గడచిన ఐదేళ్లలో 40శాతం గోదాముల సామర్థ్యం పెంపు
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ జనాబ్ కరిముల్లా షేక్ అమీన్ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్ ట్రిట్మెంట్తోపాటు శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీ జి.ఓంకార్రెడ్డి, పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఐదెకరాలా.. పదెకరాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ను సంప్రదించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది. ఇచ్చే మొత్తం పెంచి.. 90% మందికే ఇచ్చి.. రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతీ సీజన్కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందేవి. తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు చేసింది. అంటే రెండు సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.15,250 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. అంటే.. మొత్తం లబ్దిదారుల్లో 90.36 శాతం. వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. వాళ్లందరికీ కట్..! సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించనున్నామని.. తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వంపై రైతుభరోసా భారం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. -
మిర్చి రైతులు నష్టపోవద్దు
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
22లోగా రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
ఈ–క్రాప్తో అన్నదాతలకు భరోసా
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదు వేగంగా సాగుతోంది. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది. ఈ–క్రాప్ ప్రామాణికంగానే రైతులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోంది. దీంతో పంటలు వేసిన ఒక్క రైతును కూడా వదలకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాలో ప్రతి పంటనూ నమోదు చేయడమే వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 38.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ డేటాతోపాటు జియో ఫెన్సింగ్ ఆధారంగా డిసెంబర్లో ఈ–క్రాప్ నమోదుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 37,02,031 ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్లో నమోదు చేశారు. ఇందులో 34,21,189 ఎకరాల్లో వీఏఏలు, 31,86,682 ఎకరాల్లో వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు 20,06,326 ఎకరాలకు సంబంధించి రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) నమోదు పూర్తయింది. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దుల గుర్తింపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్లో ఆధార్, వన్బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దులు నిర్థారించి, రైతు ఫొటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాలు ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతోపాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పొలం ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, రొయ్యలు, చేపల చెరువులుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. డూప్లికేషన్కు తావులేకుండా ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. జిరాయితీ, పట్టాదార్, అసైన్డ్, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోమెంట్, వక్ఫ్, ఈనాం, లంక, సీజేఎఫ్ఎస్, మిగులు, ఆక్రమిత తదితర కేటగిరీల కింద గుర్తించిన ప్రభుత్వ భూముల్లో సాగవుతున్న ఆహార, నూనె గింజలు, పశుగ్రాసం, పంటలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పూలు, మల్బరీ పంటలను నమోదు చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి రైతుకు రసీదు అందించే ఏర్పాటు చేశారు. పారదర్శకంగా నమోదు ఈ–క్రాప్ను పారదర్శకంగా నమోదు చేయడంతోపాటు ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం. సోషల్ ఆడిట్ కోసం 21 నుంచి 28వ తేదీ వరకు ప్రాథమిక ఈ క్రాప్ జాబితాలను ప్రదర్శిస్తాం. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. మార్చి 6న తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు అందుతాయి. అందువల్ల ప్రతి రైతు వారు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. – గెడ్డం శేఖర్బాబు,ఇన్చార్జి కమిషనర్, వ్యవసాయ శాఖ -
సాగుకు రూ.1.27లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–2024)తో పోల్చుకుంటే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. రూ.1,27,469.88 కోట్లలో వ్యవసాయ విభాగానికి రూ.1,17,528 కోట్లు కేటాయించగా, వ్యవసాయ పరిశోధన, విద్య (డేర్) విభాగానికి రూ.9,941 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాల ప్రకారం.. వ్యవసాయ విభాగానికి రూ.1,16,788.96 కోట్లు, డేర్కు రూ.9,876.60 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ పథకానికివ్యవసాయ విభాగం పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.60 వేల కోట్లే కేటాయించారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు మూడు వాయిదాలుగా సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున అందజేస్తోంది. ప్రజా పంపిణీకి రూ.8 వేల కోట్ల తగ్గింపు.. వినియోగదారుల వ్యవహారాలు,ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేటాయింపులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ శాఖకు రూ.2.13 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇందులో వినియోగదారుల వ్యవహారా లకు 302.62 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్ రూ.309.26 కోట్లు కావడం గమనార్హం. ఇక ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,924.64 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కొంత కోత విధించి రూ.2,13,019 కోట్ల బడ్జెట్ మాత్రమే కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఈ విభాగం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది. రసాయనాలు ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రసాయనాలు, ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ఎరువుల విభాగానికి కేటాయింపులు రూ.1,88,947.29 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించారు. ఇక రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.572.63 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి కేవలం రూ.139.05 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఫార్మాస్యూటికల్స్ విభాగానికి మాత్రం కేటాయింపులు పెరగడం గమనార్హం. దీనికి కేటాయింపులు రూ.2,697.95 కోట్ల నుంచి రూ.4,089.95 కోట్లకు పెరిగాయి. అలాగే హోంమంత్రి అమిత్షా నేతృత్వంలోని సహకార శాఖకు కూడా రూ.747.84 కోట్ల నుంచి రూ.1,183.39 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. నీళ్లకు నిధులు పెరిగాయ్ ♦ జలశక్తి శాఖకు రూ. 98,418 కోట్లు కేటాయింపు ♦ గతేడాదికన్నా రూ. 2 వేల కోట్లు అధికం ♦ పీఎంకేఎస్వై ప్రాజెక్టుకు రూ. 11,391 కోట్లు ♦ గతంకన్నా రూ. 3 వేల కోట్లు పెరుగుదల సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్ర జలశక్తి శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది జలశక్తి శాఖకు మొత్తంగా కేటాయించిన నిధుల కంటే దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులను పెంచింది. గతేడాది జలశక్తి శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ. 98,418 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద నిధుల మొత్తాన్ని రూ. 8,781 కోట్ల నుంచి రూ. 11,391 కోట్లకు పెంచింది. దీనికిందే ఉన్న సమగ్ర సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకానికి గతేడాదికి సమానంగా రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఏఐబీపీ పథకంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు ఈ నిధులు కేటాయించే అవకా శం ఉంది. దీంతోపాటే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరగా పీఎంకేఎస్వై పథకం కింద ప్రాజె క్టుకు ఆర్థిక సాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఈ నిధు ల్లోనే ఆ మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఆయకట్టు అభివృధ్ధి పథకం (కాడా) కింద రూ. 1,400 కోట్లు కేటాయించగా దీని కింద సైతం తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులున్నాయి. నదుల అనుసంధానానికి పెరిగిన కేటాయింపులు... నదుల అనుసంధాన కార్యక్రమానికి కేంద్రం నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ. 1,500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ. 4 వేల కోట్లకు పెంచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వడం, నాలుగు రోజుల కిందటే మధ్యప్రదేశ్, రాజస్తాన్ మధ్య పర్బతి–కాలిసింద్–చంబల్ నదులను తూర్పు రాజస్తాన్ కాలువతో కలిపే అనుసంధాన ప్రక్రియపై ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. అయితే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది తుంగభద్ర జలాలపై ఆధారపడి కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర సాయం కింద రూ. 5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ ఏడాది దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఏపీలోని పోలవరం ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంశాల ప్రస్తావన లేదు. ‘లఖ్పతి దీదీ’ కిందకు 3 కోట్ల మంది మహిళలు న్యూఢిల్లీ: స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం తీసుకుని పొదుపు బాటలో పయనిస్తూ తమ దక్షతతో వ్యాపారం చేస్తూ లఖ్పతి దీదీ (లక్షాధి కారి)లుగా అవతరిస్తున్న మహిళల సంఖ్యను మరింత పెంచడంపై దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ 83 లక్షల స్వయం సహాయక బృందాలు(ఎస్హెచ్జీ)ల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధి సాధిస్తూ, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కష్టించి వ్యాపారాన్ని నిలబెట్టుకుని తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలు ఏటా కనీసం రూ. 1 లక్ష ఆర్జిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఇలా పొదుపు సంఘాల మహిళలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తూ సాధికారత, స్వావలంభన సాధిస్తూ అందరికీ స్ఫూర్తిప్రదాతలయ్యారు. ఇలాంటి లక్షాధికారి(లఖ్పతి దీదీ)ల సంఖ్యను రెండు నుంచి మూడు కోట్లకు పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని నిర్మల లోక్సభలో వ్యాఖ్యానించారు. ఆశ, అంగన్వాడీలకు ‘ఆయుష్మాన్ భారత్’ న్యూఢిల్లీ: ఆశా, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు హెల్త్కేర్ కవరేజీని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. వారిని ఆయుష్మాన్ భారత్ బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తు న్నట్లు 2024–25 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కింద అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా న్యూట్రిషన్ డెలివరీ వేగవంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఆస్పత్రుల మౌలిక వసతు లను వినియోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనిని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామ న్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కేటాయింపులను రూ. 6,800 కోట్ల నుంచి రూ. 7,500 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తామన్నా రు. సమగ్ర ఆచరణ కోసం వివిధ మాతా శిశు హెల్త్కేర్ స్కీంలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. మిషన్ ఇంద్రధనుష్ మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా కొత్తగా రూపొందించిన యు–విన్ పోర్టల్ను దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నామని తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబ్లు యథాతథం.. సాక్షి,అమరావతి: మధ్యతరగతి, వేతనజీవుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు కుమ్మరించారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో కాసింత ఉపశమన మాటలు వస్తాయనుకున్న వారికి గతంలో చేసిన గొప్పలను ఏకరువు పెట్టి సరిపెట్టారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రత్యక్ష పన్ను ల వసూళ్లూ 3 రెట్లకుపైగా పెరగ్గా పన్ను రిట ర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2013– 14 ఆర్థిక సంవత్సరానికి దేశంలో పన్ను చెల్లించాల్సినవసరం లేని ఆదాయ పరిమితి రూ.2.2 లక్షలు ఉంటే ఇప్పుడు 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఒక్క రూపాయి పన్ను చెల్లించా ల్సిన పని లేదన్నారు. కొత్త పన్నుల విధానం ఎన్నుకున్న వారికే ఇది వర్తింపు 7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదన్న ఆర్థిక మంత్రి మాటలపై మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, పాత పన్ను ల విధానంలో ఉన్న వారికి ఈ రిబేటు పరిమితి రూ.5 లక్షలే ఉందన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. నాలుగేళ్ల కిందట కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారు. పాత విధానంతో పోలి స్తే తక్కువ పన్ను రేట్లతో అన్ని వయసుల వారికి ఒకే విధమైన శ్లాబ్ రేట్ల ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఎంచుకుంటే సెక్షన్ 80సీ, గృహ రుణాలు, స్టాండర్డ్ డిడక్షన్, ఆరోగ్య బీమా వంటి పలు సెక్షన్ల కింద లభించే ప్రయోజనాలను పొందడానికి వీలుండదు. మొత్తం ఆదాయం మీద పన్ను చెల్లించా ల్సి వస్తుంది. కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించన వరం లేకుండా సెక్షన్ 87ఏ కింద రిబేటు ప్రకటించింది. దీనికింద రూ.25,000 ప్రయో జనం లభిస్తుంది. అదే పాత పన్నుల విధానం ఎంచుకుంటే సెక్షణ్ 87ఏ రిబేటు పరిమితిని రూ.5 లక్షల ఆదాయం వరకు పరిమితం చేశారు. పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి కేవలం రూ.12,500 మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మార్చాలన్న ఉద్దే శ్యంతో నిర్మాల ఈ నిర్ణయం తీసుకున్నారు. రిటైల్ వ్యాపారుల ఊహాజనిత ఆదాయం పరిమి తిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, వృత్తినిపుణుల ఊహాజనిత ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పన్ను రిట ర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 2013– 14లో 93 రోజులుగా ఉన్న రిఫండు సమయాన్ని ఇప్పుడు పదిరోజులకు తగ్గించినట్లుగా తెలిపారు. గ్రామీణాభివృద్ధికి..రూ.1.77 లక్షల కోట్లు 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.77 లక్షల కోట్లు ప్రకటించారు. గతేడాది రూ.1.57 లక్షల కోట్ల కంటే 12 శాతం ఎక్కువగా కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్లో చేసిన రూ.60,000 కోట్ల కంటే ఇది 43 శాతం ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– గ్రామీణ్ పథకానికి రూ.54,500 కోట్లు కేటాయించారు. ‘లఖ్ పతి దీదీ’ల లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి 3 కోట్లకు పెంచినట్లు సీతారామన్ ప్రకటించారు. జాతీయ జీవనోపాధి మిషన్–అజీవికకు రూ.15,047 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,129.17 కోట్ల కంటే ఇదిదాదాపు 6% ఎక్కువ. కాగా, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించారు. పర్యావరణ శాఖకు..రూ.3,265 కోట్లు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్లో పర్యావ రణ శాఖకు రూ.3,265 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ మొత్తం రూ.3,231 కోట్లు ఉండగా, ఈ సారి కొద్దిగా పెరి గింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర జూ అథారిటీ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ,ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సంస్థలకు గతేడాది బడ్జెట్లో 158.60 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.192 కోట్లు కేటాయించారు. కాగా, స్వయంప్రతిపత్తి సంస్థలైన జీబీ పంత్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వి రాన్మెంట్, భారత అటవీ పరిశోధన, అభి వృద్ధి మండలి, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం గతేడాది బడ్జెట్లో రూ.573.73 కోట్లు కేటాయించగా, తాజా మధ్యంతర బడ్జె ట్లో రూ.391 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అడ వుల్లో జంతు ఆవాసాల సమీకృత అభివృద్ధికి రూ.450 కోట్లను కేటాయించింది. అలాగే అడవుల పరిరక్షణ, పచ్చ దనం పెంపునకు సంబంధించి జాతీయ గ్రీన్ ఇండియా మిషన్కు గత బడ్జెట్లో రూ.160 కోట్లు ఉన్న కేటాయింపులను ఈ సారి రూ.220 కోట్లకు పెంచింది. సామాజిక న్యాయం, సాధికారతకు..రూ.14,225 కోట్లు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 మధ్యంతర బడ్జె ట్లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ.14,225.47 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,000 కోట్లు కేటాయించగా.. వికలాంగుల సాధికారత శాఖకు రూ.1,225.27 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ.11,078.33 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 28.4% పెరిగింది. వికలాంగుల సాధికారత విభా గం కింద జాతీయ వికలాంగుల సంక్షేమానికి రూ.615 కోట్లు కేటా యించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ కింద షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకానికి రూ.9,559.98 కోట్లు కేటాయించగా, బలహీ న వర్గాల అభివృద్ధి కార్యక్రమానికి రూ.2,150 కోట్లు కేటా యించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, వెనుక బడి న తరగతుల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారుల జాతీ య కమిషన్కు మొత్తం రూ.7,175 కోట్లు కేటాయించారు. గిరిజన మంత్రిత్వ శాఖకు..రూ.13వేల కోట్లు 2024–25 మధ్యంతర బడ్జెట్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఇది గత కేటాయింపుల కంటే భారీ అనగా 70 శాతం ఎక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖకు రూ.7,605 కోట్లు కేటాయించారు. 2024– 25లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎమ్ ఆర్ఎస్) నిర్మాణానికి కేంద్రం రూ.6,399 కోట్లు కేటాయించింది. ఇది 2023–24లో కేటాయించిన రూ.2,471.81 కోట్ల కంటే 150 శాతం ఎక్కువ. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకు కేటాయింపులు రూ.300 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి–ఆదాయ కల్పన వంటి రంగాల్లోని అంతరాలను తగ్గించడానికి గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులను అందిస్తారు. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని రూ.50 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెంచారు. కాగా, జాతీయ ఫెలోషిప్, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య, స్కాలర్షిప్ కోసం బడ్జెట్ కేటాయింపులు 2023–24లో రూ.230 కోట్ల నుంచి 2024–25లో రూ.165 కోట్లకు తగ్గించారు. రాష్ట్రాలకు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా సంస్కరణల బాటపట్టే రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని కేంద్రం తెలిపింది. 2047కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యసాధన కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు ఎన్నో అభివృద్ధి ఆధారిత సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా మోదీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. అంతరిక్షానికి అదనంగారూ. 2,000 కోట్లు అంతరిక్షంలో భారత కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా కలిగిన అంతరిక్ష విభాగానికి కేంద్ర బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విభాగానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,042.75 కోట్లు కేటాయించారు. 2023–24 సవరించిన అంచనాల ప్రకారం ఈ విభాగానికి రూ.11,070.07 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2035 కల్లా భారత్ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, 2040 కల్లా భారతీయ వోమగామి చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా స్పేస్ టెక్నాలజీకి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ.8,180 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,087 కోట్లుగా ప్రతిపాదించారు. మహిళా శిశు అభివృద్ధికి రూ.26 వేల కోట్లు మధ్యంతర బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.26 వేల కోట్ల కేటాయింపులు దక్కాయి. 2023–24 బడ్జెట్తో పోలిస్తే ఇది 2.52 శాతం అధికం. అత్యధికంగా సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0లకు రూ.21,200 కోట్లు కేటాయించారు. మిషన్ శక్తికి రూ.3,145.97 కోట్లు ప్రతిపాదించారు. మహిళలకు భద్రత, రక్షణ అలాగే వారు తమ హక్కులు పొందడం, పలు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం లక్ష్యంగా మిషన్ శక్తి (సంబల్)కి కేంద్రం శ్రీకారం చుట్టింది. కాగా మిషన్ వాత్సల్య (బాలల రక్షణ సేవలు, బాలల సంక్షేమ సేవలు)కు రూ.1,472 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం..2023–24లో మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.25,448.68 కోట్లు కేటాయించారు. అటానమస్ సంస్థలకు రూ.168 కోట్ల నుంచి రూ.153 కోట్లకు బడ్జెట్ తగ్గింది. ఈ సంస్థల్లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. ఇది కార్పొరేట్ల బడ్జెట్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కార్పొరే ట్లకు లాభాలు కట్టబెట్టే, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ బడ్జెట్ దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించేది కాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపు రాయితీలకు కోత పెడుతోందన్నారు. -
‘కౌలు’కు ఏపీ తరహా చట్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో అమలు చేస్తున్న పంటసాగు హక్కుల చట్టం–2019 తరహాలోనే తెలంగాణలో సైతం కొత్త చట్టం తీసుకొస్తే కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం వర్తింపజేయడానికి అవకాశం ఉంటుందని, ధరణి పోర్టల్ పునర్ని ర్మాణ కమిటీకి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, అటవీశాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో కమిటీ సమావేశమై చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలుదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి ఏటా నిర్దేశిత కటాఫ్తేదీ నాటికి ధరణి పోర్టల్లో ఉన్న భూరికార్డుల సమాచారం ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు కమిటీకి నివేదించారు. రైతుబంధు సాయం పొందుతున్న లబ్ధిదారులు నిజంగా భూములను అనుభవిస్తున్నారా? పంటలు సాగు చేస్తున్నారా? ఖాళీ భూములకు కూడా రైతుబంధు చెల్లిస్తు న్నారా? అని కమిటీ ప్రశ్నించగా, తమ వద్ద ఎలాంటి సమాచా రం లేదని వ్యవసాయశాఖ అధికారులు బదులిచ్చారు. అటవీ భూములన్నింటిని ధరణిలోని నిషేధిత భూముల జాబితాలో చేర్చలేదని, అటవీశాఖ అధీనంలోని భూముల లెక్కకు, ధరణి లోని అటవీ భూముల లెక్కకు పొంతన లేదని అటవీఅధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూముల పరిరక్షణకు ధరణిలో లోటుపాట్లు సరిచేయాలని కోరారు. గిరిజన ప్రాంతా ల్లోని కొందరు రైతుల పట్టాభూముల వివరాలు పాత రికార్డుల్లో నమోదు కాకపోవడంతో, ధరణిలో ఎంట్రీకి నోచుకోలేదని గిరి జనశాఖ అధికారులు కమిటీకి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వారసత్వ బదిలీకి గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయాలని నిబంధనలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని వివరించారు. క్షేత్ర స్థాయిలో గిరిజన రైతుల ఆధీనంలో ఉన్న భూము లను వారి పేరు మీద ధరణిలో ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కాంగ్రెస్ కిసాన్సెల్ నేత కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్, రిటైర్డ్ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సీఎంఆర్ఓపీడీ వి.లచ్చిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ తదుపరిగా వచ్చేనెల 3వ తేదీన సచివాలయంలో స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, వక్ఫ్, ఎండోమెంట్, స్వే అండ్ సెటిల్మెంట్ శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. జిల్లాల పర్యటనల తర్వాత తుది నివేదిక ఇవ్వనుంది. -
యూరియా సరఫరాలో కోత
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్లో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు వానాకాలం సీజన్ కంటే గత ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్ టన్నులు పెరగడం గమనార్హం. పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూ.40,000 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. బడ్జెట్పై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన వ్యవసాయ శాఖ గతం కంటే అధికంగా నిధులు కేటాయించాలని కోరడం విశేషం. 2022–23 బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించగా, 2023–24లో రూ.26,831 కోట్లు కేటాయించింది. కాగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం.. రైతుల పట్ల సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందనడానికి నిదర్శనమని అధికార వర్గాలు అంటున్నాయి. రుణమాఫీ, రైతు భరోసాకే అధికం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అలాగే రైతుభరోసా పేరుతో అన్నదాతలకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది. దీనితో వీటికి అధిక మొత్తంలో నిధులు అవసరం. బీఆర్ఎస్ ప్రభుత్వం 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీకి మొత్తం రూ.19,198.38 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలంటే మొత్తం రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలతో కలిపి రూ.36 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. కాగా మొదటి సంవత్సరానికి గాను రూ.7,200 కోట్లు చెల్లించేలా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో.. రుణమాఫీ నిధులను బ్యాంకులకు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకుతో ఒక దఫా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఆర్బీఐతోనూ చర్చించాలని, బ్యాంకులకు నెలసరి వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, రుణమాఫీ ఒకేసారి చేసేలా బ్యాంకులను ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ (గడువు తేదీ)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రుణమాఫీ ఎలా చేయాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఇక రైతుబంధు కోసం 2023–24 బడ్జెట్లో రూ.15,075 కోట్లు కేటాయించారు. తాజాగా రైతుభరోసా సొమ్ము కూడా పెరగడంతో బడ్జెట్ కూడా పెంచాల్సి ఉంది. కాబట్టి రూ.22,500 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా కాగా.. ఆ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపింది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణపైనా దృష్టి సారించాలని, ఆ మేరకు రూ.500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. రైతు బీమాకు ప్రభుత్వం 2022–23లో రూ.1,466 కోట్లు కేటాయిస్తే, 2023–24 బడ్జెట్లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఈసారి రూ.1,600 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు 2023–24 బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈసారి కూడా అంతే మొత్తంలో కేటాయించాలని ఉద్యానశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు, మైక్రో ఇరిగేషన్ తదితరాలకు కూడా నిధులు కోరుతూ వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఇక రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. దీన్ని అమలు చేయాలంటే ఆ మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. -
కౌలురైతులు, అటవీ భూ సాగుదారులకు మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతుభరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించి మూడోవిడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతుభరోసా అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైతుభరోసా పోర్టల్లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద ఈ నాలుగున్నరేళ్లలో 53.53 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ సాయం అందుకున్నవారిలో ఏటా సగటున 51 లక్షల మంది భూ యజమానులు, పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్సీ) ఆధారంగా 1.2 లక్షల మంది కౌలురైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాతో అటవీభూమి సాగుచేసుకుంటున్నవారు 90 వేలమంది ఉన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కౌలురైతులు (సీసీఆర్సీ), ఆర్వోఎఫ్ఆర్ సాగుదారులు మొత్తం 9.39 లక్షల మందికి రూ.1,219.68 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. జనవరిలో మూడోవిడత.. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. లబ్దిపొందిన వారిలో 51 లక్షల మంది భూ యజమానులు, 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. జనవరిలో మూడోవిడత సాయం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరింతమంది కౌలుదారులు, అటవీ భూ సాగుదారులకు లబ్దిచేకూర్చాలని రైతుభరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఓపెన్ చేశారు. లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి. అర్హత ఉండి ఇంకా అవకాశం వినియోగించుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ) పట్టాదారులు ఈ పథకంలో అర్హత సాధించటానికి రైతుభరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కౌలుదారులు సీసీఆర్సీతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అటవీ భూమి సాగుచేసేవారు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఆర్బీకేకి వెళ్లి పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో మూడువిడతల సాయం ఒకేసారి అందించనున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్నాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తకర స్థాయి (శాచ్యురేషన్)లో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో అర్హత ఉండి ఇప్పటివరకు పెట్టుబడి సాయం పొందని కౌలుదారులు, అటవీ భూ సాగుదారులు రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ మేరకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. – చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ -
నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితర అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడిసాయం అందించాలన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే విధానం గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వారానికి రెండ్రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాదర్బార్ప్రజావాణిగా మార్పు ప్రజాదర్బార్ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. దీనిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. తొలి ప్రజాదర్బార్ శుక్ర వారం నిర్వహించగా, ఆ తర్వాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు కావడంతో ప్రజా దర్బార్ నిర్వహించలేదు, సోమ వారం ప్రజా దర్బార్ ఉన్నా, సీఎం రేవంత్రెడ్డి కాకుండా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు, ఇకపై దీనికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ప్రజావాణికి హాజరై విజ్ఞప్తులు స్వీకరిస్తే అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అన్నదాత సేవలో ఆర్బీకే సైన్యం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో పంటలను, పంట ఉత్పత్తులను కాపాడటంలో విశేష కృషి చేస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్బీకేల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ.. పొలాల్లోని వరి పనలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని రైతులతో కలిసి పనలపై సామూహికంగా చల్లుతున్నారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిను కిందకు పోయేలా చేస్తున్నారు. తడిసిపోయిన పనలను రైతు కూలీలతో కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కాలువలు, డ్రెయిన్లను ఉపాధి హామీ కూలీల సహకారంతో మరమ్మతులు చేసి పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు నిలిచి ఉంటే.. చేలల్లో చిన్నపాటి బాటలు, బోదెలు తీసి మడుల నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకే సిబ్బంది స్వయంగా చేలలో నేలకు పడిపోయిన వరి దుబ్బులను లేపి.. కట్టలు కట్టే ప్రక్రియలో రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. పంట నష్టం అంచనాలకు ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని, ముంపు నీరు పూర్తిగా చేల నుంచి తొలగిన తర్వాత పంట నష్టం అంచనా వేసేందుకు ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. -
దిగుబడులు దుమ్మురేపాయి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి. ఆహార ధాన్యాల దిగుబడులే కాదు.. అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల దిగుబడులు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే వచ్చాయి. 2022–23 వ్యవసాయ సీజన్కు సంబంధించి తుది దిగుబడి అంచనాల నివేదికను అర్థగణాంక విభాగం (డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 వ్యవసాయ సీజన్లో 259.28 లక్షల టన్నుల దిగుబడులు రాగా.. ఇవి 2021–22తో పోలిస్తే 22.10 లక్షల టన్నులు అధికంగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పత్తి, మిరప దిగుబడులు.. ఇక వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి 2021–22లో 13.85 లక్షల ఎకరాల్లో సాగయితే 12.74 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాగే, 2022–23లో 17.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 15.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. మరోవైపు.. మిరప 2021–22లో 5.62 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర ప్రభావంతో 4.18 లక్షల టన్నులకు పరిమితమైంది. అదే 2022–23లో 6.47 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 14.63 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. రైతు ఇంట ‘ధాన్యం’ సిరులు.. ♦ 2021–22 సీజన్లో కోటి 51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 237.16 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఆ తర్వాత 2022–23 సీజన్లో వివిధ కారణాల వల్ల కోటి 39 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనప్పటికీ దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నులు నమోదయ్యాయని ఆ విభాగం వెల్లడించింది. ♦ వీటిలో ప్రధానంగా 2021–22లో 60.30 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, హెక్టార్కు సగటున 5,048 కిలోల చొప్పున 121.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. ♦ అదే.. 2022–23లో 53.22 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, హెక్టార్కు సగటున 5,932 కిలోల చొప్పున 126.30 లక్షల ధాన్యం దిగుబడులు నమోదయ్యాయి. ♦ మొత్తం మీద చూస్తే 2021– 22లో కోటి 03 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవగా.. దిగుబడులు కోటి 55 లక్షల టన్నులు వచ్చాయి. 2022–23లో 92లక్షల ఎకరాలకుగాను కోటి 68 లక్షల టన్నుల దిగు బడులొచ్చాయి. అపరాలు, నూనె గింజలు కూడా.. ♦ అపరాల పంటలు 2021–22లో 30.67 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ 2022–23లో 25.80 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.87 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ♦ ఇక నూనెగింజల పంటలు 2021–22లో 25.05 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.68 లక్షల టన్నులు.. 2022–23లో 20.30 లక్షల ఎకరాల్లో సాగవగా, 28.96 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ♦ వీటిలో ప్రధానంగా కందులు 2021–22లో 6.27 లక్షల ఎకరాల్లో సాగయితే.. 68 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. అలాగే, 2022–23లో 6 లక్షల ఎకరాల్లో సాగవగా, 78 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ♦ వేరుశనగ అయితే 2021–22లో 20.62 లక్షల ఎకరాల్లో సాగవగా, 5.15 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 2022–23లో 14.85 లక్షల ఎకరాల్లోనే సాగవగా, 6 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. సగటు దిగుబడులు పెరిగాయి.. ఆర్థిక, గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 సీజన్తో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 2022–23లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదయ్యాయి. తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడంతో దాదాపు ప్రతీ పంటలోనూ హెక్టార్కు సగటు దిగుబడులు 2021–22తో పోలిస్తే పెరిగాయి.– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
యూరియా గుప్పించారు
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్లో 9.50 లక్షల మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్ టన్నులు, సెపె్టంబర్ నెలలో 3.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారు. సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా పెరగడం విశేషం. పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
పొలం బాట పట్టిన విద్యార్థులు
తెనాలి: తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ) విద్యార్థులు పొలం బాట పట్టారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించారు. తమ విద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ల్యాబ్లో ఆయా నమూనాలకు భూసార పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వివరాలతో భూమి ఆరోగ్య కార్డులు సిద్ధం చేస్తారు. సంబంధిత రైతులకు వారి భూమి ఆరోగ్య పరిస్థితులను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో వెల్లడిస్తారు. విద్యార్థులేంటి.. నేల ఆరోగ్యాన్ని చెప్పడమేంటి! సాధారణంగా మట్టి నమూనాలు సేకరించి.. నేల ఆరోగ్యాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తుంది. సంబంధిత అధికారులు మట్టి నమూనాలు సేకరించి.. పరీక్షలు జరిపి.. వివరాలు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా కేంద్రీయ విద్యాలయం విద్యార్థులే ఈ పనికి పూనుకున్నారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్గా పాఠశాలల్లో భూసార మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 కేంద్రీయ విద్యాలయాలను ఎంపిక చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెనాలి కేంద్రీయ విద్యాలయానికి మాత్రమే ఇందులో స్థానం లభించింది. భూసార పరీక్షల నిర్వహణకు విద్యాలయానికి అవసరమైన పరికరాలు, రసాయనాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సహకారంతో వీరు పనిచే సేలా కార్యక్రమాన్ని రూపొందించారు. తెనాలి కేంద్రీయ విద్యాలయంలో 9, 11 తరగతుల విద్యార్థుల్లో 19 మంది ఈ ప్రాజెక్టులో ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రెండు రోజులుగా తెనాలి మండలంలోని గుడివాడ, నందివెలుగు గ్రామాల్లోని మెట్ట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ‘ఆత్మ’ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ నోడల్ అధికారి కేవీ రాజేంద్రప్రసాద్, ఆర్.రామిరెడ్డి సమక్షంలో మొత్తం 52 నమూనాలను సేకరించారు. విద్యాలయంలో ఏర్పాటైన భూసార పరీక్షా కేంద్రంలో వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అందించిన రెండు యాప్ల్లో వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రైతుల వారీగా భూమి ఆరోగ్య కార్డులు తయారవుతాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అనంతరం ఆయా కార్డులతో సంబంధిత గ్రామ సభలు నిర్వహించి.. రైతుల వారీగా వారి భూమిలో నత్రజని, ఫాస్పరస్, పొటాíÙయం సహా 10 రకాల పోషకాల స్థాయిలను వివరిస్తారు. వ్యవసాయ వికాసానికి.. విద్యార్థులకు వ్యవసాయ విజ్ఞానాన్ని నేర్పించటం, రసాయనాలు అధికంగా వాడకుండా సహజ ఎరువులను వినియోగించేలా రైతులకు సూచిస్తూ భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించటం ఆశయాలుగా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రీయ విద్యాలయాలను భాగస్వాములను చేసింది. తగిన శిక్షణ ఇవ్వటంతో అమలుకు శ్రీకారం చుట్టాం. – కేవీ రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి ప్రాజెక్టులో చేరటం సంతోషంగా ఉంది చదువుతోపాటు వ్యవసాయంపై అవగాహనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో చేరటం చాలా సంతోషంగా ఉంది. భూసార పరీక్షలను చేసి రైతులకు ఉపయోగపడతాం. రైతుల కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – ఎన్.శివగగన్, 9వ తరగతి -
మట్టిని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి. -
మరింత మందికి రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని భూ యజమానులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్లో రెండు విడతల సాయం కలిపి పంపిణీ చేయనున్నారు. ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి ఇటీవల పంపిణీ చేసిన తొలి విడత సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 52,57,263 రైతు కుటుంబాలకు రూ.31 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏటా తొలి విడత సాయం పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్ లాగిన్ను తెరుస్తుంటారు. ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా తొలి ఏడాది (2019–20) 45,11,252 భూ యజమానులు అర్హత పొందగా.. ఆ తర్వాత వరుసగా 2020–21లో 50,04,874 మంది, 2021–22లో 50,66,241 మంది, 2022–23లో 49,26,041 మంది లబ్ధి పొందారు. 2023–24 వ్యవసాయ సీజన్లో 50,19,187 మంది భూ యజమానులు లబ్ధి పొందారు. ఏటా పెరుగుతున్న భూ యజమానులు ఇలా ఈ నాలుగేళ్లలో 5,07,935 మంది అదనంగా భూ యజమానులు అర్హత పొందారు. ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పొందిన వారు, తల్లిదండ్రులు మృతిచెందగా వారసత్వంగా భూములు పొందినవారు, అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్న వారు, వివిధ రూపాల్లో మ్యుటేషన్ పొందిన వారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల 12నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం తెరిచారు. ఇంకా అర్హత ఉండి అవకాశం వినియోగించుకోని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించటానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కల్గిన భూ యజమానులకు అక్టోబర్లో రెండు విడతల సాయం అందించనున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాం. మ్యుటేషన్ చేయించుకున్న వారు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు, వారసత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓపీసీఏ) రిజిస్ట్రేషన్తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
ఏపీ బీమా.. ది బెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడంపై పలు రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ముందుకొచ్చాయి. 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై ఉత్తరాఖండ్లోని రిషికేష్లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగిన 10వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఏడాది నుంచి రైతుల నుంచి రూపాయి మాత్రమే వసూలు చేస్తామని, మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వాలు భరిస్తాయని ఆ రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. సెమినార్లో పాల్గొన్న మరికొన్ని రాష్ట్రాలు కూడా ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలును అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించాయి. గతంలో పంటల బీమా రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం.. ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకొని ప్రస్తుతం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. అధిక ప్రీమియం కారణంగా ఈ పథకంలో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారు కాదు. ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమాకు దూరంగా ఉండడంతో ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. అధికారంలోకి రాగానే శ్రీకారం పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూలై 8న ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 ఖరీఫ్ సీజన్లో ఒక్క రూపాయి ప్రీమియంతో ఈ పథకాన్ని అమలు చేయగా, ఆ తర్వాత సీజన్ నుంచి ఆ భారం కూడా రైతులపై పడకుండా వారు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింప చేస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్ పంటలకు సీజన్ ముగియకుండానే లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తోంది. అభ్యంతరాల పరిష్కారం అనంతరం బీమా పరిహారం చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంకా ఎవరైనా మిగిలి పోయారేమోనని వెతికి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తోంది. ఇలా ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇందులో టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. ఏపీ భేష్ అంటూ ముందుకొచ్చిన కేంద్రం పీఎంఎఫ్బీవైతో అనుసంధానించడం ద్వారా 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ.971 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్ విషయంలో ఏపీ స్ఫూర్తిగా కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. 2022–23లో పీఎంఎఫ్బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకం అమలైంది. దిగుబడి ఆధారిత పంటల కోసం 2022 ఖరీఫ్లో రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు కంపెనీలకు చెల్లించగా, వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. గతంలో ఏటా సగటున 16 లక్షల మంది రైతులు, 48 లక్షల ఎకరాలకు బీమా చేయించు కోగలిగితే.. ఈ ప్రభుత్వం వచ్చాక 2019 – 2022 మధ్య ఏటా సగటున 30 లక్షల మంది రైతులకు చెందిన 71.55 లక్షల ఎకరాలకు ఉచిత బీమా కవరేజ్ కల్పించింది. 2020 ఖరీఫ్లో 50 లక్షల ఎకరాలకు కవరేజ్ కల్పిస్తే, 2021 ఖరీఫ్లో బీమా కల్పించిన విస్తీర్ణం ఏకంగా 80 లక్షల ఎకరాలకు చేరింది. ఇలా యూనివర్సల్ కవరేజ్ సాధించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఈ తరహా స్కీమ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని బీమా రంగ నిపుణులే కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు ‘రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేశాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ క్రాప్ డేటా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే రైతుల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. 2023–24 సీజన్ నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ స్ఫూర్తితోనే ఫసల్ బీమాలో మార్పులు కూడా తీసుకొచ్చాం’ అని గత కాన్ఫరెన్స్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడం తెలిసిందే. ఏపీ బాటలో మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగులు వేయాలని అప్పట్లోనే ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కేంద్ర మంత్రితో సహా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలు తీరును ప్రస్తావించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేశాయి. 2019లో ఏపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే రూపాయికే పంటల బీమా అమలు చేస్తున్నామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏపీ ఈ–క్రాప్ ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తూ బీమా రక్షణ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ 20 రాష్ట్రాలు పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్లో పలువురు కొనియాడారు. రైతులపై పైసా భారం పడకూడదన్న ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. పంటల బీమా పరిధిలో కవరేజ్ పెంచడానికి ఇతర రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా వ్యవహరించిందని కేంద్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. సర్వత్రా ప్రశంసలు వర్కుషాపులో ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిసింది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంతో యూనివర్సల్ బీమా కవరేజ్ని అమలు చేస్తుండడం పట్ల, సెమినార్లో పాల్గొన్న రాష్ట్రాలన్నీ ప్రశంసించాయి. తగిన మోడల్ను ఎంచుకోవడానికి రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఇవ్వడం వల్ల 2023–24 సీజన్లో దేశంలోనే అతితక్కువ ప్రీమియం రేట్లను ఏపీ ప్రభుత్వం సాధించగలగడాన్ని కూడా ప్రశంసించారు. ఏపీ బాటలోనే తాము కూడా పయనిస్తున్నామంటూ సెమినార్లో ఆయా రాష్ట్రాలు ప్రకటించడం గొప్ప అచీవ్మెంట్. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ అరుదైన గౌరవం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో ఈ క్రాప్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలు కీలకం. ఈ రెండు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వీటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు క్యూ కడుతున్నాయి. ఒకేసారి నాలుగు రాష్ట్రాలు ఏపీ బాటలో అడుగులు వేస్తున్నట్టు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవం. – కాకాని గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
‘సహకారం’ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్–ప్యాక్స్), రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) భాగస్వామ్యం కావాలి. వీటి నెట్వర్క్ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఆర్బీకేల రూపంలో ప్రతీ గ్రామంలో ఓ బ్రాంచ్ ప్రతి పీఏసీఎస్ పరిధిలో 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతీ ఆర్బీకేలోనూ ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్ను నియమించాం. వీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. పీఏసీఎస్లు, ఆర్బీకేలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం. పీఏసీఎస్లు ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలను గ్రామ స్థాయిలో పీఏసీఎస్లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి. ఇలా పీఏసీఎస్ల మాదిరిగానే ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో ఆప్కాబ్కు, డీసీసీబీలకు ప్రత్యేకంగా శాఖలు ఉన్నట్టుగానే పరిగణించాలి. దేశంలో మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు ఉంది. రైతులకు రుణాల విషయంలో ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్లు వ్యవహరించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలంటే గ్రామ స్థాయి వరకు ఉన్న ఈ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సహకారరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీసీఎంఎస్లపై అధ్యయనం చేయాలి జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా, రైతులతో పాటు సంబంధిత వర్గాల వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ అధ్యయనం జరగాలి. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయి. ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోయినా, ధరలు నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్లకు సముచిత పాత్ర కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను కూడా డీసీఎంఎస్ల ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. ఇందుకోసం çసమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేయాలి. స్వయం ఉపాధి కల్పించాలి గ్రామస్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలివ్వడం వల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ చర్యలు తీసుకోవాలి. గుర్తించిన లబ్దిదారు చేతిలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం డబ్బులు పెడుతుంది. వీటితో వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేలా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి. బంగారంపై ఇచ్చే రుణాలపై కూడా తక్కువ వడ్డీ ఉండాలి. పీఏసీఎస్ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థంగా ఉండేలా చూడాలి. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీలు తయారుచేయాలి. లాభాల బాట పట్టించేలా చూడాలి.. గతంలో చూడని పురోగతి ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్లో కనిపిస్తోంది. ఆప్కాబ్ మన బ్యాంకు, మనందరి బ్యాంక్ అన్న భావనతో తీర్చిదిద్దాలి. మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆప్కాబ్ మాదిరిగానే డీసీసీబీలు, పీఏసీఎస్లను కూడా నూటికి నూరు శాతం లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలి. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆ వివరాలు పీఏసీఎస్ల వద్ద అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రికార్డుల స్వచ్చ్చికరణ జరుగుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. 84.32 శాతం పెరిగిన కార్యకలాపాలు: అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా సహకార రంగంలో ఆర్థిక కార్యకలాపాలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పెరిగాయని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 84.32 శాతం పెరిగాయన్నారు. 2019 వరకూ పీఏసీఎస్లో ఆర్థిక కార్యకలాపాలు రూ. 11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ. 21,906 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 400 పీఏసీఎస్లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయని సీఎంకు చెప్పారు. ఆప్కాబ్లో 2019 మార్చి నాటికి రూ. 13,322.55 కోట్ల టర్నోవర్ ఉండగా, అది 2023 మార్చి నాటికి రూ. 36,732.43 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో 175 శాతం గ్రోత్ రేటు నమోదైందన్నారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ ఎండీ జీ.వీరపాండియన్, సహకార శాఖ కమిషనర్ అహ్మద్బాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంచాలి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వలన సహకార రంగంలోని ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం తీసుకురాగలిగితే ఆ మేరకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి. డీసీసీబీల్లో ఇప్పటికే ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం. అదే రీతిలో పీఏసీఎస్లు, డీసీఎంఎస్లలో కూడా ప్రొఫెషనలిజాన్ని పెంచాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్లు కీలక పాత్ర పోషించాలి. పీఏసీఎస్లు, ఆర్బీకేల నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయిలో నాణ్యమైన సేవలు అందుతాయి. పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలాముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. పీఏసీఎస్ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ అందుబాటులోకి తీసుకురావాలి. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేలా చూడాలి. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యం.. విస్తరణే లక్ష్యం
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది. లక్ష్యానికి మించి పంపిణీ సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది. 2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ 2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ 45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్కు ఖరీఫ్లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్ఎల్ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
57.24 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం... రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. -
డ్రోన్ సాగు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతన్నలకు వ్యవ‘సాయం’ కోసం డ్రోన్లతో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి పెట్టింది. కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కాత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్పెట్టవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లేలా.. డ్రోన్ల ద్వారా వరి విత్తనాలను వెదజల్లి సాగు చేసే విధానాన్ని వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. దీనిపై పరిశోధన కొనసాగుతోందని, త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరి నారు పెంచడానికి కొన్ని రోజులు పడుతుందని, తర్వాత నారు తీసి నాట్లు వేయడానికి సమయం పడుతుందని.. ఇదే సమయంలో కూలీల కొరత, ఖర్చు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే బాగుంటుందని, దీనికి డ్రోన్ సాంకేతికతను వినియోగించేలా పరిశోధన చేస్తున్నామని వివరించారు. డ్రోన్తో రోజుకు ఏకంగా 30 ఎకరాల్లో ఐదు వరుసల్లో వరి విత్తనాలను వెదజల్లవచ్చని చెప్తున్నారు. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసివస్తుందని అంటున్నారు. కలుపు మందును కూడా డ్రోన్ల సాయంతో చల్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. డ్రోన్లపై శిక్షణ కోసం అకాడమీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని.. ఇందుకోసం డ్రోన్ అకాడమీని నెలకొల్పాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో డ్రోన్లను ఎలా వాడాలో శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి శిక్షణ అవకాశం ఉంటుందని.. ఇందుకోసం తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించారు. ఆరు రోజులపాటు సమగ్రంగా శిక్షణ ఇచ్చేందుకు రూ.45 వేలు ఫీజు ఖరారు చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఉంటుంది. పురుగు మందులు చల్లడంపై ప్రత్యేకంగా.. రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే వరి, పత్తి, వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, సోయాబీన్ పంటల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులను చల్లడంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించింది. ఉదాహరణకు డ్రోన్ల ద్వారా పురుగు మందు చల్లేటపుడు వాటి రెక్కల నుంచి వచ్చే గాలి వేగానికి వరి చేను విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు నుంచి డ్రోన్లను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో మందును విడుదల చేయాలన్నది నిర్ణయించారు. ► ఇక సాధారణ తైవాన్ స్ప్రేయర్ల ద్వారా ఎకరా పంటకు పురుగుమందు పిచికారీ చేయాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్ల నీటిని వాడుతారు. అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 20 లీటర్లతో పిచికారీ చేయొచ్చు. ఒక రోజులో ఏకంగా 30 ఎకరాల్లో మందును చల్లవచ్చు. ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా.. కాండం మొదట్లోకి పురుగు మందు చేరేలా చేయవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నానో యూరియాను కూడా డ్రోన్ల ద్వారా పంటలపై చల్లవచ్చని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. పురుగు మందులను తక్కువ వ్యవధిలో, పొదుపుగా, సమర్థవంతంగా చల్లడానికి డ్రోన్లతో వీలవుతుందని వివరించారు. అదనపు పరికరాలను అమర్చి.. పంటలకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడానికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటలకు పైపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి కాండం మొదట్లో చల్లాల్సి ఉంటుంది. దీనితోపాటు పంట పరిస్థితి ఏమిటి? ఏవైనా చీడపీడలు ఆశించాయా? అన్నది తెలుసుకునేందుకు ఫొటోలు తీయాలి. వాటిని వ్యవసాయాధికారికి పంపాలి. ఈ క్రమంలోనే ఆయా అవసరాలకు అనుగుణంగా డ్రోన్లకు ప్రత్యేక పరికరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటల పూత, కాత ఎలా ఉంది? దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశం ఉంది వంటి ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలోనూ పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్లు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సాగు కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరి కోత యంత్రాలు వంటివి ఇవ్వగా.. భవిష్యత్తులో డ్రోన్లను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నారు. డ్రోన్ల సాగులో దేశానికే మార్గదర్శకంగా.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి తెలంగాణ దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ పంటల్లో డ్రోన్ల వినియోగం, నిర్వహణకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఎస్ఓపీ)నే కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై సాధారణ మార్గదర్శకాలివీ.. ► నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాసం పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్లను వినియోగించాలి. ► డ్రోన్ వాడకానికి సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇస్తారు. ► డ్రోన్ మంచి స్థితిలో ఉందని, సురక్షితంగా ప్రయాణించడానికి సరిపోతుందని ముందే సరిచూసుకోవాలి. ► దానితో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ► ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొంది ఉండాలి. ► ముందుగానే ప్రతిపాదిత ప్రాంతం, సరిహద్దు, అడ్డంకులు (గోడలు, చెట్లు)ను పరిశీలించి ఆ ప్రకారం డ్రోన్ను ఆపరేట్ చేయాలి. ► ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై లేదా డ్రోన్లకు అనుమతి లేని జోన్ల మీదుగా ఎగురవేయవద్దు. అనుమతి ఇవ్వని ప్రైవేట్ ఆస్తులపైనా డ్రోన్ ఎగరవేయవద్దు. -
కాటన్పై కాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో వర్షాభావం నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, సోమవారం నాటికి 42.48 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవంగా గతేడాది ఇదే సమయానికి 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే ఈసారి ఏకంగా 11.31 లక్షల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సీజన్ ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈసారి కొద్దిపాటి వర్షాలకు రాష్ట్రంలో 28.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ వాటిని కాపాడుకోవడం కూడా రైతులకు సవాల్గా మారింది. వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తే పరిస్థితి లేకుండాపోతోంది. వ్యవసాయశాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల్లో కూడా పత్తి మొలకెత్తలేదని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల పత్తి భూమిలోనే మాడిపోయిందని అంటున్నారు. దీంతో రైతులు మళ్లీ భూమిని దున్ని పత్తి వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవంగా పత్తి వేయడానికి ఈ నెలాఖరు వరకే గడువు. చిట్టచివరకు ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పత్తి వేయడానికి అదనుపోయినట్లే. ఆలస్యమైతే చీడపీడలు ఆశిస్తాయి. పైపెచ్చు మళ్లీ దున్ని విత్తనాలు వేయాలంటే మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం. మరోవైపు అనుకున్న వెరైటీలు దొరక్క ఏదో ఒక రకం విత్తనం వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. కనీసం 65 లక్షల ఎకరాలకైనా పెంచాలని రైతులకు కోరింది. కానీ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. గతేడాది మేరకైనా పత్తి సాగవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పత్తి అదను దాటిపోతే దానికి బదులుగా మొక్కజొన్న లేదా ఆముదం వంటి పంటలను రైతులు వేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కసరత్తు వర్షాలు లేకపోవడం, కాల్వల్లో నీటి విడుదల లేకపోవడంతో అనేకచోట్ల ఇంకా వరి నార్లు పోయలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ ఎలా గట్టెక్కుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఈ సీజన్ సాగు ప్రమాదంలో పడినట్లేనని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కంటింజెన్సీ ప్రణాళికపై వ్యవసాయశాఖ సమాలోచనలు చేస్తోంది. సకాలంలో పంటలు వేయని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో మంతనాలు జరుపుతోంది. నార్లు వేయని పరిస్థితి నెలకొంటే వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని భావిస్తోంది. స్వల్పకాలిక రకాలైన వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని కిందిస్థాయి సిబ్బందిని వ్యవసాయశాఖ ఆదేశించింది. రోజువారీగా జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తోంది. ఖర్చు రెట్టింపైంది నా రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి గింజలు విత్తాను. కానీ వర్షాలు రాకపోవడంతో మొలకలు రాలేదు. దీంతో రెండోసారి పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి విత్తాను. పత్తి విత్తనాలకు రూ.3,500, సాగుకు రూ.6,000, విత్తడానికి రూ.1,000 ఖర్చయింది. వర్షం రాకపోవడంతో రెండుసార్లు విత్తనాలు వేయడంతో పెట్టుబడి రెట్టింపైంది. ఇప్పటివరకు రూ.21 వేలకుపైగా ఖర్చయింది. – రేఖ శ్రీధర్, రైతు, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా వానల్లేక మొలకెత్త లేదు జూన్ మొదటి వారంలో పొడి దుక్కుల్లో నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. సమయానికి వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత బాగా ఉంది. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. రెండోసారి పెట్టిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుసార్లు వేయాల్సి రావడంతో ఖర్చు ఎక్కువైంది. – చామకూరి రమేష్, పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా -
పారదర్శకంగా పంటల బీమా
సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్పష్టం చేశారు. ‘ఉచిత పంటల బీమా.. అంతా మాయ’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను జాయింట్ అజమాయిషీ కింద ఈ పంటలో నమోదు చేయడంతోపాటు 93 శాతం రైతుల బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు రసీదు కూ డా ఇస్తున్నామన్నారు. కొత్తగా ఎవరి పేర్లను చేర్చడం, తీ సేయడం కానీ చేయడం లేదన్నారు. ఖరీఫ్–2022 సీజన్కు సంబంధించి 10.20 లక్షల మంది అర్హత పొందితే. వారికి రూ.1, 117.21 కోట్ల బీమా పరిహారాన్ని జూలై 8న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేస్తా్తర న్నారు. ఈ పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లుగా లబ్ధి పొందుతున్న రైతులను అయోమయానికి గురిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు నిత్యం అబద్ధాలను అచ్చు వేస్తోందన్నారు. 30 వేల పంట కోత ప్రయోగాలు చేశాం దిగుబడి ఆధారిత పంట నష్టం అంచనాలను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పంట కోత ప్ర యోగాలు చేసినట్టు హరికిరణ్ పేర్కొన్నారు. వాతా వరణ ఆధారిత పంట నష్టం అంచనా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,817 వాతావరణ కేంద్రాల్లో నమోదైన సమాచారాన్ని (అధిక/లోటు వర్షపాతం, ఉష్ణోగ్రతలు) పరిగణనలోకి తీసుకుని బీమా పరిహారాన్ని లెక్కించామన్నారు. సత్యదూరమైన ఇలాంటి కథనాలతో రైతులను గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జూలై 15, జూలై 31, ఆగస్ట్ 15 నాటికి సరైన వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంటలు, పంట రకాల మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా పంటల కాలంలో అవసరమయ్యే వివిధ పంటల సరళి, అవసరమైన ఉత్పాదకలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా జూలై 15 నాటికి వర్షాలు పడకపోతే.. 40 వేల క్వింటాళ్లు, జూలై 31 నాటికి వర్షాలు పడకపోతే 71 వేల క్వింటాళ్లు, ఆగష్టు 15 నాటికి వర్షాలు పడకపోతే లక్ష క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల పంపిణీకి కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే నేషనల్ సీడ్స్, తెలంగాణ సీడ్స్, కర్ణాటక సీడ్స్ కార్పొరేషన్ల నుంచి విత్తనాలు సమీకరించి ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
పంటలకు మద్దతు ధర అరకొరేనా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి. కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వా మినాధన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది. స్వామినాధన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
‘రైతు వేదిక’లు ఇక ప్రజా వేదికలు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు వేదిక’లు ఇక నుంచి ‘ప్రజా వేదిక’లుగా రూపాంతరం చెందనున్నాయి. రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా ఇతర ప్రభుత్వ లబ్ధిదారులకు సంబంధించిన మీటింగులు పెట్టుకునేలా వీలు కల్పిస్తూ వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలూ తమ కార్యక్రమాలను రైతు వేదికగా ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథక లబ్ధిదారులందరినీ రైతు వేదికల వద్దకు పిలిచి వారికి అవగాహన కల్పించొచ్చు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలపై అవగాహన కల్పించాలంటే ఇక రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చు. ఆ మేరకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే... వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో పాటు సాంకేతిక వ్యవసాయంతో పాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతు వేదికలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం రూ.12 లక్షలు ఖర్చు చేసింది. మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలతో వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో రైతు వేదికలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్న భావన సర్కారులో నెలకొంది. అందుకోసం ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచించింది. వీటిని నిత్యం ఏదో ప్రభుత్వ కార్యక్రమం జరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రస్తుత నిర్ణయంలోని ఉద్దేశం. ప్రైవేట్ కార్యక్రమాలకూ ఇవ్వాలన్న ప్రతిపాదనలు... మండలానికి మూడు నాలుగు చొప్పున రైతు వేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఆదాయ కేంద్రాలుగా మార్చాలని జిల్లాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలయాలకు ఇవ్వడం వల్ల ఆయా కేంద్రాలకు ఆదాయం సమకూరుతుందని, దీనివల్ల రైతు వేదికల నిర్వహణ భారం ప్రభుత్వంపై ఉండదని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం నెలకొంది. అలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతుందని అంటున్నారు. గతంలో ఒకట్రెండు చోట్ల ప్రభుత్వం దృష్టికి రాకుండానే రైతు వేదికలను పెళ్లిళ్లకు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుతానికి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఇవ్వొద్దని నిర్ణయించారు. -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
రైతులకు చైతన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు సీజన్ ప్రారంభానికి ముందు మే నెలలో వారంపాటు రైతు చైతన్య యాత్రలను వ్యవసాయ శాఖ నిర్వహించేది. సీజన్కు ముందు రైతులకు కొత్త వంగడాలు, పథకాలు, పంట రుణాలు, సాగునీటి వసతి, వర్షపాతం, విద్యుత్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా సూచించేవారు. ప్రతీ గ్రామంలో రైతు చైతన్య యాత్రలు జరగడం వల్ల కిందిస్థాయిలో రైతులకు, అధికారులకు మధ్య సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు రైతు చైతన్య యాత్రలు నిలిచిపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లక్షలాది రైతులకు దూరం గతంలో రైతు చైతన్య యాత్రలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశు సంవర్థకశాఖ తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేవారు. సీజన్కు సన్నద్ధతపై వివరించేవారు. కొత్త వంగడాలు, విత్తనాలు ఎప్పుడు చల్లాలి, ప్రభుత్వ పథకాలు, ఎలాంటి పంటలకు డిమాండ్ ఉందనే విషయాలను చెప్పేవారు. సీజన్ను త్వరగా ప్రారంభించేలా చైతన్యం కలిగించేవారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేవారు. పంట రుణాలపై బ్యాంకర్లు చెప్పేవారు. మోటార్లకు విద్యుత్ అందించే విషయంలో వివరించేందుకు విద్యుత్ అధికారులు.. సాగునీటి వసతి, కాలువల్లో నీటిని వదిలే విషయాలను వెల్లడించేందుకు నీటిపారుదల అధికారులు హాజరయ్యేవారు. ఇతరత్రా అన్ని రకాల వివరాలను చెప్పేందుకు రెవెన్యూ అధికారులు కూడా వచ్చేవారు. ఒకరకంగా రైతులకు ఇదో వర్క్షాప్ మాదిరిగా ఉండేది. ఇలా రాష్ట్రంలోని మొత్తం 12 వేల గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేవారని వ్యవసాయవర్గాలు చెప్పాయి. ప్రత్యామ్నాయంగా నిలవని రైతు వేదికలు రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు 2,500 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఏఈవో కేంద్రంగా వీటిని నెలకొల్పింది. వాటిల్లో రైతులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. కానీ రైతు వేదికలు ఆ మేరకు సేవలు అందించలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. రైతు చైతన్య యాత్రలు ప్రతీ గ్రామంలో కొనసాగేవి. కానీ రైతు వేదికలు చైతన్య యాత్రలకు ప్రత్యామ్నాయంగా నిలవడంలేదు. అదీగాక కిందిస్థాయిలో ఉన్న ఏఈవోలకు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే పరిస్థితి లేదు. అలాగే, రైతు వేదికలకు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్య, విద్యుత్, సాగునీటిపారుదల తదితర శాఖల అధికారులు వచ్చే పరిస్థితి లేదు. గత నెలన్నర రోజులుగా అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కనిపిస్తోంది. కనీసం క్షేత్రస్థాయికి వెళ్లడానికి కూడా రాష్ట్రస్థాయి అధికారులు ఆసక్తి ప్రదర్శించడంలేదన్న ఆరోపణలున్నాయి. కాగా, వ్యవసాయ అధికారులకు రైతుబంధు, రైతుబీమా పనులు, ఇతరత్రా రోజువారీ సమాచార సేకరణ, ఆ డేటా అప్లోడ్ వంటి పనులతోనే సరిపోతోందన్న వాదన ఉంది. -
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. -
Telangana: కల్లాల్లో కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు. – వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం రాళ్లవాన ముంచింది మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది. – గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా పావు మందమే వడ్లు మిగిలాయి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది. – రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్ పంట నష్టం అంచనాలివీ.. ఉమ్మడి కరీంనగర్లో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా. మెదక్ ఉమ్మడి జిల్లాలో.. సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్లో.. కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్కు వ్యవసాయ శాఖ నివేదించింది. -
Andhra Pradesh: సంపూర్ణ ‘మద్దతు’
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా మద్దతు ధర లభించని పక్షంలో వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకుని ఎమ్మెస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. పంటల ధరల పర్యవేక్షణకు తెచ్చిన ‘సీఎం యాప్’ విషయంలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. యాప్ ద్వారా రోజువారీ పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించుకున్న విధంగా (ఎస్వోపీ) పనిచేసేలా పర్యవేక్షిస్తూ, లోపాలుంటే చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతన్నలను అక్కడకు వెళ్లండి.. ఇక్కడకు వెళ్లండంటూ తిప్పొద్దు. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రసీదు అందచేయడంతోపాటు అందులో కొన్ని సూచనలు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలి? అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే వివరాలతో సూచనలు ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకొచ్చిన 1967 టోల్ఫ్రీ నంబర్ రసీదులో తప్పనిసరిగా ఉండాలని, దళారులు, మిల్లర్ల ప్రమేయానికి తావులేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల సందర్భంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాల సాగు.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను సాగు చేయడంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధర వస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. మే 10వతేదీ కల్లా అర్హులైన జాబితాలను సిద్దం చేయాలి ప్రతీ ఆర్బీకే పరిధిలో గోడౌన్ కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వీలుగా దశలవారీగా ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్ సీజన్ కోసం అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఏటా పంపిణీ చేసే ఇన్పుట్స్ పెంచుకుంటూ వెళ్లాలి. పంపిణీ ప్రక్రియ మరింత సమర్థంగా ఉండాలి. ఆర్బీకేల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. మే 20వతేదీలోగా మిగిలిన ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సాగు ఉపకరణాల పంపిణీ చేపట్టాలి. జూలై కల్లా 500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధం కావాలి. ఈ – కేవైసీ 97.5 శాతం రబీలో సాగైన 48.02 లక్షల ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి చేసినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రైతులందరికీ డిజిటల్గానే కాకుండా భౌతికంగా కూడా రశీదులిచ్చి పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలకు డేటాను పంపినట్లు వివరించారు. ఈ–కేవైసీ 97.5 శాతం పూర్తైందన్నారు. రబీలో సాగైన పంట ఉత్పత్తుల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని, తొలిసారిగా రైతులకు అందిస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల చెల్లింపులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రూ.7,233 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా ఇప్పటికే రూ.7,200 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల మరో రూ.33 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలియచేయడంతో వాటిని పరిష్కరించి రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ. తిరుపాల్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల కమిషనర్లు ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్పాండే, హెచ్.అరుణ్కుమార్, విత్తనాభివృద్ధి, పౌరసరఫరాల సంస్థల ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వినియోగంపై ఎన్జీరంగా వర్సిటీ శిక్షణ ► జూలై నాటికి 500, డిసెంబర్ నాటికి 1,500 ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లు సమకూర్చేలా కార్యాచరణ సిద్ధం. ► డ్రోన్ల వినియోగంపై తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు. ► ఇప్పటికే 6,500 ఆర్బీకేల పరిధిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు. మరో 3,953 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ), 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు మే 20లోగా వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా సాగు ఉపకరణాలు అందించేలా సన్నద్ధం. ► ఆర్బీకేల స్ధాయి సీహెచ్సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు రూ.25 లక్షల విలువైన యంత్రాలు అందుబాటులోకి. ► గతేడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువుల సరఫరా. ఈ ఏడాది మరింత పెంచేలా చర్యలు. ► ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు. ► ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాము నిర్మించే లక్ష్యంతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి. ఇప్పటికే 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా 206 చోట్ల పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 93 గోడౌన్లు. వివిధ దశల్లో గోదాములను జూలై కల్లా పూర్తి చేసేలా చర్యలు. -
రాష్ట్రంలోవిత్తన పరిశోధన, శిక్షణ సంస్థ
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలి విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంక్, సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, విత్తనాలు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మించనుంది. రైతుల కోసం ట్రైనింగ్ సెంటర్తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిపొ్లమా చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగు వేసే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సంస్థ లక్ష్యాలివే.. రాష్ట్రంలో విత్తన నాణ్యతను పరీక్షించే నెట్వర్క్ను బలోపేతం చేయడం, మానవ వనరుల అభివృద్ధి, సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవడం, ఏటా కనీసం 1,000 మంది అగ్రి గ్రాడ్యుయేట్స్, 2 వేల మంది అగ్రి డిపొ్లమా విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ఈ కేంద్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాగా, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగేలా, అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల విత్తనాలను రూపొందించడంలో, సంకర జాతులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. -
కడుపులో పెట్టుకుంటం: సీఎం కేసీఆర్
పంటలు దెబ్బతింటే తెలిసీ తెలియక నష్టపరిహారం అంటారు. కానీ వాస్తవంగా దీన్ని సహాయ పునరావాస చర్యలు అంటారు. నష్ట పరిహారం అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. సాధ్యం కాదు కూడా. మళ్లీ రైతు పుంజుకుని వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధులు ఖమ్మం, కరీంనగర్/సాక్షి, మహబూబాబాద్, వరంగల్/దుగ్గొండి: ఇటీవలి అకాల వర్షాలకు రాష్ట్రంలోని 2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కె.చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ పునరావాస చర్యగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.228 కోట్లు గంటలోనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్లో సంబంధిత జీవో కాపీని కూడా చూపించారు. ‘ఇది చాలా కాస్ట్లీ. ఎకరానికి రూ.10 వేలు ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఈ పంట.. ఆ పంట అని కాకుండా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ సహాయం బాధిత రైతులకు అందుతుంది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో వరి, టమాట పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అడవి రంగాపురంలో పంట నష్టం చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. పలుచోట్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే.. ‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో గాలి దుమారం, వడగళ్ల వాన రైతులను నిండా ముంచేసింది. మొక్కజొన్న 1,29,446 ఎకరాల్లో, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నర్సంపేటలాంటి ప్రాంతాల్లో పంటలు గుర్తుపట్టలేనంతగా పాడయ్యాయి. కరీంనగర్లో 100 శాతం దెబ్బతిన్నాయి. నేను హైదరాబాద్ నుంచే ఎకరానికి రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పి చేతులు దులుపుకోవచ్చు. కానీ రైతుల కష్టాలు నాకు తెలుసు. రైతులు బాధ తెలిసిన వాళ్లంగా రైతుల వద్దకు వచ్చి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కోడ్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెద్దగా రావు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఉంది. వారికి రాజకీయాలు తప్ప ప్రజలు లేరు.. రైతులు లేరు అనే పరిస్థితి ఉంది. చీఫ్ సెక్రటరీ, మేము పంటల నష్టంపై రాస్తే కేంద్ర బృందం వస్తుంది. ఎప్పుడు వస్తుందో.. ఏం సంగతో దేవునికి ఎరుక. వచ్చినా.. దొంగలు పడిన తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆరు నెలలకు కాని రూపాయి రాదు. కేంద్రం ఇస్తే మహద్భాగ్యంగా.. మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,333, వరికి రూ.5,400, మామిడి తోటలు ధ్వంసం అయితే రూ.7,200.. ఇదీ ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూలకూ సరిపోదు. గతంలో పంపినదానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఈ విధానాలకు నిరసనగా మేం కేంద్రానికి పంట నష్టంపై నివేదిక పంపదలుచుకోలేదు. చెప్పదలుచుకోలేదు.. చెప్పినా దున్నపోతు మీద వానపడినట్టే. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడు. మా రైతులను మేమే కాపాడుకుంటాం. వందశాతం మేమే ఆదుకుంటాం..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. రబ్బరు బంతిలా తిరిగి ఎగరాలి ‘ఖమ్మం జిల్లా జిల్లాలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిని కూడా ఆదుకునేలా సీఎస్కు చెప్పి.. జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు ఇప్పిస్తాం. డబ్బు రైతుకు ఇవ్వకుండా కౌలు రైతులను ఆదుకునేలా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తాం. పంట నష్టపరిహారం విషయంలో 2015 నాటి జీవోను కూడా సడలిస్తాం. అయితే మొత్తానికి కాకుండా ప్రస్తుతం కౌలు రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను రివైజ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నిరాశకు గురి కావద్దు. ధైర్యం కోల్పోవద్దు. రబ్బరు బంతిలా తిరిగి ఎగిరే విధంగా, జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పంటలు గొప్పగా పండించే ఆలోచనకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వానల ముప్పు ఇంకా తొలగిపోలేదు. మరో రెండు మూడురోజుల్లో వడగళ్లు మళ్లీ పడవచ్చు. అయినా అధైర్య పడొద్దు..’ అని సీఎం అన్నారు. దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ‘ఇప్పటికీ వ్యవసాయం దండగనే మూర్ఖులు, కొందరు మూర్ఖ ఆర్థికవేత్తలు ఉన్నారు. వ్యవసాయంతో ఏమీ రాదని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్గా ఉంది. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర చాలా పెద్దగా ఉంది. లక్షలాదిమంది పొట్ట పోసుకోవడానికి, అనేక రకాల ఉపాధులు కల్పించేలా వ్యవసాయం రంగం ఉంది. ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినం. రాష్ట్రంలో వ్యవసాయం అత్యున్నత స్థితిలో ఉంది. వలస వెళ్లిన రైతును తిరిగి రప్పించి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, నీటితీరువా రద్దు తదితర సదుపాయాలు కల్పించాం. ఈ రోజు దేశం మొత్తం మీద చూస్తే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలన్నింట్లో వరి 50 లక్షల ఎకరాలు ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల్లో ఈ పంట ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చుతాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి ‘దేశంలో ఒక పద్ధతి..పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే.. పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. గత కేంద్ర ప్రభుత్వాలూ అంతే. ఇప్పుడున్న ప్రభుత్వమైతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. వాళ్లకు చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటేలా అన్నట్లు పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఒక మాట చెబుతున్నాం. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి..’ అని కేసీఆర్ అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, సీఎంఓ అధికారి రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. బస్సులోనే మధ్యాహ్న భోజనం.. సమయం తక్కువగా ఉండడంతో సీఎం ఎక్కడా విరామం లేకుండా పర్యటించారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు వచ్చిన కేసీఆర్.. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలతో కలిసి బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి పెరుగన్నం వడ్డించారు. ధైర్యం చెప్పేందుకే వచ్చా.. కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో రైతు సోమ్లా నాయక్ పంటను పరిశీలించారు. అనంతరం ఆయనతో మాట్లాడారు. సీఎం: అరే...మిర్చి పంటంతా పాడైంది కదా.. ఈ చేను ఎవరిది? రైతు: నాదే అయ్యా...నా పేరు సోమ్లా నాయక్. సీఎం: ఎన్ని ఎకరాల్లో మిర్చి వేసినవ్...ఎంత కాలంగా సాగు చేస్తున్నావు? రైతు: ఈ ఏడు రెండెకరాల్లో వేసినా. పదేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. సీఎం: మిర్చి మీద లాభాలు వస్తున్నాయా? రైతు: పోయినేడు నష్టమే వచ్చింది. ఈ సంవత్సరం ధర మంచిగానే ఉంది. క్వింటాల్కు రూ.20 వేలకు పైగా పలుకుతుందనుకుంటే మాయదారి రాళ్ల వాన నట్టేట ముంచింది. సీఎం: అవును ఈ ఏడు మిర్చికి బాగానే ధర ఉంది. కానీ పంటంతా నష్టపోయావు. ఇలాంటి పరిస్థితిలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. నీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్లో మరింత మెరుగ్గా వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తా. రైతు: అవును అయ్యా.. తెలంగాణ వచ్చిన తర్వాతే కరెంటు, నీళ్ల తిప్పలు పోయినయి. సీఎం: (రైతు భుజంపై చేయి వేసి) ఇది మన ప్రభుత్వం. రైతు ప్రభుత్వం. అందుకోసమే మీకు ధైర్యం కల్పించేందుకు వచ్చా. బాధ పడకండి..భయపడకండి. అటు తమ్మినేని.. ఇటు కూనంనేని.. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. రావినూతల, గార్లపాడు గ్రామాల్లో ఇద్దరు నేతలు సీఎం వెంటే ఉండి పంటల పరిశీలనలో పాల్గొన్నారు. జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేయడంతో పాటు రైతులు, కౌలు రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కుడి, ఎడమ సీట్లలో కూర్చున్నారు. రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. -
రాజస్తాన్లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్లోని కాల్ సెంటర్ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1,654 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలుకు రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై), క్రిషోన్నతి పథకాల కింద 2023–24 సంవత్సరానికి రూ.1,654 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలకు నిధుల కేటాయింపుౖపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడంతో పాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్కేవీవై, క్రిషోన్నతి యోజన కింద నిధుల కోసం కేంద్రం ప్రతిపాదనలు కోరిందని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుçస్తూ ఏటా ఈ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆర్కేవీవై కింద ఈ ఏడాది రూ. 1,148 కోట్లకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ నిధులతో కిసాన్ డ్రోన్ టెక్నాలజీ ప్రోత్సాహం, భూసార పరిరక్షణ, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు బిందు సేద్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పొగాకుకు బదులుగా అపరాలు, నూనె గింజలసాగు పెంచడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా క్రిషోన్నతి యోజన కింద ఈ ఏడాది 506 కోట్ల రూపాయాలతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. వీటితోపాటు జాతీయ ఆహార భద్రత పథకం కింద 70 కోట్ల రూపాయలుర, జాతీయ నూనె గింజల పథకం కింద 29.50 కోట్ల రూపాయలు, రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందించేందుకు 19 కోట్ల రూపాయలు, వ్యవసాయ విస్తరణ, శిక్షణకు రూ.36 కోట్లు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్తో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘తృణ’ధాన్యమే..! రాష్ట్రంలో అంతంతమాత్రంగానే సాగు
సాక్షి, హైదరాబాద్: తృణ ధాన్యాలు...చిరుధాన్యాలుగా పేరొందిన వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. కోవిడ్–19 తర్వాత పరిస్థితులతో వీటికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. సమృద్ది పోషకాలతో పాటు రోగ నిరోదక శక్తిని పెంపొందించడం, జీర్ణవ్యవస్థను గాడిలో ఉంచడంతో పాటు మానవ శరీరానికి పలు రకాల మేలు చేయగల ఈ తృణధాన్యాల సాగు రాష్ట్రంలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. నాలుగైదేళ్లుగా ఈ ధాన్యాల సాగు రాష్ట్ర స్థాయిలో కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఇతర రాష్ట్రాల దిగుబడులతో పరిశీలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. తృణ ధాన్యాల్లో ఎక్కువగా వినియోగించేవి జొన్నలు, సజ్జలు, రాగులు. వీటితో పాటు కొర్రలు, అరికెలు, సామలు తదితరాలు తృణధాన్యాల కేటగిరీలోకే వస్తాయి. కానీ తొలి మూడింటి కంటే వీటి వినియోగం అంతంత మాత్రమే. ఆరోగ్య సూత్రాల్లో భాగంగా తృణ ధాన్యాల వినియోగంపై వైద్య రంగ నిపుణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సూచనలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో వీటి సాగు అత్యల్పమే. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రాల వారీగా తృణధాన్యాల దిగుబడులపై కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా దిగుబడుల్లో తెలంగాణ అత్యంత వెనుకబడి ఉంది. 2021–22 అంచనాలను బట్టి రాష్ట్రంలో తృణ ధాన్యాల దిగుబడి 180.13 మెట్రిక్ టన్నులుగా ఉంది. సరిగ్గా 2017–18 వార్షికంలో ఈ దిగుబడులు కేవలం 83.67 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రథమ స్థానంలో రాజస్తాన్... చిరుధాన్యాల దిగుబడుల్లో దేశంలోనే రాజస్తాన్ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. రాజస్తాన్లో ఏటా సగటున 4290.95 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి వస్తోంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 2,296 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా...ఉత్తర్ప్రదేశ్లో 2223.86 మెట్రిక్ టన్నుల దిగుబడితో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ ముందు వరుసలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున 15921 మెట్రిక్ టన్నుల తృణ ధాన్యాలు దిగుబడి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాని అత్యంత మేలుచేసే తృణధాన్యాల సాగును విస్తృతం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో తృణధాన్యాల సాగుకు వాతావరణం అనుకూలతతో పాటు ఇక్కడి నేలలు సైతం ఎంతో అనుకూలమైనప్పటికీ వ్యవసాయ శాఖ మాత్రం ఈ అంశంపై ఎలాంటి దృష్టి సారించలేదనిపిస్తోంది. వినియోగం పెరిగితే దిగుమతి చేసుకునే కంటే స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని పెంచితే సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలకు సూచించింది. -
చిరుధాన్యాలపై అవగాహన
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పొడవునా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ చెప్పారు. అందుకు తగినట్టుగా 100 హెక్టార్లకు ఒకటి చొప్పున పంటల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణనిస్తూ, భవిష్యత్లో మంచి ధర లభించేలా కృషిచేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాల ఏర్పాటు కోసం జిల్లాల్లోని జిల్లా పర్చేజింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీపీఎంసీ) ద్వారా యంత్ర పరికరాల సూచిక ధరలను ఖరారు చేయాలని చెప్పారు. పీఎం కిసాన్ 13వ విడత ఆర్థికసాయాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందించేందుకు వీలుగా రైతుల ఈ–కేవైసీని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రబీలో సాగుచేసి కోతకు వచ్చే శనగలు, మినుములు, పెసలు, ఇతర పంటల ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉన్న ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీలోగా, మిగిలిన జిల్లాల్లో 15వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్గౌడ్ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
కొత్తగా 300 ఏఈవో పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 300కుపైగా వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) పోస్టులు రానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రం సాగుభూమి పెరగడం, ఏఈవో క్లస్టర్ల పరిమాణం పెరగడంతో వాటిని హేతుబద్ధీకరించాలని.. అవసరమైన చోట కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త క్లస్టర్ల అవసరం, వాటికి ఏఈవోల నియామకంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్లస్టర్ల ఏర్పాటు అమల్లోకి రాగానే, కొత్త ఏఈవో పోస్టులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా వాటిని భర్తీ చేస్తారు. సాగుభూమి పెరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం 2018లో వ్యవసాయ భూములను క్లస్టర్ల వారీగా విభజించి వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. దాదాపు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేశారు. అప్పుడు వానాకాలం సీజన్లో దాదాపు కోటి ఎకరాల వరకు సాగయ్యేది. కాస్త చిన్న, పెద్ద కలిపి 2,601 క్లస్టర్లు ఏర్పాట య్యాయి. ప్రతీ క్లస్టర్కు ఒక ఏఈవో ఉంటారు. ఆ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ భూమిని పర్యవేక్షించడం, రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, రైతు వేదికల నిర్వహణ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారుల గుర్తింపు, వారికి అవసర మైన సహాయ సహకారాలు అందించడం వంటి బాధ్యతలను ఏఈవోలు నిర్వర్తిస్తారు. క్లస్టర్ పరిదిలో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారాన్ని ట్యాబ్ల ద్వారా అప్లోడ్ చేస్తారు. అయితే కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, రైతుబంధు వంటి కారణా లతో రాష్ట్రంలో సాగయ్యే భూమి విస్తీర్ణం 1.46 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చాలా క్లస్టర్ల పరిధిలో సాగు భూమి ఐదు వేల ఎకరాలకు మించి పెరిగింది. 300కుపైగా క్లస్టర్లలో 6 వేల నుంచి 12 వేల ఎకరాల వరకు సాగుభూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కస్ట ర్లకు సంబంధించిన ఏఈవోలపై పనిభారం పెరిగింది. పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సాగుభూమి పెరిగిన, తక్కువగా ఉన్న క్లస్టర్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఏఈవో క్లస్టర్లలో.. పంటల వారీగా క్లస్టర్లు రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను కూడా ప్రభు త్వం గతేడాది గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. ఆ ప్రకా రం రానున్న సీజన్లో గుర్తించిన క్లస్టర్లలో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్లను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనేది సర్కారు ఉద్దేశం. రాష్ట్రంలో ప్రధాన పంటలకు సంబంధించి 2,613 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 పంట క్లస్టర్లు, కందులకు 71 క్లస్టర్లు, సోయాబీన్కు 21 క్లస్టర్లు, మొక్కజొన్నలకు తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది. ఆర్బీకేలకు ఇన్చార్జ్లుగా.. ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6,291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య, 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్బీకేలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకులే ఇన్చార్జ్లుగా ఉన్నారు. కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్చార్జ్లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెందిన సహాయకులు సెకండ్ ఇన్చార్జిలుగా సేవలందిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల పరిధిలో పాడి సంపద ఉండడంతో ప్రతి ఆర్బీకేకు ఓ పశుసంవర్ధక సహాయకుడు చొప్పున కేటాయించారు. ఇలా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాలు.. ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్ను ఆర్బీకేలకు అనుసంధానించారు. మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సచివాలయాల్లోనూ.. ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాం. –వై.మధుసూదనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
రైతన్నకు ‘విత్తన’ దన్ను
సాక్షి, అమరావతి: మాండూస్ తుపాను కారణంగా విత్తనాలు కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. అదును ఉన్నా మళ్లీ విత్తేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు గురవుతున్న అన్నదాతలపై ఆర్థికభారం పడకుండా అండగా నిలుస్తోంది. వీరికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తోంది. ఏ విత్తనం కావాలన్నా, సాగు విస్తీర్ణం బట్టి ఎంత కావాలన్నా సరఫరా చేస్తోంది. మాండూస్ తుపాను ఇటీవల రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రబీ సీజన్లో ముందుగా పంటలు సాగుచేసే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో వరి, శనగ, వేరుశనగ, నువ్వులు, మినుము విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. వరిలో ఎన్ఎల్ఆర్–34449, ఆర్ఎన్ఆర్–15048, శనగలో జేజీ 11, పెసలులో పీయూ 31, వేరుశనగలో కదిరి లేపాక్షి రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. ఇలా ఆయా జిల్లాల నుంచి 33వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 28వేల క్వింటాళ్లను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంచేసింది. ఆర్బీకేల్లో విత్తనం కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేస్తోంది. వారికి డి.క్రిష్ యాప్ ద్వారా పారదర్శకంగా విత్తన సరఫరా చేస్తోంది. 15వేల మంది రిజిస్ట్రేషన్ ఇక విత్తనాల కోసం ఇప్పటివరకు 15వేల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 10వేల మందికి 8,727 క్వింటాళ్ల విత్తనం సరఫరా చేశారు. వీరికి 4,686 క్వింటాళ్ల వరి, 3,288 క్వింటాళ్ల శనగ, 748 క్వింటాళ్ల వేరుశనగ, ఐదు క్వింటాళ్ల నువ్వుల విత్తనం సరఫరా చేశారు. జనవరి 10 కల్లా మిగిలిన వారికి 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆయా జిల్లాల్లోని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు రబీలో 8 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వరి విత్తనం వేశా. తుపాన్ దెబ్బకు మొత్తం పోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయా. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. మొన్న రెండు బ్యాగ్లు ఆర్ఎన్ఆర్ 15048 విత్తనం తీసుకున్నా. ప్రభుత్వం ఆదుకోవడం ఆనందంగా ఉంది. పంట నష్టాన్ని కూడా అంచనా వేశారు. – అట్ల కృష్ణయ్య, తునుబాక, పెల్లకూరు మండలం, తిరుపతి జిల్లా జనవరి 10కల్లా అందరికీ సరఫరా సీఎం జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై వరి, శనగ, వేరుశనగ, అపరాల విత్తనాన్ని సరఫరా చేస్తున్నాం. 33వేల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ఇప్పటికే 28వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంచేశాం. 8,727 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పంట దెబ్బతిన్న రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకుంటే జనవరి 10కల్లా కావాల్సిన విత్తనం సరఫరా చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నాకున్న ఐదెకరాల్లో శనగ పంట వేశాను. వేసిన వారంలోనే తుపానువల్ల మొలక దశలోనే పంట పూర్తిగా దెబ్బతింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. కేవలం రూ.2,040 చెల్లించి ఆర్బీకేల్లో 1.25 క్వింటాళ్ల శనగ విత్తనం తీసుకున్నా. సబిడీపై విత్తనం ఇవ్వకపోతే చాలా ఇబ్బందిపడే వాళ్లం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – నలదల కొండయ్య, పలుకూరు, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా -
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకూ ఆయిల్పామ్ విస్తరణ
సాక్షి, అమరావతి: నీటి సౌకర్యం గల ప్రతి ప్రాంతంలోనూ ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలకే పరిమితమైన ఆయిల్పామ్ సాగును ఇకపై ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ విస్తరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 236 మండలాల్లో ఆయిల్పామ్ సాగవుతుండగా.. తాజాగా మరో 117 మండలాలను నోటిఫై చేశారు. ఆయిల్పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు ఉండగా.. ఏపీలో 4.81 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తాజాగా నోటిఫై చేసిన 117 మండలాల్లో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మండలాల పరిధిలో రానున్న నాలుగేళ్లలో రూ.617.50 కోట్లను రైతులకు ప్రోత్సాహకాల రూపంలో అందజేస్తారు. ఆయిల్పామ్ మొక్కల కొనుగోలు, అంతర పంటల సాగు, నిర్వహణ, యాంత్రీకరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి వెల్లడించారు. -
‘చిరు’ ప్రయత్నం చేయాల్సిందే!
కొన్ని సందర్భాలు ఆగి ఆలోచించుకోవడానికి ఉపకరిస్తాయి. గతాన్ని సింహావలోకనం చేసుకొమ్మం టాయి. భవిష్యత్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఐరాస ప్రకటించిన ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సరం’ సరిగ్గా అలాంటి సందర్భమే. మన దేశం చొరవతో ఈ ప్రకటన రావడం సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచమే కాదు... ముందుగా మనమెక్కడ ఉన్నామో పర్యాలోచించుకోవాలి. ఆరోగ్య ‘సిరి’గా పేరు తెచ్చుకున్న విలువైన పోషకాహారానికి మనం నిజంగానే ఆచరణలో విలువ ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత నాలుగైదు దశాబ్దాల్లో మన దేశంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తి 2.3 – 2.4 కోట్ల టన్నుల నుంచి 1.9– 2 కోట్ల టన్నులకు పడిపోయిందట. ఈ లెక్కలు కొత్త సంవత్సర కర్తవ్యానికి ఓ మేలుకొలుపు. జనవరి 1 నుంచి చిరుధాన్య వత్సరంగా ఉత్సవం జరుపుకొనేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, 2018లోనే భారత సర్కార్ ఆ ఏడాదిని జాతీయ చిరుధాన్య వత్సరంగా తీర్మానించింది. చిరుధాన్యాలను ‘పోషక సంపన్న ఆహారధాన్యాలు’గా అధికారికంగా గుర్తించి, ‘పోషణ్ మిషన్ అభియాన్’లో చేర్చింది. ఆపైన 2023ను అంతర్జాతీయ చిరుధాన్య వత్సరమని ప్రకటించాల్సిందిగా ఐరాసకు ప్రతిపాదన పెట్టింది. మరో 72 దేశాలు మద్దతునిచ్చాయి. అలా ఈ పోషక ధాన్యాలను ప్రోత్సహించాలన్న మన చొరవ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకుంది. చివరకు 2021 మార్చి 5న ఐరాస సర్వప్రతినిధి సభ చిరుధాన్య వత్సర ప్రకటన చేసింది. ప్రపంచ పటంపై చిరుధాన్యాలను మళ్ళీ తీసుకురావడానికి ఇది భారత్కు మంచి అవకాశం. ఈ పోషకధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఆ ధాన్యాల ఉత్పత్తులకు సమర్థమైన మార్కెటింగ్ వసతులు కల్పించడానికి నడుం కట్టాల్సిన తరుణం. ఈ ‘సిరి’ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ, భారత జాతీయ వ్యవసాయ సహాయక మార్కెటింగ్ సమాఖ్యలు అక్టోబర్ మొదట్లో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ సైతం ఆ మధ్య తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లోనూ ఈ పోషకధాన్యాల ఉత్పత్తితో రైతులకూ, వినియోగంతో ప్రజలకూ కలిగే లాభాలను ప్రస్తావించారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ, ఆచరణలో ఇంకా వెనకబడే ఉన్నాం. దేశంలో దాదాపు 80 శాతం మెట్టభూములైనా, 20 శాతం మాగాణితో వచ్చే వరి, గోదుమల పైనే ఇప్పటికీ అర్థరహితమైన మోజు! అదనులో రెండు వర్షాలు కురిస్తే చాలు... ఆట్టే నీటి వసతి అవసరం లేకుండానే మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాలు నిజానికి మన శీతోష్ణాలకు తగినవి. వీటి లోనే పోషకాలు ఎక్కువ. అయినా చిరుధాన్యాల్లో పెద్ద గింజలైన జొన్న, సజ్జ, రాగులన్నా, చిన్న గింజలుండే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగెల లాంటివన్నా అటు రైతులకూ, ఇటు వినియోగదారులకూ చిన్నచూపే. పండుగపూట పరమాన్నంలా వరి వండుకొని తినగలిగిన తాతల కాలం నుంచి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులతో పుష్కలంగా వరి పండించగలగడం పురోగతే. ఆ మోజులో మన ఒంటికీ, వాతావరణానికీ సరిపోయే జొన్నలు, సజ్జల్ని వదిలేయడమే చేస్తున్న తప్పు. వరి, గోదుమల పంటకాలం 120 – 150 రోజులైతే, సిరి ధాన్యాలు 70–100 రోజుల్లోనే చేతికొ స్తాయి. నీటి వసతి ఆట్టే అవసరం లేని వర్షాధారిత మెట్టభూములు, కొండ ప్రాంతాల్లో ఈ ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నది అందుకే. విదేశాంగ మంత్రి అన్నట్టు ‘కోవిడ్, యుద్ధ వాతావరణం, పర్యావరణ సమస్యలు’ అంతర్జాతీయ ఆహార భద్రతకు సవాలు విసురుతున్న వేళ చిరుధాన్యాల సాగు, వాడకం పట్ల అవగాహన పెంచడం పరిష్కారం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గండం నుంచి గట్టెక్కించడానికీ ఈ ధాన్యాలే మందు. క్రీ.పూ. 3 వేల నాటి సింధునదీ పరివాహక ప్రజల కాలం నుంచి ఇవే తినేవాళ్ళం. ఇవాళ ప్రపంచంలో అనేక రకాలు ముందు మన దేశంలోవే. ఇప్పుడు మళ్ళీ ఆ పంటలకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. ఈసరికే వాటిని పండిస్తున్న పశ్చిమ రాజస్థాన్, దక్షిణ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్లలో రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఒక నిర్ణీత ధాన్యం సాగుకు కేంద్రంగా మలచడం లాంటివీ చేయవచ్చు. ఆ ప్రాంతీయుల ఆహారంలో ఆ ధాన్యాన్ని అంతర్భాగం చేయగలగాలి. అందుకు ముందుగా ప్రజలకు వీటి వినియోగాన్ని అలవాటు చేయాలి. ఇక, ఫలానా ధాన్యంతో ఫలానా రోగం పోతుందని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయోగపూర్వకంగా ఏళ్ళకొద్దీ చెబుతున్నాయి. పరిశోధన లతో వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లాంటివి ఆ పని తలకెత్తుకోవాలి. దాని సత్ఫలితాలు మరిందరిని సిరిధాన్యాల వైపు మళ్ళిస్తాయి. భూతాపం పెరిగిపోతున్న వేళ ఎండలు మండేకొద్దీ దిగుబడి పడిపోయే వరి కన్నా వేడిని తట్టు కొని దిగుబడినిచ్చే చిరుధాన్యాలకు ఓటేయడం వివేకం. ప్రపంచంలో సగం మంది పోషకాహారలోప పీడితులు గనక వారికీ ఈ ధాన్యాలే శ్రీరామరక్ష. ఈ వ్యావసాయిక జీవవైవిధ్యాన్ని కాపాడేలా కేంద్రం ‘మిల్లెట్ మిషన్’ ప్రకటించింది. కర్ణాటక, ఒరిస్సా లాంటివి అందులో దూసుకుపోతు న్నాయి. రేషన్ షాపుల్లో సిరిధాన్యాలను ఇవ్వడం మొదలు దేశంలోని 15 లక్షల స్కూళ్ళు, 14 లక్షల ప్రీస్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయగలిగితే భేష్. ఇలాంటి ప్రాథమిక ఆలోచనల్ని పటిష్ఠంగా అమలు చేస్తే– ఆహార భద్రతలో, పోషకా హార విలువల్లో బలమైన భారతావని సాధ్యం. చిరుధాన్య నామ సంవత్సరాలు సార్థకమయ్యేది అప్పుడే! -
ఎగుమతుల్లో పైపైకి..
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. తొలి రెండేళ్లు కరోనా మహమ్మారికి ఎదురొడ్డి మరీ ఎగుమతులు సాగాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఊపందుకున్నాయి. ఉదా.. 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13,855 కోట్ల విలువైన 2.62 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2021–22 నాటికి అవి రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.20వేల కోట్ల విలువైన 3.24 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. ఇక ఈ ఏడాది (2022–23) తొలి అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13వేల కోట్ల విలువైన 2.15 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆహార, ఆక్వా ఉత్పత్తులు కలిపి టీడీపీ ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22,784 కోట్ల విలువైన 34.10లక్షల టన్నులు ఎగుమతి అయితే 2021–22లో ఏకంగా రూ.39,921 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. టీడీపీ హయాంలో జరిగిన గరిష్ట ఎగుమతులను ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే సీఎం వైఎస్ జగన్ సర్కార్ అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున ఎగుమతులు జరగలేదని అధికారులతో పాటు ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది కోటి లక్షల టన్నుల మార్క్ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో నాన్ బాస్మతీ రైస్దే సింహభాగం రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతీ రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, గోధుమలు, శుద్ధిచేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలతో పాటు పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. నాన్ బాస్మతీ రైస్ ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్గా ఏపీ నిలిచింది. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతీ రైస్దే. 2018–19లో రూ.7,324కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు ఎగుమతి అయితే.. 2021–22లో రూ.17,225 కోట్ల విలువైన 68.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,718 కోట్ల విలువైన 29.48 లక్షల టన్నుల నాన్ బాస్మతీ రైస్ ఎగుమతి అయ్యింది. ఏపీ నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా, గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. మూడేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. ► మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10 వేలకు పైగా పలికింది. ► రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలుకుతోంది. ► అలాగే, రూ.5 వేలు పలకని మినుములు రూ.7వేలు, వేరుశనగ సైతం రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నాయి. ► కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతున్నాయి. ► అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. ► ఇక దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ శాతం కూడా గణనీయంగా తగ్గడం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు. 14వేల టన్నులు ఎగుమతి చేశాం 2021–22లో ఏపీ నుంచి 50 వేల నుంచి 60 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగాయి. మా కంపెనీ ఒక్కటే 14 వేల టన్నులు ఎగుమతి చేసింది. ఇరాన్, మలేసియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేశాం. ఈ ఏడాది కూడా ఎగుమతులు ఆశాజనకంగా ఉండబోతున్నాయి. – ఎం. ప్రభాకరరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్, దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపెనీ ఎగుమతులు పెరగడం రైతుకు లాభదాయకం గతేడాది రికార్డు స్థాయిలో ఆక్వా ఎగుమతులు జరిగాయి. రైతులకు కూడా మంచి రేటు వచ్చింది. రొయ్యలతో పాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా వ్యాపారులు పోటీపడి కొన్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అయ్యాయి. – ఐసీఆర్ మోహన్రాజ్, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ‘గాప్’ సర్టిఫికేషన్తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులతో పాటు 20వేల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. వచ్చే సీజన్ నుంచి రైతులకు ‘గాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. అది ఉంటే యూరోపియన్ దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంవల్లే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్దఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
భవిష్యత్ నానో యూరియాదే
సాక్షి, అమరావతి: భవిష్యత్ అంతా నానో యూరియాదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. నానో టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా వినియోగంతో పర్యావరణానికి, పంటలకు అత్యంత మేలు జరుగుతుందని తెలిపారు. రవాణా, వాడకం, ధరలతో పాటు పంటల దిగుబడి విషయంలో సంప్రదాయ యూరియాతో పోలిస్తే ఎన్నోరెట్లు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నానో యూరియా వినియోగం, అవగాహనపై మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గే ఈ యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇఫ్కో డైరెక్టర్ ఎం.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. 8 శాతం పెరిగిన దిగుబడి ఇఫ్కో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ టి.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ 500 ఎంఎల్ బాటిల్లో ద్రవరూపంలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని చెప్పారు. నానో యూరియా వినియోగించిన అనేక పంటల్లో ఎనిమిదిశాతం మేర దిగుబడి పెరిగిందని విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. నానో యూరియా వాడకంపై రూపొందించిన కరపత్రాలను మంత్రి కాకాణి విడుదల చేశారు. జాతీయ రహదారుల్లో మిల్లెట్ కేఫ్లు జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయ్యాలని మంత్రి కాకాణి సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల వెంబడి మిల్లెట్ కేఫ్ల ఏర్పాటు వల్ల చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల స్థానిక స్వయం సహాయక సంఘాలతో పాటు యువతకు అప్పగించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం ద్వారా యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొదటి రాష్ట్రం మనదేనని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్బాబు పాల్గొన్నారు. -
ఆగ్రోస్కు ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్కు జాతీయ స్థాయి ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానం పొందిన ఆగ్రోస్కు మంగళవారం ఆన్లైన్ ద్వారా అవార్డును అందజేశారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆగ్రోస్ ఎండీ రాములును వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్రావు సత్కరించారు. నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాములు వివరించారు. వాటి ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను నేరుగా అందిస్తున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్రావు ప్రోత్సాహంతో ఆగ్రోస్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. -
టమాటా రైతుకు రానున్నది మంచికాలం
సాక్షి, అమరావతి: దళారుల ప్రమేయం లేకుండా టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూచైన్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సొసైటీ ద్వారా రూ.110 కోట్ల అంచనాతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి కాకాణి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రతినిధులు వచ్చేనెలలో 4 ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభం నాలుగు ప్రాసెసింగ్ కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీవోలకు) అప్పగిస్తామని తెలిపారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులకు ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్ చైన్ అభివృద్ధికి లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సహకరిస్తాయని తెలిపారు. సాధారణంగా డిమాండు, సప్లయ్కి అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు టమాటా రైతులు, మరికొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో రేట్లు పెరగడం వలన వినియోగదారులు నష్టపోతున్నారని చెప్పారు. ధర పతనమైనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు రైతుల నుంచి కొనుగోలుచేసి రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో డిమాండుకు మించి దిగుబడుల ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రాలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఎఫ్పీవోల పరిధిలోని 20 వేలమంది టమాటా రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ సీఈవో సీఎస్ రెడ్డి, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సీఈవో పి.విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
29న వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: అన్నదాతల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే లక్ష్యంతో రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీనందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమ చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇప్పటికే రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో ఆదివారం (నేటి) నుంచి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. ఖరీఫ్–2021 జాబితా వాలిడేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీనందిస్తోంది. టీడీపీ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు చెల్లిస్తూ రైతులకు బాసటగా నిలిచింది. 2014–19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్–2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019–20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్ 2020 సీజన్లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. రబీ 2020–21తో పాటు ఖరీఫ్–2021 సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమచేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ–క్రాప్లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించనుంది. అలాగే, రబీ 2020–21 సీజన్లో సున్నా వడ్డీ రాయితీ పొందేందుకు 2,54,568 మంది అర్హత పొందినట్లుగా నిర్ధారించారు. వీరికి ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమచేస్తారు. జిల్లాల వారీగా వీరి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఈనెల 22లోగా వీటిని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ వివరాలను ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నా వడ్డీ పంట రుణాల పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ అనే వెబ్సైట్లో "know your status" విండోలో తమ ఆధార్ నంబర్ ఎంటర్చేస్తే వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు.. నవంబర్ 29న ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన రైతులకు కూడా సున్నా వడ్డీ రాయితీని జమచేయనున్నారు. ఈ సీజన్లో పంట రుణాలు తీసుకున్న 10.76 లక్షల మంది వివరాలను బ్యాంకర్లు అప్లోడ్ చేయగా, వారిలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణం పొందడం, ఈ–క్రాప్లో పంటల నమోదు ప్రామాణికంగా వ్యాలిడేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఖరీఫ్–2021 అర్హుల జాబితాను కూడా సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. తప్పొప్పులు సరిచేసుకోవచ్చు.. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకుని తమ పేర్లు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ఒకవేళ అర్హత ఉండి తమ పేరు జాబితాలో లేకపోతే పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత బ్యాంకు అధికారి ధ్రువీకరణతో రైతుభరోసా కేంద్రాల్లో సమర్పిస్తే పునః పరిశీలన చేసి అర్హుల జాబితాలో చేరుస్తారు. – చేవూరు హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్లు 3.52 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.963.26 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వివిధ రకాల వ్యవసాయ యంత్రాల సంఖ్య పెరిగింది. 2014–15లో తెలంగాణలో వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 ఉండగా, ప్రస్తుతం 3.52 లక్షలకు పెరిగాయి. 2014–15లో 6,318 వరి కోత యంత్రాలు ఉండగా, అవి ప్రస్తుతం 19,309కు చేరా యని వ్యవసాయశాఖ వెల్లడించింది. వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై ఒక నివేదికను విడుదల చేసింది. 2014–15లో గోదాముల సామర్థ్యం 39 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 68.28 లక్షలకు పెరిగింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషితో 2014 నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలుంటే, అదిప్పుడు 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది. అలాగే 11.50 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014–15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉంటే, 2021–22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకుంది. 2014–15లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020–21 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకుంది. 2014–15లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, ఇప్పుడు 60.44 లక్షల బేళ్లకు చేరుకుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. పంటలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రూ. 36,703 కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు 9 విడతల్లో రూ. 57,881 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రైతుబీమా కింద ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం 2014–15లో రూ.1,12,162 ఉండగా, 2021–22 నాటికి రూ.2,78,833లకు పెరిగింది. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసిందని ఆ శాఖ పేర్కొంది. -
పంటల బీమాలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. యూనివర్సల్ కవరేజ్ కింద నోటిఫైడ్ పంటలను సాగు చేసే రైతులందరికీ వర్తింపజేస్తున్నామని చెప్పారు. పంటల బీమా అమల్లో ఏపీ ప్రభుత్వ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన నాలుగో ఇండియా క్రాప్ ఇన్సూరెన్స్ మార్కెట్ సెమినార్లో ‘మెరుగైన భవిత కోసం పంటల బీమా – సాంకేతిక భాగస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చలో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నామన్నారు. సీజన్ ముగియకుండానే పంటల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ–పంట ఆధారంగా రాష్ట్రంలో సాగవుతున్న ప్రతి ఎకరా పంటను నమోదు చేయడమే కాదు.. రైతులందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని మూడేళ్లుగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం స్ఫూర్తితో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమల్లో పలు మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా–పీఎంఎఫ్బీవై పథకాలను అనుసంధానం చేసి దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేస్తున్నామని, వాతావరణ ఆ«ధారిత పంటలకు మాత్రం గతంలో మాదిరిగా కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్లు సెటిల్ చేస్తుందని హరికిరణ్ వివరించారు. -
రైతుబంధు నిధులు వచ్చే నెల విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు యాసంగి సీజన్ నిధులు వచ్చే నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 64.95 లక్షల మంది రైతులకు చెందిన 1.47 కోట్ల ఎకరాలకు రూ. 7,372.56 కోట్లు చెల్లించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 ఎకరాల వరకు సాగు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్కు మరికొందరు రైతులు కొత్తగా వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రకారం రూ. 7,500 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు సొమ్ము కోసం ఎదురుచూపు... యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల రోజులు దాటింది. యాసంగి సీజన్కు సంబంధించిన సాగు పనులు జరుగుతున్నాయి. అయితే రైతులు అందుకు అవసరమైన పెట్టుబడి సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా సీజన్ ప్రారంభమైన సమయంలోనే రైతుబంధు నిధులు అందజేయాలన్నది ఉద్దేశం. కానీ సకాలంలో వివరాలు పంపకపోవడం తదితర కారణాలతో రైతుబంధు సొమ్ము రైతులకు చేరడంలో ఆలస్యం అవుతుంది. దీంతో రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వానాకాలం సీజన్లో వేసిన పత్తి దిగుబడి తగ్గుతుండటం, గతం కంటే ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో యాసంగికి పెట్టుబడులు పెట్టాలంటే సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావును ‘సాక్షి’ వివరణ కోరగా గత యాసంగిలో డిసెంబర్ చివరి నాటికి రైతుబంధు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసారి ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. -
ఆందోళనలో పత్తి రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గుతు న్నాయి. గత నెల క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర.. ఇప్పుడు మార్కెట్లో రూ.7 వేల వరకు పడిపోయింది. దళారులు రోజుకో రేటు ఖరారు చేస్తూ అన్నదాతలను ఆగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పత్తి భారీగా మార్కెట్లోకి వస్తున్న సమయంలో దళారులు ధరల జిమ్మిక్కులు చేస్తు న్నారు. ఈ ఏడాది పత్తికి కాలం కలసి రాక, ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేని సమయంలో కనీ సం మంచి ధర వచ్చినా పెట్టుబడి దక్కుతుందని రైతులు భావిస్తున్నారు. కానీ దళారులు, వ్యాపా రులు పత్తి ధరలను ఇష్టారీతిగా ఖరారు చేస్తున్నా రన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీ యంగా ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని, రైతు లు తొందరపడి పత్తిని విక్రయించొద్దని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున మున్ము ందు మంచి ధరలు వస్తాయని చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు మార్కెట్ సరళిని ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు. తగ్గిన పత్తి దిగుబడులు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.40 కోట్ల ఎకరా ల్లో అన్ని పంటలు కలిపి సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని నిర్దేశించింది. అయితే జూలై నెల నుంచి కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా అనేకచోట్ల వేసిన పత్తి పంట మునిగిపోయింది. దీంతో పత్తి సాగు కేవలం 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అధిక వర్షాల కార ణంగా ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. కీల కమైన పూత, కాత దశలోనూ వర్షాలు కురవడంతో పత్తి రంగు మారింది. దీంతో పత్తి దిగుబడులు తగ్గు తున్నాయి. గతేడాది పత్తి పంటను 46.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 69.46 లక్షల బేళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కేవలం 53.28 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుందని రాష్ట్ర అర్థగణాంకశాఖ అంచనా వేసింది. దిగుబడులు తగ్గడం వల్ల రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అయితే ధరలు గతేడాది మాదిరిగా క్వింటాలకు రూ.10 వేలకు పైగా ఉంటే, దిగుబడి తగ్గినా ఎంతోకొంత నష్టాలను పూడ్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.6,380 ఉంది. కానీ ఈ ఏడాది మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ విపణిలో ధర ఎక్కువే ఉన్నా, గతేడాది కంటే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పత్తి సీజన్ ప్రారంభానికి ముందు క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర, రైతులు పెద్ద ఎత్తున విక్రయానికి తీసు కువచ్చే సమయానికి తగ్గిపోవడం కలవరపరుస్తోంది. ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన రోజు క్వింటాలు పత్తి ధర రూ.8,300 ఉంది. తర్వాత రోజురోజుకూ తగ్గుతూ గత నెల 29నాటికి క్వింటాలుకు రూ.7,330 పడిపోయింది. -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై టన్నుకు కనీసం రూ.200 పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పనపై పేపర్ మిల్లుల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ గిట్టుబాటు ధర విషయంలో సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. దీనిపై పేపర్ మిల్లుల ప్రతినిధులు స్పందిస్తూ టన్నుకు కనీసం రూ.200 నుంచి సాధ్యమైనంత ఎక్కువ పెంచేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే నేరుగా డబ్బులను చెల్లించాలని కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కె.లక్ష్మీభాయి, ఐటీసీ ప్రతినిధి గోబల కన్నన్, ఆంధ్రా పేపర్ మిల్స్ (రాజమండ్రి) ప్రతినిధి కె.బాలకృష్ణ, సిర్పూర్ పేపర్ మిల్స్ ప్రతినిధి ఎన్ఎస్ కన్నబాబు, గుజరాత్ పేపర్ మిల్స్ ప్రతినిధులు టీఎస్ భగవాన్, వై.రుషికేశ్వరరావు, బీఐఎల్టీ ప్రతినిధి జీవీడీ ప్రసాద్ పాల్గొన్నారు. మరో మూడు సేంద్రియ ఉత్పత్తులు మార్కప్ బ్రాండ్ పేరుతో కొత్తగా మరో మూడు రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మార్కప్ ద్వారా 17 రకాల సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురాగా... తాజాగా సేంద్రీయ బెల్లం, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పును కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్కెట్లోకి కొత్తగా 7 వంగడాలు రైతులకు కొత్తగా మరో ఏడు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, పత్తిలో 2, రాగి/చోడిలలో ఒకటి చొప్పున ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రాలు అభివృద్ధి చేశాయి. రెండు నెలల కిందట రాష్ట్రస్థాయిలో 10వంగడాలను విడుదల చేయగా, తాజాగా మరో 7 వంగడాలు జాతీయస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. -
AP: దేశంలోనే తొలిసారిగా.. రైతుల కోసం మొక్కల డాక్టర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు త్వరలో ప్లాంట్ అండ్ సాయిల్ క్లినిక్లుగానూ సేవలందించనున్నాయి. ఆర్బీకేల్లో సేవలందిస్తున్న గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్లాంట్ డాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంటలకు సోకే తెగుళ్లు, మట్టి నమూనాలను పరీక్షించేందుకు వచ్చే మార్చి నాటికి ప్రతి ఆర్బీకేకు ప్లాంట్ డాక్టర్ కిట్లను అందించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ డాక్టర్ల వ్యవస్థను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూసారం, పోషకాలు, నీటి, సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించి క్షణాల్లో పరీక్ష ఫలితాలను అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించేలా ప్లాంట్ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో రూ.75 వేల విలువైన సాయిల్ టెస్టింగ్ పరికరాలు (భూ పరీక్షక్), పంటల ఆధారిత లీఫ్ కలర్ చార్ట్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషకాల లోపాల చార్ట్, మేగ్నిఫయింగ్ లెన్స్, జీపీఎస్, డిజిటల్ కెమెరా తదితర పరికరాలను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. రైతులు భూసారం, పోషకాలు.. నీటి యాజమాన్యం, సూక్ష్మపోషక లోపాల గుర్తింపు, పురుగులు–తెగుళ్లు, వ్యాధి నిర్ధారణ, కలుపు నివారణ చేపట్టాలంటే వెంటనే పరీక్ష ఫలితాలు వస్తేనే సాధ్యమవుతుంది. గతంలో భూసార, నీటి పరీక్షలు చేయాలంటే రోజులు, వారాల సమయం పట్టేది. ఫలితాలొచ్చేలోగా అదును దాటిపోయేది. దీంతో చేసేది లేక మూస పద్ధతిలోనే భూసారంతో సంబంధం లేకుండా మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించేవారు. దీంతో పంటలు తరచూ తెగుళ్ల బారినపడి ఆశించిన దిగుబడులు రాక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందిపడేవారు. ఇందుకు ప్రధాన కారణం తగినన్ని ప్రయోగశాలలు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి గ్రామ స్థాయిలో ప్లాంట్ డాక్టర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 60 సెకన్లలోనే ఫలితాలు ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన భూ పరీక్షక్ పరికరాన్ని ప్రతి ఆర్బీకేలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ పరికరంలో మట్టి నమూనా వేస్తే.. భూమి స్వభావంతోపాటు భూమిలోని ఆరు (ఎన్, పీ, కే, ఓసీ, సీఈసీ, క్లే) పారామీటర్స్ను పరీక్షిస్తుంది. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా స్పెక్ట్రోస్కోపీ, ఎల్ఓటీ టెక్నాలజీ ద్వారా కేవలం 60 సెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది. రోజుకు వంద శాంపిల్స్ను పరీక్షించే సామర్ధ్యం ఉన్న ఈ పరికరాల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా భూమిలోని లోపాలను పసిగట్టవచ్చు. ఒక్క భూసారమే కాదు.. సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను కూడా పరీక్షించి నిర్ధారించుకోవచ్చు. ఫలితాలను రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా పంపిస్తారు. ఫలితాల ఆధారంగా ప్లాంట్ క్లినిక్ (ఆర్బీకే) ద్వారా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాతపూర్వకంగా (వైద్యుని ప్రిస్కిప్షన్ మాదిరిగా) రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో రాతపూర్వకంగా రైతులకు అందిస్తారు. రైతులకు బహుళ ప్రయోజనాలు ► ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డుల్లో సూచించే సిఫార్సుల వల్ల ఎరువుల వినియోగం 20–25 శాతం తగ్గుతుంది ► పంటకు సోకే తెగుళ్లను ప్లాంట్ క్లినిక్స్లో ఏర్పాటు చేసే పరికరాలతో ఇట్టే పసిగట్టవచ్చు. తెగుళ్లు, వ్యాధుల ఉధృతి ఎక్కువగా ఉంటే శాంపిల్స్ సేకరించి వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్కు పంపించి పరీక్షిస్తారు. ► వ్యాధులు, తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల పురుగుల మందుల వినియోగం 15–25 శాతం తగ్గుతుంది. ► మొత్తంగా రైతుకు పెట్టుబడి ఖర్చులు కనీసం 15–20 శాతం తగ్గుతాయి. దిగుబడుల్లో నాణ్యత పెరుగుతుంది. గతంతో పోలిస్తే 18–20 శాతం వరకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ► పెట్టుబడి ఖర్చులు తగ్గడం, దిగుబడులు పెరగడం వలన రైతులు కనీసం 20–25 శాతం అదనంగా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగానే ‘ప్లాంట్ డాక్టర్’ విధానానికి రూపకల్పనం చేశాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్లాంట్ క్లినిక్స్ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
57,151 ఎకరాల్లో యాసంగి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతోంది. గత సీజన్లో ఈ సమయానికి 1.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ప్రస్తుత యాసంగిలో కేవలం 57,151 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి 46.49 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ప్రస్తుతం అందులో 0.01 శాతమే పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వేరుశనగ 41,772 ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత శనగ 5,585 ఎకరాలు, మినుము పంట 5,891 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ జిల్లాల్లో యాసంగి సాగు ఒక్క ఎకరాలో కూడా సాగు కాలేదు. వనపర్తి జిల్లాలో అత్యధికంగా 18,365 ఎకరాలు, నాగర్కర్నూలు జిల్లాలో 11,757 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 6,204, మహబూబ్నగర్ జిల్లాలో 5,144 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కాగా, ఈసారి వరి అత్యధికంగా సాగవుతుందని అంచనా వేశారు. సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 31 లక్షల ఎకరాలు కాగా, నీళ్లు పుష్కలంగా ఉండటంతో భారీగా నమోదు అవుతుందని చెబుతున్నారు. -
ఏపీ స్ఫూర్తితో కేరళలో వ్యవసాయ విస్తరణ
సాక్షి, అమరావతి/కంకిపాడు (పెనమలూరు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేరళలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్ వెల్లడించారు. ఇక్కడ నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారని అందువల్లే పండ్లు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతిని సాధిస్తోందని కొనియాడారు. సుభాష్ సారథ్యంలో కేరళ ప్రైస్బోర్డు చైర్మన్ డాక్టర్ రాజశేఖరన్ నాయర్, వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ సబీర్ హుస్సేన్, అడిషనల్ డైరెక్టర్ సునీల్తో కూడిన కేరళ వ్యవసాయ ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా కంకిపాడులోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను సందర్శించింది. ల్యాబ్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు ఆక్వాఫీడ్ టెస్టింగ్ విధానాలను స్వయంగా పరిశీలించారు. గతంలో రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో 11 ల్యాబ్స్ మాత్రమే ఉండేవని.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పాదకాలను రైతులకు అందించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం నియోజకవర్గస్థాయిలో 167, జిల్లా స్థాయిలో 13 ల్యాబ్లతో పాటు రీజినల్ స్థాయిలో నాలుగు కోడింగ్ సెంటర్లను ఏర్పాటుచేస్తోందని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు కేరళ బృందానికి వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచడమే కాక.. రైతులకు ఉచితంగా సేవలందిస్తున్నామని చెప్పారు. అనంతరం.. టెస్టింగ్ పరికరాలు, టెస్టింగ్ విధానాన్ని కేరళ బృందం పరిశీలించి ప్రశంసించింది. దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్లు ఏర్పాటుచేసిన దాఖలాల్లేవని సుభాష్ పేర్కొన్నారు. ఏపీలో ఎఫ్పీఓలు బాగా పనిచేస్తున్నాయి అనంతరం.. అరటి ప్రాసెసింగ్, ఎగుమతుల్లో జాతీయస్థాయి అవార్డుతో పాటు వైఎస్సార్ లైఫ్టైం అఛీవ్మెంట్ అవార్డు సాధించిన తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులోని శ్రీ విఘ్నేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘం (అరటి ఎఫ్పీఓ) కార్యకలాపాలను పరిశీలించారు. సంఘంలోని సభ్యులతో సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. సంఘ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందించిందని ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ బాలాజీ నాయక్ కేరళ బృందానికి వివరించారు. రాష్ట్రంలో ఎఫ్పీఓల వ్యవస్థ చాలా బలంగా ఉందని, ఏటా వందల కోట్ల టర్నోవర్ జరుగుతోందన్నారు. 100కు పైగా ఎఫ్పీఓల పరిధిలో 37వేల మంది రైతులున్నారని చెప్పారు. ఎఫ్పీఒగా ఏర్పడిన తర్వాత సాగు ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం 30 శాతం మేర పెరిగిందని ఎఫ్పీఓ డైరెక్టర్ కొల్లి చంద్రమోహన్రెడ్డి వివరించారు. నేరుగా ట్రేడర్స్కు విక్రయించడం ద్వారా రైతులకు గరిష్ట ధర లభించేలా కృషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కూడా ఎఫ్పీఓలున్నాయని.. కానీ, ఇంత బలంగాలేవని చెప్పారు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, పనివిధానం గురించి ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్బాబు వివరించారు. -
ఏపీలో ఆర్బీకేలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు: ‘రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఊహించిన దానికంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నొవేటివ్గా ఉన్నాయి. కియోస్క్ ద్వారా రైతులే నేరుగా వారికి కావల్సిన ఇన్పుట్స్ బుక్ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించడం అద్భుత విధానం. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్ కింద పరిశోధన ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లడం నిజంగా మంచి ఆలోచన. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా సేవలందిస్తున్నట్టు వినలేదు. ఈ తరహా ఆలోచన చేసిన సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నాం’ అంటూ ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ గురించి తెలుసుకున్న ఇథియోపియా ప్రభుత్వం, వాటిని తమ దేశంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీకే వ్యవస్థ పరిశీలనకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమీర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది. ఆ బృందం బుధవారం తొలుత గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ), ఆర్బీకే చానల్ను, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బీకే–2ను సందర్శించింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో రైతుల నుంచి వస్తున్న కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, అక్కడున్న శాస్త్రవేత్తలు, అధికారులు బదులిస్తున్న తీరును పరిశీలించింది. ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారో తెలుసుకుంది. గండిగుంట ఆర్బీకేలోనే రెండున్నర గంటలు ఆర్బీకేల సేవలను తెలుసుకునేందుకు ఈ బృందం గండిగుంట ఆర్బీకేలో రెండున్నర గంటల పాటు గడిపింది. రైతులతో మమేకమైంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల స్టాల్స్ను లకించింది. కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుక్ చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించింది. డిజిటల్ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి క్షేత్రం ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించి వాటి పనితీరు, సేవలను తెలుసుకుంది. వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, విధులు, బాధ్యతలపై బృందం సభ్యులు ఆరా తీసారు. మూడేళ్లుగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకేలొచ్చిన తర్వాత వ్యవసాయ అవసరాల కోసం గ్రామం విడిచి వెళ్లడంలేదని రైతులు ఈ బృందానికి వివరించారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం ఆర్బీకేలు నిజంగా రోల్ మోడల్గా ఉన్నాయని ఇథియోపియా వ్యవసాయ మంత్రి చెప్పారు. వీటి సాంకేతికతను అందిపుచ్చుకుంటామని, తమ దేశంలో కూడా ఈ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాధార దేశమైన ఇథియోపియాలో రైతులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. సౌత్సౌత్ కో ఆపరేషన్ సమావేశంలో భారతప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పర్యటనలో ఇథియోఫియా బృందం సభ్యులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్, కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
ఏపీలో రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు అద్భుతం
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను వింటుంటే నిజంగా ఆశ్చర్యమేస్తోందని.. ఇక్కడి పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ దేశం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఊతమిచ్చేలా ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్ర న్ ఆస్ట్రేలియా వర్సిటీలతో ఎన్జీ రంగా వర్సిటీ సోమవా రం ఎంవోయూ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్, పార్లమెంటరీ కార్యదర్శి సమంతారో సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఆర్బీకేల ద్వారా పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా మంత్రి తప్పకుండా ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, మర్డోక్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆండ్రూ డీక్స్, డిప్యూటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పీటర్ డెవిస్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందంతో ప్రయోజనాలివే.. ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలతో అవగాహన ఒప్పందం వల్ల ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థులు అక్కడకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు అక్కడ పరిశోధనలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలకు చెందిన వి ద్యార్థులు ఇక్కడ మన వర్సిటీలో పరిశోధనలు చేసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ అధ్యాపక బృందం అక్కడకు వెళ్లి శిక్షణ పొందడంతోపాటు పరిశోధనా ఫలాలను పరస్పరం అందిపుచ్చుకోవచ్చు. -
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు..
సాక్షి, అమరావతి: పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. చదవండి: అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వో కలిపి 90 శాతం ఈ–క్రాప్ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్ నంబర్కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు. -
రైతుల ఆశలకు ‘గండి’.. సాగర్ ఎడమకాల్వ తెగడంతో పంటలకు తీవ్ర నష్టం
నిడమనూరు: నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలో బుధవారం పడిన గండి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద ఆ ప్రాంతంలోని పొలాలను ముంచెత్తింది. సమీప వరి పొలాల్లో ఇసుక మేట వేసింది. ఆధునీకరణ సమయంలో కాలువ అడుగు భాగంలో కొత్తగా నిర్మాణం చేపట్టకపోవడంతోనే కాలువకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నీళ్లు సుడి తిరగడం కారణంగానే గండి పడిందని సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మా పేర్కొన్నారు. గండి పడటంతో సుమారు 750 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిడమనూరులోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి మీదుగా వరద నీరు ప్రవహించడంతో రోడ్డు దెబ్బతిన్నది. ఈ రహదారిని ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. సాగర్ ఎడమ కాల్వ తెగడంతో ప్రభుత్వానికి రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మరో వారం పది రోజులపాటు సాగునీటి విడుదల నిలిచిపోతుండటంతో మిగతా వరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో శాశ్వత మరమ్మతులు... కాలువ కట్ట తెగిన ప్రాంతాన్ని గురువారం రాష్ట్ర అధికారులు, ప్రత్యేక ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఇందులో సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ముఖ్పాండే, చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి అరవింద్తో పాటు సాగర్ ప్రాజెక్ట్ సీఈ శ్రీకాంత్రావు, ఎస్ఈ ధర్మా, సబ్ కలెక్టర్ రాహుల్ ఉన్నారు. వారంలో శాశ్వత మరమ్మతులు చేపడతామని శ్రీకాంత్రావు తెలిపారు. సాయంత్రం గండి పూడ్చే పనులు ప్రారంభించారు. కాగా, ఎమ్మెల్యే నోముల భగత్ కూడా గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపం కారణంగానే కాలువలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. -
మార్కెట్లోకి 10 నూతన వంగడాలు
సాక్షి, అమరావతి: రైతులకు కొత్తగా మరో పది వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న వివిధ పరిశోధన కేంద్రాలు వీటిని అభివృద్ధి చేశాయి. వరిలో మూడు, పెసలు, చిరుధాన్యాల్లో రెండు చొప్పున విత్తనాలు వచ్చాయి. మినుము, వేరుశనగ, శనగలో ఒక్కొక్కటి చొప్పున కొత్త వంగడాలు తీసుకొచ్చారు. మంగళవారం రాష్ట్ర విత్తన సబ్ కమిటీ 40వ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, వీసీ విష్ణువర్ధన్రెడ్డి వీటిని విడుదల చేశారు. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మంచి గుణగణాలు కలిగిన కొత్త రకాలను శాస్త్రవేత్తలు, విస్తరణ సిబ్బంది కలిసి రైతులకు పరిచయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున, ఈ రకాల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త రకాల ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రద ర్శించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో అందుకు అనువైన రకాలను రూపొందించాలని సూచించారు. కొత్త వంగడాల ప్రత్యేకతలు... ► వరి.. ఎంటీయూ–1318: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేసిన ఈ రకం ఎంటీయూ 7029 స్వర్ణ రకానికి బదులుగా అభివృద్ధి చేసింది. మిషన్ కోతకు అనువైనది. ఎక్కువ దిగుబడినిస్తుంది. ముంపును తట్టుకునే శక్తి ఉంటుంది. ► వరి.. ఎంటీయూ1232: ఇది కూడా మార్టేరు పరి శోధన కేంద్రం అభివృద్ధి చేసిందే. నెల రోజుల ముంపును కూడా తట్టుకుంటుంది. 135 నుంచి 140 రోజుల్లో పంట వస్తుంది. అగ్గి, పాముపొడ తెగుళ్లు, సూది దోమను తట్టుకునే రకమిది. ► వరి.. ఎంసీఎం–103 (బందరు సన్నాలు): మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన వంగడమిది. ఉప్పు నేలలకు అనువైన రకమిది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సాధారణ నేలల్లో హెక్టార్కు 60 నుంచి 65 క్వింటాళ్లు, ఉప్పు నేలల్లో 50 నుంచి 55 క్వింటాళ్లు దిగుబడి ఇస్తుంది. ► రాగులు.. వీఆర్ 1099 (గోస్తనీ): దీన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అన్ని జిల్లాల్లో సాగుకు అనువైనది. ప్రస్తుతం ఉన్న శ్రీ చైతన్య రకం కంటే 17 నుంచి 22 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ► కొర్రలు.. ఎస్ఐఏ–3150 (మహానంది): దీన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీతో పాటు వేసవి కాలానికి కూడా అనువైనది. హెక్టారుకు 31 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 20 శాతం ఎక్కువ ప్రొటీన్, కాల్షియం ఉంటాయి. ► పెసర.. ఎల్జీజీ–574: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతానికి అనువైనది. మోజాయిక్ వైరస్ను తట్టుకుం టుంది. హెక్టార్కు 15–16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మిషన్ కోతకు అనువైనది. ► పెసర.. ఎల్జీజీ–607: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన రకమిది. పంట కాలం 60 నుంచి 65 రోజులు. యెల్లో మోజాయిక్ వైరస్ను తట్టుకునే శక్తి ఉంటుంది. హెక్టార్కు 15–17 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఒకేసారి పరిపక్వతకు వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► మినుములు.. ఎల్బీజీ–884: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైనది. మోజాయిక్ వైరస్ను తట్టుకుంటుంది. హెక్టార్కు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ► శనగలు.. ఎన్బీఈజీ 776: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన రకమిది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హెక్టార్కు 28 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎక్కువ కాయలు కలిగి 20.9 శాతం ప్రొటీన్ ఉంటుంది. జేజీ–11 రకానికి బదులుగా సాగుకు అనువైనది. 90 నుంచి 105 రోజుల్లో పంట వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► వేరుశనగ.. టీసీజీఎస్–1694: తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీ కాలాలకు అనువైన రకం. షెల్లింగ్ పర్సంటేజ్ 72 శాతంగా ఉంటుంది. ఖరఫ్లో హెక్టార్కు 35 క్వింటాళ్లు, రబీలో 50 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. -
ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న ఎలక్ట్రానిక్ క్రా పింగ్ (ఈ–క్రాప్)ను 2023 మార్చికల్లా అన్ని రా ష్ట్రాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా సూచించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్ అమలుచేయాలని సూచించారు. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ–క్రాపింగ్ అమలుపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖాధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో అహూజా మాట్లాడుతూ వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏపీలో ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీసీజన్లో అన్ని రాష్ట్రాలు పైలెట్ ప్రాజెక్టుగా ఈ–క్రాపింగ్ను అమలు చేయాలని సూచిం చారు. 2023 మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఏపీలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న చోట ఆన్లైన్లో, లేని చోట ఆఫ్లైన్లో ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇదే హైబ్రిడ్ విధానంలో అన్ని రాష్ట్రాలూ పాటించాలన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ఆఫ్లైన్లో నమోదు చేసి, ఆ వివరాలను ఇంటర్నెట్ ఉన్న చోట ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. రైతులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ–క్రాప్ అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించారు. వాస్తవ సాగుదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ఈ–క్రాపింగ్ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ–క్రాపింగ్ ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి అన్ని పథకాలనూ అందిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లను కూడా దీని ఆధారంగానే చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని పీఎంఎఫ్బీవైతో అనుసంధానించి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆర్బీకేలు, సచివాలయాల్లో ఉండే వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సçహాయకులు సంయుక్తంగా ఈ–క్రాపింగ్ నమోదు చేసి, ప్రతి రైతుకు రశీదులు ఇస్తున్నారన్నారు. వివిధ రాష్ట్రాల అధికారుల సందేహాలను స్పెషల్ సీఎస్, కమిషనర్ నివృత్తి చేశారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ సర్వే పూర్తయితే భూముల సరిహద్దులు కచ్చితంగా నిర్ధారణ అవుతాయని, ఈ క్రాప్ను మరింత పక్కాగా ఇంటిగ్రేట్ చేయవచ్చని చెప్పారు. జాతీయ స్టీరింగ్ కమిటీలో తొలిసారి ప్రాతినిధ్యం కేంద్ర వ్యవసాయ పథకాలు, కార్యక్రమాల అమలుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కమిటీలో ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్ను అమలు చేస్తున్నందున ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్కు కూడా చోటు కల్పించారు. -
ఏపీ మోడల్ తరహాలో దేశవ్యాప్తంగా ఈ–క్రాప్
ఈ–క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ పథకాల అమలు, నష్టపరిహారం పంపిణీ సులువుగా మారింది. ఏ ఊళ్లో.. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు వేశారన్న కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తోంది. తద్వారా దిగుబడిపై ముందస్తుగా ఓ అంచనాకు రావచ్చు.. ఆయా పంటలకు మార్కెటింగ్ కల్పించే విషయమై సరికొత్త ఆలోచనలతో అడుగులు ముందుకు వేయొచ్చు. ఈ–క్రాప్ వల్ల ఇన్ని సౌలభ్యాలుండటం గమనించిన కేంద్రం.. ‘ఏపీ మోడల్ భేష్’ అంటూ జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఈ–క్రాప్ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం.. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీని మోడల్గా తీసుకొని.. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ– క్రాప్ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు. భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్ నమోదే అర్హతగా వైఎస్సార్ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ బుకింగ్ జరిగింది. ఏపీలో ఈ–పంట నమోదు ఇలా.. ► నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు ఈ –పంట నమోదు చేస్తున్నారు. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా వాస్తవ సాగుదారులు సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్దతులు పాటిస్తూ సాగు చేస్తున్నారో ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. ► ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్తో సహా పంట ఫొటోను అప్లోడ్ చేసి, చివరగా రైతుల సోషల్ స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా వారి వేలి ముద్రలు (ఈకేవైసీ – మీ పంట తెలుసుకోండి) తీసుకుని.. డిజిటల్ రసీదు వారి ఫోన్ నంబర్కు పంపిస్తున్నారు. ► ఈ పంట నమోదును వీఏఏ/వీహెచ్ఎ, వీఆర్ఏ ధ్రువీకరించగానే ఫిజికల్ రసీదు అందజేస్తారు. పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు ఆ కార్డుల్లేని రైతుల పంట వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 96.41 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 43.35 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుంటే.. ఇప్పటి వరకు 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నమోదు చేశారు. సెప్టెంబర్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా స్టీరింగ్ కమిటీలు ► ఏపీలో ఈ–క్రాప్ను మోడల్గా తీసుకొని అగ్రి స్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఏ) అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడీఏ ద్వారా పంటల సాగు ఆధారంగా రైతుల డేటా బేస్ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు వెబ్ ల్యాండ్ డేటానే అన్నింటికీ ఆధారం. దీన్ని బట్టే పీఎం కిసాన్తో సహా ఇతర పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఇక నుంచి సీజన్ వారీగా పంటల సాగు ఆధారంగా రైతుల డేటాను తయారు చేసి, ఆ మేరకు వారికి సంక్షేమ ఫలాలు అందించాలని సంకల్పించింది. ► వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా జియో రిఫరెన్స్, విలేజ్ మ్యాప్, జీఐఎస్, ఆధార్ అథంటికేషన్, ఈ–కేవైసీలను అనుసంధానిస్తూ సీజన్ వారీగా రియల్ టైం క్రాప్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల కోసం రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీలు, అమలు కోసం జిల్లా స్థాయిలో ఇంప్లిమెంటింగ్ కమిటీలు నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ► ఈ డేటాతో పీఎం కిసాన్తో పాటు పీఎంఎఫ్బీవై వంటి సంక్షేమ పథకాలను అనుసంధానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీని ఆదర్శంగా తీసుకొని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ– పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇదే బాటలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది. ► ఇందుకోసం సోమవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా ఆదేశాల మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్లు రాష్ట్రంలో అమలవుతున్న ఈ–పంట నమోదుపై అవగాహన కల్పించనున్నారు. కేంద్రానికి ఏపీ ఆదర్శం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ పంట నమోదుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బాటలోనే వాస్తవ సాగుదారుల డేటాను రూపొందించి పీఎం కిసాన్తో సంక్షేమ ఫలాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం నిజంగా శుభ పరిణామం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
ఆర్బీకేలు అద్భుత ఆవిష్కరణలే
సాక్షి, అమరావతి/అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఆవిష్కరణలు అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ బ్యాంకు సీనియర్ కన్సల్టెంట్ (అగ్రికల్చర్, ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్) హిమ్మత్ పటేల్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు సేవలందించే ఆర్బీకేలు ఎంతో వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలన్నీ వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రప్రభుత్వ సిఫార్సు మేరకు ఆర్బీకే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ఆఫ్రికాలోని ఇథియోపియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హిమ్మత్ పటేల్ రాష్ట్రంలో పర్యటించి వీటి పనితీరును స్వయంగా పరిశీలించారు. మంగళవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్ను సందర్శించారు. పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే వద్ద రైతులు వినియోగించుకుంటున్న సేవలను పరిశీలించారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుకునేం దుకు ఇథియోపియా సహకారం కోరిన సమ యంలో ఏపీలో ఆర్బీకేలు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. ఇంత టెక్నాలజీ ఎక్కడా లేదు.. ‘ఆర్బీకేలు వన్స్టాప్ సెంటర్గా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాల సేవలు గ్రామ స్థాయిలో అందించడంపై మాకున్న సందేహాలు ఇక్కడకు వచ్చాక పటాపంచలయ్యాయి. ఆర్బీకేల ద్వారా నిజంగా అద్భుతమైన సేవలందిస్తు న్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ని ఇంత బాగా వినియోగిస్తున్న ప్రభుత్వం బహుశా మరెక్కడా లేదు. ఈ తరహా సేవలను వ్యవసాయ ఆధారిత దేశాలన్నీ అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఏపీలో పర్యటించి రాష్ట్ర ప్రభు త్వంతో ఎంవోయూ కుదుర్చుకోనుందని వెల్లడించారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్కు ఫోన్చేసే రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేస్తున్న తీరును హిమ్మత్ పటేల్ పరిశీలించారు. వణుకూరు ఆర్బీకేలో కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుకింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు. వైఎస్సార్ సంచార వెటర్నరీ అంబులెన్స్ పనితీరును గమనించారు. ఘంట సాలలోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) సందర్శించారు. సీఎం జగన్ కృషి అభినందనీయం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని దూరదృష్టితో ఆర్బీకేలను ఏర్పాటు చేశారని, ఆయన కృషి అభినందనీయమని హిమ్మత్ పటేల్ ప్రశంసించారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకందిస్తున్న సేవలను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వివరిం చారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలను వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాల కొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీ చిరంజీవి చౌదరి, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, కె.కన్నబాబు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ Ôశేఖర్బాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, స్టేట్ ఆర్బీకేల ఇన్చార్జి శ్రీధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
సాగు పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు, స్ప్రేయర్లను పంపిణీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదేశించారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవన్లో మంగళవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని చెప్పారు. జూలైలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టాలపై సత్వరమే నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా, ఏ దశలోనూ డీఏపీ సహా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఖరీఫ్ సీజన్లో సాగయ్యే 90 లక్షల ఎకరాలను ఈ క్రాప్లో నమోదు చేయాలన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా–ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పగడ్బందీగా, పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి మూడు ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్ల ఏర్పాటుకు ఈ నెలాఖరులోపు రైతు గ్రూపులను గుర్తించాలని చెప్పారు. ఉద్యాన రైతులకు పంటల మార్పిడిని అలవాటు చేయాలని సూచించారు. మిర్చిలో తామర పురుగు, అరటిలో సిగటోక తెగులు, పత్తిలో తెల్లదోమ వంటి తెగుళ్ల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొం డయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
రైతు.. ప్రభుత్వం.. ఫ్లిప్కార్ట్
సాక్షి, అమరావతి: రైతుల నుంచి మెరుగైన ధరలకు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు కొనుగోలు చేయించేలా ఫ్లిప్కార్ట్తో ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. తొలుత అపరాలు.. ఆ తర్వాత దశల వారీగా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయడానికి ఫ్లిప్కార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచన మేరకు ఫ్లిప్కార్ట్ ముందుకు వచ్చింది. ఆన్లైన్ విక్రయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లిప్కార్ట్ మాల్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఎఫ్పీవోల ద్వారా కొనుగోళ్లు వ్యవసాయ ఉత్పత్తులను ఇతర బహుళ జాతి సంస్థల మాదిరిగా మధ్యవర్తులు, వ్యాపారులు, మిల్లర్ల ద్వారా కాకుండా రైతుల నుంచి నేరుగా ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అనంతపురం, గుంటూరు రీజియన్ పరిధిలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవోల) ద్వారా కొనుగోళ్లు జరుపుతుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్తో ఫ్లిప్కార్ట్ బృందం మంగళవారం సమావేశం కానుంది. తొలి దశలో కందులు, మినుములు, పెసలు తదితర పప్పు దినుసులను ఎఫ్పీవోల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నామని, త్వరలో ఎంవోయూ చేసుకోనున్నామని ఫ్లిప్కార్ట్ ఏపీ ప్రతినిధి గిరిధర్ ‘సాక్షి’కి తెలిపారు. రైతులకు మేలు చేసేలా ఒప్పందం రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ సంస్థ ముందుకురావడం శుభపరిణామం. ఆహార ఉత్పత్తుల సరఫరా చైన్ మేనేజ్మెంట్ను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్న వేళ ఫ్లిప్కార్ట్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతోంది. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం మేలు కలుగుతుంది. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ఫ్లిప్కార్ట్ గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభం ఈ – కామర్స్ మార్కెట్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్కార్ట్ సరఫరా చైన్ నెట్వర్క్ను మరింతగా విస్తరించింది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్కార్ట్ కార్యక్రమం బిగ్ బిలియన్ డేస్ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు. ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పండ్లు, కూరగాయల నష్టాలకు ఇక చెక్
సాక్షి, అమరావతి: రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలకు కోత అనంతరం నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీకేల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో నిర్మించిన ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి కాకాణి ప్రారంభించారు. 75 శాతం సబ్సిడీతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం కోసం వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవో) పరిధిలో రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మంత్రి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా నిర్మిస్తున్న ఈ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎఫ్పీవోలకు 75 శాతం, వ్యక్తిగతంగా నిర్మించుకుంటే రైతులకు 40 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాము పండించిన ఉత్పత్తుల నాణ్యతను పెంచుకునేందుకు, మంచి ధరలు పొందడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు, కూరగాయల కోతలు, సరైన పద్ధతిలో రవాణా, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయడంపై రైతులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి అన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు గుర్తింపు కోసం సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, రైతులకు శిక్షణనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాన్ని మంత్రి అభినందించారు. ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటలు అధికంగా పండించే ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం చొప్పున 945 కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 505 కేంద్రాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా.. 171 చోట్ల పనులు చేపట్టామన్నారు. వీటిలో 32 కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
కిసాన్ డ్రోన్లపై కసరత్తు!
సాక్షి, విశాఖపట్నం: రానురాను వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోతోంది. కూలీల కొరత కూడా అధికమవుతోంది. వీటన్నిటిని అధిగమించి సాగు చేయడం అన్నదాతకు తలకు మించిన భారమవుతోంది. ఇలా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం ఎంతగానో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రైతులకు వివిధ యంత్రాల పనిముట్లను రాయితీపై అందిస్తోంది. తాజాగా పంటలకు పురుగు మందులను పిచికారీ చేయడానికి కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఇందుకోసం జిల్లాల వారీగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) పరిధిలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ పనిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టారు. ప్రాథమికంగా మండలానికి మూడు చొప్పున కిసాన్ డ్రోన్లను మంజూరు చేయనున్నారు. ఒకే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల వినియోగానికి వీలుగా ఉంటుందని భావించి అలాంటి వాటిని తొలుత ఎంపిక చేస్తున్నారు. కిసాన్ డ్రోన్లు మంజూరుకు నిబంధనల ప్రకారం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు కనీసం పదో తరగతి/ఇంటర్మీడియట్ విద్యార్హతను కలిగి ఉండాలి. ఈయనకు డ్రోన్ వినియోగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన రైతుకు సర్టిఫికెట్ కూడా ఇస్తారని విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి ‘సాక్షి’కి చెప్పారు. డ్రోన్లపై రైతులకు అవగాహన.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్ది రోజుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్ డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా గ్రామాల్లో వీటితో ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలు మినహా మిగిలినవి అర్బన్ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో పద్మనాభం మండలంలోనే అధికంగా పంటలు పండిస్తున్నారు. అందువల్ల విశాఖపట్నం జిల్లాలో పంటల సాగు తక్కువగానే జరుగుతోంది. దీంతో విశాఖ జిల్లాలో 57 ఆర్బీకేలున్నప్పటికీ ఇప్పటివరకు కిసాన్ డ్రోన్ల కోసం ఐదు గ్రూపులు మాత్రమే ముందుకు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 మండలాల్లో 66 రైతు గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ గిరి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 38 గ్రామాలు కిసాన్ డ్రోన్ల మంజూరుకు అనువైనవని గుర్తించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు గాను 72 గ్రామాలను ఇందుకు ఎంపిక చేసినట్టు ఆ జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి చెప్పారు. రైతు గ్రూపుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబర్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అయ్యాక డ్రోన్ల కొనుగోలుకు వీలవుతుంది. ఉద్యాన పంటలకు సైతం.. సాధారణంగా పంటలకు సోకిన తెగుళ్ల నివారణకు పురుగు మందులను స్ప్రేయర్లలో నింపి పంటపై స్ప్రే చేస్తారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకు సోకే తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఈ డ్రోన్ల ద్వారా పిచికారి చేసేందుకు వీలుంది. డ్రోన్ల ద్వారా పిచికారి చేసే మందు నానో డోసుల్లో ఉంటుంది. దానిని తగిన మోతాదులో నింపి డ్రోన్లో ఉంచి వదిలితే పంటపై జెట్ స్పీడ్లో స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. డ్రోన్ ఖరీదు రూ.10 లక్షలు.. ఒక్కో కిసాన్ డ్రోన్ ఖరీదు సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 40 శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. 50 శాతం సొమ్మును బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది. మిగతా 10 శాతం సొమ్మును గ్రూపు రైతులు సమకూర్చుకోవలసి ఉంటుంది. పంటలకు పురుగు మందులు పిచికారీ చేసుకోదల్చుకున్న వారికి అద్దె ప్రాతిపదికన డ్రోన్లను ఇస్తారు. చాన్నాళ్లుగా పంటల చీడపీడల నివారణకు కూలీలతో పురుగు మందులను స్ప్రే చేయిస్తున్నారు. ఈ పనికి కూలీలు ముందుకు రాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది రైతుకు ఆర్థిక భారమవుతోంది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు కూలీల బెడద తప్పుతుంది. ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. -
బరువైందా... అంటూ బాబుకు బాజా! ఏది నిజం?
‘‘రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా నేనే స్వయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసి అడిగాను. కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపించి అక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేయించాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికి బీమా వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తున్నాం. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదే డేటాను మేం కూడా ప్రామాణికంగా తీసుకుని, నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో మార్పులు చేస్తున్నాం.’’ – ఫసల్ బీమాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‘ఈనాడు’ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? చెప్పటం కష్టం. ఎందుకంటే చంద్రబాబుకు మేలు చేయాలనే ఏకసూత్ర అజెండా అమలు చేయటంలో అడ్డూఅదుపూ కోల్పోయింది. నిజాలు నిస్సిగ్గుగా గాలికొదిలేసింది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ తాము సృష్టించిన ఎల్లో అద్దంలో చూపిస్తోంది. జనంలో అపోహలు సృష్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. వరద బాధితులకు సాయం విషయంలోనైనా... రైతులకు ముందెన్నడూ లేని తీరులో అందుతున్న పంటల బీమా విషయంలోనైనా... దేన్లోనైనా ఇదే తీరు. ఇదంతా చూశాక ఇప్పుడో కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తోంది. రాసేవాడు రామోజీరావు అయితే... చదివే వాడు చంద్రబాబే అని!!. కాకపోతే ‘ఈనాడు’ పత్రిక చదివే వాళ్లంతా చంద్రబాబులు కారుగా? తమ సంతోషం కోసం రాశారని చూసి మురిసిపోవటానికి!!. పాఠకులకు నిజాలు కావాలి కదా? ఇంకెప్పుడు చెబుతారు రామోజీరావుగారూ వాస్తవాలు? వృద్ధాప్యంలోనైనా మారరా? ‘బీమా బరువైందా?’ అని ప్రశ్నిస్తూ మంగళవారం ఉదయం ఓ పేద్ద కథనాన్ని వండేసింది ‘ఈనాడు’. రెండేళ్లకే సర్కారు మడమ తిప్పేస్తోందని, మళ్లీ కేంద్ర పథకాల్లో చేరుతోందని... ఇదంతా కేంద్ర నిధుల కోసమేనని పాపం తెగ ఆందోళనకు గురైంది. దాంతోపాటు... ఇలా కేంద్ర పథకాల్లో చేరితే అప్పట్లో ఉన్న లోపాలను అధిగమించేదెలా? అంటూ మథనపడిపోయింది కూడా!!. ఇక్కడ రామోజీ తెలిసో తెలియకో ఒప్పుకున్న నిజం ఒకటుంది. అది.. అప్పట్లో లోపాలున్నాయని!! కాబట్టే రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర బీమా పథకం నుంచి బయటకు వచ్చి కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చిందని. దీంతోపాటు.. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం చాలా బరువును మోస్తోందన్న విషయాన్ని కూడా రామోజీరావు చెప్పకనే చెప్పారు. ఇక్కడ రామోజీ సమాధానమివ్వాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏం! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ కేంద్ర పథకం బాగులేదని, రాష్ట్ర రైతులకు మేలు చేయాలంటే దీంతో సాధ్యం కాదని రామోజీ ఎందుకు సలహా ఇవ్వలేదు? పోనీ తన పత్రికలో కథనాలెందుకు రాయలేదు? ఈ రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులతో పంటల బీమా అమలు చేస్తోందని ఏ ఒక్కరోజూ ఎందుకు రాయలేదు? ఇపుడు వాస్తవమేంటన్నది చెప్పకుండా ఈ నిందలెందుకు? అసలు మీ పాత్ర ఏంటి రామోజీ? ప్రతిపక్ష పాత్రా..? లేక ప్రతినాయకుడి పక్ష పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా ఈ రోత రాతలకు!!. చంద్రబాబు చేయలేదెందుకు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై)తో బీమా సంస్థలకే లబ్ధి చేకూరుతోందని, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే రెండు సీజన్లు ముగిసినా పరిహారం అందటం లేదని అందుకే బీహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సొంత పథకాలు అమలు చేస్తున్నారని ‘ఈనాడు’ వాకృచ్చింది. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్సార్ పంటల బీమా తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. కాకపోతే ఘనత వహించిన ఇంటిమనిషి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో ఎప్పుడూ రాయదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేస్తున్నట్లు కూడా ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా రాయదు ‘ఈనాడు’. నిజానికి గతంలో ఇది కేంద్ర పథకంగా ఉండేటపుడు పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక ప్రీమియంలో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారు నష్టపోతే.. వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. ఇదిగో... ఇలాంటి పరిస్థితులకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే... రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా పంటల బీమా అమలు చేయాలని సంకల్పించారు వైఎస్ జగన్. అందుకే కేంద్ర పథకం నుంచి బయటకు వచ్చేసి... ఈ–క్రాప్ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగియక ముందే పరిహారం ఇవ్వటం. తద్వారా తదుపరి సీజన్కు ఆ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటం. అదీ ఉద్దేశం. అందుకే ఇది రైతు ప్రభుత్వమయ్యింది. అలాంటి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు వదిలేస్తుందా? బీమా పథకం బరువైపోయింది కాబట్టి కేంద్రానికి అప్పగించేస్తుందా? ఆ మాత్రం ఆలోచించాలి కదా రామోజీరావు గారూ? అసలు ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా? చంద్రబాబు ఈ దిశగా ఆలోచనైనా చేశారా? టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.341 కోట్ల పరిహారాన్ని అందించారు. కానీ కేంద్ర పథకంలో ఉన్న పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్.జగన్ సర్కారు.. నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేసింది. ప్రీమియం చెల్లించిన వారికే ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చేసింది. 2019 జూలై 8న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు జగన్. ఈ–క్రాప్లో పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకూ బీమా వర్తించేలా... ఆర్బీకేల్లోనే నామమాత్రంగా రూ.10 తీసుకుని రసీదు కూడా ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్లో నమోదు చేసినట్లు రైతుకు ఇచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా సీజన్ మారకముందే పరిహారం అందుతోంది. ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తుండగా... గతంతో పోలిస్తే బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కూడా ఏకంగా 167.04 శాతం పెరిగింది. 2018–19లో 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల మొత్తాన్ని 2019లో వై.ఎస్.జగన్ ప్రభుత్వమే చెల్లించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్లు బీమా దక్కితే గడిచిన మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.6684.84 కోట్ల బీమా సొమ్ములు అందాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఖరీఫ్– 2021–22 సీజన్కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2977.82 కోట్లు బీమాగా అందజేసింది. ఇవీ రాయని, రాయాలనుకోని వాస్తవాలు!!. బీమా లైసెన్స్ కోసం ప్రయత్నాలు... బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావించటంతో పాటు... దీనికోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు ముఖ్యమంత్రి జగన్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ బీమా కంపెనీ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. దీనికి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) లైసెన్సు ఇవ్వాల్సి ఉంటుంది. పదేపదే దీనికోసం అభ్యర్థనలు చేయటంతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో పెండింగ్ అంశాలు మాట్లాడిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావించారు. త్వరలో లైసెన్స్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ మధ్యలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా సీఎం జగన్కు ఫోన్ చేసి... కేంద్ర పథకంలో భాగస్వామిగా ఉండాలని కోరారు. ఈ పథకం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారో అడగటంతో పాటు... లోటుపాట్లు ఉంటే చెప్పాలని, సవరించుకుంటామని కూడా అడిగారాయన. అనంతరం కేంద్ర బృందాన్ని కూడా పంపించారు. ఇక్కడి అధికారులతో సమావేశమైన ఆ బృందం... ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేమిటనేది అడిగి తెలుసుకుంది. ఈ–క్రాప్లో నమోదైన ప్రతి రైతుకూ పంట దెబ్బతిన్న పక్షంలో బీమా పరిహారం అందటం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి పరిహారాన్ని అదే సీజన్లో అందించటమనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లు కాగా... ఆ రెండింటికీ కేంద్రం అంగీకరిస్తోంది. ఆ మేరకు చట్టానికి సవరణలు చేసే పనిలోనూ పడింది. అవన్నీ పూర్తయితే రైతుకు ఇప్పటి మాదిరే పరిహారానికి ఎలాంటి ఢోకా ఉండదు. మరప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అయినా రైతు డబ్బులే చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు కేంద్ర పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోతోందని రామోజీ ఎందుకంత బాధపడిపోతున్నారో అర్థం కాదు. పైపెచ్చు కేంద్ర పథకంలో చేరినా కూడా ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న డేటా ప్రకారమే... అంటే ఇప్పటి మాదిరిగానే రైతులకు పరిహారం అందుతుంది. మరప్పుడు ‘ఈనాడు’కొచ్చిన కష్టమేంటి? రైతుకు బీమా సొమ్ము ముఖ్యం తప్ప... ఆ డబ్బులు బీమా సంస్థ నుంచి వస్తున్నాయా? కేంద్రం నుంచి వస్తున్నాయా? రాష్ట్రం నుంచి వస్తున్నాయా? అనేది కాదుకదా!!. మూడేళ్లుగా రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదనుకోవాలా? ఇకనైనా ఇలాంటి అర్థంపర్థం లేని వార్తలు అచ్చేయటం ఆపండి రామోజీరావుగారూ!! బీమా బరువేమీ కాదు... పైసా భారం లేకుండా, ఈ–పంట నమోదు ప్రామాణికంగా మూడేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మనం అమలు చేస్తోన్న ఈ–పంట నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం, ఈ డేటా ఆధారంగా పీఎంఎఫ్బీవై పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. కేంద్రం అభ్యర్థన మేరకు సాధ్యా, సాధ్యాలను బేరీజు వేసుకొని మన బీమా పథకాన్ని పీఎంఎఫ్బీవైతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022–23 సీజన్ కోసం బీమా కంపెనీల ఎంపికకు టెండర్ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తాం. ఈ పంటలో నమోదు, ఈ కేవైసీ పూర్తయిన తర్వాత రైతులకు ఇచ్చే రసీదులో బీమా చేసిన పంట పేరు, విస్తీర్ణం వివరాలు పొందుపరుస్తాం. వారి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2023 జూన్లోగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ బీమా పరిహారం, 2023 అక్టోబర్ 15లోగా రబీ–2022–23 సీజన్ బీమా పరిహారం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నాం. పంటల బీమా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – చేవూరి హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీతో రైతు సాధికార సంస్థ గతేడాది అక్టోబర్లో చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన శనగలను మార్క్ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పండించేలా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చారు. వీటిని కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ధర చెల్లించి మరీ సేకరించారు. వాటి నమూనాలను థర్ట్ పార్టీ ఏజెన్సీ ద్వారా పరీక్షించి ధ్రువీకరించిన తర్వాత టీటీడీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 10 నెలల్లో రూ.7.52 కోట్ల విలువైన 1,306 టన్నుల శనగలను టీటీడీకి సరఫరా చేశారు. టీటీడీ సూచన మేరకు స్వామివారి నైవేద్యం, ప్రసాదాలతో పాటు నిత్యాన్నదానం కోసం 2022–23 సీజన్లో 24,728 టన్నుల 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 ఆలయాలకు ఉత్పత్తులు ఇదే స్ఫూర్తితో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, పెనుగంచిప్రోలు, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఆలయాల్లో ప్రసాదం, నైవేద్యం, నిత్యాన్నదానం కోసం రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను ప్రోసెస్ చేసి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం గుర్తించిన రైతులకు రైతు సా«ధికార సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు పండించిన ఉత్పత్తులకు భారతీయ సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండర్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ (పీజీఎస్) ద్వారా సర్టిఫికేషన్ చేయించి మరీ ఆలయాలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, వ్యవసాయ శాఖ మంత్రుల సమక్షంలో ఆయా దేవస్థానాలు, రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్ఫెడ్ మంగళవారం అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. -
ఖరీఫ్లో పంటల నమోదుకు ‘ఈ–క్రాప్’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. పక్కాగా నమోదు ఈ ఖరీఫ్లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్లో వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్తో సహా పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అనంతరం యాప్లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది. ఆ తర్వాత వీఏఏ /వీహెచ్ఏ, వీఆర్వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు. ఈ ఆప్షన్లో వివరాలు.. సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్ల్యాండ్లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్లు 5 శాతం, డీఏవో/డీహెచ్ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్గా తనిఖీ చేయాలి. ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు. -
లక్ష్యం 51,229 కోట్లు.. ఇచ్చింది రూ.12,552 కోట్లే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు బ్యాంకర్ల నిర్లక్ష్యం వెరసి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటికే నష్టాల అంచున ఉన్న రైతులను ఆదుకోవడంలో బ్యాంకులు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు రెండోసారి పంట వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటికి 65 శాతం వరకు పంటలు సాగు కాగా, ఇప్పటివరకు లక్ష్యంలో కేవలం 25 శాతం లోపే బ్యాంకులు పంట రుణాలు ఇచ్చాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు మొదటి వారంలోకి ప్రవేశించి సీజన్ ఊపందుకుంటున్నా.. బ్యాంకు రుణాలు సరిగా లభించకపోవడంతో, సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తుండటంతో రైతులు ప్రైవేట్ అప్పుల వైపు పరుగులు పెట్టాల్సి వస్తోంది. లక్ష్యంలో 24.50 శాతమే..! ఖరీఫ్ (వానాకాలం) సీజన్ మొదలై రెండు నెలలైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 65 శాతం పంటలు ఇప్పటికే సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కానీ ఈ మేరకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. వానాకాలం సీజన్ పంట రుణాల లక్ష్యం రూ.51,229 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.12,552 కోట్ల మేరకే ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే మొత్తం రుణ లక్ష్యంలో కేవలం 24.50 శాతమే రుణాలు ఇచ్చాయన్నమాట. రాష్ట్రంలో పట్టాదారు రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు ఉండగా, అందులో బ్యాంకర్ల రుణ లక్ష్యం కేవలం 33.85 లక్షల మంది రైతులే. కాగా వీరిలో ఇప్పటివరకు 8 లక్షల మందికే రుణాలు అందినట్లు అంచనా. కాగా మిగతా రైతుల్లో చాలామంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా రైతులు సుమారు రూ.7 వేల కోట్ల మేరకు ప్రైవేట్ అప్పులు తీసుకున్నట్లు ఓ అంచనా. ధరణితో తిప్పలు.. బ్యాంకులు రైతులకు రుణాల మంజూరు విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నాయి. ముఖ్యంగా ధరణి పోర్టల్కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారని తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీసీఎల్ఏతో సమావేశం ఏర్పాటు చేయాలని బ్యాంకులు కోరుతున్నాయి. ధరణి పోర్టల్లో కొందరు రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్బుక్లు ఉన్నా కొన్ని బ్యాంకర్ల లాగిన్లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. కొన్ని గ్రామాలు ఇంకా ధరణిలో నమోదు కాలేదు. కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి మధ్య వివరాల్లో తేడాలుంటున్నాయి. ఇలాంటి కారణాలతోనే రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. కాగా లక్షలాది మందికి ఈ విధంగా ధరణి సమస్యలతో రుణాలు రాకుండా పోతున్నాయి. అయితే దీనికి పరిష్కారం చూడకుండా బ్యాంకర్లు, అధికారులు రైతులను కష్టాలు పాలు చేయ డంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో రైతుల పట్టాదార్ పాస్బుక్లు పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ప్రతీ జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోర్టల్లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు సరి చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే సమస్యగా మారడంతో దాన్ని సాకుగా చూపించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రుణమాఫీ జరగకపోవడంతో.. లక్ష రూపాయల రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల కూడా బ్యాంకులు చాలామంది రైతులకు రుణాలు ఇవ్వడంలేదు. ఇప్పటివరకు కేవలం రూ.37 వేల లోపు బకాయిలున్న రైతులకు మాత్రమే రుణమాఫీ పూర్తిచేశారు. ఇంకా లక్ష రూపాయల వరకు ఉన్న బకాయిలు మాఫీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు క్లియర్ చేసుకుందామని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2018 వరకు ఉన్న బకాయిలపై వడ్డీకి వడ్డీ జమ అవుతోంది. అసలు, వడ్డీ కలిపి తడిసిమోపెడవుతోంది. తొలుత రైతులు బ్యాంకు రుణాలు రెన్యువల్ చేసుకోవాలని, తర్వాత తాము చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొందరు రైతులు రెన్యువల్ చేసుకోగా.. ఎక్కువమంది రైతులు రెన్యువల్ చేసుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. దీంతో బ్యాంకులు వారికి పంట రుణాలు ఇవ్వడంలేదు. కొన్నిచోట్ల రైతుబంధు సొమ్మును కూడా బ్యాంకులు రైతుల బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఆపొద్దన్నా బ్యాంకర్ల తీరులో మార్పు రావడం లేదు. రుణం కోసం రెండు నెలలుగా తిరుగుతున్నా పంట రుణం కోసం కోహెడలోని బ్యాంకు చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదు. కొత్త వారికి రుణాలు మంజూరు చేసేందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయం సరిపోలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నాం. –బోలుమల్ల కృష్ణ, రైతు, రాంచంద్రాపూర్, కోహెడ మండలం -
ఆహారభద్రత నిధులపై చిన్నచూపు.. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) నిధులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచాలన్నదే జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రధాన లక్ష్యం. మెరుగైన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. అందులో భాగంగా అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యంత్రాలు సమకూర్చడం ద్వారా రైతులకు ఉపయోగపడాలి. సమర్థవంతమైన పంట సంరక్షణ చర్య లు, పోషకాల నిర్వహణ, భూసారం పెంచే చర్య లు, ప్రాసెసింగ్ యూనిట్లు, పంటకోత అనంత రం ఉపయోగించే పరికరాలతోపాటు పంటలకు సంబంధించి రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇంతటి కీలకమైన లక్ష్యాలతో ఏర్పాటైన మిషన్ను రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు, విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం.. ఆహార భద్రతా మిషన్ కింద కేంద్రం 60 శాతం నిధులు కేటాయిస్తే, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో కేంద్రం కేటాయింపుల్లో 60 శాతం ఇవ్వడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. 2021–22లో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1,471 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణకు కేంద్రం రూ.21.94 కేటాయించింది. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇలా గోవా, తెలంగాణలకే నిధులు కేటాయించలేదని అంటున్నాయి. మిషన్ కింద గతేడాది అత్యధికంగా మధ్యప్రదేశ్కు రూ.282.67 కోట్లు కేటాయించిన కేంద్రం, రూ. 169.56 కోట్లు విడుదల చేసింది. రాజస్థాన్కు రూ.199.50 కోట్లు కేటాయించి, రూ.89.50 కోట్లు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్కు 119.85 కోట్లు కేటాయించి, రూ. 52.73 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎందుకు నిధులు విడుదల చేయలేదని అధికారులు ప్రశ్ని స్తున్నారు. కేంద్రవర్గాలు మాత్రం తెలంగాణ తన వాటా సొమ్ము కేటాయించడంలో అనేకసార్లు విఫ లమైందని అంటున్నాయి. 2019– 20లో 32.65 కోట్లు కేటాయిస్తే, రూ.15.05 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయని, కానీ, రాష్ట్రం రూ.10.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నాయి. -
AP: రైతన్నలకు శుభవార్త.. 50% సబ్సిడీపై..
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన అత్యాధునిక యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 50% సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనుంది. రూ.2,016 కోట్ల అంచనా వ్యయంతో.. రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల (రూ.6 లక్షలు సబ్సిడీ) విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల (రూ.10 లక్షలు సబ్సిడీ) అంచనా వ్యయం కాగల కంబైన్డ్ హార్వెస్టర్స్తో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల విలువైన 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. వీటికి అదనంగా త్వరలో రైతన్నలకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 1.80 లక్షల మందిని సర్వే చేసి.. రైతులకు ఏ పరికరాలు అవసరమో గుర్తించేందుకు ఆర్బీకే స్థాయిలో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి 20 మంది చొప్పున రాండమ్గా 1.80 లక్షల మందిని సర్వే చేసి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 34 శాతం మంది.. పీపీ ఎక్విప్మెంట్స్ (నాప్సాక్, తైవాన్, పూట్ బూమ్ తదితర కంపెనీలకు చెందిన స్ప్రేయర్లు), 25 శాతం మంది.. టార్పాలిన్స్, 15 శాతం మంది.. భూమి చదును యంత్రాలు (కల్టివేటర్స్, ఎంబీ ప్లాఫ్, లెవెలింగ్ బ్లేడ్, డిస్క్ ప్లో, డిస్క్ పడ్లెర్, రోటో పడ్లెర్ తదితర), 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ (పవర్ టిల్లర్, పవర్ వీడర్, క్రాప్ రేపర్, బ్రష్ కట్టర్, చాప్ కట్టర్), 9 శాతం మంది.. రోటోవేటర్స్, 4 శాతం మంది.. సీడింగ్ పరికరాలు (సీడింగ్ డ్రిల్, సీడ్ కమ్ పెర్ట్ డ్రిల్, డ్రమ్ సీడర్), ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్మెంట్ కావాలని కోరారు. 50 శాతం సబ్సిడీపై పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైన యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామానికి 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైనవి 2 యూనిట్ల చొప్పున 50 శాతం సబ్సిడీపై మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యూనిట్లను అందించడానికి రూ.403 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అర్హుల గుర్తింపు పూర్తికాగానే అమలుకు చర్యలు.. గత మూడేళ్లలో గ్రామ, క్లస్టర్ స్థాయిలో రైతు కమిటీలతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అందించాం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీహెచ్సీలతో పాటు వ్యక్తిగతంగా రైతులకు పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అర్హుల గుర్తింపు కోసం విధివిధానాల రూపకల్పన పూర్తి కాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. –కాకాని గోవర్థన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
సాగు.. బహు బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ముందస్తుగా సాగు నీటి విడుదలతో ఏరువాక కంటే ముందుగానే రైతులు కాడెత్తి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు ఆశించిన స్థాయి వర్షాలతో జోరు పెంచారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో గత మూడేళ్ల కంటే మిన్నగా దిగుబడులు సాధించాలని రైతులు కదంతొక్కుతున్నారు. ఈ సీజన్కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,757.70 కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత ఖరీఫ్లో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మందికి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందించింది. మొత్తంగా రూ.6,735.52 కోట్ల సాయం చేసింది. దీంతో రైతులకు ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి ఢోకా లేకుండా పోయింది. మేలు చేస్తున్న వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలకరి ప్రారంభమైంది మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్లో జూలై మూడో వారానికి 192.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 222.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా మినహా సాధారణం కంటే అధిక, అత్యధిక వర్షపాతాలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 248 మి.మీ కురవాల్సి ఉండగా, 342.8 మి.మీ (38.1 శాతం అధికం), దక్షిణ కోస్తా జిల్లాల్లో 150 మి.మీకు 165.4 మి.మీ (10.3 శాతం అధికం), రాయలసీమలో 98.4 మి.మీ కురవాల్సి ఉండగా, 100.5 (2.2 శాతం అధికం) వర్షపాతం కురిసింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో విత్తిన తర్వాత కొంత నీటి ఎద్దడికి గురవడం జరుగుతుంది. కానీ, తొలిసారి రాయలసీమతో సహా రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ పంటకూ నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మొక్క నిలదొక్కుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాను కట్టే దశకు చేరుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశకు చేరుకుంది. పైగా ఎక్కడా ఇప్పటి వరకు తెగుళ్లు, పురుగుల జాడ కన్పించలేదు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఈ సీజన్కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 12.20 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 4.22 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 7.98 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూలై నెలకు ç3,92,899 టన్నుల ఎరువులు అవసరం. కానీ, డిమాండ్ కంటే రెట్టింపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1,24,366 టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటి వరకు 59 వేల టన్నులు రైతులకు విక్రయించారు. జూలై నెలకు కేంద్రం కేటాయించిన 3,92,987 టన్నుల ఎరువులు రావాల్సి ఉంది. ఇవి కూడా వస్తే సీజన్ ముగిసే వరకు ఎరువులకు ఢోకా ఉండదు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.50 కోట్ల విలువైన పురుగుల మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. గతేడాది కంటే మిన్నగా సాగు ఇక సాగు నీటి విడుదల, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు సాగు జోరు పెంచారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 95.23 లక్షల ఎకరాలు కాగా, జూలై మూడో వారం ముగిసే నాటికి 26.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 25 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 40.75 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 8.30 లక్షల ఎకరాల్లో పత్తి, 5.6 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.32 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగుల మందులు ఆర్బీకేల ద్వారా 6.33 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 5.21 లక్షల క్వింటాళ్ల రైతులకు పంపిణీ చేశారు. ప్రధానంగా 1.40 లక్షల క్వింటాళ్ల వరి, 3.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో 18 వేల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 11 వేల క్వింటాళ్ల 90 శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు పంపిణీ చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 88.15 క్వింటాళ్లు, మిరప 0.86 క్వింటాళ్లు, జొన్నలు 2.25 క్వింటాళ్లు, సోయాబీన్ 37.20 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. ఈసారి అప్పు చేయాల్సిన అవసరం లేదు నాకు మూడెకరాల సొంత భూమి ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు చేస్తున్నా. రైతు భరోసా కింద æరూ.7,500, పంట బీమా పరిహారంగా రూ.18 వేలు వచ్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో చిన్న ట్రాక్టరుకు రూ.70 వేలు సబ్సిడీ అందింది. ఈసారి సాగుకు పెద్దగా అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. మంచి వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేశాను. – సానబోయిన శ్యామసుందర్, కొత్తపేట, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నా నాకు 12 ఎకరాల పొలం ఉంది. ఎంటీయూ 1061 రకం వరి వేశాను. మాను దశలో ఉంది. పెట్టుబడి సాయం, పంటల బీమా చేతికొచ్చింది. పెట్టుబడికి ఇబ్బంది లేదు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు కూడా తీసుకున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నా. – జి.శ్రీనివాసరావు, ఎస్ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం జిల్లా సాగు ఊపందుకుంటోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. నెలాఖరుకు కనీసం 50 శాతం దాటే అవకాశాలున్నాయి. విత్తనాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. రికార్డు స్థాయిలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ జోరుగా సాగుతోంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఈ–పంటతోపాటే ఈ–కేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలవల్ల పంట కొనుగోలు.. సంక్షేమ పథకాల వర్తింపు విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ–పంట ఆధారంగానే వైఎస్సార్ రైతుభరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, దీని ప్రామాణికంగానే పంట ఉత్పత్తులను కనీస మద్దతుకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్) గడిచిన రబీ సీజన్లోనే నవీకరణ (అప్డేట్) చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పంట వివరాల నమోదు ఒకసారి, ఈకేవైసీ నమోదు మరోసారి చేసేవారు. ఈ విధానంవల్ల పంట కొనుగోలు ఇతర పథకాల అమలు సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి చెక్పెడుతూ ఇక నుంచి పంట వివరాల నమోదు సమయంలోనే ఈకేవైసీ (వేలిముద్రలు) తీసుకోవాలని నిర్ణయించారు. వెబ్ల్యాండ్ ఆధారంగానే ఈ–క్రాపింగ్ వెబ్ల్యాండ్ ఆధారంగా పంట సాగు వివరాలతోపాటు రైతు బ్యాంకు, సామాజిక వివరాలను కూడా అనుసంధానిస్తున్నారు. తొలుత ఆధార్ నెంబర్ కొట్టగానే రైతుల వ్యక్తిగత వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత సీజన్లో అతను సాగుచేసే పంట వివరాలు నమోదుచేస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈకేవైసీ నమోదుచేస్తారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది జాయింట్ అజమాయిషీ ద్వారా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్ సీజన్లో ఆగస్టు నెలాఖరు వరకు జాయింట్ అజమాయిషీ కొనసాగిస్తారు. రబీ సీజన్లో అక్టోబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, మూడో పంటకు సంబంధించి మార్చి 1 నుంచి మే 31వరకు నిర్వహించనున్నారు. ఈ జాయింట్ అజమాయిషీలో తొలుత రెవెన్యూ గ్రామాలను ఆర్బీకేలతో అనుసంధానిస్తారు. ఆ తర్వాత వీఆర్వో, గ్రామ సర్వేయర్లు (రెవెన్యూ)తో పాటు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో బృందాలను ఏర్పాటుచేస్తారు. వారికి మండల స్థాయిలో శిక్షణనిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే సంబంధిత రైతు వేలిముద్రలు (ఈకేవైసీ) కూడా నమోదుచేసి రశీదు ఇస్తారు. పంట వివరాల నమోదుకు మార్గదర్శకాలు పరిష్కారంకాని ఇనాం, ఎస్టేట్, సర్వేకాని గ్రామాల్లోని భూములు, చుక్కల భూములు, పీఓటీ ఉల్లంఘనలు, దేవదాయ, వక్ఫ్, సీజేఎఫ్ఎస్, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, సాదాబైనామా కేసులు, మ్యుటేషన్ కోసం పెండింగ్లో ఉన్న భూములు, సీసీఆర్సీ కార్డుదారులు, నమోదుకాని కౌలుదారులు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న వారు, ఏపీఐఐసీ/ఏలినేటెడ్, సేకరించిన భూములు, వాటర్ బాడీలకు చెందిన భూములు, లంక భూముల్లో సాగుచేస్తున్న పంటల వివరాల నమోదుకు మార్గదర్శకాలు జారీచేశారు. నమోదైన ఈ–పంట వివరాలను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు విధిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి 14వరకు ఈ–పంట, ఈకేవైసీ వివరాలను విధిగా ఆర్బీకేలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సెప్టెంబర్ 15న ఆర్బీకే అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పంట వివరాలను తుది జాబితాలను ప్రచురించాలి. పకడ్బందీగా పంటల నమోదు కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడకూడదన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాయింట్ అజమాయిషీ ద్వారా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బంది సంయుక్తంగా ఈ–పంటతో పాటు ఈకేవైసీ ఒకేసారి నమోదు చేయనున్నారు. వివిధ రకాల ప్రభుత్వ, ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న పంట వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో మార్గదర్శకాలిచ్చాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ వ్యవసాయ శాఖ -
ఏపీ వైపు దేశం చూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిశా నిర్దేçశం చేస్తూ.. ఏపీని మోడల్గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ వంటి సౌకర్యాలను పరిశీలించి, మీ రాష్ట్రాల్లో కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పడంతో సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారుల ఆరా సదస్సు ముగిసిన మర్నాడే రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా తన బృందంతో కలిసి ఏపీలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని ఓ ఆర్బీకేను సందర్శించి, కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో పాటు.. గ్రామ స్థాయిలో అందిస్తోన్న సేవలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. తమ ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఉన్నత స్థాయి బృందాన్ని ఏపీ పర్యటనకు పంపిస్తామని ప్రకటించారు. తాజాగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, అస్సోం రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్కు ఫోన్ చేసి, ఏపీలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఆర్బీకేల తరహాలోనే తమ రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. రైతు సంబంధిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి.. తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే తమ రాష్ట్ర ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటిస్తాయని ప్రకటించారు. సాంకేతిక సహకారానికి సిద్ధం కేంద్రంతో సహా వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ తీసుకొస్తున్నారు. తమిళనాడులో గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. జాతీయ సదస్సు తర్వాత ప్రతి రోజు ఏదో రాష్ట్రం నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఏపీలో పర్యటించేందుకు ఆసక్తి చూపాయి. మరిన్ని రాష్ట్రాలు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుసగా ఈ బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. వారికి అవసరమైన సాంకేతికత అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
రాజస్థాన్లోనూ ఆర్బీకే తరహా సేవలు
సాక్షి, అమరావతి/నారాయణవనం (తిరుపతి): ఆంధ్రప్రదేశ్ రైతులకు గ్రామస్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ప్రశంసించారు. ఇదే తరహాలో రాజస్థాన్లో కూడా సేవలం దించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి జి ల్లా నారాయణవనం మండలం భీమునిచెరువు ఆర్బీకేను ఆయన సందర్శించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ అగ్రి ఇన్పుట్ షాప్, లైబ్రరీ, మాయిశ్చర్ మీటర్, సీడ్ టెస్టింగ్ కిట్, కియోస్క్ల పని తీరు.. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు బుక్ చేసుకునే విధానాన్ని పరిశీలించారు. కియోస్క్లో వాతావరణం, దేశవ్యాప్త మార్కెట్ ధరల సమాచారం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కియోస్క్ల పనితీరును ప్రత్యేకంగా అభినందించిన ఆయన.. రాజస్థాన్లో కూడా వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే, ఏపీ తరహాలోనే రాజస్థాన్లో కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏ ర్పాటుచేశామని, వాటి ద్వారా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పాడి సేవలనూ కటారియా మెచ్చుకున్నారు. మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్లను పరిశీలిం చి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. వీటిని తమ రాష్ట్రంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఏపీలో గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటుచేసి పంటల ప్రణాళికలో రైతులను భాగస్వామ్యం చేస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి కటారియా ఇది ఒక వినూత్నమైన ఆలోచనన్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోళ్ల విధానాన్ని పరిశీలించిన ఆయన రాజస్థాన్లో కూడా ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను గ్రామస్థాయిలో ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతు విస్తరణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంతగా మరే రాష్ట్రంలోనూ జరగటంలేదన్నారు. ఏపీని మోడల్గా తీసుకోబోతున్నట్లు కటారియా చెప్పారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక అధికారుల బృందాన్ని మరోసారి పంపనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ నాకు మంచి స్నేహితుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు మంచి స్నేహితుడని.. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. అనంతరం.. ఇటీవల ఈ ఆర్బీకే పరిధిలోని రైతు కమిటీకి అందజేసిన ట్రాక్టర్, యంత్ర పరికరాలను పరిశీలించారు. రైతులతో కలిసి ట్రాక్టర్ను నడిపారు. ఆ తర్వాత సమీప వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం కటారియా.. పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
దేశానికే ఆదర్శంగా నిలిచాం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచామ ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తెచ్చే లక్ష్యంతో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతు న్నాయని తెలిపారు. బెంగళూరులో జరుగు తున్న వ్యవసాయ, ఉద్యాన మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సులో గురువారం మంత్రి కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ‘వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతలుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. సీడ్ టు సేల్’ కాన్సెప్ట్తో ఆర్బీకేల ద్వారా దేశానికే రోల్ మోడల్గా నిలిచాం. నీతి ఆయోగ్, ఆర్బీఐ, నాబార్డు వంటి అనేక ప్రముఖ సంస్థలు, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఆర్బీకే సేవలను ప్రశంసించాయి. పలు ప్రఖ్యాత సంస్థలు మాతో పనిచేసేందుకు ముందుకు వచ్చాయి’ అని చెప్పారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, మన్సుఖ్ మాండవియా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కౌలురైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు చెప్పారు. గతంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే భూ యజమాని, కౌలుదారుడు అనే భేదం లేకుండా వాస్తవ సాగు దారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. సీసీఆర్సీ (పంట సాగు దారుల హక్కు పత్రం) కార్డులున్న వారికి రూ.7లక్షలు, సీసీఆర్సీ కార్డుల్లేని వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ‘కౌలుపాశమా?’ అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడంపై మండిపడ్డారు. పంట సాగు హక్కుదారుల చట్టం–2019 ప్రకారం గడిచిన మూడేళ్లలో 15 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5.76 లక్షల సీసీఆర్సీలు జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.97 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా జారీ చేస్తామని తెలిపారు. సీసీఆర్సీల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ–క్రాప్లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటను కౌలురైతులు ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారని చెప్పారు. గతంలో పరిహారంపై వడ్డీనే తీసుకునే వారు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5లక్షల పరిహారం ఇచ్చేవారని, ఈ మొత్తంలో 1.5 లక్షలు అప్పులకు జమ చేయగా, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం రైతు కుటుంబానికి ఉండేది కాదని వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే సదుపాయం ఉండేదన్నారు. ఎప్పుడో ఐదేళ్లకో..పదేళ్లకో నిర్ణీత గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం సీసీఆర్సీ కార్డు ఉంటే రూ.7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాకే జమ చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 450 మందికి మాత్రమే రూ.5లక్షల చొప్పున రూ.20.12 కోట్ల పరిహారం అందించిందన్నారు. టీడీపీ హయాంలో పరిహారం దక్కని 471 మందికి రూ.5లక్షల చొప్పున రూ.23.55కోట్ల పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందించిందన్నారు. మూడేళ్లలో ఆత్మహత్యకు పాల్పడిన 850 మందికి రూ.7లక్షల చొప్పున రూ.59.50 కోట్ల పరిహారం అందించామన్నారు. వారి మరణాల వెనుక వాస్తవాలివి.. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాదుకు చెందిన షేక్ జానీబాషా, అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం బందార్లపల్లికి చెందిన సోమశేఖర్లు వ్యవసాయమే చేయడం లేదని శేఖర్బాబు తెలిపారు. ఈ ముగ్గురు కూడా కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని త్రిసభ్య కమిటీ నివేదికల్లో స్పష్టంగా పేర్కొందని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వ్యవసాయంలో కలిసిరాక, అప్పుల బాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు ఒడిగట్టినట్టుగా ఈనాడులో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు. మూడేళ్లలో కౌలురైతులకు అందిన సాయమిలా సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద 2019–20లో 1.08 లక్షల మందికి రూ.146.15 కోట్లు, 2020–21లో 69,899 మందికి రూ.94.36 కోట్లు, 2021–22లో 89,877 మందికి రూ.121.33 కోట్లు చొప్పున మూడేళ్లలో 2,68,032 మందికి రూ.361.84 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని వివరించారు. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ)ని అందించామన్నారు. ఖరీఫ్–2020 లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమాపరిహారాన్ని అందించామన్నారు. 3 ఏళ్లలో 1,69,088 మంది రైతులకు రూ.3,382.06 కోట్ల సబ్సిడీతో కూడిన 7,247.5 క్వింటాళ్ల విత్తనాలందించగా, 8.29 లక్షల మందికి రూ.5,421 కోట్ల రుణాలివ్వగా,రూ.లక్ష లోపు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించిన 30,044 మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించామని వివరించారు. -
సాగులో ఏపీ విధానాలు సూపర్.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగంలో ఏపీప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)పై మంగళవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ–క్రాప్ దేశంలోనే వినూత్నం: తోమర్ ‘వ్యవసాయం బాగుండి రైతుల ఆదాయం పెరిగితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ దిశగా మీ (సీఎం జగన్) ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. వ్యవసాయ రంగంలో మీరు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానం దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. ఇది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోయా. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. విజయవంతంగా అమలవుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశమంతా అమలు చేయడం అవసరం. వాటి ఫలాలను రైతులందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశాన్ని నిర్వహించి ఈ–క్రాప్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వినూత్న పథకాలు, కార్యక్రమాలను వివరిస్తాం. వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ సూచనలను స్వీకరిస్తున్నాం.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) రైతులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సమయంలో ఎంతో అండగా ఉంటుంది. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వైదొలిగాయి. లోటుపాట్లను అధిగమిస్తూ ముందుకెళ్తేనే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఏపీలో కేంద్ర బృందం పర్యటన సందర్భంగా సీఎం జగన్ చేసిన సూచనల మేరకు మార్పులు చేస్తున్నాం. ఈ–క్రాప్ వివరాలతో బీమా పథకాన్ని అనుసంధానిస్తాం. ఈ మేరకు మార్గదర్శకాలు సవరించాం. పీఎంఎఫ్బీవైలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు కూడా స్వీకరిస్తాం. చెరిసగం భరిస్తే మరింత మేలు: సీఎం జగన్ ఫసల్ బీమా యోజన పథకాన్ని అందరికీ వర్తింప చేయాలంటే విధానపరంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కేంద్రమంత్రితో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలున్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలతో కలిసి ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్ధక, మత్స్య అసిస్టెంట్లతో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారు. రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్తో ఇ–క్రాప్ చేస్తున్నాం. ప్రతి పంటను బీమా పరిధిలోకి తెచ్చేలా అడ్డంకులను తొలగించాం. పటిష్ట వ్యవస్థ ద్వారా డేటా సేకరిస్తున్నాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. మూడింట రెండొంతుల ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. పంటల బీమాలో యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సన్న, చిన్నకారు రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. ఇందుకోసం ఈ–క్రాప్ డేటాను వినియోగించుకోవాలి. కొన్ని రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనలో ఎందుకు లేవన్న అంశంపై దృష్టి సారించి సమస్యల పరిష్కారంతో పాటు మేం సూచించిన మార్పులు చేర్పులు చేసేందుకు ముందుకొచ్చిన కేంద్ర మంత్రి తోమర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. -
దేశమంతటా ‘ఆర్బీకే’ సేవలు!
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల స్ఫూర్తితో దేశంలోని రైతులందరికీ ఆ తరహా సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రైతులకు గ్రామస్థాయిలోనే సేవలందించే సంకల్పంతో రెండేళ్ల క్రితం నెలకొల్పిన ఆర్బీకే వ్యవస్థపై వివిధ రాష్ట్రాలతోపాటు ఆఫ్రికన్ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మన ఆర్బీకే వ్యవస్థను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రతిష్టాత్మక చాంపియన్ అవార్డుకు నామినేట్ చేసిన కేంద్రం.. ఈ తరహా సేవలను దేశమంతటా అమలు చేయాలని అడుగులు వేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆర్బీకే తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. ఎఫ్ఏవో, నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఎఆర్), ఆర్బీఐ, కేంద్ర బృందాలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ఆర్బీకేల పనితీరును అధ్యయనం చేసి వెళ్లాయి. తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటన ఇలా.. రాష్ట్రంలో పర్యటించే బృందంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి రితీష్ చౌహాన్, వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునిల్, నోడల్ అధికారి అజయ్ కరణ్ సభ్యులుగా ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఈ బృందం నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను సందర్శిస్తుంది. అక్కడ సమీకృత రైతు సమాచార కేంద్రంతో పాటు ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలిస్తుంది. అనంతరం నేరుగా కంకిపాడు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను సందర్శిస్తుంది. ఈ ల్యాబ్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను బృందం సభ్యులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉయ్యూరు మండలం పెదఓగిరాల ఆర్బీకేను సందర్శిస్తారు. ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను పరిశీలించి స్థానిక రైతులతో భేటీ అవుతారు. ఈ పంట నమోదుతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరును పరిశీలిస్తారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు? పీఎంఎఫ్బీవైకు ఈ పథకానికి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? కేంద్ర పథకంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ఈ పథకంలో పలు రాష్ట్రాలు చేరకపోవడానికి ప్రధాన కారణాలలేమిటి? వంటి అంశాలను కూడా కేంద్ర బృందం అధ్యయనం చేస్తుంది. సీఎంతో భేటీకి ఛాన్స్ క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కేంద్ర బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ఆర్బీకే తరహా సేవలను జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర బృందం మన రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు. -
సాగులో ‘డ్రోన్స్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనుషులపై దుష్ప్రభావం చూపే రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి పనులకు డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్లోగా డ్రోన్లను అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయంలో రైతులకు సాయం చేయడానికి కృత్రిమ మేథస్సుతో కూడిన డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలోని ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) ద్వారానే వీటినీ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2 వేల ఆర్బీకేల్లో డ్రోన్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మండల పరిధిలో ఎక్కువ విస్తీర్ణం కల్గిన ఆర్బీకేలను ఎంపిక చేస్తున్నారు. వీటి పరిధిలో ఏ పంటల విస్తీర్ణం ఎంత ఉంది? ఏ సీజన్లో ఎంత ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తారో అంచనా వేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై డ్రోన్లు ఒక్కో డ్రోన్, దాని అనుబంధ పరికరాల అంచనా వ్యయం రూ.10 లక్షలు. వీటి వినియోగానికి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రైతులతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణనిచ్చి, సర్టిఫికెట్లను కూడా ఇస్తారు. డ్రోన్లకు సబ్సిడీ కూడా వస్తుంది. చదువుకోని రైతులకు 40 శాతమే సబ్సిడీ వస్తుంది. అదే చదువుకున్న రైతులతో ఏర్పాటు చేసే సీహెచ్సీలకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. డ్రోన్ల నిర్వహణలో ఫలితాలు వస్తాయి. డ్రోన్తో మందులు, ఎరువులు చల్లే విధానంతో వీడియోలూ రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 30 వేల ఎకరాల్లో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇప్పటికే డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పురుగు మందుల పిచికారీకి పుష్పక్–1, ఎరువులు, విత్తనాలు చల్లడానికి పుష్పక్–2 అనే రెండు రకాల డ్రోన్లను తయారు చేశారు. ఆటోమేటిక్ స్ప్రేయింగ్ మెకానిజంతో 8 కిలోల బరువుండే అగ్రికల్చర్ డ్రోన్లను రూపొందించారు. వీటికి కేంద్రం నుంచి అనుమతులు పొందారు. పది రకాల పంటల సాగులో వీటి వినియోగంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపీ)ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఈ డ్రోన్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పురుగుల మందులు, ఎరువులు చల్లిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, చెరకు పంటల్లో వీటిని వినియోగిస్తున్నారు. డ్రోన్లతో ఉపయోగాలెన్నో.. ► మనుషులతోకన్నా 60 శాతం వేగంగా మందులు, ఎరువులు చల్లొచ్చు ► మోతాదుకు మించి రసాయనాల వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు ► అవసరమైన ప్రాంతంలోనే అవసరమైనంతే పిచికారీ చేయొచ్చు ► తద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ► వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా, త్వరితగతిన అంచనా వేయొచ్చు ► సులువుగా ఎక్కడికై నా తీసుకెళ్లవచ్చు. ► తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ► పంట విస్తీర్ణం. సరిహద్దులను రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు సాధ్యమైనంత త్వరగా సీహెచ్సీల ఏర్పాటు డ్రోన్ల ఎంపిక, వినియోగంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఆర్బీకేల ఎంపిక, సీహెచ్సీల కోసం పట్టభద్రులైన రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాం. సాధ్యమైనంత త్వరగా వీరితో సీహెచ్సీలను ఏర్పాటు చేస్తాం. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే ఎంపిక చేసిన వారికి శిక్షణనిచ్చి గడువులోగా గ్రౌండింగ్ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
‘రైతుబంధు’ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఖాతాలో వెంటనే రైతుబంధు సొమ్ము జమ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. అలాగే, హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగింది. కాగా, ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు నిధుల విడుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిం చింది. ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, నియోజ కవర్గాలు, జిల్లాల వారీగా రైతులను సమీకరించి ఉద్యమించాలని, అవసర మైతే ‘చలో హైదరాబాద్’కు పిలుపునివ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతుబంధు సాయం చేయండి.. పరిహారం ఇప్పించండి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలని టీపీసీసీ కిసాన్సెల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ కిసాన్సెల్ నేతలు బుధవారం వ్యవసాయ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్సెల్ వైస్చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ మే నెలాఖరుకే రైతుబంధు నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జూన్ నెలాఖరుకు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. -
పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్
ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఉండటంతో అన్నదాతల్లో ఆ దిగులు పోయింది. ప్రతి పంటకూ రైతుకు రూపాయి ఖర్చు లేకుండా బీమా చేయిస్తోంది. సగటు దిగుబడి కంటే తక్కువగా వచ్చినప్పుడు అండగా నిలిచి ఆదుకుంటోంది. ఇందుకోసం ఏకంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. 2021 ఖరీఫ్కు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు భారీగా బీమా సొమ్ము అందజేస్తోంది. సాక్షి, అమరావతి: వరదలు, తుపాన్లు, అకాల వర్షాలతో పాటు చీడపీడలతో ఖరీఫ్–2021 సీజన్లో నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రికార్డు స్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తోంది. లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శించింది. అనంతపురం జిల్లా సీకే పల్లిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీమా సొమ్ము పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంటల బీమా గతంలో సన్న, చిన్నకారు రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. కొద్దిపాటి అవగాహన ఉన్న బడా రైతులకు మాత్రమే దాని గురించి అవగాహన ఉండేది. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది చిన్న రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారినపడి ప్రతిసారి ఆర్థికంగా నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం బీమా సొమ్ము ఎప్పుడొస్తుందో.. ఎంతొస్తుందో తెలియక ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. సీజన్ ముగియ కుండానే బీమా పరిహారం చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఈ పంటే ప్రామాణికంగా పంటల బీమా గతంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద ఆహార, నూనెగింజల పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, సీజన్తో సంబంధం లేకుండా ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మారుస్తూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పైసా భారం పడకుండా రైతులకు పరిహారం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పిస్తోంది. క్లైయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. గత ప్రభుత్వంలో కంటే మిన్నగా.. ► టీడీపీ హయాంలో ఏటా సగటున 20 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వస్తే, గత మూడేళ్లలో సగటున 60.35 లక్షల మంది రైతులు, 53.86 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో పైసా భారం పడకుండా 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు బీమా చేయించగలిగారు. ► 2020–21లో 71.30 లక్షల మంది రైతులకు సంబంధించి 61.75 లక్షల హెక్టార్లలో పంటలు బీమా పరిధిలోకి వచ్చాయంటే ఏ స్థాయిలో పెరుగుదల నమోదైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంతో పోల్చుకుంటే రైతుల పరంగా 198.57 శాతం, విస్తీర్ణ పరంగా 128.51 శాతం పెరిగింది. ► చెల్లించిన క్లైమ్ల విషయానికి వస్తే టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా చెల్లిస్తే, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల మేర బీమా అందించింది. ► 6.19 లక్షల మంది రైతుల రూ.715.84 కోట్ల గత ప్రభుత్వ బకాయిలను సైతం చెల్లించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా ఖరీఫ్ –2021కు సంబంధించి 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మొత్తంగా గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లయింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. చరిత్రలో ఇదే తొలిసారి ఒక సీజన్కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదు. 2021 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – చేవూరు హరి కిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
AP: మెగా మేళాకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 5,177 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ)ను ప్రారంభిస్తోంది. రైతుల కమిటీలతో కూడిన ఈ సీహెచ్సీల ద్వారా ఆ ప్రాంత రైతులకు ఎక్కువ ఏ యంత్ర పరికరాలు అవసరమో వాటిని అందిస్తారు. ఇందులో భాగంగా తొలిసారిగా ప్రభుత్వం ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను అందుబాటులోకి తెస్తోంది. మంగళవారం (7వ తేదీ) గుంటూరు చుట్టుగుంట సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. చిన్న, సన్నకారు రైతుల కోసం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చిన్న, సన్నకారు రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్సీలను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో రూ.1,612.50 కోట్లతో 10,750 సీహెచ్సీలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా సాగయ్యే ఎనిమిది (ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల్లో క్లస్టర్ స్థాయిలో రూ.403.75 కోట్లతో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెస్తోంది. ఈ మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. రైతు కమిటీలు పది శాతం , మిగిలిన 50 శాతం ఆప్కాబ్ ద్వారా రుణంగా అందిస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల చొప్పున ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో రూ.163.70 కోట్లతో 3,624 ఆర్బీకే స్థాయి సీహెచ్సీలు, రూ.17.75 కోట్లతో 71 కంబైన్డ్ హార్వెస్టర్స్తో కూడిన క్లస్టర్ స్థాయి సీహెచ్సీలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.65.06 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించింది. మిగిలిన మొత్తంలో రూ.25.66 కోట్లు రైతు కమిటీలు సమకూర్చుకోగా, రూ.90.72 కోట్లు రుణంగా అందించారు. నాలుగో విడతలో 5,177 సీహెచ్సీలు నాలుగో విడతలో రూ.470 కోట్ల అంచనా వ్యయంతో 5,177 సీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ట్రాక్టర్లతో కూడిన ఆర్బీకే స్థాయి సీహెచ్సీలు 3,800 ఉంటాయి. హార్వెస్టర్లతో కూడినవి 320 క్లస్టర్ స్థాయిలో ఉన్నాయి. ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలతో ఆర్బీకే స్థాయి సీహెచ్సీలు మరో 1,057 ఏర్పాటు చేస్తున్నారు. వ్యయంలో రూ.170 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగిలిన మొత్తంలో 10 శాతం రైతు కమిటీలు, మిగిలినది బ్యాంకుల నుంచి రుణం రూపంలో అందిస్తున్నారు. ప్రతి సీహెచ్సీకి ఓ ట్రాక్టర్ ఆర్బీకే స్థాయిలో ప్రతి సీహెచ్సీకి ఓ ట్రాక్టర్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం ఏడుకు పైగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వందకు పైగా మోడళ్లు ఉంటాయి. హార్స్ పవర్ను బట్టి రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ విలువలో 40 శాతం (రూ.2లక్షల నుంచి రూ.3.4లక్షల) వరకు సబ్సిడీగా అందిస్తున్నారు. తొలి విడతగా మండలానికి కనీసం ఆరు చొప్పున 3,800 ట్రాక్టర్లను ఇస్తారు. కంబైన్డ్ హార్వెస్టర్ల మాదిరిగానే ఈ ట్రాక్టర్లకు కూడా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను అమర్చుతున్నారు. రైతుల వెతలు తీర్చేందుకే విత్తు నుంచి కోతల వరకు కూలీల కోసం రైతులు పడుతున్న ఇక్కట్లకు తెరదించేందుకే గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను తీసుకొస్తోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆర్బీకేలోనూ ఓ ట్రాక్టర్ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే తొలి విడతగా 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేయబోతున్నాం. 320 కంబైన్డ్ హార్వెస్టర్స్తో క్లస్టర్ స్థాయి సీహెచ్సీలు, ఇతర పరికరాలతో మరో 1,057 సీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మెగా మేళా రూపంలో రాష్ట్రస్థాయిలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. – వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
కాడి కట్టి, మేడి పట్టి అరకలు.. ఉరకలు
సాక్షి, అమరావతి: సహకరిస్తున్న ప్రకృతితోపాటు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మేడి పట్టి ముందస్తు ఏరువాకకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కేరళపై విస్తరించిన నైరుతి పవనాలు మరో ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కాడెద్దులతో అన్నదాతలు ముందస్తుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించి ముందస్తుగా రుతు పవనాల రాకతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి ఎరువుల దాకా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే రైతన్నలకు అందుబాటులో ఉంచింది. ముందస్తు ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతుండగా నేటి నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వరితోపాటు ఇతర పంటల విత్తనాల పంపిణీ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఆర్బీకేల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ముందస్తు ఖరీఫ్కు అనుగుణంగా ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో జూన్–జూలై నెలల్లో డిమాండ్కు సరిపడా నిల్వ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా గోదావరి డెల్టాకు నేడు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎరువులు.. విత్తనాలు గత ఖరీఫ్లో రాష్ట్రంలో 15.34 లక్షల టన్నుల ఎరువులను వినియోగించగా ఈసారి 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రబీలో మిగిలిన నిల్వలతో పాటు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏప్రిల్, మేలో కేంద్రం 3.47 లక్షల టన్నులను కేటాయించడంతో 7.69 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో 1.21 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగడంతో 6.48 లక్షల టన్నులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేశారు. వీటిలో 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ చేశారు. తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. వీటి కోసం ఇప్పటికే 23 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. తొలుత తూర్పు, పశ్చిమ డెల్టాలో గోదావరి తూర్పు డెల్టా కింద 2 లక్షలు, సెంట్రల్ డెల్టా పరిధిలో 1.7 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ డెల్టా పరిధిలో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తొలుత ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో 6.3 లక్షలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. సెంట్రల్ డెల్టా పరిధిలో కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరందేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. నీటి విడుదలతో ముందుగా రాజమహేంద్రవరం, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కొవ్వూరు, నిడదవోలు, మార్టేరు, పెనుగొండ తదితర ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువలకు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నారు. ► ఖరీఫ్లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం ► ఈసారి ఖరీఫ్లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 40.76 లక్షల ఎకరాల్లో వరి, 18.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 15,97 లక్షల ఎకరాల్లో పత్తి, 8.88 లక్షల ఎకరాల్లో అపరాలు 3.94 లక్షల ఎకరాల్లో మిరప, 2.95 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ► ఖరీఫ్ కోసం 6,16,664 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. 29,417 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా 5,87,247 క్వింటాళ్ల విత్తనాన్ని 25 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ► ఆర్బీకేల్లో 94,542 క్వింటాళ్ల పచ్చి ట్ట విత్తనాల పిణీ జోరుగా జరుగుతోంది. మరో వైపు 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 1,73,635 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. ఇప్పటివరకు 1,25,318 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ► వరి సహా ఇతర పంటలకు సంబంధించి 1,92,433 క్వింటాళ్ల విత్తనాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,72,234 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించినవి ఉన్నాయి. వెంటనే నారుమళ్లు పోస్తాం.. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నీటి విడుదలలో ఆలస్యం వల్ల ఏటా కోతకొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. గతేడాది వర్షాలు, తుపాన్ల వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. ఈఏడాది ప్రభుత్వం జూన్ 1నే డెల్టాకు నీరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నారుమళ్లు పోసి నాట్లు వేసుకుంటా. ఈసారి స్వర్ణతో పాటు ఎంటీయూ 1318, పీఎల్ 1100 రకాలు సాగు చేస్తా. –సంకురాత్రి సుబ్బారావు, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా వ్యవసాయానికి మంచిరోజులు వ్యవసాయానికి నిజంగా మంచిరోజులొచ్చాయి. ముందుగా సాగునీరు ఇవ్వాలని కోనసీమలో గతంలో రైతులంతా లక్ష ఎకరాల్లో సాగు సమ్మె చేశారు. నాటి డిమాండ్ నేడు సాకారమైంది. ప్రభుత్వం ముందస్తుగా సాగు నీరివ్వడం నిజంగా రైతులకు వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీటి వృథాను అరికట్టి సాగు చేపట్టాలి. –కొవ్వూరి త్రినాథ్రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రైతులకెంతో మేలు ముందస్తు ఖరీఫ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కాలువలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని అదును దాటిపోకుండా ఖరీఫ్ సాగు చేపట్టాలి. –జున్నూరి రామారావు(బాబి) రైతు, ఏపీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు అదునులో సాగుతో అదనపు దిగుబడి ‘నాకు 59 సెంట్ల సొంత భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది అకాల వర్షాలు, తుపాన్ల వల్ల దిగుబడి తగ్గింది. ఈసారి జూన్ 1వ తేదీనే డెల్టాకు నీరిస్తుండటంతో బుధవారమే నారుమడి పోస్తున్నా. అదునులో సాగు చేపడుతుండటంతో ఎకరాకు కనీసం 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ముందుగా నీళ్లిస్తున్న ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు’ – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, రాయవరం మండలం, కోనసీమ జిల్లా -
ముందస్తు.. మస్తు!
సాక్షి, అమరావతి: ఈసారి ముందస్తు ఖరీఫ్ సాగుతో మంచి దిగుబడులొస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 దశాబ్దాల తర్వాత 15–30 రోజులు ముందుగానే కాలువలకు నీటిని వదలనుండటంతో వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా పంటలు చేతికందనున్నాయి. గత ఖరీఫ్లో 165 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయగా అకాల వర్షాలు, వైపరీత్యాలతో 159.82 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్లో 171.62 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆహార ధాన్యాల్లో రికార్డు ఆహార ధాన్యాల దిగుబడులు గతేడాది 77.35 లక్షల టన్నులు రాగా ఈసారి ఖరీఫ్లో 95.16 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. 2019 ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 87.77 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈసారి అంతకు మించి వస్తాయంటున్నారు. వైపరీత్యాల ప్రభావంతో గతేడాది ధాన్యం దిగుబడి 70.96 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈసారి 85.58 లక్షల టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా. 2019లో రికార్డు స్థాయిలో 80.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి నమోదైంది. భారీగా పెరగనున్న చెరకు ధాన్యం తర్వాత ఈసారి చెరకు దిగుబడులు గణనీయంగా రానున్నట్లు అంచనా. 2019లో 67.17 లక్షల టన్నులు, 2020లో 41.15 లక్షల టన్నులు, 2021లో 36.54 లక్షల టన్నుల చెరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 50.15 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. అపరాలు గతేడాది 1.14 లక్షల టన్నుల దిగుబడులు రాగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2.18 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది. నూనె గింజల్లో ప్రధానంగా వేరుశనగ గతేడాది 5.40 లక్షల టన్నుల దిగుబడి రాగా ఈసారి 8.28 లక్షల టన్నులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న గతేడాది 4.41 లక్షల టన్నులు రాగా ఈ ఏడాది 5.74 లక్షల టన్నులొస్తుందని భావిస్తున్నారు. ఇలా ప్రధాన పంటల దిగుబడులు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముందస్తు సాగుతో సత్ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్ కోసం సాగునీటి ప్రణాళికను ప్రకటించింది. ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నాటికి పంటలు చేతికి వచ్చేలా ప్రణాళికకు అనుగుణంగా సాగు చేపడితే సత్ఫలితాలు సాధించవచ్చు.ఖరీఫ్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతన్నలు ముందస్తు సాగుకు సిద్ధం కావాలి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్క్ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్లో ఉన్నట్లు మార్క్ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్ఫెడ్ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది. మార్గదర్శకాలు ఇవీ.. ♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు. ♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు. ♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి. ♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి. ♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు. ♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. -
ముందస్తు ఏరువాకకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ముందస్తు తొలకరికి అన్నదాతలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. సాగునీటి ప్రణాళికతో పాటు చానళ్ల వారీగా నీటి విడుదల షెడ్యూల్ ఖరారు కావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని అదునులో విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవైపు ఆర్బీకేల ద్వారా ప్రచారం చేస్తూ మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్కు ముందే అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నాడు ముక్కారు పంటలు.. ఒకప్పుడు ముక్కారు పంటలు పండిన కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతాల్లో 2 పంటలు చేతికి రావడం గగనమైపోయింది. ఆంగ్లేయుల కాలం నుంచి ఏప్రిల్–మేలో నిలిపివేసి మే–జూన్లో కాలువలకు నీటిని విడుదల చేసేవారు. 1980కు ముందు వరకు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత పనుల్లో జాప్యం కారణంగా నీటి నిలిపివేత వ్యవధిని 2 నెలలకు పెంచడంతో పాటు మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డెల్టాలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారడంతో ఒకదశలో సాగు సమ్మెకు సైతం సిద్ధపడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సమృద్ధిగా నీరు మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రైతన్నలు ఏటా సిరుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల తర్వాత ముందస్తు సాగుకు సన్నాహాలు చేస్తోంది. అదనపు ఆదాయం.. భూమి సారవంతం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటలను విత్తుకుంటే అక్టోబర్ చివరికి కోతలు పూర్తి కానున్నాయి. మార్చి చివరికల్లా రబీ ముగించుకొని మూడోపంటగా అపరాలు సాగు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా అక్టోబర్–నవంబర్లో ఖరీఫ్ పంట, మేలో రబీ పంట వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా కాపాడవచ్చు. మూడో పంటగా అపరాలు సాగు చేస్తే ఎకరాకు కనీసం రూ.30 వేలకు పైగా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అపరాల కోతల తర్వాత దుక్కులు దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలు 2022 ఖరీఫ్లో 95,23,217 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. సాధారణంగా ఈ సీజన్లో ఏప్రిల్–మేలో 2 లక్షల టన్నులు, జూన్–జూలైలో 3 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయిస్తుంది. ముందస్తు సాగు నేపథ్యంలో వీటిని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించడంతో సరిపడా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 5.8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా కాగా 1.50 లక్షల టన్నులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. జూన్–జూలైలో కనీసం 6 లక్షల టన్నులు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్టిఫై చేసిన 6.52 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేయగా ఇప్పటికే వేరుశనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వరితో సహా మిగిలిన విత్తనాలను జూన్ 1 నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉంచారు. తొలిసారిగా వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మొత్తం వినియోగంలో కనీసం 20–30 శాతం ఎరువులు, 5–10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్బీకేల్లో విస్తృత ప్రచారం గతంతో పోలిస్తే ఈసారి 15–30 రోజులు ముందుగా సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న గోదావరి డెల్టాకు, జూన్ 10న కృష్ణా డెల్టా, పెన్నా ప్రాజెక్టు కింద, జూన్ చివరి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు కింద నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా నీటి పారుదల సలహా మండలి సమావేశాల్లో చానళ్ల వారీగా నీటి విడుదలను, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో పంటల ప్రణాళికలను ఖరారు చేశారు. రైతులను సన్నద్ధం చేసేందుకు ఆర్బీకేల ద్వారా పోస్టర్లు, కరపత్రాలు, టముకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. పాలనకు ప్రకృతి సహకారం... సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నిండా సమృద్ధిగా నీళ్లుండడంతో దశాబ్దాల తర్వాత రైతులకు ముందస్తుగా నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఏర్పాట్లు పూర్తి ముందస్తు సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్కు ముందుగానే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యం తో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమల (సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదేశించారు. తొలి దశలో ప్రతిపాదించిన యూనిట్లను నెల రోజుల్లో గ్రౌండింగ్ చేయడంతో పాటు వాటిని ఏడాదిలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్పై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తే రైతుకు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 21 చోట్ల భూసేకరణ పూర్తి ఇప్పటికే 21 చోట్ల యూనిట్ల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, తొలి దశలో 11 యూనిట్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. గ్రౌండింగ్ చేయడం కాదని నెల రోజుల్లో అవి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నిమ్మకాయల మార్కెట్ అయిన పొదలకూరు మార్కెట్ యార్డులో యాసిడ్ లైమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో శ్రీధర్రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. -
ఆఫ్రికాలో ఆర్బీకేలు!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల వరకు గ్రామస్థాయిలో రైతన్నలకు సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆఫ్రికా దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆర్బీకేలు అనుసరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేయూతను అందించనుంది. ఇథియోపియా ప్రతినిధి బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పు వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్బీకే వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. 10,778 ఆర్బీకేలు రైతులకు ఇంటి ముంగిటే అన్ని సేవలు అందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, మిశ్రమ దాణా, రొయ్యలు, చేపల మేత.. ఇలా సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కళ్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. వీటి సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘చాంపియన్’ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి. ఇథియోపియాలో సమృద్ధిగా సాగు భూములు ఆఫ్రికాలో అత్యంత పేద దేశమైన ఇథియోపియాకు వ్యవసాయం, పాడి రంగాలే ఆర్ధిక పునాది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 46.3 శాతం ఈ రంగాల నుంచే వస్తున్నప్పటికీ ఏటా 4.6 మిలియన్ల మంది ఆహార కొరతతో సతమతమవుతున్నారు. మొక్కజొన్న, కాఫీ, పప్పులు, తృణధాన్యాల సాగులో ప్రత్యేక స్థానం పొందిన ఇథియోపియాలో సాగు యోగ్యమైన భూములు విస్తారంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తేవడం, రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఉత్పత్తి ఖర్చులను నియంత్రించడం, నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించే లక్ష్యంతో సౌత్సౌత్ కో ఆపరేషన్ భాగస్వామి దేశాల్లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇథియోపియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్బీకేల తరహాలో అక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్బీకేలను సిఫార్సు చేసిన కేంద్రం ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్లో ఆర్బీకేల సేవల గురించి ప్రపంచ బ్యాంకు బృందానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో మరోసారి భేటీ కానున్న ఇథియోపియా–వరల్డ్ బ్యాంక్ –కేంద్ర బృందాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. జూన్ లేదా జూలైలో ఇథియోపియా వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఆర్బీకేల సేవలు, విస్తరణ కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. అనంతరం మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇథియోపియాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తుంది. మన శాస్త్రవేత్తలు, అధికారులు ఇథోయోపియాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతను తీసుకురావడంపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఐరాస –ఎఫ్ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్లో ఇథియోపియా కోసం వీటిని వరల్డ్ బ్యాంక్కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది మన ఆర్బీకేలకు దక్కిన మరో గౌరవం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
ప్రకృతి సేద్యంలో ‘ఆచార్య’
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్)లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న రైతు సాధికార సంస్థ(ఆర్.వై.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించనుంది. ఈ ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని ఆరు వ్యవసాయ పర్యావరణ జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన రీతిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు. ‘అనంత’లో పర్యటన ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయదారుల క్షేత్రాల్లో సాగు తీరుతెన్నులను నిరంతరం పరిశీలిస్తూ ఖర్చు, ఆదాయం, ఇతరత్రా ప్రయోజనాలపై ఆర్.వై.ఎస్.ఎస్.తో కలిసి కచ్చితమైన గణాంకాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నద్ధమవుతోంది. ఈ సన్నాహాల్లో భాగంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి, 6 జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు, పలువురు రైతులు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించి వర్షాధార భూముల్లో అనుసరిస్తున్న వినూత్న ప్రకృతి సేద్య పద్ధతులను పరిశీలించారు. సాధారణంగా 20 ఎం.ఎం. వర్షం కురిసిన తర్వాతే విత్తనం విత్తుకోవటం పరిపాటి. అయితే పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేసి వర్షాలకు ముందే విత్తనం వేయటం (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్–పీఎండీఎస్), 365 రోజులూ పొలంలో బహుళ పంటలు సాగు చేయటం అనే వినూత్న పద్ధతులను అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం గత మూడేళ్లుగా పలువురు రైతులతో అనుసరింపజేస్తోంది. అనంతపురం డీపీఎం లక్ష్మణ్నాయక్ ఈ పద్ధతులను వర్సిటీ బృందానికి వివరించారు. ఇప్పటికే ఈ పద్ధతులను అనుసరిస్తున్న రైతుల వర్షాధార వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి చూపించారు. మండుటెండల్లోనూ రక్షక తడుల సహాయంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఏడాది పొడవునా బహుళ పంటలు పండిస్తుండటాన్ని వర్సిటీ బృందం పరిశీలించింది. విత్తనాలు వేసిన తర్వాత శనగ పొట్టును ఆచ్ఛాదనగా పోస్తున్న దృశ్యం ఎకరానికి రూ.50 వేల ఆదాయం రైతు దంపతులు స్వయంగా పనులు చేస్తారు కాబట్టి వారి కష్టం, రక్షక తడులకు పోనూ ఎకరానికి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ పంటలకన్నా ఉద్యాన పంటలే రైతులకు ఈ పద్ధతుల్లో లాభదాయకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది నుంచి పీఎండీఎస్, 365 రోజులు పంటలు పండించే పద్ధతులను ఆర్.వై.ఎస్.ఎస్. సూచించిన పద్ధతుల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా సాగు చేసి ఫలితాలను క్రోడీకరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో సాగు తీరును, ఖర్చు, పంట దిగుబడులను కూడా పరిశీలించి గణాంకాలను రూపొందిస్తామని తెలిపారు. పీఎండీఎస్ పద్ధతిలో నవధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయ విభాగం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల ద్వారా రైతులకు సూచిస్తోంది. పీఎండీఎస్ అంటే? ప్రధాన పంట సాగుకు ముందు భూమిని సారవంతం చేయటానికి 25 రకాల విత్తనాలను సాగు చేస్తారు. ఈ విత్తనాలకు బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద, ద్రవ జీవామృతంతో లేపనం చేసి గుళికల మాదిరిగా తయారు చేస్తారు. ఈ విత్తన గుళికలను ఎండాకాలంలో పొడి దుక్కిలోనే వర్షానికి ముందే విత్తుతారు. ఈ గుళికలు కొద్దిపాటి వర్షానికే మొలుస్తాయి. పూత దశ (45–50 రోజులకు)లో ఈ పంటను కోసి పొలంలోనే ఆచ్ఛాదనగా వేస్తారు లేదా పశువుల మేతగా ఉపయోగిస్తారు. భూమిని సారవంతం చేయటానికి పండించే ఈ పంటను నవధాన్య పంట అని కూడా అంటారు. ఈ పంటను కోయటానికి ముందే ఖరీఫ్లో ప్రధాన పంటగా సాగు చేయదలచిన పంట విత్తనాలను పై విధంగా గుళికలుగా చేసి విత్తుకొని ఆ తర్వాత ఈ పంటను కోస్తారు. -
ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు తోడుగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడంతోపాటు తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక అవార్డు ‘చాంపియన్’కు నామినేట్ అయిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు)అందిస్తున్న సేవలను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. వన్ స్టాప్ సెంటర్.. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే చేర్చే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. నాలెడ్జ్ హబ్లుగా రూపుదిద్దుకుని నాణ్యమైన ఇన్పుట్స్ అందిస్తున్నాయి. వైఎస్సార్ పొలం బడులతో పాటు తోట, పట్టు, పశు విజ్ఞాన, మత్స్యసాగులో రైతులకు మెళకువలు సూచిస్తున్నాయి. పంట ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, మార్కెటింగ్ కోసం మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే ఛానల్ను తీసుకొచ్చింది. ఇలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ‘వన్ స్టాప్’ సెంటర్ కింద అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ సంస్థల అధ్యయనం.. పలు రాష్ట్రాలు ఆర్బీకేల తరహా వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరుపై అధ్యయనం చేశాయి. నీతి ఆయోగ్, నాబార్డు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బీఐ.. ఇలా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలపై అధ్యయనం చేపట్టాయి. కాల్సెంటర్ సేవలు... టోల్ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఇప్పటి వరకు 4.50 లక్షల మంది రైతులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాల్ సెంటర్లో శాస్త్రవేత్తలు, 70 మందికి పైగా సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామ సేవలందిస్తున్నారు. 1.75 లక్షల సబ్స్క్రిప్షన్తో ఆర్బీకే ఛానల్ అంతర్జాతీయ మన్నన్నలందుకుంటోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 680కు పైగా వీడియోలను ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. తెలంగాణలో కాల్ సెంటర్, రైతు ఛానల్ ఆర్బీకేల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు వేదిక’ల ద్వారా సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది అక్టోబర్లో ఆర్బీకేలను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాటి సేవలు ఎంతో బాగున్నాయని అభినందించారు. ఆర్బీకే వ్యవస్థ వినూత్నమని ప్రశంసించారు. ఈ సేవలను తెలంగాణ రైతులకు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, స్పెషల్ కమిషనర్ కేజే హనుమంత్ నేతృత్వంలోని బృందాలు కూడా పలు దఫాలు ఆర్బీకేలపై అధ్యయనం చేశాయి. ఆ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్బీకేల తరహా సేవలను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సమీకృత రైతు సమాచార కేంద్రం (కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్ తరహాలో రైతు ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల్లో డిజిటల్ లైబ్రరీలతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో శాఖలవారీగా ఆకట్టుకునే రీతిలో మ్యాగజైన్లను తెస్తున్నారు. లక్ష మందికిపైగా చందాదారులతో రైతుభరోసా మ్యాగజైన్ విశేష ఆదరణ æపొందుతోంది. తెలంగాణలో కూడా శాఖలవారీగా మ్యాగజైన్లు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఆర్బీకేలను పీఏసీఎస్లతో అనుసంధానించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆదేశించారు. విజయవాడలోని ఆప్కాబ్ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్పర్సన్లు, సీఈవోలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని సూచించారు. 2021–22లో 40 శాతం వృద్ధి రేటుతో ఆప్కాబ్ మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఆప్కాబ్తో సహా డీసీసీబీలన్నీ లాభాల బాట పట్టాయంటే అందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణమన్నారు. అనంతరం పీఏసీఎస్ అడాప్షన్ పాలసీ, 59వ వార్షిక పరిపాలనా రిపోర్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ పాలసీ, ఉద్యోగుల కోసం రూపొందించిన ‘కాబ్నెట్’ మొబైల్ యాప్ను మంత్రి ఆవిష్కరించారు. -
‘చాంపియన్’.. ఆర్బీకే!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్’’ అవార్డుకు ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గమనార్హం. గ్రామగ్రామాన రైతన్నకు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం.. పేరుకు తగ్గట్టుగానే ప్రతి గ్రామంలో అన్నదాతకు అండదండగా నిలుస్తోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రైతులకు అన్ని రకాల సేవలందిస్తున్న ఓ వినూత్న, విప్లవాత్మక వ్యవస్థ ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన ఆర్బీకేలను మన దేశం తరపున ఐరాస అనుబంధ సంస్థ ఎఫ్ఏవో అందించే ఛాంపియన్ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. రెండేళ్ల క్రితం రూపుదిద్దుకుని.. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పం మేరకు రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 2020 మే 30న శ్రీకారం చుట్టిన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా నాణ్యమైన సాగు ఉత్పాదకాలన్నీ అందించడమే కాకుండా రైతు పండించిన పంటను కూడా నాలెడ్జ్ హబ్లుగా తీర్చిదిద్దిన ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసించాయి. తాజాగా ఎఫ్ఏవో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు నామినేట్ కావడం మరో అరుదైన గౌరవమని అధికారులు పేర్కొంటున్నారు. ‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్ డాలర్లను అందజేస్తారు. పలు దశల్లో వడపోత.. ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డు కోసం ఎఫ్ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ ఆర్బీకేలను రోల్ మోడల్గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్ఏవోకు నామినేట్ చేసింది. అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు. వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. జూన్ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్ఏవో 169వ కౌన్సిల్ సమావేశంలో డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్ అవార్డును ప్రదానం చేస్తారు. అందరికీ ఆదర్శం... ఆర్బీకే వ్యవస్థ వినూత్నం, విప్లవాత్మకం. దేశమంతా అమలు చేయతగ్గ ఓ ప్రయోగం. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా సిఫార్సు చేస్తాం. ఆర్బీకేలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వీటి పనితీరును మరింత మెరుగు పరిచేందుకు లోతైన అధ్యయనం కూడా చేస్తుంది. – డాక్టర్ ఏకే సింగ్, ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దేశమంతా అనుసరించాలి... ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలు జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవి. ఈ– క్రాప్ ద్వారా పంటలవారీగా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను నమోదు చేస్తున్న తీరు బాగుంది. వాస్తవ సాగుదారులకు పంట రుణాలతో పాటు అన్నిరకాల రాయితీలు అందేలా ఈ–క్రాప్ను ఈ కేవైసీతో అనుసంధానించడం మంచి ఆలోచన. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకేల్లో గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. ఈ తరహా ప్రయత్నం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు చూడలేదు. – కయా త్రిపాఠి, సోనాలి సేన్ గుప్తా, ఆర్బీఐ సీజీఎంలు మనకు గర్వ కారణం... అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఏవో అందజేసే ఛాంపియన్ అవార్డుకు మన ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గర్వకారణం. ఎఫ్ఏవో కంట్రీ హెడ్ టోమియో షిచిరీ బృందం గతంలో ఆర్బీకేలను స్వయంగా పరిశీలించి ప్రశంసించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సాంకేతిక సామర్థ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ప్రపంచంలో మరెక్కడా లేని ఆర్బీకేల వ్యవస్థకు ఛాంపియన్ అవార్డు కచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ ఇలాంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు.. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోలు ఓ వినూత్న ఆలోచన. వీటి ద్వారా గ్రామస్థాయిలో రైతు ముంగిటకు నేరుగా నాణ్యమైన సేవలందించడం నిజంగా ప్రశంసనీయం. ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. – ఆర్బీకేల సందర్శన సందర్భంగా టోమియో షిచిరీ, ఎఫ్ఏవో కంట్రీ హెడ్ -
ఆర్బీకేలు.. అద్భుతం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలను సదస్సు దృష్టికి తెచ్చినందుకు సీఎం జగన్ను అభినందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసిందన్నారు. ఆర్బీకేల సేవలు అభినందనీయం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పని తీరును డాక్టర్ రాజీవ్కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని, అవి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. -
ఆరోగ్య సిరులు!
సాక్షి, అమరావతి: అన్నదాత ఇంట చిరుధాన్యాలు సిరులు కురిపించనున్నాయి. ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని చేకూర్చనున్నాయి. అటు రైతులకు రొక్కం ఇటు ప్రజలకు ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ మిల్లెట్’కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. విత్తనాల సరఫరా నుంచి 100 శాతం పంట కొనుగోలు బాధ్యత స్వీకరించడం ద్వారా రైతులకు భరోసా కల్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను సరఫరా చేయడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం.. ప్రభుత్వ హాస్టళ్లలో పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని అందించడం ద్వారా భావితరం ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించింది. లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఇదీ... 10 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం... రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్ మిషన్’కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్ మిల్లెట్స్గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్ మిల్లెట్స్గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర చిరు ధాన్యాలైన సజ్జ, జొన్న, వరిగ, ఊద, సామ, అరిక సాగును కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అనువైన ప్రాంతాల మ్యాపింగ్... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కార్యాచరణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు. అందుకోసం రూ.82.95 కోట్లతో 17,282 ఎకరాల్లో రాగులు, రూ.30.88 కోట్లతో 7,720 ఎకరాల్లో కొర్రలను ‘క్లస్టర్ డెమో’గా గుర్తించి సాగు చేపడతారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు రూ.103.69 కోట్లతో 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందచేస్తారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.8.13 కోట్లతో 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు రూ.15.07 కోట్ల అంచనాతో ఎంపిక చేసిన చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులతో.. చిరుధాన్యాల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్) గుర్తింపునిస్తారు. వీటి సాగు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొండలు, గిరిజన ప్రాంతాలతో పాటు మెట్ట భూములు వీటికి అనుకూలం. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటాయి. కందులు, ఆముదం లాంటి ఇతర పంటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగెకరాల్లో చిరుధాన్యాలను పండించొచ్చు. తక్కువ విద్యుత్, పరిమితంగా ఎరువుల వినియోగం, తక్కువ కాలపరిమితితో సాగు చేయడం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. సజ్జలు, జొన్నలు, రాగులకు కేంద్రం మద్దతు ధర ప్రకటించగా మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కని ప్రతీసారి ప్రభుత్వం జోక్యం చేసుకొని చిరు ధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. చిరుధాన్యాలను సాగు చేస్తే ఎకరాకు రూ.10 వేల లోపే ఖర్చు అవుతుంది. మార్కెట్లో ధర బాగుంటే ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. పైగా వీటి సాగు కాలం చాలా తక్కువ. విత్తు నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వమే.. చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. పంట రుణాలు, కొనుగోలు, పంపిణీ బాధ్యతలన్నీ చేపడుతుంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ‘మిషన్ మిల్లెట్’ ద్వారా రైతులకు పంట రుణాలు అందచేసి ఉచిత పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేస్తారు. మార్కెటింగ్ లింకేజ్ కల్పిస్తారు. పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. తద్వారా చిరుధాన్యాల సాగు లాభదాయకమని, అనుకూలమని రైతులకు భరోసా కల్పిస్తారు. హాస్టళ్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో.. కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, వైద్యశాఖ ద్వారా గర్భిణీలకు పంపిణీ చేస్తారు. పాఠశాలల్లో వారానికోసారి మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్ వంటకాలను అందిస్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మిల్లెట్ ఆహారంతో పాటు వారానికి రెండుసార్లు వాటితో చేసిన బిస్కెట్స్, స్నాక్స్ అందిస్తారు. అన్ని ప్రభుత్వ క్యాంటీన్ల మెనూల్లో వీటితో తయారైన వంటకాలను చేరుస్తారు. మిల్లెట్ల ఆహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫుడ్ మేళాలు నిర్వíహిస్తారు. మిల్లెట్ వంటకాలు, చిట్కాలపై ఆర్బీకేలు, ఆర్బీకే చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రత్యేక ప్యాకేజింగ్, బ్రాండింగ్తో రైతుబజార్లతో పాటు డీమార్ట్, జియో మార్ట్, స్పెన్సర్స్, మోర్ లాంటి సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీసీ, ఎఫ్పీఓలతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇలా చిరుధాన్యాల సాగు అటు రైతులకు ప్రయోజనకరంగా ఇటు సామాన్యులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ.. చిరుధాన్యాల సాగు కార్యాచరణను పక్కాగా పర్యవేక్షించేందుకు ‘స్టేట్ మిల్లెట్ గ్రూప్’ పేరుతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వచ్చే ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా కమిటీ కార్యాచరణను వేగవంతం చేసింది. వరికి ప్రత్యామ్నాయంగా.. రాష్ట్రాన్ని చిరుధాన్యాల హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు మిషన్ మిల్లెట్ కార్యాచరణ రూపొందించాం. రానున్న ఐదేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తాం. వీటిని సాగు చేసే రైతులకు అన్ని రకాలుగా చేయూతనందిస్తాం. వారు పండించిన పంటను ఆర్బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ నిదానంగా అరుగుదల.. ప్రస్తుతం మనం తింటున్న పాలీష్ పట్టిన బియ్యం, ఇతర పప్పులు తిన్న వెంటనే అరిగిపోతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. పాలీష్ చేయని చిరుధాన్యాలు తీసుకుంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్తో పాటు విటమిన్స్ కూడా సమపాళ్లలో అందుతాయి. ఫోర్టిఫైడ్ రైస్తో చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రజలకు చిరుధాన్యాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం. – డాక్టర్ కె.సుధాకర్, అదనపు డీఎంఈ సాగుకు ప్రోత్సాహం ► ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తుంది. ► రైతులకు 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. -
ఆర్బీకేల ద్వారానే పత్తి విత్తన విక్రయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. -
కొత్త జిల్లాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: కొత్త జిల్లాలతో రైతులకు మరింత వేగంగా మెరుగైన సేవలందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు సైతం ఏపీలో అమలు చేస్తున్న సంస్కరణలు, విధానాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో బుధవారం మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిందని చెప్పారు. దీనికి తగినట్లుగా రైతులకు సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. రైతుల ప్రతి అవసరాన్ని.. వారి వద్దకే వచ్చి తీర్చేందుకు ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆర్బీకే వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం అందరికే తెలిసిందేనన్నారు. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ తదితరాల రూపంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు అధిక దిగుబడులు, మంచి ధరలు పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర రైతులకు 1.10 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చామని వివరించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ జానకిరామ్ పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై సర్టిఫికెట్ కోర్సు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’పై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. కోర్సు కరదీపికను విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కన్నబాబు తదితరులు ఆవిష్కరించారు. -
పంటల వారీగా క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. గుర్తించిన క్లస్టర్లలో వచ్చే వానాకాలం సీజన్లో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. పంటలు శాస్త్రీయంగా సాగు కావాలన్నది క్లస్టర్ల నిర్ధారణలోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రైతులకు బాగా ప్రయోజనం కలుగుతుందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ల ప్రకారం ఈసారి వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలో సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయా బీన్తో పాటు పలు పంటలను ఏ జిల్లాలో ఎంత వేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏ పంట ఎక్కువగా సాగవుతుందో దానిపై దృష్టి ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా సాగవుతుందనే దాని ఆధారంగా ఆ పంట క్లస్టర్ను గుర్తించారు. ఒకవేళ రెండు ప్రధాన పంటలుంటే, వాటిల్లో ఏది 50 శాతం పైగా ఉందో దాన్ని ఆ పంట క్లస్టర్ (ఐదు వేల ఎకరాలు)గా నిర్ధారించారు. ఆ క్లస్టర్లో ఆ పంటపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. రైతులకు కూడా ఆ ప్రధాన పంటపైనే అవగాహన కల్పిస్తారు. నిర్దిష్ట పంట క్లస్టర్లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రధాన పంటలను 2,615 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 , కందులకు 71, సోయాబీన్కు 21, మొక్కజొన్నకు 9 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాగర్కర్నూల్లో 142 పంట క్లస్టర్లు.. అత్యధికంగా నాగర్కర్నూల్లో 142 పంట క్లస్టర్లు, నల్లగొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 129, సిద్దిపేటలో 128 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్, ములుగు జిల్లాల్లో అత్యంత తక్కువగా 15 క్లస్టర్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ 5 వేల ఎకరాల్లో ఉండగా, వాటిని పంటల వారీగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పత్తి క్లస్టర్లే ఎక్కువ.. మొక్కజొన్న మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలో గుర్తించిన క్లస్టర్లలో అత్యధికంగా పత్తి క్లస్టర్లే ఉన్నాయి. అయితే జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో పత్తి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. కాగా ఆ జిల్లాల్లో ఏ ఒక్కచోట కూడా అత్యధికంగా పత్తి సాగు కావడం లేదని దీనిని బట్టి తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఏకంగా 110 క్లస్టర్లలో పత్తి సాగు చేస్తారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరి క్లస్టర్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. అక్కడ 98 పత్తి క్లస్టర్లు ఉన్నాయి. ఇక నారాయణపేట సహా ఎనిమిది జిల్లాల్లో కంది క్లస్టర్లు, కామారెడ్డితో పాటు నాలుగు జిల్లాల్లో సోయాబీన్ క్లస్టర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి అయినా.. కేవలం మూడు జిల్లాల్లోనే ఈ పంట క్లస్టర్లు ఉన్నాయి. 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు! రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వానాకాలంలో పత్తి పంటను ఎక్కువగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దాదాపు 80 లక్షల ఎకరాలకుపైగా పత్తి వేసేలా ప్రణాళికలు రచిస్తోంది. పత్తి పంటతో వచ్చే లాభాలు రైతులకు వివరించి ఎక్కువ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గత ఏడాది వానాకాలంలో వేసిన పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా పత్తినే ఎక్కువ వేయాలని రైతులకు సూచించాలని నిర్ణయించింది. ఒకవేళ మార్కెట్లో ధర పడిపోయినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వరి సాగుపై గందరగోళం కొనసాగుతున్నందున రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
'మే'లో తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈసారి మరింత మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. తొలి విడతలో రూ.7,500 సాయం అందిస్తుంది. రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలు సాయం అందిస్తుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ భూ సాగుదారులకు పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయమందించింది. ఇలా గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల సాయం అందించింది. ఈ పథకం కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు కేటాయించింది. గత మూడేళ్లలో లబ్ధి పొందని వారికీ అవకాశం గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాదీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన, అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్లోని ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‘ మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించి పోర్టల్లో వివరాలు నమోదుచేయించాలి. అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఐటీడీఏ పీవోల నుంచి సేకరిస్తున్నారు. వీరి జాబితాలను కూడా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హుల తొలగింపు, అర్హుల నమోదు ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ఏప్రిల్ 30వ తేదీలోగా అర్హులను ఖరారు చేసి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలుదారులకు ‘భరోసా’ కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి కచ్చితంగా సీసీఆర్సీ కలిగి ఉండాలని నిబంధన విధించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల జారీ కోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. వాస్తవ సాగుదారులు విధిగా వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు సీసీఆర్సీ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అర్హతనుబట్టి మే 1నుంచి సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. వీరు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్లో నమోదు చేయాలి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులను గుర్తిస్తారు. వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అందుతుంది. అర్హత పొందని వారికి అవకాశం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని ఈ ఏడాది మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాం. గతేడాది లబ్ధి పొందిన వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. అనర్హులను తొలగించడంతో పాటు గడిచిన మూడేళ్లలో అర్హత పొందని వారు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాం. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తాం. –హెచ్ అరుణ్కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతకు అండగా నిలిచే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత మూడేళ్లుగా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి