RBI Governor
-
ప్రారంభమైన ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తలు అంచనా. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. అక్టోబర్లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెపె్టంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. -
ఆర్థికాభివృద్ధికి ‘ధరల స్థిరత్వమే’ పునాది
ముంబై: ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన అన్నారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సౌత్ దేశాల సెంట్రల్ బ్యాంకుల ఉన్నత స్థాయి విధాన సదస్సులో ఆయన ‘సమతౌల్య ద్రవ్యోల్బణం, వృద్ధి: ద్రవ్య పరపతి విధానానికి మార్గదర్శకత్వం’ అనే అంశంపై ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...⇒ దేశ ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండడం.. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్య సాధనపై ఆర్బీఐ గురి తప్పకుండా చూస్తోంది. ⇒ సుస్థిర ద్రవ్యోల్బణం అటు ప్రజలు, ఇటు ఎకానమీ ప్రయోజనాలకు పరిరక్షిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, పెట్టుబడులకు తగిన వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదపడే అంశమిది. ⇒ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను తట్టుకుని తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతోంది. అయినప్పటికీ, ఇప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అనిశ్చితితో కూడిన ఈ వాతావరణంలో ద్రవ్య, పరపతి విధాన రూపకల్పన.. స్పీడ్ బ్రేకర్లతో కూడిన పొగమంచు మార్గంలో కారును నడపడం లాంటిది. ఇవి డ్రైవర్ సహనం, నైపుణ్యాన్ని పరీక్షించే కీలక సమయం. ⇒ ప్రస్తుతం ఎన్నో సవాళ్లు సెంట్రల్ బ్యాంకులకు ఎదురవుతున్నాయి. విధాన నిర్ణేతలు పలు కీలక పరీక్షలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన కాలపు చరిత్రను వ్రాసినప్పుడు, గత కొన్ని సంవత్సరాల అనుభవాలు, అభ్యాసాలు అందులో భాగంగా ఉంటాయి. భవిష్యత్ సెంట్రల్ బ్యాంకింగ్ పరిణామంలో తాజా పరిణామాలు ఒక మలుపుగా మారుతాయి. ⇒ గ్లోబల్ సౌత్ దేశాలకు స్థిరమైన వృద్ధి, ధరలు, ఆర్థిక స్థిరత్వాలను కొనసాగించడం సవాలు. ⇒ కోరుకున్న ఫలితాలను సాధించేందుకు సెంట్రల్ బ్యాంకులు ఎంతో వివేకంతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు ద్రవ్య, ఆర్థిక, నిర్మాణాత్మక విధానాలను అవలంభించాలి. మరింత దృఢమైన, వాస్తవిక, అతి క్రియాశీల పాలసీ ఫ్రేమ్వర్క్లను రూపొందించాలి. రేటు తగ్గింపు ఉండకపోవచ్చు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2% అటు ఇటుగా 4% వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 % పైకి పెరగకూడదు. అక్టోబర్లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావి స్తున్నారు.ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6% దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. -
సాఫీగానే ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగిపోతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉండడం, నియంత్రణలో కరెంటు ఖాతా లోటు, వస్తు, సేవల ఎగుమతుల వృద్ధిని ప్రస్తావించారు. 682 బిలియన్ డాలర్ల విదేశీ మారకంతో (అక్టోబర్ 31 నాటికి) ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రేట్ల కోతకు ఇచ్చిన పిలుపుపై స్పందించలేదు. డిసెంబర్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కోసం తన వ్యాఖ్యలను రిజర్వ్ చేస్తున్నట్టు దాస్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా అక్టోబర్ పాలసీ సమీక్షలో తటస్థ విధానానికి మారినట్టు దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం మధ్యమధ్యలో పెరిగినప్పటికీ మోస్తరు స్థాయికి దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 4 శాతానికి ప్లస్ 2 లేదా మైనస్ 2 శాతం మించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యం కావడం గమనార్హం. దీర్ఘకాలం పాటు అంతర్జాతీయంగా ఎన్నో సంక్షోభ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపించినట్టు దాస్ చెప్పారు. కాకపోతే అంతర్జాతీయంగా ప్రస్తుతం కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ.. బాండ్ ఈల్డ్స్, కమోడిటీ ధరల పెరుగుదలను ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు చెప్పారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని.. ఇందుకు ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్న స్వీయ అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదే సభలో వ్యక్తం చేశారు. రూపాయికి లక్ష్యం లేదు.. రూపాయి మారకం విషయంలో ఆర్బీఐకి ఎలాంటి లక్ష్యం లేదని, అస్థిరతలను నియంత్రించేందుకు అవసరమైనప్పుడే జోక్యం చేసుకుంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ 2022, 2023లో ద్రవ్య కఠిన విధానాలను చేపట్టిన తరుణంలోనూ రూపాయి స్థిరంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) కార్యాచరణకు సంబంధించి ముసాయిదాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. -
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ స్థానంలో పనిచేయడానికి అర్హులైన వారి నుంచి కేంద్ర ఆర్థికశాఖ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ స్థానంలో ఉన్న మైకేల్ పాత్రా పదవీకాలం జనవరి 14, 2025న ముగుస్తుంది. దాంతో తన స్థానంలో మరో వ్యక్తిని నియమించేలా ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది. ఈ స్థానంలో పనిచేయబోయే ఆర్థికవేత్తలు విభిన్న విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఈ పదవికి ఎంపికైన వ్యక్తి, ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పర్యవేక్షించాలి. కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా ఉండాలి. ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా 25 ఏళ్ల పాటు భారత్ లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పని చేసి ఉండాలి. కొత్తగా పదవి చేపట్టే వారు 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించకూడదు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!ఆర్థికశాఖ వేతన నిబంధనల ప్రకారం డిప్యూటీ గవర్నర్గా ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల వేతనం, ఇతర అలవెన్స్లు ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేవారి 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. -
మరోసారి ‘శక్తి’మంతుడైన ఆర్బీఐ గవర్నర్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంక్ పొందారు. శక్తికాంత దాస్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం.A+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరిలో డెన్మార్క్కి చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సెన్, స్విట్జర్లాండ్కు చెందిన థామస్ జోర్డాన్ ఉన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండవ సంవత్సరం A+ గ్రేడ్ అవార్డును అందుకున్నారని ఆర్బీఐ ‘ఎక్స్’లో పేర్కొంది.యూఎస్లోని వాషింగ్టన్ డీసీలో శక్తికాంత దాస్కు గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును అందించింది. సంక్లిష్ట ఆర్థిక సవాళ్లలో భారతదేశ అపెక్స్ బ్యాంక్ను నడిపించడంలో గవర్నర్ శక్తికాంత దాస్ అద్భుతమైన పనితీరు, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ సంస్థ గుర్తించింది.గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుండి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ ను ఏటా విడుదల చేస్తుంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ సహా దాదాపు 100 దేశాల కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు.Governor @DasShaktikanta received the award for A+ grade in Central Bank Report Cards 2024, for the second consecutive year. Presented by Global Finance at an event held today in Washington DC, USA.… pic.twitter.com/uxCgJqfgCJ— ReserveBankOfIndia (@RBI) October 26, 2024 -
వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్లో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు. సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
RBI Monetary Policy: అదుపులో ద్రవ్యోల్బణ ‘గుర్రం’
ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీ తొలి భేటీ కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్రాజన్ తెలిపారు. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రేటు తగ్గింపునకు తొందరలేదు..!
సింగపూర్: రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా పూ ర్తిగా అదుపులోనికి వచి్చనప్పటి కీ, రేటు తగ్గింపునకు తొందరపడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఈ దిశలో (రేటు తగ్గింపు) నిర్ణయానికి ఇంకా చాలా దూరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024’లో దాస్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. → 2022లో గరిష్ట స్థాయి 7.8% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 4% లక్ష్యం దిగువకు చేరింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు (రేటు తగ్గింపు) తీసుకోడానికి ఇంకా చాలా దూరం ఉంది. మరోవైపు (సరళతర ద్రవ్య విధానాల వైపు) చూసే ప్రయత్నం చేయలేము. → ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం చాలా వరకు కష్ట నష్టాలను తట్టుకుని నిలబడుతున్నప్పటికీ, ద్రవ్యో ల్బణం చివరి మైలు లక్ష్య సాధన సవాలుగానే ఉందని పలుసార్లు నిరూపణ అయ్యింది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలకు దారితీస్తాయి. → ద్రవ్యోల్బణం కావచ్చు... ప్రతిద్రవ్యోల్బణం కావచ్చు. సమస్య తీవ్రమైనది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సడలించడంలో జాగ్రత్త అవసరం. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్వహణలో వివేకం ఉండాలి. మరోవైపు సరఫరా వైపు ప్రభుత్వం చర్యలు చురుకుగా ఉండాలి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నుండి సరళతర పాలసీ సంకేతాల నేపథ్యంలో రేటు తగ్గింపులకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే పాలసీల మార్పు విషయంలో అన్ని విషయాలను విస్తృత స్థాయిలో పరిగణనలోని తీసుకుంటూ, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిని అనుసరించని సెంట్రల్ బ్యాంకులు– తమ దేశీయ ద్రవ్యోల్బణం–వృద్ధి సమతుల్యత అంశాలపై నిఘా ఉంచి తగిన పాలసీ ఎంపిక చేసుకోవాలి. భారత్ వృద్ధిలో వినియోగం, పెట్టుబడుల కీలక పాత్ర భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయన వ్యాఖ్యానిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, ద్రవ్యోలోటు, కరెంటు అకౌంట్ లోటు వంటి అంతర్లీన పటిష్టతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ పురోగతిలో – ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని దాస్ విశ్లేíÙంచారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటకు వచి్చందని, 2021–24 మధ్య సగటు వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతం కంటే అధికంగా నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టతతోపాటు ప్రభుత్వ భారాలు తగ్గుతుండడం సానుకూల పరిణామమన్నారు. కార్పొరేట్ పనితీరు పటిష్టంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్బీఐ నియంత్రించే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు కూడా బలపడ్డాయని గవర్నర్ తెలిపారు. అన్ని స్థాయిల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ప్రపంచ పురోగతికి కీలకమని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీ, దాని తర్వాత ప్రపంచ దేశాలతో నిరంతర సహకార విధానాలను పరిశీలిస్తే, ఆయా అంశాలు ‘ప్రపంచం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే న్యూ ఢిల్లీ దృష్టిని ప్రతిబింబిస్తాయని దాస్ వివరించారు. పరస్పర సహకారంతోనే ప్రపంచ పురోగతి 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుళజాతి అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, ఉత్పాదకత లాభాలను సాధించడం, మధ్య–ఆదాయ దేశాలకు రుణ పరిష్కారం వంటివి భారత్ ప్రాధాన్యతలలో కొన్నని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ అభివృద్ధి మెరుగుదల కోసం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రమాన్ని పునరి్నర్మించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం మానవజాతి కోసం ఇందుకు సంబంధించి ’ఒక భవిష్యత్తు’ కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇటీవలి నెలల్లో సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోందని అన్నారు. ఈక్విటీ, బాండ్ ఈల్డ్ వంటి అంశాల్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉంటున్నాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లలో ధరల అసాధారణ పెరుగుదల ఒక అనూహ్య పరిణామమన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అనుసంధానానికి, ఈ విషయంలో అసమతుల్యత పరిష్కారానికి సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని (జీఎఫ్ఎస్ఎన్) బలోపేతం చేయడంపై కూడా సంస్కరణలు దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.బేస్ మాయతోనే ద్రవ్యోల్బణం తగ్గిందా? 2023 జూలై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ భారీగా (వరుసగా 7.44 శాతం, 6.83 శాతం) ఉన్నందునే 2024 జూలై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) కనబడుతున్నాయని కొందరు నిపుణుల చేస్తున్న వాదనను గవర్నర్ శక్తికాంతదాస్ శక్తికాంతదాస్ తాజా వ్యాఖ్యలు (రేటు తగ్గింపుపై) సమరి్థంచినట్లయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా (మైనస్ లేదా ప్లస్) 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని కూడా గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!
బ్యాంకులు వినూత్న మార్గాల్లో డిపాజిట్లను సేకరించకపోతే ప్రమాదంలో పడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. దీని వల్ల బ్యాలెన్స్షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం(అసెట్ లయబిలిటీ డిఫరెన్స్) పెరుగుతుందన్నారు.ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో దాస్ మాట్లాడుతూ..‘బ్యాంకు కస్టమర్లు డిపాజిట్ల రూపంలో కాకుండా వివిధ మార్గాల్లో డబ్బు దాచుకుంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, భారీగా కార్పొరేట్ రుణాలు జారీ చేయాలన్నా డిపాజిట్లు పెరగాలి. లేదంటే బ్యాలెన్స్ షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం ఎక్కువవుతుంది. అది బ్యాంకులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వినూత్న మార్గాల్లో కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు భారీ బ్రాంచ్ నెట్వర్క్ను కలిగి ఉండాలి. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాదంలో పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!ఇదిలాఉండగా, గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్డేట్ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..⇢ 2024–25లో ఆర్బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం. ⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్లుక్కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది. ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.భారీ మిగులుకు కారణం? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్బీఐ పెంపు మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ను (సీఆర్బీ) ఆర్బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. సీఆర్బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్బీ నిర్వహణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది. -
ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించేందుకు నిరాకరించారు. ఆర్బీఐ ద్వై మాసిక క్రెడిట్ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 5)గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్నికల బాండ్లపై గవర్నర్ను ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని సమాధానమిచ్చారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించింది. కంపెనీలు తమ నికర విలువ కంటే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం అనే అంశం మా పరిధిలోకి రాదు’అని దాస్ చెప్పారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. ఇదీ చదవండి.. బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. రూల్స్లో కీలక మార్పులు -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
RBI MPC Meeting 2024: ఆరో‘సారీ’.. తగ్గించేదేలే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు. వరుసగా ఆరవసారి ‘యథాతథం’.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. పాలసీలో కీలకాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా. ► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా. ► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు. ► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్లైన్ కార్యాచరణను ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించనుంది. ► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్ఎస్)ను కస్టమర్లకు అందించవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్ఎస్ను అందించాల్సి ఉంటుంది. ► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ వృద్ధికి బూస్ట్ రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్ హిల్స్' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు. 2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..! రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఫుల్టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్హెచ్బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
రానున్న నెలల్లో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నరే స్వయంగా తెలిపారు. ఇప్పటికే పెరిగిపోయిన పలు ధరలపై ఆహార ధరల షాక్ల ప్రభావం రెండో రౌండ్లోనూ ఉంటే ఆర్బీఐ కీలక రేట్లను పెంచాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హింట్ ఇచ్చారు. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముఖ్యాంశాలపై ఆయన మాట్లాడుతూ.. "విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచే ప్రమాదాలపై ఆహార ధరల షాక్ల రెండో రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 8 నుంచి 10 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో ఈ సంవత్సరం మూడవసారి కూడా రేట్లను యథాతథంగా ఉంచేందకు ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది" అన్నారు. అయితే పాలసీ రేటు యథాతథ కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. కూరగాయల ధరల స్వల్పకాలిక స్వభావాన్ని బట్టి, ప్రధాన ద్రవ్యోల్బణంపై ధరల మొదటి రౌండ్ ప్రభావాన్ని బట్టి ద్రవ్య విధానం ఉంటుందన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా కొనసాగుతోందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. వీటన్నింటి మధ్య, భారతదేశం స్థిరంగా నిలుస్తూ ప్రపంచంలో కొత్త గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతోందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఇతర కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ ఆహార ధరల పరిణామాల వల్ల గృహాల ద్రవ్యోల్బణ భావనలు ప్రభావితమైనట్లు తమ సర్వేలు సూచిస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత.. -
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మొట్టమొదటిగా స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక చర్యగా అభివర్ణించారు. కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ఓ అంతర్గత కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే అవి చెల్లుబాటు అవుతాయని వివరించారు. మరోవైపు రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో వెల్లడించారు. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని వివరించారు. రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేసినట్లు స్పష్టం చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం తగినంత సమయం ఇచ్చామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. సెప్టెంబర్ 30 వరకూ రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చన్నారు. కాగా డిపాజిట్ మొత్తం రూ.50 వేలకు మించితే పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నగదు డిపాజిట్కు సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. #WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, "Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank...For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU — ANI (@ANI) May 22, 2023 ఇదీ చదవండి: Rs 2,000 Notes: బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా? జువెలరీ షాపులకు వెల్లువెత్తిన ఎంక్వైరీలు! -
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
కోచి: భారత్లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. భారత్ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంతో విజయవంతమైంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన చెల్లింపుల వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అందుకే పలు దేశాలు ఈ సాధనం విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ విజన్ 2025 కింద.. ప్రతి ఒక్కరికీ ఈ–చెల్లింపులు, ఎక్కడైనా, ఎప్పుడైనా (4ఈలు) అనే ముఖ్యమైన థీమ్కు కట్టుబడి ఉన్నాం. మన చెల్లింపుల ఉత్పత్తులను అంతర్జాతీయం చేసేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు మన దేశానికి కొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ఏడాది జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోంది. కనుక అంతర్జాతీయంగా అందరి దృష్టికీ మన విజయవంతమైన స్టోరీని తీసుకెళ్లాలి’’అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం అంతర్జాతీయ వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానత పెరుగుతోందన్నారు. సీమాంతర చెల్లింపులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని.. మన యూపీఐ, రూపే నెట్వర్క్ స్థానం అంతర్జాతీయంగా విస్తరిస్తోందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర దేశాలతో మన చెల్లింపులు, స్వీకరణ లావాదేవీలు మరింత సులభంగా, చౌకగా, వేగంగా జరిగేందుకు వీలు పడుతుందన్నారు. యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ చెల్లింపులు ప్రస్తుతం భూటాన్, సింగపూర్, యూఏఈలో అందుబాటులోకి రావడం గమనార్హం. ఈ విషయంలో మనం ఎంతో సాధించామని, రానున్న రోజుల్లో మరింత చేయాల్సి ఉందని శక్తికాంతదాస్ అన్నారు. వైఫల్యాలపై దృష్టి సారించాలి.. ‘‘విజయవంతం కాని ప్రతీ లావాదేవీ, మోసపూరిత ప్రయత్నాలనేవి కొనసాగితే, ప్రతి ఫిర్యాదును సంతృప్తికరంగా పరిష్కరించకపోతే అది ఆందోళనకరమైన అంశమే అవుతుంది. అప్పుడు మరింత లోతైన విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దేశంలో ఎవరూ కూడా డిజిటల్ చెల్లింపులకు వెలుపల ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శక్తికాంతదాస్ అన్నారు. -
RBI Monetary Policy: రెపో పెంపుతో ఎన్బీఎఫ్సీలకు ఇబ్బందిలేదు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పెంచడం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రెపో రేటును ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం పావుశాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఎన్బీఎఫ్సీపై రేటు పెంపు ప్రభావం విషయంలో ఇక్రా రేటింగ్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► రెపో రేటు పెరుగుదల ఎన్బీఎఫ్సీ వసూళ్ల సామర్థ్యాలను ప్రభావితం చేయదు. రుణగ్రహీతలు ఇచ్చిన పూచీకత్తులు, వారు తిరిగి చెల్లింపులకు ఇచ్చే ప్రాధాన్యతను ఇక్కడ ప్రాతిపతికగా తీసుకోవడం జరిగింది. ► ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు రంగాలపై ఈ ప్రభావాన్ని ప్రస్తుతం నిర్ధారించడం కష్టంగా ఉన్నప్పటికీ, మెజారిటీ రంగాల అవుట్లుక్ పటిష్టంగానే ఉంది. ఇది ఎన్బీఎఫ్సీల రుణ వసూళ్ల సామర్థ్యానికి సానుకూల అంశం. ► అందుతున్న గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు (2022–23, ఏప్రిల్–డిసెంబర్) నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వసూళ్ల సామర్థ్యం 97–105 శాతం శ్రేణిలో ఉంది. ► అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్ల నేపథ్యంలోనూ వస్తున్న ఈ సానుకూల గణాంకాలు ఆర్థిక పటిష్టతను సూచిస్తున్నాయి. ► పటిష్ట రుణ వసూళ్ల సామర్థ్యం కొనసాగడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉంటుంది. సానుకూల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులకు ఇది దారితీస్తుంది. ► మహమ్మారి కారణంగా అంతరాయం కలిగిన రెండు సంవత్సరాల తర్వాత నాన్–బ్యాంకింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ► కోవిడ్ సమయంలో తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్న వ్యక్తులు, వ్యాపారాలకు ప్రస్తుతం తిరిగి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సజావుగా అందుతోంది. పటిష్ట దేశీయ వృద్ధి ధోరణి దీనికి నేపథ్యం. -
ఈ దఫా రేటు పెంపు పావు శాతమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశ కీలక నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. అయితే ఈ దఫా రేటు పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెపె్టంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతానికి ఎగసింది. విశ్లేషకుల అంచనాలు నిజమైతే ఈ రేటు తాజా పాలసీ సమీక్ష సందర్భంగా 6.50 శాతానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం విశ్లేషకుల తాజా అంచనాల నేపథ్యం. -
ప్రస్తుత కీలక సమయంలో రేటు పెంపు ఆపితే కష్టం: దాస్
ముంబై: కఠిన ద్రవ్య విధాన బాటలో పయనిస్తున్న ప్రస్తుత కీలక సమయంలో.. రెపో రేటు పెంపును అపరిపక్వంగా నిలుపుచేయడం తీవ్ర విధానపరమైన లోపం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నెల 5 నుంచి 7 మధ్య జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్ష మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ఈ సమావేశంలో 35 బేసిస్ పాయింట్ల కీలక రెపో రేటు పెంపునకు కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
రాహుల్ గాంధీ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్తాన్లో కొనసాగుతుంది. ఇంతవరకు రాహుల్ యాత్రలో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందులో భాగంగా రాహుల్ భారత్ జోడో యాత్రలో తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో... ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు సాగుతున్న ఈ యాత్రలోకి జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్తో రఘరామ్ రాజన్ ఏదో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్రలో పాల్గొనడంపై బీజీపీ పలు విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన్ను అవకాశవాదిగా బీజేపీ నేత అమిత్ మాల్వియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్లో ముగియునున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్థార్లు జాయిన్ అయ్యారు. వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, స్వయం-స్టైల్ గాడ్ మాన్ నామ్దేవ్ దాస్ త్యాగి (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందారు), నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఉన్నారు. Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF — Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022 (చదవండి: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!.. ప్రతిపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ) -
మారుతున్న ఆర్థిక పరిస్థితులను గమనించాలి
ముంబై: మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బ్యాంకులను కోరారు. అప్పుడే తమ బ్యాలన్స్ షీట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవచ్చన్నారు. కరోనా సంభవించినప్పటి నుంచి కల్లోల సమయంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించినట్టు అంగీకరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటూ, ఎన్నో అంశాల్లో మెరుగుపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఎండీ, సీఈవోలతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. డిపాజిట్లలో వృద్ధి నిదానంగా ఉండడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు, నూతన టెక్నాలజీ సొల్యూషన్లను అందిపుచ్చుకోవడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకుల డిపాజిట్లలో 9.6 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.2 శాతంతో పోలిస్తే తగ్గింది. కానీ, ఇదే కాలంలో రుణాల్లో వృద్ధి 6.5 శాతం నుంచి 17.9 శాతానికి పెరగడం గమనార్హం. -
బ్యాంక్ సీఈఓలతో శక్తికాంత్ భేటీ.. చర్చించే కీలక అంశాలు ఇవేనా!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)లతో బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం కానున్నారు. డిపాజిట్ల మందగమనం, రుణ వృద్ధి పటిష్టత సంబంధిత అంశాలపై ఈ సమావేశం చర్చించనున్నదని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్తో ముగిసిన వార్షిక కాలానికి డిపాజిట్ వృద్ధి రేటు 10.2 శాతం ఉంటే, ప్రస్తుతం 9.6 శాతంగా ఉంది. ఇక రుణవృద్ధి 6.5 శాతం నుంచి 18 శాతానికి చేరింది. రిటైల్, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలో రుణ నాణ్యత, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల వంటి అంశాలపై కూడా బ్యాంకింగ్ సమావేశం చర్చించనున్నదని సమాచారం. -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం
ముంబై: ద్రవ్యోల్బణాన్ని లకి‡్ష్యత స్థాయికి కట్టడి చేయడంలో విఫలమైందంటూ వస్తున్న విమర్శలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తగిన బదులిచ్చారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమన్న ప్రాథమిక లక్ష్యంలో వెనుకబడినట్టు అంగీకరిస్తూనే.. ఆర్బీఐ అనుసరించిన విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. ముంబైలో జరిగిన ఎఫ్ఐబీఏసీ సమావేశంలో భాగంగా శక్తికాంతదాస్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ ఆర్బీఐ ముందుగానే రేట్లను కట్టడి చేసి ఉంటే ఆర్థిక వ్యవస్థ అధోముఖం పాలయ్యేదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలమైన, సుస్థిర, ఆశావాదంగా ప్రపంచం చూస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పుడిక మోస్తరు స్థాయికి దిగొస్తుందన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో విరుద్ధమైన అంశాలను కూడా చూడాల్సి ఉంటుందని, ముందస్తుగానే రేట్లను కట్టడి చేయడం వృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని దాస్ సూచించారు. ‘‘అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులకు భారంగా మారి ఉండేది. భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది’’అని దాస్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సురక్షిత స్థానానికి చేర్చాల్సి ఉందంటూ, అటువంటి తరుణంలో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు అవరోధం కలిగించరాదన్నారు. ‘‘కరోనా సమయంలో ద్రవ్యోల్బణం నిర్ధేశిత లక్ష్యం 2–6 శాతం పరిధిలో కొంచెం పెరిగినా పర్వాలేదనే విధంగా ఆర్బీఐ సులభతర మానిటరీ పాలసీ చర్యలను అనుసరించింది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇలా చేసింది. దీంతో 2021–22, 2022–23లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది’’అని వివరించారు. భారత ఆర్థిక వృద్ధి రికవరీ విస్తత స్థాయిలో ఉందంటూ.. సకాలంలో, సరైన లక్షి్యత ద్రవ్య, మానిటరీ, నియంత్రణపరమైన విధానాల ఫలితమే ఇదన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఆర్బీఐ ఎంపీసీ గురువారం (ఈ నెల 3న) నాటి సమావేశం ఎజెండాను శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో ఎందుకు విఫలమైందనే, కారణాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. వరుసగా తొమ్మిది నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగడానికి దారితీసిన కారణాలను వివరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ రుణాల ప్రయోగాత్మక డిజిటైజేషన్పై దాస్ స్పందిస్తూ.. చిన్న వ్యాపార రుణాలకు సైతం 2023 నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ‘అర్జునుడు–చేప కన్ను’ ప్రస్తావన... ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిపైనే దృష్టినంతా కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ భావిస్తోందని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. మహాభారత ఇతిహాసంలో పైన తిరిగే చేప కంటిని గురి చూసి కొట్టడంపై అర్జునుడు దృష్టి సారించిన దృష్టాంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం. ‘‘అర్జునుడి పరాక్రమానికి ఎవరూ సాటిలేరు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే మా నిరంతర ప్రయత్నం’’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు టోకు (హోల్సేల్) మాదిరే రిటైల్ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్సేల్ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు మంగళవారమే మొదలు కావడం గమనార్హం. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి)ని విడుదల చేయడం దేశ కరెన్సీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని దాస్ పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. రూపాయి విలువ క్షీణతను భావోద్వేగాల కోణం నుంచి బయటకి వచ్చి చూడాలన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి రూపాయి క్రమపద్ధతిలోనే చలించిందని చెప్పారు. తద్వారా దీనిపైపై విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉన్నట్టు చెప్పారు. యూఎస్ డాలర్ మినహా మిగిలిన కరెన్సీలతో బలపడినట్టు గుర్తు చేశారు. -
కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
జోధ్పూర్: కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు వస్తున్నందున దీనికి మూల కారణాలను నియంత్రణ సంస్థలు, అంబుడ్స్మెన్ గుర్తించి, అందుకు వ్యవస్థాపరమైన పరిష్కారం చూపాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ అంబుడ్స్మెన్ వార్షిక సమావేశం జోధ్పూర్లో జరిగింది. దీనిని ఉద్దేశించి శక్తికాంతదాస్ మాట్లాడారు. కస్టమర్ల ఫిర్యాదులకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఫైనాన్షియల్ వ్యవస్థ ముఖచిత్రం మారుతోంది. కానీ, అంతర్గత సూత్రాలైన కస్టమర్లకు మెరుగైన సేవలు, కస్టమర్లకు రక్షణ, పారదర్శకత, సరైన ధర, నిజాయితీ వ్యవహారాలు, బాధ్యాయుతమైన వ్యాపార నడవడిక, కన్జ్యూమర్ డేటా, గోప్యత పరిరక్షణ అన్నవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వీటికితోడు మనమంతా కలసి కస్టమర్లకు వైవిధ్యాన్ని చూపాలి’’అని చెప్పారు. కస్టమర్ల అనుభవాన్ని మరింత మెరుగు పరిచేందుకు అంబుడ్స్మెన్ తగినన్ని మార్పులు తీసుకురాగలదన్నారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
3న ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన ద్రవ్యోల్బణం సవాళ్లపై ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక రూపకల్పనపైనే నవంబర్ 3న జరిగిన ఆర్బీఐ ఎంపీసీ చర్చించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సెక్షన్ 45జెడ్ ఎన్ కింద... సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరగనుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తన చర్యల గురించి ఆర్బీఐ కేంద్రానికి వివరణ ఇవ్వడం 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. ఆర్బీఐ తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనున్న నేపథ్యంలో వచ్చేనెల 3న జరిగే ‘ద్రవ్యోల్బణంపై’ కీలక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
తిరోగమన బాటలో ఫారెక్స్ నిల్వలు.. భారీగా తగ్గుదల
ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు తిరోగమన బాటన కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 897 మిలియన్ డాలర్లు తగ్గి, 572.978 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల, రూపాయి విలువ స్థిరీకరణకు చర్యలు వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం.. వేర్వేరు విభాగాల్లో... ► డాలర్ రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) సమీక్షా వారంలో 1.611 బిలియన్ డాలర్లు తగ్గి 509.646 బిలియన్ డాలర్లకు చేరాయి. ► సిడి నిల్వల విలువ 671 మిలియన్ డాలర్లు పెరిగి 40.313 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 46 మిలియన్ డాలర్లు పెరిగి 18.031 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థాయి 3 మిలియన్ డాలర్లు తగ్గి 4.987 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్బీఐ గవర్నర్ భరోసా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దిగుమతులు, రుణ సేవల అవసరాలు, పోర్ట్ఫోలియో అవుట్ఫ్లోల కారణంగా డిమాండ్కు సంబంధించి ఫారెక్స్ మార్కెట్లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్ బ్యాంకు మార్కెట్కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!
ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది. కోవిడ్–19 కన్నా పావుశాతం అధికం... తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. ► రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5%కి ఇది దిగివస్తుంది. ► భారత్ వద్ద ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది. ► ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే, అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ కరెన్సీ పటిష్టంగానే ఉంది. ► భారత్లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్ఆర్ఐలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది. ► 2021 ఏప్రిల్–జూన్ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్డీఐల పరిమాణం 11.6 బిలియన్ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది. డిపాజిట్లను సమీకరించుకోండి! రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఐసీఐసీఐ, పీఎన్బీ వడ్డింపు.. న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటును 9.10%కి పెంచింది. పీఎన్బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది. -
పెట్రోలు,డీజిల్పై ఎక్సైజ్ సుంకం..తగ్గింపుకు ఒప్పుకోని కేంద్రం! ఆర్బీఐ ప్రయత్నం విఫలం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం కట్టడికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రెపో రేటును 0.4 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని అరశాతం పెంచిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం, పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇతర సరఫరా వైపు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆర్బీఐ ప్రయత్నించి విఫలమైంది. ఆయా అంశాలే ఆర్బీఐ అర్థాంతర, ఆశ్చర్యకరమైన రేటు పెంపును ప్రేరేపించాయి. ఆర్బీఐ అనూహ్యరీతిలో బుధవారం బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. దీనితోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం రెక్కలను తొలగించాలన్నది ఈ ఇన్స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. ద్రవ్యోల్బణంపై నిర్దేశాలు కీలకం... ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు ఇటీవలి కాలంలో మరింత స్పష్టమవుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్సహా కమోడిటీ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. దీనితో పాటు వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు (ఒక శాతానికి) వంటి పలు అంశాలు దేశంలో వడ్డీరేట్లు పెంచాల్సిన పరిస్థితిని సృష్టించాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కీలకం. ఆయా పరిణామాల అన్నింటి నేపథ్యంలో ఆర్బీఐ తాజా అనూహ్య నిర్ణయం తీసుకుంది. జూన్ తొలి వారంలో జరిగే పాలసీ సమావేశాల్లో రెపోను మరో 0.5% పెంచవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. దేశీయ పరిస్థితులు.. అంతర్జాతీయ పరిస్థితులు దేశీయంగా ద్రవ్యోల్బణానికి రెక్కలు తీసుకువచ్చే పరిస్థితి నెలకొంది. ‘‘దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి లక్ష్యంతోనే తాజా రెపో రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థిరంగా కొనసాగే అధిక ద్రవ్యోల్బణం పొదుపు, పెట్టుబడి, పోటీతత్వం ఉత్పాదక వృద్ధిని అనివార్యంగా దెబ్బతీస్తుంది. ఇది పేద జనాభా వర్గాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ఎకానమీలో తీవ్ర ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది’’ అని పాలసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించడం గమనార్హం. మార్చి 22 నుండి ప్రారంభమైన 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలలో లీటరుకు రికార్డు స్థాయిలో రూ.10 పెరిగింది. ఇది ఇప్పటికే ఉన్న అధిక వస్తువుల ధరలకు మరింత ఆజ్యం పోసింది. ఇక తప్పదన్న పరిస్థితుల్లోనే ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి చర్యల కోసం ఆర్బీఐ ప్రభుత్వాన్ని ‘‘వేడుకుంది, ఉద్బోధించింది‘, కానీ ప్రతిస్పందనను పొందలేకపోయిందని ఆ వర్గాలు తెలిపాయి. భారీ సుంకాలను విధిస్తున్న రాష్ట్రాలనూ ఈ విషయంలో దూకుడు తగ్గించమని ఆర్బీఐ కోరిందని, ఇక్కడి నుంచి కూడా తగిన స్పందన రాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఇక ఆర్బీఐ ద్రవ్యోల్బణం కట్టడికి సంబంధించి తన పనిలో తాను ఒంటరిగా నడిచిందని వివరించింది. ఎన్నికల తర్వాత ఒత్తిడి... ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధనంపై ధరల పెంపు ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు యథాతథ రేటు కొనసాగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గతేడాది కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ను తగ్గించాయి, అయితే చాలా ఇతర రాష్ట్రాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల రాష్ట్రాలకు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ఉద్బోధించారు. అయినా పెద్దగా ఫలితం లభించలేదు. దీనితో వ్యవస్థలో వడ్డీరేట్ల పెంపు, తద్వారా డిమాండ్ కట్టడితో ద్రవ్యోల్బణం కట్టడి చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రూ.14 లక్షల కోట్ల సమీకరణ ప్రణాళికలు... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 14 లక్షల కోట్లకుపైగా స్థూల ప్రభుత్వ రుణ సమీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్న దృఢ నిశ్చయంలో ఆర్బీఐ ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇక్కడ రుణ సమీకరణ కార్యక్రమాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ‘కేవలం నిధుల’ పరిమాణంలో చూడరాదని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) రుణ సమీకరణ 6.8 శాతంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం 5 శాతానికి చేరిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆ వర్గాలు సూచించాయి. 2022–23 ఆర్థిక సంవత్స రంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. స్థూల రుణాలు ఆర్థిక సంవత్సరంలో రూ.14,95,000 కోట్లుని బడ్జెట్ అంచనా. స్థూల రుణాల్లో గత రుణాల రీ పేమెంట్లు కలిసి ఉంటాయి. డేటెడ్ సెక్యూరిటీలు (బాండ్లు), ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రభుత్వ తన ద్రవ్యలోటుకు నిధులను సమకూర్చుకుంటుంది. బ్యాంకింగ్ రుణ వృద్ధికి బ్రేకులు: ఇండియా రేటింగ్స్ ఆర్బీఐ అనూహ్య నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ, రిటైల్ విభాగాల నుంచి రుణ వృద్ధి ఉన్నప్పటికీ, పరిశ్రమ, సేవల విభాగాల నుంచి డిమాండ్ ఉంటుందని వివరించింది. నివేదిక ప్రకారం, మధ్యకాలికంగా చూస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా చైన్లో అంతరాయాలు, బలహీనమైన వినియోగ డిమాండ్ రుణ వృద్ధి డిమాండ్ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ రేట్ల పెంపు నిర్ణయం రుణాలను వ్యయ భరితం చేయనుంది. స్థూల ఆర్థిక రంగంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నందున, మూలధన వ్యయ ప్రణాళికల అమల్లో వేచిచూసే ధోరణిని అవలంభిస్తామని తాను రేటింగ్ ఇస్తున్న పలు కంపెనీలు పేర్కొన్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2022 ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన కాలానికి రుణ వృద్ధి అంతకుముందు ఇదే కాలంతో పోల్చితే 5.3 శాతం నుంచి 11.2 శాతం పెరిగిందని, అయితే తాజా పెంపు రుణ వృద్ధి ఉత్సాహాన్ని నీరుగార్చే వీలుందని వివరించింది. 2022– 23లో 10 శాతం రుణ వృద్ధిని తన ఫిబ్రవరి నివేదికలో ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. అయితే ఈ అంచనాల్లో తక్షణం సంస్థ ఎటువంటి సవరణా చేయలేదు. -
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు ► భారత్ ఎకానమీపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ► ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. ► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. ► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్స్కు వెసులుబాటు ► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. -
ఎనిమిదోసారీ యథాతథమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే– రెపో. ప్రస్తుతం 4 శాతంగా ఇది కొనసాగుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పా యింట్లు తగ్గించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజు ల సమావేశం అనంతరం శుక్రవారం ఎకానమీకి సంబంధించి నిర్ణయాల ప్రకటన వెలువడింది. కట్టడిలోకి ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. వృద్ధి రేటుపై ధీమా... ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శాతం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. ఎకానమీ సంపూర్ణ ప్రయోజనాలు కీలకం తాజా పాలసీ సమీక్ష నేపథ్యంలో పొదుపు పథకాలు, బ్యాంకుల డిపాజిట్లపై ఆధారపడి జీవించే వారికి కొత్తగా వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ ఉండదు. వారికి యథాతథంగా సాధారణ వడ్డీరేట్లు మాత్రమే అందుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే మాత్రం వారు ప్రతికూల రిటర్న్స్ అందుకునే పరిస్థితి ఉంటుంది. ‘‘కుప్పకూలిపోతున్న లేదా క్షీణిస్తున్న మొత్తం ఆర్థిక వ్యవస్థకు మీరు మద్దతు ఇవ్వలేకపోతే, సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఇతర ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది’’ అని ఇదే విషయంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబి శంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పొదుపు పథకాలు ఇంకా నెగటివ్ రిటర్న్స్ ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయన విశ్లేíÙంచారు. ఈ సందర్భంగా ఆయన స్మాల్ సేవింగ్స్ స్కీమ్లో ఏడాది డిపాజిట్ పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ డిపాజిట్ రేటు మార్గదర్శకాల ద్వారా వచి్చన వాస్తవ రేటు కంటే కనీసం 170–180 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు. పెట్రో పన్నులపై ఆందోళన పెట్రో ఉత్పత్తులపై పన్నుల తీవ్రత పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. బహిరంగంగా రెండవసారి ఈ అంశంపై మాట్లాడిన గవర్నర్, పప్పులు, వంటనూనెల వంటి నిత్యావసరాల సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రాలకు చేయూత మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ), ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి ఈ సమస్యతో పాటు అధిక రుణాల ఫలితంగా, రాష్ట్రాలు తమ బాండ్ హోల్డర్లకు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి – ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రేటు దాదాపు 7 శాతానికి చేరువైంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు డబ్ల్యూఎంఏ విండోను వినియోగించుకున్నాయి. జూలై నాటికి ఈ సౌలభ్యం ద్వారా నిధుల రుణ పరిమాణం 35 శాతం పెరిగి రూ .92,000 కోట్లకు చేరింది. ఉద్దీపనలను వెనక్కు... సంకేతాలు కోవిడ్–19 నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనలకు క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాలసీ సమీక్ష సూచించింది. ప్రస్తుతం వ్యవస్థలో రూ .9 లక్షల కోట్లకు పైగా ఉన్న అదనపు ద్రవ్యతను ‘క్రమంగా‘ సర్దుబాట్లు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ సుముఖంగా ఉందని గవర్నర్ సూచించారు. మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లు) కొనుగోలుకు సంబంధించిన జీఎస్ఏపీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ ప్రొగ్రామ్)ను నిలుపుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత లేకుండా చూడ్డామే దీని ఉద్దేశ్యమని సూచించారు. గడచిన రెండు త్రైమాసికాల్లో జీఎస్ఏపీ కింద ఆర్బీఐ రూ.2.2 లక్షల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కాగా, ఇదే సమయంలో ఎకానమీ రికవరీకి తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో ఎప్పడూ కొనసాగేలా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బడా టెక్ ‘ఫైనాన్షియల్స్’పై కన్ను గూగుల్, అమెజాన్ ద్వారా డిపాజిట్ల ఆమోదం నిర్దేశిత చట్టాలు, నిబంధనల ప్రకారం ఉందో లేదో ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలో బడా టెక్ సంస్థల కార్యకలాపాలపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే (ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్) , అమెజాన్ రెండూ తమ మొబైల్ ఫోన్ యాప్ల ద్వారా దేశంలో డిపాజిట్లను స్వీకరించడానికి రుణదాతలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షలకు ఐఎంపీఎస్.. ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తోంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు... ► బ్యాంకులు తమ మిగులు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినప్పుడు లభించే రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్ కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది. ► ద్రవ్య లభ్యత, సర్దుబాటు లక్ష్యాలుగా అక్టోబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 3 మధ్య పక్షం రోజుల ప్రాతిపదికన ఐదు 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) వేలాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ► ఏటీఎంల్లో డబ్బు అందుబాటులో లేని సంద ర్భంల్లో ఆయా బ్యాంకులపై జరిమానా విధింపునకు ఉద్దేశించిన పథకాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది. బ్యాంకర్ల నుంచి అందిన సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఈ జరిమానా విధానాన్ని ప్రకటిస్తే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ► ఫైనాన్షియల్ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది. ► బ్యాంకుల తరహాలోనే బడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎప్సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్మన్ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ► దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్బాండ్ ఇండిసీస్లో చేరే విషయంలో భారత్ ముందడులు వేస్తోంది. ఆర్బీఐ, కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది. ఆఫ్లైన్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఒక ఫ్రేమ్వర్క్ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రిటైల్ డిజిటల్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవడం ఈ ఫ్రేమ్వర్క్ ప్రధాన లక్ష్యం. చెల్లింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా అంగీకృత మౌలిక వ్యవస్థ బలోపేతానికి జియో ట్యాగింగ్ ఫ్రేమ్వర్క్ విడుదల కానుంది. వృద్ధి సంకేతాలు పటిష్టమవుతున్నాయ్ వృద్ధి కిరణాలు విస్తరిస్తుండడం, ఇందుకు సంకేతాలు పటిష్టమవుతుండడాన్ని ఆర్బీఐ గమనిస్తోంది. రైల్వే రవాణా, పోర్ట్ కార్యకలాపాలు, సిమెంట్ ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, ఈ– వే బిల్లుల మెరుగుదల, జీఎస్టీ, టోల్ భారీ వసూళ్ల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దీర్ఘకాలం వృద్ధి పటిష్ట ధోరణి కొనసాగడానికి సరళతర ఆర్థిక విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఐఎంపీఎస్ చెల్లింపులు.. గుడ్న్యూస్ చెప్పిన ఆర్బీఐ
RBI Monetary Policy Updates: డిజిటల్ చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు రెండురోజులపాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, శుక్రవారం మీడియాకు వెల్లడించారు. యూపీఐలాగే ఐఎంపీఎస్ కూడా ఇన్స్టంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచ్లు, ఏటీఎం, ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో ఉపయోగించుకోవచ్చు. 2014 జనవరిలో ఐఎంపీఎస్ చెల్లింపు పరిమితిని 2 లక్షలుగా నిర్ణయించింది ఆర్బీఐ. ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో మాత్రం ఇది 5 వేలుగానే కొనసాగుతోంది. ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రామాణికంగా మారిన తరుణంలో.. ఊరటనిస్తూ ఐదు లక్షలకు ఆర్బీఐ పెంచడం విశేషం. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వరుసగా ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారాయన. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి, ఎస్ఎఫ్ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. ఇక యూజర్లకు ఊరటనిస్తూ ఐఎంపీఎస్ ట్రాన్జాక్షన్ లిమిట్ను 2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను Immediate Payment Service (IMPS) యాప్స్ ముందు ఉంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో పాటు ఎన్బీఎఫ్సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్మన్ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆఫ్లైన్పేమెంట్ మెకానిజంను త్వరలో తీసుకురాబోతున్నట్లు, దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైపే మొగ్గుచూపింది. ఇక కరోనాతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడానికి ఆర్బీఐ రెపోరేటును 2020 మేలో 4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎంపీసీలోని కీలకాంశాలు ►చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ►ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ►పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ►పండగ సీజన్లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తోంది. ►కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. ►జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ► క్యాపిటల్ గూడ్స్కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది. ►ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. ►జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ►అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు. ►రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది. ►పేమెంట్ యాక్సెప్టెన్సీ కోసం పీవోఎస్ point of sale (PoS), క్యూఆర్ కోడ్ల తరహాలోనే జియో ట్యాగింగ్ టెక్నాలజీ తీసుకురావాలనే ఆలోచన ►2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది ఆర్బీఐ. చదవండి: మరింత సులభతరం కానున్న లావాదేవీలు -
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు. -
ధరల భయం.. వడ్డీ రేట్లు యథాతథం!
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి వృద్ధికి మద్దతు పలికింది. ద్రవ్యోల్బణం సమీప కాలంలో ఎగువ స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తూ.. అదే సమయంలో కీలకమైన రెపో రేటు (4 శాతం), రివర్స్ రెపో రేటు (3.35 శాతం)ను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాల్లోనూ మార్పులు చేయలేదు. వృద్ధికి మద్దతుగా సర్దుబాటు ధోరణినే కొనసాగించడం శుక్రవారం ముగిసిన మూడో ద్వైమాసిక (2021–22లో) ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలుగా చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు, వృద్ధి స్థిరపడే వరకు సర్దుబాటు విధానం కొనసాగింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఐదుగురు ఆమోదం తెలిపినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. గతంలో ఏకగ్రీవ ఆమోదం రాగా.. ఈ విడత ఒక్కరు దీంతో విభేదించడం గమనార్హం. సమీప కాలంలో రేట్లను పెంచే అవకాశం లేదని దీంతో తెలుస్తోంది. ఆర్బీఐ కీలక రేట్లను యథావిధిగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో విడత. చివరిగా 2020 మే నెలలో రేట్లను సవరించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అప్పుడు కీలక రేట్లను అత్యంత కనిష్టాలకు తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి నుంచి 2020 మే నాటికి మొత్తం మీద 2.5 శాతం మేర రేట్లను తగ్గించింది. సదా సన్నద్ధంగానే ఉంటాం.. కరోనా మరో విడత విరుచుకుపడే ప్రమాదంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అప్రమత్తత ప్రకటించారు. ‘‘ఆయుధాలను విడిచి పెట్టకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో విడత పట్ల అప్రమత్తంగా ఉంటాం’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైందంటూ.. ఈ కీలక సమయంలో ద్రవ్యపరమైన, విధానపరమైన, రంగాల వారీ మద్దతు కొనసాగాల్సిన అవసరాన్ని దాస్ ప్రస్తావించారు. కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైందంటూ.. పెట్టుబడులు, డిమాండ్ కోలుకోవడాన్ని కీలక గణాంకాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ 2021–22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 9.5 శాతంగానే కొనసాగించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 21.4 శాతం, జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 7.3 శాతం, ఆ తర్వాతి త్రైమాసికంలో 6.3 శాతం, చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) 6.1 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధి నమోదవుతుందన్న అభిప్రాయాన్ని తెలియజేసింది. వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి, అటు గృహ కొనుగోలు దారులకు మేలు చేసినట్టు దాస్ పేర్కొన్నారు. ఎంపీసీ ఇతర నిర్ణయాలు ► కరోనా కారణంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రంగానికి ఊరట లభించింది. రుణ పునరుద్ధరణ పథకానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ నిర్దేశించిన పలు నిబంధనల అమలుకు గడువును మరో ఆరు నెలలు అంటే 2022 అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ► సెకండరీ మార్కెట్లో రూ.50,000 కోట్లతో ప్ర భుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ 2.0) ఆగస్ట్ నెలలో రెండు విడతలుగా చేపట్టనున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ లిక్విడిటీ ఉండేలా చూడడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. ► ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నందున.. ఆన్ ట్యాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్టీఆర్వో) పథకాన్ని మూడు నెలల పాటు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. ► వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) ఆక్షన్లను రూ.2.5 లక్షల కోట్లతో ఆగస్ట్ 13న, రూ.3 లక్షల కోట్లతో ఆగస్ట్ 27న, రూ.3.5 లక్ష ల కోట్లతో సెప్టెంబర్ 9న, రూ.4 లక్షల కోట్లతో సెప్టెంబర్ 24న చేపట్టనుంది. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీని సర్దుబాటు చేయనుంది. గరిష్టాల్లోనే ద్రవ్యోల్బణం సరఫరా వైపు ఉన్న సమస్యలు, చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం, ముడి సరుకుల వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. డిజిటల్ రూపీ డిజిటల్ రూపాయిని త్వరలో చూసే అవకాశా లున్నాయి. డిజిటల్ కరెన్సీల నిర్వహణ నమూనాను ఈ ఏడాది చివరి నాటికి ప్రకటించే అవకాశాలున్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ తెలిపారు. పరిధి, టెక్నాలజీ, పంపిణీ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకు ని ఫియట్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే సాధ్యా సాధ్యాలను ఆర్బీఐ అంతర్గతంగా మదింపు వేస్తున్నట్టు చెప్పారు. -
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ?!
ముంబై:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు అంటే 6వ తేదీ వరకూ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మూడవ వేవ్ భయాలు, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణికి మించి నమెదుకావడం వంటి అంశాల నేపథ్యంలో తాజా సమావేశం జరగనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4%) కమిటీ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం ఉండడం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి కారణం. రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. -
ఆర్బీఐ వృద్ధి మంత్రం!
ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సర్దుబాటు విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతమిచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు గాను గతేడాది 1.15 శాతం మేర ఆర్బీఐ రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ బాండ్లను రూ.లక్ష కోట్ల మేర ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఎంపీసీ ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రుణ వ్యయాలను తగ్గించడంతోపాటు, బాండ్ ఈల్డ్స్ను అదుపులో ఉంచేలా వ్యవహరించనుంది. వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత వృద్ధికి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ఎంపీసీ సమావేశం తర్వాత నిర్ణయాలను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని పరుగు అందుకునే వరకు ఆర్బీఐ అన్ని విధాలుగా (కనిష్ట వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత చర్యలు) మద్దతుగా నిలుస్తుందన్నారు. కనిష్ట రివర్స్ రెపో విధానం నుంచి ఆర్బీఐ ఎప్పుడు బయటకు వస్తుందన్న ప్రశ్నకు.. కాలమే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను దృష్టిలో పెట్టుకుని.. తటస్థ చర్యలను తీసుకోవడంపై అవగాహన కలిగి ఉన్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. వృద్ధి 10.5 శాతం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘క్యూ1లో (ఏప్రిల్–జూన్) 26.2 శాతం, క్యూ2లో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం, క్యూ3లో (అక్టోబర్–డిసెంబర్) 5.4 శాతం, క్యూ4లో (2022 జనవరి–మార్చి) 6.2 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఫిబ్రవరి నుంచి కమోడిటీ ధరలు పెరగడం, ఆర్థిక మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వృద్ధి రేటును కిందకు తీసుకెళ్లే రిస్క్లుగా దాస్ పేర్కొన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, మరిన్ని వర్గాలకు విస్తరించడం, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులను పెంచే చర్యలు వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చెప్పారు. 2021–22 బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడి చర్యలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ), సామర్థ్య విస్తరణ అన్నవి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడతాయని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. అదే సమయంలో నైరుతి రుతుపవనాల పురోగతిపైనా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. అవసరమైనంత కాలం అండగా... వృద్ధి రేటు నిలకడగా, స్థిరంగా కొనసాగేందుకు అవసరమైనంత కాలం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోయేంత వరకు సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రానున్న రోజుల్లోనూ ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉంటుంది. ఇటీవల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరగడం భవిష్యత్తు వృద్ధి అంచనాలపై అనిశ్చితికి దారితీసింది. ముఖ్యంగా స్థానిక, ప్రాంతీయ లాక్డౌన్లు ఇటీవలే మెరుగుపడిన డిమాండ్ పరిస్థితులను దెబ్బతీస్తాయా? సాధారణ పరిస్థితులు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. అయితే, ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పుడు మరింత మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా పడకుండా చూసేందుకు ద్రవ్య, పరపతి యంత్రాంగాలు సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణికి తగినట్టు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పుష్కలంగా ఉండేలా ఆర్బీఐ చూస్తుంది. అంటే ఫైనాన్షియల్ మార్కెట్, ఉత్పత్తి రంగాల అవసరాలకు మించి నగదు లభ్యత ఉండేలా చూడడం. ఆర్థిక స్థిరత్వం కోసం చేయాల్సినదంతా ఆర్బీఐ చేస్తుంది. అంతర్జాతీయ ప్రభావాలు, అస్థిరతలను దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లు తట్టుకునేలా తగిన చర్యలతో రక్షణ కల్పిస్తాం. నేటి పరిస్థితుల్లో మారటోరియం (రుణ చెల్లింపులపై కొంత కాలం విరామం) అవసరం లేదు. ప్రైవేటు రంగం తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన సన్నద్ధతతో ఉంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు హామీతో కూడిన, నిరంతర ద్రవ్య లభ్యతకు కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటన స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సవాళ్లను అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శనం చూపించింది. వృద్ధిపై స్పష్టమైన ముద్ర వేసింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతోపాటు ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించింది. పుష్కలంగా ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం.. ఎన్హెచ్బీకి అదనంగా రూ.10,000 కోట్లు సమకూర్చడం అన్నది.. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సాయపడేవి. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ రూ.లక్ష కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలు సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్లు) కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ) ఆర్బీఐ ప్రకటించింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. బాండ్ఈల్డ్స్ గమనా న్ని గాడిలో పెట్టేందుకు (బాండ్ ఈల్డ్స్లో క్రమబద్ధత) ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మానిటరీ పాలసీకి అనుగుణంగా బ్యాలన్స్ షీటును కొసాగించేందుకు ఆర్బీఐ మొదటిసారి నిర్ణయించింది. ప్రతీ త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల మేర (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు) మార్కెట్కు అందించనున్నాం’ అని మేఖేల్ డి పాత్ర తెలిపారు. బాండ్ల కొనుగోలు అన్నది ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన విధానం మాదిరేనన్నారు. మొదటగా ఏప్రిల్ 15న రూ. 25,000 కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. రాష్ట్రాలకు నిధుల సాయం కొనసాగింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యంతర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏఎస్) కింద రూ.51,560 కోట్ల సాయాన్ని పొందే గడువును వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో విడత ప్రభావాలను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్రాలకు ఈ మేరకు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఆదాయాలు, వ్యయాల మధ్య అంతరాలను గట్టేందుకు గాను రాష్ట్రాలకు అందించే తాత్కాలిక రుణ సదుపాయమే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెన్స్. అలాగే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే అగ్రిగేట్ డబ్ల్యూఎంఏ సాయం రూ.32,225 కోట్లుగా ఉండగా.. దీన్ని 46% పెంపుతో రూ.47,010 కోట్లు చేస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. నాబార్డ్, సిడ్బి, ఎన్హెచ్బీలకు రూ.50వేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలకు రుణ వితరణ సక్రమంగా అందేలా చూసేందుకు జాతీయ ఆర్థిక సంస్థలకు అదనంగా రూ.50వేల కోట్లను ఆర్బీఐ అందించనుంది. నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.25,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్హెచ్బీ)కు రూ.10,000 కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కు రూ.15,000 కోట్లు లభిస్తాయి. వ్యాలెట్ల మధ్య నగదు బదిలీలు చెల్లింపుల సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్బీఐ పలు చర్యలను తాజా సమీక్షలో ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలు, ఇతర చెల్లింపుల సేవల సంస్థలు, పేమెంట్ బ్యాంకులు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పించింది. ఆర్బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల సేవలైన (సీపీఎస్) ఆర్టీజీఎస్, నెఫ్ట్లను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దాస్ ప్రకటించారు. ఆపరేటర్లు ఇందుకు గాను సీపీఎస్ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. డిజిటల్ ఆర్థిక సేవలు మరింత మందికి చేరుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రీపెయిడ్ చెల్లింపుల సేవలను అందించే సంస్థలు (ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్/పీపీఐ).. తమ కస్టమర్లు ఇతర సంస్థల పరిధిలోని కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించుకునేలా ఇంటర్ ఆపరేబులిటీని అమలు చేసే చర్యలను చేపట్టనున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ సేవలను అందించే ఎంపికను పీపీఐలకు ఇచ్చామని.. ఒక పీపీఐ పరిధిలోని కస్టమర్ మరో పీపీఐ/బ్యాంకు పరిధిలోని కస్టమర్కు నగదు బదిలీలు చేసుకోవచ్చని దాస్ చెప్పారు. పీపీఐ పరిధిలో ఒక కస్టమర్కు సంబంధించి బ్యాలన్స్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచింది. పూర్తి స్థాయి కేవైసీ కస్టమర్లకే ఇది వర్తిస్తుంది. -
ఇక రోజంతా ఆర్టీజీఎస్ సర్వీసులు
ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ .. ట్విటర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్ సేవలను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్లో ఆర్టీజీఎస్లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది. జైపూర్లో బ్యాంక్నోట్ ప్రాసెసింగ్ సెంటర్ బ్యాంక్ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాŠంక్నోట్ ప్రాసెసింక్ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా. -
కరోనా బారిన శక్తికాంత దాస్
-
ఏడో రోజూ కొనసాగిన ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ ఆశావహ వ్యాఖ్యలతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 327 పాయింట్లు పెరిగి 40,509 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 ర్యాలీ చేసి 11,914 వద్ద ముగిసింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ... కరోనా ప్రభావంతో సెప్టెంబర్ క్వార్టర్లో మైనస్ల్లో నమోదైన జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 నుంచీ రికవరీ బాట పట్టే అవకాశం ఉందన్నారు. వ్యవస్థలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్న తరుణంలో అకామిడేటివ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. దీంతో ఫైనాన్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీకే కట్టుబడి ఉంటామన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచే చర్యలు చేపడతామన్నారు. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్లో అధిక వెయిటేజీ కలిగి బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లతో పాటు గత సెషన్లో సూచీలను నడిపించిన ఐటీ షేర్ల హవా నేడు కూడా కొనసాగింది. ఫలితంగా సూచీలు ఏడో రోజూ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ 7 రోజుల్లో సెనెక్స్ 2,537 పాయింట్లను, నిఫ్టీ 692 పాయింట్లను ఆర్జించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,067 – 40,585 రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 11,805 – 11,939 మధ్య ఊగిసలాడింది. అయితే ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంజీసీ, ఆటో, రియల్టీ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దన్నుగా అంతర్జాతీయ సంకేతాలు ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలకు తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా మన మార్కెట్కు దన్నుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదుకావడంతో ఉద్దీపన ఆశలు మరింత పెరిగాయి. ఫలితంగా నేడు ఆసియాలో మార్కెట్లు రెండున్నర ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. వారం రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన చైనా మార్కెట్ లాభాలతో దూసుకెళ్లింది. యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు పాజిటివ్గా ట్రేడ్ అవడం మన మార్కెట్కు కలిసొచ్చాయి. కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.160.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థకు అండగా అవసరమైతే మరిన్ని విధాన చర్యలకు సిద్ధమని ఆర్బీఐ గవర్నర్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ బలపరిచింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వాలన్న ఆర్బీఐ నిర్ణయం సాహసోపేతం. వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, అకామిడేటివ్ విధానాలు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల ర్యాలీకి మద్దతునిచ్చాయి’’ – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ -
వడ్డీరేట్లు యథాతథంగానే..!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి భేటీలో వడ్డీ రేట్లను సవరించకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. అక్టోబర్ 1న ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుంది. మరింత రేట్ల కోతకు అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడే వాటిని వినియోగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు. దీంతో తదుపరి రేట్ల కోతపై అంచనాలు ఏర్పడ్డాయి. చివరి ఎంపీసీ భేటీ ఆగస్ట్లో జరగ్గా.. అప్పుడు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిస్క్లను దృష్టిలో ఉంచుకుని యథాతథ స్థితికే మొగ్గు చూపించింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన స్థితిలో ఉందని ఆసందర్భంలో పేర్కొంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.73 శాతంగా ఉంటే, ఆగస్ట్లో అతి స్వల్పంగా తగ్గి 6.69 శాతం స్థాయిలోనే ఉంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిల్లో.. గరిష్టంగా, కనిష్టంగా 2 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అంటే ప్రస్తుతద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పైనే ఉండడం గమనార్హం. నిపుణుల అంచనాలు.. ‘‘యథాతథ స్థితికే ఆర్బీఐ మొగ్గు చూపించొచ్చు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ విడత రేట్ల కోత ఉంటుందని నేను అయితే భావించడం లేదు’’ అని యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్కిరణ్ రాయ్ తెలిపారు. రేట్ల కోతకు అవకాశం ఉందని, అయితే, వచ్చే ఫిబ్రవరిలో అది సాధ్యపడొచ్చన్నారు. డిసెంబర్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, మంచి పంటల ఉత్పాదకత కారణంగా రేట్ల కోతకు అవకాశం ఫిబ్రవరిలో కలగొచ్చని చెప్పారు. రెపో, రివర్స్ రెపో రేట్లతో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని.. స్థూల ఆర్థిక గణాంకాలను ఆర్బీఐ నిశితంగా పరిశీలించొచ్చని కోటక్ మహీంద్రా బ్యాంకు కన్జ్యూమర్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ శక్తిఏకాంబరం అన్నారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలకు మరింత పెరగొచ్చు. తర్వాతి నెలల్లో క్రమంగా తగ్గుముఖం పడుతుంది. టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎంపీసీ నుంచి ఎటువంటి రేట్ల నిర్ణయాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాము’’ అని అదితినాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని, విధానంలోనూ, రెపో, సీఆర్ఆర్లోనూ ఏ విధమైన మార్పులు ఉండకపోవచ్చని కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ సైతం పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున వేచి చూసే ధోరణి అనుసరించొచ్చని పేర్కొన్నారు. తక్కువ స్థాయిల్లోనే కొనసాగించాలి.. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున రేట్ల కోతకు బదులు ఆర్బీఐ తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలి. వృద్ధికి మద్దతునివ్వడం కీలకం. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చే వరకు ఆర్బీఐ వేచి చూడాలి’’ అని సీఐఐ కోరింది. అసోచామ్ సైతం ఇదే కోరింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, ఎన్నో సవాళ్లు నెలకొన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ చార్జీలను తగ్గించడం, డెవలపర్లు ఇస్తున్న ఉచిత తాయిలాలతో రియల్ ఎస్టేట్లో డిమాండ్ క్రమంగా ఏర్పడుతోందని.. ఈ క్రమంలో రానున్న పండుగల సీజన్లో కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వీలుగా రెపో రేట్లను దిగువ స్థాయిల్లోనే ఉంచాల్సిన అవసరం ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. -
11,600 పాయింట్ల పైకి నిఫ్టీ...
బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 73.52 వద్ద ముగియడం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చాయి. నిఫ్టీ కీలకమైన 11,600 పాయింట్ల పైకి ఎగబాకింది. 83 పాయింట్లు లాభపడి 11,605 వద్ద ముగిసింది. ఫిబ్రవరి తర్వాత ఈ సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇక సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు.... రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఈ బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్బీఐ అభయం...: ఆర్థిక రికవరీ ఇంకా పుంజుకోలేదని, అయినప్పటికీ, నిధుల లభ్యత పెంచడానికి, వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయం ఇచ్చారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 4 శాతం లాభంతో రూ.640 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇండియన్ ఎనర్జీ ఎక్సే ్చంజ్,లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకా యి. లక్ష్మీ విలాస్ బ్యాంక్.గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మరిన్ని చర్యలకు సిద్ధం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో దేశ జీడీపీ మైనస్ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్బీఎఫ్సీ’లు బలహీనంగా.. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం.. డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్ చెప్పారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు. -
బ్యాంకులు నిధులు సమీకరించుకోవాలి
ముంబై: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు బ్యాంకులకు నిధులు అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. రుణ వితరణతోపాటు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అందుకు బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు కీలకమవుతాయన్నారు. ‘‘ఇటువంటి సమయాల్లో బ్యాంకులు తమ పాలనను, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ముందస్తు అంచనాలతో అవి నిధులను సమకూర్చుకోవాలి. అంతేకానీ ఆ అవసరం ఏర్పడే వరకు వేచి చూడరాదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తూ తమ వద్ద తగినంత మిగులు నిధులు ఉండేలా చూసుకోవాలి’’ అని శక్తికాంతదాస్ అన్నారు. ఎస్బీఐ నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.లాక్డౌన్, అనంతర పరిణామాలతో మొండి బకాయిలు (ఎన్పీఏలు) పెరిగే అవకాశాలు ఉన్నాయని గవర్నర్ అంచనా వేశారు. కరోనా కారణంగా తమ బ్యాలెన్స్ షీట్లపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ఆర్బీఐ ఇటీవలే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను కోరింది. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా సమస్యలను అధిగమించడం, నిధులు సమీకరించడంపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించినట్టు శక్తికాంతదాస్ తెలిపారు. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్డౌన్లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్డౌన్ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్ఎఫ్ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
ద్రవ్యలోటు కట్టడి కష్టమే
ముంబై : కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాలు అధిగమించడం కష్టసాధ్యమేనని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లపైనా ప్రభావం పడొచ్చని వార్తాసంస్థ కోజెన్సిస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు.. ఎకానమీపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోతగిన చర్యలేంటి? ఆర్థిక ఉద్దీపనల కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే వెల్లడించారు. కరోనా వేళ బడుగు వర్గాల కోసం ప్రభుత్వం పలు సహాయక చర్యలు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దరిమిలా ద్రవ్య లోటును 3.5 శాతానికి పరిమితం చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం కష్టసాధ్యమే. ద్రవ్య లోటు కచ్చితంగా దాటేయొచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా జీఎస్టీ వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రత్యక్ష పన్నులపైనా ప్రభావాన్ని తోసిపుచ్చలేం. ఏదేమైనా కరోనా సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు ద్రవ్య లోటును కట్టడి చేసేలా ప్రభుత్వం సమతూకమైన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. ద్రవ్య లోటు భర్తీలో ఆర్బీఐ ఏమైనా తోడ్పాటు అందించబోతోందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఇంకా ఏ అభిప్రాయమూ లేదు. అవసరం తలెత్తినప్పుడు స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకుంటాం. ఈ క్రమంలో నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తాం. 2008, 2020 సంక్షోభాలను చూసినప్పుడు ఎకానమీని పట్టాలెక్కించడంలో ఆర్బీఐ పాత్ర పరిమితంగానే ఉంటోందనే భావనపై మీ అభిప్రాయమేంటి? కేంద్రీయ బ్యాంకు పాత్రను తక్కువగా చేసి చూడటానికి లేదు. ద్రవ్య పరపతి విధానం, లిక్విడిటీ నిర్వహణ, ఆర్థిక రంగ నియంత్రణ.. పర్యవేక్షణ మొదలైనవన్నీ చాలా శక్తిమంతమైన సాధనాలే. ఆర్థిక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావాలు చూపేవే. ప్రస్తుతం ఒక మహమ్మారిపరమైన మందగమనంతో పోరాడుతున్నాం. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంటుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఉదార ఆర్థిక విధానాల చక్రవ్యూహం నుంచి బైటపడే మార్గమేంటి? ఇలాంటి అంశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్కి సంబంధించి సమయోచిత మార్గదర్శక ప్రణాళిక ఉండాలి. ద్రవ్య లోటు కావొచ్చు లేదా లిక్విడిటీ కావొచ్చు లేదా అసాధారణ చర్యలేవైనా కావొచ్చు.. చక్రవ్యూహంలోకి ప్రవేశించడం, బైటపడటం గురించి ఏకకాలంలో వ్యూహాలు రచించుకోవాలి. ఇదంతా చూసి.. ఆర్బీఐ కఠినతర విధానాన్ని పాటించబోతోందని మార్కెట్లు భావించకుండా ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పరిస్థితులు దాదాపుగా సాధారణ స్థాయికి వచ్చాయని, చక్కబడ్డాయని భరోసా కలిగినప్పుడు మాత్రమే సమయోచితంగా ఎగ్జిట్ ఉండాలి. మరీ ముందుగానో.. మరీ ఆలస్యంగానో ఉండకూడదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిట్ విషయమొక్కటే కాదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కష్టమే. అసాధారణ పరి స్థితుల్లో అసాధారణ చర్యలు తీసుకోవాల్సిందే. -
విదేశీ ఎక్సే్చంజీల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్సే్చంజ్ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ ఇండెక్స్లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్సే్చంజ్ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. విదేశీ ఎక్సే్చంజ్ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020–21 బడ్జెట్లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్–రెసిడెంట్ ఇన్వెస్టర్లకు ఉద్దేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్బీఎఫ్సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు. -
మరో దఫా రేటు కోత?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్బీఐ 1.1 శాతం (0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4 శాతం దిగువన నిర్దేశిత లక్ష్యాల లోపు కొనసాగుతుండడం రెపో రేటు కోతకు కలిసి వస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే మరో దఫా రేటు కోతకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు అవకాశం లేదుకానీ, రెపో రేటు తగ్గింపునకు కొంత వీలుందని ఇటీవలే స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొనడం గమనార్హం. కార్పొరేట్ పన్ను కోతసహా ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. దీనితోపాటు దేశంలో పండుగల వాతావరణం ఉంది. ఆయా పరిస్థితుల్లో డిమాండ్ పెంపునకు 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయం వెలువడుతుందన్నది పలువురి విశ్లేషణ. కాగా బ్యాంకులు తమకు అందివచ్చిన రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టడానికి ఇప్పటికే ఆర్బీఐ కీలక చర్య తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచీ బ్యాంకులు తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, తదితర ఎక్స్టర్నల్ రేట్లకు బదలాయించాలని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశించింది. -
పరిశ్రమ వర్గాలతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018–19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ ‘జాగరూకతతో కూడిన కఠిన’ వైఖరిని ‘తటస్థం’ దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్బీఐ రేట్లు పెరిగాయి. రేటు తగ్గింపు వెసులుబాటు... ఆర్బీఐకి రేటు కోతకు వెసులుబాటు ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి రూ.69,000 కోట్లు ఆర్బీఐ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్లు డివిడెండ్గా రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.40,000 కోట్లను డివిడెండ్గా పంపిణీ చేసింది. -
నగదు లభ్యత పెంచుతాం : ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత క్షీణిస్తే లిక్విడిటీ పెంపునకు చర్యలు చేపడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రుణాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ తనను కలిసిన చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ సంప్రదింపులు జరిపారు. చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల రుణాల పునర్వ్యస్ధీకరణపై ప్రతిపాదనలను బ్యాంకులు బేరీజు వేయాలని సూచించారు. నగదు లభ్యతపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నగదు లభ్యత అవసరాలను కేంద్ర బ్యాంక్ పూర్తిస్ధాయిలో పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరింత లిక్విడిటీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నా కేంద్ర బ్యాంక్ పరిధిలోని అంశాలపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని తెలిపారు. -
సగం తగ్గిన లాభాలు
స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ లాభాలు కొనసాగాయి. రిటైల్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్ను నింపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. బ్యాంక్ల అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ కానుండటం కూడా కలసివచ్చింది. రూపాయి బలపడగా, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటంతో స్టాక్సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 35,930 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 10,792 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే మూడు రోజుల వరుస లాభాల కారణంగా మధ్యాహ్నం తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ సూచీల లాభాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. గణాంకాలతో కళకళ.... ఆసియా మార్కెట్ల జోష్తో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి 8.1 శాతానికి పుంజుకోవడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. రిటైల్ ద్రవ్యల్బోణం తగ్గడంతో కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు పెరిగాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ గురువార భేటీ కానుండటంతో బ్యాంకింగ్ రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 317 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్ల వరకూ పెరిగాయి. అయితే వరుస మూడు రోజుల ర్యాలీ కారణంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ లాభాలు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఆల్టైమ్ హైకి హెచ్యూఎల్.. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల రానున్నందున గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారిస్తుందని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్ను పెంచే పథకాలు, నిర్ణయాలు రానున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వినియోగ కంపెనీల షేర్లు మంచి లాభాలు సాధించాయి. హిందుస్తాన్ యూనిలివర్, కాల్గేట్ పామోలివ్ (ఇండియా) షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ► సన్ఫార్మాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సెబీ వెల్లడించడంతో సన్ ఫార్మా షేర్ 2 శాతం నష్టంతో రూ.422 వద్ద ముగిసింది. ► టార్గెట్ ధరను రూ.350 నుంచి రూ.375కు మోర్గాన్ స్టాన్లీ పెంచడంతో ఎస్బీఐ షేర్ 1 శాతం లాభంతో రూ. 288 వద్దకు చేరింది. ► ఐడీఎఫ్సీ బ్యాంక్లో క్యాపిటల్ ఫస్ట్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలపడంతో ఈ రెండు షేర్లు ఇంట్రాడేలో చెరో 7 శాతం వరకూ ఎగిశాయి. రూపాయి వరుస నష్టాలకు బ్రేక్ ముంబై: వరుసగా మూడు రోజుల పాటు నష్టపోయిన రూపాయి.. గురువారం కోలుకుంది. డాలర్తో పోలిస్తే 33 పైసలు బలపడి 71.68 వద్ద క్లోజయ్యింది. డాలర్ బలహీనపడటం, ముడిచమురు ధరలు కాస్త తగ్గుముఖం పడుతుండటం ఇందుకు కారణం. కీలక అంశాల్లో సంబంధిత వర్గాలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కొత్తగా నియమితులైన శక్తికాంత దాస్ భరోసానివ్వడం కూడా రూపాయికి కొంత ఊతమిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
రిజర్వ్ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. ఉర్జిత్ పటేల్పై అదే ఒత్తిడి ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న ఉర్జిత్ పటేల్పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరు? ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్గా ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. కొత్త గవర్నర్ ప్రభుత్వం మాట వింటారా? అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. అసలేం అవుతుంది ? మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. -
ఆర్బీఐకి ‘శక్తి’ కాంత్!
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వరాష్ట్రం ఒడిశా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి వ్యవహారాల్లో ఆరంభంలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక పదవికి 61 సంవత్సరాల దాస్ పేరును ప్రకటించడం గమనార్హం. మూడేళ్లు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని అధికారిక ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి ఒక బ్యూరోక్రాట్కు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ బాధ్యతలు అప్పగించటం ఐదేళ్లలో ఇదే తొలిసారి. అంతకు ముందు ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆయన తరవాత మూడేళ్లపాటు రఘురామ్ రాజన్, రెండేళ్లకు పైగా ఉర్జిత్ పటేల్ ఈ పదవిలో కొనసాగటం తెలిసిందే. ‘తాత్కాలికం’ అంచనాలకు భిన్నంగా... నిజానికి పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ బాధ్యతలకు తాత్కాలికంగా ఎవరో ఒకరిని నియమిస్తారని అంతా భావించారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దాస్ను మూడేళ్ల కాలానికి ఎంచుకోవడం గమనార్హం. డాక్టర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాను కేంద్రం ఆమోదించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే తాజా నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి శక్తికాంత దాస్కు విశేష అనుభవం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎ.ఎస్.ఝా పేర్కొన్నారు. ఐఏఎస్ నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకూ... దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. నార్త్బ్లాక్లో నిర్వహించిన బాధ్యతల్లో పరిపూర్ణత ఆయనను మింట్ స్ట్రీట్ వరకూ నడిపించిందని చెప్పవచ్చు. 38 సంవత్సరాల కెరీర్లో ప్రతి సందర్భంలోనూ శక్తికాంత దాస్... వివాద రహిత ధోరణి కలిగిన వ్యక్తిగా, కీలక అంశాల్లో ఏకాభిప్రాయ సాధనలో విజయం సాధించే నేర్పరిగా ప్రత్యేకత సాధించారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఆటుపోట్లను పరిష్కరించటంలో కీలక పాత్రను పోషించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత... భారత్లో జీ–20 సమావేశాల నిర్వహణ బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో పట్టభద్రులయిన శక్తికాంత దాస్... 2008లో పి.చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. తదుపరి 2014 మధ్యలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన కీలక బాధ్యతలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖ పగ్గాలను ఆయనకు అప్పగించింది. అటు తర్వాత ఆర్బీఐ, ద్రవ్య పరపతి విధానంతో ప్రత్యక్ష సంబంధాలు నెరపే ఆర్థిక వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనల్లో పలు సంవత్సరాలు ఆయన ముఖ్య భూమిక వహించారు. ఈ నియామకం హర్షణీయం ఆర్బీఐ చీఫ్గా శక్తికాంత్దాస్ నియామకం హర్షణీయం. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి నియామకం ఆర్బీఐ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నాం. కీలక కూడలిలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా నియామకం లాభిస్తుందని విశ్వసిస్తున్నాం. – రాకేశ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రయోజనం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నియామకం ఫైనాన్షియల్ మార్కెట్లకు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ద్రవ్య, వాణిజ్య పరమైన అంశాల్లో దాస్కు విశేష అనుభవం ఉండడమే దీనికి కారణం. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పనలోనూ ఈ నియామకం సానుకూల ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ గొప్ప నిర్ణయం దాస్కు నా శుభాకాంక్షలు. ఆయన నాకు కళాశాల రోజుల నుంచీ తెలుసు. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన, పరిపక్వత కలిగిన అధికారి ఆయన. గొప్ప టీమ్ లీడర్. ఏకాభిప్రాయ సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఆర్థికాభివృద్ధిలో, ఆర్బీఐ స్వతంత్య్రత, ప్రతిష్టలను కాపాడ్డంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. – అమితాబ్కాంత్, నీతీ ఆయోగ్ సీఈఓ లిక్విడిటీ సమస్యల పరిష్కారం కొత్త గవర్నర్ దాస్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలను పరిష్కరిస్తారన్న విశ్వాసం ఉంది. పరిశ్రమల సెంటిమెంట్కు ఈ నియామకం బలాన్నిస్తుంది. దాస్ అపార ఆర్థిక అనుభవం కలిగినవారు. పలు వ్యవహారాల సున్నిత పరిష్కారానికి, స్థిరత్వానికి ఆయన నియామకం దోహదపడుతుంది. బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో లిక్విడిటీ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నాం. – రాకేష్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ 14న బోర్డ్ భేటీ యథాతథం ఈ నెల 14వ తేదీన యథాతథంగానే ఆర్బీఐ బోర్డ్ సమావేశం జరుగుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ఆర్బీఐలో దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటికి సడలింపులు వంటి కీలక అంశాలపై 14 మంది బోర్డ్ సభ్యులు ఈ భేటీలో చర్చిస్తారు. దాస్ నియామకాన్ని తప్పుపట్టిన ఆర్థికవేత్త అభిజిత్ ముఖర్జీ .. రిటైర్డ్ బ్యూరోక్రాట్ శక్తికాంత్ దాస్ను ఆర్బీఐ గవర్నర్గా ప్రభుత్వం నియమించడాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ తప్పుపట్టారు. దీనివల్ల కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో గవర్నెన్స్పరమైన అంశాలపై సందేహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశ్వసనీయతను పునరుద్ధరించాలి ఉర్జిత్ పటేల్ స్థానంలో నియమితులైన వ్యక్తి అత్యున్నత సంస్థ విశ్వసనీయతను, స్వతంత్రతను పునరుద్ధరించాలి. రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉర్జిత్ పటేల్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనబడుతోంది. పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ అంశంపై కేంద్రం కూడా ఆత్మావలోకన చేసుకోవాలి. జోక్యం ఏ స్థాయిలో అవసరం, పరిమితులేమిటి? వంటి అంశాల్లో కేంద్రం పరిపక్వత కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నా. – దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. -
పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)పై వివరణ ఇచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మంగళవారం ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన పదిరోజుల్లో లిఖితపూర్వకంగా బదులిస్తారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సంప్రదింపుల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ముడిచమురు ధరలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి చర్చించినట్టు సమాచారం. నోట్ల రద్దు, బ్యాంకుల్లో ఎన్పీఏల పరిస్థితి పర్యవసానాలపై సభ్యులు ఆర్బీఐ గవర్నర్ను ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆర్బీఐ నిర్వహణ వ్యవహరాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఊర్జిత్ పటేల్ను ప్రశ్నించినట్టు సమాచారం. -
ఇప్పటికైతే సయోధ్య!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు, కేంద్రానికి మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఘర్షణ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈ పరిణామానికి సహజంగానే మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు వారాల గరిష్ట పాయింట్లు నమోదుచేశాయి. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సోమ వారం తొమ్మిది గంటలపాటు సాగించిన సుదీర్ఘ సమావేశం అనంతరం ప్రధానమైన నగదు నిల్వల అంశంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీసుకున్న రుణాల పునర్వ్యవస్థీకరణ, ఆ పరిశ్రమలకు కల్పించాల్సిన రుణలభ్యత అంశాలను పరిశీలించేందుకు ఆర్బీఐ అంగీకరించింది. సమావేశం సాఫీగా సాగిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పవలసి వచ్చిందంటేనే కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య గత కొన్నాళ్లుగా ఏ స్థాయిలో విభేదాలొచ్చాయో అర్ధమవుతుంది. ఆర్బీఐ గవర్నర్ పదవి సంక్లిష్టమైనది. ఆ బ్యాంకు ప్రభుత్వానికి చెందిన కీలకమైన అంగం. కనుక గవర్నర్లుగా ఉండేవారు సర్వ స్వతంత్రంగా పనిచేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఎప్పుడూ ప్రభుత్వానిదే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందల్లా చేసుకుంటూ పోతే కొంప మునిగే ప్రమాదం ఏర్పడవచ్చు. కనుకనే పాలకులు ఏరి కోరి తెచ్చుకున్నవారు సైతం కీలక సందర్భాల్లో సమస్యగా మారతారు. వేణుగోపాలరెడ్డి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నకాలంలో ప్రధానిగా మన్మోహన్సింగ్, ఆర్థిక మంత్రిగా చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాంటెక్సింగ్ అహ్లూవాలియా, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్గా సి. రంగరాజన్ ఉండేవారు. అందరూ ఆర్థికరంగ హేమాహేమీలే. అయినా భిన్న సందర్భాల్లో ఆయన వారితో విభేదించాల్సి వచ్చింది. ఆయన అనంతరం వచ్చిన దువ్వూరి సుబ్బారావు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయనతో కూడా అప్పటి ఆర్థిక మంత్రులు ప్రణబ్ముఖర్జీ, చిదంబరంలకు సమస్యలెదురయ్యాయి. ఇక రఘురాం రాజన్ సంగతి చెప్పనవసరం లేదు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సంస్థల్లో పనిచేసి వచ్చిన రాజన్ వెనకా ముందూ చూడకుండా వడ్డీ రేట్లు తగ్గిస్తారని అరుణ్జైట్లీ, అరవింద్ సుబ్రమణియన్లు ఆశపడ్డారు. కానీ ఆయన అందుకు సిద్ధపడలేదు. ఆర్థిక వృద్ధి సరే... ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ఎలాగని ఆయన ఎదురు ప్రశ్నించేసరికి వారికి నోట మాట రాలేదు. వడ్డీరేట్లు తగ్గిస్తే చాలు...ఆర్థిక వ్యవస్థ క్షణాల్లో పరుగులు పెట్టడం ఖాయమని జైట్లీ, సుబ్రహ్మణ్యస్వామి వంటివారు ఎంత చెప్పినా ఆయన నిగ్రహం చెక్కు చెదరలేదు. ఇది వారికి ఆగ్రహం కలిగించింది. రాజన్ అనంతరం వచ్చిన ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేక పోయారన్న విమర్శ ఉంది. కానీ అటువంటి ఉర్జిత్కు కూడా ఇప్పుడు లడాయి తప్పలేదు. అయితే ఇప్పుడొచ్చిన వివాదానికి, పాత వివాదాలకూ పోలిక లేదు. గతంలో ఆర్థికమంత్రులు ఆర్బీఐపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మినహా మరేం మాట్లాడేవారు కాదు. మీడియాలో విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు రావడం తప్ప ఇప్పటిలా బహిరంగంగా వివాదాల్లోకి దిగలేదు. ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు సభ్యుల్లో ఒకరైన ఎస్. గురుమూర్తి బ్యాంకు దగ్గరున్న 9.69 లక్షల కోట్ల నగదు నిల్వలనుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొంత బదిలీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్రవ్య వినిమయంపై ఆంక్షలు విధిస్తే వృద్ధిపై దాని ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అయితే కేంద్రం అధికారికంగా నగదు బదిలీ చేయాలని నేరుగా కోరలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐ వ్యవహారాలను డైరెక్టర్ల బోర్డే నిర్వహిం చేవిధంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించడానికి కేంద్రం వెనకాడదన్న కథనాలు వెలువడ్డాయి. దానికి జవాబుగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య ఒక సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకు స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగిస్తే ఆర్థిక రంగంలో పెను సంక్షోభం ఖాయమని హెచ్చరించారు. అందుకాయన 2010నాటి అర్జెంటీనా ఉదంతాన్ని కూడా ఉటంకిం చారు. ఆర్బీఐ నగదు నిల్వల్లో 3.60 లక్షల కోట్లు బదలాయించాలని కేంద్రం చేస్తున్న డిమాండు సరికాదని ఆయన ఆ రకంగా తేల్చిచెప్పారు. అయితే సోమవారంనాటి డైరెక్టర్ల బోర్డు సమావేశం నేరుగా దీనిపై నిర్ణయం తీసుకోకుండా నిల్వలను బదిలీ చేయడానికి అనుసరించాల్సిన ఆర్థిక చట్రం(ఈసీఎఫ్) ఎలా ఉండాలన్న సిద్ధాంత చర్చలోకి పోయింది. చివరకు దానిపై ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. చర్చ సందర్భంగా ఆర్బీఐ కీలకమైన డేటా ఆధారంగా తన వాదనను సమర్థించుకుంది. ఇక ఆర్బీఐ తక్షణ దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని తీసుకురావడంపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. తమ రాబడిలో 10శాతానికి మించి నిరర్థక రుణాలున్న బ్యాంకులు కొత్త రుణాలివ్వడానికి వీల్లేదని ఈ పీసీఏ నిర్దేశిస్తోంది. ఫలితంగా ఎంఎస్ఎంఈలకు రుణలభ్యత ఉండటం లేదు. దీనిపైనా నిపుణుల కమిటీ ఏర్పాటైంది. పీసీఏను సరళీకరిస్తే తప్ప ఎంఎస్ఎంఈలకు రుణలభ్యత అంతం తమాత్రంగానే ఉంటుంది. ఇవన్నీ పెద్దనోట్ల రద్దుతో కుదేలైనవి గనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీటికి అప్పుదొరికేలా చూడాలని కేంద్రం ఆత్రంగా ఉంది. కానీ పది భారీ పరిశ్రమలనుంచి రావా ల్సిన మొండి బకాయిల సంగతిని బోర్డు పరిశీలించలేదు. ఆ బకాయిల మొత్తం దాదాపు 4 లక్షల కోట్లు! ఈ బకాయిలు వసూలైతే బ్యాంకులు కళకళలాడతాయి. ఇలాంటి సమస్యల జోలికి పోకుండా తాను అనుకున్నట్టే అంతా పరిష్కారం కావాలని కేంద్రం కోరుకోవచ్చు. కానీ బాధ్యత గల సెంట్రల్ బ్యాంకుగా ఆర్బీఐ అంత ఉదారంగా వ్యవహరించలేదు. ఇప్పుడు చేసిన నిర్ణయాలు, వాయిదా పడిన మరికొన్ని సమస్యలపై వచ్చే నెల 14న మరోసారి జరిగే డైరెక్టర్ల బోర్డు సమావేశం ఏం చేస్తుందో చూడాలి. -
ఆర్బీఐ గవర్నర్ను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్కు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ను మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. వీరప్ప మొయిలీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన ఊర్జిత్ పటేల్ను సభ్యులు నీరవ్ మోదీ-పీఎన్బీ స్కామ్పై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నకిలీ పత్రాలతో రూ 13,000 కోట్ల రుణాలు పొందిన నీరవ్ మోదీ ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెను ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణాన్ని దీర్ఘకాలంగా ఎందుకు గుర్తించలేకపోయారని స్టాండింగ్ కమిటీ సభ్యులు ఊర్జిత్ పటేల్ను ప్రశ్నించారు. ఈ భేటీలో బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పైనా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. బ్యాంకుల్లో మొండిబకాయిల వసూలు ప్రక్రియ ప్రారంభమైందని పటేల్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వివరించారు. గతంలో మే 17న కూడా ఆర్బీఐ గవర్నర్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. -
ఆర్బీఐ గవర్నర్ గిరీపై రాజన్ పుస్తకం
సెప్టెంబర్ 4న మార్కెట్లోకి ’ఐ డూ వాట్ ఐ డూ’ న్యూఢిల్లీ: సంక్షోభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్ రాజన్.. కొత్తగా మరో పుస్తకాన్ని ప్రచురించారు. ’ఐ డూ వాట్ ఐ డూ’ పేరిట ఆయన రాసిన ఈ పుస్తకం సెప్టెంబర్ 4న మార్కెట్లోకి రానుంది. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన కాలంలో రాజన్ రాసిన వ్యాసాలు, ప్రసంగాలు ఇందులో పొందుపర్చారు. ఆర్థిక, రాజకీయపరమైన అంశాలు దీన్లో చాలా ఉన్నాయి. 2013 సెప్టెంబర్లో రాజన్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టే నాటికి రూపాయి పతనావస్థలో ఉండగా.. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. కరుగుతున్న విదేశీ మారక నిల్వలు.. భారీ కరెంటు అకౌంటు లోటు దేశానికి సమస్యాత్మకంగా మారాయి. అయిదు బలహీన ఎకానమీల్లో ఒకటనే ముద్రతో భారత్పై నమ్మకం సడలిన పరిస్థితులను రాజన్ సమర్థంగా ఎదుర్కొన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత... కొనసాగుతున్న సంస్కరణల గురించి ప్రపంచానికి బలమైన సంకేతాలు పంపారని ముద్రణా సంస్థ హార్పర్కోలిన్స్ ఇండియా పేర్కొంది. దీర్ఘకాలికంగా వృద్ధి, స్థిరత్వాన్ని సాధించడం, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై రాజన్ దృష్టి పెట్టారని తెలిపింది. దోశ ధరతో ముడిపెట్టి ఆర్థికాంశాలను రాజన్ వివరించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘దోశనామిక్స్ లేదా రుణ సంక్షోభ పరిష్కారమార్గాలు కావొచ్చు. రాజన్ ఆర్థిక విషయాలను సరళంగా వివరిస్తారు‘ అని హార్పర్కోలిన్స్ వివరించింది. రాజన్ ఇప్పటికే సేవింగ్ క్యాపిటలిజం ఫ్రం క్యాపిటలిస్ట్తో పాటు మరో పుస్తకాన్ని కూడా రాశారు. -
ప్రభుత్వ బ్యాంకులకు మరింత క్యాపిటల్ కావాలి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత పెట్టుబడుల అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబైలో నిర్వహించిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాలెన్స్ షీట్ల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ భారీ రీకాపిటలైజేషన్ అవసరమవుతుంది. నగదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రీకాపిటలైజేషన్ అవసరమవుతుందని ఆర్బీఐ గవర్నర్ పటేల్ చెప్పారు. అదనపు నిధులు కావాలన్నారు. మార్కెట్ నుంచి నిధులను సమీకరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను తగ్గించడంతో పాటు పలు రంగాల్లో అదనపు క్యాపిటల్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది అధిక నిష్పత్తిలో కొనసాగుతోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏ నిష్పత్తి 9.6 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని వివిధ బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో తెలిపారు. అలాగే బ్యాంకుల బ్యాడ్ లోన్ల సమస్య పరిష్కరించేందుకు హెయిర్ కట్ అవసరం పేర్కొన్నారు. -
నోట్ల లెక్క ఇంకా తేలలేదు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముగిసి ఆరు నెలలకు పైగా కావొస్తున్నా ఇంకా ఆ నోట్ల లెక్క తేలలేదు. డీమానిటైజేషన్ తర్వాత పాత నోట్లు ఎన్ని డిపాజిట్ అయ్యాయో ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేడు పార్లమెంట్ ప్యానెల్కు తెలిపారు. స్పెషల్ టీమ్ ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతుందని, వారంలో ఆరు రోజులు పనిచేస్తూ కేవలం ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటున్నట్టు పటేల్ చెప్పారు. నోట్ల రద్దు చేపట్టినప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్ని రద్దైన నోట్లు మళ్లీ సిస్టమ్లోకి వచ్చాయని సమాజ్వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్, తృణమూల్ ఎంపీ సాగాటో రాయ్లు ఆర్బీఐ గవర్నర్ను ప్రశ్నించగా... గతేడాది నవంబర్న రూ.17.7 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, ప్రస్తుతం రూ.15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు పటేల్ తెలిపారు. గతేడాది నవంబర్ 8 ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు చేసిన అనంతరం పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అప్పటిలోగా దేశంలో ఉన్న పాత కరెన్సీ నోట్లన్నంటిన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలని ఆదేశించింది. రద్దయిన నోట్లు ఇంకా నేపాల్ దేశం నుంచి, కోపరేటివ్ బ్యాంకుల నుంచి వస్తున్నాయని పటేల్ చెప్పారు. అంతేకాక పోస్టు ఆఫీసులు ఇంకా పాత నోట్లను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు విషయంలో పటేల్ రెండోసారి పార్లమెంట్ ప్యానల్ ముందు హాజరయ్యారు. ప్యానల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు లెక్కలు పార్లమెంటులో ప్రవేశపెడతామని పటేల్ చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ప్యానల్కు అధినేతగా కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఉన్నారు. అంతకముందు రెండుసార్లు పటేల్కు ప్యానల్ సమన్లు జారీచేయగా.. ఆ కాలంలో ఆర్బీఐకు అత్యంత కీలకమైన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఉన్నందున పటేల్ మినహాయింపు కోరారు. ఈ కమిటీ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులకు కూడా పెద్ద నోట్ల విషయంలో సమన్లు జారీచేసింది. దీని ప్రభావాన్ని తమ ముందు వెల్లడించాలని ఆదేశించింది. -
ముందే నోట్ల స్టాక్ ను రెడీగా పెట్టాం: ఉర్జిత్
న్యూఢిల్లీ : నోట్ల రద్దుపై ఇప్పటికీ చాలానే అంతు తోచని ప్రశ్నలు ప్రజల మదిలో ఉన్నాయి. అంత సీక్రెసీగా నిర్ణయం ఎలా తీసుకున్నారు? కొత్త నోట్లను వెంటనే ఎలా విడుదల చేశారు? ఉర్జిత్ పటేల్ కు ముందున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రాజన్ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపారా? అనే ప్రశ్నలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే డీమానిటైజేషన్ కు ముందే అవసరమయ్యే కొత్త 500, 2000 నోట్లను తయారుచేసి రెడీగా పెట్టామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. డీమానిటైజేషన్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి ఆర్బీఐకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలను రికార్డుల రూపంలో పొందుపరచలేదని ఉర్జిత్ పటేల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజల అసౌకర్యాలను తొలగించామని చెప్పారు. ప్రింటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఇతర వనరులు బ్యాంకు నోట్ పేపర్, ఇంక్, లాజిస్టిక్స్ అవసరాలు వంటి వాటి విషయంలో ఎప్పడికప్పుడూ ప్రభుత్వంతో చర్చలు జరిపామని లిఖిత పూర్వకంగా తన సమాధాన్ని అందించారు. ఈ కీలక అంశాలన్నింటిన్నీ పరిగణలోకి తీసుకుని డీమానిటైజేషన్ కు కొన్ని నెలల ముందే కొత్త 2000, 500 నోట్ల ముద్రించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పుడు తమ దగ్గర సహేతుకమైన కొత్త నోట్లు ప్రింట్ అయి, సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్నప్పటి నుంచే అంటే 2016 ప్రారంభం నుంచే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ గురించి సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని పటేల్ తెలిపారు. అయితే డీమానిటైజేషన్ కు సంబంధించి రాజన్ కు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల మినిట్స్ రికార్డుల్లో లేవన్నారు. -
ఉర్జిత్కు శాలరీ బొనాంజ.. భారీగా జీతం పెంపు!
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్తోపాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. వారి మూలవేతనాన్ని ఏకంగా 100శాతం పెంచింది. దీంతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ నెలకు రూ. 2.50 లక్షల జీతాన్ని అందుకోనుండగా.. డిప్యూటీ గవర్నర్లు రూ. 2.25 లక్షల జీతాన్ని పొందనున్నారు. ఈ పెంపు గడిచిన ఏడాది (2016) జనవరి 1 నుంచి అమలుకానుండటం గమనార్హం. ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్కు రూ. 90వేల నెలవారీ జీతం అందుతుండగా, ఆయన డిప్యూటీలకు రూ. 80వేల జీతం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారి వేతనాల అంశాన్ని సమీక్షించి.. జీతాలలో ఈ మేరకు మార్పులు చేసింది. భారీస్థాయిలో ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ జీతాలను కేంద్రం పెంచినప్పటికీ.. ఆర్బీఐ నియంత్రిస్తున్న పలు బ్యాంకుల్లోని టాప్ అధికారులతో జీతాలతో పోలిస్తే.. వారికి తక్కువ వేతనమే లభిస్తుండటం గమనార్హం. -
నోట్ల రద్దుతో అభివృద్ధి ఢమాల్
జీడీపీ వృద్ధి ఒక శాతం పతనమైంది: చిదంబరం ♦ దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.5 లక్షల కోట్ల నష్టం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఒక శాతం పడిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిందంబరం అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి సగానికి పడిపోయిందని, మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు. మన తెలంగాణ పత్రిక రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆస్కి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిదంబరం ప్రసంగించారు. ‘‘నోట్లరద్దు అత్యంత అనాలోచిత, తెలివి తక్కువ నిర్ణయం. సుమారు 4 కోట్ల మంది నల్ల కుబేరులు తమ నల్లధనాన్ని మార్పిడి చేసుకోలేరని ఆశించి ప్రభుత్వం భంగపడింది. రూ.15,44,000 కోట్లు విలువ చేసే నోట్లను రద్దు చేస్తే దాదాపు నోట్లన్నీ తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయి. నేపాల్, భుటాన్, ఎన్నారైల వద్ద ఉన్న నోట్లు వస్తే రద్దయిన నోట్లన్నీ జమైనట్లే. ఇదంతా కేవలం నోట్ల పునఃముద్రణ, నోట్ల మార్పిడిగా మారింది’’ అని అన్నారు. నల్లధనం, అవినీతి, నకిలీ నోట్లు, ఉగ్రవాదం నిర్మూలనకే నోట్ల రద్దు అని కేంద్రం చెప్పుకున్న లక్ష్యాలు ఏమాత్రం నెరవేరలేదన్నారు. పైగా బ్యాంకర్ల అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లి కొత్త అవినీతి, నల్లధనం పుట్టుకొచ్చిందన్నారు. ఉగ్రవాదం కూడా తగ్గలేదని, బారాముల్లాలో హతమైన ఉగ్రవాది వద్ద కొత్త రూ.2 వేల నోట్లు లభించాయన్నారు. అవినీతి, లంచాల డిమాండ్ను నిర్మూలిస్తేనే నల్లధనానికి చెక్పెట్టడడం సాధ్యమవుతుందన్నారు. ఆర్బీఐ గవర్నర్ను నిర్బంధంలో ఉంచారు నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ పాత్రను కేంద్రమే పోషించిందని, దీంతో ఆర్బీఐ స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడిందని చిదంబరం పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రులను హడావుడిగా సమావేశానికి పిలిచి నోట్ల రద్దుపై ప్రకటన చేస్తున్నామని ప్రధాని తెలిపారని, ఆ ప్రకటన ముగిసే వరకు గంటపాటు వారిని, ఆర్బీఐ గవర్నర్ను నిర్బంధంలో ఉంచారన్నారు. కేవలం ఇద్దరు, ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లతోనే ఆర్బీఐ తూతూమంత్రంగా సమావేశం నిర్వహించిందని, 8 మంది డైరెక్టర్లు హాజరు కాలేదన్నారు. ఇప్పట్లో నగదు కొరత తీరదు నోట్లరద్దుతో 45 కోట్ల మంది కూలీలు జీవనోపాధి కోల్పోయి 50 రోజులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రోజూ 10 కోట్ల మంది ఏటీఎంల ముందు నానా యాతన అనుభవించారని చిదంబరం పేర్కొన్నారు. అయినా కేంద్రం నష్టపరిహారం మాటే ఎత్తడం లేదన్నారు. మహానగరాల ఏటీఎంలలో డబ్బులను చూసి అంచనాకు రావద్దని, దేశంలో సగం ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయని, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నగదు చేరలేదని పేర్కొన్నారు. రద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్ల ముద్రణకు కనీసం 8 నెలలు పడుతుందని, మే చివరి నాటికి కూడా కరెన్సీ కొరత తీరదన్నారు. దేశంలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని, నగదు రహితానికి మారితే పేటీఎం వంటి ఈ–వాలెట్ సంస్థలు రోజూ రూ.1,500 కోట్ల లబ్ధి పొందుతాయని చెప్పారు. కార్యక్రమంలో మన తెలంగాణ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ పద్మనాభయ్య, ఈడీ అంజయ్య, డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు అతి పెద్ద కుంభకోణం పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని చిదంబరం అన్నారు. ఆదివారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నోట్ల రద్దు కాదని, పునర్ముద్రణ మాత్రమే అని ఎద్దేవా చేశారు. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పడు ప్రధాని తీసుకున్నట్టుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుని ఉంటే పదవికి రాజీనామా చేసేవాడినని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు జరిగిన నష్టాన్ని, ఇబ్బందులను గ్రామస్థాయికి తీసుకుపోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీనికి పీసీసీ ముఖ్యనేతలంతా బాధ్యతలను తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో పార్టీ బలంగా ఉంటే, గాంధీభవన్ బలంగా ఉన్నట్టేనన్నారు. అనేక ఆకాంక్షలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ ధైర్యంగా నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమేయ్యేది కాదన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల పాల్గొన్నారు. -
ఉర్జిత్ను కాపాడిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని ఉర్జిత్ పటేల్కు సలహా ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతకు ముప్పు వస్తుందంటూ హెచ్చరించారట. అయితే ఆ ప్రశ్నలేమిటో తెలుసా? నగదు విత్డ్రాయల్స్పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా.. 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం ఉర్జిత్ పటేల్ను ప్రశ్నిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నించింది. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్కు మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారట. హఠాత్తుగా నోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి ఉర్జిత్పటేల్, ఆర్థికశాఖ అధికారులు నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వద్దని మన్మోహన్ సూచించారని తెలిసింది. సెంట్రల్ బ్యాంకు టాప్ బాస్గా పనిచేసిన మన్మోహన్, అనుభవపూర్వకంగా ఉర్జిత్ను ఆదుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్, ఈ మేరకు సలహా ఇవ్వడం విశేషం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. -
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
-
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
►ఎక్కడి వడ్డీరేట్లు అక్కడే... ► రెపో 6.25%, రివర్స్ రెపో 5.75%, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు... ► నోట్ల రద్దుతో ఈ ఏడాది వృద్ధి అంచనా 7.1 శాతానికి కోత మార్చినాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం ► తదుపరి పాలసీ సమీక్ష ఫిబ్రవరి 8న అంచనాలన్నీ తప్పాయి. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో అష్టకష్టాలు పడుతున్న సామాన్యుడికి వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు కూడా ఆవిరయ్యాయి. కనీసం పావు శాతం వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయమంటూ లెక్కలేసిన విశ్లేషకులు, స్టాక్ మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాక్ ఇచ్చారు. కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలానికి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించింది. మొత్తంమీద రుణాలపై వడ్డీరేట్లు దిగొస్తాయని వేచిచూస్తున్నవారందరినీ ఆర్బీఐ తీవ్ర నిరాశకు గురిచేసింది. అరుుతే, తాత్కాలిక 100% సీఆర్ఆర్ పరిమితిని తొలగించడంతో రుణ రేట్లు రానున్న కాలంలో తగ్గుముఖం పట్టొచ్చని బ్యాంకర్లు పేర్కొనడం కాస్త ఊరటనిచ్చే అంశం. ముంబై: ఆర్బీఐ గవర్నర్గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతున్నదన్న భయాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ కారణంగా వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా పోటెత్తడంతో ఆర్బీఐ కచ్చితంగా ఈ సమీక్షలో పావు శాతమైనా రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి, ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఉంటుంది. మరోపక్క, డీమోనిటైజేషన్ కారణంగా ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. ఈ స్వల్పకాలిక ప్రతికూలతల వల్లే ప్రస్తుత సమీక్షలో కాస్త ఆచితూచి రేట్లను యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సరళ పాలసీ విధానం కొనసాగుతుంది. రానున్న కాలంలో వెలువడే ప్రధాన ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తదుపరి పాలసీ చర్యలు ఉంటారుు’ అని ఆర్బీఐ పేర్కొంది. కాగా, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలవల్లే పాలసీ రేట్లను తగ్గించలేదా అన్న ప్రశ్నకు దాంతో సంబంధం లేదని ఉర్జిత్ పటేల్ పేర్కొనడం గమనార్హం. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కు... రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి(మార్చి) 5 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అరుుతే, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే రిస్కు ఉందని అభిప్రాయపడింది. 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ రద్దు... తాత్కాలికంగా కొత్త డిపాజిట్లపై 100 శాతం నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం)ను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి దీన్ని తొలగించనున్నామని పాలసీ సమీక్ష సందర్భంగా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి డిపాజిట్లు వెల్లువెత్తడంతో వాటిపై తాత్కాలికంగా సీఆర్ఆర్ను 100 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్ స్థిరీకరణ పథకం(ఎంఎస్ఎస్) కింద ప్రభుత్వ బాండ్ల జారీ పరిమితిని ఇటీవలే రూ.30 వేల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచిన నేపథ్యంలో ఈ 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ను తొలగించేందుకు ఆర్బీఐకి మార్గం సుగమం అరుుంది. దీంతో ఇకపై డీమోనిటైజేషన్లో భాగంగా బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లను(ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది) బ్యాంకులు తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి దోహదం చేస్తుంది. వృద్ధికి డీమోనిటైజేషన్ దెబ్బ... డీమోనిటైజేషన్ కారణంగా డిమాండ్ మందగించడంతో స్వల్పకాలానికి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభవం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) జీడీపీ వృద్ధి అంచనాలను 7.1 శాతానికి తగ్గించింది. గతంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6 శాతంగా ఉంది. ‘ప్రధానంగా నగదు లావాదేవీలపై అధికంగా ఆధారపడి ఉండే రిటైల్ వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణాతో పాటు అసంఘటిత రంగంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం తీవ్రంగా దెబ్బతినొచ్చు. ఈ రంగాల్లో డిమాండ్ దిగజారనుంది. దీంతో మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్దిని దిగజార్చవచ్చు. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వచ్చింది’ అని ఆర్బీఐ పేర్కొంది. పరిశ్రమవర్గాల నిరాశ... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచడంపై పరిశ్రమవర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే.. కుదేలవుతున్న పరిశ్రమకు ఊతమిచ్చేందుకు, పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడి ఉండేదని పేర్కొన్నాయి. ’ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఉండి ఉంటే పారిశ్రామిక ఎకానమీకి ఊతమిచ్చినట్లయ్యేది. డీమోనిటైజేషన్ కారణంగా వినియోగ డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే ఇటు వినియోగదారులకు, అటు పరిశ్రమకు తోడ్పాటు అందించినట్లయ్యేది’ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ న్యోతియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో దేశీ ఆర్థిక వ్యవస్థ నుంచే వృద్ధికి తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, వృద్ధి, రుణాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పైనా డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉందని అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోరియా చెప్పారు. కోతతో సెంటిమెంట్ మెరుగుపడేది.. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం ఉండేది. తగ్గించకపోవడం వల్ల మార్కె ట్ కాస్త నిరాశపడి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో డిమాండ్ గణనీయంగా పతనమైంది. డిమాండ్ పెరగాలంటే.. ఎకానమీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదనపు సీఆర్ఆర్ పెంపు తొలగింపు, మార్కెట్ స్థిరీకరణ పథకం కింద బాండ్ల జారీ పరిమితిని రూ. 6 లక్షల కోట్లకు పెంచడం పరిణామాలతో బ్యాంకులకు ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. వ్యవస్థలో ఆర్థిక స్థిరీకరణకు దోహదం చేస్తుంది. - అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఉదార విధానం.. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఉదార విధానం కొనసాగించింది. ఒకవైపు వృద్ధికి తోడ్పాటునిస్తూ.. మరోవైపు మధ్యకాలికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించడంపై దృష్టితో ద్రవ్యపరపతి విధానాన్ని స్థిరంగా ఉంచింది. అదనపు సీఆర్ఆర్ నిబంధన ఉపసంహరణ, లిక్విడిటీ నిర్వహణకు ఎంఎస్ఎస్ తదితర సాధనాలను ఉపయోగించడం మొదలైనవి స్వాగతించతగ్గ అంశాలు. రాబోయే రోజుల్లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్ల తగ్గుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయి. - చందా కొచర్, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్ డీమోనిటైజేషన్ ప్రభావాలపై ధీమా.. వృద్ధిపై డీమోనిటైజేషన్ ప్రభావాలు తాత్కాలికమైనవేనని, మధ్య-దీర్ఘకాలికంగా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని ఆర్బీఐకి ఉన్న ధీమాను పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించడం ప్రతిబింబిస్తోంది. - రాణా కపూర్, సీఈవో, యస్ బ్యాంక్ వేచి చూసే ధోరణి.. ఆర్బీఐ పావు శాతం పాలసీ రేట్లు తగ్గించవచ్చని చాలా మంది భావించారు. కానీ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులు ఎలా ఉంటాయో పరిశీలించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ వేచి చూసే ధోరణిని అవలంబించింది. - చంద్రశేఖర్ ఘోష్, చైర్మన్, బంధన్ బ్యాంక్ సాహసోపేత నిర్ణయం: ఆర్థిక శాఖ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ స్వాగతించింది. ‘అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం తగ్గుదలకు కొన్ని అటంకాలు నెలకొన్నాయి. ఇవన్నీ పరిశీలించే ఆర్బీఐ వేచిచూసే ధోరణితో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణరుుంచింది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ప్రజల అంచనాలకు భిన్నంగా ఉంది కాబట్టి.. ఇది సాహసోపేతమైన చర్యేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రణియన్ వ్యాఖ్యానించారు. అందుకే తగ్గించకపోరుు ఉండొచ్చు.. డీమోనిటైజేషన్ ప్రభావంతో వ్యవస్థలోకి గణనీయంగా నగదు వచ్చి చేరింది. ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత స్థారుులోనే తిరుగాడుతోంది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా రేట్లను తగ్గించి ఉంటే బోలెడంత ఊతంగా ఉండేది. అయితే, గత పాలసీ రేట్ల కోతల ప్రయోజనాల పూర్తి బదలారుుంపు కోసం ఆర్బీఐ బహుశా ఎదురుచూస్తుండవచ్చు. అందుకే రేట్ల కోత నిర్ణయం వాయిదా వేసి ఉండొచ్చు. ప్రస్తుతం నగదు లభ్యత బాగానే ఉంది.. అలాగే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం కూడా తగ్గనుంది కాబట్టి అవి ఇప్పుడిక వడ్డీ రేట్లు తగ్గించవచ్చు. - వీఎస్ పార్థసారథి, గ్రూప్ సీఎఫ్వో, ఎంఅండ్ఎం గ్రూప్ -
రూ. 1000 నోటుపై ఆర్బీఐ క్లారిటీ
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ నగదు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త నోట్లు సరఫరా చేశామన్నారు. తగినన్ని కొత్త నోట్లు సరఫరా చేస్తామని, ప్రజలు వీటిని దాచుకోవద్దని సూచించారు. నోట్ల రద్దు తర్వాత అధికారికంగా కొత్త నోట్ల సరఫరాపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 11.55 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు డిపాజిటయ్యాయని వెల్లడించారు. గత రెండు వారాలు 500, 100 రూపాయల నోట్ల ముద్రణ వేగవంతం చేసినట్టు చెప్పారు. వెయ్యి రూపాయిల నోటును తిరిగి ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నోట్ల కష్టాలు తీరిన తర్వాత నగదు ఉపసంహరణపై పరిమితులు తొలగిస్తామన్నారు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీటుపై నోట్ల రద్దు ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఆర్బీఐ తర్వాతి సమావేశం ఫిబ్రవరి 7-8 మధ్య ఉంటుందని తెలిపారు. -
ఆర్బీఐ గవర్నర్ జీతమెంతో తెలుసా..?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ నెల జీతమెంతో తెలుసా? గత సెప్టెంబరు 4న ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ తొలిసారి అక్టోబరు నెలకు పూర్తి నెల జీతం అందుకున్నారు. ఆయన 2.09 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు నెలకు అప్పటి గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఇంతే మొత్తంలో జీతం అందుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారు కోరిన మేరకు ఆర్బీఐ ఈ వివరాలు తెలియజేసింది. ఊర్జిత్ జీతం, సిబ్బంది వివరాలు, అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ జీతాల వివరాలను వెల్లడించింది. ఊర్జిత్ ప్రస్తుతం ముంబైలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫ్లాట్లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో పనిచేసేందుకు సహాయ సిబ్బందిని కేటాయించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఊర్జిత్కు రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్లను కేటాయించినట్టు తెలిపింది. ఊర్జిత్కు ముందు 2013 సెప్టెంబరు 5న ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన నెలకు 1.69 లక్షల రూపాయల జీతం తీసుకునేవారు. తర్వాత 2014లో ఆయన జీతం 1.78 లక్షలకు, 2015లో 1.87 లక్షల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో రాజన్ జీతాన్ని 2.09 లక్షల రూపాయలకు పెంచారు. రాజన్కు మూడు కార్లు, నలుగురు డ్రైవర్లు, తొమ్మిదిమంది సహాయ సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం గవర్నర్ ఊర్జిత్కు అంతే మొత్తంలో జీతం ఇస్తున్నా సహాయ సిబ్బందిని కేటాయించలేదు. -
కరెన్సీ కష్టాలను తొలగిస్తాం
• బ్యాంకుల వద్ద పరిస్థితులు మెరుగుపడ్డారుు • సామర్థ్యం మేరకు కొత్త నోట్ల ముద్రణ • పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు • ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడి • ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేయాలని సూచన ముంబై: నోట్ల రద్దు అనంతరం సామాన్యులు పడుతున్న కరెన్సీ కష్టాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తొలిసారిగా స్పందించారు. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సామా న్యుల ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా పటేల్ పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రెస్లు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు ‘‘ప్రింటింగ్ ప్రెస్లు కొత్తగా రూ.100, రూ.500 నోట్లను ముద్రించే పనిలో ఉన్నారుు. డిమాండ్ను చేరుకునేందుకు వీలుగా ప్రెస్లు పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తున్నారుు. ఈ సమయంలో ప్రజలు నగదుకు బదులు డెబిట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లను ఉపయోగించుకోవడం ప్రారంభించాలి. వీటితో లావాదేవీలు చౌకగా, తేలిగ్గా మారతారుు. దీర్ఘకాలంలో ఇది దేశానికి మేలు చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల స్థారుులో తక్కువ నగదు వినియోగం ఉన్న దేశంగా భారత్ మారుతుంది. వ్యాపారుల వద్ద పీవోఎస్ మెషిన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరుతున్నాం. దీంతో డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతుంది. బ్యాంకు శాఖల్లో, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గారుు. మార్కెట్లు తిరిగి యథావిధిగా పనిచేస్తున్నారుు. నిత్యావసరాల కొరత ఉన్న ట్టు ఎటువంటి సమాచారం లేదు. ఏటీఎంల్లో మార్పుల కోసం 50వేల మందిని రంగంలోకి దింపాం. నగదు లభ్యత తగినంత ఉంది. బ్యాంకులు నగదును శాఖలకు, ఏటీఎంలకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థారుులో పనిచేస్తున్నారుు. బ్యాంకుల సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలకు కృతజ్ఞతలు’’ అని ఉర్జిత్ పటేల్ అన్నా రు. నకిలీకి వీలుకాని నోట్లు.. ‘‘కొత్త నోట్ల సైజు, మందాన్ని ఎందుకు మార్చారని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ స్థారుులో మార్పులు చేయాలనుకున్నప్పుడు ఉత్తమ ప్రమాణాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుం ది. నకిలీకి వీలుకాని రీతిలో రూ. 2000, రూ. 500 నోట్లను డిజైన్ చేశాం’’ అని ఉర్జిత్ వివరించారు. నగదు రహితంవైపు మళ్లేందుకు... నకిలీ కరెన్సీ నోట్లపై కూడా ఇది ఒకరకమైన దాడే. వ్యాపారులు, ప్రజలను నగదు రహితం వైపు మళ్లించేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంకులు సైతం డెబిట్ కార్డుల చెల్లింపులపై చార్జీలను ఎత్తివేశారుు. లెక్కల్లోకి రాని ధనాన్ని కొందరు పెద్ద నోట్ల రూపంలో కలిగి ఉన్నారు. రియల్ ఎస్టే ట్ వంటి రంగాలను పన్ను ఎగవేతలకు ఉపయోగించుకుంటున్నారు’’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఒక్క రోజులో అయ్యేది కాదు.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు, వ్యాపారం తగ్గుదలపై ప్రశ్నకు ఉర్జిత్ స్పందించారు. ‘‘ఇది జీవిత కాలంలో ఒక్కసారి చోటుచోసుకునే ఘటన వంటిది. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. నోట్ల రద్దు విషయంలో పూర్తి గోప్యత అవసరం. ఈ రకమైన ఆపరేషన్ చాలా పెద్దది. ఇలాంటి సమయంలో బ్యాంకు లు అన్నింటినీ పూర్తి సర్వ సన్నద్ధం చేయడం 24 గంటల్లో సాధ్యమయ్యేది కాదు. అరుుతే, దీని వల్ల కొంత అసౌకర్యం ఉంటుందన్నది నిజమే. అందుకే పన్ను ఎగవేత, నల్లధనంపై పోరాటం కోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు. ఎప్పుడు సాధారణ పరిస్థితి...? పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ బదులిస్తూ... ‘‘పరిస్థితి మెరుగుపడిందని బ్యాంకులు అంటున్నారుు. మెట్రో నగరాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత ఇబ్బంది ఉన్నట్టు అవి చెబుతున్నారుు. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత పెరిగింది. రుణాలు మరింత సులభంగా లభిస్తారుు. సాధ్యమైనంత త్వరలో పరిస్థితులను సాధారణీకరించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం’’అని చెప్పారు. ఇంక్రిమెంట్ సీఆర్ఆర్ పెంచాం... ఆర్బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషి యో) 100 శాతం పెంచినట్టు ఉర్జిత్ పటేల్ వెల్లడిం చారు. ‘‘రద్దరుున రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో బ్యాంకు ల్లో భారీగా డిపాజిట్లు పెరిగిపోయారుు. నగదు లభ్యత పెరిగినందువల్ల తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) కింద బాండ్లను తగినంత విడుదల చేసిన వెంటనే సీఆర్ఆర్ పరిస్థితిని సమీక్షిస్తాం’’ అని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్పై జైరామ్ వ్యాఖ్యలు సరికాదు: జైట్లీ న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఆర్బీఐ గవర్నర్పై జైరామ్ రమేశ్ వ్యాఖ్యలు అన్యాయమని పేర్కొన్నారు. ఎవరైతే తమకు తాము మద్దతుగా అదే స్వరంతో స్పందించలేకుండా ఉంటారో... అటువంటి వారిపై వ్యాఖ్యలకు రాజకీయనేతలు దూరంగా ఉండాలని సూచిస్తూ జైట్లీ ట్విటర్లో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఓ ఆర్టికల్లో జైరామ్ రమేశ్ ఆర్బీఐను లక్ష్యంగా చేసుకున్న విష యం తెలిసిందే. ‘‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం అనూహ్య నిర్ణ యం తీసుకోవడం ద్వారా ఆర్బీఐని చీకట్లోకి నెట్టేసింది. నోట్ల రద్దు విషయమై ఆర్బీఐ సన్నద్ధత గురించి జాతిని తప్పుదోవ పట్టించడంలో ఉర్జిత్ పటేల్ అపరాధి అరుు ఉండవచ్చు లేదా ఆర్బీఐ స్వతంత్రను పణంగా పెట్టి ఉండవచ్చు. ఏదైనప్పటికీ ఆయన రాజీనామా చేయాలి’’ అని జైరామ్ రమేశ్ డిమాండ్ చేశా రు. దేశంలో ఆర్బీఐ మానిటరీ సంస్థ అని, అందరికీ బ్యాంకు నోట్లు అందుబాటులో ఉంచే బాధ్యత దానిపై ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
పెద్ద నోట్ల రద్దు; మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్
ముంబై: పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను రోజువారీగా సమీక్షిస్తున్నామని, కరెన్సీ కోసం ఇబ్బంది పడుతున్న నిజాయితీ పరుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిమాండ్కు తగినట్టుగా కరెన్సీని ప్రింట్ చేస్తున్నామని ఊర్జిత్ పటేల్ తెలిపారు. బ్యాంకుల్లో నగదు లభ్యత పెరిగిందని వెల్లడించారు. వీలైనంత త్వరలో ఇబ్బందులు తొలగిపోతాయని, సాధారణ పరిస్థితి వస్తుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఊర్జిత్ పటేల్పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు కరెన్సీ కోసం కష్టాలు పడుతుంటే ఊర్జిత్ స్పందించకపోవడంపై సామాన్యుల నుంచి ప్రతిపక్షాల వరకు తప్పుపట్టారు. ఇక నెటిజెన్ల అయితే ఊర్జిత్ పటేల్ అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. -
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అదృశ్యం!
కనిపించడం లేదంటూ ట్విట్టర్లో పోస్టు.. వైరల్ దేశంలో రూ. 500, వెయ్యినోట్లు రద్దుచేసి దాదాపు 15 రోజులవుతోంది. అయినా ఇప్పటికీ ప్రజలు నగదు కష్టాలు తొలిగిపోలేదు. దేశంలో ఎక్కడ కూడా తగినంత నగదు అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితులతో తీవ్రంగా చిరాకు పడుతున్న నెటిజన్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు ఆర్బీఐ గవర్నర్ ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉర్జిత్ కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారి.. తీవ్రంగా హల్చల్ చేస్తోంది. పెద్దనోట్ల రద్దుపై అనంతరం ఉర్జిత్ మీడియాలో కనిపించకపోవడాన్ని తప్పుబడుతూ.. ‘మిస్సింగ్.. మీరు ఉర్జిత్ను చూశారా’ అంటూ ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. ఉర్జిత్ ఫొటో పెట్టి.. ‘ఉర్జిత్ పటేల్, వయస్సు 53 ఏళ్లు. చివరిసారిగా ఆర్బీఐ భవనం వద్ద కనిపించాడు. అన్నింటినీ క్షమించేశాం. దయచేసి ఇంటికి రా. ఎవరైనా ఆచూకీ చెబితే రివార్డు ఇస్తాం. దయచేసి 01123710538 నంబర్కు కాల్ చేయండి’ అంటూ మధు మీనన్ చేసిన ట్వీట్ ఆనతికాలంలో వైరల్ అయింది. బహుశా తాను చేసిన పెద్ద పొరపాటుకు చింతిస్తూ ఉర్జిత్ ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటాడని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ బాధ్యత వహించాలన్న డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలిండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ ఉర్జిత్ను పదవి నుంచి పీకేయాలని డిమాండ్ చేసింది. MISSING PERSON. Please spread the word. Situation serious. pic.twitter.com/5Ll1ICHFzL — Madhu Menon (@madmanweb) 23 November 2016 -
‘బ్రహ్మచారి’ ఊర్జిత్ పెళ్లిపై ఊహాగానాలు!
న్యూఢిల్లీ: బ్రహ్మచారిగా భావిస్తున్న భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఊర్జిత్ పటేల్ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి. ఉర్జిత్కు పెళ్లయిందని, ఆయన భార్య స్వయానా ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ సోదరి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు చెలరేగాయి. ఊర్జిత్ భార్య, అంబానీ భార్య అక్కాచెల్లెళ్లు కావడంతో పెద్దనోట్ల రద్దు విషయంగా ముందుగానే అంబానీ కుటుంబానికి పొక్కిందంటూ కొందరు ఊహాగానాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న రూ. 500, రూ. వెయ్యినోట్లను రద్దుచేస్తున్నట్టు ఆకస్మికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ గవర్నర్ భార్యతో బంధుత్వం ఉండటం వల్ల ముకేశ్ అంబానీ కుటుంబానికి ముందే ఈ విషయం తెలియడంతో ఆయన జాగ్రత్త పడినట్టు ఊహాగానాలు చెలరేగాయి.. అయితే, అవన్నీ కట్టుకథలు, వట్టి వదంతులేనని తేలింది. ఊర్జిత్ కు నీతా అంబానీ సోదరికి ఎలాంటి సంబంధం లేదు. నీతా అంబానీకి ఒక సోదరి ఉన్నారు. ఆమె పేరు మమతా దలాల్. వారి తండ్రి రవీంద్రభాయ్ దలాల్ 2014 జూలైలో మృతిచెందారు. మమతా దలాల్ ముంబై బాంద్రాలోని ధీరూభాయ్ అంబానీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇక ఊర్జిత్ వివాహం విషయమై భిన్నభిప్రాయాలు నెలకొన్నాయి. ఊర్జిత్ పెళ్లయిందని, ఆయన భార్య కనన్ పటేల్ అని, వారికి ఇషాన్, ఇషికా అనే పిల్లలు ఉన్నారని ‘క్వింట్’లో ఓ కథనం పేర్కొంటున్నది. గూగుల్ సెర్చ్లో మొదట ఇదే దర్శనమిస్తున్నది. అయితే, నిజానికి ఆయన బ్రహ్మచారి అని ప్రొఫైల్ చెబుతున్నది. -
'ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి'
తిరుపతి : నోట్ల రద్దు విషయంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని సీపీఐ నేత కె.నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దుకు బాధ్యత వహిస్తూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలన్నారు. నిత్యావసర చిల్లర దుకాణాలలో పాత రూ.500,రూ.1000 నోట్లను అనుమతించాలన్నారు. నోట్ల మార్పిడి గడువు పెంచి, సరిపడినంత రూ.50, 100 నోట్ల అందించాలని కోరారు. ఈ దీక్షకు వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. -
'ఆరు నెలల నుంచి ముద్రిస్తే..ఆ సంతకం ఎలా?'
తిరుపతి : రూ.500, 1000 నోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణమే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో సోమవారం ఆయన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిత్యావసరాల కోసం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త నోట్లను ఆరు నెలల నుంచి ముద్రిస్తున్నామని కేంద్రం చెబుతున్నారు...రెండు నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఆ నోట్లపై ఎలా ఉందో చెప్పాలని భూమన ప్రశ్నించారు. -
ఆరేళ్ల కనిష్టస్ధాయికి వడ్డీ రేట్
-
ఆర్బీఐలో ‘పటేల్’ ఇన్నింగ్స్ షురూ
చడీచప్పుడు లేకుండా గవర్నర్గా అధికారిక బాధ్యతల్లోకి... ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్... ఎలాంటి మీడియా హడావుడి లేకుండా మంగళవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. గత గవర్నర్లకు భిన్నంగా చడీచప్పుడుకాకుండా ఈ కార్యక్రమం పూర్తయింది. అంతేకాదు తొలిరోజు విధుల్లోకి హాజరైన తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించకపోవడం గమానార్హం. రఘురామ్ రాజన్ మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించినప్పుడు అదేరోజు మీడియాతో మాట్లాడటమే కాకుండా.. ఆర్బీఐకి సంబంధించి పలు కీలక సంస్కరణలను కూడా ప్రకటించడం తెలిసిందే. వాస్తవానికి కొత్త గవర్నర్కు ఇప్పుడున్న గవర్నర్ బాధ్యతలను అప్పగించే కార్యక్రమం.. పూర్తిగా బహిరంగంగా జరుగుతుంది. మీడియా హడావుడి, ఫొటోలతో చాలా సందడిగా ఉంటుంది. గతంలో దువ్వూరి నుంచి రాజన్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగింది. అయితే, ఈ నెల 4న(ఆదివారం)తో రాజన్ పదవీకాలం ముగియడంతో అదేరోజు అధికారికంగా బాధ్యతలను చేపట్టినట్లేనని.. ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో అధికారికంగా బాధ్యతల స్వీకరణ, తొలిరోజు విధుల్లోకి హాజరు కార్యక్రమాలు మంగళవారం జరిగాయని ఆర్బీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆర్బీఐయే విడుదల చేయడం విశేషం. ఎందుకిలా... ఎలాంటి హడావుడీ లేకుండ పటేల్ బాధ్యతలు చేపట్టడానికి వెనుక కీలక సంకేతాలు ఉన్నాయంటున్నారు కొంతమంది పరిశీలకులు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించి కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడిన మాజీ గవర్నర్ రాజన్ తరహాలో ఇకపై ఆర్బీఐ గవర్నర్ వ్యవహరించబోరనేదానికి నిరాడంబరంగా పటేల్ బాధ్యతల స్వీకరణకే ప్రధాన సంకేతమని వారు అంటున్నారు. రాజన్ తొలిరోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం తెలిసిందే. అంతేకాదు ఆతర్వాత కూడా పలు అంశాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించారు కూడా. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం రాజన్ను గవర్నర్గా రెండో విడత కొనసాగించకపోవడానికి ఈ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమన్న వాదనలూ ఉన్నాయి. ఇక పటేల్ విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 2013 జనవరి నుంచి ఆర్బీఐలోనే డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తూ వస్తున్న ఉర్జిత్ను ఈ ఏడాది జనవరిలో అదే పదవిలో మరోసారి నియమించారు. చివరకు రాజన్ వారసుడిగా, 24వ గవర్నర్గా ఆయన బాధ్యతలను చేపట్టారు. డాక్టర్ పటేల్గా ఆర్బీఐలో సుపరిచితుడైన ఉర్జిత్.. ఆర్బీఐలో పలు కీలక కమిటీలకు నేతృత్వం వహించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీల్లోనూ పనిచేయడం గమనార్హం. మరోపక్క, ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా చేసింది ఉర్జిత్ పటేల్ కమిటీయే కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రాజన్ చేసిన పోరాటం, అదేవిధంగా బ్యాం కుల మొండిబకాయిల సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలను పటేల్ ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరమైన అంశం. అలా అయితే అక్టోబర్లో రేటు కోత: సిటీ ఆగస్టు నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం లోపునకు పడిపోతే, అక్టోబర్లో రెపో రేటుకోత పావుశాతం ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీగ్రూప్ తన తాజా నివేదికలో అంచనావేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.5%గా ఉంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 6.1%. అయితే ఆగస్టులో ఈ రేటు 5%కి తగ్గొచ్చనేది సిటీ గ్రూప్ అంచనా. తగిన వర్షపాతం, సరఫరాల సమస్య మెరుగుపడ్డం దీనికి కారణాలు కావచ్చని పేర్కొంది. డిప్యూటీ గవర్నర్ల బాధ్యతల్లో మార్పులు ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కొందరు డిప్యూటీ గవర్నర్ల పర్యవేక్షణా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ ఉర్జిత్ పటేల్ పర్యవేక్షించిన పరపతి విధాన శాఖను అత్యంత సీనియర్ అయిన ఆర్.గాంధీకి మార్చారు. రేటు నిర్ణయానికి సంబంధించి ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా గాంధీని నియమించే వీలుందని సమాచారం. మరో డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్, కార్పొరేట్ సర్వీసెస్, రిస్క్ మోనిటరీ శాఖలను పర్యవేక్షిస్తారు. డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా బ్యాంకింగ్ పర్యవేక్షణ, హెచ్ఆర్, ఫైనాన్షియల్ ఇన్క్లూషన్, గణాంకాలు, సమాచార నిర్వహణ విభాగాలను చూస్తారు. కాగా పటేల్ స్థానంలో కేంద్రం కొత్త డిప్యూటీ గవర్నర్ను నియమించాల్సి ఉంది. -
రూపాయి... 4 నెలల గరిష్టానికి
డాలర్తో 30 పైసలు వృద్ధి... 66.52కి చేరిక ముంబై: ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ శకం ప్రారంభమైన రోజే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కూడా ర్యాలీ జరిపింది. మంగళవారం ఒక్కరోజే డాలర్తో రూపాయి 30 పైసలు బలపడి నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 66.52కి చేరుకుంది. గత శుక్రవారం డాలర్తో రూపాయి 66.82 వద్ద ముగిసింది. అమెరికాలో బలహీన ఉద్యోగ గణాంకాలు వెల్లడైన దరిమిలా ఫెడ్ వడ్డీ రేట్ల భయాందోళనలు తగ్గిపోవడం రూపాయి ర్యాలీకి దోహదపడింది. విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరపడం సెంటిమెంట్ను బలపరిచింది. రూపాయి డాలర్తో లాభపడడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం. ఈ ఏడాది మే 11న రూపాయి ముగింపు 66.56గా ఉండగా ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తెరుచుకున్న ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 66.53 వద్ద ప్రారంభమైంది. ఆర్బీఐ 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడంతో సానుకూల సెంటిమెంట్ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో ఒక దశలో 66.47 వరకూ వెళ్లిన రూపాయి చివరికి 66.52 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 30 పైసలు (0.45శాతం) లాభపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకితోడు ఆసియా కరెన్సీలతోనూ డాలర్ బలహీనపడడం, విదేశీ నిధుల రాక రూపాయి బలపడడానికి కారణాలుగా ఓ ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. -
'మై నేమ్ ఈజ్ రాజన్.. రఘురాం రాజన్'
ఆర్బీఐ గవర్నర్గా అతి తక్కువకాలంలో తనదైన ముద్రవేసిన రఘురాం రాజన్ ఆదివారం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన వారసుడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పగ్గాలను ఉర్జిత్ పటేల్ చేపట్టారు. రాజన్ నిక్కచితనం గల ఆర్థికవేత్త. ముక్కుసూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆయన నైజం. చాలా అంశాల్లో ఆయన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ మళ్లీ తన పాతవృత్తి ఉపాధ్యాయ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. రాజన్ పలుసందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి. ఆయన మంచి బ్యాంకర్ కాదు.. హాస్య చతురత కలిగిన వక్త అని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. ఇప్పటికీ మనం సంతృప్తికరమైన స్థానాన్ని సాధించాల్సిన అవసరముంది. 'గుడ్డివాళ్ల దేశంలో ఒంటికన్నువాడే రాజు' అనే సామెత ఉంది. మనం అదే దారిలో సాగుతున్నాం. నేను వినాశకారినో, విషాద వ్యక్తినో కాదు వ్యవస్థతో మంచి సంబంధాలు కలిగిన సంపన్న అక్రమార్కులను ఎవరూ పట్టించుకోవడం లేదు. మనం నిరంతర వృద్ధి సాధించాలంటే అలాంటి వారికి రక్షణ కల్పించే సంస్కృతికి ఫుల్స్టాప్ పెట్టాలి. నన్ను మీరెలా పిలుస్తారో నాకు తెలియదు. శాంట్ క్లాజ్ అని పిలుస్తారో, లేక డేగ అని అంటారో కానీ, నా పేరు రఘురాం రాజన్. నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను. జేమ్స్ బాండ్ ఇమేజ్ కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, ముందుకునడింపించే బ్యాంకర్గా ఉండాలనుకుంటున్నా. బ్యాంకర్ దయ వల్ల కాదు.. డబ్బును సృష్టించాలన్న అతని ఆలోచన వల్లే మనకు ప్రతిరోజు ఉదయం ఆహారం దొరుకుతోంది. మనం డేగలం కాదు. పావురాళ్లమూ కాదు. మనం నిజానికి గబ్బిలాలం. అంచనాలు చాలా ఉన్నాయి. కానీ నేనేమీ సూపర్మ్యాన్ ని కాదు. భారత్లో ఇలాంటి కోలాహలం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. -
కొనసాగాలనే అనుకున్నా...
♦ కానీ ప్రభుత్వంతో అవగాహన కుదరలేదు.. ♦ ఆర్బీఐ గవర్నర్ రాజన్ వెల్లడి న్యూఢిల్లీ: రెండు రోజుల్లో (సెప్టెంబర్ 4) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మూడేళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న రఘురామ్ రాజన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. ఆర్బీఐ గవర్నర్గా మరికొంత కాలం కొనసాగాలనే అనుకున్నట్లు పేర్కొన్నారు. అరుుతే పదవీ బాధ్యతల పొడిగింపు విషయమై ప్రభుత్వంతో ‘‘తగిన విధమైన అవగాహనకు’’ రాలేకపోరుునట్లు పేర్కొన్నారు. నిజానికి పదవిలో కొనసాగే విషయమై చర్చలు జరిగాయని, ఒక దశ దాటి అవి ముందుకు సాగలేదని తెలిపారు. అరుుతే ఈ ‘‘అవగాహన’’ ఏమిటన్న విషయంపై ఆయన స్పష్టతను ఇవ్వలేదు. పూర్తి చేయాల్సిఉన్న పనులు ఇంకా మిగిలి ఉండడమే బాధ్యతల్లో కొనసాగాలనుకోవడానికి కారణమని అన్నారు. అరుునా తన బాధ్యతలను సంతృప్తిగానే విరమిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన ఉర్జిత్ పటేల్ గురువారంనాడు ముంబైలో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు. -
అది మూర్ఖత్వమే.. కొత్త గవర్నర్పై స్వామి వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: విదేశాలతో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ దిగిపోతున్న గవర్నర్ రఘురాం రాజన్ దుయ్యబట్టిన సుబ్రహ్మణ్యస్వామి.. కొత్త గవర్నర్గా నియమితులైన ఉర్జిత్ పటేల్ విషయంలో ఒకింత సానుకూల స్పందించారు. కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్ పటేల్ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి కొత్త గవర్నర్కు బీజేపీ ఎంపీ అయిన స్వామి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 'ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్3 (రఘురాం రాజన్) మాత్రం భారత్లో పుట్టి, అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు. -
రాజన్తో విభేదించిన దువ్వూరి
ముంబై: ఆర్బీఐ గవర్నర్కు నైతిక నియమావళి ఉండాలన్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయంతో మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విభేదించారు. ‘గవర్నర్ ఏ అంశాలపై మాట్లాడాలి అనే విషయంలో నైతిక నియమావళి ఉండాలని నేను అనుకోవడం లేదు. గవర్నర్ సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలి... ఇతర అంశాల జోలికి వెళ్లరాదు అంటూ వర్గీకరించడం సూచనీయం కాదు’ అని దువ్వూరి సుబ్బారావు ఇక్కడ జరిగిన తన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చెప్పారు. రాజన్లా ఆర్బీఐ గవర్నర్ మేధావి అయినప్పుడు అలాంటి అంశాలపై మాట్లాడడం మంచిదేనని, ఆమోదనీయమేనని అన్నారు. బల మైన ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు మేలు... గొడ్డుమాంసం తిన్నందుకు ఓ మతానికి సంబంధించిన వ్యక్తిని హత్య చేయడాన్ని ఖండించడం వంటి ఎన్నో అంశాలపై రాజన్ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
మోదీపై నేను ఏం మాట్లాడినా ప్రాబ్లమే!
న్యూఢిల్లీ: త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మాట్లాడేందుకు నిరాకరించారు. పలు అంశాలపై ప్రభుత్వ తీరును బాహాటంగా విమర్శించేరీతిలో గతంలో వ్యాఖ్యలు చేసిన రాజన్.. ప్రధాని మోదీపై తాను ఏం మాట్లాడినా అది సమస్యాత్మకం (ప్రాబ్లమేటిక్) అవుతుందని పేర్కొన్నారు. అసహనం మొదలు కేంద్రం ప్రతిష్టాత్మక పథకం 'మేకిన్ ఇండియా' వరకు రాజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బీబీసీతో 'ర్యాపిడ్ ఫైర్' తరహా ఇంటర్వ్యూలో మోదీ గురించి వివరించమని అడుగగా.. 'నేను ఈ ప్రశ్నను దాటవేయాలనుకుంటున్నాను. నేనేమీ చెప్పినా అది సమస్యాత్మకమే అవుతుంది. కనుక ఈ ప్రశ్నను పాస్ చేస్తాను' అని చెప్పారు. షికాగో యూనివర్సటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన వెంటనే తిరిగి తన పాత అధ్యాపక వృత్తికి తరలిపోతానని తెలిపిన సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై రాజన్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇరకాటంలో పడిన ప్రభుత్వం ఆయనను మరో పర్యాయం ఆర్బీఐ గవర్నర్గా కొనసాగించడానికి వెనుకాముందాడింది. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రెండోసారి ఈ పదవిలో కొనసాగబోనని రాజన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులూ.. వడ్డీరేట్లు తగ్గించండి!
• ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన • తన చివరి పాలసీలో రేట్లు యథాతథం • ద్రవ్యోల్బణం భయాలే ప్రాతిపదిక ముంబై: అందరూ ఊహించినట్లే కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. మంగళవారంనాటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ తన కీలక రుణ రేట్లు రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్ రేషియో... మూడింటినీ మార్పులేకుండా కొనసాగించింది. ద్రవ్యోల్బణ భయాల వల్లే రేట్లు తగ్గించలేదని ఆర్బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ఇంకా ఈ ఆందోళనలు తొలగిపోలేదన్నారు. అయితే ద్రవ్యోల్బణం తగ్గే పరిస్థితి ఉంటే రేటు కోత దిశలో మున్ముందు నిర్ణయం ఉంటుందన్నారు. ‘‘నిజానికి ఇప్పటివరకూ తగ్గించిన దాదాపు 1.50 శాతం రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదలాయించలేదు’’ అని పాలసీ సమీక్ష అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాజన్ చెప్పారు. ఇందుకు బ్యాంకులు తరచూ ఏదో ఒక కారణాన్ని చెబుతున్నాయన్నారు. తాజాగా ‘డాలర్ తరలిపోయే భయాల’ను చూపిస్తున్నాయన్నారు. ‘‘ఇలాంటి భయాలేవీ అక్కర్లేదు’’ అని భరోసా ఇచ్చారాయన. కాగా రేటు కోత ఉండదని ఊహించినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఈ దిశలో ఆర్బీఐ నిర్ణయం ఉంటుందని నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డారు. తక్షణం రేట్లు తగ్గించేది లేదు: బ్యాంకులు ఆర్బీఐ సూచించినప్పటికీ తక్షణం వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఏమీ లేవని బ్యాంకర్లు స్పష్టం చేశారు. వృద్ధి రేటు ఊపందుకుంటేనే రేటు తగ్గింపు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఆర్బీఐ రేటు కోతకు ప్రస్తుతం అవకాశం ఉందని పారిశ్రా మిక వేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరి అభిప్రాయాలను చూస్తే... అక్టోబర్ 4 ‘రేటు’కు మెజారిటీ బేస్.. రాజన్కు ఇది చిట్టచివరి పాలసీ సమీక్ష. సెప్టెంబర్ 4తో ఆయన పదవీ బాధ్యతలు ముగుస్తాయి. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2015 నుంచి మళ్లీ 6.5 శాతానికి తీసుకొచ్చారు. తదుపరి పాలసీ సమీక్ష అక్టోబరు 4న జరగనుంది. అయితే ఇప్పటిదాకా రేట్లపై గవర్నరు మాత్రమే నిర్ణయం తీసుకునే విధానం అక్టోబరు 4 నుంచి మారనుంది. ఆరుగురు సభ్యులు, ఆర్బీఐ గవర్నర్ కలిసి మెజారిటీ ప్రాతిపదికన ఇకపై నిర్ణయం తీసుకుంటారు. ‘రేటు నిర్ణయం’పై సభ్యులు సరిసమానంగా చీలిపోతే గవర్నర్ నిర్ణయం కీలకంగా మారుతుంది. ఆరుగురు సభ్యుల కమిటీని పరపతి విధాన కమిటీగా (ఎంపీసీ) వ్యవహరిస్తారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వం త్వరలో నియమిస్తుంది. ఆర్బీఐ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. కమిటీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు రాజన్ ఈ సందర్భంగా తెలిపారు. నా పదవీ కాలం అద్భుతం.. తన పదవీకాలాన్ని అద్భుతమైనదనిగా రాజన్ అభివర్ణించారు. ‘విమర్శకులు కానీయండి. మద్దతుదారులు కానీయండి. ఎవరికి అనిపించింది వారు చెబుతారు. వీటన్నింటికీ నేను ప్రాధాన్యమివ్వను. సామాన్యుడికి ఏది మంచిదో అదే చేశా. నా చర్యల ఫలితాలు ఐదు నుంచి ఆరేళ్ల కాలంలో కనబడతాయి. దేశ పటిష్ట, సుస్థిర వృద్ధి, ఉపాధి కల్పన, మధ్య, సామాన్య వ్యక్తి ఆదాయం ఇవన్నీ పాలసీ లక్ష్యాలు. నేను చేయాల్సిందంతా చేశాను. వాటి ఫలి తాలు వస్తేనే తెలుస్తాయి. ఇవి ఎలా ఉన్నాయన్నది వచ్చే ఐదారేళ్లలో చూస్తారు. ఏది మంచో, ఏది చెడో చెప్పే తీర్పును ఆ తరవాత ఇద్దాం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఎవరి వ్యాఖ్యలెలా ఉన్నా ఫలితాలే ముఖ్యమని రాజన్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 4 తరువాత భవిష్యత్పై ఇంకా ప్రణాళికలు రూపొం దించుకోలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆప్ చికాగోలో పూర్వపు బాధ్యతల నిర్వహణ నుంచి భారత్ ఆర్థిక అంశాలపై పరిశోధనల వరకూ వివిధ అంశాలు పరిశీలనలో ఉన్నట్లు సూచించారు. రాజన్ చివరి పాలసీ సమీక్ష సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి వచ్చిన ఆయన కుమార్తె, కుమారుడుఊహించిందే... పాలసీ ముఖ్యాంశాలు... ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం. ⇔ 2017 జనవరి నాటికి ద్రవ్యోల్బణం రేటు అంచనా 5 శాతం. పెరిగే అవకాశాలే అధికం. ⇔ సాధారణ వర్షపాతం, 7వ వేతన కమిషన్ సిఫారసులు వృద్ధి రేటును పెంచుతాయి. ⇔ వస్తు, సేవల పన్ను అమలు పెట్టుబడులు, వ్యాపార సెంటిమెంట్కు సానుకూలం. ⇔ ఆగస్టు 5 నాటికి రికార్డు స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు. 365.7 బిలియన్ డాలర్లు. ⇔ జీఎస్టీ వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆలోచనలు ఇప్పటికి ఆలోచనలే. ⇔ సెప్టెంబర్లో 26 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్ (బీ) రిడమ్షన్ల వల్ల బ్యాంకింగ్ ద్రవ్యలభ్యత (లిక్విడిటీ)కు ఎటువంటి విఘాతం కలుగదు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఇలాంటి సమస్య ఏదీ తలెత్తకుండా ఆర్బీఐ జాగరూకత వహిస్తుంది. ⇔ బ్యాంకులు తమ రేటు ప్రయోజనాన్ని కొంతమొత్తమే కస్టమర్లకు బదలాయించాయి. ⇔ కేవైసీ గురించి ఆర్బీఐ వెబ్సైట్లో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ⇔ తాజా డిపాజిట్ రేటు ప్రాతిపదికన రుణ రేటుకు సంబంధించి ‘మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు ఫ్రేమ్వర్క్’ను మరింత పటిష్టం. ⇔ బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య తీవ్రమైనదే అయినా... పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇవీ కీలక రేట్లు... ⇔ బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో. ప్రస్తుతం ఇది 6.5 శాతం. ⇔ బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే డిపాజిట్లపై వాటికి ఆర్బీఐ చెల్లించేది రివర్స్ రెపో. ప్రస్తుతం ఇది 6 శాతం. ⇔ బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిష్పత్తే క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రస్తుతమిది 4%. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే పాలసీ విధానం ఉంది. వృద్ధి మెరుగుపడుతూ, వచ్చే కొద్ది నెలల్లో రుణ వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటున్న పక్షంలో వడ్డీరేట్లు కూడా తగ్గే వీలుంటుందని నేను విశ్వసిస్తున్నా. ద్రవ్యలభ్యతకు గవర్నర్ హామీ బ్యాంకింగ్కు సానుకూల అంశం. - ఆరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ లిక్విడిటీపై హామీ హర్షణీయం బ్యాంకింగ్కు ఎటువంటి ద్రవ్య లభ్యత సమస్యా రాకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్న హామీ స్వాగతనీయం. ద్రవ్యోల్బణం తగ్గుదల సంకేతాలతో రేట్లు తగ్గుదల చోటుచేసుకుంటుందని ఆర్బీఐ సూచించింది. ఇవి వృద్ధికి సత్ఫలితాలను ఇస్తుంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ వచ్చే నెలల్లో రేటు కోత...! ప్రస్తుతం లేకున్నా... సమీప భవిష్యత్తులో రేటు కోత ఉంటుందని భావిస్తున్నా. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రభుత్వ వ్యవస్థాపరమైన చర్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 50-100 బేస్ పాయింట్ల మేర రేటు కోతకు వీలు కల్పిస్తాయని భావిస్తున్నా. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. - రాణా కపూర్, యస్ బ్యాంక్ తగిన సమయం... వృద్ధి వేగం పుంజుకుంటోంది. రేటు తగ్గింపునకు ఇది తగిన సమయం. సమీప భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి వేగం పుంజుకోవడానికి వడ్డీరేట్ల కోత అవసరం. ప్రభుత్వ చర్చలు, తగిన వర్షపాతంతో త్వరలో రేటు కోతకు వీలుంది. - హర్షవర్ధన్ నోటియా, ఫిక్కీ -
విమర్శకులపై మండిపడ్డ రఘురాం రాజన్
ముంబై: ద్రవ్యోల్బణం కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ తనపై విమర్శిస్తున్న వారిపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ద్రవ్యోల్బణం కట్టడి కన్నా ఆర్థిక వృద్ధి మీదనే ఎక్కువ దృష్టి పెట్టానని విమర్శించే ముందు.. ఎలా ద్రవ్యోల్బణాన్ని కనిష్ఠాస్థాయికి తగ్గించాలో చూపాలని ఆయన సవాల్ చేశారు. ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శలు ఊసుపోని డైలాగులేనని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వ విధానాల పట్ల తరచూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసే రాజన్.. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంలో ఇలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయని, వరుసగా రెండు కరువులు, బలహీనంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఎలాంటి బహ్య పరిణామాలు ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంలో ఆటంకాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చిక్కులున్నా భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు చాలా బాగుందని, రుతుపవనాలు బాగుండి, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే.. మన వృద్ధిరేటు మరింతగా పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన అనుభవాలను వివరిస్తూ త్వరలోనే తనకు పుస్తకం రాసే ఆలోచన లేదని రాజన్ స్పష్టం చేశారు. -
రాజన్ వారసుడిగా.. పనగరియా?
ఈ వారంలోనే ఆర్బీఐ కొత్త గవర్నర్ ప్రకటన! న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వారసుడిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా నియమితులు కానున్నారా? దీనికి సంబంధించిన ప్రకటన ఈ వారంలోనే వెలువడనున్నదా? అవుననే అంటున్నాయి ఆర్థిక వర్గాలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్గా అరవింద్ పనగరియా పేరు దాదాపు ఖరారయింది. ఈయనతోపాటు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు సుబీర్ గోకర్ణ్, రాకేశ్ మోహన్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వంటి ప్రముఖులు కూడా పోటీలో ఉన్నా... పనగరియావైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చాక ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4న ముగుస్తుంది. ఏడీబీ చీఫ్ ఎకనమిస్టుగానూ.... ♦ అరవింద్ పనగరియా గతేడాది జనవరి 5న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ♦ అంతకు ముందు ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేశారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల్లో విధులు నిర్వహించారు. ♦ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంశంలో పనగరియాకు అపార అనుభవం ఉంది. ♦ 2012 మార్చిలో పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. స్వస్థలం రాజస్థాన్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో పీహెచ్డీ పొందారు. -
అరుంధతి ఔట్!
న్యూఢిల్లీ: తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి రెండుకు కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి. అరుంధతి భట్టాచార్య, ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జులై 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తి కావచ్చని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు ఆరుగురుతోనూ, ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ జాబితా నుంచి తొలగించింది. ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పక్కన పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ ఫైనల్ రేసులో మిగిలారు. మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆలస్యంగానైనా...
భారత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండేళ్లకు నరేంద్ర మోదీ తొలిసారిగా సోమవారం మీడియాతో మాట్లాడటం ఆహ్వానించదగిన మార్పు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన, పలు వివాదాస్పద అంశాలపైన ప్రధాని అభిప్రాయాలను ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్న సమయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి బదులు ఆయన ఒక ప్రైవేటు టీవీ చానల్తో మాట్లాడాలని భావించడం ఆశ్చర్యకరమే. ఏది ఏమైనా ఎన్ఎస్జీ నుంచి ఉగ్రవాదం వరకు, విదేశాంగ విధానం నుంచి వివిధ సామాజిక ఆర్థిక సమస్యల వరకు పలు అంశాలు ఆ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చాయి. అయితే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్పై బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి చేసిన వ్యాఖ్యాలపై ప్రధాని స్పందనే పతాక శీర్షికలకు ఎక్కడం విశేషం. రాజన్ దేశభక్తిని శంకించడాన్ని మోదీ ఖండించడమేగాక, ఆర్బీఐ గవర్నర్గా ఆయన ప్రశంసనీయమైన కృషిచేశారని స్పష్టం చేశారు. రాజన్కు రెండో దఫా అవకాశం ఇవ్వరాదంటూ సాగిన ప్రచారానికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేయగలిగారు. యూపీఏ హయాం నాటి రాజన్పైనే గాక ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శాంతికాంత దాస్లపైన కూడా స్వామి దాడి సాగించారు. తమ పార్టీకే చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు బాధ్యతారహితంగా రాజేసిన దుమారాన్ని మోదీ కేవల ప్రచార విన్యాసాలుగా కొట్టిపారేసి, మీడియా అలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వరాదని హితవు పలికారు. సంచలనాత్మకతకు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే ప్రముఖులకు ప్రాధాన్యాన్నిచ్చే ధోరణి మీడియాలో ఉన్న మాట వాస్తవమే. అలాంటి పెడ ధోరణులకు దూరంగా ఉండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నదనేదీ వాస్తవమే. కానీ నూట ఇరవై ఐదు కోట్ల ప్రజలను పాలించే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పార్టీకి తమ నేతలు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణాయుతంగా వ్యవహరించేట్టు చేయవలసిన బాధ్యత లేదా? రాజన్ను రెండో దఫా గవర్నర్గా నియమించడంపై రెండు నెలలుగా అవాంఛనీయమైన రభస జరుగుతుండగా మిన్నకుండి... మరో దఫా ఆ బాధ్యతలను స్వీకరించేది లేదని ఆయన ప్రకటించిన తర్వాత ప్రధాని నోరు విప్పడంలోని ఔచిత్యం ఏమిటనే సందేహం తలెత్తదా? ఆలస్యంగానైనా ప్రధాని ఆర్బీఐ గవర్నర్పై, ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేతలు నోరు పారేసుకోరాదనే హెచ్చరికను పంపడం ఆహ్వానించదగిన పరిణామాలు. స్వామి విషయంలోలాగే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్న కొందరు మంత్రులు, బీజేపీ నేతల విషయంలో కూడా మీడియా వారిని పట్టిం చుకోకపోతే, వారిని హీరోలను చేయకపోతే వారే దారికి వస్తారని ప్రధాని హితవు చెప్పడం, ఈ సమస్యకు కూడా అభివృద్ధే పరిష్కారమని సరిపుచ్చడం విభ్రాం తికరం. అలాంటివారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశంలోని మైనారిటీలలో ప్రత్యేకించి ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచుతున్న వాస్తవాన్ని ఇలాంటి దాటవేతలు కప్పిపుచ్చలేవు. అందుకు రుజువన్నట్టుగా ఈనెల 10న హరియాణాలో గోమాం సాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోసంరక్షణ కార్యకర్తలు పట్టుకుని చితగ్గొట్టి, గోమూత్రాన్ని తాగించి, పేడ తినిపించిన హేయమైన ఘటన వీడియో తాజాగా వెలుగు చూసింది. గత ఏడాది గోమాంసం తిన్నారన్న ఆరోపణపై ఒక వ్యక్తిని కొట్టి చంపేసిన దాద్రీ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తదుపరి రక్షణ స్థితిలో పడ్డట్టనిపించిన ప్రభుత్వం, బీజేపీ ఆ తదుపరి పట్టనట్టు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమౌతున్నాయి. అందుకు మీడియా కారణం గానే హీరోలవుతున్నారని ప్రధాని అంటున్న నేతలే ఆజ్యం పోస్తున్నారు. అధికార పార్టీలో అంతర్మథనం, పునరాలోచన అవసరమైన ఒక పెద్ద సమస్యను కేవలం మీడియాకు సంబంధించిన సమస్యగా చూపడం ద్వారా ప్రధాని దేశానికి అనుద్దేశ పూర్వకంగానే అయినా తప్పుడు సంకేతాలను పంపారు. యువత, ప్రత్యేకించి పట్టణ, విద్యాంతులైన యువత ఇలాంటి వైషమ్యపూరిత, సంఘర్షణాత్మక వాతా వరణాన్ని కోరుకోవడం లేదు. ప్రధానే అన్నట్టు 30 ఏళ్ల తర్వాత ప్రజలు కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వానికి పట్టంగట్టారు. మోదీ తెస్తానన్న మార్పులో విశ్వాసం ఉంచారు. పట్టణ, విద్యావంతులు సహా యువత మోదీపై ఆశలను పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓట్లతో, కేవలం 31 శాతం ఓట్లతో లోక్సభలోని 520 స్థానాలలో 283 స్థానాలను గెలుచుకోగలిగింది. 18-22 ఏళ్ల ప్రాయంలోని నవ యువత 47 శాతం మోదీకి ఓటు చేశారని అంచనా. ఏటా కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామన్న వాగ్దానాన్ని యువత విశ్వసించింది. అది కష్టసాధ్యమైన లక్ష్యమే అయినా ఆ కొలబద్దతోనే వారు మోదీ పని తీరును చూస్తారు. కాగా, 2014-15లో కేవలం 5,00,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే, 2015-16లో ప్రథమార్థ భాగంలో మరింత అధ్వానంగా అది 95,000కు దిగజారింది. 2019 ఎన్నికల నాటికి 12.5 కోట్ల మంది కొత్త ఓటర్లు కీలక తీర్పరులుగా మారనున్నారు. విదేశీ పర్యటనలకే ప్రాధాన్యాన్నిస్తూ జాతీయ సమస్యలపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారనే విమర్శలను ప్రధాని తరచుగా ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మోదీ ఇంటర్వ్యూలో విదేశాంగ విధానం, గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఆర్థికరంగ మెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణాన్ని, ప్రత్యేకించి అనూహ్యంగా పెరిగిన పప్పుల ధరలను నియంత్రించడంపై ప్రధాని భరోసాను కల్పించలేకపోయారు. విదేశాలలో దాచిన నల్లధనాన్ని రప్పించి భారత పౌరులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15,00,000 జమ చేస్తామన్న బీజేపీ వాగ్దానంపై సైతం మోదీ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. పైగా గత ప్రభుత్వం వైఫల్యాలను ఏకరువు పెట్టారు. బ్యాంకుల మొండి బకాయిలవల్ల మన బ్యాంకింగ్ వ్యవస్థకు ఉన్న ముప్పు ఆరు నెలల కంటే నేడు మరింత పెరిగిందని తాజా ఆర్బీఐ ఫైనాన్సియల్ స్టెబిలిటీ రిపోర్ట్ పేర్కొంది. మన బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీసున్న ఈ మొండి బకాయిలపై ప్రధాని ప్రభుత్వ వైఖరిని స్పష్టపరచలేదు. ఏదిఏమైనా మీడియా ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ దిశగా ప్రధాని మోదీ వేసిన ఈ తొలి అడుగును స్వాగతించాల్సిందే. -
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?
న్యూఢిల్లీ : తదుపరి ఆర్బీఐ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్గా కొనసాగరని స్పష్టం కావడంతో రాజన్ వారసుడి ఎంపికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు సీనియర్ అధికారి రాయిటర్స్ కి చెప్పారు. కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన జాబితాను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత ఉన్నతోద్యోగులు కాగా, మరొకరు స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య . ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు. ఒకవైపు ఎస్ బీఐ అధిపతి అరుంధతి భట్టాచార్య ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత, నైపుణ్యంలేవని వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ బీఐ అత్యున్నత పదివికి అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్ దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని రాజన్ స్పష్టం చేయడంతో కేంద్ర బ్యాంకు ఉన్నత పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది. వీరిలో బలంగా వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది. -
ఇటు రెగ్జిట్.. అటు బ్రెగ్జిట్!
ఈ వారం మార్కెట్పై ప్రభావం న్యూఢిల్లీ: బ్రెగ్జిట్కంటే ముందు రెగ్జిట్(ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ వైదొలగడం-రాఘురామ్ ఎగ్జిట్-రెగ్జిట్) ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. ఆర్బీఐ గవర్నర్గా రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేనని రఘురామ్ రాజన్ ప్రకటించడంతో నేడు స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అటుతర్వాత బ్రెగ్జిట్పై ఇన్వెస్టర్లు దృష్టిమళ్లిస్తారని వారన్నారు. యూరోపియన్ యూనియన్లో కొనసాగాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ ఈ వారంలోనే(జూన్ 23-గురువారం) చోటు చేసుకోవడం అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం బాగానే చూపించవచ్చనేది వారి అభిప్రాయం. వీటికి తోడు నైరుతి రుతుపవనాల విస్తరణ, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ప్రారంభంలో ప్రతికూల ప్రభావం ఆర్బీఐ గవర్నర్గా రెండోసారి రఘురామ్ రాజన్ కొనసాగింపుపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో... రెండోసారి గవర్నర్గా తాను సుముఖంగా లేనని రాజన్ చెప్పడం స్వల్పకాలంలో స్టాక్మార్కెట్, కరెన్సీ, బాండ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజన్ నిర్ణయం అశుభవార్త అని జియోజిత్ బీఎన్పీ పారిబా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వి. కె. విజయ్కుమార్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ వైదొలిగే అవకాశాలుండడం, తదనంతర పరిణామాల పట్ల ప్రపంచమంతా ఆందోళనలు నెలకొన్న సమయంలో రాజన్ నిర్ణయం రాంగ్ టైమ్లో వచ్చిందని వివరించారు. స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల నేటి ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఈ ప్రతికూల ప్రతిస్పందన స్వల్పకాలమే ఉంటుందని, భారత ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండడమే దీనికి కారణమని వివరించారు. ఈ ప్రారంభ ప్రతికూల ప్రభావం నుంచి గట్టెక్కగలిగే సత్తా దేశీయ ఆర్థిక వ్యవస్థకు, ఆర్బీఐకు ఉన్నాయని నిపుణులంటున్నారు. ఉద్వేగపూరితమైన షాక్.. రాజన్ నిర్ణయం ఉద్వేగపూరిత షాక్ను సృష్టిస్తుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. అయితే ఈ షాక్ నుండి త్వరగానే తేరుకునే పరిపక్వత మార్కెట్లకు ఉందని పేర్కొన్నారు. రాజన్ తీసుకున్న మంచి నిర్ణయాలను ఆయన తర్వాత వచ్చే గవర్నర్ కొనసాగిస్తారన్న అంచనాలున్నాయని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరుకు మరిన్ని మంచి చర్యలు తీసుకోగలరన్న అంచనాలున్నాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈడీ, కుంజ్ బన్సాల్ చెప్పారు. రుతుపవనాల విస్తరణ, బ్రెగ్జిట్... ఈ రెండు అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను నిర్ణయిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. బ్రె గ్జిట్ అంశం పూర్తయ్యేవరకూ దేశీయ స్టాక్ మార్కెట్ విదేశీ స్టాక్ మార్కెట్ను అనుసరిస్తుందని, ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఒడిదుడుకులమయంగా సాగిన గత వారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 10 పాయింట్లు క్షీణించి 26,626 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు రూ.4,394 కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ నెలలో కూడా విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వర్షాలు విస్తారంగా కురుస్తాయనే అంచనాలతో ఈ నెల 16వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.4,394 కోట్ల పెట్టుబడులు పెట్టారు. రూ.1,607 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. ‘రెగ్జిట్’ ప్రకంపనలకు సెబీ రెడీ... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజన్ రెండోవిడత కొనసాగకుండా నిష్ర్కమిస్తూ తీసుకున్న నిర్ణయం(దీన్నే రెగ్జిట్గా పిలుస్తున్నారు) దేశీ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్లతో ఏవైనా భారీ హెచ్చుతగ్గులు సంభవిస్తే.. దాన్ని ఎదుర్కోవడానికి సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు తమ నిఘా, నిర్వహణ యంత్రాంగాలను మరింత కట్టుదిట్టం చేశాయి. బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లు కూడా డాలర్లకు డిమాండ్ అనూహ్యంగా ఎగబాకితే.. తగిన సరఫరా కోసం సన్నద్ధమవుతున్నారు. రాజన్ వైదొలగడం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని.. బాండ్, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
రాజన్ను తక్షణం తొలగించండి
♦ ప్రధానికి సుబ్రమణ్యస్వామి లేఖ ♦ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక వ్యవస్థను ♦ ముందుకు వెళ్లనీయలేదని విమర్శ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా గ్రీన్ కార్డ్ పొందిన రాజన్... మానసికంగా పూర్తి భారతీయుడు కాదని, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. తక్షణం ఆయనను ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. రాజన్ను చికాగో తిరిగి పంపేయాలని స్వామి గతవారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానికి తాజాగా లేఖ రాశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నియమించిన వ్యక్తిని ఇప్పుడూ కీలక బాధ్యతల్లో కొనసాగించడం సరికాదని అన్నారు. ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వహించడానికి దేశానికి చెందిన అనేకమంది నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల రీత్యా రాజన్ను తక్షణం తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని అధిక వడ్డీరేట్ల వ్యవస్థలో దీర్ఘకాలం ఉంచడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగం మందగించడం తన డిమాండ్కు ప్రధాన కారణమని వివరించారు. కేవలం రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు రెట్టింపై రూ.3.5 లక్షల కోట్లకు చేరడం దారుణమని పేర్కొన్నారు. సెప్టెంబర్లో ముగియనున్న బాధ్యతలు... రాజన్ మూడేళ్ల బాధ్యతలు సెప్టెంబర్ మొదటివారంలో ముగియనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేసిన రాజన్కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్లీవ్’ ఫ్రొఫెసర్గా ఉన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50% తగ్గించారు. దీనితో ఈ రేటు 6.5%కి దిగివచ్చింది. చేయాల్సింది చాలా ఉందని ఇటీవలే పేర్కొన్న రాజన్.. రెండోసారి కొనసాగడానికి సిద్ధమని ఇటీవలే సంకేతాలు ఇచ్చారు. -
‘హెలికాప్టర్ మనీ’ అవసరం ఉందా?!
♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ కేంద్ర బ్యాంకుల మధ్య చర్చకు పిలుపు లండన్: ‘హెలికాప్టర్ మనీ’ విధాన అవసరం నిగ్గుతేలాల్సి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనిపై సెంట్రల్ బ్యాంకుల మధ్య చర్చ జరగాల్సి ఉందని పిలుపునిచ్చారు. ‘హెలికాప్టర్ మనీ’ విధానానికి సంబంధించి రాజకీయ సంబంధ అంశాలు... ఆర్థిక ప్రయోజనాలు అన్నింటిపై చర్చ జరగాలని అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేసిన ఒక ప్రసంగం సందర్భంగా రాజన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందా? లేక సంక్షోభాలకు సమాధానం లభిస్తుందా? అన్న అంశంపై లోతైన చర్చ జరగాల్సి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ అన్నారు. హెలికాప్టర్ మనీ అంటే... ప్రస్తుత సంపద, నిర్దిష్టకాలంలో వృద్ధి అవకాశాలు వంటి పలు పటిష్ట అంశాల ప్రాతిపదికన తగిన స్థాయిలో కరెన్సీ ముద్రణ జరుగుతుంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా... సెంట్రల్ బ్యాంకులు భారీగా ద్రవ్య ముద్రణ చేసి... దానిని వ్యవస్థలోకి వెదజల్లడమే‘హెలికాప్టర్ మనీ’ విధానంగా పేర్కొంటున్నారు. 2008 ఆర్థికమాంద్యం నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ భారీగా నిధులను ముద్రించి దానిని వ్యవస్థలోకి పంపింది. తక్కువ వడ్డీరేట్లతో మార్కెట్లలోకి భారీ నిధులు కుమ్మరించడం ద్వారా పలు రంగాల్లో తాజా పెట్టుబడులు జరిగేలా చూడటం, దీంతో ఉపాధి అవకాశాలు పెంపొందించడం... ‘హెలికాప్టర్ మనీ’ విధానం ఉద్దేశం. అయితే దీనివల్ల పలు దేశాల్లో కరెన్సీ విలువలు భారీగా పడిపోవడం, ద్రవ్యోల్బణం వంటి పలు ఆర్థిక సవాళ్లు ఏర్పడ్డాయి. ఇలా ముద్రించిన డబ్బును తిరిగి వ్యవస్థలోంచి వెనక్కు తీసుకుంటే తలెత్తే పరిణామాలు సానుకూలంగా ఉంటాయా? లేక ప్రతికూలంగా ఉంటాయా? అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఈ ‘హెలికాప్టర్ మనీ’ విధానాన్ని 1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రెడ్మన్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. 2002లో మరో అమెరికా ఆర్థికవేత్త, ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాకీ దీనిని ప్రస్తావించడంతో ఈ పదం తిరిగి వెలుగులోకి వచ్చింది. 2006లో ఆయన అమెరికా ఫెడరల్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని ఆయన అమల్లోకి సైతం తీసుకువచ్చారు. ‘ట్రాఫిక్ సిగ్నల్’ వ్యవస్థ! ఒక దేశం ద్రవ్య విధానం... ఇతర దేశాల ద్రవ్య విధానాలపై ప్రతికూల ప్రభావం పడకుండా సెంట్రల్ బ్యాంకులకు సంబంధించి ఒక ‘ట్రాఫిక్ సిగ్నల్’ తరహా వ్యవస్థ ఉండాలని రాజన్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. -
ఎవరిపని వారు చేసుకుని చూడండి!
♦ బ్యూరోక్రాట్స్కు ఆర్బీఐ గవర్నర్ సూచన ♦ ‘సామాన్యుని’ గురించి మరింత ♦ అవగాహన పెరుగుతుందని వ్యాఖ్య ముంబై: బ్యూరోక్రాట్స్ తమ సహాయకుల సేవలు తీసుకోకుండా ఒకరోజు తమకుతాము తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనివల్ల ‘సామాన్యుని’ గురించి మరింత అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యూరోక్రాట్లు తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోడానికి సైతం ఈ చర్య దోహదపడుతుందని ఆయన అన్నారు. సెక్రటేరియట్లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వైబీ చవాన్ స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్బీఐలో బ్యూరోక్రాట్లు తమకుతాముగా కొన్ని సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఒక వ్యవస్థను ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల తమ కిందివారు కార్యకలాపాల నిర్వహణలో ఎదుర్కొనే ఇబ్బందులు... వ్యవస్థలో ఇమిడి ఉన్న క్లిష్టత వంటి అంశాలు ఉన్నతస్థాయి అధికారులకు అర్థమవుతాయని అన్నారు. తనతోసహా చాలామంది అధికారులకు పదవీ విరమణ చేసిన తర్వాతే.. వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు అర్థం అవుతుంటాయని ఆయన పేర్కొన్నారు. సహాయకులు ఎవ్వరూ లేకపోవడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఉన్నత స్థాయి అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయ డానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో- రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. పీ2పీ లెండింగ్పై సెబీతో సంప్రదింపులు.. ఇదిలావుండగా పీర్-టూ-పీర్ (పీ2పీ) లెండింగ్ నిబంధనలు ఖరారుచేసి, సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరేముందు దీనిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో సంప్రదింపులు జరుపుతామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ఇక్కడ ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆన్లైన్ సేవల ద్వారా వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించే ప్రక్రియను మరింత పటిష్ట పరచడమే పీ2పీ లెండింగ్ లక్ష్యం. పారదర్శకత మెరుగుపడ్డం, రుణ ప్రక్రియలో నెలకొనే అనవసర జాప్యం, వ్యయాల నియంత్రణ వంటి అంశాలు లక్ష్యంగా ఈ విధానంపై బ్యాంకింగ్ కసరత్తు జరుగుతోంది. ఇది అటు వినియోగదారులకు ఇటు బ్యాంకింగ్కు ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు. ఈ విధానాంశాలను ప్రజల అభిప్రాయాల కోసం త్వరలో ఆర్బీఐ వెబ్సైట్లో ఉంచుతామని కూడా ఆయన పేర్కొన్నారు. -
'చలామణిలో 60 వేల కోట్లు'
ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల పంపకం విపరీతంగా పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్ అన్నారు. సుమారు రూ.60 వేల కోట్లు చలామణిలో ఉందని చెప్పారు. మంగళవారం ద్రవ్య, పరపతి విధాన సమీక్ష ప్రకటన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో ప్రజల వద్ద డబ్బుల గలగల ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మీకూ తెలుసు.. నాకు తెలుసు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రూపాయిని ‘తక్కువ’ చేసేది లేదు
ఆర్బీఐ గవర్నర్ రాజన్ తిరువనంతపురం: వృద్ధి సాధన దిశగా చైనా, జపాన్ తదితర దేశాల బాటలో రూపాయి మారకం విలువను తక్కువ స్థాయిలో ఉంచే యోచనేది కేంద్రానికి గానీ తమకు గానీ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఇలాంటి ధోరణులు భవిష్యత్లో అనేక సమస్యలకు దారి తీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల 4వ సదస్సును ప్రారంభించిన సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. కరెన్సీ మారకం విలువను ఉండాల్సిన దానికన్నా తక్కువ స్థాయికి (అండర్వేల్యుయేషన్) పరిమితం చేయడం వల్లే చైనా, జపాన్, కొరియా వంటి దేశాలు అధిక వృద్ధి సాధించగలిగాయని, భారత్ కూడా అదే బాటలో వెళ్లాలని పలువురు భావిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల తలెత్తే సమస్యలు ఆయా దేశాల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. సుదీర్ఘకాలం కరెన్సీ విలువ తక్కువ స్థాయిలోనే ఉంచడం సాధ్యం కాదని, అలాగే వృద్ధి సాధనకు అనుసరించతగిన వ్యూహమూ కాదని రాజన్ చెప్పారు. కాబట్టి మారకం విలువను పెంచి, తగ్గించి మాయ చేసే కన్నా.. ఎక్కువ హెచ్చుతగ్గులకు లోను కాకుండా సముచిత స్థాయిలో స్థిరంగా ఉండేలా చూడాలన్నదే ఆర్బీఐ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్పీఏలను మరీ కఠిన ం చేస్తే ... మొండిబకాయిల (ఎన్పీఏ) నిర్వచనాలను, నిబంధనలను మరీ కఠినతరం చేస్తే ఖాతాల వాస్తవ పరిస్థితులు ఇన్వెస్టర్లకు తెలియకుండా పోయే ప్రమాదముందని, అందుకే దీనిపై ఆర్బీఐ సుముఖంగా లేదని రాజన్ చెప్పారు. ఎన్పీఏ నిబంధనలను స్థిరంగా ఉంచడమే ప్రయోజనకరమని, తరచూ మొండి బకాయిల నిర్వచనాలు మార్చేస్తుంటే ప్రధాన లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. వ్యాపారవేత్తల నిధుల సమీకరణకు తోడ్పడేలా విశిష్ట గుర్తింపు కార్డు లాంటిది ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనితో చిన్న సంస్థలకు రుణ సమీకరణ సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. భారత ఎకానమీ అభివృద్ధికి.. ఉపాధి కల్పనకు చిన్న సంస్థలు కీలకమని, వాటికి సమాన అవకాశాలు లభించేలా చూడాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. కేవలం స్టార్టప్స్కే కాకుండా చిన్న సంస్థల ఎదుగుదలకు అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన చెప్పారు. -
ఆర్బీఐ గవర్నర్ మనసు దోచిన గోల్కొండ
హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే చారిత్రక గోల్కొండ కోట అందాలు భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మదిని దోచాయి. రాజన్ శుక్రవారం కుటుంబసమేతంగా కోటను సందర్శించారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన 'సౌండ్ అండ్ లైట్ షో'ను తిలకించి మంత్రముగ్దులయ్యారు. 'అద్భుతమైన ప్రదర్శనిది. ఇక్కడ గొప్ప వాతావరణాన్ని సృష్టించారు. మీరు చరిత్రను సజీవంగా ఉంచున్నారు' అంటూ పర్యాటక శాఖను కొనియాడుతూ సందర్శకుల పుస్తకంలో రాజన్ తన సందేశాన్ని రాశారు. -
రాజన్వైపు మార్కెట్ చూపు
ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఆధారంగా ట్రెండ్ * నిపుణుల అంచనా న్యూఢిల్లీ: సెప్టెంబర్ 29నాటి రిజర్వుబ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష వైపు మార్కెట్ చూపు వుందని, వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. కీలక రెపో రేటును పావుశాతం తగ్గించవచ్చన్న మెజారిటీ అంచనాలు మార్కెట్లో వున్నాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.66 శాతం కనిష్టస్థాయికి తగ్గడం, జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితం కావడం వంటి అంశాలవల్ల రేట్ల కోత అంచనాలు ఊపందుకున్నాయని ఆయన వివరించారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గతవారం వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదావేయడం, స్థానికంగా ద్రవ్యోల్బణం తగ్గడం వంటి అంశాలతో ఇక్కడ ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్బీఐ పాలసీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి మారకపు విలువ హెచ్చుతగ్గులు మార్కెట్ను ప్రభావితం చేస్తాయని క్యాపిటల్వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గాంధీ జయంతి కారణంగా వచ్చే శుక్రవారం మార్కెట్లకు సెలవు. దాంతో ఈ వారం మార్కెట్లో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. కాగా, సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకూ దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 6,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి రికార్డుస్థాయిలో రూ. 17,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గతవారం మార్కెట్.. గతవారం యూరప్ మార్కెట్లు బాగా క్షీణించడంతో ఇక్కడ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ 355 పాయింట్లు తగ్గింది. చివరకు 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. -
'ఇతర మార్కెట్ల కంటే మనమే బెటర్'
ముంబై: స్టాక్ మార్కెట్ల పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. భారత్ వద్ద 355 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్టు తెలిపారు. సోమవారం ముంబైలో జరిగిన బ్యాంకింగ్ సమావేశంలో రాజన్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు కనిష్ట స్థాయిలో ఉంటాయని రాజన్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని అన్నారు. కొత్త ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కొత్త బ్యాంకులకు లైసెన్స్లు మంజూరు చేశామని రాజన్ తెలిపారు. -
ఆర్బీఐ ప్రతిపత్తికి విఘాతం తగదు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తికి ఎటువంటి విఘాతం కలగనీయరాదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ- ఆర్బీఐ సన్నిహిత సహకారంతో కార్యకలాపాలు నిర్వహిం చాలని సూచించారు. ఆర్థికమంత్రిగా (1991-1996), ఆర్బీఐ గవర్నర్గా(1982-85) కూడా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వడ్డీరేట్లు, కేంద్రం బ్యాంక్ నుంచి కొన్ని అధికారాలను బదలాయించాలన్న ప్రతిపాదనలు తత్సం బంధ అంశాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ-ఆర్బీఐ మధ్య విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్న మన్మోహన్ ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. అటు ఆర్థికశాఖ, ఇటు ఆర్బీఐ రెండూ అత్యున్నత ప్రాముఖ్యత గలిగిన విభాగాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ, వీటి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే ప్రకటించిన విషయాన్నీ ప్రస్తావించారు. -
ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు ఈ-మెయిల్
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్కు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనకు ఒక ఈ- మెయిల్ వచ్చినట్టుగా సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బెదిరింపులు రావడంతో రాజన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఈ విషయాన్ని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఈమెయిల్లో రాజన్కు బెదిరింపు లేఖ వచ్చిందని మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కేపీ బక్షి తెలిపారు. అయితే ఈమెయిల్ వివరాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఈమెయిల్ అందిన తర్వాత ఆర్బీఐ అధికారులు క్రైంబ్రాంచి పోలీసులకు విషయం తెలిపారు. సైబర్ క్రైం విభాగం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తోంది. ఈమెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది. -
కీలక వడ్డీ రేట్లు యధాతథం
ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే రెపోరేట్, సీఆర్ఆర్ యధాతథంగా ఉంటాయని పేర్కొంది. ఎస్.ఎల్.ఆర్ను 50 బేసిస్ పాయింట్లుకు తగ్గించింది. ఇది ఇలా ఉండగా మంగళవారం ముంబై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని వెల్లడించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. ఆర్బీఐ ప్రకటనలో స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా పయనిస్తున్నాయి. -
తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం
‘మేక్ ఇన్ ఇండియా’పై ఆర్బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు చైనాను అనుసరించడం మంచిదికాదు... ఇరు దేశాల్లో పరిస్థితులు భిన్నమైనవి... న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. చైనాలో సత్ఫలితాలిచ్చిందన్న కారణంతో మనం కూడా తయారీ రంగాన్నే ఎక్కువగా ప్రోత్సహించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎగుమ తి ఆధారిత వృద్ధి బాటను ఎంచుకున్న చైనాను అనుసరిస్తూ.. మేక్ ఇన్ ఇండియా పేరుతో కేవలం తయారీ రంగంపైనే అధికంగా దృష్టికేంద్రీకరించడం ప్రమాదకరం. ఇలా నిర్ధిష్టంగా ఒకే రంగాన్ని ప్రోత్సహించాల్సి న అవసరం లేదని నేను భావిస్తున్నా. చైనాతో మన దే శాన్ని పోలిస్తే... కాలమాన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భిన్నమైనవి. అయితే, దేశీ మార్కెట్ కోసం తయారీని ప్రోత్సహించేలా ‘మేక్ ఫర్ ఇండియా’గా మార్చితే బాగుంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. మనకు సరిపడదు...: భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. దీనిపై ఆర్బీఐ గవర్నర్ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు మనం తయారీ ఎగుమతులపై దృష్టికేంద్రీకరిస్తే.. ముందుగా చైనాతో పోటీపడాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ప్రపంచం మరో చైనా వంటి చౌక తయారీ హబ్ను కోరుకోవడం లేదన్నారు. ‘భారత్ కంటే అనేక ఏళ్లకు ముందే ఈ విధమైన వృద్ధి బాటను చైనా సహా ఆసియాలోని కొన్ని దేశాలు ఎంచుకున్నాయి. ఇదే వ్యూహాన్ని మనం అమలు చేయడం సులువేమీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఎగుమతి కేంద్రంగా మారాలంటే.. ఎగుమతిదారులకు భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ముడిసరుకులను చౌకగా లభించేలా చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా కరెన్సీ మారకం విలువను తక్కువస్థాయి(అండర్వేల్యూ)లో కొనసాగించాల్సి ఉంటుంది. ఇవన్నీచూస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా అనేది మనకు సరిపడదు’ అని రాజన్ పేర్కొన్నారు. దేశీ డిమాండ్పై దృష్టిపెట్టాలి... దేశీయంగా ఏకీకృత మార్కెట్ను సృష్టించేందుగా ముందుగా ఇక్కడి డిమాండ్ను చేజిక్కించుకోవడంపై కంపెనీలు దృష్టిపెట్టాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రతిపాదిత వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) వల్ల పన్నుల గందరగోళానికి తెరపడుతుంది. తద్వారా అసలైన జాతీయ మార్కెట్ ఆవిర్భవిస్తుంది. రానున్న సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది చాలా కీలకం కూడా’ అని రాజన్ వ్యాఖ్యానించారు. పొదుపును ప్రోత్సహించాలి... దేశీయంగా ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం బడ్జెట్లో తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలని రాజన్ సూచించారు. ‘దేశీ పొదుపు మొత్తాల నుంచే పెట్టుబడులకు భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని పెట్టుబడుల కోసం ప్రభుత్వం తీసుకునే పొదుపు ప్రోత్సాహక చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయి. మన బ్యాంకులు మొండిబకాయిల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టుల మదింపులో గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. రుణాల మంజూరులో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే.. ఆర్థిక వ్యవస్థ అసలైన అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది’ అని రాజన్ చెప్పారు. ఇప్పటిదాకా బడ్జెట్లలో వ్యక్తిగతంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు వాస్తవానికి వాళ్లకు నిజమైన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని.. అందువల్ల ఈసారి పొదుపు పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా, ద్రవ్యోల్బణాన్ని సాధ్యమైనంతవరకూ కనీస స్థాయిలో స్థిరంగా ఉంచడమే ఆర్బీఐ లక్ష్యమని.. దీనివల్ల వృద్ధికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 2-6 శాతం శ్రేణిలో పరిమితమ య్యేలా చూసేందుకు ప్రభుత్వంతో ఆర్బీఐ చర్చిస్తోందని ఈ సందర్భంగా రాజన్ వెల్లడించారు. -
రాజన్.. ఐదో‘సారీ’
ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం ఈఎంఐల భారం ఇప్పట్లో తగ్గే అవకాశం లేనట్లే! రెపో 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు.. వచ్చే ఏడాది ఆరంభంలో రేట్లు తగ్గొచ్చని సంకేతం.. పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి.. వడ్డీరేట్లు తగ్గించాలంటూ నలువైపుల నుంచీ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాత్రం దిగిరాలేదు. పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించారు. బ్యాంకర్లు కూడా రుణ రేట్లలో కోతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. దీంతో గృహ, వాహన , ఇతరత్రా రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారాన్ని రుణ గ్రహీతలు ఇంకొన్నాళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, వచ్చే ఏడాది తొలినాళ్లలో రేట్ల కోత ఉండొచ్చంటూ ఆర్బీఐ సంకేతాలివ్వడం కాస్త సానుకూలాంశం. ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిర్ణయం వెలువడింది. మంగళవారం చేపట్టిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లలో మార్పుల్లేవని ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు ఇప్పుడున్న 8 శాతం వద్ద, దీనికి అనుసంధానమైన రివర్స్ రెపో రేటు 7 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. కాగా, పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయంపై కార్పొరేట్ ఇండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా రేట్లను తగ్గించమని చెబుతున్నా.. రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోవడం లేదని కార్పొరేట్లు వ్యాఖ్యానించారు. మరోపక్క, తమ డిపాజిట్, రుణాలపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ చేయబోమని బ్యాంకర్లు పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 5.52 శాతానికి దిగిరావడం, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి తగ్గడంతో ఈసారైనా ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక రంగం గంపెడాశలు పెట్టుకుంది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం(బ్యారెల్ 68 డాలర్లు) కూడా రేట్ల కోతకు సానుకూలాంశమని కార్పొరేట్లు వాదించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(తొలి త్రైమాసికంలో 5.7%) తగ్గిన నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధికి చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మద్దతుగా మాట్లాడటం తెలిసిందే. అయితే, బ్యాంకర్లు, విశ్లేషకులు మాత్రం ప్రస్తుతానికి పాలసీ రేట్లు యథాతథంగానే ఉంటాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే రాజన్ నిర్ణయం వెలువడింది. పాలసీ సమీక్షలో ఇతర ముఖ్యాంశాలివీ... చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) ఇప్పుడున్న 22 శాతం వద్దే కొనసాగుతుంది. పస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5% ఉండొచ్చు. 2015 మార్చి చివరినాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా (గతంలో 8 శాతంగా అంచనా వేసింది). నవంబర్లో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ... డిసెంబర్లో పుంజుకోవచ్చు. పన్ను వసూళ్లు మందకొడిగా ఉన్న నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడం (ఈ ఏడాది 4.1 శాతం) కష్టసాధ్యం కావచ్చు. తదుపరి సమీక్ష 2015 ఫిబ్రవరి 3న జరుగుతుంది. రుణ పునర్వ్యవస్థీకరణ నిబంధనల సడలింపు మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు రుణాల పునర్వ్యవస్థీకరణ నిబంధనలను సడలించనున్నట్లు రాజన్ చెప్పారు. ప్రస్తుతం రుణాల పునర్వ్యవస్థీకరణ జరిపే కంపెనీల్లో బ్యాంకులకు 10 శాతాన్ని మించి ఈక్విటీ వాటాను తీసుకోకుండా పరిమితి ఉంది. దీన్ని త్వరలోనే సాధ్యమైనంతమేర పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు తాజా రుణాలకు కూడా 5/25 నిబంధనను అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిప్రకారం ఏదైనా ఇన్ఫ్రా కంపెనీకి బ్యాంకులు 25 ఏళ్ల కాలపరిమితితో కొత్త రుణాలిచ్చేందుకు వీలవుతుంది. ఈ రుణాన్ని ఐదేళ్ల తర్వాత వేరే బ్యాంకు/ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం లేదా రుణ ఒప్పందాలను మార్చుకోవడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి త్రైమాసికంలో చిన్న, పేమెంట్ బ్యాంకులకు లెసైన్స్లు జారీ చేసే అవకాశం ఉందని రాజన్ వెల్లడించారు. ఇటీవలే దీనికి సంబంధించి తుది మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ.. ఔత్సాహిక సంస్థలు, వ్యక్తులు లెసైన్స్లకు దరఖాస్తు చేసుకోడానికి 2015 జనవరి 16ను ఆఖరి తేదీగా నిర్ధేశించింది కూడా. రేట్ల తగ్గింపునకు ఇది సమయం కాదు: రాజన్ ఆర్బీఐ పాలసీ ధోరణిలో మార్పునకు(రేట్ల కోత) ఇది తగిన సమయం కాదని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగపడితే(ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రాజన్ చెప్పారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం అంచనాలు, ధోరణి ఆధారంగా ఆర్బీఐ విధానం ఉంటుంది. అంతేకానీ, ఒక సమీక్షలో రేట్లను తగ్గించడం.. తర్వాత వెంటనే మళ్లీ పెంపు.. ఇలాంటి దోబూచుల పద్ధతిని తాము అనుసరించబోమని పేర్నొన్నారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వాలన్న విజ్ఞప్తులను ఆర్బీఐ పట్టించుకోవడం లేదన్న కార్పొరేట్ల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇదంతా వాళ్ల దురభిప్రాయమని తేల్చిచెప్పారు. ‘పారిశ్రామిక వర్గాలు దూరదృష్టితో కాకుండా సంకుచిత ధోరణితో ఆలోచిస్తున్నాయి. ఆర్బీఐ వృద్ధికి వ్యతిరేకం కాదు. ఎల్లప్పుడూ సాధ్యమైనంతమేరకు పటిష్టమైన వృద్ధినే కోరుకుంటుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కూడా మా బాధ్యత. లేదంటే అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితులు మళ్లీమళ్లీ చోటుచేసుకుంటాయి’ అని రాజన్ పేర్కొన్నారు. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం రానున్న కాలంలో మరింత తగ్గుముఖం పట్టే అవశాలున్నాయని.. వచ్చే 12 నెలల వ్యవధిలో సగటున 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి.. ఆతర్వాత కాలంలో 4% (2% అటూఇటూగా) లక్ష్యాన్ని నిర్దే శించుకుంటున్నామన్నారు. ప్రస్తుత లక్ష్యం 6%. ఒక్క బంగారంలోనే పెట్టుబడి పెట్టొద్దు... బంగారం దిగుమతులపై సుంకంలో ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని రాజన్ సంకేతాలిచ్చారు. పుత్తడి దిగుమతులకు అడ్డుకట్టకోసం ప్రభుత్వం సుంకాన్ని 10%కి పెంచడం తెలిసిందే. పసిడి దిగుమతుల నియంత్రణకు అమలు చేసిన 80:20 స్కీమ్వల్ల పెద్దగా ఉపయోగం లేనందువల్లే ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు. దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతాన్ని ఎగుమతి చేసిన తర్వాతే తదుపరి దిగుమతులకు అనుమతించడమనేది ఈ 80:20 స్కీమ్ ఉద్దేశం. ఇన్వెస్టర్లు ఒక్క బంగారానికే తమ పెట్టుబడులన్నీ కేటాయించవద్దని.. ఇతర ఆర్థిక సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని రాజన్ సూచించారు. వృద్ధికి ఆర్బీఐ సహకరించట్లేదు: కార్పొరేట్లు మందగమనంలో ఉన్న వృద్ధిని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సహకరించడంలేదని పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇబ్బందుల్లో ఉన్న తయారీ రంగానికి వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. వచ్చే పాలసీ సమీక్ష కంటే ముందే రేట్ల తగ్గింపు ద్వారా వృద్ధికి చేయూతనిస్తుందని భావిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నిర్ణయం నిరాశ పరిచిందని రియల్టర్ల సంఘం క్రెడాయ్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ లేకపోగా వ్యయాలు మాత్రం భారీగా పెరిగాయని చెప్పారు. చౌక గృహాలకు డిమాండ్ పెంచేందుకు వీలుగా వడ్డీరేట్లలో రాయితీ, పన్నుల తగ్గింపు రూపంలో తమకు ప్రభుత్వం సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డీ రేట్లు తగ్గించం: బ్యాంకర్లు ఆర్బీఐ అనుసరించిన యథాతథ విధానాన్నే తామూ అమలు చేస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు. రుణాలు అదేవిధంగా డిపాజిట్లపైన కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాల్లేవని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. కాగా, వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 6 శాతానికి కుదించడం చూస్తే.. సరళ పాలసీవైపు ఆర్బీఐ అడుగులేస్తోందనేందుకు నిదర్శనమన్నారు. అధిక వడ్డీ రేట్లకు బ్యాంకులే కారణమని, మనీ మార్కెట్ ద్వారా పొందే ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదిలీ చేయడం లేదంటూ రాజన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మనీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం చాలా స్వల్పమే కావడం వల్ల బదలాయించేంత స్థాయిలో ప్రయోజనాలేమీ బ్యాంకులకు ఒనగూరవని చెప్పారు. కాగా, అధిక మొండిబకాయిల కారణంగా బ్యాంకుల మార్జిన్లు తగ్గుతున్నాయని.. ప్రస్తుతానికైతే వడ్డీరేట్ల కోతకు ఆస్కారం లేదని యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ పేర్కొన్నారు. -
నల్లధనం ఎంత ఉందో ఎవ్వరికీ తెలియదు:ఆర్బీఐ గవర్నర్
గుజరాత్: విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం ఎంతన్నదీ ఎవరికీ తెలియదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న నల్లధనంపై ఇప్పటికే పలు ఊహాగానాలు సాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదాయం పన్ను రేట్లను మరింత తగ్గించడం ద్వారా అక్రమ నిధుల తరలింపును తగ్గించవచ్చని ఆయన సూచించారు. డాక్టర్ వర్గీస్ కురియన్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన రాజన్ మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకోవడాన్ని అరికట్టే అంశంపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.ఇందుకు ఎగువ తరగతి వారికి పన్ను రేట్లు ప్రోత్సాహకరంగా ఉండేలా చర్యలు చేపడితే నల్లధనం అంశాన్ని అరికట్టే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పేదల నుంచి లాభాలు పిండుకోవద్దు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ హితవు ముంబై: సమాజంలో అట్టడుగునున్న నిరుపేదల నుంచి కూడా లాభాలను పిండుకోవడం తగదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ(ఎంఎఫ్ఐ)లనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంబంధించిన రుణాల విషయంలో ఎంఎఫ్ఐలు అధిక లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఎంఎఫ్ఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురు సీకే ప్రహ్లాద్ రాసిన ‘ద ఫార్చూన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్’ అనే పుస్తకంలో అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా రాజన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కంపెనీలు పేదల లక్ష్యంగా వస్తు, సేవల వ్యాపారాల నిర్వహణ కోసం అనుసరించాల్సిన కొత్త వ్యాపార విధానాలను ప్రహ్లాద్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ప్రహ్లాద్ తన పుస్తకంలో అట్టడుగున సంపద దాగి ఉందంటూ పేర్కొనడం ద్వారా పేదలపై నిర్దయతో వ్యవహరించారని భావిస్తున్నా. నిరుపేదల నుంచి ఎవరైనాసరే ఎలా లాభాలు దండుకుంటారు. తమ వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు అవసరమైనమేరకే స్వల్ప లాభాలకు పరిమితం కావాలనేదే నా ఉద్దేశం. ఎడాపెడా లాభాలు పిండుకుంటే అది సమాజంలో ఆందోళనలు పెరిగేందుకు దారితీస్తుంది. ప్రహ్లాద్ చెప్పిన మేనేజ్మెంట్ పాఠాలతో చాలా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మారుమూల మార్కెట్లలోకి చొచ్చుకెళ్లాయి. ముఖ్యంగా దేశంలోని కన్సూమర్ గూడ్స్, వాహన, టెలికం కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. అయితే, ఎవరైనాసరే నిరుపేదలకు సేవల విషయంలో అధిక లాభాపేక్షలేకుండా వ్యవహరించాలి’ అని రాజన్ అన్నారు. -
వృద్ధి సంకేతాలు బాగున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కానీ దీన్ని స్థిరంగా ఎలా కొనసాగించాలన్నదే అత్యంత కీలకమైన అంశమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యలోటు అదుపులోకి రావడం, పారిశ్రామికోత్పత్తిలో వృద్ధి కనిపించడం, ఆయిల్, బంగారం కాకుండా ఇతర ఎగుమతుల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి అంశాలన్నీ వృద్ధిపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ ఏడాది 5.5 శాతం వృద్ధిని, వచ్చే ఏడాది 6 శాతం ఆ తర్వాత ఏడు శాతం వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులతో జరిగిన చర్చాగోష్టి కార్యక్రమంలో రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ వృద్ధిరేటు మరింత పైకి పెరగాలంటే ప్రభుత్వ సంస్కరణల తోడ్పాటు అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వృద్ధిపై భారీ అంచనాలను పెట్టుకున్నారని, దీన్ని అందుకోవాలంటే కీలక సంస్కరణలు తప్పవన్నారు. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం అంటే.. రుణ లభ్యత, నిబంధనలు, స్కిల్డ్ లేబర్ను అందుబాటులోకి తీసుకొస్తే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త మానిటరీ పాలసీని విధానాలను రూపొందిస్తున్నామన్నారు. స్టార్ట్అప్స్, చిన్న కంపెనీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలను ఇచ్చే ఆలోచనలో ఉందన్న మరో విద్యార్ధి ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక కంపెనీ ఎదగడానికి అందుకు కావల్సిన వాతావరణం ఏర్పాటు చేయాలే కాని సబ్సీడీలు మార్గం కాకూడదన్నారు. అందరికీ సబ్సిడీలు ఇస్తే దాన్ని భరించే వారు ఎవరని, అందుకే సబ్సీడీలకు ఆర్బీఐ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఆర్థిక సంస్థ సరిగి పనిచేయకపోతే దీని ప్రభావం బాగా పనిచేసే సంస్థపై పడుతోందని, ఇటువంటి పనిచేయని సంస్థలను మూసివేయడం కోసం ఫైనాన్షియల్ రిజల్యూషన్ అథార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఫ్రా కంపెనీల్లో పెరిగిపోతున్న ఎన్పీఏలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెపుతూ ఎన్పీఏ నిబంధనలు మార్చితే బ్యాలెన్స్ షీట్లు మెరుగు అవుతాయే కానీ, సమస్యకు పూర్తి పరిష్కారం రాదన్నారు. ఇన్ఫ్రా ఎన్పఏలను కొనుగోలు చేయడానికి త్వరలోనే కొత్త అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్బీఐ బోర్డు దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై హైదరాబాద్లో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమీక్షించింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితి, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ వంటి విషయాలపై సమీక్ష జరిపినట్లు ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సుమారు ఏడేళ్ల తర్వాత హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమీక్షా సమావేశంలో ఆర్బీఐ డెరైక్టర్లు అనిల్ కకోద్కర్, కిరణ్ కార్నిక్, నచికేత్ మోర్, వై.హెచ్.మలేగామ్, జీ.ఎం.రావు, ఇందిరా రాజారామన్, దమోదర్ ఆచార్యాలతో పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు హరున్ ఖాన్, ఆర్.గాంధీ, ఎస్.ఎస్.ముంద్రా పాల్గొన్నారు. -
బ్యాంకులు సహకరించట్లేదు..
* ‘మాఫీ’ రైతులకు కొత్త రుణాలపై ఆర్బీఐ గవర్నర్తో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రిజర్వ్బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్... రైతులకు రుణాలివ్వని అంశంపై తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని, అన్ని సమస్యలూ సర్దుకునేలా చూస్తానని కేసీఆర్కు హామీ ఇచ్చారు. బుధవారం ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆయన ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగావ్యవసాయ రంగంతో పాటు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరముందని కేసీఆర్ వారితో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రఘురాం రాజన్... ఆర్బీఐ పరిధిని మరింత విస్తృతపరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణ వితరణతో పాటు మరింత సహకారం అందించడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఆర్బీఐ త్వరలో చిన్న బ్యాంకులకు అనుమతులు ఇవ్వనుందని..ఆ బ్యాంకులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలిచ్చేలా చూస్తామని వివరించారు. కొత్త రాష్ట్రం.. సహకరించండి.. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టిందని.. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్కు కేసీఆర్ వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులివ్వడానికి సీఎం కార్యాలయంలోనే ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటికే మూడు లక్షల ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల క ల్పనకు చ ర్యలు తీసుకుంటున్నామని... పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. దీనికి రఘురాం రాజన్ బదులిస్తూ... ఎలాంటి సంకోచం లేకుండా తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులను రుణాలు కోరవచ్చని, అవసరమైన మేర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని, అవసరమైన నిధులను నాబార్డు నుంచి ఇప్పించేలా చూడాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ ఆర్బీఐ గవర్నర్ను కోరారు. హైదరాబాద్ పరిశ్రమల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిందని, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ పనితీరు భేష్.. కొద్ది నెలల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు బాగుందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభినందించారు. ముఖ్యమంత్రి చేసిన పలు ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు. -
కెసిఆర్తో భేటీ అయిన RBI గవర్నర్
-
'ఏపీ పరిస్థితి ఆర్బీఐ గవర్నర్కు వివరించాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ను కోరినట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో రఘురాం రాజన్తో భేటీ అనంతరం యనమల, సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజన్కు వివరించినట్లు చెప్పారు. అలాగే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సాధికారిత కార్పోరేషన్ గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్లు అనుసంధానం చేసిన తమ ప్రభుత్వానికి రాజన్ అభినందనలు తెలిపారన్నారు. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని గవర్నర్ రాజన్ తమను కోరారని యనమల, సుజనా చౌదరి వెల్లడించారు. -
'రుణమాఫీకి ఆర్బీఐ గవర్నర్ ఒప్పుకోలేదు'
-
'రుణమాఫీకి ఆర్బీఐ గవర్నర్ ఒప్పుకోలేదు'
విజయవాడ: పంట రుణాల మాఫీకి రిజర్వు బ్యాంకు గవర్నర్ ఒప్పుకోలేదని, కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 20 శాతం రుణమాఫీ నిధులను ఈ నెల 22న బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. మిలిగిన 80 శాతం నిధులను వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి 20 శాతం చొప్పున చెల్లిస్తామని వెల్లడించారు. నూతన రాజధానికి రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భూముల సేకరణ విషయంలో సర్కారుకు సహకారం అందించాలని కోరారు. ఫించన్ల వివరాలను కంప్యూటరీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. -
మందకొడి పాలనవల్లే.. వృద్ధి పతనం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి మందకొడి పాలన, సహజ వనరుల కేటాయింపుల్లో తప్పిదాలే కారణమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. రాజకీయ స్థిరత్వం ఏర్పడినందువల్ల వచ్చే మూడేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతానికి పెరుగుతుందని అన్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఇన్వెస్టర్ల బృందంతో గురువారం నిర్వహించిన సమావేశంలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సిటీగ్రూప్ శుక్రవారం పేర్కొంది. రెండేళ్ల క్రితం 8-9 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 4-5 శాతానికి తగ్గిపోవడానికి పర్యావరణ, భూసేకరణ సమస్యలు, ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణలో జాప్యం కూడా కారణాలేనని రాజన్ తెలిపారు. ఈ ఏడాది వృద్ధి రేటు 5.5% ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిందన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 5.7%కి ఎగసింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 4.6 శాతమే. ద్రవ్యోల్బణంపై దృష్టి ... ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉండడానికి సరఫరాలు మెరుగు పడకపోవడమే కారణమని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఈ సీజన్లో తక్కువ వర్షపాతం నమోదుకావడంతో ఆహార ద్రవ్యోల్బణంపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. జూలైలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.19 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 7.96 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 8.43 శాతం ఉందని చెప్పారు. పటిష్టమైన ద్రవ్య విధానం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఈ ఏడాది 8 శాతానికి అదుపుచేయాలనీ, వచ్చే ఏడాది 6 శాతానికి తగ్గించాలనీ రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని వివరించారు. భారత్లో మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఎన్నికలు సమీపించడం వల్లే పరిమిత సంఖ్యలో బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేశామని తెలిపారు. భారత్లో విదేశీ బ్యాంకుల ప్రాతినిధ్యం పెంచేందుకు ప్రాధాన్య రంగ రుణ నిబంధనలను ఆర్బీఐ పునఃసమీక్షించే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు. మొండి బకాయిలపై అది బ్రహ్మాస్త్రం... మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకుల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’గా ప్రకటించడమేనని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేట్ల కోత ఫిబ్రవరిలోనే: బీఓఎఫ్ఏ-ఎంఎల్ ఆర్బీఐ ఈ నెల 30వ తేదీన నిర్వహించే ద్రవ్య, పరపతి సమీక్షలోనూ పాలసీ రేట్ల కోత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) తాజా నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతుండడమే దీనికి కారణమని పేర్కొంది. అయితే ఫిబ్రవరిలో మాత్రం రేట్ల కోత ఉండవచ్చని అభిప్రాయపడింది. -
అన్ని జిల్లాల్లోనూ రీ షెడ్యూల్ చేయండి
రేపు ఆర్బీఐ గవర్నర్తో భేటీలో కోరనున్న ఏపీ సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గత ఖరీఫ్ సందర్భంగా రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్కు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు రిజర్వ్బ్యాంక్ను కోరనున్నారు. ఆర్బీఐ సోమవారం ముంబైలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సీఎస్తో పాటు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లాం హాజరుకానున్నారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో భేటీ అయ్యేందుకు కృష్ణారావు సమయం కోరారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లోని 120 మండలాల్లో రీ షెడ్యూల్కే అనుమతించారని చెబుతూ.. మిగతా జిల్లాల్లోని మండలాల్లో పంటలు కోల్పోయిన రైతుల రుణాల రీ షెడ్యూల్కూ అనుమతించాల్సిందిగా రాజన్ను సీఎస్ కోరనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శనివారం ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రుణ మాఫీకి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు తదితర అంశాలపై సమీక్షించారు. -
ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని
-
దిగుబడి తక్కువుంటేనే రీ షెడ్యూల్
-
రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం
-
దిగుబడి తక్కువుంటేనే రీ షెడ్యూల్
* ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టీకరణ * ఏపీ, తెలంగాణల్లో పంటల దిగుబడి * 50% కంటే ఎక్కువే ఉంది * రుణ మాఫీ, రీ షెడ్యూల్పై సమాచారం అందలేదు * రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం * ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని ముంబై: రుణాల రీ షెడ్యూల్ ఎప్పుడు వర్తిస్తుందో తమ మాస్టర్ సర్క్యులర్లో స్పష్టంగా ఉందని రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియూ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఏదైనా ఒక జిల్లా లేదా ప్రాంతంలో కరువు, తుపాను వంటి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. జిల్లా కలెక్టర్ ఆ మేరకు ప్రకటిస్తారని, అప్పుడు బ్యాంకులు స్వచ్ఛం దంగా రీ-షెడ్యూల్కు అవకాశమిస్తాయని తెలిపారు. అలాంటప్పుడు రైతులు చెల్లించని రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా పరిగణించకుండా రీ-షెడ్యూల్ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని పరోక్షంగా వెల్లడించారు. మంగళవారం ఇక్కడ పరపతి విధాన సమీక్ష అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తే పంటల దిగుబడి 50 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో రీ-షెడ్యూల్ సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఒకవేళ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని ఉంటే వాటి వివరాలను ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా ఆయా ప్రభుత్వాలను కోరామని, కానీ ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం రీ-షెడ్యూల్కు సంబంధించి రెండు రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సకాలంలో చెల్లించేవారికి కాకుండా, చెల్లించకుండా ఎగ్గొట్టేవారికి మేలు చేసే రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరమైనవని, ఇటువంటి పథకాలు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చెల్లించినవారికి నష్టం కలిగించని విధంగా ఈ రుణ మాఫీ పథకం ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కానీ ఇంతవరకు ఆ పథకం వివరాలు తమకు అందలేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ దిగుబడి ఎక్కడ తగ్గిందో నిరూపించండి ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఖరీఫ్లో పంటల దిగుబడి ఏ మండలాల్లో తగ్గిందో నిరూపించాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఏపీ ప్రభుత్వానికి సూచిం చింది. గత ఖరీఫ్లో రాష్ట్ర అర్థగణాంక శాఖ లెక్కల ప్రకారం పంటల దిగుబడి బాగానే ఉందని, 50 శాతానికి ఎక్కడా దిగుబడి తగ్గిపోలేదని ఆర్బీఐ పేర్కొంది. అర్థగణాంక శాఖ లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కలకు ఏమైనా తేడా ఉంటే చెప్పాలని కూడా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచిం చింది. దీనిపై ఏంచేయాలో పాలుపోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క పంటల దిగుబడి బాగుందని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లెక్కలు చెప్తుండగా.. ఇప్పుడవి సరికావని చెప్పడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఏదైనా మండలాల వారీగా పంటల దిగుబడి 50 శాతానికి తగ్గిపోయినట్లుంటే గణాం కాలతో నిరూపించాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకనుగుణంగా కసరత్తు చేసినా ఆ మేరకు ఆర్బీఐ అంగీకరించినా రూ. రెండు లేదా మూడు వేల కోట్లకే రుణాల రీషెడ్యూల్ పరిమితమవుతుం దని అధికార యంత్రాంగం భావిస్తోంది. గత ఖరీఫ్లో 50% కన్నా పంటల దిగుబడి తగ్గినట్లు నిరూపిస్తూ గణాంకాలను పంపిస్తే గానీ ఆర్బీఐ స్పందించదని అధికారులు చెబు తున్నారు. దీంతో రీషెడ్యూల్పై ఆశ వదులు కోవాల్సిందేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
రుణమాఫీకి సహకరించండి
ఆర్బీఐ గవర్నర్కు చంద్రబాబు లేఖ ఫోన్లోనూ ఈ అంశంపై చర్చ హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణ మాఫీ అమలు చేయడానికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ను కోరారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కలిగించడానికి తగిన సలహాలు ఇవ్వాలని, ఈ విషయమై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబు ఒక లేఖ రాశారు. ఫోన్లో కూడా ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్తో చర్చించారు. రుణ మాఫీపై ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో తాను లేఖ రాస్తున్నట్లు బాబు పేర్కొన్నారు. ‘రాష్ట్ర రైతాంగం గత ఐదేళ్ల కాలంలో కరువు, తుపానులతో తీవ్రంగా పంటలను నష్టపోయారు. ఎరువులు, విత్తనాల ధరలు బాగా పెరిగిపోయారుు. పెట్టుబడి వ్యయం పెరిగినా దానికి తగినట్టుగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించలేదు. ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధరకు చర్యలు తీసుకోలేదు. దీంతో పంటలను తక్కువ ధరకు విక్రయించిన రైతులు నష్టపోయారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించాం..’ అని వివరించారు. హామీ మేరకు రుణాల మాఫీ అమలు చేసేందుకు సహకరించడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖలో కోరారు. ‘ఈ విషయమై త్వరలో మిమ్మల్ని కలిసి చర్చిస్తా..’ అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోతే ఎదురయ్యే ఇబ్బందులను చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. -
ఆర్బీఐ గవర్నర్తో ఫోన్లో మాట్లాడిన బాబు
రైతుల రుణమాఫీ తమ వల్ల కాదంటూ ఆర్బీఐ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో బుధవారం ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రుణమాఫీ అవశ్యకతను ఈ సందర్బంగా రఘురామరాజన్కు చంద్రబాబు వివరించారు. రుణమాఫీ అంశంపై మరింత వివరంగా అటు కేంద్రంతో పాటు ఇటు ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల జరిగి ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేకాకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటగా రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒటేశారు. దాంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయిన తర్వాత రుణమాఫీపై కమిటీ వేస్తుందుకు ఉద్దేశించిన ఫైల్పై సంతకం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రైతులకు రుణమాఫీ చేయాలంటే రూ. 80 వేల కోట్లకుపైగా అవసరం అవుతాయి. అంత సొమ్ము రుణమాఫీ మా వల్ల కాదంటూ ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పీఎస్యూ బ్యాంకుల మార్కెట్ వాటా పడిపోతుంది!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్యూ) బ్యాంకుల మార్కెట్ వాటా 2025కల్లా 20% క్షీణించడం ద్వారా 60%కు పరిమితమవుతుందని రిజర్వ్ బ్యాంక్ కమిటీ నివేదిక అంచనా వేసింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో పీఎస్యూ బ్యాంకుల వాటా 2000లో 80%గా నమోదైంది. ప్రభుత్వం వాటాలు తగ్గించుకోవడం, బ్యాంకులు పనితీరు మెరుగుపరచుకోవడం వంటి చర్యలను చేపట్టకపోతే మార్కెట్ వాటా పడిపోతుందని తెలిపింది. కాగా, ఇదే సమయంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా మూడో వంతుకు పుంజుకోనున్నట్లు పేర్కొంది. 2000లో ప్రయివేట్ రంగ బ్యాంకుల వాటా 12%గా నమోదైంది. ఇక విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు నామమాత్రంగా ఉండనున్నట్లు అభిప్రాయపడింది. ఆస్తుల ఒత్తిడి ... పీఎస్యూ బ్యాంకులు అటు మొండి బకాయిలతోపాటు, ఇటు తగినంత మూలధన పెట్టుబడులు లేక ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు ఆర్బీఐ కమిటీ నివేదిక వివరించింది. ఇవి బ్యాంకుల వృద్ధిని అడ్డగిస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 15 ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు, 30 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. -
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ముంబయి : ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో రెపోరేటుతో పాటు రివర్స్ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రెపోరేటు 8శాతంగా ఉండగా రివర్స్ రెపోరేటు 7శాతం గా ఉంది. భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారమిక్కడ తెలిపారు. అయితే అసవరమైనప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కిందటి మానిటరీ పాలసీలో కీలక వడ్డీరేట్లను 7.75శాతం నుంచి 8శాతానికి పెంచిన సంగతి విధితమే . గత నవంబర్లో 11.24శాతం పెరిగిన ద్రవ్యోల్భణం ఇపుడిప్పుడే నియంత్రణలోకి వస్తుందని ఆయన అన్నారు. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి రేటు మాత్రం 4.5శాతానికి తగ్గిందని ఈ ఆర్ధిక సంవత్సరం అది 4.9శాతంగా ఉంటుందని ఆర్బిఐ అంచనా వేస్తోంది. -
నేడు ఆర్బీఐ పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. రేట్లకు సంబంధించి గవర్నర్ రఘురామ్ రాజన్ యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేట్ల విషయంలో సోమవారం తన తాజా అంచనాలను వెలువరిస్తూ, రెపో రేటు తగ్గింపునకు అవకాశం లేదని పేర్కొంది. యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణం (ఫిబ్రవరిలో 8.1 శాతం) స్థాయి ఆమోదనీయంకాదని, ఇంకా తగ్గాలని ఆర్బీఐ భావించే అవకాశాలు ఉండడమే దీనికి కారణమని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. రేట్లు పెంచితే వృద్ధికి విఘాతం రేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని డన్ అండ్ ఏఎంపీ బ్రాడ్షీట్ సీనియర్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరగడానికే అవకాశాలు ఉండడం దీనికి కారణమని ఆయన అంచనావేశారు. అయితే రేటు పెంచితే మాత్రం అది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలమవుతుందని స్పష్టం చేశారు. -
మొండి బకాయిలతోనే ఆందోళన : ఆర్బీఐ గవర్నర్
-
మరోసారి షాక్ ఇచ్చిన ఆర్బీఐ
-
మరోసారి షాక్ ఇచ్చిన ఆర్బీఐ
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా వడ్డీరేటు పెంచింది. రెపోరేటును 7.75 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో 7.25 శాతంగా ఉన్న రెపోరేటు 5 నెలల్లో 0.75 శాతం పెరిగి 8 శాతానికి వచ్చింది. అంటే ప్రతి లక్ష రూపాయల రుణానికి అదనంగా ఏడాది 750 రూపాయలు ఇప్పుడు చెల్లించాల్సి వస్తోంది. 10 లక్షల రూపాయల హౌసింగ్ లోను తీసుకున్న వారికి ఏడాది 7500 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి గడిచిన అయిదు నెలల్లో ఏర్పడింది. అయితే రిజర్వ్ బ్యాంకు వడ్డీరేటు పెంచిన మేరకు అన్ని బ్యాంకులు.. రుణాలపై వడ్డీరేట్లను పెంచలేదు. ఇది కొంత నయం. ధరల పెరుగుదలను అరికట్టేందుకు వడ్డీరేట్లు పెంచకతప్పలేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ చెబుతున్నారు. ఇది చివరి పెంపు కావొచ్చని ఆయన చెప్పారు. ఈ మాటే నిజం కావాలని.. ఇకపైనా వడ్డీరేట్లు పెరగకుండా తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం. -
15 నిమిషాల దూరంలో బ్యాంకు!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని నచికేత్ మోర్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్యానెల్ మంగళవారం సూచించింది. దిగువస్థాయి ఆదాయ వర్గాల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. 2016 నాటికి పౌరులంతా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యం నెరవేరడానికి ఇది ముందడుగని మోర్ ప్యానెల్ సూచించింది. దేశంలో ఏ పౌరుడికైనా కేవలం 15 నిముషాల నడక దూరంలో నగదు విత్డ్రా, చెల్లింపు, డిపాజిట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తేవాలని ప్యానల్ అభిప్రాయపడింది. చిన్న వ్యాపారాలు, దిగువస్థాయి ఆదాయ గృహస్తులకు సంబంధించి సమగ్ర ఆర్థిక సేవలపై ఏర్పాటయిన ఈ కమిటీ ఆయా అంశాలకు సంబంధించి పలు సిఫారసులు సమర్పించింది. ఆర్బీఐ గవర్నర్గా సెప్టెంబరు 4న బాధ్యతలు స్వీకరించిన రఘురామ్ రాజన్... అదేరోజు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఈడీ నచికేత్ మోర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడానికి సంబంధించి కమిటీ పలు సూచనలు చేసింది. కొత్త బ్యాంకుల కోసం 25 కంపెనీలు చేసిన దరఖాస్తులను ఆర్బీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో నచికేత్ మోర్ బృందం సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యాంశాలు... 2016 జనవరి 1కి 18 ఏళ్లు నిండిన వారందరికీ భద్రతాపూర్వక, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఖాతా అందుబాటులో ఉండాలి. ‘పేమెంట్స్ బ్యాంకులు’ ఏర్పాటు చేయాలి. చిన్న వ్యాపారులకు, దిగువస్థాయి గృహస్తులకు చెల్లింపు, డిపాజిట్ పథకాల వంటి ప్రత్యేక సేవలందించడం ఈ బ్యాంకుల ధ్యేయంగా ఉండాలి. ఆయా వర్గాలకు గరిష్టంగా రూ.50,000 వరకూ రుణ సౌలభ్యతను కల్పించగలగాలి. ఈ తరహా బ్యాంకులకు కనీస మూలధనం రూ.50 కోట్లుగా ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా తేలిగ్గా బ్యాంక్ ఖాతా ప్రారంభించగలిగే పరిస్థితిని తేవాలి. వ్యవసాయ రుణ వ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలి. ఈ రం గానికి బేస్రేటుకన్నా తక్కువ వడ్డీకి రుణాలివ్వడాన్ని ఎత్తేయాలి. ఏ ప్రయోజనమైనా.. ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఉండాలి. -
ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి కొత్తసారొచ్చారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, పదవీ కాలం పూర్తయిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజన్ బాధ్యతల స్వీకరణ, దువ్వూరి పదవీ విరమణ ఒకే రోజు నేపథ్యంలో ఇరువురూ అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజన్ తొలిసారిగా గవ ర్నర్ హోదాలో విలేకరులతో మాట్లాడారు. వస్తూవస్తూనే భారీ చర్యల ప్యాకేజీ తీసుకొచ్చారు. స్వల్పకాలంలో చేపట్టబోయే సవివర రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. రూపాయి అథపాతాళానికి పడిపోయి విలవిల్లాడుతున్న ఫైనాన్షియల్ మార్కెట్కు బూస్ట్ ఇచ్చేవిధంగా పలురకాల సెటిల్మెంట్లను రూపాయిల్లో జరుపుకోవడం తదితర చర్యలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ఈ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎలాంటి చికిత్స చేస్తారనేదానిపైనే చర్చ నడుస్తోంది. యాభై ఏళ్లకే ఆర్బీఐ చీఫ్గా వచ్చి ఈ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా రాజన్ నిలిచారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉందని, అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరలను కట్టడి చేయడంతోపాటు సమీకృత ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. పడిపోతున్న వృద్ధిరేటును తిరిగి గాడిలోపెట్టడం, ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా తాజా మాజీ గవర్నర్ దువ్వూరి వృద్ధిరేటు పడిపోతున్నా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు పదేపదే డిమాండ్ చేసినా ఆయన ధరలను దించడమే తొలి ప్రాధాన్యమంటూ అనేకసార్లు తేల్చిచెప్పారు కూడా. ఈ విషయంలో చిదంబరం, ప్రభుత్వం చేసిన సూచనలను కూడా పక్కనబెట్టడంతో తీవ్రమైన విభేదాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ రాజన్ వృద్ధిపై దృష్టిపెడతామని అంటూ పరోక్షంగా వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలివ్వడం గమనార్హం. చకచకా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్లు... జనవరికల్లా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్లను జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజన్ వెల్లడించారు. లెసైన్స్లు ఇచ్చేవిషయంలో అత్నున్నత ప్రమాణాలు, పారదర్శకత, పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. కొత్త బ్యాంకుల ఏర్పాటు కోసం టాటా, బిర్లా, అంబానీలతోసహా మొత్తం 26 కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల మదింపునకు ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు రాజన్ తెలిపారు. గడచిన 20 ఏళ్లలో ప్రైవేటు రంగంలో 12 బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్స్లు ఇచ్చింది. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్లకు దక్కిన లెసైన్స్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు కొత్త బ్యాంకులకు ఆర్బీఐ తెరతీయనుంది. సమీక్ష తేదీ మార్పు...: ఈ నెల 18న జరగాల్సిన ఆర్బీఐ పాలసీ సమీక్షను కొత్త గవర్నర్ రాజన్ 20కి మార్చారు. ఇదే ఆయనకు తొలి పాలసీ సమీక్ష ప్రకటన కానుంది. మరోపక్క, మానిటరీ పాలసీ విధివిధానాలు, ఆర్థిక స్థిరీకరణ, మారుమూల ప్రాంతాలకూ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్), బ్యాంకుల్లో మొండిబకాయిలను తగ్గించడం వంటి వాటిపై కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్ ప్రకటించారు. ‘పడిపోతున్న దేశీ కరెన్సీకి చేయూతనిచ్చేలా విశ్వాసం పెంచే ద్రవ్య స్థిరీకరణ అనేది ఆర్బీఐ ప్రాథమిక కర్తవ్యం. అంతిమంగా స్థిరమైన, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణమే లక్ష్యం. రూపాయి పతనం, సరఫరాపరమైన అడ్డంకులు, డిమాండ్ ఒత్తిళ్లు ఇలా దేశీయ పరిణామాలు వేటివల్లయినా ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. అయితే, సమగ్ర వృద్ధిరేటు, అభివృద్ధి అనేవి కూడా చాలా ప్రధానమైన అంశాలే. ఆర్థిక స్థిరీకరణా ముఖ్యం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. మరోపక్క, ధరల కట్టడే లక్ష్యంగా పనిచేసిన దువ్వూరి విషయంపై స్పందించాలని విలేకరులు కోరగా... ఈ నెల 20 (పాలసీ సమీక్ష) వరకూ దీనిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయను’ అని స్పందించారు. వృద్ధి రేటు పుంజుకుంటుంది... దేశ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని, కొన్ని సానుకూల పరిణామాలు కనబడుతున్న నేపథ్యంలో వృద్ధికి ఊతం లభించగలదని రాజన్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి పుంజుకోవడం కోసం పలు సంస్కరణలను తాను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రకటిస్తునట్లు తెలిపారు. ఇక భారత్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేస్తామన్న స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరికలపై స్పందిస్తూ... మూడింట ఒకవంతు చాన్స్ ఉందని ఎప్పటినుంచో ఈ ఏజెన్సీ చెబుతోంది. ఇందులో కొత్తేమీలేదన్నారు. మరిన్ని చర్యలకు ప్రణాళిక...: బ్యాంకులకు అమలయ్యే చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని తగ్గించేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ సంకేతాలిచ్చారు. భారత్లో విదేశీ బ్యాంకుల కార్యకలాపాలపై మరింత నియంత్రణ, పర్యవేక్షణను తీసుకొచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. మరోపక్క, ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండానే దేశీ బ్యాంకులు శాఖలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించనున్నట్లు రాజన్ హామీనిచ్చారు. మార్కెట్లలో సంస్కరణలను ఒక్కొక్కటే ప్రవేశపెడతామని.. ముఖ్యంగా సెబీతో సంప్రదింపుల ద్వారా పొజిషన్లు, పెట్టుబడులపై నియంత్రణలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. ఓవర్నైట్ వడ్డీరేట్లపై కూడా వడ్డీరేట్ల ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాజన్ వెల్లడించారు. నగదురూపంలో సెటిల్ చేసుకునే పదేళ్ల కాలపరిమితిగల వడ్డీరేట్ల ఫ్యూచర్స్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా, రిటైల్ ద్రవ్యోల్బణంతో అనుసంధానించే ద్రవ్యోల్బణ సూచీ సేవింగ్స్ సర్టిఫికెట్లను కూడా జారీచేయనున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్ల శుభాకాంక్షలు.. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాజన్కు పలువురు బ్యాంకర్లు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విజ్ఞానిగా పేరొందిన డాక్టర్ రాజన్ నుంచి దేశ ఆర్థిక రంగానికి అత్యుత్తమ సేవలు అందుతాయని ఎస్బీఐ చీఫ్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో రాజన్ లాంటి దార్శనికుడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ఆర్బీఐలో కొలువుతీరడం ఆహ్వానించదగ్గ విషయమని బీఓబీ సీఎండీ ఎస్ఎస్ ముంద్రా అన్నారు. ఫేస్బుక్లో ‘లైక్స్’ కోసం కాదు.. ఆర్బీఐకి గవర్నర్గా నేతృత్వం వహించడం, బాధ్యతలు నెరవేర్చడం అంటే ఫేస్బుక్లో లైక్స్ సంపాదించడం లేదంటే ఎవరిదైనా మనసు గెలుచుకోవడం వంటిది కాదని రాజన్ వ్యాఖ్యానించారు. తద్వారా తాను కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ‘ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం అనేది ఈ స్థానంలోకి వచ్చే వ్యక్తి పేరుప్రఖ్యాతుల నుంచే మొదలవుతుంది. అయితే, నేను తీసుకునే కొన్ని చర్యలు అంతగా పేరొందకపోవచ్చు. రుచించకపోవచ్చు’ అని పేర్కొన్నారు. విమర్శలకు తాను వెరవనని... సరైనదనుకుంటే ఎలాంటి చర్యలకైనా వెనుకాడనని కూడా ఆయన తేల్చిచెప్పారు. సద్విమర్శలైతే వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా సిద్ధమేనన్నారు. -
నేటితో దువ్వూరి సుబ్బారావు పదవీకాలం పూర్తి
-
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజన్ బాధ్యతలు
-
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ అవసరం
ముంబై: మోసపూరిత పథకాల నుంచి మదుపరులను రక్షించాల్సిన బాధ్యత ఇటు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తో పాటు అటు ప్రభుత్వంపైన కూడా ఉందని ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రాజ్యభాష పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత పథకాల నుంచి ప్రజలను దూరంగా ఉంచడానికి ద్విముఖ వ్యూహాన్ని ఆయన సూచించారు. ఇందులో ఒకటి ప్రజలను చైతన్యవంతులను చేయడం ఒకటని పేర్కొన్నారు. మరొకటి సామాన్యుని పొదుపులు అధికారిక ఆర్థిక వ్యవస్థకు మరల్చే విధంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచడమని వివరించారు. -
భారీ బ్యాంకులతో ముప్పే
ముంబై: చిన్న చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి ఒకటో, రెండో ప్రపంచ స్థాయి భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న వాదనలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. ఇలాంటి బ్యాంకుల వల్ల ఆర్థిక సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ తరహా బ్యాంకుల వల్లే 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభం వచ్చి పడిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కావాల్సినది గుత్తాధిపత్యం కాదని, ఒకటో రెండో అత్యంత భారీ బ్యాంకుల కన్నా నాలుగైదు పెద్దస్థాయి బ్యాంకులు అవసరమని దువ్వూరి తెలిపారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మంగళవారం ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారీ బ్యాంకుల వల్ల సంక్లిష్టతతో పాటు నైతిక సమస్యలు పెరుగుతాయన్నారు. విలీనాల వల్ల అధిక మూలధనం అందుబాటులో ఉంటుందని, డిమాండ్కి తగినట్లు రుణాలు మంజూరు చేసే వీలుతో పాటు జీడీపీ వృద్ధికి, వ్యయాల తగ్గింపునకు ఉపయోగ పడుతుందని దువ్వూరి చెప్పారు. అయితే, నియంత్రణపరమైన సమస్యలూ తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అత్యంత భారీ బ్యాంకులు గుత్తాధిపత్య ధోరణులను ప్రదర్శించగలవని, దీనివల్ల పోటీ దెబ్బతింటుందని దువ్వూరి పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన ఎకానమీ కోసం అత్యంత భారీ బ్యాంకులు కొన్నైనా అవసరమని ఆర్థిక మంత్రి చిదంబరం చెబుతున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ స్థాయికి చాలా కాలం భారత బ్యాంకులు అతి పెద్ద గ్లోబల్ బ్యాంకుగా ఎదగాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పట్టేస్తుందని సుబ్బారావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ.. అంతర్జాతీయస్థాయిలో చూస్తే 60వ స్థానంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయబద్ధమైన పద్ధతిలో విస్తరిస్తే.. ఎదగాలంటే చాలా కాలం పడుతుందని ఆయన తెలిపారు. 1991 ప్రారంభంలో ఆర్థిక రంగ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పట్నుంచి బ్యాంకుల కన్సాలిడేషన్ అంశం ప్రాధాన్యం సంతరించుకుందని దువ్వూరి పేర్కొన్నారు. 1969లో తొలిసారి బ్యాంకులను జాతీయం చేసినప్పట్నుంచి 41 విలీనాలు జరిగాయని, ఇందులో 17 డీల్స్ ..1991కి ముందు మిగతావి ఆ తర్వాత జరిగాయన్నారు. చిన్న బ్యాంకులతో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ తోడ్పాటు.. చిన్న వ్యాపారులు, రైతులు, ఇతర అసంఘటితరంగ సంస్థలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు చిన్న బ్యాంకులు ఉపయోగపడతాయని, వీటి వల్ల అందరికీ ఆర్థిక సేవలు (ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) సాధ్యపడగలవని దువ్వూరి పేర్కొన్నారు. అయితే.. స్థానిక ఎకానమీ పరిస్థితుల నుంచి వీటికీ రిస్కులు ఉంటాయన్నారు. ప్రాంతీయ చిన్న బ్యాంకులు విఫలమైనా దాని ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్దగా ఉండబోదని, పరిష్కారం కూడా సులువుగానే ఉండగలదని పేర్కొన్నారు. ఎన్బీఎఫ్సీలన్నీ ఆర్బీఐ నియంత్రణలోనే ఉండాలి.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణాధికారాలను ఆర్బీఐ నుంచి దూరం చేసి ఏకీకృత ఆర్థిక సంస్థ అధీనంలో ఉంచడం సరికాదని దువ్వూరి అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని, ఫలితంగా ద్రవ్య విధానంపైనా ప్రతికూల ప్రభావం పడగలదని చెప్పారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా డిపాజిట్లు తీసుకునే సంస్థలకు మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయని.. ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ఉండాలంటే ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణ పరిధిలోనే ఉండాలని దువ్వూరి పేర్కొన్నారు. సీఆర్ఆర్ తగ్గాలి..: నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) మరింత తగ్గించాల్సిన అవసరం ఉండొచ్చని భావిస్తున్నట్లు దువ్వూరి చెప్పారు. సీఆర్ఆర్ తగ్గించాలని లేదా కనీసం వడ్డీ అయినా ఇవ్వాలని, అలాగే ఎస్ఎల్ఆర్ను తగ్గించాలంటూ బ్యాంకర్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తినా ససేమిరా అన్న దువ్వూరి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతంగాను, ఎస్ఎల్ఆర్ 23 శాతంగానూ ఉన్నాయి. -
రాజన్.. రాత మారుస్తారా!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా నియమితులైన రఘురామ్ రాజన్ ప్రస్తుత ఆర్థిక మందగమనం నుంచి భారత్ను బైటపడేస్తారని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్కు మధ్య మంచి సమన్వయం నెలకొనేలా ఆయన చూడగలరని వారు విశ్వసిస్తున్నారు. అయితే విధాన నిర్ణయాల్లో రాజన్ ఎలాంటి మార్పులు తెస్తారో ముందే వ్యాఖ్యానించడం తొందరపాటవుతుందని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. అక్కరకు అనుభవం: ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో రాజన్ నియామకం ఆశలు రేకెత్తించేదిగా ఉందని క్రెడిట్ సూసీ డెరైక్టర్(ఏషియన్ ఎకనామిక్స్ రీసెర్చ్) రాబర్ట్ ప్రియర్-వాండెస్ఫోర్డే వ్యాఖ్యానించారు. అవసరమైన నిర్ణయాలను త్వరితంగా తీసుకోవలసిన అవసరం ఇప్పుడుందని ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన అనుభవం కారణంగా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్కు మధ్య రాజన్ మంచి సమన్వయం సాధించగలరని నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండట్ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ చెప్పారు. మార్కెట్లు సానుకూలం రాజన్ నియామకం పట్ల మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయని డీబీఎస్ బ్యాంక్ ఎకనామిస్ట్ రాధికా రావు విశ్లేషించారు. -
రాజన్ చేతికి ఆర్బీఐ పగ్గాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి అత్యున్నత నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో కొత్త సారథి కొలువుదీరనున్నారు. ప్రపంచ విఖ్యాత ఆర్థిక రంగ నిపుణుడు రఘురామ్ గోవింద్ రాజన్.. ఆర్బీఐ గవర్నర్గా పగ్గాలు చేపట్టనున్నారు. వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజన్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం 2008లో ప్రపంచదేశాలను అల్లాడించిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన రాజన్... ఎంతోమంది నిపుణులు, విశ్లేషకులను నివ్వెరపరిచారు. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్గా ఆయన ఎలాంటి విధానాలను అమలుచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూపాయి కనీవినీఎరుగని రీతిలో పాతాళానికి పడిపోవడం, విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు... ఆర్థిక మందగమనం వంటివి దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికితోడు అధిక వడ్డీరేట్లు, ధరల మంటల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారో వేచిచూడాల్సిందే. న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి. రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 50 సంవత్సరాల రాజన్, మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న దువ్వూరి సుబ్బారావు స్థానంలో రాజన్ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రేట్ల వైఖరిపై సర్వత్రా ఆసక్తి! ద్రవ్యోల్బణంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి రేటుకూ సైతం ఆర్బీఐ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా పాలసీరేట్లను సైతం తగ్గించాలని కేంద్రం చేస్తున్న సూచనలకు ఇప్పటివరకూ రాజన్ సానుకూల రీతిలో స్పందిస్తూ వచ్చారు. డాలర్ మారకంలో రూపాయి విలువ కిందకు జారిపోవడాన్ని నిలువరించడానికి, ఒడిదుడుకులను నివారించడానికి ఆర్బీఐ ఇటీవల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన కఠిన విధానాన్ని సమర్థిస్తూనే... ఆర్బీఐ రూపాయితోపాటు ఆర్థికాభివృద్ధి రేటుపైనా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక మందగమనం, తీవ్ర ఆహార ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు వంటి సవాళ్లతో కూడిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో- ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధాన ధ్యేయంగా దువ్వూరి సుబ్బారావు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన కఠిన విధానాన్ని రాజన్ కూడా కొనసాగిస్తారా...? లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అన్నది ప్రస్తుతం విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ. మంత్రదండం లేదు... ఆర్బీఐ గవర్నర్గా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే రాజన్ స్పందిస్తూ... ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇబ్బందులను మాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే సవాళ్లను ఎదుర్కొనగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. సర్వోన్నత సమగ్రత, స్వతంత్రత, వృత్తి నిపుణత కలిగిన సంస్థగా ఆర్బీఐని ఆయన అభివర్ణించారు. పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం రాజన్ నియామకం పట్ల పాలక, పారిశ్రామిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది. రాజన్ చక్కటి నిర్ణయాలు తీసుకుని బాగా పనిచేయగలరన్న అభిప్రాయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సి.రంగరాజన్ వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజన్ నుంచి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధికి తగిన సంకేతాలు, మార్గదర్శకాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. గవర్నర్గా మంచి నిర్ణయాలు తీసుకోడానికి ఆర్థిక రంగంలో ఆయన అపార అనుభవం దోహదపడుతుందని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. రాజన్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం మనకు అదృష్టమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. రాజన్ ఎంపిక ‘చాలా చక్కనిది’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో ఆయన విజయం సాధించగలరని అసోచామ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. చిన్న వయసులోనే.. ఆర్బీఐ గవర్నర్గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో రాజన్ ఒకరు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాల 6 నెలలుగా ఉంటుంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ 1982లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన తన 50వ పుట్టిన రోజుకు 10 రోజుల దూరంలో ఉన్నారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్, 1982 సెప్టెంబర్ 16న ఆర్బీఐ పగ్గాలు చేపట్టారు. ఆర్బీఐకి అతి చిన్న వయసులో గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రికార్డు ఇప్పటికీ సర్ సీడీ దేశ్ముఖ్కే దక్కుతుంది. 1943లో కేవలం 47 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ బాధ్యతల్లో నియమితులయ్యారు. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందే వరకూ ఆయన కొనసాగారు. ఈ పదవిలో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. గత పదేళ్ల కాలంలో నాన్-సివిల్ సర్వెంట్గా ఆర్బీఐ గవర్నర్ కుర్చీలోకి రాబోతున్న వ్యక్తి రాజన్. ఇంతక్రితం బిమల్ జలాన్ నాన్-ఐఏఎస్గా ఈ బాధ్యతలను నిర్వహించి 2003లో పదవీ విరమణ చేశారు. రచనలు... సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల గురించి ఆయన రచించిన ‘ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకం అత్యధిక ప్రాచుర్యం పొందింది. భారత్లో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై నివేదికను రూపొందించడంలో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషించారు. అత్యున్నతస్థాయి బాధ్యతలు... గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమి స్ట్గా పనిచేసిన రాజన్, గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తున్న కౌశిక్ బసు స్థానంలో ఆయన ఆగస్టులో ఈ బాధ్యతలు చేపట్టారు. సీఈఏగా బాధ్యతలను చేపట్టే నాటికి ఆయన షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రికి గౌరవ ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. ముందుచూపు... ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన అతి కొద్ది మంది ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. -
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్గా రఘురామ్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్గా రాజన్ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకుకు ఐఏఎస్ అధికారిని మాత్రమే గవర్నర్గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్ అధికారులే. ఐఏఎస్ కాకపోయినా రాజన్కు గవర్నర్ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్గా రాజన్ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం. రఘురామ్ రాజన్ భోపాల్లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త. అందువల్ల 7వ తరగతి వరకు రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్ మెడల్తో బీటెక్ పట్టా అందుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి పీహెచ్డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పని చేశారు. ఐఎంఎఫ్లో చీఫ్ ఎకానమిస్ట్గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. -
కొత్త బ్యాంక్ లెసైన్సులకు మరికొంత సమయం: ఆర్బీఐ
ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.