Regional Ring Road
-
ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా విస్తరణకనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టిసారించింది. హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీలు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతుల ప్రక్రియలు డీటీసీపీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు కూడా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోకి వచ్చాయి. దీంతో వివిధ విభాగాల్లో అవసమైన అధికారులు, సిబ్బందిని నియమించి సంస్థాగతంగా బలోపేతం చేయవలసి ఉన్నదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు.‘ప్రస్తుతం జోనల్ అధికారులు రీజనల్ రింగ్రోడ్డు (Regional Ring Road) వరకు విధులు నిర్వహించడం టెక్నికల్గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్లు ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్రింగ్ రోడ్డు వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి పనులను చేపట్టివలసి ఉంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.గతంలో మేడ్చల్, శంకర్పల్లి, ఘట్కేసర్, శంషాబాద్ (Shamshabad) నాలుగు జోన్లు మాత్రమే ఉండగా, శంకర్పల్లి, మేడ్చల్ జోన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్ఎండీఏ జోన్ల సంఖ్య 4 నుంచి 6 కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1355 గ్రామాలు ఉన్నాయి. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లోని 104 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. రీజనల్ రింగ్రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా నిర్ణయించారు. రీజనల్ రింగ్రోడ్డు తరువాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తరణ అనివార్యం అయింది.చదవండి: 111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల (Raviryal) నుంచి ఆమన్గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు తరహాలోనే రీజనల్ రింగ్రోడ్డుకు, ఔటర్రింగ్రోడ్డుకు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించనున్న మాస్టర్ప్లాన్–2050లో రహదారులు, శాటిలైట్ టౌన్షిప్పులు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. ‘హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ మేరకు హెచ్ఎండీఏ కార్యాచరణను పటిష్టం చేయవలసి ఉంది’ అని ఒక అధికారి చెప్పారు. -
RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించకుండానే ఆగమేఘాల మీద హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తూ తెచ్చిన జీఓ.. రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని కుదేలు చేసేలా మారింది. నిర్మాణ రంగం కూడా మరింత బలహీన పడే పరిస్థితి నెలకొంది. ఇంచుమించు ఏడాదిన్నరగా చతికిల పడ్డ ‘రియల్ భూమ్’ను ఇది మరింత భూస్థాపితం చేసేలా మారిందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల నుంచే ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం లభించింది. నగరం చుట్టుపక్కల ఉన్న భూములు బంగారం కంటే ప్రియంగా మారాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హెచ్ఎండీఏ (HMDA) భూములకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer ring road) పరిధిలో ఎక్కడ హెచ్ఎండీఏ భూములను అమ్మకానికి పెట్టినా రూ.వందల కోట్ల ఆదాయం లభించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో రియల్ రంగం వెనుకంజ వేసింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ విస్తరణతో తిరిగి కొంత రియల్ భూమ్ రావచ్చని మొదట్లో భావించారు. కానీ.. ఏ విధమైన ప్రణాళికలు, విధి విధానాలు లేకుండానే ఆకస్మికంగా జీఓ తేవడంతో అనుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లభించే అనుమతులకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.అనుమతులు ఇచ్చేదెవరు? ఇప్పటికే డీటీసీపీ పరిధిలో భూములు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఎలాంటి సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం లే అవుట్ అనుమతుల అంశం తమ పరిధిలో లేదంటూ డీటీసీపీ (DTCP) అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణదారులు రెండు, మూడు రోజులుగా హెచ్ఎండీఏకు తరలివస్తున్నారు. కానీ.. హెచ్ఎండీఏలో సైతం చుక్కెదురే కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ వరకు తమ పరిధి పెరిగినప్పటికీ ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదని చెబుతున్నారు.మరోవైపు కొత్త మాస్టర్ప్లాన్ వస్తే తాము అనుమతులు ఇవ్వలేమంటున్నారు. దీంతో రియల్టర్లు, వ్యాపార వర్గాలు, ఆర్కిటెక్టర్లు తదితర వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ‘అనుమతుల కోసం కొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. కానీ.. ఎంతకాలం అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. పైగా మాస్టర్ ప్లాన్ లేకుండా అనుమతులను ఇవ్వడం కూడా సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది నష్టదాయకంగా మారింది’ అని కందుకూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకుల నుంచి, ఇతరత్రా రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేసిన వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మాస్టర్ప్లాన్కు మరో ఏడాది.. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్గా, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మిగతా తెలంగాణ అంతా రూరల్గా పరిగణిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైన మాస్టర్ప్లాన్– 2050ని రూపొందించాల్సి ఉంది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.చదవండి: ఎల్ఆర్ఎస్తో తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు మాస్టర్ప్లాన్ (Mastar Plan) రూపకల్పన కోసం ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్స్ను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన సంస్థ పూర్తిగా అధ్యయనం చేసి సమగ్రమైన మాస్టర్ప్లాన్ను సిద్ధం చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తప్ప హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవు. అంటే అప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరకు అన్ని రకాల నిర్మాణాలు, లే అవుట్లు, వెంచర్లు నిలిచిపోవాల్సిందేనా అనే సందేహం నెలకొంది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ భవిష్యత్ను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిస్థితి అగమ్యగోచరం.. హైదరాబాద్ విస్తరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. అసలు మాస్టర్ప్లాన్ లేకుండానే విస్తరణ జీఓ ఇవ్వడం వల్ల స్పష్టత లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రంగానికే కాదు హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఇది నష్టమే. – సత్యనారాయణ చిట్టి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో వెలువరించింది. దీంతో ఇప్పటివరకు 7,257 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 10,472.723 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాలకు విస్తరిస్తుంది. మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు సంస్థ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలోకి తెచ్చారు. రీజినల్ రింగ్రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రగతి పరుగులు! అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం వల్ల ప్రగతి పరుగులు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్ నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా పరిగణిస్తూ సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీని విస్తరిస్తారు. ఆ తర్వాత ఔటర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా పరిగణిస్తూ శాటిలైట్ టౌన్షిప్పులు, ఇతర మౌలిక సదుపాయాలతో నగరాన్ని విస్తరించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తరువాత ఉన్న తెలంగాణను రూరల్ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం కూడా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలో అంతర్జాతీయ కన్సల్టెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. -
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్లో ఉంటూ ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్చాట్లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
‘మహా ప్రణాళిక’కు కసరత్తు
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపకల్పన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వచ్చే సెప్టెంబర్ నాటికి మాస్టర్ప్లాన్ ముసాయిదాను విడుదల చేసే దిశగా హెచ్ఎండీఏ (HMDA) కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు కొత్తగా విస్తరించనన్న పరిధికి అనుగుణంగా మాస్టర్ప్లాన్ కోసం మరో వారం, పది రోజుల్లో ఆసక్తి వ్యక్తీరణ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) దరఖాస్తులను స్వీకరించేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్లో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో రూపొందించిన హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ – 2031లో దొర్లిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు. 2050 వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, టౌన్షిప్పులు, రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు, పచ్చదనం, నీటివనరులు, తదితర అంశాలను సమగ్రంగా ప్రతిపాదించేలా మాస్టర్ప్లాన్ రూపొందించేందుకు ఆసక్తి గల అంతర్జాతీయ కన్సార్షియంల నుంచి దరఖాస్తులను కోరనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న అన్ని మాస్టర్పాల్న్లను ఈ బృహత్తర మాస్టర్ప్లాన్లో విలీనం చేయనున్నారు. ఎంసీహెచ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ప్లాన్లు విలీనం కానున్నాయి.రీజినల్ రింగ్రోడ్డు వెలుపల 2 కిలోమీటర్ల వరకు... హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రీజనల్ రింగ్రోడ్డుకు వెలుపల 2 కిలోమీటర్ల వరకు మాస్టర్ప్లాన్ను రూపొందిస్తారు. ట్రిపుల్ ఆర్ తరువాత ఒక కిలోమీటర్ను బఫర్జోన్గా పరిగణిస్తారు. ఆ కిలోమీటర్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం 7,527 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి కొత్తగా 10,560 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. మొత్తం 104 మండలాలు, 1,355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.చదవండి: హైదరాబాద్కు దీటుగా ప్యూచర్ సిటీ!ఇప్పుడు ఉన్న 7 జిల్లాలకు తోడు నల్గొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్ కొత్తగా చేరడంతో హెచ్ఎండీఏ పరిధిలోని జిలాల సంఖ్య 11కు చేరనుంది. అలాగే 41 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. కొత్తగా 3 మున్సిపాలిటీలు చేరనున్నాయి. ఔటర్ లోపల 28 మున్సిపాలిటీలు, ఔటర్ వెలుపల 12 మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. -
హైదరాబాద్కు దీటుగా ప్యూచర్ సిటీ!
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (future city urban development authority) పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ (HDMA) పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.ఫ్యూచర్సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ (RRR) వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్ఫీల్డ్ (రతన్టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం ఆమోదంహైదరాబాద్ మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం (Telangana Cabinet) ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం వల్ల మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది.హెచ్ఎండీఏ పరిధి పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్షిప్పుల నిర్మా ణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్దత నెలకొన్ని ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. చదవండి: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదరిందిఔటర్రింగ్రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్గా, ఔటర్రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం వల్ల నల్లగొండ, నాగర్కర్నూల్, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. -
ఇక ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ నగరమే!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి పెరగనుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించే అవకాశముంది. ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్గా, ఔటర్ రింగ్రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీఅర్బన్గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీఅర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్రోడ్డు వరకు సుమారు 2,000 చదరపు కిలోమీటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుంది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి..11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు అంచనా. ఇప్పుడు 70 మండలాలు, 1,000 గ్రామపంచాయతీలు, 8 కార్పొరేషన్లు, మరో 38 కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా చేరుతాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, 1,400లకు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే జీవో విడుదల అవుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంచలంచెలుగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా)ని ఏర్పాటు చేశారు. 650 చదరపు కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉండేది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో 2008లో హుడా స్థానంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)ని ఏర్పాటు చేశారు. దీంతో 7,257 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరిగింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత హెచ్ఎండీఏలోని జిల్లాల సంఖ్య 7 కు పెరిగింది. ప్రస్తుతం 11జిల్లాలకు దీని పరిధిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు నల్లగొండ, నాగర్కర్నూల్, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. సుమారు 1,400 గ్రామాలు హెచ్ఎండీఏలో కలిసే అవకాశముంది. ట్రిపుల్ ఆర్ తర్వాత 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రజా రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ⇒ రీజినల్ రింగ్రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఔటర్రింగ్ రోడ్డు(రావిర్యాల) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆమన్గల్లు) వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ⇒ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణపైన కూడా దృష్టి సారించింది. లీ అసోసియేషన్ రూపొందించే కామన్ మెబిలిటీ ప్లాన్ సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది. వచ్చే నెలలో మాస్టర్ప్లాన్కు బిడ్డింగ్ మరోవైపు ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాల మేరకు 2051 వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాల్సిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే నెలలో ఆన్లైన్ బిడ్డింగ్ను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఉన్న 5 మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే మాస్టర్ప్లాన్గా అభివృద్ధి చేస్తారు. ఫోర్త్ సిటీకి స్పెషల్ అథారిటీ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్సిటీ అభివృద్ధికి స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గత నెలలోనే జీవో వెలువడింది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్తగా స్కిల్ యూనివర్సిటీతో పాటు విద్యాసంస్థలకు, పారిశ్రామికరంగానికి ఈ ప్రాంతం హబ్గా మారనుంది. ఈ క్రమంలో ఫోర్త్సిటీ పరిధిలోని వచ్చే 56 రెవెన్యూ గ్రామాను అభివృద్ధి చేస్తారు. -
ఉత్తర ‘రింగు’కు ఎన్పీజీ గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా చేపట్టే కీలక ప్రాజెక్టులపై చర్చించి వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం చూపే పీఎం గతిశక్తిలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) దీనికి పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలతో కూడిన ఈ గ్రూప్ సమన్వయ బృందంగా పనిచేస్తుంది.సదరు ప్రాజెక్టు వల్ల ఇతర శాఖలు, వాటి పరిధిలోని ప్రాజెక్టులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర కీలక ప్రాజెక్టులకు ఏర్పడే ఇబ్బందులపై ఎన్పీజీ చర్చించి.. ఎలాంటి అడ్డంకి లేదనుకుంటే ఆమోద ముద్ర వేస్తుంది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు దీని ఆమోదం తప్పనిసరి. శనివారం ఢిల్లీలో జరిగిన ఎన్పీజీ భేటీలో 17 ప్రాజెక్టులపై చర్చించారు. అందులో రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగం కూడా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఇతర ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని తేల్చి, ఓకే చేసినట్టు తెలిసింది. ఇకపై వేగంగా ప్రక్రియ.. రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి జనవరిలోనే కేంద్రం టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 14న టెండర్లు ఓపెన్ చేసి నిర్మాణ సంస్థను గుర్తించాల్సి ఉంది. కానీ రెండు సార్లు గడువు పొడిగించారు. రీజనల్ రింగు రోడ్డుకు ఇప్పటివరకు ఎక్స్ప్రెస్వే నంబర్ (హైవే నంబర్) కేటాయించకపోవటమే దీనికి కారణం. ఏదైనా జాతీయ రహదారి ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు.. రోడ్డు నంబర్ కీలకం, దాన్ని ఖరారు చేయకుండా పనులు చేపట్టేందుకు వీలుండదు. రీజనల్ రింగురోడ్డుకు ఇంకా నంబర్ కేటాయించకపోవటంతో.. టెండర్లను తెరిచేందుకు, పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు, నిధులు మంజూరు, భూసేకరణ పరిహారం చెల్లింపు వంటివి చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్పీజీ క్లియరెన్స్ రావడంతో, కేంద్ర జాతీయ రహదారుల శాఖ మరోసారి ఆమోద ముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపుతుంది. అక్కడ నిధుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రోడ్డుకు ఎక్స్ప్రెస్ వే నంబర్ కేటాయిస్తారు. ‘రీజనల్’దక్షిణ భాగంపై తకరారు! కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజనలో చేర్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పేచీలు, కొ న్ని ప్రక్రియల్లో జాప్యంతో దక్షిణ భాగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ అటు కేంద్రా న్ని చేపట్టాలని కోరుతూనే.. దక్షిణ భాగానికి డీపీ ఆర్ తయారీ కన్సల్టెన్సీ సేవల కోసం రాష్ట్ర ప్రభు త్వం టెండర్లు పిలవడం గమనార్హం. ఇది గందరగోళానికి కారణమైంది. తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలిచిందో అంతుచిక్కడం లేదని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటుండటం గమనార్హం. -
లైటింగ్ లేని ‘రింగ్’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యాధునిక ఎక్స్ప్రెస్ రహదారుల్లో ఒకటిగా రూపుదిద్దుకోబోతున్న రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్) రాత్రి వేళ మాత్రం చిమ్మ చీకట్లోనే ఉండబోతోంది. ప్రస్తుతం నాలుగు వరుసలు, భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరణ, 5 మీటర్ల ఎత్తుతో ఎలివేటెడ్ కారిడార్ను తలపించే నిర్మాణం, ఇంటర్ ఛేంజ్ కూడళ్లు, అండర్పాస్లు ఇలా ఎన్నో విశేషాలతో నిర్మాణం కానున్నప్పటికీ, దాని మీద వీధి దీపాలు మాత్రం ఉండవని సమాచారం. రూరల్ కేటగిరీ అయినందునే..దేశంలోనే తొలి భారీ రింగురోడ్డుగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్).. సాయంత్రం కాగానే శక్తివంతమైన ఎల్ఈడీ లైట్ల కాంతులతో ధగధగలాడుతుంది. దానికంటే మెరుగ్గా, రెట్టింపు నిడివితో నిర్మించనున్న ఆర్ఆర్ఆర్ మీద మాత్రం లైట్లు ఏర్పాటు చేయొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. ఓఆర్ఆర్ను అర్బన్ రోడ్డు కేటగిరీలో నిర్మించారు. కానీ, ఆర్ఆర్ఆర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించే యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే అయినప్పటికీ, దాన్ని రూరల్ రోడ్డు కేటగిరీలో నిర్మిస్తున్నారు. జాతీయ రహదారులపై పట్టణ ప్రాంతాల్లో లైట్లు కనిపించినా, గ్రామీణ ప్రాంతాల్లో లైట్లు ఉండవు. దీంతో దీన్ని కూడా అదే కేటగిరీలో భాగంగా లైట్లు లేకుండా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ రోడ్డు పట్టణాలకు దూరంగా నిర్మితమవుతోంది. ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లు, మరీ పట్టణాలకు దగ్గరగా ఉన్న పరిమిత ప్రాంతాల్లో మాత్రం లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లే వాహనాలు చీకటి వేళ సొంత లైట్ల కాంతినే ఆధారం చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత అవతలి వరుసల నిర్మాణం.. ఆర్ఆర్ఆర్ను ఎనిమిది లేన్లతో డిజైన్ చేశారు. కానీ, ప్రస్తుత అవసరాలకు నాలుగు లేన్లు మాత్రమే సరిపోతాయని నిర్ణయించారు. దీంతో తొలుత సెంట్రల్ మీడియన్ను ఆనుకుని నాలుగు (ఒక్కో వైపు రెండు చొప్పున) వరుసలు నిర్మించాలని భావించారు. కానీ, ఇప్పుడు నిర్ణయం మార్చుకుని తొలుత చివరి భాగాల్లో రెండు చొప్పున నాలుగు వరుసలు నిర్మించాలని నిర్ణయించారు. భవిష్యత్లో భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ ఆర్ రైతుల ధర్నాతో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు శనివారం తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా ట్రిపుల్ ఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపు నివ్వగా.. ధర్నాకు అనుమతి లేదని నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించారు. ధర్నా నిర్వహించేందుకు కలెక్టరేట్ వద్దకు బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్ తదితరులు హాజరయ్యారు. రైతులు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్తోపాటు 10 మంది నిర్వాసితులు వేర్వేరుగా కలెక్టరేట్లోకి వెళ్లి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందించారు. -
దక్షిణ వలయం.. అయోమయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్ను రూపొందించే పనిలో ఉంది.గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్మెంట్లు, డీపీఆర్లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది. సీఎం సమీక్షలు, కమిటీలుఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్మాల పరియోజన గడువు తీరిపోయింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.ఎవరి పనిలో వారు..!దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్హెచ్ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి అందించింది.అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్మెంటును తయారు చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్హెచ్ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.మేమే కసరత్తు చేస్తాం: ఎన్హెచ్ఏఐ‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఫోర్త్ సిటీ, ఆర్ఆర్ఆర్పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). వరదలు లేని నగరంగా హైదరాబాద్(Hyderabad)ను తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి నేడు సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించడం సంతోషం. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాకు ఓ కల ఉంది. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్లో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ(Fourth city)ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.ఈవీ బస్సులే..ఇక, తెలంగాణలో 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయబోతున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం.ఆర్ఆర్ఆర్..రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీల పొడవు రీజినల్ రింగ్ రోడ్ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాము. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. రెండు రింగ్ రోడ్డుల మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు.ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి వాటిపైన దృష్టి పెడతాము. తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. అందరం కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఇక్కడ తొలగించి..అక్కడ పెంచి..!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణంతో 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయి. ఈ భాగం రోడ్డు అలైన్మెంటు పరిధిలో ఉన్నందున వీటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతించింది. భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సిరావటంతో పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కోల్పోయిన చెట్లకు ప్రతిగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మహబూబాబాద్లో భూమిని ఎంపిక చేశారు. మూడు ప్రాంతాల్లో ఎక్కువ అటవీ భూములు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. నిడివిలో మూడు ప్రాంతాల్లో అటవీ భూములు అడ్డు వస్తున్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆయా అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్మెంటును రూపొందించింది. గజ్వేల్, నర్సాపూర్, యాదాద్రి ప్రాంతాల్లో ఈ అటవీ భూములున్నాయి. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లు.. వెరసి 72.3536 హెక్టార్ల మేర అటవీ భాగం అలైన్మెంటు పరిధిలోకి వచ్చింది. అంటే 200 ఎకరాలకు లోపు మాత్రమే ఉత్తర రింగు ప్రభావానికి గురికానున్నాయి. ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. దీంతో వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ శాఖ అనుమతించింది. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. వెరసి ఉత్తర భాగం పరిధిలో 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారన్న మాట. పరిహారం స్థానంలో మొక్కల పెంపకం ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు కూడా పరిహారం ఇచ్చే విధానం గతంలో అమల్లో ఉండేది. అయితే మోదీ ప్రభుత్వం.. పరిహారానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి వాటిల్లో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ఇప్పుడదే వర్తింపజేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కొత్తగూడ మండలం పరిధిలోని పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలం పరిధిలోని చింతల్గూడ గ్రామంలో ఈ భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో కలిపి 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారు. జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎకో బ్రిడ్జీలు 3 అటవీ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, నక్క లు, కోతులు, కొండముచ్చులు, నెమళ్లు, ఎలుగుబంట్లు కొన్ని ఇతర జంతువులు ఉన్నాయని గుర్తించారు. రోడ్డు నిర్మాణంతో వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా ఎకో బ్రిడ్జీలు (పర్యావరణ హిత వంతెనలు) నిర్మించనున్నారు. వీటివల్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నా, జంతువులు దిగువ నుంచి మరోవైపు వెళ్లేందుకు, వచ్చేందుకు వీలవుతుంది. ఇక జంతు సంచారం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు రెండు వైపులా నాయిస్ బారియర్స్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది. -
‘రీజినల్’లో మెరుగైన పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్ మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఆర్అండ్బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై... హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. -
పరిహారం తేల్చకుండానే టెండర్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చే పరిహారం ఎంతనేది తేల్చకుండానే.. రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా తమ జీవనాధారమైన భూములను కోల్పోతే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ఎంతో విలువైన ఈ భూములకు కనీసం ఎకరాకు రూ.కోటిపైగా చెల్లించాల్సిందేనని, లేకుంటే భూములు ఇచ్చేదే లేదని పేర్కొంటున్నారు. త్వరలో భూసేకరణ అవార్డు.. ‘రీజనల్’ఉత్తర భాగం కింద 161.581 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. తొలివిడతలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. పరిహారం నిర్ణయించేందుకు... ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఎకరానికి ఎంత మొత్తం చెల్లిస్తారనేది తేలలేదు. రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు ఈ భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ ఉన్నతాధికారుల ధోరణిని రైతులు తప్పుపడుతున్నారు. నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకుండా, కేవలం చట్టప్రకారం వ్యవహరిస్తామంటున్నారే తప్ప ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. భూముల విలువలు కొన్నేళ్లుగా భారీగా పెరిగాయని, దానికితోడు తాము జీవనాధారమూ కోల్పోతున్నామని... ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యాలయానికి నిర్వాసితులు.. తమ భూములకు ఇచ్చే పరిహారం తేల్చకుండానే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడా స్థానిక రెవెన్యూ అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ.. నిర్వాసితులు ఎన్హెచ్ఏఐ అధికారుల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉన్న ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు యూనిట్ కార్యాలయానికి పీడీని కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిహారంపై నిర్ణయం రెవెన్యూ అధికారులే తీసుకుంటారని వారు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.వాళ్లు చెప్పడం లేదు.. వీళ్లు తేల్చడం లేదు.. మా భూముల నుంచి రోడ్డు వేస్తామంటున్నారు. ఈ రోడ్డుకు టెండర్లు కూడా మొదలయ్యాయట. కానీ మా భూములకు ఎంత ఇస్తారో తేల్చడం లేదు. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధికారులను అడిగితే వారు రెవెన్యూ వారే చెబుతారంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – గొల్ల కృష్ణ, నిర్వాసితరైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా చట్ట ప్రకారం చెల్లిస్తాం రీజనల్ రోడ్డు భూసేకరణ ప్రక్రియపై త్వరలో అవార్డు ప్రకటిస్తాం. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం చెల్లిస్తాం. ఎకరానికి ఎంత చొప్పున ఇస్తారని లెక్కించేందుకు ఓ విధానం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రవీందర్రెడ్డి, భూసేకరణఅధికారి, రీజనల్ రింగ్ రోడ్డు -
హైస్పీడ్లోనూ అదుపులోనే!
సాక్షి, హైదరాబాద్: వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయినా అదుపు తప్పకుండా ఉండేలా రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్)ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్స్ప్రెస్వేల మీద గరిష్ట వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గంటకు 120 కి.మీ.లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. కానీ, కొన్నిచోట్ల దీన్ని లెక్కచేయకుండా పరిమితికి మించిన వేగంతో వాహనాలు దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఆర్ను గంటకు 180 కి.మీ నుంచి 200 కి.మీ. వేగాన్ని కూడా తట్టుకునే స్థాయిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఇలా.. ట్రిపుల్ ఆర్ను 8 వరసలకు ప్రతిపాదించినా.. ప్రస్తుతం నాలుగు వరసలతోనే నిర్మిస్తారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగాక మలిదశలో మిగతా నాలుగు లేన్లను నిర్మిస్తారు. రోడ్డు మీద సెంట్రల్ మీడియన్ 15 మీటర్లుగా ఉంటుంది. దానిని ఆనుకుని ఉండే (రెండువైపులా కలిపి) నాలుగు వరసలను తదుపరి దశలో నిర్మిస్తారు. రోడ్డు చివరి వైపు నాలుగు వరసలను (2 ప్లస్ 2) ప్రస్తుతం నిర్మిస్తారు. – ఈ నాలుగు వరసలు ఒక్కో వైపు 11 మీటర్లు ఉంటుంది. రెండు వైపులా కలిపి 22 మీటర్లు. ఇందులో 3 ప్లస్ 3 మీటర్లు పేవ్డ్ షోల్డర్ ఏరియా ఉంటుంది. ఏదైనా కారణంతో వాహనాలను నిలపాల్సి వస్తే.. పేవ్డ్ షోల్డర్ పరిధిలో నిలుపుతారు. ప్రధాన క్యారేజ్ వే 15 మీటర్లు ఉంటుంది. 150 ఎంఎంతో తారు వరసలు రోడ్డు మీద తారు లేయర్లు 150 ఎంఎం మందంతో వేస్తారు. ఇందులో మొదట 100 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ కాంక్రీట్ ఉంటుంది. ఇది రోడ్డుకు పటుత్వాన్ని అందిస్తుంది. తారుతోపాటు వివిధ మిశ్రమాలను ఇందులో కలుపుతారు. దీని జీవితకాలం 20 సంవత్సరాలు. ఆ తర్వాత పాత లేయర్ను మిల్లింగ్తో తొలగించి కొత్త లేయర్ వేయాల్సి ఉంటుంది. దాని మీద 50 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ మెకడం (డీబీఎం)ను పరుస్తారు. ఇది సర్ఫేస్ లేయర్. చాలా నునుపుగా ఉంటుంది. వాహనాలు వేగంగా వెళ్లినప్పుడు జారకుండా ఇది నియంత్రిస్తుంది. దీని జీవితకాలం కనిష్టంగా నాలుగేళ్లు. ఆ తర్వాత పైభాగంలో పటుత్వం కోల్పోతుంది. అప్పుడు మిల్లింగ్ ద్వారా దాన్ని తొలగించి కొత్త లేయర్ పరవాల్సి ఉంటుంది. రోడ్డు కేంబర్ కీలకం వాహనాలు వేగంగా ప్రయాణించే రోడ్లకు రోడ్ కేంబర్ చాలా కీలకం. కేంబర్ అంటే రోడ్డు వాలు. నేల సమాంతరంగా ఉన్నప్పుడు వాలు ఎంత ఉండాలి? మలుపుల వద్ద ఎంత ఉండాలి? అన్నది దీనిపై ఆధారపడి ఉంటుంది. తారుకు ప్రధాన శత్రువు నీరు. నీళ్లు నిలిస్తే తారు కణాలు విడిపోయి రోడ్డు మీద గుంతలు ఏర్పడతాయి. అందువల్ల నీళ్లు నిలువకుండా నిర్ధారిత వాలును అనుసరించాల్సి ఉంటుంది. మలుపుల్లో సూపర్ ఎలివేషన్ మలుపుల వద్ద వేగంగా తిరిగినప్పుడు వాహనం అదుపుతప్పి బోల్తాపడే ప్రమాదం ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు రోడ్డు చివరలు కాస్త ఎత్తుగా ఉండేలా డిజైన్ చేస్తారు. దాన్నే సూపర్ ఎలివేషన్ అంటారు. ఎత్తు పల్లాల్లో ఉండే మలుపుల్లో ఈ ఎలివేషన్ వేర్వేరుగా ఉంటుంది. రోడ్డు వెడల్పు, వాహనాల వేగం, ఎత్తు పల్లాలు... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎన్ని డిగ్రీల కోణంలో తిరగాలి? ఎంత ఎత్తు ఉండాలి? అన్న లెక్కలుంటాయి. దాన్ని కచ్చితంగా అనుసరించాలని నిర్ణయించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్లను వినియోగించి కచ్చితత్వంతో రోడ్డును డిజైన్ చేస్తున్నారు. మలుపు 700 మీటర్ల నిడివితో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అప్పుడు వాహనం మలుపు తిరిగిన ఫీలింగ్ రాదు. అతి వేగం ప్రమాదకరమే.. ‘ఎక్స్ప్రెస్వేల మీద గంటకు 200 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోయినా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరగటం లేదు. అలా అని 200 కి.మీ. వేగంతో దూసుకుపోయేందుకు ఆ రోడ్డు సురక్షితమని అనుకోకూడదు. మన ప్రమాణాల ప్రకారం 120 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు వాహనంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా రోడ్డు నియంత్రిస్తుంది. అంతకు మించితే పరిస్థితులు చేయిదాటిపోతాయి. 180 –200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రోడ్డు ఉన్నా.. వాహనం తయారీ పరిమితులు, డ్రైవింగ్ మెళకువలు, వాతావరణం వంటివన్నీ ప్రభావితం చేస్తాయి. రోడ్డు బాగుంది కదా అని అంత వేగంగా దూసుకుపోతే ప్రమాదాలకు అవకాశాలెక్కువ’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
రీజినల్ రింగ్ కోసం కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది
-
‘రింగు’ యమ కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ డీపీఆర్లో పేర్కొంది. 162 కి.మీ నిడివితో ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు ఏకంగా రూ. 52.5 కోట్లు ఖర్చు కానుంది. 8 వరసలుగా ప్రతిపా దించినప్పటికీ, ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో 4 వరసలను మాత్రమే నిర్మించనున్నారు. భవిష్యత్తులో దాన్ని 8 వరసలకు విస్తరిస్తారు. మరి 4 వరసల నిర్మాణానికే ఇంత భారీ వ్యయం ఎందుకు అవుతోందో చూద్దాం..5 మీటర్ల ఎత్తుతో నిర్మాణంఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగురోడ్డు స్థాయిలో దీనికి ప్లాన్ చేశారు. కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఆటంకాలు తలెత్తని రీతిలో నిర్మించబోతున్నారు. నగరం, నగర శివారు ప్రాంతాల్లో అప్పుడప్పుడు రికార్డు స్థాయి వర్షపాతం నమోదై లోతట్టు ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతాయి. కొన్నిరోజుల పాటు ఆ ప్రాంతాలు నీటిలోనే ఉంటాయి. ఇలాంటి వరదలు ఈ రోడ్డును ఇబ్బంది పెట్టకుండా భూ ఉపరితలం నుంచి 5 మీటర్ల ఎత్తుతో ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 16.4 అడుగుల ఎత్తుతో ఇంచుమించు ఎలివేటెడ్ కారిడార్ తరహాలో ఉంటుంది. అంతెత్తు మట్టి కట్ట నిర్మించి దానిమీద రోడ్డును నిర్మిస్తారు. 162 కి.మీ రోడ్డును అంత ఎత్తుతో నిర్మించేందుకు భారీ వ్యయం కానుంది. 3 నదులు.. 3 భారీ వంతెనలుఈ మార్గంలో 3 నదుల మీదుగా ఈ రోడ్డు సాగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో 4 వరసల రోడ్డుకు సరిపోయే వెడల్పుతో 3 భారీ వంతెనలు నిర్మిస్తారు. వలిగొండ వద్ద మూసీ నదిని దాటాల్సి ఉంది. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కిలోమీటరు పొడవుతో భారీ వంతెనకు డిజైన్ చేశారు. దీనికి దాదాపు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పుల్కల్ మండలం శివంపేట గ్రామం వద్ద మంజీరా నదిని దాటాల్సి ఉంది. ఇక్కడ 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.75 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక తూప్రాన్ సమీపంలో హరిద్రా నదిని దాటుతుంది. అక్కడ అర కి.మీ పొడవైన వంతెన నిర్మిస్తారు. దీనికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.190 చిన్న వంతెనలు, అండర్ పాస్లుఇతర రోడ్ల మీదుగా సాగే వాహనాలు దాటేందుకు, కాలువలు, వాగుల్లో పారే నీళ్లు దాటేందుకు వీలుగా రోడ్డు పొడవునా చిన్న వంతెనలు, అండర్ పాస్లను ప్లాన్ చేశారు. ఇవి మొత్తం 190 ఉంటాయి. వీటిల్లో 105 అండర్ పాస్లు ఉన్నాయి. దిగువన 10 అడుగుల ఎత్తుతో దారి ఉంటుంది. వాటి గుండా ఇతర రోడ్ల వాహనాలు సాగుతాయి. ఈ కల్వర్టులు, అండర్పాస్లు ఉండే చోట్ల రింగురోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇక కాల్వలు, చెక్ డ్యామ్లు, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే నీటి ప్రవాహానికి రింగురోడ్డు అడ్డుగా మారకుండా 85 చిన్న కల్వర్డులు నిర్మించనున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా, వీటి గుండా ట్రాక్టర్లు లాంటి వాహనాలు వెళ్లేలా రోడ్డు కూడా ఉంటుంది.ఇలా పెద్ద, చిన్న వంతెనలు, కల్వర్టులు, అండర్పాస్ల నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీపీఆర్లో పొందుపరిచారు. ఇక తారు పొరలు కూడా చాలా మందంగా ఉండనున్నాయి. వాహనాలు 120 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున, అవి జారిపోయే ప్రమాదం లేకుండా రోడ్డుపైన ప్రత్యేక మెటీరియల్తో పొరలు నిర్మించనున్నారు. దిగువ తారు పొరలు కూడా చాలా మందంగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి మొత్తంగా రూ.8,500 కోట్ల వ్యయం అవనుంది. -
రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు..
-
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లను ఆహా్వనించింది. 161.518 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. ఆలోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ డాక్యుమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు.. రీజినల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూ ర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత బీఓటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్), హామ్ వంటి విధానాలను పరిశీలించినా.. ఈ రోడ్డుపై వాహన ట్రాఫిక్ ప్రస్తుతానికి తక్కువగా ఉంటుందన్న అంచనాతో ఈపీసీ వైపు మొగ్గు చూపింది. మిగతా రెండు పద్ధతుల్లో నిర్మాణ సంస్థ తొలుత నిర్మాణ ఖర్చు మొత్తాన్ని భరించి, టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం టోల్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని, నిర్మాణ సంస్థలు ముందుకురాకపోవచ్చని భావనకు వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఈపీసీ వైపు మొగ్గు చూపింది. నిర్మాణం పూర్తయ్యాక టోల్ను ఎన్హెచ్ఏఐ సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తం వ్యయం రూ.17,080 కోట్లు నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆ వెంటనే ఎన్హెచ్ఏఐ రీజనల్ ఉత్తర భాగం డీపీఆర్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది. రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.17,080 కోట్లుగా (రాష్ట్ర ప్రభుత్వ వాటా సహా) ప్రతిపాదించింది. ఇందులో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.8,500 కోట్లు, భూసేకరణ వ్యయంలో కేంద్రం వాటా రూ.2,580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,580 కోట్లు, ఇతర వ్యయం రూ.3,420 కోట్లుగా పేర్కొంది. మొత్తంగా ఎనిమిది లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు లేన్ల రోడ్డును నిర్మించి, భవిష్యత్తులో మిగతా నాలుగు లేన్లను నిర్మించనున్నారు. రెండింతలు అయిన వ్యయం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదించిన ఏడేళ్ల తర్వాత డీపీఆర్ సిద్ధమైంది. ప్రస్తుత ధరలు, పరిస్థితుల మేరకు అంచనా వ్యయం సుమారు రెండింతలై ఏకంగా రూ.17 వేల కోట్లు దాటింది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఐదు ప్యాకేజీలు ఇవే.. రీజనల్ రింగ్రోడ్డు ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ప్యాకేజీ–1: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయ అంచనా రూ.1,529.19 కోట్లు. ప్యాకేజీ–2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1114.80 కోట్లు. ప్యాకేజీ–3: ఇస్లాంపూర్ నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,184.81 కోట్లు. ప్యాకేజీ–4: ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మీద ఉన్న రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.1,728.22 కోట్లు. ప్యాకేజీ–5: రాయగిరి నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు. వ్యయ అంచనా రూ.1,547.04 కోట్లు. 11 చోట్ల భారీ ఇంటర్చేంజ్ కూడళ్లు రీజనల్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. జాతీయ/రాష్ట్ర రహదారులను ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మొదటి కూడలి: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్.. ఇక్కడ ఎక్సె్టండెడ్ డంబెల్ ఆకృతిలో భారీ ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని నిడివి 3 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండో కూడలి: సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 జాతీయ రహదారిని క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్లో ఉంటుంది. మూడో కూడలి: నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ను ఎంపిక చేశారు. నాలుగో కూడలి: హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లీవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. ఐదో కూడలి: తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్పల్లి వద్ద. ఇక్కడ రోటరీ డిజైన్ను ఖరారు చేశారు. ఆరో కూడలి: రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక క్లీవర్ లీఫ్ (మూడు లూప్లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. ఏడో కూడలి: జగదేవ్పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఇక్కడ రోటరీ డిజైన్ను ఎంపిక చేశారు. ఎనిమిదో కూడలి: తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్లో నిర్మిస్తారు. తొమ్మిదో కూడలి: హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద.. డబుల్ ట్రంపెట్ డిజైన్లో నిర్మించనున్నారు. పదో కూడలి: భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ను ఖరారు చేశారు. 11వ కూడలి: చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు. ఎది ఎక్స్టెండెడ్ డంబెల్ నమూనాలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ టెండర్లకు కానరాని స్పందన మరోవైపు రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో.. ఈ భాగాన్ని సొంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించింది. తుది అలైన్మెంట్ తయారీ కోసం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. దాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు శనివారం తెరిచారు. అయితే ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదని తెలిసింది. మరోవైపు రోడ్డు నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించిన మేరకు ఎన్హెచ్ఏఐతోనే చేపట్టాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఆ రోడ్డు నిర్మాణంపై సందిగ్ధత చోటు చేసుకుంది. -
దీని వెనుక ఏదో మతలబు ఉంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ను ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్ఎండీఏకు అవతల ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్ చెప్పారు.ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
ఉత్తర ‘రింగు’ అలైన్మెంటుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భా గానికి సంబంధించిన అలైన్మెంటును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గతంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదించగా, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్కు ఎక్స్ప్రెస్ వే నంబరు కూడా త్వరలో రానుంది. అలైన్మెంటు ఓకే అయిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఉత్తర భాగానికి టెండర్లు పిలవనున్నారు. అలైన్మెంటు మార్పు వినతుల సంగతేంటి? ఉత్తర భాగం అలైన్మెంటులో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీని కలిసి వినతులు అందించారు. సంగారెడ్డి సమీపంలో, యాదాద్రి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ఇంటర్ఛేంజ్ కూడలి.. ఇలా పలుచోట్ల అలైన్మెంటును కొంతమేర సవరించాలని కోరారు. ఇందులో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కొన్ని భూముల వివరాలు 3డీ గెజిట్లో నమోదు కాలేదు. ఆ గెజిట్ విడుదలైతేనే భూసేకరణ జరుగుతుంది. ఎలాగూ గెజిట్లో వివరాలు నమోదు కానందున, అలైన్మెంటు మార్పు పెద్ద కష్టం కాదనేది నేతల అభిప్రాయం. అయితే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆయా భూముల వివరాలు 3డీ గెజిట్లోకి రాలేదని, అలాంటి భూములు మొత్తం భూముల్లో కేవలం 0.4 శాతం లోపేనని ఎన్హెచ్ఏఐ వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ సమయంలో అలైన్మెంటులో మార్పులు చేస్తే, కొత్త ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ వినతులను పూర్తిగా కొట్టిపడేయలేదు. దీంతో అలైన్మెంటులో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ అలైన్మెంటుకు ఆమోదముద్ర వేయటంతో మార్పుల అంశంపై ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్హెచ్ఏఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో జాతీయ రహదారులకు సంబంధించిన అలైన్మెంట్లకు ఎన్హెచ్ఏఐ ఆమోదంతో సరిపోయేది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర మంత్రిత్వశాఖ కచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే నిబంధన వచ్చింది. ఆ మేరకు మంత్రిత్వ శాఖలో కొత్తగా అలైన్మెంటు అప్రూవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భేటీలోనే ఉత్తర భాగం అలైన్మెంటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నంబర్ వస్తేనే పర్యావరణ అనుమతులు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పా ట్లు చేస్తున్న క్రమంలో ఆ రోడ్డుకు ఎక్స్ప్రెస్ వే నంబరు కేటాయింపు కీలకంగా మారింది. ఆ నంబరు కేటాయిస్తేనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అవి ఉంటేనే టెండర్లను తెరిచేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ప్రెస్ వే నంబరును వీలైనంత త్వరలో కేటాయించాలని నిర్ణయించారు. -
ఉత్తర ‘రింగు’ ఇంకాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగానికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత రావటం లేదు. టెండర్లు పిలిచే నాటికే పరిహారం అందిస్తారని ఆశించినా, అందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.పరిహారం అందించిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఆదేశించారు. కానీ, ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్ పరిహారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. జాప్యమెందుకు? ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ చేపడు తున్న విషయం తెలిసిందే. ఈ భాగానికి టెండర్లు పిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంట్ను సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. డిసెంబరు చివరికల్లా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలుస్తారని ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగానికి అటవీ అనుమతులు కూడా వచ్చాయని ఆయన అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు. అవి రాకుండా అవార్డులు పాస్ చేసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు రావాలంటే, ఆ రోడ్డుకు నంబరు కేటాయించాల్సి ఉంటుంది. ట్రిపుల్ఆర్ ఎక్స్ప్రెస్వే కేటగిరీలో నిర్మిస్తున్నందున దానికి ఎక్స్ప్రెస్ వే నంబరు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నంబరు కేటాయించలేదు. ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయితేనే... దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలకు నంబర్లు కేటాయించాలంటే నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అనుమతివ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీ ఇంకా భేటీ కాలేదు. దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న రోడ్లన్నింటికి సంబంధించి ఒకేసారి నంబర్లు కేటాయించే కసరత్తు చేస్తున్నందున, అన్నింటికి కలిపి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నంబరు కేటాయింపులో జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు పరిహారం చెల్లింపులో ఆలస్యానికి కారణమైంది. ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి ప్రాథమిక అనుమతి లభించింది. సేకరించే అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఇది అనుమతిస్తుంది. దీని కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోపు అటవీశాఖకు పరిహారం, ప్రత్యామ్నాయ భూకేటాయింపు, అక్కడ చెట్ల పెంపకానికి అయ్యే వ్యయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కసరత్తు జరిగితేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి. అటవీశాఖ పూర్తి అనుమతులు, పర్యావరణ అనుమతులు రాకుండా కూడా టెండర్లు పిలిచుకునే వీలుంటుంది. కానీ, టెండర్లు తెరవాలంటే మాత్రం ఆ అనుమతులు వచ్చి ఉండాలి. ఇక పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే మాత్రం విధిగా పర్యావరణ అనుమతులు వచ్చి ఉండాలి. దాని విషయంలో జాప్యం పరిహారం అందకుండా చేస్తోంది. ఇప్పటికిప్పుడు రోడ్డు నంబరు కేటాయించినా, ఆ తర్వాత పర్యావరణ అనుమతుల జారీ కసరత్తు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెరసి మరో రెండుమూడు నెలల సమయం పట్టే వీలుందని వారు చెబుతున్నారు. -
ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది. ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డిట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు. -
‘ఉత్తర రింగు’ @ రూ.16,800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి దాదాపు రూ.16,800 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఈ భాగం రోడ్డు నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ప్రైవేట్ సంస్థ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్ను ఇటీవలే ఎన్హెచ్ఏఐకి అందజేయగా, దాని ఆధారంగా ఈ లెక్క తేల్చారు. దీని ఆధారంగా త్వరలో ఎన్హెచ్ఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. నిర్మాణ పనులు ప్రారంభం కావటానికి ఇంకా ఆరేడునెలల సమయం ఉన్నందున, అప్పటికి ఉండే మార్కెట్ ధరల ఆధారంగా ఈ అంచనాలు మరికాస్త పెరగొచ్చు. రోడ్డు నిర్మాణం ఇలా... దాదాపు 162 కి.మీ. నిడివితో ఉండే రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనుల(సివిల్ కాస్ట్)కు రూ.8,100 కోట్లు ఖర్చు అవుతుందని ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా రూపొందించిన అంచనా స్పష్టం చేస్తోంది. మొదట నాలుగు వరుసలకు.. ఒక్కో కి.మీ.కు దాదాపు రూ.50 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంది. ఈ రోడ్డు 5 మీటర్ల ఎత్తుతో ఉండేలా డిజైన్ చేయడంతో నిర్మాణ వ్యయం అధికంగా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి కి.మీ. నిడివికి ఒకటి చొప్పున కల్వర్టు, అండర్పాస్, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఓ నిర్మాణం ఉంటుంది. దీంతో ఖర్చు భారీగా అవుతుంది. కనీసం 10 అడుగుల ఎత్తు అప్రోచ్తో అండర్పాస్లను నిర్మిస్తారు. భూసేకరణకు.... ఈ భాగం రోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. దీనికి పరిహారంగా దాదాపు రూ.5,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించనుంది. ప్రస్తుతానికి నాలుగు వరు సల రోడ్డే నిర్మిస్తున్నా, భవిష్యత్లో దానిని 8 లేన్లకు విస్తరిస్తారు. అందుకు వీలుగా ఇప్పుడే భూసేకరణ చేపట్టారు. ⇒ ఈ అలైన్మెంటులో సేకరించాల్సిన భూముల్లో దాదాపు 80 హెక్టార్ల అటవీ భూములున్నాయి. అటవీశాఖకు పరిహారంగా మరోచోట భూమిని కేటాయించటంతోపాటు, ఆ భూమిలో మొక్కల పెంపకానికి అయ్యే వ్యయం కూడా చెల్లిస్తారు. సేకరించిన భూమిలో తొలగించే చెట్లకు విలువ కట్టి చెల్లిస్తారు. ఈ అటవీ భూముల్లో దాదాపు 20 హెక్టార్ల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వారిలో నిరుపేదలున్నందున వారిపేరిట గతంలో పట్టాలు కూడా జారీ అయ్యాయి. అలా పట్టాలు పొందిన వారికి లెక్క ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుందని తేల్చారు. -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
మూసీ నిర్వాసితుల కోసం టవర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిర్వాసితులు సకల సౌకర్యా లతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళల కు రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పా టు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కోసం 39 ఎస్టీపీలు మంజూరు చేశామని భట్టి చెప్పారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై త్వరలోనే ఎస్ఎల్బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో అనుకూలంగా ఉన్న వాళ్లను దగ్గరికి తీసుకోవడం, లేని వాళ్లను దూరం పెట్టడం వంటి ఆలోచన తమకు లేదన్నారు.అద్భుతంగా ఫ్యూచర్ సిటీ..: హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు 30 వేల ఎకరాల్లో అద్భుతంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చని.. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం వంటివెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, సంకల్పంతో ఉందన్నారు. నాటి పాలకులు బీహెచ్ఈఎల్, సీసీఎంబీ, హెచ్ఈ ఎల్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని.. ఫలితంగా వారి నివాసం కోసం కూకట్పల్లి, వెంగళరావునగర్, బర్కత్పుర వంటి హౌసింగ్ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించామన్నారు. ఆ నిధులతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచ డెవలపర్లను ఆకర్షిస్తామని చెప్పారు. -
అలైన్మెంట్లో టింక‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. ఎక్కడెక్కడ మార్పులు – సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్తో అనుసంధానించాల్సి ఉంది. దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు. – యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. – ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్మెంటు మార్చాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన అలైన్మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు. చిన్న మార్పుతో భారీ తేడా! రింగురోడ్డు అలైన్మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. -
అలైన్మెంట్ను మార్చండి..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ‘అవార్డు ఎంక్వైరీ’ని బహిష్కరించారు. మూడు రోజుల పాటు రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించతలపెట్టిన అవార్డు ఎంక్వైరీని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమన్నారు. బుధవారం మొదటి రోజు విచారణను బహిష్కరించిన నిర్వాసితులు, జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భాగంలో పాటిస్తున్న విధంగానే 40 కిలోమీటర్ల నిబంధన ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పలుమార్లు అలైన్మెంట్ను మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేసే హక్కు పాలకులు, అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే అలైన్మెంట్ను మార్చాలని, లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్రెడ్డి, మారుపాక రామలింగం, చింతల ప్రభాకర్రెడ్డి, సందగళ్ల మల్లేష్, సుర్కంటి రాజిరెడ్డి, బోరెం ప్రకాష్రెడ్డి, చింతల సుధాకర్రెడ్డి, దబ్బటి రాములు, ఏనుగు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్ప్రెస్వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్ప్రెస్వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
‘రీజనల్’ చుట్టూ సెజ్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మించనుండటంతో..ఈ రోడ్డు ఉండే చాలా ప్రాంతాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అక్కడి భూములకు డిమాండ్ పెరుగుతుంది, రోడ్డు సదుపాయం వల్ల పరిశ్రమల స్థాపనకూ వీలవుతుంది. అలాంటి చోట్ల ‘స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)’లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని.. అదే సమయంలో సెజ్లలో కంపెనీలకు భూములు కేటాయించటం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇది సాకారం కావాలంటే.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారయ్యే ప్రాంతా ల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాల్సి ఉండనుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.గతంలోనే ప్రతిపాదనలున్నా..హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. నగర రూపురేఖలను మార్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 2006లో ఓఆర్ఆర్ నిర్మాణానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల తర్వాత దశలవారీగా అది అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచి పురోగతి మొదలైంది. డిమాండ్ పెరిగింది. కానీ ఆ రోడ్డును ఆనుకుని ప్రభుత్వానికి కొత్తగా భూవనరులేవీ సమకూరకపోవడంతో.. అదనపు ఆదాయమేదీ రాలేదు. భవిష్యత్తులో రీజనల్ రింగురోడ్డు కూడా ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే ఆయా ప్రాంతాలకు కొత్త రూపును ఇవ్వడం ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోకపోవటం వంటి పొరపాటును ఇప్పుడు చేయవద్దని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత భూమిని సేకరించి పెట్టుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.అలైన్మెంట్ మార్పు నేపథ్యంలో..రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని సొంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో రూపొందించిన అలైన్మెంట్ను కాదని.. కొత్త అలైన్మెంట్ను రూపొందిస్తోంది. భూసేకరణ వ్యయంలో 50శాతం భరించటం మినహా మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించే అవకాశాన్ని కూడా కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రింగ్రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పడింది.అంత భూసేకరణ సాధ్యమేనా?రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. దానికంటే దక్షిణ రింగ్ దాదాపు 50 కిలోమీటర్ల నిడివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు 2,400 హెక్టార్లకుపైగా భూమి రోడ్డు నిర్మాణానికే కావాలి. ఈ భూముల సేకరణ ఎలాగన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రీజనల్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలాంటిది రోడ్డు కోసమే కాకుండా అదనంగా భూమిని సేకరించడం ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టులకు భూములి చ్చేందుకు రైతులు ఇష్టపడక న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకుంటే.. రీజనల్ రోడ్డు వెంట భవిష్యత్తులో భూమిని సమీకరించడం సాధ్యమయ్యే పనికాదని.. ఇప్పుడే ముందుకెళ్తే ప్రయోజనమని అధికారవర్గాలు చెబుతు న్నాయి. -
రీజనల్ రింగ్.. మరింత లాంగ్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను మించిపోనుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టిన పరిశీలనను కాదని రాష్ట్ర ప్రభుత్వం విడిగా రూపొందించిన అలైన్మెంట్, దానిలో మార్పులు చేయాల్సిన పరిస్థితులే దీనికి కారణం. గతంలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన చేపట్టి మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించగా.. అందులో 189.425 కిలోమీటర్ల నిడివి ఉన్న మూడో అలైన్మెంట్ను ఖరారు చేశారు. దాన్ని ఎన్హెచ్ఏఐ ఆమోదించేలోగా లోక్సభ ఎన్నికలు రావడంతో పెండింగ్లో పడింది. తర్వాత రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. సొంతంగా దక్షిణ భాగం రింగ్రోడ్డును చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో అలైన్మెంట్పై చర్చలు జరిగాయి. కొన్ని కన్సల్టెన్సీ సంస్థల సాయంతో గూగుల్ మ్యాప్ల ఆధారంగా ప్రాథమికంగా ఓ అలైన్మెంట్ను అధికారులు సిద్ధం చేశారు. గతంలో ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్లో చాలా మార్పులు చేస్తూ, కొత్త ప్రాంతాల మీదుగా రింగ్రోడ్డు కొనసాగేలా రూపొందించారు. దానితో దక్షిణభాగం నిడివి 194 కిలోమీటర్లకు చేరింది. అయితే అది క్షేత్రస్థాయి పరిశీలనతో రూపొందించినది కాకపోవటంతో పలు లోపాలు ఉండిపోయాయి. ఆ అలైన్మెంట్ను ఉన్నది ఉన్నట్టుగా ఖరారు చేసే పరిస్థితి లేదు. జలాశయాలు, రిజర్వాయర్లు, గుట్టలు, వాగులు, వంకల మీదుగా దాన్ని రూపొందించడమే కారణం. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ తప్పిస్తూ.. తుది అలైన్మెంట్ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనితో నిడివి మరో 12 కిలోమీటర్లకుపైగా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన రీజనల్ రింగ్రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను దాటిపోతుందని అంటున్నారు. రూ.1,200 కోట్లు అదనపు వ్యయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ను ఖరారు చేసే పనిలో ఉంది. ఇటీవలే 12 మంది అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 194 కిలోమీటర్ల ప్రాథమిక అలైన్మెంట్ను ఆధారంగా చేసుకుని.. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్మెంట్ను సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక అలైన్మెంట్లోని లోపాలను సరిదిద్దితే.. రోడ్డు నిడివి పెరగనుంది. దీనితో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆమన్గల్ ఆవలి నుంచి.. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్ ఆమన్గల్ పట్టణం ఇవతలి నుంచి ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఆమన్గల్ పట్టణం అవతలి నుంచి అలైన్మెంట్ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ పట్టణం పూర్తిగా రీజనల్ రింగురోడ్డు లోపలికి రానుంది. ఇక చేవెళ్ల మండలం పరిధిలోని ఆలూరు –కిష్టాపూర్ గ్రామాల సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేను క్రాస్ చేసేలా ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఉండగా.. ఇప్పుడు మన్నెగూడ వద్ద క్రాస్ చేసేలా మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మరెన్నో మార్పులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రాథమిక అలైన్మెంట్ స్థానంలో.. మరో తాత్కాలిక అలైన్మెంట్ను కొత్తగా రూపొందించినట్టు సమాచారం. గతంలోనూ ఇలాగే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను రూపొందించకముందు, రాష్ట్ర ప్రభుత్వం అ«దీనంలో ఎన్హెచ్ విభాగం ఓ ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించింది. అప్పట్లో కూడా అధికారులు గూగుల్ మ్యాపుల ఆధారంగా దాదాపు 182 కిలోమీటర్ల నిడివితో దాన్ని రూపొందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడలో ఉన్న రిజర్వాయర్ మధ్యలోంచి రోడ్డును నిర్మించేలా సిద్ధం చేశారు. దీనితో ఆ రిజర్వాయర్ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్ను ఆసరా చేసుకుని సాగు భూముల్లోంచి అలైన్మెంట్ మార్కింగ్ చేసిన అంశాన్ని.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కొత్త అలైన్మెంట్ రూపొందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది.ప్రస్తుతం జలాశయాల మీదుగా..ఇది దక్షిణ రింగురోడ్డు ప్రారంభ ప్రాంతం. ఉత్తర రింగ్ ప్రారంభయ్యే సంగారెడ్డి పట్టణం చేరువలోని గిర్మాపూర్ వద్ద దక్షిణ భాగం రింగురోడ్డు అనుసంధానమయ్యే చోటు ఇది. ఇక్కడ ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్ ప్రారంభంలోనే ఓ లూప్ తరహాలో అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి (లేత నీలిరంగు గీత) మొదలవుతుంది. దీన్ని లోపంగా భావించారో, మరేమో గానీ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్లో దాన్ని (ముదురు నీలిరంగు) స్ట్రెయిట్ లైన్గా మార్చారు. నిజానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. కొండాపూర్ మండలం తొగర్పల్లి పెద్దచెరువు పరీవాహక ప్రాంతాన్ని తప్పించేందుకు ఢిల్లీ కన్సల్టెన్సీ లూప్లో అలైన్మెంట్ రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని నేరుగా ఉండేలా మార్చటం వల్ల చెరువు పరీవాహక ప్రాంతం మీదుగా రోడ్డు వస్తుంది, అలాగే నిర్మించాలంటే ఎలివేటెడ్ విధానాన్ని అనుసరించాలి. అది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక మర్రిగూడ మండలం కిష్టరాయునిపల్లి వద్ద ఓ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. దాన్ని తప్పించేందుకు ఢిల్లీ సంస్థ ఆ ప్రాంతంలో వంపు తిరుగుతూ అలైన్మెంట్ను రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని కూడా నేరుగా మార్చటం వల్ల.. ప్రతిపాదిత రిజర్వాయర్ భూముల్లోంచి రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. అది కుదిరే పనికాదు. లేదా అతి భారీ ఫ్లైఓవర్లు కట్టాల్సి వస్తుంది. దక్షిణభాగం పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో.. ప్రాథమిక అలైన్మెంట్కు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
ట్రిపుల్ ఆర్పై కాంగ్రెస్ మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపు ల్ ఆర్) భూ సేకరణలో నష్టపోతున్న రైతులు, బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్తో నష్టపోతున్న రైతులు మంగళవారం హరీశ్రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తూ భువనగిరి సభలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో జంక్షన్ను 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని రైతులు నష్టపోతున్నారు. గతంలో జంక్షన్ రింగును 78 ఎ కరాల్లో ప్రతిపాదించగా, ప్రస్తుతం 184 ఎకరా లకు పెంచడంతో నష్టం పెరుగుతుంది. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రె డ్డి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నా చేశారు. కానీ ఇప్పు డు పోలీసు బలగాలతో నిర్బంధంగా సర్వే చేసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మాట నిలుపుకునేంత వరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం’అని హరీశ్రావు చెప్పారు. -
అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకం: మాజీ మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.అలైన్మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్మెంట్కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్పు ఫోర్త్సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఆమన్గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్తో పాటు కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్కు అలైన్మెంట్ మా ర్చారన్నారు. -
సొంతంగానే దక్షిణ రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ అలైన్మెంట్ ఖరారుకే ఏడాది సమయం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్మెంట్ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్మెంట్ రూపొందించారు. మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్మెంట్ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్మెంట్పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్మెంట్ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్మెంట్గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
60 రోడ్లు.. 1,712 కిలోమీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. 200 అడుగుల వెడల్పుతో.. రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్–షాద్నగర్–సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది. లీ అసోసియేట్స్కు 10 రేడియల్ రోడ్లు ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. మూడు దశల్లో రేడియల్ రోడ్ల స్వరూపమిదీ: ఫేజ్–1: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ. » 5 రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ గుండా సాగుతాయి. » ఓఆర్ఆర్తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు–17 నుంచి కంకాల్ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లే మెదక్, నాగ్పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్ సాగుతుంది.ఫేజ్–2: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ. » ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంటుంది. ళీ ఇక ఆదిబట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి.. మునీరాబాద్ నుంచి రంగంపేట.. ఓఆర్ఆర్ ఇంద్రజీత్ మెహతా నుంచి తియల్పూర్.. ఎగ్జిట్ నంబర్–4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్ నంబర్–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్.. జన్వాడ ఎస్ఆర్ఆర్సీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్.. ఎగ్జిట్ నంబర్–15 నుంచి మధురాపూర్.. ఎగ్జిట్ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్ రోడ్లు ఉంటాయి.ఫేజ్–3: లింక్ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ. » ఫేజ్–1 లేదా ఫేజ్–2లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వరకు ఉంటాయి. » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్లను కలుపుతూ 18 లింక్ రోడ్లు. అలాగే ఓఆర్ఆర్, గ్రీన్ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి. » రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్ నుంచి వట్టిపల్లి.. గున్గల్ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్రోడ్ నుంచి చీపునుంతల.. కడ్తాల్ నుంచి చుక్కాపూర్.. రూప్సింగ్ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్ రోడ్లు నిర్మిస్తారు. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్గల్ మండలంలోని ఆమన్గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం194 కి.మీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్లను సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ప్రయోజనాలను పరిరక్షించేలా దక్షిణ రింగు అలైన్మెంట్
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఫోర్త్ సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఇతర వసతులు కల్పించేందుకు వీలుగా ఆ అలైన్మెంట్ ఉండాలని సూచించారు.బుధవారం రాత్రి తన నివాసంలో రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్టును సీపోర్టుతో అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రీజనల్రింగు రోడ్డుకు సంబంధించి గతవారం సూచించిన మార్పుల ఆధారంగా రూపొందించిన అలైన్మెంట్ను సీఎం పరిశీలించారు. అందులో కొన్ని మార్పులను సూ చించారు. అలైన్మెంట్ ఖరారుకాగానే.. వెంటనే తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్–ఓఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల కోసం ముందుగానే భూసమీకరణ, భూసేకరణ చేపట్టాలని పేర్కొన్నారు. నిర్వాసితుల విషయంలో సానుభూతితో వ్యవహరించి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని.. ప్రభుత్వపరంగా మరేదైనా అదనపు సాయం చేయగలమేమో ఆలోచించాలని సూచించారు. డ్రైపోర్టుపై పరిశీలన చేయండి డ్రైపోర్టు ఏర్పాటుకు సంబంధించి కాకినాడ, మచి లీపట్నం రేవులను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రేవులకు ఉండే దూరంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉన్నదీ, తెలంగాణకు దేనిద్వారా ఎక్కువ ఉపయోగం కలుగుతుందనే విషయాలను గమనంలో ఉంచుకోవాలని సూచించారు. ఈ అధ్యయనం తర్వాతే గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్–ఓఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బెంగళూరులో ఉన్న జిందాల్ నేచర్కేర్ వంటివి మనవద్ద కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాచకొండ ప్రాంత ప్రకృతి రమణీయత సినీ పరిశ్రమను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
3 నదులపై 3 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో మూడు నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండటంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తలమునకలై ఉంది. భూసేకరణ ప్రక్రియలో కీలక అంకమైన అవార్డులను పాస్ చేసే ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఆపై మరో 5–6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు డిజైన్ సహా ఇంటర్చేంజ్ వంతెలు, నదీ వంతెనలు, అండర్పాస్లు తదితర స్ట్రక్చర్ డిజైన్లు సిద్ధం చేసుకుంది. ఉత్తర భాగంలో మూడు చోట్ల రీజనల్ రింగురోడ్డు నదులను క్రాస్ చేస్తుంది. ఆ మూడు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించనుంది. మూసీ నదిపై వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో, మంజీరా నదిపై పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో, హరిద్రా నది (హల్దీ నది/హల్దీ వాగు) తూప్రాన్ దగ్గర ఈ వంతెనలను నిర్మించనున్నారు. మూసీపై కిలోమీటర్ పొడవుతో.. మూడు నదులపై నిర్మించే వంతెనల్లో మూసీ నదిపై దాదాపు కిలోమీటరు పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. నల్లగొండ–భువనగిరి రోడ్డులో భాగంగా ఇప్పటికే వలిగొండ వద్ద వంతెన ఉండగా ఇప్పుడు వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ శివారులో ఈ వాగును రీజనల్ రింగురోడ్డు క్రాస్ చేయనుంది. అక్కడ కిలోమీటరు పొడవుతో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. దీనికి దాదాపు రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నాందేడ్ జాతీయ రహదారికి సమాంతరంగా.. మెదక్–సంగారెడ్డి రోడ్డు 161వ నంబర్ నాందే డ్–హైదరాబాద్ జాతీయ రహదారిలో కలిసిన ప్రాంతంలో మంజీరా నదిపై వంతెన నిర్మించనున్నారు. పుల్కల్ మండలం శివంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిని రీజనల్ రింగు రోడ్డు క్రాస్ చేయనుంది. దీంతో అక్కడ దాదాపు 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. తూప్రాన్ సమీపంలో.. గజ్వేల్ మీదుగా ప్రవహిస్తూ మంజీరా నదిలో కలిసే హరిద్రా నదిపై తూప్రాన్ వద్ద మూడో వంతెనకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇప్పటికే అక్కడ ఓ వంతెన ఉంది. దానికి దాదాపు చేరువలో తూప్రాన్ వద్ద మరో వంతెన రానుంది. తొలుత నాలుగు వరసలకే.. రీజనల్ రింగు రోడ్డును 8 వరుసలతో నిర్మించేలా ప్రణాళిక రచించినా తొలుత నాలుగు లేన్లకే పరిమితమవుతున్నారు. మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగు సమయంలో నిర్మించనున్నారు. అయితే ఆ నాలుగు వరుసలకు సరిపడా భూమిని సైతం సేకరించి చదును చేసి వదిలేయనున్నారు. మిగతా నాలుగు లేన్లను మాత్రం ఇప్పుడు నిర్మించనున్నారు. ఈ కారిడార్లో భాగంగానే వంతెనలు ఉంటున్నందున వాటిని కూడా ఎనిమిది వరుసలకు సరిపడేలా నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన క్యారేజ్ వేను నాలుగు లేన్లకు పరిమితం చేసినందున వంతెనలను కూడా నాలుగు లేన్లకే సరిపడేలా నిర్మించనున్నారు. ఇప్పుడు నిర్మించే వంతెనల పక్కనే తదుపరి నాలుగు వరుసల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. పక్కపక్కనే నిర్మించేప్పుడు పాత వంతెనల పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి ప్రమాదం లేకుండా ఫౌండేషన్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వాటికి ప్రత్యేక డిజైన్ను అనుసరించనున్నారు. -
సొంతంగానే ‘దక్షిణ రింగు’!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. అలైన్మెంట్ రూపొందించటంసహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా సొంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మూడు కన్సల్టెన్సీ సంస్థలను సంప్రదించి అలైన్మెంట్పై చర్చించిననట్టు విశ్వసనీయ సమాచారం. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీని కలిసినప్పుడు మొదటిసారి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ట్రిపుల్ ఆర్లోని 162 కి.మీ. ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అన్ని గెజిట్లు జారీ చేసి, భూమిని తన అధీనంలోకి తీసుకుంది. అవార్డులు పాస్ చేసి భూ నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయటమే తరువాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. దీంతో ఈ భాగం రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. ఇక దక్షిణ భాగం విషయానికొస్తే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను గతేడాదే ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం–కేంద్రప్రభుత్వం మధ్య సఖ్యత కొరవడటంతో దక్షిణభాగంలో కసరత్తు నిలిచిపోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాగా, అలైన్మెంట్కు కూడా ఆమోదం లభించలేదు. దీంతో దక్షిణభాగం రోడ్డు కసరత్తు ఇప్పట్లో మొదలు కాదన్న అభిప్రాయం నెలకొంది. ఈ తరుణంలో దక్షిణభాగాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ఢిల్లీ తరహాలో...ఢిల్లీ ఔటర్ రింగురోడ్డులో వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేను ఎన్హెచ్ఏఐ నిర్మించింది. ఇప్పుడు ఇదే తీరుగా.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డులో ఉత్తర భాగాన్ని ఎన్హెచ్ఏఐ, దక్షిణభాగాన్ని తెలంగాణ చేపట్టాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.ఖర్చు భరించగలదా..?దాదాపు ఐదేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన వచ్చినప్పుడు రెండు భాగాలు కలిపి రూ.17 వేల కోట్ల వ్యయంలో పూర్తవు తుందని అంచనా వేశారు. కానీ, గతేడాది జనవరిలో దక్షిణ భాగానికి సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ రూ.12,900 కోట్ల అంచనాతో నివేదిక సమర్పించింది. ఇప్పుడు అది రూ.19 వేల కోట్లకు చేరింది. ఇంతపెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించటం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. బీఓటీ, హెచ్ఏఎం పద్ధతులను అవలంబిస్తుండటంతో ప్రభుత్వంపై భారం తక్కువగానే ఉంటుంది. రోడ్డు నిర్మాణం, నిర్వహణ చూసే సంస్థలే ఎక్కువ మొత్తాన్ని భరిస్తాయి. ఈ పద్ధతిలో భారం ఉండకపోవచ్చన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం.అలైన్మెంట్ ప్రక్రియే కీలకం..ట్రిపుల్ ఆర్ ఆలోచన మొగ్గ తొడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ ప్రాథమిక అలైన్మెంట్ చేశారు. కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా అది జరిగింది. దక్షిణభాగం పరిధిలో ఆ అలైన్మెంట్ మరింత గందరగోళంగా ఉంది. ఆ భాగానికి సంబంధించి తర్వాత ఎన్హెచ్ఏ ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించింది. దాని ప్రతినిధులు కొన్ని నెలల పాటు క్షేత్రస్థాయిలో తిరిగి పాత అలైన్మెంట్ మొత్తం గందరగోళంగా ఉందని గుర్తించి, జలవన రులు, జనావాసాలకు దూరంగా వంకర టింకర లేని కొత్త అలైన్మెంట్ సిద్ధం చేశారు. 2023 జనవరిలో మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐకి ఆ సంస్థ సమర్పించింది.అందులో 189.205 కి.మీ. నిడివి ఉండే అలైన్మెంట్ను ఎన్హెచ్ఏఐ దాదాపు ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే, మళ్లీ కొత్తగా అలైన్మెంట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోని కన్సల్టెన్సీ సంస్థ పట్టించుకోకుండా శాస్త్రీయంగా అలైన్మెంట్ను రూపొందించింది. ప్రస్తుత అలైన్మెంట్ మారే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. -
వేగంగా భూసేకరణ.. ట్రిపుల్ ఆర్ పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘సంగారెడ్డి–ఆమన్గల్–షాద్నగర్–చౌటుప్పల్ (189.20 కి.మీ.) మీదుగా నిర్మించే రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలి. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలావరకు పూర్తయినందున, దక్షిణ భాగం కోసం కూడా ప్రారంభించాలి. భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. పనుల్లో మాత్రం జాప్యం లేకుండా చూడాలి..’ అని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ట్రిపుల్ ఆర్ పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ‘భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా దక్షిణ భాగం అలైన్మెంట్ ఉండాలి. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. (రోడ్డు అలైన్మెంటు మ్యాప్ను గూగుల్ మ్యాప్తో బేరీజు వేసుకుంటూ ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులను సూచించారు). నేను సూచించిన మార్పులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోజువారీ సమీక్షలు నిర్వహించాలి ‘ఆర్ఆర్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించాలి. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని నాకు అందజేయాలి. ఉత్తర భాగం విషయంలో రోజువారీ పురోగతి, దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు, ఇతర అంశాల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలి. సీఎస్తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలి. ఒక సమీక్ష సమావేశానికి, మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలి..’ అని రేవంత్ స్పష్టం చేశారు. రేడియల్ రోడ్లపై ప్లాన్ సిద్ధం చేయాలి ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ‘రేడియల్ రోడ్లు ప్రధాన రహదారులతో ఏయే ప్రాంతాల్లో అనుసంధానం చేస్తే మెరుగ్గా ఉంటుందో, సిగ్నలింగ్ సహా ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లాన్ సిద్ధం చేయాలి. అవి ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనువుగా ఉండాలి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. 15 నాటికి ఉత్తర భాగం భూసేకరణ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన మిగతా భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి నివేదిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఆర్ పై సీఎం సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్–విజయవాడ (ఎన్.హెచ్–65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని, రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే మన్నెగూడ ఎక్స్ప్రెస్వే పనులు ప్రారంభించామని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడర్ పనులు త్వరలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను గొప్పగా రూపొందిస్తామని, అవసరమైన సాయం కోసం త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు తెలిపారు. -
‘ట్రిపుల్ ఆర్’ సూపర్ గేమ్చేంజర్
సాక్షి,హైదరాబాద్: ఔటర్రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) హైదరాబాద్కు ఎలాగైతే గేమ్ చేంజర్గా మారిందో, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) కూడా తెలంగాణకు సూపర్ గేమ్చేంజర్గా మారుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూ.22 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఆధ్వర్యంలో మంగళవారం హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ థీమ్తో స్టేట్కాన్ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ మాట్లాడుతూ మూసీ రివర్ఫ్రంట్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, ముచ్చర్ల ఫోర్త్ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ వంటి బృహత్తర కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వీటితో రాష్ట్ర అభివృద్ధి నెక్ట్స్ లెవల్కు దూసుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడంతోపాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులను తయారు చేసేందుకు స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో భూముల విలువలు పెంచడంతో పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు.. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేస్థాయికి భాగ్యనగరం ఎదిగిందని కొనియాడారు. రాష్ట్ర ప్రగతిలో డెవలపర్లు కూడా భాగస్వాములేనని, నిర్మాణ రంగ సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.వైఎస్సార్ దూరదృష్టితోనే : మంత్రి కోమటిరెడ్డిఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాల పరిమితి పెట్టుకొని, ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుర్తు చేసుకున్నారు. 24 నెలల డెడ్లైన్లోనే ఔటర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు భూసేకరణ, నిర్మాణ పనులు పూర్తి చేశారని, వీటికి సమాంతరంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించారని చెప్పారు. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ రంగం వైఎస్సార్ దూరదృష్టితో కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించిందన్నారు.ఔటర్ చుట్టూ 16 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని, రహదారుల డిజైన్లు డీపీఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఫోర్త్ సిటీలో అహ్మదాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ఈమేరకు బీసీసీఐ ప్రతినిధులతో సమావేశమయ్యారని చెప్పారు. అనంతరం సీబీఆర్ఈ, సీఆర్ఈడీఏఐ సంయుక్తంగా రూపొందిన ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ నివేదికను మంత్రులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ప్రేమ్సాగర్రెడ్డి, ప్రెసిడెంట్(ఎలెక్ట్) ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రింగ్రోడ్ ఇంటర్చేంజ్
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్చేంజ్ డిజైన్ను మార్చారు. నాలుగు లూప్లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్చేంజ్ డిజైన్ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక.. తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్తో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్తో ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్కు ఉండే నాలుగు లూప్లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది. అదే డిజైన్తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి. ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్చేంజ్ డిజైన్ను మూడు లూప్లకు మార్చారు. మరో లూప్కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు. -
సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో భూసేకరణ
-
‘సర్వీసు’ లేకుండానే ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్ప్రెస్ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్చేంజ్ కూడళ్లలోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్ ఆర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు. సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్ప్రెస్వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్ ఆర్ను కూడా ఎక్స్ప్రెస్వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది. సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్ప్రెస్ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది. ⇒ ఎక్స్ప్రెస్ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్ బూత్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్ప్రెస్వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది. ⇒ పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్ప్రెస్ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ⇒ ఎక్స్ప్రెస్ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్ప్రెస్ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్ప్రెస్ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. గ్రీన్ఫీల్డ్ రహదారి అయినందున.. ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్ ఆర్ పూర్తి గ్రీన్ఫీల్డ్ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు కూడా ఎక్స్ప్రెస్ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్ప్రెస్ వేల నియమావళి వర్తించదు. ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరటం విశేషం. -
చౌటుప్పల్–సంగారెడ్డిలో ఇంటర్చేంజ్ కూడళ్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డుపై రెండు ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. హైదరాబాద్–పుణె జాతీయ రహదారిని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేసే చౌటుప్పల్ వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్ను ఎంపిక చేశారు. ఎనిమిది వరసల (తొలి దశలో నాలుగు వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్చేంజ్లను విశాలంగా రూపొందిస్తున్నారు. ఆ డిజైనే ఎందుకు? ఇప్పటికే ఉన్న భారీ రహదారులను ఎక్స్ప్రెస్ వేలు క్రాస్ ప్రాంతాల్లో.. వాహనాలు ఆ రోడ్ల నుంచి రింగ్రోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆ రోడ్ల మీదకు సులువుగా మారేందుకు వీలుగా ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మిస్తారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా లూప్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర–దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చాలా నిర్మాణాలున్నా యి. అలాంటి చోట కూడళ్ల వద్ద భారీ లూప్లు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ క్రమంలో ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాను ఎంపిక చేశారు. ఈ డిజైన్లో వాహనాలు రోడ్లను మారే లూప్లు ఎక్కువశాతం రింగురోడ్డును అనుకునే ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగురోడ్ భూమినే వినియోగిస్తారు. మిగతా 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఒక్కోటి 150 ఎకరాల్లో.. 3 కిలోమీటర్ల నిడివితో.. ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాలో నిర్మించే ఇంటర్ చేంజ్లలో.. లూప్ రోడ్లు చాలా దూరం నుంచే మొదలవుతాయి. ప్రస్తుతం రీజనల్ రోడ్డులో కూడా.. ప్రధాన కూడలికి ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చొప్పున మూడు కిలోమీటర్ల నిడివితో ఈ లూప్ రోడ్లు ఉండనున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్ చేంజ్ల కంటే ఇది దాదాపు రెట్టింపు సైజు కావడం విశేషం.మొత్తంగా పదకొండు కూడళ్లు.. రీజనల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఐఏ) రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ మొదలయ్యే చాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు రోడ్డు డిజైన్ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి ఉత్తర భాగం (162 కిలోమీటర్లు.. సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటు ప్పల్ వరకు) నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు దక్షిణభాగంతో కలిసే చోట్ల ఉండే రెండు ఇంటర్ చేంజ్లు సహా ఉత్తరభాగంలో మొత్తం 11 కూడళ్లు ఉంటాయి. వాటి డిజైన్లు సిద్ధమయ్యాయి. » సంగారెడ్డి వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్తో కూడలి నిర్మిస్తారు. ళీ సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 నంబర్ జాతీయ రహదారిని క్రాస్చేసే శివంపేట వద్ద ఉంది. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్లో ఉంటుంది. » మూడో కూడలి నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ ఎంపిక చేశారు. ళీ నాలుగో కూడలి హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లోవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. » ఐదో కూడలి తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్పల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » ఆరో కూడలి రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో వస్తుంది. ఇక్కడ పాక్షిక క్లోవర్ లీఫ్ (మూడు లూప్లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. » ఏడో కూడలి జగదేవ్పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఎంపిక చేశారు. » ఎనిమిదో కూడలి తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద వస్తుంది. ఇక్కడ కూడా రోటరీ డిజైన్లో నిర్మిస్తారు. » తొమ్మిదో కూడలి హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ డిజైన్లో ఉంటుంది. » పదో కూడలి భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద వస్తుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » పదకొండో కూడలిని చౌటుప్పల్ వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్తో నిర్మిస్తారు. -
ధరలు పెరిగేలోపే ‘దక్షిణం’ పనులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనుల టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికొచ్చాయి. టెండర్లు కాగానే ఉత్తరభాగం పనులు మొదలవుతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం దక్షిణ భాగంపై కూడా పడుతుంది. అక్కడా భూముల ధరలు పెరుగుతాయి. అప్పుడు, దక్షిణభాగంలో తమకు ఇచ్చే పరిహారం చాలదని, దానిని పెంచాలంటూ భూనిర్వాసితుల నుంచి డిమాండ్ వస్తుందన్న సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో దక్షిణభాగంలో జరుగుతున్న జాప్యాన్ని నిలవరించి..అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తాజాగా కేంద్రం కూడా సమ్మతించినట్టు తెలిసింది. పనులకు అడ్డంకిగా మారుతుందని.. ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేస్తారు. దీంతో భూనిర్వాసితుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురుకాగా, మిగతా ప్రాంతాల్లో సాఫీగానే సాగుతోంది. ఉత్తర భాగానికి సంబంధించి రూ.5200 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున భరించాల్సి ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే, దక్షిణ భాగంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దాని నిడివి మాత్రం ఎక్కువ. దీంతో అక్కడ దాదాపు రూ.6000 కోట్ల వరకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మరో రెండు మూడునెలల్లో ఉత్తర భాగం టెండర్ల దశకు చేరుకుంటుంది. కానీ, దక్షిణభాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. ఉత్తర భాగం టెండర్లు పూర్తయ్యేనాటికి స్థానికంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఉంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా.. దక్షిణ భాగంలో కూడా రింగ్ నిర్మాణం ఎలాగూ ఖరారైనందున, స్థానికంగా కూడా భూముల ధరలు అప్పటికి భారీగా పెరుగుతాయి. దీంతో అప్పటి భూముల ధరలకు తగ్గట్టుగా పరిహారం మొత్తం పెంచాలని దక్షిణ భాగం నిర్వాసితులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఉత్తర భాగంలో భూముల ధరలు పెరిగేలోపు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. భూ పరిహార భారం పెరిగితే, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రూ.17 వేల కోట్లతో రెండు భాగాలు పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లకు చేరేలా కనిపిస్తోంది. పరిహారం మరింత పెంచాల్సి వస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. దీంతో మరో మూడు నెలల్లోగా దక్షిణభాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
గరిష్ట పరిహారం దక్కేలా చూడాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతుల విషయంలో మానవీయకోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం వచ్చే గరిష్ట పరిహారం రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఏఐ(నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలను కొలిక్కి తెచ్చేందుకు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదని కలెక్టర్లు ఆయన దృష్టికి తెచ్చారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నప్పుడు రైతుల్లో ఆవేదన ఉంటుందని, దానిని అధికారులు గుర్తించాలన్నారు. రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్రింగురోడ్డు దక్షిణభాగం, ఉత్తరభాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే ఎన్హెచ్ నంబర్ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపారి్టయేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం భూసేకరణలో ఉన్న ఆటంకాలపై ఆయన ప్రశ్నించారు. అలైన్మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్పూర్ కారిడార్లకు సంబంధించి అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్–మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.రెండునెలల్లో హైదరాబాద్–విజయవాడ విస్తరణ పనులు హైదరాబాద్–విజయవాడ జాతీయరహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్హెæచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్చౌదరిని కోరారు. రెండునెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీ‹Ù, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి: భట్టి సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాగపూర్–అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయం నుంచి సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్దత్ పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో చర్చకు వచ్చి0ది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్హెæచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్పాస్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగపూర్–అమరావతి రహదారిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. తల్లాడ–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. -
డ్రైపోర్టుకు మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరం లేని తెలంగాణలో ఏర్పాటు చేసే డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అడ్డంకిగా ఉన్న చిక్కుముడులను తొలగించే అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. బుధవారం ఆ బృందంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తనను మంగళవారం కలిసిన అధికారులతో కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన చర్చించారు.తెలంగాణలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించిన సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించదగ్గవాటిని పరిష్కరిస్తామని, భూసేకరణ అంశాలను కొలిక్కి తెస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైపోర్టుకు బందరు పోర్టుతో కనెక్టివిటీ ప్రతిపాదనపై చర్చించారు. అలాగే హైదరాబాద్–విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. రీజినల్ రింగ్రోడ్డు ప్రాజెక్టును భారత్మాల పరియోజనలో భాగంగా చేపట్టాలని ఇటీవల తాను ప్రధానికి సూచించిన విషయాన్ని వారి ముందు ప్రస్తావించారు. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య 12 రేడియల్ రోడ్లు వస్తాయని, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మిస్తామని వెల్లడించారు.వెంటనే రీజినల్ రింగ్ రోడ్డు పనులను, మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్–కల్వకుర్తి పనులను పూర్తిచేస్తే తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్– ఖమ్మం–విజయవాడ రోడ్డుకు సంబంధించిన భూమి అప్పగింత, ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు, వరంగల్–కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్ సేకరణ, కాళ్లకల్–గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరసల విస్తరణకు భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రత ఏర్పాటు.. తదితర అంశాలను ఎన్హెచ్ఐఏ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై బుధవారం సమగ్రంగా సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. -
‘రింగు’ చెరిసగం!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు పనుల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చూసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెండర్ల దశకు చేరువలో ఉన్న ఉత్తరభాగాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇక అలై న్మెంట్ దశలోనే ఆగిపోయిన దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్న అంశాన్ని కేంద్రం పరిశీ లిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో నిర్వహించిన భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత్మాల పరియోజనలో చోటు దక్కకపోవటంతో..రీజినల్రింగ్ రోడ్డులో 162.4 కి.మీ నిడివి ఉండే ఉత్తరభాగాన్ని, 189.2 కి.మీ. నిడివి ఉండే దక్షిణభాగాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డులు పాస్ చేసే దశలో ఉంది. మరో రెండుమూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ జరగనుంది. కానీ, దక్షిణభాగానికి ఏడాది క్రితం అలైన్మెంట్ పూర్తయినా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ భాగానికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరగటం లేదు. నిజానికి ఈ రెండు భాగాలను భారత్మాల పరియోజన కార్యక్రమంలో చేర్చాల్సి ఉంది. ఉత్తర భాగాన్ని గతంలోనే ఆ జాబితాలో చేర్చారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించటం, భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో అగాధం ఏర్పడటంతో రోడ్డు ప్రక్రియలో జాప్యం జరిగింది. భారత్మాల పరియోజనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో రీజినల్ రింగురోడ్డును దాని నుంచి మినహాయించారు. దీంతో మిగిలిపోయిన 7500 కి.మీ. నిడివి గల ఎక్స్ప్రెస్వే పనులతోపాటు మరో 5000 కి.మీ. ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులను చేరుస్తూ 2047 సంవత్సరం లక్ష్యంతో కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.భారత్మాల పరియోజనలో చోటు దక్కిన వాటిని ముందు నిర్వహించి, రెండో ప్రోగ్రామ్లో ఉన్న వాటిని తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే నిధుల కేటాయింపు ఉంటుంది. రింగు ఉత్తరభాగాన్ని తొలుత భారత్మాలలో చేర్చినందున, దానిని అలాగే కొనసాగిస్తూ దక్షిణభాగాన్ని రెండో ప్రోగ్రామ్లో చేర్చారు. ఫలితంగా దక్షిణ భాగం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలే లేవు. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రమంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భాగాన్ని మరో రకంగానైనా చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించిన మీదట, పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్)ను పీడబ్ల్యూడీకి స్థానిక ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నది. ఈ విభాగం ద్వారా నిర్వహించే రోడ్డు పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నా, పనుల నిర్వహణ మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. భారత్మాల పరియోజన కింద కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం, రాష్ట్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్హెచ్ విభాగం ఆధ్వర్యంలో దక్షిణభాగం పనుల నిర్వహణ ఉంటుందన్నమాట. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. అదే జరిగితే ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం పనులు ప్రారంభమైన వెంటనే ఎన్హెచ్ ఆధ్వర్యంలో దక్షిణభాగం పనులు పట్టాలెక్కుతాయి. ఆ విభాగానికి పెద్ద టాస్కే..రింగురోడ్డు దక్షిణ విభాగం పనుల అంచనా దాదాపు రూ.19 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్హెచ్ విభాగం ఇంత పెద్ద పనులు చేపట్టలేదు. దాదాపు 2500 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తక్కువ నిడివి ఉండే జాతీయ రహదారులను ఆ విభాగం చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు బాధ్యత వస్తే ప్రత్యేకంగా అంతర్గతంగా కొన్ని విభాగాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. -
‘రింగు’ భూసేకరణలో వందల ఎకరాలు మిస్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు 460 ఎకరాలను మరిచిపోయారు. అలైన్మెంట్ పరిధిలోని ఆ భూమిని భూసేకరణ జాబితాలో చేర్చకుండానే పరిహారం పంపిణీ అవార్డులు పాస్ చేసే కసరత్తు చేపట్టారు. విషయం తెలిసి ఇప్పుడు ఆ మరిచిపోయిన భూమిని సేకరించేందుకు హడావుడి మొదలుపెట్టారు. అందుకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేశారు. మిగతా భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ల తంతు పూర్తి చేసిన 8 నెలల తర్వాత ఇప్పుడు ఈ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. రీజనల్ రింగురోడ్డులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూములు ఇక రీజినల్ రింగురోడ్డు కోసం ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వ అదీనంలోకి వచ్చాయంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. భూపరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు గ్రామాలవారీగా అవార్డులు పాస్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా భూముల వివరాలు పరిశీలిస్తుండగా అలైన్మెంట్ పరిధిలోకి వచి్చన భూముల్లో కొన్ని భూసేకరణ తుది జాబితాలోంచి మిస్ అయ్యాయని అధికారులు గుర్తించారు. నర్సాపూర్ ‘కాలా’ పరిధిలో 360 ఎకరాలు, గజ్వేల్ ‘కాలా’ పరిధిలో మరో 100 ఎకరాలు ఇలా గల్లంతైనట్లు తేల్చారు. అయినప్పటికీ గతేడాది భూసేకరణకు సంబంధించి రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆ గెజిట్ నోటిఫికేషన్ల గడువు కూడా తీరిపోయింది. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ల జారీ సేకరించాల్సిన భూములను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇందులో 3ఏ, 3డీలు కీలకమైనవి. గ్రామం పేరు, సర్వే నంబర్లు, భూమి పరిమాణం వివరాలు తెలుపుతూ మూడు రోజుల క్రితం 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. నర్సాపూర్, గజ్వేల్ కాలాలకు సంబంధించి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. వీటిపై అభ్యంతరం ఉన్న వారు 21 రోజుల్లో తమ అభ్యంతరాలను ఆయా ‘కాలా’లకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత భూ యజనమానుల పేర్లతో 3డీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. వాటి తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తేగానీ ఆయా గ్రామాల్లో భూసేకరణకు వీలుండదు. ఇలా ఇంకేమైనా గ్రామాల్లోనూ భూముల వివరాలు గల్లంతయ్యాయేమోనని అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. -
డిసెంబర్ లోపు ట్రిపుల్ ఆర్ పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను డిసెంబర్లోపు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ట్రిపుల్ ఆర్ పనులు ఇప్పటివరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్టు చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ఆధారంగా స్పోర్ట్స్, హార్డ్వేర్ జోన్లు ‘ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి ట్రిపుల్ ఆర్కు ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నాం. దీనితోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్–విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణ పనులను కూడా డిసెంబర్ నాటికి కొలిక్కి తెస్తాం. రూ.375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. 17 ఫ్లైఓవర్లు, అండర్పాస్ల పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నాం.రూ.5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగుళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగ్పూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తాం. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే, మా ప్రభుత్వం అకౌంటబిలిటీ(జవాబుదారీతనం) కోసం పనిచేస్తుంది..’అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. 3 నెలల్లో అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభం ‘ఎనిమిదేళ్ల క్రితం పనులు మొదలై నిలిచిపోయిన ఉప్పల్ వంతెన పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. అంబర్పేట వంతెనను 3 నెలల్లో ప్రారంభిస్తాం. అల్వాల్ మార్గంలో 14 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఢిల్లీలో ఏపీ భవన్ స్థలంలో మన దామాషా ప్రకారం దక్కే భూమిలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్ను నిర్మిస్తాం. దీనికి సంబంధించి డిజైన్లు పూర్తయ్యాయి. రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రోల్ మోడల్గా తెలంగాణ రోడ్లు తెలంగాణ రోడ్లు రోల్మోడల్గా ఉండేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రహదారుల్లో వేటిని జాతీయ రహదారులుగా మార్చాలో తేల్చి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రస్తుతం 16 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. వాటికి అనుమతులు సాధిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో పాటు ప్రధానిని కలుస్తాం. రాహుల్గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం పార్లమెంటులో విపక్ష కూటమి బలంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తాం. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్ వే, దాని పక్కనే బుల్లెట్ రైలు మార్గం సాధించేందుకు కూడా ఒత్తిడి చేస్తాం. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉస్మానియాకు కొత్త భవనంపై అఖిలపక్ష సమావేశం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి అదే స్థలంలో కొత్త భవనాన్ని, అదే నమూనాలో నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వరలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. దేశంలోనే గొప్ప హైకోర్డు భవనంగా తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తాం. దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో భవనం సిద్ధమవుతుంది..’అని మంత్రి వివరించారు. -
‘మహా’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. నలువైపులా అభివృద్ధి పడమటి హైదరాబాద్కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.జోన్ల విస్తరణ ఇలా..ప్రస్తుతం ఉన్న ఘట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్లు, భవనాలకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. -
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపొడవైన రింగురోడ్డుగా రికార్డుకెక్కనున్న రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) మరో ఘనతను సొంతం చేసుకోనుంది. కోటగోడను తలపించేలా 18 అడుగుల రికార్డు స్థాయి ఎత్తుతో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కానుంది. జాతీయ రహదారులు, ముఖ్యమైన రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దీని ఎత్తు ఏకంగా 30 అడుగులు ఉండనుంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇంత ఎత్తులో ఎక్స్ప్రెస్ వేలు నిర్మాణం కాలేదు. హైదరాబాద్ చుట్టూ మణిహారంగా రూపుదిద్దుకున్న ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) ఎత్తు 11 అడుగులు మాత్రమే ఉంది.ఇంత ఎత్తు ఎందుకంటే..ఉత్తర భాగంలో ప్రతి అర కిలోమీటర్కు ఒక వంతెన ఉండనుంది. పాదచారులు దాటే అండర్ పాస్ ఎత్తు గతంలో మూడున్నర మీటర్లుగా నిర్ధారించారు. ఇటీవలే దాన్ని మార్చి 4 మీటర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగా చేపట్టే ఎక్స్ప్రెస్ వేలలో చిన్న అండర్పాస్ల క్లియరెన్స్ ఎత్తు 4 మీటర్లుగా నిర్ధారించారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వరికోతలకు హార్వెస్టర్ యంత్రాల వినియోగం అధికంగా ఉంది. వాటి ఎత్తు 4.3 మీటర్లు. ఇవి రోడ్డు దాటాలంటే అంతకంటే ఎత్తుతో క్లియరెన్స్ ఉండాలి. ఇందుకోసం రీజనల్ రింగ్రోడ్డులో అండర్పాస్ల కనిష్ట క్లియరెన్స్ను 4.5 మీటర్లుగా నిర్ధారించారు. దానిమీద రోడ్డు మందం మరో మీటర్ కనిష్టంగా ఉంటుంది. దీంతో అండర్పాస్లు ఉండే ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు ఐదున్నర మీటర్లుగా ఉండనుంది. అండర్పాస్లు లేనిచోట్ల దాని ఎత్తు తగ్గించే వీలుంది. కానీ ఈ రోడ్డులో ప్రతి అర కిలోమీటర్కు చిన్నదో, పెద్దదో ఏదో ఒక అండర్పాస్ ఏర్పాటు కానుంది. అందువల్ల అండర్పాస్ ఉన్న చోట్ల రోడ్డు ఎత్తు పెంచి ఆ తర్వాత తగ్గిస్తే వేగంగా దూసుకెళ్లే వాహనాలకు ఆ ఎత్తుపల్లాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. దీంతో ఈ రోడ్డు మొత్తం కనీసం 18 అడుగుల ఎత్తులో ఉండేలా డిజైన్ చేశారు. ఈ రోడ్డులో 27 పెద్ద వంతెనలు సహా 309 వంతెనలు నిర్మించనుండగా వాటిలో 187 అండర్పాస్లు ఉండనున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దాటుతూ 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్లు నిర్మించనున్నారు. ఇంటర్ఛేంజ్ల వారీగా ఆయా డిజైన్లను ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది.ఏడాదిన్నర కిందటే పనులు మొదలవ్వాల్సి ఉన్నా..రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలో గ్రామాలవారీగా భూ పరిహారానికి సంబంధించి అవార్డులు పాస్ చేయనున్నారు. దీంతో 158 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) యంత్రాంగం రోడ్డు నిర్మాణానికి వీలుగా అప్పట్లోనే డిజైన్లు సిద్ధం చేసుకుంది. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో అప్పట్లో పనులు పడకేశాయి -
‘రింగు’ పరిహారానికి రుణం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యయంలో సగం భరించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. సొంత ఆదాయవనరుల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రుణం తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణం వైపే మొగ్గుచూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తోంది. హడ్కో వైపు చూపు: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఒకేసారి చెల్లించాలంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఒత్తిడి చేసింది. దీన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించకుంటే ప్రాజెక్టే నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్హెచ్ఏఐ నుంచి పరోక్ష హెచ్చరికలూ వెలువడ్డాయి. చివరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకారం కుదరింది. తొలుత రూ. వెయ్యి కోట్లు.. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు నాటి ప్రభుత్వం సమ్మతించింది. అయితే అలైన్మెంట్ మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాల లాంటి వాటి తరలింపునకు అవసరమయ్యే రూ. 364 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్హెచ్ఏఐ కోరడంతో ప్రస్తుత ప్రభుత్వం తొలుత తటపటాయించినా తర్వాత సమ్మతించింది. కానీ సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాక ఆ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో భూపరిహారం వాటా నిధుల కోసం రుణం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కానీ ఎక్కడి నుంచి రుణం పొందాలనే విషయంలో డోలాయమానం నెలకొంది. వారం క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో దీనిపై స్పష్టత వచి్చంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రాజెక్టు నిర్మాణ సన్నాహాలు వేగం పుంజుకోనున్నాయి. అంచనా వ్యయం పెరిగే అవకాశం.. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు.. ఇలా దాదాపు రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2022 చివర్లో రీజనల్ రింగురోడ్డుకు బడ్జెట్ ఖరారు చేసిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 13,200 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ మొత్తం రూ. 16 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇక జాప్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా భూపరిహారం వ్యవహారాన్ని కొలిక్కి తేవాల్సి ఉంది. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలో లోన్ మొత్తాన్ని పొందాల్సి ఉంది. -
కొత్తగా దక్షిణ ‘రింగ్’!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్గల్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్మెంటుకు.. జూన్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్మెంట్నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్నగర్ నుంచి చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్’ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది) -
ఔటర్ రింగ్ రైల్ సర్వే షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్్కటాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తి కాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంట్ సిద్ధమవుతుంది. హైదరాబాద్కు అన్నివైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ.దూరంలో రీజినల్ రింగురోడ్డును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. త్వరలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే దానికి ఆమోదముద్ర పడనుంది. ఈ రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి. ఆ అలైన్మెంటు కోసం ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాథమిక అలైన్మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్ లైడార్ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్మెంటు కోసం 3డీ మ్యాపింగ్ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు. గ్రేడియంట్ ఆధారంగా స్టేషన్ల పాయింట్లను కూడా గుర్తిస్తారు. అక్షాంశరేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంటు ఖరారు చేస్తారు. దాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తారు. భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున, దీని వల్ల ఆదాయం ఎంత ఉంటుందని తేల్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్ఓఆర్) ట్రాఫిక్ సర్వే కూడా చేయనున్నారు. ఆదాయం బాగా ఉంటుందని తేలితే రెండో లైన్ కోసం కూడా ప్రతిపాదిస్తారు. ముందుగా ఒక్క లైన్ను మాత్రమే నిర్మిస్తారు. లైన్తోపాటు విద్యుదీకరణ పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నట్టు తెలిసింది. సరుకు రవాణా రైళ్లకూ ప్రాధాన్యం రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్కు కూడా రిలీఫ్ క ల్పిస్తుంది. 536 కి.మీ... రూ.12 వేల కోట్లు.. ♦ రీజినల్ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా. ♦ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ♦ ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ♦ ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది. -
ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది. బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్! దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. -
మెగా హెచ్ఎండీఏ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడువేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి కొత్తగా రానున్న ఆర్ఆర్ఆర్ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించారు. రెండు రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా, ఆర్ఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మునిసిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్– 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని ఆదేశించారు. ఆమ్రపాలికి ‘టోల్ నివేదిక’ బాధ్యత ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. టెండర్లలో ఏయే సంస్థలు పాల్గొన్నాయి? అవకతవకల్లో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని చెప్పారు. టెండర్లకు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరు, జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి, టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెండర్ విధానంతో రూ.15 వేల కోట్లకు పైగా నష్టం! టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ కింద ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్ను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, అలాగే ల్యాండ్ పూలింగ్ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కాగా హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉంటే.. అందులో 2,031 ఎకరాల పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘కమ్యూనిటీ’ స్థలాలపై తక్షణ సర్వే హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచి్చన స్థలాలు తమ అ«దీనంలోనే ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. స్థానికులైన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కనీసం 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పారు. ప్రపంచ స్థాయి టూరిస్ట్ ప్లేస్గా హుస్సేన్సాగర్ పరిసరాలు హుస్సేన్సాగర్పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన, అందమైన జోన్గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇటు అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్ రోడ్డు, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలిగించాలన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ, ల్యాండ్ స్కేప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్కు మళ్లించి పర్యాటక జోన్గా మార్చాలని చెప్పారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
రీజనల్ రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు( ఆర్ఆర్ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగురోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. రూ. 300 కోట్ల డ్యూటీ ఛార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయని తెలిపారు. అవినీతిపరుడైన సోమేష్ కుమార్ వల్లే ఇలా జరిగిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. మూసీనదీ ప్రక్షాళన చేస్తాం. సిగ్గులేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు. ... కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. అది అప్పుడే బీటలు వారింది. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో నిర్మాణం చేస్తాం. కాంగ్రేస్ పార్టీ చాలా రోజులుండదని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలలు కంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ. 100 తెచ్చుకోలేని చేతగానివాడు కిషన్రెడ్డి’ అని వెంకటరెడ్డి అన్నారు. -
దక్షిణ ‘రింగ్’కూ ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం (చౌటుప్పల్–ఆమన్గల్–షాద్నగర్–సంగారెడ్డి– 182 కిలోమీటర్లు)ను జాతీయ రహదారిగా గుర్తించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించింది. తాజాగా దక్షిణ భాగాన్ని కూడా గుర్తించేందుకు ప్రతిపాదనలు కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గంటన్నర పాటు భేటీ..: సీఎం రేవంత్తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులతో కూడిన బృందం మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి గడ్కరీని ఆయన అధికారిక నివాసంలో కలిసింది. సుమారు గంటన్నర పాటు భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాల్సిన ఆవశ్యకతను గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్తోపాటు ఇతర రోడ్లకు అనుమతి ఇవ్వాలని.. పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన జాబితాను కేంద్రమంత్రికి అందజేశారు. యుటిలిటీస్ తరలింపుపై..: ఆర్ఆర్ఆర్ నిర్మించే మార్గంలో చౌటుప్పల్–భువనగిరి–తుప్రాన్–సంగారెడ్డి–కంది పరిధిలో యుటిలిటీస్ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల) తొలగింపు వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ భేటీలో చర్చించారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పదినెలల క్రితం ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు సిద్ధమంటూ ఎన్హెచ్ఏఐకు లేఖ పంపింది. సీఎం రేవంత్ ఈ అంశాన్ని కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయన ఎన్హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టినదెవరని అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్లో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర బృందానికి గడ్కరీ వివరించారు. రెండు రోడ్లను విస్తరించండి.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా.. హైదరాబాద్–కల్వకుర్తి మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. ఇక నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్టు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీటిని సానుకూలంగా పరిశీలిస్తామని గడ్కరీ రాష్ట్ర బృందానికి హామీ ఇచ్చారు. ఇక సీఆర్ఐఎఫ్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం కోరిన రోడ్లు ఇవీ.. 1. మరికల్–నారాయణపేట్–రామసముద్ర: 63 కి.మీ. 2. పెద్దపల్లి–కాటారం: 66 కి.మీ 3. పుల్లూర్–అలంపూర్–జటప్రోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల్–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ: 225 కి.మీ. 4. వనపర్తి–కొత్తకోట–గద్వాల–మంత్రాలయం: 110 కి.మీ. 5. మన్నెగూడ–వికారాబాద్–తాండూర్–జహీరాబాద్–బీదర్: 134 కి.మీ. 6. కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం: 165 కి.మీ. 7. ఎర్రవెల్లి క్రాస్రోడ్–గద్వాల–రాయచూర్: 67 కి.మీ. 8. జగిత్యాల–పెద్దపల్లి–కాల్వశ్రీరాంపూర్–కిష్టంపేట–కల్వపల్లి–మోరంచపల్లి–రామప్ప దేవాలయం–జంగాలపల్లి: 164 కి.మీ 9. సారపాక–ఏటూరునాగారం: 93 కి.మీ 10. దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట–రాయగిరి క్రాస్రోడ్: 63 కి.మీ. 11. జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం: 100 కి.మీ. 12. సిరిసిల్ల–వేములవాడ–కోరుట్ల: 65 కి.మీ 13. భూత్పూర్–నాగర్కర్నూల్–మన్ననూర్–మద్దిమడుగు(తెలంగాణ)–గంగలకుంట –సిరిగిరిపాడు: 166 కి.మీ. 14. కరీంనగర్–రాయపట్నం: 60 కి.మీ. -
నిధుల పేచీతో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత, పేచీల కారణంగా ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వేగంగా అలైన్మెంట్ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ).. తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు కాలదోషం పట్టి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి ఆఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులు సందిగ్ధంలో పడ్డాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రాజెక్టుకు మరింత జాప్యం తప్పదు. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరేదాకా ఎదురుచూడక తప్పదు. అనుమతులకు దరఖాస్తే చేయలేదు పెద్ద రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కీలకం. అనుమతులొచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతమాల పరియోజన–1లో కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని చేర్చింది. అలైన్మెంట్కు అనుమతులు రావటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు గత ఏడాదే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తినా ఎలాగోలా సభలను పూర్తిచేశారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు ఈ రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్లో పెట్టింది. భూపరిహార వాటా నిధులు అందనందుకే.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పరిహారంలో రాష్ట్రప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా రూ.2,600 కోట్లు అవుతుందని తాత్కాలికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలివిడతగా కనీసం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచి్చంది. కానీ నిధుల విడుదల కాలేదు. ఇలా నిధులు రాకుండా, అవార్డులు పాస్ చేయటం సరికాదని, ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేంద్రం రీజనల్ రింగ్రోడ్డు పనిని పక్కన పెట్టేసింది. జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కీలక ప్రాజెక్టు కాస్తా పెండింగ్లో పడింది. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్రెడ్డికి సూచించారు. -
సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణ కోసం ఎన్హెచ్ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది.. -
‘రియల్’ అభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంగ్లండ్లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. భట్టిని కలిసిన వారిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు మేకా విజయసాయి, కె.శ్రీధర్రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్రెడ్డి, చలపతిరావు, భూపాల్రెడ్డి, మారోజు శ్రీధర్రావు, అశోక్, రామిరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ బృందం ప్రతిపాదనలివీ.. ♦ భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్ట్గేజ్ విధానాన్ని ఎత్తేయాలి. ♦ అధికంగా ఉన్న రిజి్రస్టేషన్ చార్జీలను తగ్గించాలి. జీఓ 50ని ఎత్తేయాలి. ♦ పెండింగ్లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. ♦ రంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న టీఎస్ బీ–పాస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలి. ♦ రాష్ట్రంలో గత 6 నెలలు ఖాళీగా ఉన్న పర్యావరణ కమిటీని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలి. ♦ భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లపై యూనిట్కు వసూలు చేస్తున్న రూ. రూ. 14ను తగ్గించేలి. వెల్త్ క్రియేటర్లను ఇబ్బంది పెట్టం.. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చే వెల్త్ క్రియేటర్లను ఇబ్బందిపెట్టబోమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రియల్ ఎస్టేట్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. మూసీ నది శుద్ధితో సుందరీకరణ జరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండ్రస్టియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని భట్టి చెప్పారు. ‘ధరణి’పై చేసే సూచనలను తాను పరిశీలించడంతోపాటు ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానని తెలిపారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అవార్డ్ జారీకి శ్రీకారం: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్ జారీచేసే కసరత్తుకు ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్ రింగ్రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్మాల పరియోజన తదుపరి ఫేజ్లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్హెచ్ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్ నో టిఫికేషన్ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్హెచ్ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు. -
RRR ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
3 క్లస్టర్లుగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. కొత్త విధానంలో తెలంగాణను మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి హైదరాబాద్ తరహాలో తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడారు. అత్యున్నత అభివృద్ధి సాధనే లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని తీసుకుని వస్తామ సీఎం చెప్పారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో అత్యున్నత అభివృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే వాదనలకు భిన్నంగా తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాము తెచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా విలేజీల అభివృద్ధి ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్య రహితంగా, పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించటం లేదని సీఎం స్పష్టం చేశారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా చూస్తామని, యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు సి.శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షమియుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో కోమటిరెడ్డి.. రింగ్రోడ్, తెలంగాణ భవన్పై కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ను పరిశీలించారు. అనంతరం, ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ..‘ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవన్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి మేం తీసుకుంటాం. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారం. ట్రిపుల్ ఆర్ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ను కలుస్తున్నాం. రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో కోమటిరెడ్డితో మాట్లాడుతూ..‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అని అప్పటి పీఎం మన్మోహన్ చెప్పారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరం. నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు, అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది’ అని వ్యాఖ్యలు చేశారు. -
రీసేల్.. రివర్స్
సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది. నగరం చుట్టూ ఇదే పరిస్థితి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెరాలో నమోదు లేకుండానే నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు. రెండు మూడేళ్లుగా.. జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్తేజ ఇన్ఫ్రా -
ఇక ఆ భూములు ఎన్హెచ్ఏఐ ఖాతాలోకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అలైన్మెంటులో గుర్తించిన భూమిని తన పరిధిలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. యాదాద్రి–భువనగిరి, ఆందోల్–జోగిపేట, చౌటుప్పల్ అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లకు సంబంధించి ఏప్రిల్లో మూడు గెజిట్లు జారీ చేయగా, తాజాగా భువనగిరి, ఆందోల్–జోగిపేటలోని అనుబంధ నోటిఫికేషన్లు, సంగారెడ్డి, గజ్వేల్, తూప్రాన్ కాలాలకు సంబంధించి 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అలైన్మెంటు ఖరారు చేసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా తొలుత జారీ చేసిన రెండు గెజిట్లలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవలే గుర్తించి వాటికి మళ్లీ నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అలా గల్లంతైన భూములకు సంబంధించి మినహా మిగతా భూమలుకు సంబంధించి తుది గెజిట్ నోటిపికేషన్లు దాదాపు జారీ అయినట్టే. దీంతో ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనం నుంచి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి చేరినట్టయింది. భూ యజమానుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్హెచ్ఏఐ: ఈ భూముల సేకరణ ప్రక్రియపై వాటి యజమానుల నుంచి వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను ఎన్హెచ్ఏఐ తోసి పుచ్చింది. ఆయా అభ్యంతరాలకు సంబంధించి గ్రామ సభ ల్లో అధికారికంగా వెల్లడించిన సమాధానాలతో ఇక అభ్యంతరాలు రద్దయినట్టుగానే ఎన్హెచ్ఐఏ పరిగణిస్తుంది. ప్రజో పయోగానికి సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈ భూములను సేకరించాలని నిర్ణయించినందున, ఆ ప్రాజెక్టు పనులు మందుకు సాగేందుకు వీలుగా భూములపై ఉన్న ప్రైవేటు యాజమాన్య హక్కులను రద్దు చేస్తున్నట్టుగా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. వెరసి ఆ భూములన్నీ కేంద్రప్రభుత్వ అధీనంలోకి చేరినట్టయింది. గెజిట్లో ఇలా: ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీలోని సబ్ సెక్షన్(1) ప్రకారం.. నిర్ధారిత గ్రీన్ఫీల్డ్ హైవే దిగువ తెలి పిన సర్వే నెంబర్లలోని భూమిని కేటాయించాము. దాని కో సం సేకరించనున్నాము’’ ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీ సబ్సెక్షన్(2) నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. నిర్ధారి త భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్టుగా పరిగణించాలి. ’’ అని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించింది. 158.62 కి.మీ.గాను 2 వేల హెక్టార్ల భూమి సేకరణ రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగంలో 158.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5170 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో సగ భాగం.. అంటే రూ.2585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు లాంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. నిధులు ముందే జమ కట్టే విషయంలో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య అప్పట్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రాజీ కుదిరి రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేయటంతో 3 డీ నోటిషికేషన్ జారీకి మార్గం సుగమమైంది. 3ఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలోపు 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నెలతో ఏడాది పూర్తి అవుతున్నందున 3డీ గెజిట్ నోటిఫికేషన్లను ఎన్హెచ్ఏఐ జారీ చేయటం విశేషం. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. -
తెలంగాణలో రీజనల్ రింగ్రోడ్డు వెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు... ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆర్ఆర్ఆర్ చుట్టూ 'రింగ్ రైల్'..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ మేరకు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు కేంద్రం పచ్చజెండా ఊపిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. సర్వే కోసం తాజాగా రూ. 14 కోట్లను కేటాయించిందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానివెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారిపోతా యని పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు వస్తాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. నలువైపులా లైన్లను అనుసంధానిస్తూ.. హైదరాబాద్కు నలువైపులా ఉన్న రైల్వేలైన్లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని.. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్కు త్వరగా, సులభంగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. దీనితోపాటు కరీంనగర్– హసన్పర్తి (వరంగల్) మధ్య 61 కిలోమీటర్ల రైల్వేలైన్ సర్వే కోసం రైల్వేశాఖ రూ.1.5 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.330 కోట్లతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఈ వ్యయంలో మూడింట రెండొంతుల మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఉన్నా ముందుకు రాలేదని.. దీనితో మొత్తం ఖర్చును కేంద్రమే భరించి పనులు చేపట్టాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనితోపాటు ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2023–24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఎన్సీడీసీ కోసం భూమి ఇవ్వండి అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని కిషన్రెడ్డి వెల్లడించారు. కానీ జీనోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బదలాయించలేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు మరో లేఖ రాయనున్నట్టు తెలిపారు. దేశంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సెపె్టంబర్లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎలాంటి చర్చా లేదు తెలంగాణలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం మార్పు వంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష మార్పు అంశమేదీ అధిష్టానం దృష్టిలో లేదని, దీనిపై పారీ్టలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదంతా మీడియా సృష్టించిన గందరగోళమేనన్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష మార్పు వార్తలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ కూడా కొట్టిపారేశారు. అధిష్టానం వద్ద ఇలాంటి ఆలోచనేదీ లేదన్నారు. -
కూల్చాల్సిన భవనాలెన్ని..కొట్టేయాల్సిన చెట్లెన్ని..?
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి మూడు కాలా(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్)ల పరిధిలో అవా ర్డు పాస్ చేసేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పట్టాదారుల వారీగా వివరాలు నమోదు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో సేకరించాల్సిన భూముల్లో ఉన్న నిర్మాణాలు, తోటలు, ఇతర ఆస్తుల విలువను మదింపు చేసే ప్రక్రియకు తాజా గా అధికారులు శ్రీకారం చుట్టారు. సేకరించాల్సిన భూమి విలువ ఆధారంగా పరిహారాన్ని అందించే క్రమంలో, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, చెట్ల విలువలను కూడా గుణించి పరిహారం అందిస్తారు. ఇప్పుడు వాటి విలువకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ లెక్కలు సేకరిస్తున్నారు. ఉత్తరభాగంలో 8 ’కాలా’లు రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 8 ‘కాలా’లున్న విషయం తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి, చౌటుప్పల్, ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి ఇటీవలే ఎన్హెచ్ఏఐ 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూడు ప్రాంతాల్లోని రైతులకు పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా అవార్డ్ పాస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి ప్రాంతంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ జరక్కుండా రైతులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో రీజినల్ రింగ్రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ వారు భీషి్మంచుకుని కూర్చున్నారు. నిరసన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కొందరు రైతులపై కేసులు పెట్టిన పోలీసులు, వారికి బేడీలు వేసి మరీ కోర్టుకు తీసుకురావటం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో సర్వేను అలాగే పెండింగులో ఉంచిన అధికారులు, మిగతా రెండు కాలాల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సేకరించాల్సిన భూముల్లో ఉన్న ఇళ్లు, దుకాణ సముదాయాలు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల లెక్కలు తీస్తున్నారు. పొలాల్లో ఉన్న తోటలు, సాధారణ చెట్ల లెక్కలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటి నిర్ధారిత విలువ ఆధారంగా నష్టపరిహారాన్ని అందిస్తారు. ప్రైవేటు వ్యక్తులతోపాటు, కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి లెక్కలను కూడా సంబంధించి విభాగాల అధికారులతో కలిసి సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో రింగురోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, నీటి పైపులైన్లను తర లించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించిన చిన్న స్తంభాలను తొలగించనున్నారు. అదే హైటెన్షన్, పవర్ గ్రిడ్ స్తంభాలను తొలగించకుండా, లైన్లు మరింత ఎత్తుగా ఉండేలా స్తంభాల ఎత్తును పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు ట్రాన్స్కో, పవర్గ్రిడ్ అధికారులతో కలిసి ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను కూడా అడ్డుగా ఉన్నందున, ఏయే ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలో, వాటి పొడవు, ఎత్తు ఎంత ఉండాలో తేల్చేందుకు రైల్వే అధికారులతో కలిసి సర్వే చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న చోట్ల ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కి.మీ.లు చొప్పున రెండు ప్యాకేజీలుగా 60 కి.మీ. నిడివి గల రింగు రోడ్డు పనులు తొలుత ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్యాకేజీలకు ఈ సంవత్సరమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా అవార్డు పాస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైతుల చేతులకు సంకెళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కాన్వాయ్ను అడ్డుకోవడంతో.. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్రెడ్డి కలెక్టరేట్లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రిమాండ్లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు. కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా? నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాళ్లసలు రైతులే కాదు.. యాదాద్రి పోలీసుల వివరణ!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు బేడీలు వేసి మరీ భువనగిరి సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చిన ఉదంతంపై రాజకీయంగానూ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాదాద్రి భువనగిరి పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అసలు వాళ్లు రైతులే కాదంటూ ప్రకటించారు డీసీపీ రాజేష్ చంద్ర. అరెస్ట్ అయినవాళ్లలో రైతులు ఎవరూ లేరు. ఆ నలుగురూ జమ్మాపూర్లోని ఓ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఇంతకుముందు వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు మాపై దాడి చేసి వాహనం ధ్వంసం చేశారు. అంతేకాదు గతంలో కలెక్టరేట్లోకి వెళ్లి లోపల నిప్పు పెట్టారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడి కాన్వాయ్ పై దాడి చేసినందుకు అరెస్టు చేశాం. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ల ప్రవర్తన సరిగా లేకనే ముందస్తు జాగ్రత్త కోసం బేడీలు వేయాల్సి వచ్చిందని డీసీపీ వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తులో ఉన్న పోలీస్ ఇంచార్జ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారాయన. అయితే.. ఇది సబబేనా? ఈ పరిణామంపై సాక్షి టీవీతో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మాట్లాడారు. కొండంత తీసుకొని గోరంత నష్టపరిహారం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరే ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతుల భూములు పూర్తిస్థాయిలో కోల్పోవాల్సి వస్తోంది. బడా నాయకుల భూములను కాపాడుకోవడం కోసమే అలైన్మెంట్ మార్చారు. మోటకొండూరు నుంచి ఉన్నటువంటి అలైన్మెంట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలి?.. అని నిలదీశారు. అధికారులకు, నాయకులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు వినిపించుకున్న ఫలితం లేకుండా పోయిందని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రైతులమైన తమపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు వాళ్లు. ఒక రాజకీయంగానూ ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రౌడీల మాదిరి బేడీలు వేస్తారా? రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతులంటే కేసీఆర్ కు అంత చులకనెందుకు?. నిర్వాసితులైన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?. ఆ రైతులు చేసిన తప్పేంది?. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే జైల్లో వేస్తారా?. కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దగ్గర పడింది. ప్రజాకోర్టులో కేసీఆర్కు శిక్ష తప్పదు అని బండి సంజయ్ విమర్శించారు. బాధితుల తరపున కాంగ్రెస్ పోరాడుతుంది ఇక భువనగిరి కోర్టు పరిణామంపై కాంగ్రెస్ సీనియర్, మాజీ ఎంపీ వీహెచ్ స్పందించారు. ‘‘భువనగిరి RRR భూ నిర్వాసితులు ఆరుగురు పై కేసులు పెట్టారు. గతంలో మిర్చి రైతులకి సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్ది. ఇప్పుడు RRR నిర్వాసితులకు సంకెళ్లు వేశారు. రియల్టర్లు దగ్గర డబ్బులు తీసుకొని భువనగిరి రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతుల దగ్గర Ak 47 గన్స్ ఉన్నాయా చెప్పండి?. అన్నం పెట్టె రైతులకి సంకేళ్లు వేస్తారా? వారి నాన్ బెయిల్ కేసులు పెడతారా?. అన్నం పెట్టే రైతులకి సంకేళ్లు వేసే ఏకైక ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. రియల్టర్ల తో బిఆర్ఎస్ నేతలు కుమ్మక్కై కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు . భువనగిరి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని వీహెచ్ ప్రకటించారు. ఇదీ చదవండి: అసలు ఆ మీటింగ్ల వెనుక ఎవరున్నారు? -
రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు సంకెళ్లు
-
‘రింగు’ భూమి కేంద్రం ఖాతాలోకి ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఖరారు చేసి గుర్తించిన భూములు ఇక కేంద్ర ప్రభుత్వ పరమైనట్టే. వాటిపై ఇంతకాలం వాటి యజమానులకు ఉన్న హక్కులు రద్దయ్యాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వ భూసేకరణ చట్టంలోని సెక్షన్ 3డీ ప్రకారం గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల సంస్థ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తర భాగం పరిధిలో.. భూసేకరణకు ఎనిమిది అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లు ఉండగా, ఈనెల 18వ తేదీతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగంలో 1,58.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5,170 కోట్ల వరకు ఖర్చవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఐఏ) ఈ ప్రాజెక్టు బడ్జెట్లో అంచనా వేసింది. అందులో సగ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. రూ.2,585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు వంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయంగా జమ చేయాలంటూ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోశ్కుమార్ యాదవ్ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. సాధారణంగా 3డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాక అవార్డ్ పాస్ చేసే సమయంలో ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుందని, అడ్వాన్సుగా చెల్లించటమెందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. అయినా, ఎన్హెచ్ఏఐ లేఖలు రాస్తూనే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో 3డీ గెజిట్ విడుదలలో జాప్యం జరిగింది. గతేడాది ఏప్రిల్లో మూడు, ఆగస్టులో ఐదు కాలాలకు 3ఏ గెజిట్ విడుదల చేసిన ఎన్హెచ్ఏఐ, నెలలు గడుస్తున్నా భూసేకరణ ప్రక్రియలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం వరకు వెళ్లి ఒకదశలో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ: మహిళలకు లక్కీ చాన్స్! గురుకుల కొలువుల్లో వారికే అధికం ఈ తరుణంలో ఇటీవల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య దీని విషయంలో ఎట్టకేలకు రాజీ కుదిరింది. ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించామని, దాన్ని దశలవారీగా విడుదల చేస్తామని, ముందుగా రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తామన్న రాష్ట్రప్రభుత్వ అధికారుల ప్రతిపాదనను ఎన్హెచ్ఐ అధికారులు సానుకూలంగా స్వీకరించారు. దీంతో ఎన్హెచ్ఐఏ 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. పట్టాదారు పేర్లతో.. రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను అందించవచ్చని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇంతకు ముందు ప్రాథమిక నోటిఫికేషన్ల సమయంలో అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి చివరకు వాటిని అనుమతించలేదంటూ తాజా నోటిఫికేషన్లో వెల్లడించటం గమనార్హం. నిర్ధారిత భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చిందంటూ కొత్త నోటిఫికేషన్లో పేర్కొన్నందున, ఇప్పుడు కొత్తగా వచ్చే అభ్యంతరాల ప్రభావం ఎంతుంటుందనేది ప్రశ్నార్థకమే. ఇక అవార్డు పాస్ చేయటమే.. చట్టంలోని 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనందున ఇక అవార్డు పాస్ చేయటమే తరువాయి. ఇప్పటికే ఊళ్ల వారీగా సర్వేనెంబర్లతో పట్టాదారుల పేర్లను, భూ విస్తీర్ణాన్ని గుర్తించి సర్వే చేసిన అధికారులు.. వాటిని మరోసారి వెరిఫై చేసి నోటీసులు జారీ చేయనున్నారు. పట్టాదారు బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. అభ్యంతరాలతో.. దాన్ని తీసుకునేందుకు నిరాకరించే వారి పేరుతో సంబంధిత కోర్టులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. కాలాల వారీగా ఊళ్లు..సేకరించే భూ విస్తీర్ణం ఇలా.. యాదాద్రి–భువనగిరి రోడ్డులో 98వ కి.మీ. నుంచి 118 కి.మీ. వరకు దీని పరిధి ఇందులో సేకరించే మొత్తం భూమి విస్తీర్ణం 184.961 హెక్టార్లు ఊళ్లు: వీరారెడ్డిపల్లె, ఇబ్రహీంపూర్, కోనాపురం, దత్తాయపల్లె, వేల్పులపల్లె, మల్లాపూర్, దాతర్పల్లె ఆందోల్–జోగిపేట రోడ్డు నిడివిలో 9.56 కి.మీ. నుంచి 18.18 కి.మీ. పరిధి మొత్తం భూ విస్తీర్ణం 94.38 హెక్టార్లు ఊళ్లు: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ చౌటుప్పల్ రోడ్డు నిడివిలో 133.17 కి.మీ. నుంచి 158.64 కి.మీ. వరకు మొత్తం సేకరించే భూ విస్తీర్ణం 225.02 హెక్టార్లు గ్రామాలు: పహిల్వాన్పూర్, రెడ్లరేపాక, పొద్దటూరు, వెర్కట్పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, చౌటుప్పల్, తలసింగారం, లింగోజిగూడ. (చదవండి: రైతన్న ఆశలు ఆవిరి) -
రింగురోడ్డుపై జంగ్.. నిధుల విషయంలో వివాదం! పెండింగ్లో ప్రాజెక్టు?
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో గందరగోళం ఏర్పడింది. ప్రాజెక్టులో ఉత్తరభాగానికి సంబంధించి అన్ని సర్వేలు, అలైన్మెంట్ గుర్తింపు పూర్తయి భూసేకరణ చేయాల్సిన తరుణంలో.. ప్రాజెక్టు పెండింగ్లో పడేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్మాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా నిర్మించనుంది. అయితే దీనికి అయ్యే భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది. ఈ మేరకు వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ‘జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)’కు డిపాజిట్ చేయకపోవటంతో వివాదం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇస్తే.. భూసేకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (3డీ) విడుదల చేసేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమైంది. నిధులను డిపాజిట్ చేయాలంటూ గత డిసెంబర్ నుంచి పలుమార్లు లేఖలు రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటుగా లేఖ రాయటంతో ఈ అంశం మరింతగా ముదురుతున్నట్టు కనిపిస్తోంది. రూ.2,948 కోట్ల నిధుల కోసం.. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 162 కిలోమీటర్ల పొడవునా 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ లెక్కలేసుకుంది. ఇందులో 50 శాతం మొత్తం రూ.2,585 కోట్లతోపాటు విద్యుత్ స్తంభాలు వంటి వాటిని తరలించడం, ఇతర ఖర్చులకు మరో రూ.363.43 కోట్లు చెల్లించాలంటూ.. గత డిసెంబరులో ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తర్వాత ఆ విభాగం ప్రాంతీయ అధికారి కార్యాలయం నుంచి మరో మూడు లేఖలు, ఆ తర్వాత ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ఒక లేఖ రాయగా.. తాజాగా ఎన్హెచ్ఏఐ చైర్మన్ మరో లేఖ రాశారు. ‘‘భూసేకరణకు సంబంధించి అవార్డు పాస్ చేసేందుకు అవసరమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు చెల్లించే విధానాన్ని స్పష్టం చేయాలి. నిధులు కూడా అందాలి. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో సంబంధిత భూములు కేంద్ర ప్రభుత్వం ఆ«దీనంలోకి వస్తాయి. అప్పుడు రాష్ట్ర నిధుల వాటా లేని పక్షంలో పరిహారం చెల్లింపులో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయి’’అని అందులో స్పష్టం చేశారు. జాప్యమైతే వ్యయం మోత! తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పుడు ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కోవిడ్ వల్ల జరిగిన జాప్యం వల్ల ఇప్పటికే అంచనా వ్యయం రూ.15 వేల కోట్లకు చేరువైంది. ఇంకా జాప్యం జరిగితే ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్)లో మార్పులు వచ్చి అంచనా వ్యయం మరో రూ.2–3 వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రోడ్డు త్వరగా అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పురోగతి ఉండటం, పెట్టుబడుల రాక, స్థానికుల ఉపాధి అవకాశాలు పెరిగే పరిస్థితితోపాటు హైదరాబాద్ నగరంపై ట్రాఫిక్ భారానికి కొంత పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్హెచ్ఏఐ లేఖలపై వివరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సంప్రదించడానికి ‘సాక్షి’ప్రయతి్నంచగా ఆమె స్పందించలేదు. -
‘రీజనల్’కు రాష్ట్ర వాటా నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50% నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు త్వరగా డిపాజిట్ చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రీజనల్ రింగు రోడ్డు పూర్తి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ వ్యయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగాన్ని భరించేలా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేటాయించిన నిధులూ విడుదల చేయరా? భారత్ మాల పరియోజనలో భాగంగా కేంద్రం రీజనల్ రింగు రోడ్డును మంజూరు చేసిందని.. ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణనూ వేగిరం చేసిందని కిషన్రెడ్డి వివరించారు. భూసేకరణ కోసం గెజిట్ నోటిఫి కేషన్ కూడా విడుదల చేసిందన్నారు. ‘‘భూసేకరణ వ్యయంలో 50శాతం మేర నిధులను డిపాజిట్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయం అధికారి ఇప్పటికే 5 సార్లు లేఖలు రాశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి లేవనెత్తిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. అయి నా తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదు. 2022–23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రీజనల్ రింగు రోడ్డు భూ సేకరణ పేరుతో రూ.500 కోట్లు కేటాయించినా వాటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం దురదృష్టకరం..’’అని కిషన్రెడ్డి విమర్శించారు. సకాలంలో స్పందించండి రీజనల్ రింగు రోడ్డు వల్ల హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే వాహనాల రద్దీని నియంత్రించటంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తారని, మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుందని కిషన్రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ నిమిత్తమై తదుపరి 3డీ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించడానికి సర్వే కూడా ముగిసిందన్నారు. ఈ ఏడాది మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వడానికి ముందుకు రానట్లయితే.. ఈ 3డీ గెజిట్ నోటిఫికేషన్ వృథా అయిపోతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రాజెక్టు ప్రారంభం అనవసరంగా మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని, సకాలంలో నిధులు జమ చేయాలని స్పష్టం చేశారు. -
50% నిధులు జమచేస్తేనే ఆర్ఆర్ఆర్ ప్రారంభం: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఉత్తరభాగం అలైన్మెంట్, భూసేకరణ ప్లాన్ ఆమోదం పూర్తయిందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 3 డీ నోటిఫికేషన్ను చేపట్టేందుకు వీలుగా భూసేకరణ ఖర్చులో 50% వాటాను డిపాజిట్ చేసేందుకు అవసరమైన ప్రతిపాదన, సరైన యంత్రాంగాన్ని రూపొందించాలన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న 50% వాటాను జమ చేయడంపై ప్రతిస్పందనను బట్టి ప్రాజెక్ట్ చేపట్టే సమయం ఆధారపడి ఉంటుందని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారులకు రూ.5,534 కోట్లు గత ఐదేళ్లలో తెలంగాణలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5,534 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.9,215 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
11 ఇంటర్ చేంజర్లు.. 85 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం.. దీని నిడివి 158.645 కి.మీ... ప్రస్తుతానికి నాలుగు వరసల రోడ్డు.. ఈ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులను 11 చోట్ల అడ్డంగా దాటాల్సి ఉన్నందున భారీ ఇంటర్చేంజర్ స్ట్రక్చర్లను నిర్మించనున్నారు. ఒక్కోటి దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. వీటికితోడు 105 అండర్ పాస్లు.. 85 వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి మూడు కి.మీ.కు రెండు అండర్పాస్లు పెద్ద రహదారులను దాటేటప్పుడు ట్రంపెట్, డబుల్ ట్రంపెట్, క్లెవర్ లీఫ్ నమూనాల్లో ఇంటర్చేంజర్ వంతెనలను నిర్మించనున్న విషయం తెలిసిందే. కానీ, రోడ్లతో సంబంధం లేకుండా ప్రతి కిలోమీటరున్నర నడివికి ఓ అండర్పాస్ చొప్పున నిర్మాణానికి ప్లాన్చేశారు. స్థానికంగా ఉండే ఊళ్ల నుంచి వాహనాలు రోడ్డును అటూఇటూ దాటాలంటే కచ్చితంగా అండర్పాస్లు అవసరం. అందుకోసం ప్రతి కిలోమీటరున్నరకు ఒకటి చొప్పున ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. అలా ఉత్తర భాగం నిడివిలో 105 అండర్పాస్లకు ప్లాన్ చేశారు. ఇది చిన్నాచితక అండర్పాస్లు కాదు. భారీ వాహనాలు సులభంగా దూసుకెళ్లేలా 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటాయి. భవిష్యత్తులో ఈ రోడ్లను వెడల్పు చేయాల్సి వస్తే, అండర్పాస్లను వెడల్పు చేయటం సాధ్యంకాదు. అందుకే ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 20 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇక వాగులువంకలు, సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించే కెనాల్స్, చెక్డ్యామ్లు, గుట్టల నుంచి జాలువారే ప్రాంతాల్లో ప్రత్యేకంగా వంతెనలు నిర్మిస్తారు. నీటిప్రవాహానికి రింగురోడ్డు ఏమాత్రం అడ్డంకి కావద్దని ఈ ఏర్పాటు చేశారు. ఉత్తర రింగు నిడివిలో దాదాపు 85 వరకు ఇలాంటి వంతెనలు నిర్మించనున్నారు. నీళ్లు వెళ్లటానికే పరిమితం కాకుండా పక్కనుంచి ట్రాక్టర్లు లాంటి వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇలా ఇంటర్ ఛేంజర్లు, అండర్పాస్లు, నీళ్లు పారేందుకు నిర్మించే వంతెనల కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. డ్రాఫ్ట్ డీపీఆర్ సిద్ధం రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.13,800 కోట్లు ఖర్చవుతుందని డ్రాఫ్ట్ డీపీఆర్లో అధికారులు పేర్కొన్నారు. ఈ రోడ్డును ప్రతిపాదించిన సమయంలో రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరగనుందని స్పష్టమవుతోంది. రోడ్డు నిర్మాణానికి రూ.8,600 కోట్లు, భూపరిహారా నికి రూ.5,200 కోట్లు అవసరమవుతాయని డ్రాఫ్ట్ డీపీఆర్లో పేర్కొన్నట్టు తెలిసింది. రోడ్డు నిర్మాణ వ్యయంలో స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్పాస్లకు రూ.2 వేల కోట్ల ఖర్చవుతుందని పేర్కొన్నట్టు సమాచారం. భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చెరో రూ.2,600 కోట్లు చొప్పున భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన అంశం తెలిసిందే. రింగురోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి అలైన్ మెంటును ఖరారు చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపారు. 189.2 కి.మీ. నిడివితో ఈ అలైన్ మెంటును రూపొందించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. -
ప్రాణాలైనా ఇస్తాం, భూములివ్వం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వేలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం గురువారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రి క్తత ఏర్పడింది. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూములను ఇవ్వబోము’అంటూ రైతులు నినాదాలు చేశారు. సర్వేకు ఒప్పుకోమని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పో లీసు బలగాలను దించి ఎక్కడికక్కడ మహిళలు, యువకులు, వృద్ధులను అదుపులోకి తీసుకుని వి విధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొత్తానికి అధికారులు రాత్రి వరకు సర్వేను పూర్తి చేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు సర్వే సిబ్బందిని అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళలు, పిల్లలు, రైతులు రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, రైతులు ఒక్కసారిగా వె ళ్లి సర్వే పనులను అడ్డుకుని అధికారుల చేతుల్లోని యంత్రాలను లాక్కుని పరుగులు తీశారు. ఈ క్ర మంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా రైతు చేతికి గాయమైంది. మరో మహిళ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇతర మహిళలు ఆందోళన ఉధృతం చేశా రు. మహిళా పోలీసులు వచ్చి వారిని బీబీనగర్, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓవైపు ఆందోళన.. మరో వైపు సర్వే రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల సర్వేకు కలెక్టరేట్ నుంచి ఎనిమిది బృందాలు వచ్చాయి. సర్వే నిలిపివేయాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే.. అధికారులు భూ సర్వే పనులు కొనసాగించారు. గత కొన్ని రోజుల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ సర్వేను రాయగిరి రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కేవలం భువనగిరి మున్సిపాలిటీ, కొన్ని గ్రామాల్లో మాత్రమే సర్వే మిగిలింది. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చారు. భువనగిరి మండలం రాయగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల మధ్య సర్వే పనులు పూర్తయినట్లు యాదాద్రి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి చెప్పారు. రైతులు కొంతమేరకు ప్రతిఘటించారని, అయినప్పటికీ సర్వే పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. 32 మందిని అరెస్టు చేశాం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్నందుకు నలుగురు మహిళలతో కలిపి మొత్తం 32 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశాం. – వెంకట్రెడ్డి, ఏసీపీ, భువనగిరి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? నాకున్న మూడు ఎకరాల భూమి రోడ్డులో పోతే నా ముగ్గురు ఆడ పిల్లలను ఎలా పెంచాలి. పెళ్లిళ్లు ఎలా చేయాలి? తలుచుకుంటేనే భయమేస్తుంది. ఒక బిడ్డకు ఒక ఎకరం చొప్పున అమ్మి పెళ్లి చేయాలి అని అనుకున్నాం. కానీ, ప్రభుత్వం భూమి మొత్తం తీసుకుంటోంది. – పద్మ, రాయగిరి బతకడమే వ్యర్థం నా భర్త చనిపోగా ఆయన వారసత్వంగా నాకు ఏడు ఎకరాల భూమి వచ్చింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. ఒక్క గుంట భూమి కూడా లేకుండా పోతుంది అంటే గుండె ఆగిపోయినట్లు ఉంది. బతకడమే వ్యర్థం అనిపిస్తోంది. –– లక్ష్మి, రాయగిరి -
ఆర్ఆర్ఆర్: చివరి దశకు భూసేకరణ.. 15 రోజుల్లో త్రీడీ నోటిఫికేషన్!
గజ్వేల్: ట్రిపుల్ఆర్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ పూర్తి కాగా, త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత రెండు సభల్లో బాధితుల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరిహారం లెక్కలు కూడా తేల్చనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రిపుల్ఆర్ 110 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండనుంది. 14 మండలాల్లోని 73కిపైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. జగదేవ్పూర్ – గజ్వేల్ – తూప్రాన్ –నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. ఈ క్రమంలోనే భూసేకరణను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు, ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండదని, ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్ను అధికారుల ముందుంచారు. త్వరలోనే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్న సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. 980 ఎకరాలు.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఇక త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగ తలమునలై ఉన్నది. ఈ నోటిఫికేషన్లో సర్వే నంబర్లవారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజపేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్పల్లి, సంగాపూర్, మక్తమాసాన్పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ 15 రోజుల్లో విడుదల కానుంది. మరో రెండు నెలల్లో.. మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి అభిప్రాయసేకరణ ఎలా ఉన్నా.. ఈ త్రీడీ నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టనున్నారు. పరిహారం పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలలు అనుసరిస్తారా? మార్పులు చేస్తారా...? అనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకురాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టుల్లో జమచేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతోంది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ గజ్వేల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను తుది దశకు చేరుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. దీని తర్వాత భూముల విలువ ఆధారంగా పరిహారం లెక్కలు కూడా తేలనున్నాయి. ఆ తర్వాత ప్రక్రియను రెండు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. –విజయేందర్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గజ్వేల్ -
బ్రేకులు పడినా.. ఆగేది లేదు...
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అలైన్మెంట్, పరిహారం, ఇతర అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు కింద కోల్పోతున్న భూమికి బదులుగా నామమాత్రపు పరిహారం ఇస్తే ఊరుకోబోమని, భూమికి బదులు భూమినే ఇవ్వాలని రైతులు ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) సభల్లో డిమాండ్ చేస్తున్నారు. తమకు కచ్చితమైన హామీ ఇవ్వకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తుండటంపై మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించి నిర్వహించిన రెండు సభల్లో కూడా జనం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో అర్ధంతరంగా ముగిశాయి. ఈనెల 28న యాదాద్రి జిల్లాలో, తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సభలు జరగనున్నాయి. ఇప్పటికే యాదాద్రిలో రైతులు, భూయజమానులు ఆందోళనలు చేస్తుండటంతో.. అక్కడ జరగబోయే సభ కూడా రసాభాసగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రహదారి హద్దులు నిర్ధారించే సర్వే కోసం వచ్చిన అధికారులను సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో భూయజమానులు అడ్డుకుని, ఆందోళనకు దిగడంతో సర్వే ఆగిపోయింది. ఈ పరిస్థితులతో ఇక ముందు పోలీసు పహారా మధ్య భూసేకరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. సంగారెడ్డి శివారులో పోలీసు భద్రత మధ్య సర్వే పూర్తిచేసి, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. ముందుకు సాగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ సభలు సరిగా జరగకున్నా ఈ ప్రక్రియ పూర్తయినట్టుగానే నమోదు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. భూముల ధరలు భారీగా పెరగటంతో.. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయం దాదాపు నాలుగేళ్లుగా నానుతోంది. మూడేళ్ల క్రితమే రోడ్లు–భవనాల శాఖ ఆధ్వర్యంలో ఓ అలైన్మెంట్ రూపొందించారు. అది జనంలోకి వెళ్లింది. దానితో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా భూములు కొన్నారు. తర్వాత ఆ అలైన్మెంటు కొంత మారి తుది అలైన్మెంట్ ఖరారైంది. అయితే ఇప్పుడా ప్రాంతాలన్నిటా భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని, లేకుంటే కోల్పోయే భూమికి సమానంగా సమీపంలోనే భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రెట్లు పెంచి పరిహారం! భూములకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ధారించిన ధరనే పరిహారంగా ఇవ్వరని.. దానికి మూడు రెట్లు పెంచి పరిహారంగా ఇస్తారని అధికారులు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత మూడేళ్లలో జరిగిన భూక్రయ విక్రయ లావాదేవీల్లో ఎక్కువ ధర పలికిన భూముల సగటును గుర్తిస్తారని.. దానికి మూడు రెట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ధారించి పంపిణీ చేస్తారని అంటున్నారు. 3డి నోటిఫికేషన్ వచ్చాక.. పరిహారం లెక్క.. 3డి గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక.. ప్రతి పట్టాదారు కోల్పోతున్న భూమి, అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లను లెక్కగట్టి.. ఎంత పరిహారం అందనుందో తేల్చి చెప్పనున్నారు. దానికి అంగీకరించిన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తారు. పరిహారం తీసుకోవడానికి నిరాకరించే వారి విషయంలో సంబంధిత న్యాయస్థానంతో కలిపి జాయింట్ ఖాతా తెరిచి అందులో సొమ్ము జమ చేస్తారు. ఈ విషయాన్ని భూయజమానికి తెలిపి భూమిని సేకరిస్తారు. యజమాని తీసుకునేంతవరకు ఆ పరిహారం జాయింట్ ఖాతాలో ఉంటుంది. తీసుకునే రోజునాటికి బ్యాంకు వడ్డీ జత చేసి వస్తుంది. -
‘ఉత్తర రింగు’లో 84 ఊళ్లే!
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికిగాను అవసరమైన భూమిని సేకరించే గ్రామాల సంఖ్యలో స్పష్టత వచి్చంది. ఉత్తర భాగం పరిధిలో వంద మీటర్ల వెడల్పుతో 162.46 కి.మీ. మేర రింగురోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మించనున్న నాలుగు వరసల రోడ్డును భవిష్యత్తులో ఎనిమిది వరసలకు విస్తరించనున్నారు. ఎనిమిది వరసలు, స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని ఇప్పుడే సేకరిస్తారు. ఇందుకు 4,638 హెక్టార్లు అవసరమవుతాయని అధికారులు లెక్క తేల్చారు. తొలుత 4,200 హెక్టార్లు సరిపోతుందని భావించినా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇంటర్ఛేంజర్లను మరింత విశాలంగా నిర్మించాలని నిర్ణయించటంతో అదనంగా మరికొంత భూమిని సేకరిస్తున్నారు. ఇందుకు అదనపు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. కానీ, గెజిట్లో మాత్రం 4,942 ఎకరాలు అవసరమవుతాయని ప్రాథమికంగా పేర్కొన్నారు. భూసేకరణలో భాగంగా స్వల్ప మొత్తం భూమి పక్క గ్రామ సర్వే నంబర్ పరిధిలో ఉన్నా.. దాని వివరాలను కూడా గెజిట్లో పొందుపరచాల్సి ఉంటుంది. సర్వే నంబర్లవారీగా భూమి వివరాల నమోదుకు సమయం పట్టనున్నందున, ప్రాథమికంగా అలైన్మెంట్కు రెండువైపులా అర కి.మీ. పరిధిలోని 122 గ్రామాలను తొలుత గుర్తించారు. ఇప్పుడు స్పష్టంగా వివరాలు నమోదు చేయటంతో గ్రామాల సంఖ్య 84కు పరిమితమైంది. 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికి 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సేకరించే భూమికి రూ.5,200 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవలే బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయా ఆర్డీవోల పరిధిలో భూమిని సేకరించే గ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామాల వివరాలు ఇవే... ఆర్టీవో సంగారెడ్డి: మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతపల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవల్పల్లె, సికిందర్పూర్, దౌల్తాబాద్ కొత్తపేట ఆర్టీవో ఆందోల్–జోగిపేట: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ ఆర్డీవో నర్సాపూర్: నాగులపల్లె, మూసాపేట్, జానకంపేట, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, ఖాజీపేట్, తిర్మల్పూర్, తుజల్పూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబోగూడ, గుండ్లపల్లి, కొంతాన్పల్లె ఆర్డీవో తూప్రాన్: వట్టూరు, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్పల్లె, గుండారెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంటకాయపల్లె, నర్సంపల్లె. ఆర్డీవో గజ్వేల్: బేగంపేట, యాల్కల్, బంగ్లా వెంకటాపూర్, నెమ్టూరు, మఖత్ మాసాన్పల్లె, జబ్బాపూర్, మైలారం మక్తా, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, పాములపర్తి, చేబర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్: వీరారెడ్డిపల్లె, కోనాపురం, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వేల్పుపల్లె, మల్లాపూర్, దత్తార్పల్లె. ఆర్టీవో భువనగిరి: రాయగిరి, కేసారం, పెంచికల్పహాడ్, తుక్కాపూర్, గౌస్నగర్, ఎర్రంబల్లె ఆర్డీవో చౌటుప్పల్: పహిల్వాన్పూర్, రెడ్లరాపాక, పొద్దటూరు, వెర్కట్పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, తలసింగారం, చౌటుప్పల్, లింగోజిగూడ. -
Regional Ring Road: ఉత్తర ‘రింగ్’కు బడ్జెట్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి బడ్జెట్ ఖరారైంది. ఉత్తర భాగంలో మొత్తం 162.46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.13,200 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర జాతీయ రహదారుల విభాగం తేల్చింది. ఇందులో రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించింది. వాస్తవానికి ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఇప్పుడు మరో రూ.4,200 కోట్ల మేర పెరిగింది. వాటా సొమ్ము ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి మొత్తంగా 2 వేల హెక్టార్ల భూమి అవసరం పడుతోంది. ఇందులో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున.. చాలావరకు భూసేకరణ చేయాల్సి వస్తోంది. పరిహారం రూపంలో భారీగా ఖర్చవనుంది. నిబంధనల ప్రకారం భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్లు తన వాటాగా ఇవ్వాలి. దీంతో ఈమేరకు సొమ్మును జమ చేయాల్సిందిగా ఎన్హెచ్ఏఐ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది. వ్యయం మరింత పెరిగే అవకాశం! గ్రేటర్ హైదరాబాద్ను చుట్టేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు అవతల చేపట్టిన రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి మొత్తంగా రూ.19 వేల కోట్లు ఖర్చవుతుందని తొలుత ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు, దక్షిణ భాగానికి రూ.10 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. కానీ పలు రకాల కారణాలతో ఈ ప్రాజెక్టులో జాప్యం జరిగి.. నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్రం ఆమోదించిన బడ్జెట్ ప్రకారం.. ఒక్క ఉత్తర భాగం నిర్మాణానికే రూ.13,200 కోట్లు ఖర్చవనున్నాయి. ఈ మార్గంలో ప్రధాన పట్టణాలకు చేరువగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా ఉండటంతో పరిహారం ఖర్చు ఎక్కువగా ఉంటుందని.. అంచనా వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక రీజనల్ రింగ్రోడ్డు దక్షిణ భాగం ఖర్చుకూడా భారీగానే ఉంటుందని అంటున్నాయి. 30 కిలోమీటర్లు మినహా వేగంగా.. భువనగిరి కాలా (కాంపిటెంట్ అథారిటీ లాండ్ అక్విజిషన్) పరిధిలో 22 కిలోమీటర్ల రోడ్డు, సంగారెడ్డికి చేరువగా ఉన్న గ్రామాలకు సంబంధించి 8 కి.మీ.ల రోడ్డుకు సంబంధించి భూసేకరణ సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ సర్వే కొనసాగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో పూర్తయింది. ఆ ప్రాంతాలకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుమతులు రాగానే భూసేకరణ చేపడతారు. అవార్ట్ పాస్ చేస్తే సదరు భూమి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి వెళుతుంది. ఈలోగా పరిహారం నిధుల్లో రాష్ట్రం వాటాను జమ చేయాలని జాతీయ రహదారుల విభాగం కోరింది. -
‘ఆర్ఆర్ఆర్’పై హైస్పీడ్లో భూసేకరణ.. నవంబర్లో రంగంలోకి కలెక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూసేకరణ అవార్డ్ పాస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అవార్డ్ పాస్ చేయాలంటే కచ్చితంగా పర్యావరణ అనుమతి వచ్చి ఉండాలి, ఇది రావాలంటే అటవీ అనుమతుల్లో స్టేజ్–1 మంజూరు కావాలి. ఈ రెండింటిని త్వరగా పొందేందుకు చర్యలు చేపట్టారు. అటవీ అనుమతులు.. గ్రామసభలు రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో 70 హెక్టార్ల మేర అటవీ భూములు పోనున్నాయి. అంతమేర స్థలాన్ని అటవీశాఖకు అప్పగిస్తే చెట్లను పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలాలిచ్చే అవకాశం లేదు. బదులుగా ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో రెట్టింపు స్థలంలో మొక్కలను పెంచనున్నారు. మొక్కలు నాటి, ఐదేళ్ల వరకు సంరక్షించేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖకు జాతీయ రహదారుల సంస్థ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్పష్టమైన హామీతో అటవీశాఖ స్టేజ్–1 అనుమతిని ఇస్తుంది. డబ్బులు డిపాజిట్ చేశాక స్టేజ్–2 అనుమతులు వస్తాయి. ఇక పర్యావరణ అనుమతుల కోసం నవంబర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు 4 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కలెక్టర్లు గ్రామసభల తేదీలను ప్రకటించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరిస్తారు. గ్రామసభల ఆమోదంతో పర్యావరణ అనుమతులు రానున్నాయి. ఆరు నెలలకోసారి వాహన శబ్దాలపై సమీక్ష రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే అయినందున వాహనాలు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ రోడ్డును ప్రధాన పట్టణాలకు చేరువగా నిర్మిస్తుండటంతో శబ్ద కాలుష్యం జనావాసాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో శబ్దాన్ని నిరోధించే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో జనావాసాల్లోకి వెళ్లే శబ్దాన్ని అడ్డుకునేలా రోడ్ల పక్కన పొడవుగా ఉండే చెట్లను పెంచుతారు. వెలువడే శబ్దం పరిస్థితి పరికరాల ద్వారా ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. శబ్ద కాలుష్యం నిర్ధారిత పరిమాణాన్ని మించి ఉంటే మరిన్ని చర్యలకు సిఫార్సు చేస్తారు. ఈ వివరాలను వచ్చే నెలలో జరిగే గ్రామసభల్లో వివరించనున్నారు. -
దక్షిణ ‘రింగ్’కు మూడు అలైన్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: ‘అడ్డుగా వస్తున్న గుట్టలను చీల్చి రోడ్డు నిర్మించాలా? ఖర్చు తగ్గించుకోవటానికి అలైన్మెంటును మళ్లించాలా? ఏయే ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? వాటికి కాలువలు ఎక్కడెక్కడ నిర్మాణం కాబోతున్నాయి? అటవీ భూములను తప్పించాలంటే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?’ రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో అధికారులకు ఎదురవుతున్న సవాళ్లు ఇవి. అంతగా ట్రాఫిక్ లేని ఈ మార్గంలో నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్వే అవసరమా అంటూ కొన్నినెలల పాటు ఈ భాగం విషయంలో తర్జనభర్జన పడ్డ కేంద్రం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణభాగం నిడివి పెద్దగా ఉండటమే కాకుండా, భౌగోళికంగా అలైన్మెంట్ను రూపొందించే విషయంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా అలైన్మెంట్ ఖరారు చేయాలని నిర్ణయించిన అధికారులు.. కన్సల్టెన్సీ సంస్థకు పలుసూచనలు చేశారు. గతంలో భారీ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలందించిన అనుభవమున్న ఢిల్లీ సంస్థ ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’.. అధికారుల సూచనలకు అనుగుణంగా సర్వే చేస్తోంది. గుట్టలు, చెరువులు, ఊళ్ల మధ్య. కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నాలుగైదు చోట్ల 20 మీటర్ల వరకు ఎత్తున్న చిన్న గుట్టలు అడ్డుగా ఉన్నట్టు గుర్తించారు. ‘వాటిని తొలిచి రోడ్డు నిర్మించే అవకాశం ఉందా? లేదా అలైన్మెంట్ను మళ్లించాలా.. మళ్లించదల్చుకుంటే వాటికి దగ్గర గా ఉన్న జనావాసాల పరిస్థితి ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, ఊళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలైన్మెంట్ను మళ్లించాలి. దానివల్ల దూరం, నిర్మాణ ఖర్చు పెరుగుతాయ’ని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపై ఢిల్లీలోని జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వివరాల ను కన్సల్టెన్సీ సంస్థ అధికా రులకు అందజేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించాలని.. నిర్మాణ వ్యయం, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యోగ్యమైన దాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ, అటవీ శాఖలతో సంప్రదింపులు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వాటి స్థలాలను ఖరారు చేయలేదు. దీనితో ‘దక్షిణ రింగ్’ అలైన్మెంట్ను ఖరారు చేస్తే.. భవిష్యత్తులో మళ్లీ మార్పుచేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అలైన్మెంటు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ నిర్మాణాలు రాబోతున్నాయనే వివరాలు, ప్రణాళికలు అందించాల్సిందిగా కోరారు. కాలువలు ఉన్న చోట అలైన్మెంటులో ఎలాంటి స్ట్రక్చర్లను నిర్మించాలో తేల్చుకోవటానికి ముందస్తు అవకాశం చిక్కనుంది. ఇక ఏయే ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయో గుర్తించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు.. అటవీ శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వారి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుకూలంగా అలైన్మెంటు రూపొందించారన్న విమర్శలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు చేపడతామని అంటున్నారు. అలైన్మెంట్కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని, ఈ నెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ అలైన్మెంట్లో స్పష్టత వస్తుందని అధికారులు సూచించారు. -
భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్’ రియలేనా?
సాక్షి, రంగారెడ్డి/ కొందుర్గు: గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్’ రియల్గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవలే గూగుల్ ఎర్త్మ్యాప్ ద్వారా రోడ్డు వెళ్లే మార్గం సూచిస్తున్న గూగుల్ మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, చుట్టుపక్కల భూముల రైతులు తమ భూములకు మంచి ధరలు వస్తాయని ఆశల పల్లకీలో తేలుతున్నారు. మండలంలో ఇప్పటికి వరకు ఎకరం భూమి ధర రూ.40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉండేది. కాగా, రింగ్రోడ్డు ప్రకటనతో ఏకంగా ఎకరం కోటి రూపాయలు దాటింది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామన్నా రూ.80 లక్షలకు తక్కువ దొరకడం లేదని రియల్ వ్యాపారులు అంటున్నారు. ఇన్నర్, ఔటర్ గ్రామాలు ఇవే.. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించనున్న దక్షిణ భాగం రీజినల్ రింగ్రోడ్డుకు సంబంధించి గ్రామాల్లో మార్కింగ్ కూడా చేసినట్లు తెలిసింది. ఇక తాజాగా రోడ్డుకు లోపలి గ్రామాలు, వెలుపలి గ్రామాల జాబితా విడుదల చేసినట్లు గ్రామాల జాబితా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏకంగా రెవెన్యూ గ్రామాల వారీగా ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారోనని గ్రామాల జాబితాలో నమోదు చేయడం జరిగింది. దీంతో ఇక రింగ్రోడ్డు వెళ్లేది ఖాయమేనని రియల్ వ్యాపారులు, రైతులు నమ్ముతున్నారు. రింగ్ రోడ్డు ఇలా వెళ్తుందా..? సంగారెడ్డి జిల్లా కొండాపూర్, కంది మండలాల నుంచి వికారాబాద్ జిల్లా మోమిన్పేట్, నవాబ్పేట్, పూడూర్ మండలాల మీదుగా రంగారెడ్డి చేవెళ్ల, శంషాబాద్, షాబాద్, కొందుర్గు, ఫరూఖ్నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, మంచాల మండలాల మీదుగా రింగ్రోడ్డు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే అదును చేసుకొని రియల్ వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుందో భూముల ధరలు ఎంతవరకు పెరుగుతాయో వేచి చూడాల్సిందే. మాకు ఎలాంటి సమాచారం లేదు మండల పరిధిలోని ఆయా గ్రామాల గుండా రింగ్ రోడ్డు వస్తుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయినా, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లును నమ్మి రియల్ వ్యాపారుల ఉచ్చులో పడి రైతులు మోసపోవద్దు. – తహసీల్దార్, రమేష్కుమార్, కొందుర్గు. -
Hyderabad Regional Ring Road: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన ఇంటర్ ఛేంజర్ల (జంక్షన్లు) నిర్మాణం ఆయా ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తుంటే.. ఇంటర్ ఛేంజర్లపై ప్రజల అభ్యంతరాలు అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. చుట్టూ ఇంటర్ ఛేంజర్ నిర్మాణం..మధ్యలో కొన్ని మిల్లులు, దుకాణాలు, పెట్రోలు పంపులు.. వంటి వాణిజ్యపరమైన ప్రైవేటు నిర్మాణాలు, ఇళ్లు సైతం ఉండటం సమస్యగా మారింది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు తొలగించాల్సి రావటం ఇప్పుడు చాలా కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. భూసేకరణ ప్రక్రియ షురూ.. హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులను కొంతమేర తగ్గించే క్రమంలో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఉత్తర భాగానికి సంబంధించిన 162 కి.మీ. రోడ్డుకు గాను భూసేకరణకు మార్గం సుగమం చేస్తూ 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదలయ్యాయి. అభ్యంతరాల గడువు కూడా పూర్తి కావటంతో ఇక భూమిని సేకరించే పని మొదలైంది. దీనికి సంబంధించి సర్వే కూడా ఇటీవలే పూర్తి చేశారు. రోడ్డు అలైన్మెంట్ విషయంలో రాయిగిరి, సంగారెడ్డిలాంటి ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఆయా ప్రాంతాల్లో 30 కి.మీ.కు సంబంధించిన సర్వేను అధికారులు పెండింగులో పెట్టారు. ఆయా ప్రాంతాల్లో భూ యజమానులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కుదరని పక్షంలో చివరి అస్త్రంగా పోలీసు రక్షణ మధ్య భూమిపై హద్దులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంటర్ ఛేంజర్లపై తీవ్ర అభ్యంతరాలు జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగురోడ్డు దాటే ప్రాంతాల్లో నిర్మించాల్సిన ఇంటర్ ఛేంజర్లపై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి వందల్లో వినతులు ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులకు చేరాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు రెండు ఇంటర్ ఛేంజర్ల విషయంలో మాత్రం ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు వినియోగించుకునేలా అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా వాటి విషయంలో మాత్రం కచ్చితంగా ఆయా నిర్మాణాలను తొలగించాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజర్స్ వద్ద వెసులుబాటు? రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజర్లు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ ట్రంపెట్ (గుండ్రంగా ఉండే రెండు నిర్మాణాలు) నమూనాలో ఇంటర్ ఛేంజర్ నిర్మించాల్సి ఉండగా..ఆ భూమి పరిధిలో రైస్ మిల్లులున్నాయి. ఇక జోగిపేట రోడ్డులో మరో డబుల్ ట్రంపెట్ నిర్మాణం రానుంది. ఇక్కడ పెట్రోలు బంకు వస్తోంది. అయితే ఈ రెండూ డబుల్ ట్రంపెట్ నిర్మాణాలైనందున, స్ట్రక్చర్ లూప్లో ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండి, మిగతా మూడు వైపులా ఖాళీగా ఉంటుంది. ఆ లూప్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ (వంతెన లాంటి నిర్మాణం) కావటంతో కింది నుంచి మిల్లులు, పెట్రోల్ బంకు వంటి ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ రెండుచోట్లా ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాడుకునేలా వెసులుబాటు కల్పించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల డబుల్ ట్రంపెట్ నమూనాలు లేనందున, మధ్యలో ఉండే ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటుకు అవకాశం ఉండదు. యజమానుల్లో ఆందోళన డబుల్ ట్రంపెట్లు కాని 9 ప్రాంతాల్లో రెండు చోట్ల పెట్రోలు బంకులు, దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యం కాదని అధికారులంటున్నారు. దాంతో వాటి యజమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఊళ్లకు కొంచెం దూరంగా అలైన్మెంట్ మార్చి ఖాళీ ప్రాంతాల్లో జంక్షన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే రోడ్డు అలైన్మెంట్ ఖరారైనందున జంక్షన్లను మార్చటం సాధ్యం కాదని, ఒకవేళ మార్చాలంటే మరో 10 కి.మీ. దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అప్పుడు రోడ్డు నిర్మాణానికి మరింత భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. ఆ రెండు చోట్ల మాత్రం!) -
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. అక్కడ మాత్రం!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తయింది. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ప్రకారం హద్దులు నిర్ధారించారు. అలైన్మెంట్ ప్రకారం జెండాలు కట్టిన కర్రలు పాతారు. సర్వే నంబర్ల వారీగా రైతుల సమక్షంలో వారి వివరాలను రికార్డు చేశారు. ఆ రెండు చోట్ల తీవ్ర నిరసనలు.. రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు కోసం ఎనిమిది ‘కాలా’ (కాంపిటెంట్ అథారి టీస్ ఫర్ లాండ్ అక్విజిషన్) లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు అన్ని విభాగాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే భువనగిరి కాలాకు సంబంధించి సర్వే అసలు జరగలేదు. ఇక్కడ రైతులు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూమి ఇచ్చినందున మరోసారి భూమిని కోల్పేయే ప్రసక్తే లేదంటూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అలాగే సంగారెడ్డి పట్టణం సమీపంలోని గ్రామాల రైతులు కూడా అధికారులను సర్వే చేయనివ్వలేదు. సంగారెడ్డిని దాదాపు ఆనుకుని ఉన్నందున తమ భూములకు ఎక్కువ ధర ఉందని, అయితే పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భూములు ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్నారు. భువనగిరి కాలా పరిధిలో 22 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే జరగలేదు. సంగారెడ్డి కాలా పరిధిలో 8 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో చర్చించి, సర్వే జరపాలని అధికారులు భావిస్తున్నారు. కుదరని పక్షంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. -
సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ భూములు పోతాయనే అలైన్మెంట్ మార్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. వాస్తానికి రింగ్రోడ్డు.. సంగారెడ్డి చౌరస్తా నుంచి సదాశివపేట, సీఎం ఫాంహౌస్æ మీదుగా వెళ్లాల్సి ఉండగా దాని అలైన్మెంట్ మార్చిన కారణంగా భువనగిరి పట్టణం, కలెక్టరేట్ను అనుకొని ఉన్న రాయగిరి భూములు పోతున్నాయన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరి రైతులు సోమవారం ఎంపీ వెంకట్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన రైతులతో మాట్లాడుతూ.. రైతుల కోసం తాను ఎంతటి త్యాగానికి, పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని.. దసరా తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్లి గడ్కరినీ కలుద్దామని రైతులకు చెప్పారు. అంతకుముందు రాయగిరి, చౌటుప్పల్ మండలం భూనిర్వాసితులు యాదాద్రి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి వారి నుంచి వినతిపత్రం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
గడ్కరీకి రాయగిరి రైతుల గోడు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డుతో భూములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమవారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్గడ్కరీ సోమవారం మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆయనతో రీజినల్ రింగ్రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చెప్పారు. రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్మెంట్ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. -
Regional Ring Road: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించి అదనంగా మరో 40 ఎకరాల భూసేకరణకు ఎన్హెచ్ఏఐ అనుబంధ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు సమాచారం. గత ఏప్రిల్లో సంగారెడ్డి జిల్లా ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలో 270 ఎకరాల భూసేకరణకు కీలకమైన 3ఏ గెజిట్ నోటిఫికేషన్ను ఢిల్లీ అధికారులు జారీ చేశారు. ఇప్పుడు దానికి మరో 40 ఎకరాలను చేర్చినట్లు సమాచారం. ఇలాగే మరో రెండు అనుబంధ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత నోటిఫికేషన్లకు అనుబంధంగా.. ఆర్ఆర్ఆర్ ఇంటర్ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించి భూసేకరణకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ జంక్షన్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే జంక్షన్ల వద్ద వాహనాల వేగం కనీసం 60 కి.మీ. మేర ఉండేందుకు ఇంటర్ ఛేంజర్లను విశాలంగా నిర్మించాలని నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.64 కి.మీ నిడివిగల రోడ్డుకు 8 భాగాలుగా భూసేకరణ జరపనున్న విషయం తెలిసిందే. ఇందులో మూడు భాగాలకు సంబంధించి గత ఏప్రిల్లో 3ఏ గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ, చౌటుప్పల్ ఆర్డీఓ, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో సేకరించాల్సిన భూమి వివరాలతో ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు వాటికి అనుబంధ గెజిట్ నోటిఫికేషన్లు జారీ కానున్నట్టు తెలిసింది. ఉత్తరభాగానికి సంబంధించి 11 చోట్ల ఇంటర్ఛేంజ్ జంక్షన్లు నిర్మితం కానున్నాయి. ఇందుకోసం అధికారులు రెండు డిజైన్లు రూపొందించారు. మొదటిది వాహనాలు గంటకు 30 కి.మీ వేగంతో, రెండోది 60 కి.మీ.వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. భూసేకరణకు సంబంధించి మొదటి మూడు గెజిట్ నోటిఫికేషన్లను తొలి డిజైన్కు సరిపోయేలానే జారీ చేశారు. కానీ ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వే తరహాలో గంటకు 60 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలని ఎన్హెచ్ఏఐ అధికారులు తర్వాత ఖరారు చేశారు. ఈ కారణంగానే గత నెలలో విడుదలైన మిగతా ఐదు గెజిట్ నోటిఫికేషన్లలో రెండో డిజైన్కు సరిపోయేలా భూమిని గుర్తిస్తూ విడుదల చేశారు. ఇప్పుడు మొదటి మూడు గెజిట్ నోటిఫికేషన్లకు సంబంధించి మిగతా భూమిని చేరుస్తూ అదనపు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివంపేట గ్రామంలో అదనంగా 40 ఎకరాలు సేకరిస్తున్నారు. -
Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా?
సాక్షి, యాదాద్రి: అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం మరికొంత భూమి పోయింది.. తమ ప్రాంతం పచ్చగా అవుతుంది కదా అనుకున్నారు. యాదాద్రి అభివృద్ధికి, హైటెన్షన్ విద్యుత్ లైన్ల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంది. అటు దేవుడు, ఇటు కరెంటు.. ఇవ్వలేక ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగు రోడ్డు తెరపైకి వచ్చింది. దాని అలైన్మెంటు కూడా రాయగిరి గ్రామం మీదుగానే వెళుతోంది. ఇన్నిసార్లు భూములు ఇచ్చామని.. ఇప్పుడూ ఇస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు. రాయగిరి గ్రామంలో వందలాది మందికి ఉపాధి కల్పించే రైస్ మిల్లులు, హోటళ్లు మొత్తం రోడ్డు విస్తరణలో పోతున్నాయని అంటున్నారు. 80 ఎకరాల సేకరణ కోసం.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ జంక్షన్ సర్కిల్ కోసం 80 ఎకరాలు సేకరిస్తున్నారు. ముందుగా 60 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికి.. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 20 ఎకరాలు పెంచారు. అలైన్మెంట్ మార్చారా? : ముందుగా రీజనల్ రింగ్ రోడ్డు తుర్కపల్లి మండలం నుంచి రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల మీదుగా భువనగిరి మండలంలోకి వెళ్లేలా ప్రాథమికంగా ప్రతిపాదించారు. తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానానికి ఉత్తరం వైపు నుంచి కాకుండా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, దాతర్పల్లి మీదుగా కలెక్టరేట్ నుంచి రాయగిరి గ్రామం మీదుగా వలిగొండ మండలం వరకు తాజా ప్రతిపాదనతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా రాయగిరి గ్రామానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు భూములు పోతే ఎలా..? రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన బద్దం నర్సింహారెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్ లైన్ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో పది మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని నర్సింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గుంట భూమి లేకుండా పోతుంది సర్వే నంబర్ 690లో మా అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోంది. రోడ్డు అలైన్మెంటు మార్చి మా జీవితాలు కాపాడాలి. – తెల్జూరి ఐలయ్య, రాయగిరి అలైన్మెంట్ మార్చాలి సర్వే నంబర్ 726లో 7.15 ఎకరాల భూమిపోతోంది. ఇందులో ఆరుగురు రైతులు తమ భూములు మొత్తం కోల్పోతున్నారు. ముందుగా ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఈ సర్వే నంబర్లో 4 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చిన అలైన్మెంట్తో భూమి మొత్తం పోతోంది. వెంటనే రింగురోడ్డు అలైన్ మెంట్ మార్చాలి. – అవిశెట్టి పాండు, రాయగిరి గుంట భూమి కూడా మిగలకుండా.. రాయగిరికి చెందిన కోటం భద్రయ్యకు ఉన్న 4.17 ఎకరాల భూమి మొత్తం రీజనల్ రింగ్రోడ్డులో పోతోంది. గతంలో ఆయన భూమిలో రెండు ఎకరాలను హైటెన్షన్ విద్యుత్ లైన్లు, టవర్ల కోసం ప్రభు త్వం తీసుకుంది. అలాగే జాతీయ రహదారి విస్తరణ కోసం 34 గుంటల భూమి, ఇల్లు పోయాయి. తాజా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉన్న మొత్తం భూమిని కోల్పోతున్నాడు. కూతురు వివాహం కోసం పనికి వస్తుందనుకున్న కోట్ల విలువ చేసే భూము లను కోల్పోయి ఎలా బతకాలని, ప్రభుత్వం అలైన్ మెంట్ మార్చాలని భద్రయ్య వేడుకుంటున్నాడు. -
RRR: భూసేకరణ వేగవంతం.. 14 మండలాల్లో వేలాది ఎకరాల...
సాక్షి, గజ్వేల్: నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కావడంతో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియ జోరందుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నందున.. దీని కోసం 14 మండలాల్లో 73కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది. ఈక్రమంలో సర్వే పనులను ప్రారంభించారు. ►ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్, చిట్యాల నుంచి భువనగిరి– గజ్వేల్ మీదుగా సంగారెడ్డి (కంది) వరకు 65వ నంబరు జాతీయ రహదారిని తాకుతూ 164కి.మీ మేర రహదారి విస్తరించనుంది. ►కంది–శంకర్పల్లి–చేవేళ్ల–షాద్నగర్–కడ్తాల్–యాచారం నుంచి (186 కిలోమీటర్లు) తిరిగి చౌటుప్పల్ను తాకనుందని ప్రాథమిక సమాచారం. ►ఈ లెక్కన మొత్తంగా 350 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగు రోడ్డుగా మారనుంది. ఇందులో మొదటి విడతగా ఉత్తర భాగంలో చౌటుప్పుల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే. ►కాగా ట్రిపుల్ఆర్ వెళ్లే గ్రామాల జాబితాతో కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఉత్తర భాగంలో 20 మండలాలు, వీటి పరిధిలోని 111 గ్రామాలు ఉన్నాయి. ►ఇందులో భాగంగానే యాదాద్రి–భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి. ►ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో గల 73కి పైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఉమ్మడి జిల్లా (సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్) పరిధిలో 110 కిలోమీటర్లపైనే విస్తరించనుంది. ►జగదేవ్పూర్–గజ్వేల్–తూప్రాన్–నర్సాపూర్–సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. గ్రామాలు, పట్టణాలు, పాత రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు. సర్వే పనులు షురూ.. ►భూసేకరణ జరుగనున్న ఉత్తర భాగంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే పలుమార్లు డిజిటల్ సర్వే చేపట్టారు. ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా ప్రత్యక్ష సర్వే చేపడుతున్నారు. ►ఈ క్రమంలోనే జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో సర్వే జరిపిన సందర్భంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ►గ్రామంలోని 191 సర్వే నంబర్లో 250 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్ల కిందట 150 మంది ఎస్సీలు, బీసీలకు అసైన్ చేశారు. అప్పటి నుంచి వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ►ఐదేళ్ల క్రితం ఇవే భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామని వీరికి ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ►ఈ క్రమంలోనే ఈ భూముల్లో 120 ఎకరాల మేర ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సేకరిస్తుండగా.. తమకు ఎలాంటి సమాచారమివ్వకుండా, సర్వే చేపట్టారని ఆరోపిస్తూ సర్వేను అడ్డుకున్న సంగతి విదితమే. ►దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి, సదరు రైతులకు న్యాయం చేసేలా నష్ట పరిహారం కో సం ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంది. ►ఇక్కడే కాకుండా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. దీని కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగితేనే భూసేకరణకు అడ్డంకులు ఏర్పడవు. ►ఇకపోతే గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ కోసం మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ►తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వే లాది ఎకరాల భూసేకరణ జరగనుండగా, రెవె న్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమై ఉంది. వారి సమస్యను పరిష్కరిస్తాం మా డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని సర్వేను అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం. – విజయేందర్రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ -
దక్షిణ ‘రింగు’కు 5 వేల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి సంబంధించి 182 కి.మీ. రోడ్డు నిర్మాణానికి దాదాపు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్గా ఎంపికైన ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నో క్రాట్స్ సంస్థ మరో రెండు నెలల్లో తుది అలైన్ మెంట్ను రూపొందించనుంది. దాని ప్రకారం రోడ్డు అసలు నిడివి తేలనుంది. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం దాదాపు 5 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో ఇది 4,200 ఎకరాలుగా ఉంది. అయితే, నిడివి ఎక్కువగా ఉన్నా.. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం భూసేకరణ ఖర్చు (దామాషా ప్రకారం) తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భాగంలో ఎక్కువగా అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాణిజ్యపరమైన స్థలాలు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో భూ పరిహారం తక్కువగా ఉండనుంది. ఇంటర్చేంజర్స్ సంఖ్యా తక్కువే.. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగంలో ఇంటర్చేంజర్ల సంఖ్య కూడా తక్కువే ఉండనుంది. ఉత్తర భాగంలో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగు రోడ్డు క్రాస్ చేస్తుండటంతో, ఆయా ప్రాంతాల్లో సింగిల్ ట్రంపెట్, డబుల్ ట్రంపెట్, రోటరీ ఇంటర్చేంజ్.. ఇలా వివిధ ఆకృతుల్లో జంక్షన్లను నిర్మించబోతున్నారు. కానీ దక్షిణ భాగంలో అవి ఏడెనిమిది చోట్ల మాత్రమే అవసరం ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే ప్రాంతాలు ఈ వైపు తక్కువగా ఉండటమే కారణం. పని ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కన్సల్టెన్సీ బాధ్యతలు పొందిన ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థ శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించింది. అలైన్మెంటుకు సంబంధించి పాత కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంటును నలుగురు సభ్యుల బృందం పరిశీలిస్తోంది. ఇది గూగుల్ మ్యాప్ ఆధారంగా రూపొందించిన తాత్కాలిక అలైన్మెంటు. క్షేత్రస్థాయిలో పర్యటించటం ద్వారా, ఇందులో చేయాల్సిన మార్పులు, వీలైనంతమేర దగ్గరి దారిగా మార్గాన్ని అనుసంధానించటం, జలవనరులు, జనావాసాలు, గుట్టలను తప్పించటం తదితరాల ద్వారా కొత్త అలైన్మెంటు తయారు చేస్తారు. -
దక్షిణ భాగానికి కూడా రీజినల్ రింగ్ రోడ్డు.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్ రింగ్ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్హెచ్ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్మెంట్ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది. రెండు భాగాలుగా రోడ్డుతో.. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్మెంట్ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి నాగ్పూర్ కేంద్రంగా పనిచేసే కే అండ్ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది. భూసేకరణలో భాగంగా 3ఏ గెజిట్ల విడుదల వరకు కసరత్తు పూర్తి చేసింది. భూసేకరణ అధీకృత అధికారులుగా ఉన్న ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇటీవలే విడతల వారీగా ఎనిమిది గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా. నిరీక్షణ, అనుమానాల మధ్య.. మొదట రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి మాత్రమే అనుమతి ఇచ్చిన కేంద్రం.. దక్షిణ భాగం విషయంలో మౌనం వహించటంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దక్షిణ భాగంలో రోడ్డును ప్రతిపాదించిన ప్రాంతాల మధ్య ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో.. ఈ వైపు ఎక్స్ప్రెస్ వే అవసరం లేదని ఎన్హెచ్ఏఐ అధికారులు అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చాయి. దీనితో పూర్తి రింగ్గా కాకుండా ఒకవైపు మాత్రమే ఈ రోడ్డు నిర్మితమవుతుందని భావించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం విషయంతో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది గడిచి నాలుగు నెలలైనా అనుమతి రాకపోవటంతో.. దక్షిణభాగం ఉంటుందా, లేదా అన్న ప్రశ్నలు వినిపించాయి. కానీ తాజాగా కేంద్రం అనుమతి వచ్చింది. భారీ నిధులతో.. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని ప్రాథమిక అలైన్మెంటులో పేర్కొనగా.. ఇప్పుడు పూర్తి స్థాయి కన్సల్టెన్సీ తుది అలైన్మెంట్ను ఖరారు చేయనుంది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. పూర్తి స్థాయి డీపీఆర్ రూపొందితే వ్యయంపై స్పష్టత రానుంది. ఇక దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్ తయారీకి రెండేళ్లకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని.. దీనితో భూసేకరణ భారం పెరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అప్పటికి నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని.. దక్షిణ భాగం వ్యయం రూ.15 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఉత్తర భాగం ఇదీ.. ►సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు. ►భారత్మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్–1లో గుర్తింపు. ►ఈ రోడ్డుకు తాత్కాలిక జాతీయ రహదారి నంబర్గా ఎన్హెచ్ 166ఏఏ కేటాయింపు. ►నాగ్పూర్కు చెందిన కే అండ్ జే ప్రాజెక్ట్స్ సంస్థ ఈ భాగానికి కన్సల్టెన్సీ సంస్థగా ఉంది. ►గతేడాది సెప్టెంబర్లో టెండర్ ద్వారాసంస్థను ఎంపిక చేశారు. ఏడాదిలోగా అలైన్మెంట్ పూర్తి చేసి, భూసేకరణకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు డీపీఆర్ తయారీ కసరత్తు మొదలు. ►నిర్మాణానికి మొత్తంగా రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా దక్షిణ భాగం ఇదీ.. ►సంగారెడ్డి నుంచి కంది,నవాబ్పేట, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, ఆమన్గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు.. దాదాపు 182 కిలోమీటర్ల పొడవు ►భారత్మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్2 కింద గుర్తింపు ►ఢిల్లీకి చెందిన ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగింత. ►నిర్మాణానికి మొత్తంగా రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా ఉత్తరాదిలో పెద్ద ప్రాజెక్టులు చేసిన సంస్థ..! ఢిల్లీలోని గ్రీన్పార్కు ప్రాంతానికి చెందిన ఇంటర్కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థకు.. బిహార్, యూపీ రాష్ట్రాల్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే (పాట్నా రింగ్ రోడ్డు), గంగా బ్రిడ్జి కనెక్టివిటీ ప్రాజెక్టులను కేంద్రం కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగానికి డీపీఆర్ రూపొందించే బాధ్యతనూ ఇచ్చింది. -
జంక్షన్ల వద్ద మరింత భూసేకరణ
►వారిద్దరు అన్నదమ్ములు.. రాష్ట్ర రహదారిని ఆనుకుని వారికి 15 ఎకరాల పొలం ఉంది. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆ రహదారిని క్రాస్ చేసే చోట నిర్మించే కూడలికి తొలుత 50 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమిక అలైన్మెంటు రూపొందించారు. దీనివల్ల ఆ అన్నదమ్ములు తమ పొలంలో ఐదెకరాలు కోల్పోవాల్సి వస్తుందని తేలింది. అన్నదమ్ములు పోనీలే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ జంక్షన్ను మరింత పెద్దదిగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో వారు తమ మొత్తం పొలం కోల్పోవాల్సి వస్తోంది. ►ఆయనో వ్యాపారి.. జాతీయ రహదారికి చేరువలో ఆయనకు కొంత ఖాళీ స్థలం, ఓ మిల్లు ఉంది. ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్ ఛేంజర్కు 63 ఎకరాలు కావాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. ఈ మేరకు రూపొందించిన అలైన్మెంటులో ఆ వ్యాపారి స్థలం కూడా ఉంది. దీంతో తన మిల్లుకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలం మినహాయించినా సరిపోతుందని భావించిన అధికారులు ఓ ప్లాన్ రూపొందించారు. కానీ తాజాగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఆయనకున్న ఖాళీ స్థలంతోపాటు మిల్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజర్ల డిజైన్ మారటం.. వాటికి చేరువగా ఉన్న భూ యజమానులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. కొత్తగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముందనుకున్న ప్లాన్ను మారి ఉన్నట్టుండి కొత్త ప్లాన్ తెరపైకి రావటం, భారీగా భూ సమీకరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తడమే ఇందుకు కారణం. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ కసరత్తును వేగవంతం చేసిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఇందుకోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓల పరిధితో కూడిన ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటికి వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉండగా.. గత ఏప్రిల్లో మూడు, రెండు రోజుల క్రితం నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు చూసి, జంక్షన్లకు చేరువగా ఉన్న కొందరు భూ యజమానులు లబోదిబోమంటున్నారు. 11 చోట్ల ఇంటర్ ఛేంజర్లు రింగురోడ్డు ఉత్తరభాగంలో 11 చోట్ల ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు (జంక్షన్లు) రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇతర రోడ్లను క్రాస్ చేసే చోట జంక్షన్లు నిర్మిస్తారు. ఒక్కో జంక్షన్ 50 నుంచి 60 ఎకరాలలో ఉండేలా తొలుత డిజైన్ చేశారు. వాటిని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. సాధారణంగా జంక్షన్ల వద్ద వాహనాలు 30 కి.మీ. వేగానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఔటర్ రింగురోడ్డు కూడళ్లపై నిర్మించిన ఇంటర్ చేంజర్లను అలాగే డిజైన్ చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వే అయినందున ఇంటర్ ఛేంజర్లపై వాటి వేగం 50 నుంచి 60 కి.మీ. వరకు ఉండేలా చూడాలని తాజాగా నిర్ణయించిన అధికారులు ఇంటర్ ఛేంజర్ల డిజైన్లను మార్చారు. చాలా దూరం నుంచే మలుపు ఉండేలా చేయటంతో ఒక్కో జంక్షన్ విస్తీర్ణం 70 నుంచి 80 ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు అక్కడ భూమిని సమీకరించాల్సి వచ్చింది. తాజాగా విడుదలైన గెజిట్లలో ఈ విషయం గుర్తించి, భూములు కోల్పోతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎనిమిదో గెజిట్ నోటిఫికేషనూ విడుదల ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపే చివరి 8వ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో దాతర్పల్లె, గుండారెడ్డి పల్లె, ఇస్లాంపూర్, కిష్టాపూర్, నాగులపల్లె, నర్సంపల్లె, వట్టూరు, వెంకటాయపల్లె గ్రామాలకు సంబంధించిన 176.6176 హెక్టార్ల మేర భూమిని సేకరించేందుకు అనుమతినిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివితో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియకు అనుమతినిస్తూ 3 ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదల అయినట్టయింది. -
RRR: రీజినల్ రింగ్రోడ్డు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి కీలకమైన నాలుగు 3ఏ (క్యాపిటల్ ఏ) గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెలలోనే భూసేకరణకు కాంపిటెంట్ అథారిటీగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధి, ఆందోల్–జోగిపేట ఆర్డీవో, చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవగా.. ఇప్పుడు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్ ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు వీలుగా గెజిట్ నోటిఫికేషన్లను కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. ఒక్క తూప్రాన్ ఆర్డీవో పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అభ్యంతరాలకు 21 రోజులు గడువు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్ ఆర్డీవోల పరిధిలో భూసేకరణ గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజులలోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు, చేయాల్సిన మార్పుచేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక.. సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956 (48) సెక్షన్ 3సిలోని సబ్ సెక్షన్ 1 ప్రకారం.. అభ్యంతరాలపై కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజిట్లో పేర్కొన్నారు. హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే.. రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంటుకు సంబంధించి ఇప్పటికే మార్కింగ్ చేశారు. గెజిట్లు విడుదలైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దు రాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3డి గెజిట్ నోటిఫకేషన్ను విడుదల చేయనున్నారు. ఏయే గ్రామాలు.. ఎంత భూమి? - సంగారెడ్డి ఆర్డీవో పరిధిలోని.. దేవల్ పల్లె, దౌల్తాబాద్–కొత్తపేట, కాసాల, సికిందర్పూర్, గిర్మాపూర్, మల్కాపూర్, పెద్దాపూర్, చింతల్పల్లి, ఇరిగిపల్లె, కలబ్గూర్, కులబ్గూర్, నాగపూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె గ్రామాలకు సంబంధించి 195.129 హెక్టార్లు. - భువనగిరి ఆర్డీవో పరిధిలోని.. రాయగిరి, గౌస్నగర్, కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్ గ్రామాలకు సంబంధించి 199.103 హెక్టార్లు. - గజ్వేల్ ఆర్డీవో పరిధిలోని.. బంగ్లా వెంకటాపూర్, మఖత్ మాసాన్పల్లె, మట్రా జ్పల్లె, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, అల్రాజ్ పేట, ఇటిక్యాల, పీర్లపల్లె, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాముల పర్తి, బేగంపేట, ఎల్కల్, జబ్బాపూర్, మైలారం మక్త, నెమ్టూరు గ్రామాలకు సంబంధించి 389.96 హెక్టార్లు. - నర్సాపూర్ ఆర్డీవో పరిధిలోని.. చిన్న చింతకుంట, కాజీపేట, మహమ్మదాబాద్– జానకంపేట, మూసాపేట, నాగులపల్లె, పెద్ద చింతకుంట, రెడ్డిపల్లి, తిర్మలాపూర్, తుజల్పూర్, గుండ్లపల్లి, కొంతాన్పల్లె, కొత్తపేట, లింగోజిగూడ, పాంబండ, పోతుల బోగూడ, రత్నాపూర్, ఉసిరక పల్లె గ్రామాలకు సంబంధించి 303.79 హెక్టార్లు. ఇది కూడా క్లిక్ చేయండి: వెరైటీ కప్పుల గణపయ్య -
అడవి మీదుగా రింగురోడ్డు.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉన్న అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం జరగనుంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి కేంద్రం అనుమతించిన 162 కి.మీ. ఉత్తరభాగం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికిగాను ఇప్పటికే కొంతభాగానికి భూసేకరణకు వీలుగా గెజిట్ విడుదల కావడంతో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్తర భాగానికి ఉన్న నిడివిలో నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. ఈ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని చీలుస్తూ రోడ్డు అలైన్మెంట్ ఖరారైంది. అయితే ఎక్కువ అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండా, ఓ మూల నుంచి రోడ్డు నిర్మాణానికి వీలుగా అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఇందుకోసం 235 ఎకరాల అటవీ భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని తాజాగా తేల్చారు. వన్యప్రాణుల సంచారంపై పరిశీలన.. అటవీ ప్రాంతానికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాల్సి ఉందో తాజాగా ఎన్హెచ్ఏఐ అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. దీంతో రెండు విభాగాల అధికారులు సంయుక్త సర్వేకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భారీ వర్షాల వల్ల ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో వానలు తగ్గాక సర్వే చేపట్టి హద్దులు గుర్తించనున్నారు. అటవీ ప్రాంతం మీదుగా రీజినల్ రింగురోడ్డు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతున్నందున దాని ప్రభావం వన్యప్రాణులపై ఎంత మేర ఉండనుందో అంచనా వేస్తున్నారు. ఉత్తరభాగం రోడ్డు అలైన్మెంట్లో గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లోనే అటవీ భూములున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు కలిపి 235 ఎకరాల మేర రోడ్డు నిర్మాణానికి వాడనున్నారు. ఆ ప్రాంతాల్లో అడవి రోడ్డుకు ఓవైపు సింహభాగం ఉండనుండగా మరోవైపు కొంత ప్రాంతమే ఉండనుంది. అయినా అటూఇటూ వణ్యప్రాణుల రాకపోకలు ఎలా ఉండనున్నాయనే విషయమై అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో అరుదైన వణ్యప్రాణులు పెద్దగా లేవు. కోతులు, జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్ల లాంటి సాధారణమైన అడవి జంతువులే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటిల్లోనూ ఎక్కువ రాకపోకలుండే ప్రాంతాలను గుర్తించి ఆ వివరాలను అటవీ శాఖ అధికారులు ఎన్హెచ్ఏఐకి అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాటి రాకపోకలకు వీలుగా ఎకో బ్రిడ్జీలు నిర్మించే అవకాశం ఉంది. సామాజిక అటవీ వృద్ధికి విఘాతం.. రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్న ప్రాంతాల్లో దట్టమైన అడవులంటూ లేవు. తక్కువ పరిధిలోనే ఓ మోస్తరు అటవీ ప్రాంతాలుండగా కొన్నిచోట్ల సామాజిక అటవీ ప్రాంతాలను వృద్ధి చేశారు. ఈ పరిధి కూడా తక్కువ ప్రాంతాల్లోనే ఉంది. తాజాగా రింగురోడ్డు నిర్మాణంతో నాలుగైదు ప్రాంతాల్లో ఈ సామాజిక అటవీ ప్రాంతాల వృద్ధికి విఘాతం కలగనుంది. దీంతో వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతాల్లో అలాంటి అడవులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అటవీ శాఖకు అందిస్తారో లేక ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో వాటిని పెంచాల్సి ఉందో అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. -
రోడ్డు మారేటప్పుడూ ‘ఎక్స్ప్రెస్ వే’గమే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను దేశంలోనే ఆధునిక రాజమార్గంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ప్రస్తుతం అత్యంత భారీ ఎక్స్ప్రెస్ వేగా పేర్కొంటున్న ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వేపై నిర్మిస్తున్న ఇంటర్ఛేంజ్ల కంటే మెరుగ్గా దీనిపై ఇంటర్ఛేంజ్లను డిజైన్ చేస్తోంది. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివిగల రహదారిలో 11 చోట్ల జాతీయ/రాష్ట్ర రహదారులను దాటుతున్నందున ఆయా ప్రాంతాల్లో ఇంటర్ఛేంజ్లను నిర్మించనుండటం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే రూపొందించిన డిజైన్లను పరిశీలించిన ఢిల్లీ ఎన్హెచ్ఏఐ అధికారులు... మరింత విశాలమైన నిర్మాణాల కోసం కొత్త డిజైన్లను రూపొందించాలని ఆదేశించడంతో కన్సల్టెంట్ సంస్థ వాటిని ఎన్హెచ్ఏఐ పరిశీలనకు పంపింది. తొలుత 60 ఎకరాల్లో.. రెండోది 75 ఎకరాల్లో.. ఎక్స్ప్రెస్ వేగా ఉండే రింగురోడ్డుపై 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్లేలా రోడ్డును డిజైన్ చేస్తారు. సాధారణ రోడ్లు–ఎక్స్పెస్ వే మధ్య మారేందుకు వీలుగా నిర్మించే ఇంటర్ఛేంజ్లపై ఆ వేగం 30–40 కి.మీ. మధ్య మాత్రమే ఉంటుంది. ఔటర్ రింగురోడ్డుపై అలాగే డిజైన్ చేశారు. ప్రస్తుతం నిర్మించబోయే రీజినల్ రింగురోడ్డుపైనా అదే స్థాయిలో ఇంటర్ఛేంజ్లను తొలుత డిజైన్ చేశారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇప్పుడు ఇంటర్ఛేంజర్లపైనా వాహనాలు కనీసం గంటకు 50 కి.మీ. వేగంతో వెళ్లేలా కొత్త డిజైన్లను రూపొందించారు. ఇంటర్ఛేంజ్ మలువుల వద్ద వేగం 30–40 కి.మీ. మధ్యలో ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటి వేగం 50 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేకుండా 75 మీటర్ల ముందు నుంచి రోడ్డు మలుపు తిరిగేలా కొత్త డిజైన్ రూపొందించారు. పాత డిజైన్లో 60 మీటర్ల ముందు మలుపు ప్రారంభమయ్యేలా ఉంది. పాత డిజైన్ ప్రకారం ఇంటర్ఛేంజ్ నిర్మాణానికి 60 ఎకరాల స్థలం సరిపోయేది. కొత్త డిజైన్ ప్రకారం 70 ఎకరాలకుపైగా అవసరం కానుంది. ఈ రెండు డిజైన్లు పరిశీలిస్తున్న ఎన్హెచ్ఏఐ వాటి ల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే డిజైన్ల ప్రకారం రోడ్డు నిర్మించాలనే విషయాన్ని ఖరారు చేయనుంది. వచ్చే వారం సర్వే షురూ.. ఆందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలో 108.9491 హెక్టార్లు, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలో 300.3820 హెక్టార్లు, యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో 208.6090 హెక్టార్ల భూసేకరణకు వీలుగా ఏప్రిల్ 19న 3ఏ (క్యాపిటల్) నోటిఫికేషన్కు సంబంధించిన గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులో ఇది రెండో గెజిట్. భూసేకరణకు సంబంధించి ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలను నియమించగా ముగ్గురి పరిధికి సంబంధించే ఈ గెజిట్ను విడుదల చేశారు. ఇంటర్చేంజర్ల డిజైన్ల మార్పు నేపథ్యంలో మిగతా ఆర్డీఓల పరిధిలోని భూమికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. డిజైన్లు పూర్తయినందున మిగతా ప్రాంతాలకు సంబంధించి, గెజిట్ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి అదనపు గెజిట్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే గెజిట్ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుంది. రెవెన్యూ అధికారులు ఫీల్డ్కు వెళ్లి రోడ్డు అలైన్మెంట్ ప్రకారం 100 మీటర్ల వెడల్పుతో సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) యంత్రాలతో ఉపగ్రహ సహకారంతో నిర్వహిస్తారు. -
‘రీజినల్’ రెండో గెజిట్ విడుదల.. అభ్యంతరాలకు 21 రోజుల గడువు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి రెండో గెజిట్ విడుదలైంది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్ అథారిటీలోని 8 మంది అధికారులకుగాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను పేర్కొంటూ 3 (క్యాపిటల్ ఏ)గా పిలిచే ఈ గెజిట్ను గురువారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్, అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఆర్డీవో, సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లు, దాని పరిధిలో సేకరించాల్సిన భూముల విస్తీర్ణాన్ని ఇందులో పేర్కొన్నారు. సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వే నంబర్ల వివరాలను ఈ గెజిట్లో పొందుపరిచారు. కంపీటెంట్ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ల భూమిని సమీకరించనున్నట్లు గెజిట్లో వివరించారు. చదవండి👉🏼 మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు.. అలాగే సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట ఆర్డీఓ పరిధిలోని శివ్వంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్ (అంగడి), లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలకు సంబంధించి 108.9491 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. ఇక చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చిన్నకొండూరు, వెర్కట్పల్లె, గోకారం, పొద్దటూరు, వలిగొండ, సంగం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్పూర్, కంచెన్పల్లె, టేకులసోమారం, రెడ్లరాపాక, నేలపట్ల, తల్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లె గ్రామాలకు సంబంధించి 300.3820 హెక్టార్ల భూమిని సమీకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు.. విడుదలైన ముగ్గురు కంపీటెంట్ అధికారుల అధీనంలోని ప్రాంతాల ప్రజలు పత్రికాముఖంగా గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలపై సమాధానాలు వెలువడ్డ తర్వాత రింగ్రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరికరాల శాటిలైట్ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నెల తర్వాత 3డీ గెజిట్.. గ్రామాలవారీగా భూసమీకరణ జరిగే సర్వే నంబర్లను రెండో గెజిట్లో పొందుపరచగా ఈ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించనున్నారో, దాని యజమాని ఎవరో స్పష్టం చేసే 3డీ గెజిట్ మరో నెల రోజుల తర్వాత విడుదల కానుంది. చదవండి👉🏼 సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు -
‘ఆర్ఆర్ఆర్’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేటుకు నెగోషియేషన్ చేసి ధర నిర్ణయిస్తారు. కానీ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్... ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలైన్మెంట్పై ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్మెంట్ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. -
RRR First Gazette: రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తొలి గెజిట్ (3ఎ) విడుదలైంది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం 158.64కి.మీ.కు సంబంధించి కావాల్సిన భూసేకరణలో భాగంగా ఇటీవలే రాష్ట్రప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సహా, చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేటల ఆర్డీఓలు ఈ అథారిటీ లో ఉన్నారు. అయితే ఏయే గ్రామాల నుంచి భూమిని సేకరిస్తారో తెలుపుతూ గెజిట్ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 113గ్రామాల పేర్లను ఇందులో పొందుపరిచారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్మెంటు మ్యాపును విడుదల చేశారు. ఈ భాగంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్ రింగురోడ్డు క్రాస్ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఛేంజర్లను నిర్మిస్తారు. మ్యాపులో వాటిని నిర్మించే ప్రాంతాలను కూడా సూచించారు. త్వరలో 3ఏ(క్యాపిటల్) గెజిట్ కూడా విడుదల కానుంది. ఇందులో సర్వే నెంబర్ల వివరాలను పొందుపరచనున్నారు. -
ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్కు గ్రీన్సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ (3ఎ) మరో 2 రోజుల్లో విడుదల కానుంది. గెజిట్ నోటిఫికేషన్పై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేస్తూ సంతకం చేశారు. దానికి భూసేకరణ నోటిఫికేషన్ జత చేసి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ–మంగళవారాల్లో గెజిట్ విడుదల కానుందని సమాచారం. ఈ ఉత్తర భాగానికి సంబంధించి కావాల్సిన మొత్తం భూమి, రోడ్డు నిర్మాణం జరిగే భూమి ఉన్న గ్రామా లు ఇతర వివరాలను అందులో పొందుపర్చారు. ఉత్తరభాగానికి సంబంధించిన తుది అలైన్మెంటు మ్యాపును కూడా జత చేశారు. నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలకు సంబంధించి 113 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇందుకు మొత్తం 1,904 హెక్టార్ల భూమి అవసరమని గెజిట్లో పొందుపరిచినట్లు తెలిసింది. కావాల్సిన భూమి 1,904 హెక్టార్లు.. ఆర్ఆర్ఆర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 158.645 కి.మీ. నిడివితో నిర్మితమయ్యే ఉత్తర భాగానికి మాత్రమే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించి ప్రతిపాదిత ప్రాంతాల మీదుగా వాహనాల ప్రయాణం తక్కువగా ఉన్నందున, అక్కడ ఎక్స్ప్రెస్వే తరహా రోడ్డు నిర్మాణం అవసరం ఉందా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు.. భవిష్యత్తులో 8 వరసలకు విస్తరించేలా 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరసలతోనే నిర్మించనున్నారు. 100 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంటుకు 1,904 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గెజిట్లో ప్రతిపాదించినట్టు తెలిసింది. సంగారెడ్డి టు చౌటుప్పల్.. ఈ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి పట్టణం వద్ద ప్రారంభమై చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన 1,904 హెక్టార్ల భూమిని ఆయా గ్రామాల వారి నుంచి సేకరించనున్నారు. ఇందుకుగాను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 8 మంది అధికారులతో కూడిన కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన ఒక అదనపు కలెక్టర్తో పాటు చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జోగిపేట ఆర్టీఓలు ఉన్నారు. 4 జిల్లాలు..15 మండలాలు రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు మండలాలు, మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ మండలాలు, సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ మండలాలు, యాదాద్రి జిల్లా పరిధిలోని తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆర్డీఓ పరిధిని యూనిట్గా చేసుకుని గ్రామాల వివరాలను గెజిట్లో పొందుపరిచారు. 113 గ్రామాల పేర్లను ఇందులో వెల్లడించారు. చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు చిన్న కొండూరు, వర్కట్పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్పూర్, కంచెనపల్లి, టేకులసోమారం, రెడ్లరేపాక, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లి. భువనగిరి ఆర్డీఓ పరిధిలో.. ►రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లె, నందనం. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో.. ►గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్పల్లె. గజ్వేల్ ఆర్డీఓ పరిధిలో.. ►బేగంపేట, యెల్కల్, బంగ్ల వెంకటాపూర్, మఖత్ మాసాన్పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లె, పాములపర్తి, మజీద్పల్లె, నెమ్టూరు, జబ్బాపూర్, మైలార్ మక్తా, కొండాయ్పల్లె, మర్కూకు, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లి. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు: ►వట్టూరు, జండాపల్లె, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండారెడ్డిపల్లె, మల్కాపూర్, వెంకటాయపల్లె, కిష్టాపూర్, తూప్రాన్, నర్సంపల్లె. నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో.. ►వెంకటాపూర్, లింగోజీగూడ, పాంబండ, పోతులబోగూడ, కొంతాన్పల్లె, గుండ్లపల్లె, ఉసిరికపల్లె, రత్నాపూర్, కొత్తపేట, నాగులపల్లి, మూసాపేట్, మహ్మదాబాద్ జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిర్మల్పూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్ద చింతకుంట, సీతారామ్పూర్, రుస్తుంపేట, మంతూరు, మాల్పర్తి, తుజల్పూర్. సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో.. ►పెద్దాపూర్, గిర్మాపూర్, మల్కాపూర్, సంగారెడ్డి, నాగాపూర్, ఇర్గిపల్లె, చింతల్పల్లె, కలబ్గూర్, తాళ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవులపల్లె, హట్నూరు, దౌల్తాబాద్ (కొత్తపేట), సికిందర్పూర్. జోగిపేట ఆర్డీఓ పరిధిలో.. ►శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్. -
ఆర్ఆర్ఆర్: పక్కా ప్లాన్తో అధికారులు.. వ్యవహారం మొత్తం జరిగేది ఇలాగే...
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియలో పక్కా విధానాన్ని అధికారులు అవలంభించనున్నారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి పరిహారమిచ్చే వరకు.. అనుసరించాల్సిన తీరుపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నాలుగు గెజిట్లు.. రెండు పత్రికా ముఖ ప్రచురణలు వెలువడనున్నాయి. ఇటీవలే భూసేకరణ అధికారుల వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇలా ఉంటుంది... 3ఎ: భూసేకరణ కోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలతో కాంపిటెంట్ అథారిటీని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వివరాలను ఎన్హెచ్ ఏఐకి పంపింది. మరోవారంలోపు తొలి గెజిట్ విడుదల కానుంది. దాన్నే 3ఏ (స్మాల్ ఆల్ఫా బెట్)గా పిలుస్తారు. ప్రాజెక్టు పేరు, ఆ రోడ్డు ఏయే మండలాల నుంచి నిర్మాణం కానుంది.. గ్రామాల పేర్లు, సర్వే నంబర్లు.. ఆ ప్రాంతాల భూసేకరణ అధికారులుగా వ్యవహరించేవారి వివరాలను తెలుపుతూ తొలి గెజిట్ విడుదల కానుంది. 3ఏ (కేపిటల్ ఆల్ఫాబెట్): ఇది రెండో గెజిట్. ఇందులో ఆ గ్రామాలు, సర్వే నంబర్లతోపాటు సేకరించాల్సిన భూ విస్తీర్ణం వివరాలను పొందుపరిచి విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలకు 21 రోజుల గడువిస్తారు. 3సీ: పై గెజిట్లోని అభ్యంతరాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభ ఏర్పాటుకు ఈ గెజిట్ విడుదల చేస్తారు. ఈ సభలో ఆ అభ్యంతరాలను చదివి సమాధానాలిస్తారు. సానుకూలమైన వాటిని పరిష్కరించి.. వ్యతిరేకంగా ఉన్నవాటిని తోసిపుచ్చుతారు. అనంతరం రెవెన్యూ అధికారులు సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి. దీనికీ ఈ సభలోనే రైతుల నుంచి అనుమతి పొందుతారు. తదుపరి అధికారుల క్షేత్ర పర్యటనలో ఎవరైనా అడ్డుకుంటే పోలీసు శాఖ ద్వారా చర్య తీసుకుంటారు. 3డీ: ఇది కీలక గెజిట్. గ్రామాలు, సర్వే నంబర్లు, వాటి యజమానులు, ఒక్కొక్కరికి ఉన్న భూ విస్తీర్ణం తదితర సమస్త వివరాలు ఇందులో పొందుపరిచి విడుదల చేస్తారు. 3జీ: ఇది పత్రికాముఖంగా వెలువడే ప్రకటన. సమీకరించాల్సిన భూమిలోని నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తుల వివరాలను ఈ ప్రకటన ద్వారా వెలువరిస్తారు. వాటికీ పరిహారం అందుతుంది. దీనిపై కూడా అభ్యంతరాలుంటే చెప్పుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. తమ స్థలంలో పరిహారం పొందాల్సిన అంశాలను తక్కువగా చూపారనే తరహా అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి. 3హెచ్: ఇది కూడా పత్రికా ముఖంగా వెలువడే ప్రకటన. ఇందులో భూ యజమానులు పొందే పరిహారం ఎంతో వెల్లడిస్తారు. యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తారు. వారికి వారి బ్యాంకుల్లో ఆ మొత్తాన్ని జమచేస్తారు. పరిహారం విషయంలో సంతృప్తి లేనివారు దాన్ని తీసుకోని పక్షంలో, కోర్టుతో రెవెన్యూ విభాగం ప్రత్యేకంగా తెరిచే జాయింట్ ఖాతాలో ఆ మొత్తాన్ని ఉంచుతారు. పరిహారంపై అభ్యంతరాలను అధికారులు, కోర్టు ద్వారా తేల్చుకున్న తర్వాత ఆ మొత్తాన్ని వారు తీసుకుంటారు. పరిహారం ఇలా నిర్ధారిస్తారు మూడేళ్లుగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన మూడు గరిష్ట మొత్తాలను (సంవత్సరానికి ఒకటి చొప్పున) తీసుకుంటారు. వీటి సగటును లెక్కిస్తారు. దీనికి నిర్ధారిత మల్టీపుల్ ఫ్యాక్టర్తో గుణిస్తారు. ఇది ఆయా పరిస్థితుల ఆధారంగా గుర్తించి ఉంటుంది. అది 1.5గా ఉంటుంది. ఆ వచ్చే మొత్తాన్ని సొలీషియమ్ పేరుతో రెట్టింపు చేస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని.. గెజిట్ విడుదలైనప్పటి నుంచి 12% వడ్డీ లెక్కించి జత చేసి ఇస్తారు. -
3 కోట్ల భూమికి రూ. 10 లక్షలే.. ఇదేం న్యాయం
సాక్షి,తూప్రాన్ (మెదక్): ‘రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పేరుతో పేదల భూములను సీఎం కేసీఆర్ లాక్కుంటున్నారు. ఎకరాకు రూ.3 కోట్లు పలుకుతున్న భూములకు రూ.10 లక్షల చొప్పున భిక్షం వేస్తున్నారు. పేదల భూములను పెత్తందారులకు అంటగట్టే కుట్రలు పన్నుతున్నారు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. (చదవండి: ఇదీ రూట్.. ఒరిస్సా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్.. కానీ మధ్యలో.. ) శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లోని కాళ్లకల్కు చేరుకున్న సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన ఫౌం హౌజ్లోని భూమిని పేదలకు రూ.10 లక్షలకు ఎకరం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు వరి పంట సాగు చేయొద్దని చెప్పిన కేసీఆర్.. తాను ఫౌంహౌజ్లో 150 ఎకరాలు సాగు చేశారన్నారు. ‘రైతులకో నీతి.. తనకో నీతా’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ రైతులకు అన్యాయం చేస్తోందని, కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని దుయ్యబట్టారు. -
ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రీజినల్ రింగ్రోడ్డు(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్ట్ చుట్టూ ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని వేయగలిగితే అది దేశంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్గా మారుతుందని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. సవివరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొస్తే రైల్వే అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తాను, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కలసి ప్రధాని నరేంద్రమోదీ వద్ద దీనిపై చర్చిస్తామని చెప్పారు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ అయినందున ఇప్పటికిప్పుడు దానిపై ప్రకటన సాధ్యంకాదని స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆలోచన బాగుందని బండి సంజయ్, సీహెచ్ విఠల్ తదితర నేతలు పేర్కొన్నారు. రైల్వేమంత్రి స్పందించి ట్రిపుల్ ఆర్ వెడల్పు ఎంతని అడగగా వంద మీటర్లని కేంద్రమంత్రి కిషన్రెడ్డి బదులిచ్చారు. వంద మీటర్లలో రైల్వేశాఖకు 30 మీటర్లు కేటాయిస్తే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, నేతలు జి.ప్రేమేందర్రెడ్డి, డి.ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, గూడూరు నారాయణరెడ్డి, రాకేశ్రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. రాష్ట్రవాటా చెల్లించడంలేదు.. హైదరాబాద్లోని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) పూర్తి చేయడానికి కేంద్రం మూడొంతుల నిధులు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడంలేదని రైల్వే మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూయూపీఏ హయాంలో రైల్వేకు సంబంధించి 2009–14 మధ్యలో ఉమ్మడి ఏపీకి ఏడాదికి రూ.886 కోట్లు కేటాయించగా, మోదీ ప్రభుత్వం 2014–19 మధ్యలో ఒక్క తెలంగాణకే ఏడాదికి రూ.1,110 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 2019లో రూ.2,056 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,048 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 2009–14 మధ్యలో తెలంగాణలో ట్రాక్ డబ్లింగ్, ఇతర పనులు శూన్యంకాగా ఇప్పుడు 24 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయని, ఈ ఏడాది అవి రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు. -
ఆర్ఆర్ఆర్... గేమ్ ఛేంజర్
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్పేట్: తెలంగాణకు రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ కానుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి అభివర్ణించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే మార్గాన్ని ఆనుకొని ఉన్న జిల్లాల్లో ఐటీ పార్కులు, ఫార్మా కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండానే వివిధ జిల్లాల ప్రజలు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరు కోవడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. పర్యాటకం కూడా అభివృద్ధి చెందు తుందన్నారు. శనివారం హైదరాబాద్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హేచ్ఏఐ) అధికారులతో సమావేశానంతరం కిషన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158.50 కి.మీ. మేర నిర్మించబోయే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని రకాలుగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు వేగంగా భూసేకరణ నిర్వహించే నిమిత్తం 3 ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రోడ్డు నిర్మాణ వ్యయా న్ని కేంద్రమే భరించనుందని కిషన్రెడ్డి చెప్పారు. చౌటుప్పల్–షాద్నగర్–సంగారెడ్డి మధ్య 180 కి.మీ. నిర్మించే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రాజెక్టుకు సంబంధించి డీపీ ఆర్ తయారవుతోందని కిషన్రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పెరుగుదలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ను భవిష్యత్తులో 4 లేన్ల నుంచి 8 లేన్లుగా మార్చేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. రూ. 93,656 కోట్లతో హైవేల పనులు తెలంగాణకు జాతీయ రహదారులు, ఇతర రోడ్ల కింద కేంద్రం అత్యధికంగా రూ. 93,656 కోట్లు కేటాయించిందని కిషన్రెడ్డి వివరించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ 99 శాతం మేర పెరిగిందని చెప్పారు. అంతకుముందు 2,511 కి.మీ. మేర జాతీయ రహదారులు తెలంగాణలో ఉండగా గత ఏడేళ్లలో 2,483 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని కిషన్రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించే కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో 378 ప్రాంతాలను కేంద్రం గుర్తించిందన్నారు. ఇందుకోసం ఆర్యూబీ, ఆర్వోబీల నిర్మాణానికి రూ. 850 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్–బెంగళూరు (ఎన్హెచ్–44) రోడ్డులో కర్నూలు వరకు (251 కి.మీ) ‘సూపర్ ఇన్ఫర్మేషన్ హైవే’లో రియల్టైమ్ డిజిటల్ వ్యవస్థ ద్వారా ముఖ్యమైన సమాచారం కోసం రూ. 4,700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలో పీఎం గతిశక్తి హై–ఇంపాక్ట్ ప్రాజెక్టులో భాగంగా 898 కి.మీ. మేర ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ. 22,706 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. షోలాపూర్–కర్నూలు–చెన్నై కారిడార్ (ఎకనమిక్ కారిడార్), హైదరాబాద్–విశాఖ (ఇంటర్ కారిడార్ రూట్), హైదరాబాద్–రాయ్పూర్ (మరో ఎకనమిక్ కారిడార్), ఇండోర్–హైదరాబాద్ (ఇంటర్ కారిడార్ రూట్), నాగ్పూర్–విజయవాడ కారిడార్ (మరో ఎకానమిక్ కారిడార్ కింద) ఉన్నాయన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం రాదు... నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని కేటీఆర్ సహా పలువురు మంత్రులు చేస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా ప్రతీదీ రాజకీయం చేయడం తమకు రాదని కిషన్రెడ్డి బదులిచ్చారు. -
ఆర్ఆర్ఆర్పై వాహనాల వేగం 120 కి.మీ. మలుపే లేకుండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోబోతోంది. మలుపుల ప్రభావం లేకుండా.. సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్ఆర్ఆర్ను డిజైన్ చేస్తున్నారు. జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్మెంట్ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 4 వరుసల క్రాష్ బారియర్లు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్ఆర్ఆర్పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు. సాధారణంగా సెంట్రల్ మీడియన్లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్ఆర్ఆర్లో సెంట్రల్ మీడియన్కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు. -
లక్ష చెట్ల రింగురోడ్డు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోతున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), దాని పరిసరాలను హరితమయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల పొడవునా లక్ష చెట్లు పెంచాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డుకు రెండు వైపులా మూడు వరుసల్లో.. మొత్తంగా ఒక్కో కిలోమీటర్కు 600 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రీజనల్ రింగ్రోడ్డు, ఇతర రాష్ట్ర, జాతీయ రహదారులు కలిసే ఎనిమిది చోట్ల నిర్మించే భారీ ఇంటర్ ఛేంజర్ల వద్ద చెట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. భారీగా వృక్ష సంపద కోల్పోతుండటంతో.. రీజనల్ రింగ్ రోడ్డును భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎనిమిది వరుసలకు సరిపడా భూసేకరణ చేయనున్నారు. అందులో ప్రస్తుతానికి నాలుగు వరుసలతో రోడ్డు నిర్మిస్తారు, వాహనాల సంఖ్య పెరిగే క్రమంలో ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. మొత్తంగా రోడ్డుతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్ల పెంపకం, అవసరమైన చోట ట్రక్ వే సైడ్ పార్కింగ్, డ్రైనేజీ.. ఇలా ఇతర అవసరాలకు కలిపి 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి చదును చేసి పెడతారు. ఈ క్రమంలో భారీగా వృక్ష సంపదకు నష్టం జరగనుంది. అదే సమయంలో రోడ్డు వెంట భూముల్లో వ్యవసాయం స్థానంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటితో పర్యావరణానికి దెబ్బపడే నేపథ్యంలో.. రీజినల్ రింగురోడ్డు పొడవునా భారీగా చెట్లు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మొక్కలు నాటేదిలా.. వంద మీటర్ల వెడల్పుతో భూమిని చదును చేశాక.. రెండు చివరల్లో 3 మీటర్ల చొప్పున 6 మీటర్ల స్థలాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించారు. ఒక్కోవైపు మీటరు చొప్పున దూరంతో మూడు వరుసల్లో మొక్కలు నాటుతారు. రోడ్డు వైపు ఉండే వరుసలో తక్కువ వెడల్పుతో విస్తరించే చెట్లను, మధ్యలో సాధారణమైనవి, చివరిగా ఏపుగా పెరిగే పెద్ద చెట్లను పెంచుతారు. ఇలా రోడ్డుకు రెండు వైపులా, ఇంటర్ ఛేంజర్లతో కలుపుకొంటే మొత్తం చెట్ల సంఖ్య లక్షకుపైగా ఉండనుంది. ♦ప్రస్తుతం రోడ్డు మధ్యలో 20 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్ ఉండనుంది. అందులో ఆరు వరుసలతో వివిధ జాతుల పూల మొక్కలు నాటనున్నారు. భవిష్యత్తులో రోడ్డును ఎనిమిది లేన్లకు విస్తరిస్తే.. సెంట్రల్ మీడియన్ స్థలం ఐదు మీటర్లకు పరిమితమవుతుంది. అప్పుడు పూల చెట్ల వరుసలు తగ్గుతాయి. ♦గతంలో పెద్ద రహదారులకు ఇరువైపులా రోడ్డుపైకి అల్లుకునేలా రావి, మర్రి, వేప, మామిడి, చింత వంటి భారీ చెట్లు కనిపించేవి. రీజినల్ రింగురోడ్డును ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నందున.. వాహనాలకు ఇబ్బంది రాకుండా తక్కువ కొమ్మలతో ఎత్తుగా పెరిగే జాతులనే ఎంపిక చేస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కసరత్తు మొదలైంది. 158.6 కి.మీ. ఈ భాగానికి సమీకరించాల్సిన భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది. గెజిట్ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నట్లు సమాచారం. భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ. ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్మెంట్ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్మెంట్ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు. అభ్యంతరాలకు 21 రోజులు.. గెజిట్ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంపిటెంట్ అథారిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. మండలాలవారీగా (ఇంకా తేల్చలేదు) పబ్లిక్ హియరింగ్ సమావేశాలు (గ్రామసభ తరహా) ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు కాంపిటెంట్ అథారిటీ మార్పుచేర్పులకు అవకాశం కల్పించేందుకు దాదాపు నెల రోజుల సమయమివ్వనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణతో పాటు భూ వివరాలను నమోదుచేస్తారు. దీని కోసం ఒక్కో గ్రామానికి 10 మంది వరకు రెవెన్యూ సిబ్బందిని నియమించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన దాదాపు 2వేల మందిని ఈ అథారిటీకి అప్పగించనున్నారు. దీని అధారంగా మరో జాబితాను ప్రచురించి పత్రికాముఖంగా ప్రజల ముందు ఉంచుతారు. దీనిపైనా ప్రజా అభ్యంతరాలకు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఆ అభ్యంతరాల ఆధారంగా పొరపాట్లను సరిదిద్దుతారు. ఆ తర్వాత.. ఆ భూమిలోని చెట్లు, పైపులైన్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించి ప్రచురిస్తారు. ఇక ఏ పట్టాదారుకు ఎంత పరిహారం ఇవ్వనున్నారో లెక్కించి ఆ వివరాలను కూడా బహిరం గంగా ప్రచురిస్తారు. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిష్కరించగలిగినవి పరిష్కరించి.. వారికి రావాల్సిన పరిహారం వివరాలు పొందు పరుస్తూ (భూమి, అందులోని ఇతర ఆస్తులు కలిపి) అవార్డు పాస్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ భూ యజమానుల లిఖితపూర్వక అంగీకారాన్ని అధికారులు సేకరిస్తారు. అంగీకరించని వారికి కూడా రెవెన్యూ అధికారులతో ఓ జాయింట్ ఖాతా తెరిచి అందులో పరిహారాన్ని జమచేస్తారు. వారి అభ్యంతరాలు వీగిపోయిన తర్వాత నిర్బంధంగా భూమిని సమీకరించి పరిహారాన్ని చెల్లిస్తారు. ఏడాది నుంచి రెండేళ్లు పట్టే అవకాశం.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఇదే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా సాగితే 6 నెలలు పడుతుందని అంచనా. కానీ.. న్యాయపరంగా, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాంపిటెంట్ అథారిటీ.. భూసేకరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 4 జిల్లాల పరిధిలో ఉండనుంది. సాధారణంగా జిల్లా అదనపు కలెక్టర్ (పరిపాలన) ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి భూ సేకరణను పర్యవేక్షిస్తారు. ఈ రోడ్డు విషయంలో జాప్యం ఉండకూడదని అథారిటీని ఏర్పాటు చేస్తు న్నారు. ఇందులో ఆర్డీఓ స్థాయి (ఖరారు కాలేదు) ముగ్గురిని నియమించనున్నట్లు సమాచారం. దీని అనుమతి కోసం ఇటీవలే అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒక్కో అధికారికి 50 కి.మీ. నిడివి అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో అధికారికి మూడునాలుగు మండలాల పరిధి రానుంది. పరిహారం.. ప్రభుత్వ విలువపై 3 రెట్ల విలువను పరిహారంగా లెక్కగట్టనున్నారు. లేదా స్థానికంగా ఇటీవల ఏదైనా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణలో లెక్కగట్టిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే వీలుంది. ఏడాదిలోపు పరిహారం అందివ్వలేని పక్షంలో 12 శాతం వడ్డీ కలుపుకొని చెల్లిస్తారు. -
హైదరాబాద్ ఆర్ఆర్ఆర్.. 320 కి.మీ.
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రింగ్రోడ్డుకు మార్గం సుగమమైంది. భాగ్యనగరం చుట్టూ దాదాపు 320 కి.మీ. చుట్టూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో ఉత్తర భాగానికి ఈ సంవత్సరమే మార్గం సుగమమైంది. 158.46 కి.మీ. పొడవైన ఈ భాగానికి తుది అలైన్మెంటు సిద్ధమైంది. మరో నెలరోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నాగ్పూర్కు చెందిన కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ కన్సెల్టెన్సీ ఆధ్వర్యంలో నాలుగు అలైన్మెంటు ఆప్షన్లు రూపొందగా.. అందులో జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆప్షన్–ఏను ఎంపిక చేసింది. గతంలో అలైన్మెంటు రూపొందినప్పుడు కాళేశ్వరం నీటితో నింపే రిజర్వాయర్లకు ప్రణాళికలు లేవు. ఈ నేపథ్యంలో అలాంటి కాలువలు, చానళ్లు, జలాశయాలకు ఇబ్బందిలేకుండా ఆయా ప్రాంతాల్లో అలైన్మెంటును మళ్లిస్తూ కొత్త అలైన్మెంటును రూపొందించారు. దీనికే ఎన్హెచ్ఏఐ మొగ్గు చూపింది. నాలుగు వరసల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్పూర్–యాదాద్రి–భువనగిరి–చౌటుప్పల్ పట్టణాలను అనుసంధానిస్తూ ఈ రోడ్డు నిర్మాణం కానుంది. దక్షిణ భాగం కోసం కసరత్తు దాదాపు 180 కి.మీ. పొడవుతో రూపుదిద్దుకోవాల్సిన దక్షిణ భాగం రింగ్రోడ్డుకు సంబంధించిన అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం మార్గంలో ప్రస్తుతం వాహనాల సంచారం తక్కువగా ఉందని ఇటీవల జాతీయ రహదారుల విభాగం అధ్యయనంలో తేలింది. ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించి సర్వే చేయించగా, దీని నివేదిక కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. వాహనాలు తక్కువగా ఉన్నప్పుడు నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ వే తరహా రోడ్డు నిర్మాణం ఎంతవరకు ఉపయోగం అన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే, ఒకసారి రింగ్ అలైన్మెంట్ సిద్ధమైతే.. ఆ రోడ్డు మీదుగా తిరిగే వాహనాల సంఖ్య ఉత్తర భాగం తరహాలోనే ఉంటుందని, పూర్తి రింగుగా ఈ రోడ్డు నిర్మితమైతేనే ఉపయోగం ఉంటుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనికి సానుకూలంగానే కేంద్రం పరిశీలిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
Hyderabad RRR: అలైన్మెంట్.. ఆల్రైట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదం తెలిపింది. మూడు వారాల క్రితం తుది అలైన్మెంట్ను ఖరారు చేయగా తాజాగా దానికి మరో చిన్న సవరణ చేసి తుది అలైన్మెంట్కు ఆమోదముద్ర వేసింది. ఈ విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో నాలుగు అలైన్మెంట్ ఆప్షన్లను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయానికి పంపగా.. ‘ఆప్షన్–ఏ’ను ఖరారు చేసింది. మూడేళ్ల క్రితం కన్సల్టెన్సీగా వ్యవహరించిన సంస్థ అలైన్మెంట్తో పోలిస్తే 1.2 కి.మీ. నిడివిని తగ్గిస్తూ ఈ అలైన్మెంట్ ఉంది. అయితే ఇందులో అత్యవసరంగా మరో సవరణ చేశారు. దీని ప్రకారం పాత అలైన్మెంట్ (మూడేళ్ల కిందటిది)కు కేవలం 200 మీటర్ల తేడాతో ఈ కొత్త అలైన్మెంట్ను 158.645 కి.మీ.గా నిర్ధారించారు. నాలుగు జిల్లాలు.. 15 మండలాలు.. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. 120 గ్రామాల పరిధిలో భూసమీకరణ జరగనుంది. ఇందులో 80–82 గ్రామాల నుంచి సింహభాగం భూమిని సమీకరించనుండగా వాటికి కి.మీ. లోపు దూరంలో ఉండే మరో 38–40గ్రామాల నుంచి స్వల్పంగా సమీకరిస్తారు. అలైన్మెంట్లో భాగంగా ఆయా గ్రామాల పేర్లను గుర్తించి కేంద్రానికి పంపారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారం భం కానుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రూ. 7,512 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుం దని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టుకు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. భూసేకరణకే దాదాపు రూ. 1,800 కోట్ల వరకు ఖర్చు కానుంది. ముందే వెల్లడించిన ‘సాక్షి’ ఎన్హెచ్ఏఐ తుది అలైన్మెంట్ను ఖరారు చేసిన విషయాన్ని పక్షం రోజుల కిందటే ‘సాక్షి’ఎక్స్క్లూజివ్గా వెల్లడించింది. మూడేళ్ల కిందట పాత కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్కు సవరణలు చేస్తూ ఆప్షన్–ఏను ఖరారు చేసిన విషయాన్ని పాఠకులకు అందించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ దాన్నే ఓకే చేసింది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పరిధిలోకి వచ్చే మండలాలు.. ► సంగారెడ్డి- సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు ► మెదక్- నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ ► సిద్దిపేట- గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ ► యాదాద్రి- తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ ► 158.465 కిలోమీటర్లు- ఉత్తర భాగం రహదారి మొత్తం పొడవు ► 4,000-ఎకరాలు సమీకరించే భూమి ► రూ. 7,512 కోట్ల అంచనా వ్యయం -
ఆర్ఆర్ఆర్లో 8 భారీ ఇంటర్ ఛేంజర్లు.. లేదు సాటి.. దేశంలోనే మేటి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి మంజూరు కావడం, అలైన్మెంట్ కూడా ఖరారు కావడంతో అధికారులు రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించారు. 158.6 కి.మీ. నిడివితో రూపొందే ఈ భాగం రోడ్డులో 8 ప్రాంతాల్లో భారీ కూడళ్లు (క్లవర్లీఫ్ ఇంటర్ఛేంజెస్) ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ వేలలో ఇవి మేటిగా ఉండ నున్నాయి. ఇలాంటి నిర్మాణాలను భాగ్యనగరానికి పరిచయం చేస్తూ 12 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)లో భాగంగా నిర్మించిన క్లవర్లీఫ్ ఇంటర్ఛేంజెస్తో పోలిస్తే ఇవి మరింత భారీగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే ఆర్ఆర్ఆర్ నిర్మితం కానున్నా భవిష్యత్తులో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భావి అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్ఛేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కోటి దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నాయంటే వాటి పరిమాణం ఏ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ఆర్ఆర్ఆర్పైకి వాహనదారులు రావడానికి, ఆర్ఆర్ఆర్ నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్లీఫ్ ఇంటర్ఛేంజెస్ అవకాశం కల్పిస్తాయి. సర్వీసు రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా వీటిని నిర్మించనున్నారు. క్లవర్లీఫ్ ఇంటర్ఛేంజ్ స్ట్రక్టర్లు రానున్న ప్రాంతాలు... 1.హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి: పెద్దాపూర్–గిర్మాపూర్ గ్రామాల మధ్య 2.సంగారెడ్డి–నాందేడ్ రహదారి: శివంపేట సమీపంలోని ఫసల్వాది సమీపంలో.. 3.హైదరాబాద్–మెదక్ రోడ్డు: రెడ్డిపల్లి–పెద్ద చింతకుంట మధ్య 4.హైదరాబాద్–నాగ్పూర్ రోడ్డు: తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద 5.హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి: గౌరారం సమీపంలోని గుందాన్పల్లి వద్ద 6.హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి: భువనగిరి–రాయ్గిరి మధ్య భువనగిరికి చేరువలో.. 7.జగదేవ్పూర్–చౌటుప్పల్ రోడ్డు: మందాపురం–పెనుమటివానిపురం మధ్య.. 8.హైదరాబాద్–విజయవాడ హైవే: చౌటుప్పల్ సమీపంలోని బాగరిగడ్డ వద్ద -
రింగ్కు అటూ ఇటూ హైదరాబాద్ సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్మించనున్న రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ ప్రకారం కొన్ని పట్టణాలు రింగురోడ్డు లోపల, మరికొన్ని పట్టణాలు దాని వెలుపల ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న జలవనరులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, ఇతర నీటి కాలువల ఆధారంగా ఈ అలైన్మెంట్ను ఖరారు చేశారు. యాదాద్రిని దాటిద్దామనుకున్నా.. యాదగిరిగుట్ట దేవాలయం ఈ రీజినల్ రింగు రోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ను ఖరారు చేయాలని ప్రభుత్వం భావించినా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో దానికి నీటిని అందించే కాళేశ్వరం నీటి కాలువకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తాజా అలైన్మెంట్ ప్రకారం యాదాద్రికి దాదాపు 4 కి.మీ. దూరం నుంచే రోడ్డు నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి నుంచి యాదాద్రికి వెళ్లే రాయగిరి రోడ్డు మొదలయ్యే చోట, భువనగిరి పట్టణం బైపాస్ రోడ్డు ముగిసే ప్రాంతానికి చేరువగా ఆర్ఆర్ఆర్ క్రాస్ కానుంది. ఇది భువనగిరి పట్టణానికి చేరువగా ఉండనుంది. అంటే భువనగిరి పట్టణం రీజనల్ రింగురోడ్డు లోపలివైపు ఉండనుండగా యాదాద్రి టెంపుల్ టౌన్ మాత్రం దీనికి ఆవల ఉండనుంది. బస్వాపూర్ రిజర్వాయర్కు సమీపంలోని తుర్కపల్లి పట్టణం మాత్రం రింగురోడ్డు లోపలివైపే ఉండనుంది. తుర్కపల్లి నుంచి యాదాద్రికి నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు మధ్య భాగం నుంచి ఈ రోడ్డు క్రాస్ కానుంది. దీనికి ఇటు తుర్కపల్లి, అటు యాదాద్రి సమ దూరంలో ఉండనుంది. ఇక తుర్కపల్లికి సమీపంలోని జగదేవ్పూర్ పట్టణం రీజినల్ రింగురోడ్డుకు వెలుపలే ఉండనుంది. మరోవైపు గజ్వేల్ పట్టణం సైతం రింగురోడ్డు పరిధిలోకి రావడంలేదు. ఆ పట్టణానికి నిర్మిస్తున్న ప్రత్యేక రింగురోడ్డుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్ఆర్ఆర్ మార్గాన్ని కాస్త దూరంగానే నిర్మించనున్నారు. అలాగే తూప్రాన్ పట్టణం రింగురోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ రూపొందించారు. తర్వాత నర్సాపూర్, సంగారెడ్డి పట్టణాలు కూడా రింగురోడ్డు లోపలికే ఉండబోతున్నాయి. ఈ పట్టణాలు దాటాక ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇటు భువనగిరి దాటిన తర్వాత వచ్చే వలిగొండ ఆర్ఆర్ఆర్ వెలుపలికి పరిమితం కానుండగా చౌటుప్పల్ మాత్రం రింగురోడ్డు లోపలివైపు ఉండనుంది. 130 గ్రామాల వరకు గుర్తింపు? రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి 85 గ్రామాల్లో భూసమీకరణ జరగనుంది. వాటిని గుర్తిస్తూ గెజిట్ విడుదల కానుంది. అయితే ఈ గెజిట్లో మరో 45 గ్రామాలను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నేరుగా ప్రభావితం అయ్యే గ్రామాలకు అతిచేరువగా ఉండి కనీసం ఎకరం స్థలం అయినా కోల్పోయే గ్రామాన్ని కూడా గెజిట్లో చేర్చాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భూసమీకరణ సమయంలో గ్రామ పంచాయతీల మధ్య తేడా వస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు మరో గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు ముందుగానే ఆయా గ్రామాలకు అతిచేరువలో ఉన్న వాటిని కూడా గుర్తించనున్నారు. -
ఆర్ఆర్ఆర్ అలైన్మెంటు ఖరారు. మూడేళ్ల కిందటిదే ఫైనల్ చేశారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఉత్తర భాగం అలైన్మెంటు ఎట్టకేలకు ఖరారైంది. ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో అలైన్మెంట్పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న నాగ్పూర్కు చెందిన కే అండ్ జే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్హెచ్ఏఐకి అందజేసిన నాలుగు ఆప్షన్లలో అనుకూలమైన ఒకదాన్ని ఎంపిక చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం నాటి పాత కన్సల్టెన్సీ సంస్థ అప్పట్లో రూపొందించిన అలైన్మెంటుకు పలు సవరణలతో రూపొందించిన దాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీని ప్రకారమైతే నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుందని, ఇతరత్రా ఇబ్బందులు కూడా ఉండవని ఎన్హెచ్ఏఐ అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తం 157.2 కి.మీ నిడివి పాత అలైన్మెంట్కు ప్రస్తుత కన్సల్టెన్సీ సంస్థ దాదాపు 15 చోట్ల సవరణలు ప్రతిపాదించింది. మూడేళ్ల క్రితం పాత కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను ప్రతిపాదించే సమయంలో కాళేశ్వరం కాలువలు లేవు. ఇప్పుడు ఆ కాలువలు, కొన్ని కొత్త జలాశయ ఛానళ్లు తెరపైకి వచ్చాయి. దీంతో వాటికి ఇబ్బంది లేకుండా ఒక కి.మీ. నుంచి 5 కి.మీ దూరంతో కొత్త అలైన్మెంట్ సవరణలు ప్రతిపాదించారు. అయితే ఈ మార్పులతో పాత అలైన్మెంటు కంటే 1.2 కి.మీ మేర నిడివి తగ్గటం విశేషం. చాలా ప్రాంతాల్లో అలైన్మెంటును వెలుపలి నుంచి కాకుండా లోపలి నుంచి మార్చటంతో నిడివి తగ్గింది. పాత అలైన్మెంట్ 158.4 కి.మీ. ఉండగా, సవరణల తర్వాత కొత్త అలైన్మెంట్ 157.2 కిలోమీటర్లకు తగ్గింది. దీనికి రూ.7,900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కి.మీ.కు భూ సమీకరణ ఖర్చు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అవుతుందని, మొత్తంగా రూ.1600 కోట్ల వ్యయమవుతుందని సూచించినట్టు తెలిసింది. ఎలివేటెడ్ లేకుండా.. సాధారణంగా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంలో నీటి కాలువలను క్రాస్ చేయాల్సి వస్తే ఎలివేటెడ్ (పైనుంచి) పద్ధతిలో వాటిని దాటేలా రోడ్డును డిజైన్ చేస్తారు. ఎలివేటెడ్ పద్ధతిలో నిర్మాణానికి సాధారణం కంటే ఖర్చు 10 రెట్లు పెరుగుతుంది. తాజా అలైన్మెంటులో ఇలాంటివి దాదాపు పదికిపైగా ఉన్నందున, నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలువలను క్రాస్ చేయాల్సిన అవసరం లేకుండా వాటికి దూరం నుంచి వెళ్లేలా అలైన్మెంట్ను మార్చారు. గెజిట్లో 125 వరకు ఊళ్ల పేర్లు ఈ రోడ్డు 80 గ్రామాలపై నేరుగా ప్రభావం చూపించనుంది. ఇవి కాకుండా ఈ ఊళ్లకు కి.మీ. నుంచి కి.మీటరున్నర దూరంలో ఉన్న మరికొన్ని ఊళ్లను కూడా గెజిట్లో చేర్చి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. వెరసి ఈ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో 125 ఊళ్ల పేర్లను ప్రకటించనున్నట్టు తెలిసింది. మరో పక్షం రోజుల్లో గెజిట్ విడుదలకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు నెలల్లో ఏ సర్వే నంబరులో ఎంత భూమిని సమీకరిస్తారో వివరాలు వెల్లడించనున్నారు. ఆ వెంటనే భూ సమీకరణ ప్రక్రియ మొదలు కానుంది. -
నీరు చేరదు.. వరద ఆగదు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దాదాపు 5 మీటర్ల ఎత్తుతో నిర్మిం చనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కానప్పటికీ దాదాపు అంత ఎత్తులో నిర్మితమయ్యేలా డిజైన్లు రూపొందుతున్నాయి. అనూహ్యంగా రికార్డు స్థాయి వర్షాలు కురిసి భారీగా వరద పోటెత్తినా రోడ్డుపైకి నీరు చేరని విధంగా, అదే సమయంలో రింగ్రోడ్డు లోపల ఉన్న జలవనరుల్లో వరద చేరికకు ఎలాం టి ఆటంకం కలగకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతేడాది నగరంలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసి కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు కానిచోట్ల కూడా భారీగా నీళ్లు చేరి ఇళ్లను ముంచెత్తాయి. ఇలాంటి మెరుపు వరదలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్ఆర్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించి ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో బిజీగా ఉండగా, మరోవైపు ఇంజనీర్లు రోడ్డు ఎలా ఉండాలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రికార్డు స్థాయి ఎత్తులో..! ఎక్స్ప్రెస్ వేలను సాధారణంగా భూమి నుంచి ఒక మాదిరి ఎత్తుగా ఉండేలా నిర్మిస్తారు. వేరే రహదారులు దాన్ని క్రాస్ చేసే చోట ఎత్తును మరింత పెంచుతారు. దిగువనుంచి అండర్పాస్ రూపంలోనో, మరో రూపంలోనే ఆ రోడ్డు క్రాస్ చేసేలా చూస్తారు. మిగతా ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు తక్కువగానే ఉంటుంది. కానీ ఆర్ఆర్ఆర్ మొత్తం చాలా ఎత్తులో నిర్మించబోతున్నారు. దేశంలోనే పొడవైనదిగా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న ఈ రింగ్రోడ్డు ప్రతిపాదన, ఎత్తులో కూడా ఘనతను సాధించే అవకాశం ఉంది. వరద కోసం ప్రత్యేక కల్వర్టులు రింగు రోడ్డు అంటే.. వృత్తాకారంలో నిర్మితమై అవతలి ప్రాంతంతో అంతర్భాగాన్ని వేరు చేస్తుంది. కోటగోడలా మారి నీటి ప్రవాహానికి పెద్ద ఆటంకంలా ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు సహజసిద్ధంగా ఉండే పల్లాన్ని ఆధారంగా చేసుకుని ప్రవహించే వరదను అడ్డుకుంటుంది. రింగ్రోడ్డు లోపల ఉండే జలవనరులకు విఘాతం కలిగిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్ఆర్ఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది దాదాపు 370 కి.మీ. చట్టు కొలత (అలైన్మెంటు ఖరారయ్యాక అసలు పరిధి తెలుస్తుంది)తో రింగులాగా రూపొందనుంది. లోపలి వైపు వేల సంఖ్యలో చెరువులు, కుంటలున్నాయి. వీటికి వాన నీటి వరద ఏయే ప్రాంతాల్లో ఎటువైపు నుంచి ప్రవహిస్తుందో గుర్తించి, ఆ వరద రింగురోడ్డుకు తగిలే చోట ప్రత్యేక కల్వర్టులు ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో భారీ పైపులను ఏర్పాటు చేస్తారు. కానీ దీనికి పైపు పద్ధతి కల్వర్టులు కాకుండా బాక్సు (డబ్బా) మోడల్ కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించారు. వరద ప్రవాహ అంచనా మేరకు గరిష్టంగా పది అడుగుల ఎత్తు కల్వర్టులు ఉండేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. పదడుగుల ప్రవాహ ద్వారం ఉండటంతో, ఎంత పరిమాణంలో వరద వచ్చినా సులభంగా రోడ్డు దిగువ నుంచి జలవనరులను చేరుకునే వీలుంటుంది. అలైన్మెంటు ప్రతిపాదనల్లోనూ ఈ వివరాలు కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే నాలుగు అలైన్మెంటు ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. ఆయా ప్రతిపాదనల్లో.. ఎన్ని జలవనరులున్నాయి? వాటి నీటి ప్రవాహ పల్లం, వాటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పొందుపరిచింది. ఈ ప్రణాళికలు ఎలా ఉన్నాయో పరిశీలించాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. జనవరి నాటికి అంతా సమీక్షించి తుది అలైన్మెంటును ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసల ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించేలా భూమిని సమీకరిస్తారు. -
అప్పుడు ఎకరం పొలం రూ.60 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్–త్రిబుల్ ఆర్)తో భూముల ధరలు పెరిగాయి.హైదరాబాద్– చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందనుండటంతో స్థలాల ధరలు వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎకరం రూ.40–60 లక్షలు ఉండగా.. ఇప్పుడది రూ.2.5– 3 కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. ప్రతి పాదిత 340 కి.మీ.త్రిబుల్ ఆర్ పూడుర్ మండలంలోని చాంగోమూల్ గ్రామంలో ఎన్హె చ్–163 వద్ద కలుస్తుంది. తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్గల్, శంకర్పల్లి, సంగా రెడ్డి పట్టణాల కలిపే నాలుగు లైన్లతో కూడిన రహదారి త్రిబుల్ ఆర్తో అనుసం ధానమ వుతా యని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చదవండి: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ! -
రీజినల్ రింగ్ రోడ్.. కొత్త దారిలో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి ముఖచిత్రంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్న రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు జరుగనున్నాయి. నాలుగు వరుసలుగా చేపట్టే ఈ ఎక్స్ప్రెస్వేను ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చినా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుత అలైన్మెంట్ అనువుగా లేదని కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. పూర్తిగా కొత్త అలైన్మెంట్తో ఆర్ఆర్ఆర్ను చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పలు అంశాల ఆధారంగా నాలుగు కొత్త అలైన్మెంట్లు రూపొందించి ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)’కుఅందజేసింది. దీనిలో ఏదో ఒకటి ఖరారు కాగానే మిగతా ప్రక్రియ మొదలుకానుంది. రెండున్నరేళ్ల మార్పులతో.. రీజనల్ రింగ్రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీగా వ్యవహరించిన ఓ బెంగళూరు సంస్థ.. గూగుల్మ్యాప్స్, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఓ అలైన్మెంట్ను రూపొందించింది. దాని ఆధారంగానే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఆ అలైన్మెంట్ తయారై దాదాపు రెండున్నరేళ్లు గడిచింది. ఈలోగా క్షేత్రస్థాయిలో కొన్ని మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటయ్యాయి, గోదావరి జలాల తరలింపు కాల్వలు, కొత్త రిజర్వాయర్లు నిర్మితమయ్యాయి. ఈ నేపథ్యంలో అలైన్మెంటులో మార్పులు జరగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ నూతన ప్రతిపాదనలను రూపొందించింది. కొత్త నిర్మాణాలు, అవసరాల మేరకు.. ప్రస్తుతం నాగ్పూర్కు చెందిన ‘కే అండ్ జే ప్రైవేట్ లిమిటెడ్’సంస్థ రీజనల్ రింగ్రోడ్డు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తోంది. చెరువులు–కుంటలు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులు, నివాస ప్రాంతాలు, గుట్టలు, రోడ్లు, రైలు మార్గాలు వంటి అడ్డంకులను బట్టి అలైన్మెంట్ను అటూఇటూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ను గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (పూర్తిగా కొత్త రహదారి)గా నిర్మించాల్సి ఉండటంతో.. అవసరమైన భూమి మొత్తాన్నీ సమీకరించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికితోడు ఎక్కడైనా నిర్మాణాలను తొలగించాల్సి వస్తే పరిహారం ఖర్చు పెరుగుతుంది. జల వనరులు ఉన్నచోట కాస్త దూరంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ.. నాలుగు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించింది. వీటిని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ.. పలు మార్పులు చేర్పులు సూచించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సిబ్బంది నాలుగైదు రోజులుగా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లలో మార్పులు చేస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ వారం పదిరోజుల్లో ఎన్హెచ్ఏఐకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు అలైన్మెంట్లలో ఖర్చు, నిర్మాణ అనుకూలత ఆధారంగా యోగ్యంగా ఉన్నదానిని ఎన్హెచ్ఏఐ ఎంపిక చేయనుంది. ఓఆర్ఆర్ నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో.. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్రోడ్డును నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈ దూరం పరిధిలోనే నాలుగు అలైన్మెంట్లను ప్రతిపాదించింది. ఒక్కో అలైన్మెంట్కు మధ్య 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల తేడా ఉండేలా రూపొందించింది. అయితే ఓఆర్ఆర్ నుంచి దూరం పెరిగేకొద్దీ రీజనల్ రింగురోడ్డు పొడవు, నిర్మాణ ఖర్చు పెరుగుతాయి. అదే సమయంలో జనావాసాలు, ఇతర నిర్మాణాలకు దూరంగా ఉండటం వల్ల పరిహారం ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి అంశాలను పరిశీలించి.. అలైన్మెంట్ను ఎంపిక చేయనున్నారు. భూసేకరణే కీలకం.. ఆర్ఆర్ఆర్ తుది అలైన్మెంట్ ఖరారయ్యాక భూసేకరణ కీలకంగా మారనుంది. తొలుత అవసరమైన భూమి, ఇతర వనరులు, అవసరాలను గుర్తిస్తారు. డీపీఆర్ తయారు చేస్తారు. వీటికే ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని అంటున్నారు. ఔటర్ రింగ్రోడ్డు తరహాలో వివాదాల్లేని ప్రాంతాల్లో ముందు నిర్మిస్తూ వెళితే.. ఆర్ఆర్ఆర్ త్వరగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)’ అలైన్మెంట్ ఖరారు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ కేఅండ్జే ప్రైవేటు లిమిటెడ్.. నాలుగు రోజులుగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–ప్రజ్ఞాపూర్–జగదేవ్పూర్–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయని ప్రస్తుత అంచనా. ఈ భాగానికి సంబంధించి తుది అలైన్మెంట్ ఖరారు పనిని కన్సల్టెన్సీ సంస్థ ప్రారంభించింది. ప్రాథమిక అలైన్మెంట్ వెంట.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీ సేవలు అందించిన బెంగుళూరు సంస్థ ప్రాథమికంగా ఒక అలైన్మెంటును నిర్ధారించింది. అక్షాంశ, రేఖాంశాలు, గూగుల్ మ్యాప్ ఆధారంగా దానిని రూపొందించారు. ఇప్పుడా అలైన్మెంట్ ఆధారంగానే క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. మార్గమధ్యలో నీటి వనరులు, భారీ నిర్మాణాలు, కొండలు, గుట్టల వంటివి ఎక్కడైనా అడ్డుగా వస్తాయా అనేది పరిశీలించి.. రోడ్డు అలైన్మెంట్ను పక్కకు మార్చనున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించే కాల్వలు నిర్మించారు. ఆయాచోట్ల పరిస్థితికి తగినట్టు అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. రీజనల్ రింగ్రోడ్డు ప్రాజెక్టులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని.. త్వరగా కసరత్తు పూర్తి చేయాలని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో అలైన్మెంట్ ఖరారు పూర్తిచేసి, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి సేకరించాలనే విషయంలో స్పష్టత ఇచ్చే దిశగా కన్సల్టెన్సీ చర్యలు చేపట్టినట్టు సమాచారం. ►ఆర్ఆర్ఆర్ను ప్రస్తుతం నాలుగు వరుసల్లో ఎక్స్ప్రెస్వేగా నిర్మించనున్నారు. భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరిస్తారు. ఇందులో ప్రధాన రోడ్డుతోపాటు సర్వీసు రోడ్లు ఉంటాయి. మొత్తం ఎనిమిది వరుసల రహదారి 80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మరో 20 మీటర్ల అదనపు స్థలాన్ని చేర్చి.. 100 మీటర్ల వెడల్పు ఉండేలా భూమిని సేకరించనున్నారు. నేతల ఒత్తిళ్ల మధ్య.. రీజనల్ రింగు రోడ్డు ప్రతిపాదన రాగానే నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఇప్పుడా భూములకు చేరువగా రోడ్డు ఉండాలని, అదే సమయంలో తమ స్థలాలపై నుంచి నిర్మించవద్దని ఆశిస్తున్నారు. కాస్త పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు అలైన్మెంట్ ఖరారుపై ప్రభావం చూపేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, అలైన్మెంట్కు సంబంధించి స్థానికంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ను ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తుండటంతో వంపులు లేకుండా చూడాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ దక్షిణ భాగంపై పరిశీలన రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారి కింద నిర్మిస్తోంది. ఈ భాగంలో ప్రతిపాదిత పట్టణాలను అనుసంధానిస్తూ ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. వాటిమీదుగా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొత్తరోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో ప్రతిపాదిత పట్టణాల (చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం–కందుకూరు–అమన్గల్–చేవెళ్ల–శంకర్పల్లి–కంది–సంగారెడ్డి)లను అనుసంధానిస్తూ పెద్ద రోడ్లు లేవు. ఎన్ని వాహనాలు తిరుగుతాయన్న స్పష్టత లేదు. దీంతో ఆ లెక్కలు తేల్చాలని జాతీయ రహదారుల విభాగాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులు అధ్యయనం చేసి వారం క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించడంపై త్వరలో స్పష్టత రానుంది. -
RRR: తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందా?!
►దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కే అండ్ జే ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అప్పగించింది. ►ఇంతకు ముందు ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంటును కే అండ్ జే సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. అవసరమైన మార్పులుచేర్పులతో తుది అలైన్మెంటును ఖరారు చేయడంతోపాటు డీపీఆర్ను తయారు చేస్తుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందని భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అలైన్మెంటును ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ మరో పది రోజుల్లో రంగంలోకి దిగనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఎన్హెచ్ఏఐ గత నెలలో టెండర్లు పిలిచింది. 20 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. చివరకు కే అండ్ జే సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ మరో నాలుగు రోజుల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్ క్షేత్రస్థాయి కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభించనుంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. హైదరాబాద్లో తమ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది. అలైన్మెంటు ఖరారు తర్వాత డీపీఆర్ గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థను కన్సల్టెంటుగా నియమించారు. ఆ సంస్థ అప్పట్లో గూగుల్ మ్యాపు ఆధారంగా ప్రాథమిక అలైన్మెంటును ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ అక్షాంశ రేఖాంశాలను నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోగా కన్సల్టెన్సీ గడువు తీరిపోయింది. తాజాగా కొత్త సంస్థను నియమించుకోవాల్సి రావటంతో టెండర్లు పిలిచిన ఎన్హెచ్ఏఐ నాగపూర్ కంపెనీని ఎంపిక చేసింది. ఈ సంస్థ తొలుత అలైన్మెంటును ఖరారు చేసిన తర్వాత ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని సేకరించాలో తేల్చనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేసి డీపీఆర్ తయారు చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు పది నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు అవసరమవుతాయన్న అంచనా ఉంది. అయితే తాజా పరిస్థితుల్లో అంచనా వ్యయం వెయ్యి, రెండు వేల కోట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. భారత్మాల కింద ఉత్తర భాగం హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)కు 50–70 కి.మీ. ఆవల నగరం చుట్టూ 339 (ఇందులో మార్పు ఉండొచ్చు) కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్వే ఉత్తర భాగం అయిన సంగారెడ్డి– నర్సాపూర్– తూప్రాన్– గజ్వేల్– ప్రజ్ఞాపూర్– జగదేవ్పూర్– యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కి.మీ. పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇక దక్షిణ భాగంలోని చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం– కందుకూరు– ఆమన్గల్– చేవెళ్ల–శంకర్పల్లి–కంది–సంగారెడ్డి వరకు ఉండే మిగతా భాగం విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మార్గంలో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో వివరాలు కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం దీనిపై అధ్యయనం చేసింది. దాని ఆధారంగా కేంద్రం ఈ భాగాన్ని కూడా భారత్మాల పరియోజనలో చేర్చనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఆర్ఆర్ఆర్లో పెట్టుబడులకు తొందరొద్దు
మన వెంచర్ పక్క నుంచే ఆర్ఆర్ఆర్ వెళుతుంది సార్. అటు పక్కన మనది వంద ఎకరాల్లో టౌన్షిప్ ప్రాజెక్ట్ వస్తుంది! ఆర్ఆర్ఆర్ పనులు మొదలైతే రేట్లు డబుల్ అవుతాయి మేడం. ఇప్పుడు కొంటేనే మంచి లాభం పొందొచ్చు!! రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఏజెంట్లు, డెవలపర్లకు విక్రయాల మంత్రదండంలా మారింది. ఆర్ఆర్ఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాత్రికి రాత్రే ధరలను రెండింతలు చేసేశారు. లేఅవుట్ ప్లాన్, అనుమతులు, అభివృద్ధి పనులు ఇవేవీ ఉండవు.. జస్ట్ ఆర్ఆర్ఆర్ పేరిట మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ప్లాట్లను విక్రయించేసి చేతులు దులుపుకుంటున్నారు డెవలపర్లు. సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శివార్లలో రియల్ ఎస్టేట్ రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల మీదుగా ఈ రింగ్ రోడ్డు వెళుతుండటంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 35–40 శాతం వరకు పెరిగాయి. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. హైవే ఫేసింగ్ ఉన్న భూముల ధర ఎకరానికి రూ.2 కోట్లు, కాస్త లోపలికి ఉంటే రూ.1–1.5 కోట్ల వరకున్నాయి. ఆర్ఆర్ఆర్ వెళ్తుందని భావిస్తున్న భూముల్లో వ్యవసాయం దాదాపు నిలిచిపోయింది. ఏ జిల్లాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళుతుందో క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిగి తుది అలైన్మెంటు సిద్దమయ్యాకనే అధికారికంగా ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలతో రేట్లు జూమ్.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్ఆర్ఆర్ చుట్టూ శా>టిలైట్ టౌన్షిప్పులు, లాజిస్టిక్ పార్క్లు ఏర్పాటవుతాయంటే కాసింత అనుమానమే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఆరంభంలో ఇలాగే ఆనాటి ప్రభుత్వం శాటిలైట్ టౌన్షిప్పులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ దాదాపు పదహారేళ్లు దాటినా వాటి ఊసేలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారి టౌన్షిప్పుల జీవోలను మార్చుతూ వచ్చాయే తప్ప.. ఇవి ఏర్పాటయ్యేందుకు ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. ఓఆర్ఆర్ శాటిలైట్ టౌన్షిప్పుల పరిస్థితి ఇలాగుంటే ఆర్ఆర్ఆర్ చుట్టూ డెవలప్ అయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. ఆర్ఆర్ఆర్ చుట్టూ పారిశ్రామిక వాడలు, ఐటీ సెంటర్లు, లాజిస్టిక్ పార్క్లు, ఫార్మా పరిశ్రమలు, రిక్రియేషన్ సదుపాయాలు, వాణిజ్య కట్టడాలు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్లు వంటివి వాస్తవం కావటానికి ఇంకెంత కాలం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ ప్రకటనల పుణ్యమా అంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ధరల్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. దీంతో భూసేకరణ జరపడం కష్టంగా మారుతుంది. ఓఆర్ఆర్ను చూసే నిర్ణయం.. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డునే క్షుణ్నంగా పరిశీలిస్తే.. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు సర్వీస్ రోడ్కి ఇరువైపులా కొన్ని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్లు వచ్చాయి. మరోవైపు కొల్లూరు దాకా కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక కొల్లూరులో సర్వీస్ రోడ్డు లేనే లేదు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్కు వెళ్లాలంటే మట్టి రోడ్డు మీద ప్రయాణించాల్సిన దుస్థితి. 156 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు ఇరువైపులా కి.మీ చొప్పు న గ్రోత్ కారిడార్గా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 316 కి.మీ. మేర అభివృద్ధి పనులు, ప్రాజెక్ట్లు రావాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పశ్చిమ హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆదిభట్ల వద్ద టీసీఎస్, కాగ్నిజెంట్ వల్ల కొంత కదలికలు వచ్చినప్పటికీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోచారం వద్ద ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఏర్పడడంతో ఇక్కడ కొంత ఊపొచ్చింది. పటాన్చెరు వద్ద ప్లాస్టిక్ పరిశ్రమలు, బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్క్లు, బుద్వేల్లో ఐటీ పార్క్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే రాత్రికి రాత్రే ఆయా ప్రాం తాలలో భూముల ధరలు పెరిగాయే తప్ప ప్రకటించిన అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. గతంలో ప్రయాణ దూరాన్ని కి.మీ. చొప్పున చెప్పేవాళ్లం. కానీ, ఇప్పుడు సమయంలో చెబుతున్నాం. ఎందుకంటే ఓఆర్ఆర్, మెట్రోలతో ప్రయాణం సులువైంది కాబట్టి.. ప్రధాన నగరం నుంచి ఎన్ని కి.మీ. దూరంలో ఆర్ఆర్ఆర్ ఉంటుందనేది మ్యాటర్ కాదు. పట్టణీకరణ, వ్యాపార, ఉద్యోగ అవకాశాలతో నగరం శరవేగంగా అభివద్ధి చెందుతుంది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా సిటీ విస్తరణ జరగాల్సిందే. కాకపోతే ఆయా ప్రాంతాలలో ముందుగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే గ్రోత్ కారిడార్లలో కంపెనీలు, ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఫలానా ప్రాంతం మీదుగా ఆర్ఆర్ఆర్ రహదారి వెళుతుందంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దు. విచక్షణతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. – జే వెంకట్ రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ. (ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ) -
ఆర్ఆర్ఆర్: భూసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థ!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజినల్ రింగు రోడ్డు నిర్మాణ దిశగా యంత్రాంగం కదులుతోంది. రింగులో సగానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపిన క్రమంలో, తుది అలైన్మెంటు ఖరారుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీ. తొలి సగభాగానికి భూసేకరణ చేపట్టేందుకూ సమాంతర ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ తొలి సగభాగానికి రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటు భూసేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాకు ఓ యూనిట్ చొప్పున ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఓ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వ ర్యంలో ఒక్కో యూనిట్ పనిచేయనుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్ భూసేకరణ వ్యవహారం చూస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఇవి పనిచేస్తాయి. పదిరోజుల్లో ఫీల్డ్కు.. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపే సమయంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు అలైన్ మెంటును రూపొందించారు. ఇందులో ఏయే ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ప్రతిపాదిత అలైన్మెం టును ఖరారు చేశారు. కానీ, ఫీల్డ్ సర్వే నిర్వహిం చలేదు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ బాధ్యతలు చూసే ఫీడ్బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ వారం, పది రోజుల్లో ఫీల్డ్ సర్వే ప్రారంభించనుంది. గ్రామాల నక్షాలు, సర్వేనంబర్ల ఆధారంగా మార్కింగ్ చేయనుంది. మూడు వారాల్లో తుది అలైన్మెంటు ఖరారవుతుంది. వీలైనంత వరకు గుట్టలు, జలాశయాలను తప్పించి అలైన్మెంటు ఖరారు చేయనున్నారు. అంతా గోప్యం.. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన ఆధా రంగా రియల్ ఎస్టేట్ సంస్థలు వేగం పెంచాయి. ఎలాంటి అలైన్మెంట్ రూపొందకుండానే ఫలానా సర్వే నంబర్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుం దంటూ బోగస్ మ్యాపులు సృష్టించి రైతుల్లో భయాందోళనలు రేకెత్తించి తక్కువ ధరకే భూము లను తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుందని భావిస్తున్న భూముల్లో సాగు దాదాపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వారి ఆగడాలకు కళ్లెం వేసేలా అధికారులు ఏ విషయాన్నీ బయటకు పొక్కనీయటం లేదు. పక్కాగా సర్వే జరిగి తుది అలైన్మెంటు సిద్ధమయ్యాకనే అధికారికంగా దాన్ని ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రెండో భాగంపై ట్రాఫిక్ స్టడీ.. రీజినల్ రింగురోడ్డులో మొదటిదశకు సంబంధించి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి అనుమతించిన కేంద్రం, రెండోదశకు సంబంధించి ఇప్పటివరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టు దాదాపు రూ.18 వేల కోట్ల వ్యయంతో కూడుకున్నది కావటం విశేషం. దీంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన మొదటి సగంలో సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఓ రోడ్డు కొనసాగుతోంది. ఆయా పట్టణాల మీదుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు భారీగా ఉండటంతో ఇది పూర్తిస్థాయి ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి యోగ్యమైందని కేంద్రం ఇప్పటికే నిర్ధారించింది. రెండో సగంలో వాహనాల రాకపోకలు లేవని కేంద్రం గుర్తించింది. కానీ, రోడ్డు నిర్మాణంతో భారీగా వాహనాల రాకపోకలుంటాయని అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. అధికారులు టోల్ప్లాజాలు, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్టడీ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలించాక కేంద్రం అనుమతి మంజూరు చేయనుందని సమాచారం. త్వరలో దానికి కూడా పచ్చజెండా ఊపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆర్ఆర్ఆర్.. భూసేకరణకు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్రోడ్డుకు సంబంధించి కసరత్తు ప్రారంభం కాబోతోంది. కేంద్రం అధికారికంగా అనుమతి మంజూరు చేయబోతోంది. ఈ నేపథ్యంలో.. తొలిసారి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వేకు సిద్ధమైంది. ఆ పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టబోతోంది. తాజాగా భూసేకరణ కసరత్తు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ నడుం బిగించింది. ఇందుకు బెంగళూరుకు చెందిన ఫీడ్బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థను కన్సల్టెన్సీగా నియమించింది. త్వరలో ఈ సంస్థ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించనుంది. నెలరోజుల్లో అలైన్మెంట్.. రోడ్డు నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథ మిక అలైన్మెంట్ను సమర్పించింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా.. ఏయే ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుందో మ్యాప్ రూపొందించింది. అప్పట్లో దానికి అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఆ రూట్లో భాగంగా ఏయే సర్వే నంబర్ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కింగ్ చేస్తారు. ఆ అలైన్మెంట్లో 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించనున్నారు. ఈ కసరత్తుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. భూసేకరణకు ఏడాది గడువు.. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని జాతీయ రహదారిగా నిర్మితమవుతున్నందున కొత్త భూసేకణ చట్టం–2013 ప్రకారం సేకరించనున్నారు. ఇందులో కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. ఆ మేరకు అందులో ప్రతిపాదించిన విధంగా భూ పరిహారాన్ని అందిస్తారు. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ అధికారులు ఆ చట్టంలోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. అభ్యంతరాల గడువు, వివాదాల పరిష్కార సంప్రదింపులు.. తదితరాల గడువు కలుపుకొంటే ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం. 158 కి.మీ. తొలి భాగానికి సంబంధించి దాదాపు 4,350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట ప్రత్యేకంగా నిర్మించే క్లోవర్ లీవ్ ఇంటర్చేంజెస్కు అదనంగా మరింత భూమి అవసరమవుతుంది. పరిహారం ఇలా.. రిజిస్ట్రేషన్ విలువకు 3 రెట్ల మొత్తాన్ని నిర్ధారించి పరిహారంగా అందిస్తారు. గత మూడేళ్లలో ఆ ప్రాంతంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లను పరిశీలించి ఎక్కువ మొత్తం ధరలు ఉన్న వాటిల్లోంచి 50 శాతం లావాదేవీలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ధరల్లోంచి సగటు ధరను తేల్చి దాన్ని పరిహార ధరగా నిర్ధారిస్తారు. నిర్మాణాలు, చెట్లకు విడిగా ధరలు నిర్ణయిస్తారు. గుర్తించిన పట్టణాలు/ ఊళ్లు ఇవీ.. సంగారెడ్డి చేరువలోని పెద్దాపూర్, శివంపేట, లింగోజీగూడ, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, నరసన్నపేట, ఎర్రవల్లి, మల్కాపూర్, రాయగిరి, ఎర్రబెల్లి, సంగెం, చౌటుప్పల్ తుర్కపల్లి మీదుగా.. జగదేవ్పూర్–భువనగిరి మధ్య రెండు మార్గాలను తాత్కాలికంగా రూపొందించారు. భవనగిరి-ఆలేరు మధ్య జాతీయ రహదారిని దాటేలా ఓ మార్గాన్ని, తుర్కపల్లి మీదుగా మరో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు తుర్కపల్లి మీదుగా ప్రతిపాదించిన మార్గాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. పీర్లపల్లి, తిరుమలాపురం, వాసాలమర్రి, తుర్కపల్లి మీదుగా ఉన్న ప్రస్తుత మార్గానికి చేరువగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. త్వరలో రెండో భాగానికి పచ్చజెండా.. సంగారెడ్డి–చౌటుప్పల్ మధ్య తొలి భాగానికి కేంద్రం అనుమతినివ్వగా, రింగులో రెండో సగం అయిన ఆమన్గల్-కంది వరకు నిర్మితమయ్యే 181.8 కి.మీ. రెండో భాగానికి కూడా త్వరలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత రావటంతో జరిగిన జాప్యం వల్ల దానికి అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లోనే దీనికి కూడా కేంద్రం ఓకే చెబుతుందని రాష్ట్రప్రభుత్వం ఆశాభావంతో ఉంది. -
ఆర్ఆర్ఆర్.. అంతా కొత్త రోడ్డే
రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే ప్రతిపాదిత అలైన్మెంట్కు కాస్త అటూ ఇటుగా నగరం చుట్టూ ఇప్పటికే ఒకదానికి ఒకటి అనుసంధానమవుతూ చిన్న రోడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని విస్తరిస్తూ పోతే కూడా కొత్త రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ పట్టణాలు, ఊళ్ల మీదుగా సాగుతున్న రోడ్లు. ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా వంకరటింకరగా ఉన్నాయి. దీంతో ఆ పాత రోడ్లను అసలు వినియోగించుకోకుండా పూర్తి కొత్త రోడ్డుగా రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: నగరం చుట్టూ రానున్న రీజనల్ రింగ్ రోడ్డు (338 కిలోమీటర్లు) పూర్తి కొత్త రోడ్డుగా అవతరించనుంది. నగరానికి 50 కి.మీ.నుంచి 70 కి.మీ. దూరంలో... దాదాపు 20 ప్రధాన పట్టణా లను అనుసంధానిస్తూ వలయాకారంలో నిర్మాణం కానున్న ఈ భారీ ఎక్స్ప్రెస్వే కోసం ఎక్కడా పాత రోడ్లను వినియోగించుకోరు. భూసేకరణ జరిపి పూర్తి కొత్త (గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్) రాచబాటగా నిర్మించబోతున్నారు. నగరం చుట్టూ నిర్మితమైన ఔటర్ రింగురోడ్డుకు (162 కిలోమీటర్లు) ఆవల 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఇందుకు అవసరమైన భూమి మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సిందే. ప్రస్తుతానికి ఉన్న తాత్కాలిక అంచనా ప్రకారం దాదాపు 11 వేల ఎకరాల భూమి అవసరం కానుంది. దీనికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇందులో 50 శాతం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుండగా, మిగతా మొత్తం కేంద్రం ఇస్తుంది. ప్రస్తుతానికి 4 వరుసల ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు తర్వాత నిర్మితమవుతున్న రెండో ఎక్స్ప్రెస్ వే ఇది. మొదటి దశలో దీన్ని నాలుగు వరుసల ఎక్స్ప్రెస్వేగా నిర్మించనున్నారు. ఇందుకోసం వంద మీటర్ల కారిడార్ ఉండేటట్లుగా భూసేకరణ జరపనున్నారు. ఆర్ఆర్ఆర్ వెంబడి వాణిజ్యపరమైన నిర్మాణాలకు స్థలం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇంకా అధికంగా భూసేకరణను సూచిం చింది. ప్రస్తుతం నగరం చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరిగినందున భూసేకరణ భారం మోయటం కష్టమవటంతో పాటు, చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున.. 100 మీటర్లకే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో 11.5 మీటర్ల (వెడల్పు) చొప్పున ఇరువైపులా డబుల్ లేన్లు ఉంటాయి. అలా మొత్తం నాలుగు లేన్ల ప్రధాన క్యారేజ్ వే ఏర్పడుతుంది. దానికి రెండు వైపులా 7 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉంటాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసల రోడ్డునే నిర్మిస్తారు. భవిష్యత్తులో దాన్ని ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. ఆటోలు, ద్విచక్రవాహనాలకు ‘నో ఎంట్రీ’ ఇది ఎక్స్ప్రెస్వేగా నిర్మితమవుతున్నందున ఈ రోడ్డుపై ఆటోలు, ద్విచక్రవాహనాలకు అనుమతి ఉండదు. వాహనాలు గరిష్ట పరిమితి వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున ఆటోలు, ద్విచక్రవాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అందుకని వాటికి అనుమతి ఉండదు. ఆ వాహనాలు ప్రస్తుతం ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఏ ఊరు.. ఏ సర్వే నెంబర్.. ఆరునెలల తర్వాతే స్పష్టత దాదాపు మూడేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. భారీ ప్రాజెక్టు కావటంతో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రాష్ట్రప్రభుత్వ విన్నపానికి అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ మౌఖిక సానుకూలత వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు మొదటి దశ అయిన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 152 కి.మీ. మార్గానికి జాతీయ రహదారి హోదా ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఇలాంటి కొన్ని రోడ్లపై సమీక్షి నిర్వహించి, దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయమయ్యే ఆర్ఆర్ఆర్ వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అప్పటికి ఈ రోడ్డు అలైన్మెంటుపై ఎలాంటి స్పష్టత లేదు. కేవలం గూగుల్ మ్యాపు ఆధారంగా ఓ ప్రతిపాదన రూపొందించారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, గతంలో కేంద్రం సూచించిన మార్పులకు రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదనను తిరిగి కేంద్రం పరిశీలిస్తోంది. దాదాపు అనుమతులు మంజూరు చేసే దిశగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత వచ్చింది. త్వరలో లిఖితపూర్వకంగా ఆమోదముద్ర పడనుంది. అలా అనుమతులు వచ్చాక జాతీయ రహదారుల విభాగం అధికారులు అసలైన అలైన్మెంట్ను రూపొందించనున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలో నిర్ధారించనున్నారు. ఇందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అసలు అలైన్మెంట్పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతనే ఊళ్లు, సేకరించాల్సిన భూమి సర్వే నెంబర్ల వివరాలు తెలుస్తాయి. దాదాపు 25 చిన్నాపెద్దా పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా. 8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఈ బృహత్ ఎక్స్ప్రెస్వే 8 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తుంది. ఎన్హెచ్–65, ఎన్హెచ్– 161, ఎన్హెచ్– 44, ఎన్హెచ్–765, ఎన్హెచ్–765డి, ఎన్హెచ్–163, రాజీవ్ రహదారి, నాగార్జున సాగర్ రోడ్డులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్ రింగురోడ్డు మీదుగా మళ్లొచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం! ఇది పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలైన్మెంట్కు ఆరు నెలల నుంచి ఏడాది సమయం, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేందుకే కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలతో కూడిన రోడ్డు నిర్మాణం దాదాపు మూడేళ్లకు పైగా పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో భూసేకరణ అతిక్లిష్టమైన అంశం. అందులో ఎంత జాప్యం జరిగితే ప్రాజెక్టు అంత నెమ్మదిగా కదులుతుంది. -
ఆర్ఆర్ఆర్కు కేంద్రం ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ కలసి రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని కోరారు. గడ్కరీతో భేటీ అయిన తర్వాత కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర తెలంగాణకు మణిహారంలా ‘రీజనల్’రోడ్డు ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్తో హైదరాబాద్కు ట్రాఫిక్ తగ్గుతుందని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 40 శాతం మంది రాష్ట్ర ప్రజలు ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీలో ఉంటారని చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని.. రాష్ట్రం భూసేకరణ త్వరితగతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారని కిషన్రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుందని, అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. రెండు దశల్లో నిర్మాణ పనులు... సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించిందన్న విషయాన్ని కిషన్రెడ్డి బృందం గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. చౌటుప్పల్–షాద్నగర్ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్ కేటాయించాలని కోరారు. రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయని అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు కారిడార్, పుణే–హైదరాబాద్–విజయవాడ కారిడార్లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్లలోగా ఆర్ఆర్ఆర్ను పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్రెడ్డి తెలిపారు. -
ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్.. రాష్ట్రం మెడలో చేరనున్న కొత్త ఆభరణం.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే అపురూపం.. చిన్న పట్టణాలను కలుపుతూ పోయే ఓ అద్భుతం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన రీజినల్ రింగ్ రోడ్డు ఊహలు అతి త్వరలో నిజం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల ఆవల 338 కి.మీ. మేర ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు 50–70 కి.మీ. దూరంలో ఉన్న దాదాపు 20కి పైగా చిన్న పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారుల అనుసంధానంతో ఈ రింగు ఏర్పడనుంది. జాతీయ రహదారుల ప్రాజెక్టుగా కేంద్రమే సొంత వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండనందున నాట్ వయోబుల్ ప్రాజెక్టుగా కేంద్రం దీన్ని ఇటీవలి వరకు అటకెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడం, కేంద్రం సూచించిన మార్పులు చేపట్టేం దుకు సమ్మతించటంతో కేంద్రం దీనికి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఇక త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కొత్త రోడ్డు ఏర్పడితే రాష్ట్రం పురోగతిలో కొత్త కోణాలను చవిచూడనుంది. ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో సీఎంతో ఈ విషయంపై భేటీ అవుతానని చెప్పారు. ఓఆర్ఆర్తో మారిన రూపురేఖలు.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముందుచూపు ఇప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మారేందుకు దోహదం చేసింది. ఇంతపెద్ద రోడ్డు అవసరమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. దేశంలోనే 158 కి.మీ. తొలి 8 వరుసల ఎక్స్ప్రెస్వేగా ఔటర్ రింగు రోడ్డును ఆయన అందుబాటులోకి తెచ్చారు (ఆయన మరణానంతరం మొత్తం రోడ్డు పూర్తి). అది హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెండటంతో కీలకంగా మారింది. ఆ రోడ్డును ఆసరా చేసుకునే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వస్తున్నాయి. ఆ రోడ్డు ఆలంబనగా పారిశ్రామిక క్లస్టర్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. భారీగా ఉపాధితో పాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో ఎంతో ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రం మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా ఈ రోడ్డు మీదుగా సులభంగా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల నగర ట్రాఫిక్పై పెను భారం తప్పింది. భవిష్యత్తులో ఈ నగరం మరింతగా పురోగమించేందుకు ఇది దోహదం చేసేందుకు సిద్ధంగా ఉంది. తొలుత అవునని, ఆ తర్వాత కాదని.. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అది జాతీయ రహదారుల అనుసంధానంతో జరగాల్సి ఉన్నందున ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరింది. ఇందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చాక మరికొన్ని ప్రాజెక్టులతో కలసి దీనిపై స్వయంగా ప్రధాని మోదీ సమీక్షించారు. ఇంత భారీ వ్యయంతో చేపట్టే రహదారి వల్ల తిరిగి ఆదాయం పెద్దగా ఉండదని తేల్చారు. టోల్ రూపంలో వచ్చే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని లెక్కలేసి చివరకు ఈ ప్రతిపాదనను దాదాపు తిరస్కరించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరటంతో తిరిగి పరిశీలించి, ఈ రోడ్డు వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగేలా చూడాలని రాష్ట్రానికి సూచించింది. దీంతోపాటు భూసేకరణ ఖర్చులో సగం భరించాలని అడిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించటంతో దాని పునఃపరిశీలనకు అంగీకరించింది. తొలుత ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాణిజ్యపరంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఎక్స్ప్రెస్ వేగా దీన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఔటర్ రింగు రోడ్డు కూడా ఎక్స్ప్రెస్ వేగా ఉండటంతోనే మంచి ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఆరు వరుసలు నిర్మించాలని ప్రణాళిక మార్చారు. ఉపయోగాలు బోలెడు.. హైదరాబాద్కు 50–70 కి.మీ. దూరంలోనే ఉన్నప్పటికీ ఎన్నో ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. స్థానికంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలు తప్ప ఉపాధి కరువైంది. ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటైన ప్రాంతాల్లో ఈ సమస్య తీరింది. అదే తరహాలో ఎక్స్ప్రెస్ వేగా రూపుదిద్దుకునే ఈ భారీ రింగు రోడ్డుతో ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నాయి. సరైన రోడ్ నెట్వర్క్ ఉంటే ఆ ప్రాంతాలకు కొత్త పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తుంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లు రూపొందుతాయి. హోటళ్లు, ఎంటర్టైన్మెంట్, రీక్రియేషన్ జోన్లు ఏర్పాటవుతాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధికి అవకాశం కలుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ట్రాఫిక్ సమస్యలకూ కొంత విరుగుడు కలుగుతుంది. ఈ రోడ్డును ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానిస్తూ 25 స్పైనల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. దాదాపు 300 గ్రామాలను అనుసంధానిస్తుంది. ఆర్ఆర్ఆర్ విశేషాలు.. రీజినల్ రింగురోడ్డు నిడివి: 338 కిలోమీటర్లు అనుసంధానమయ్యే పట్టణాలు: సంగారెడ్డి– నర్సాపూర్– తూప్రాన్– గజ్వేల్– జగదేవ్పూర్– భువనగిరి– చౌటుప్పల్ –ఆమన్గల్– యాచారం– కందుకూరు– షాద్నగర్– చేవెళ్ల– కంది. మొదటి దశ: 152 కి.మీ. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉంటుంది. రెండో దశ: 186 కి.మీ. ఇందులో ఆమన్గల్ నుంచి కంది వరకు ఉంటుంది. ఈశాన్య భాగం: తూప్రాన్ నుంచి మల్కాపూర్ వరకు ఆగ్నేయ భాగం: మల్కాపూర్ నుంచి షాద్నగర్ వరకు నైరుతి భాగం: షాద్నగర్ నుంచి కౌలంపేట వరకు వాయువ్య భాగం: కౌలంపేట నుంచి తూప్రాన్ వరకు ఏయే జాతీయ రహదారులతో రింగ్ ఏర్పడుతుంది: ఎన్హెచ్ 65– ఎన్హెచ్ 44– ఎన్హెచ్163– ఎన్హెచ్ 765 నిర్మాణ అంచనా: తొలుత రూ.7 వేల కోట్లు. ప్రస్తుతం రూ.12,800 కోట్లకు చేరింది. ఇందులో భూసేకణ వాటా రూ.3 వేల కోట్లు భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం వాటా రూ.1,500 కోట్లు ఎంత భూమి అవసరం: దాదాపు 11 వేల ఎకరాలు -
రీజినల్ రింగ్ రోడ్డుపై కేంద్రం మడతపేచీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు అయోమయంలో పడింది. హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్)కు అవతల 338 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థ కంగా మారింది. ప్రస్తు తం ఇందులో సగం రోడ్డుకు మాత్రమే కేం ద్రం సూత్రప్రాయం గా అంగీకారం తెలి పింది. మిగిలిన సగం రోడ్డును దాదాపు తిర స్కరించి నట్టుగానే కనిపి స్తోంది. అది ఆర్థికంగా సాధ్యం కాదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని పరోక్షంగా సూచిస్తోంది. వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా దాదాపు 500మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి అందిస్తే చూస్తానని చెప్పడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం సగం రింగ్ మాత్రమే సాకారమయ్యేలా మారింది. రెండో భాగానికి కేంద్రం అంగీకరించాలంటే స్వయంగా ప్రధాని మోదీ సంతృప్తి చెంది ఆమోదిస్తే తప్ప అది పట్టాలెక్కే పరిస్థితి కనిపించటంలేదు. ఓఆర్ఆర్ కీలక భూమిక.. ఔటర్ రింగ్రోడ్డు.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా హైదరా బాద్ నగరం చుట్టూ సాక్షా త్కరించిన భారీ ప్రాజెక్టు. 158 కిలోమీటర్ల మేర ఎనిమిది వరుసలతో దేశంలోనే తొలి ఎక్స్ ప్రెస్ వేగా ఇది నిర్మిత మైంది. ఇంత భారీ రింగురోడ్డు అవసరమా అన్న అనుమానాలు వ్యక్త మైన తరుణంలో నిర్మిత మైన ఈ రోడ్డు.. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భూమిక పోషిం చింది. దేశంలో శరవేగంగా పురోగమించిన నగరాల జాబితాలో భాగ్యనగరం ముందు వర సలో ఉండేందుకు దోహదపడింది. నగరం చుట్టూ శివారు ప్రాంతాల ముఖచిత్రం మారడానికి సాయపడింది. అలాంటిది దీన్ని మించిన రింగు రోడ్డు నిర్మిస్తే భాగ్యనగరం మరింత పురోగమించడం ఖాయం. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. దూరదృష్టితో ఆలోచించి రూపకల్పన చేసిన ప్రాజెక్టే ఈ రీజినల్ రింగు రోడ్డు. ఏంటీ రీజినల్ రింగ్రోడ్డు? హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల దాదాపు 50 కిలోమీటర్ల పరిధిని అనుసంధానిస్తూ నిర్మితమయ్యే రోడ్డు ఇది. తొలుత దీన్ని నాలుగు వరుసలతో నిర్మించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఆరు వరసలుగా నిర్మించాలని నిర్ణయించింది. ఇది 338 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ నిర్మితమవుతుంది. నగరం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 20కి పైగా పట్టణాలను అనుసంధానిస్తూ వలయంగా ఈ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడేం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 2016లో రూపకల్పన చేసింది. భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో రాష్ట్ర రహదారులుగా ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా మార్చి అనుసంధానించటం ద్వారా దీన్ని సాకారం చేయొచ్చని భావించి కేంద్ర ఉపరితల రవాణాశాఖకు దరఖాస్తు చేసింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, రోడ్లు భవనాల శాఖ అధికారులు భేటీ అయి దీనిపై చర్చించారు. దీంతో ఆయన 2018లో ఆమోదించటంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీన్ని రెండు భాగాలుగా చేసి 152 కిలోమీటర్ల తొలి భాగాన్ని జాతీయ రహదారిగా డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తాత్కాలికంగా ఆ రోడ్డును ఎన్హెచ్ 161 బీబీగా పేర్కొంది. రెండో భాగాన్ని కూడా ఆమోదించి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఈ లోపు ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా పెండింగులో పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిశీలించి పాత నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్థికంగా వెసులుబాటు కాని ప్రాజెక్టులుగా గుర్తించిన వాటిని పక్కన పెట్టారు. ఆ జాబితాలో రీజినల్ రింగ్ రోడ్డు రెండో భాగాన్ని కూడా చేర్చారు. కేంద్రం ఏమంటోంది? దాదాపు రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్ఆర్ఆర్ రెండో భాగం నుంచి టోల్ రూపంలో తప్ప మరే ఆదాయం రాదు. టోల్ కూడా నామ మాత్రంగానే ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుగా 500 మీటర్ల వెడల్పుతో చేపడితే బాగుంటుంది. అంతమేర భూసేకరణ జరిపి వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా చేసి కేంద్రానికి అప్పగిస్తే ఆ రోడ్డును నిర్మిస్తామని మెలిక పెట్టింది. అది జరగాలంటే వేల హెక్టార్ల ప్రైవేటు భూమిని సేకరించాలి. అంత మొత్తం భరించడం ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. రాష్ట్రం ఏం చేయాలి? జాతీయ రహదారుల విషయంలో ఇప్పటికీ తెలంగాణ బాగా వెనకబడి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల చుట్టూ ఉన్న రోడ్ నెట్వర్క్ హైదరాబాద్కు లేదు. దీంతో పాత ప్రతిపాదనను ఆమోదించి రీజినల్ రింగ్రోడ్డుకు అనుమతిస్తే హైదరాబాద్ కూడా ఇతర ప్రధాన నగరాల రోడ్ నెట్వర్క్ సరసన నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీని ఈ మేరకు ఒప్పించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో దీనిపై ప్రధానికి నివేదించే అవకాశం కనిపిస్తోంది. ‘‘గతంలో నితిన్ గడ్కరీ చాలా జాతీయ రహదారులను మంజూరు చేశారు. కానీ మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆ వేగానికి బ్రేకులేశారు. ఇప్పుడు భారీ ప్రాజెక్టులకు ఉదారంగా చేపట్టేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఎక్స్ప్రెస్వే తరహాలో కాకుండా సాధారణ జాతీయ రహదారిగానైనా దీన్ని సాకారం చేసుకోవాల్సి ఉంది. అవసరమైతే భవిష్యత్తులో దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ మేరకు మోదీని ఒప్పించాల్సి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయి చర్చిస్తే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. -
‘రీజినల్’ డీపీఆర్ వేగవంతం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా డీపీఆర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రాజధానిపై ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ నిర్మించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, సీఎం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటులో కేంద్ర సహాయ మంత్రి మాండవీయ రీజినల్ రింగ్రోడ్డులోని రెండు రోడ్ల నిర్మాణానికి అంగీకారాన్ని వెల్లడించారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చు భరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా డీపీఆర్ పనులపై ఆరాతీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే వారాంతానికి డీపీఆర్ పనులు పూర్తికానున్నాయి. భూసేకరణ మొత్తం గ్రీన్ఫీల్డే: మొత్తం 334 కిలోమీటర్ల దూరం రెండు దశల్లో సంగారెడ్డి–నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్–జగ్దేవ్పూర్– భువనగిరి–చౌటుప్పల్ (దాదాపు 154 కి.మీ), చౌటుప్పల్–షాద్నగర్–కంది (దాదాపు 180 కి.మీ) రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించనున్నారు. ఈ రహదారి భూసేకరణకు మొత్తం గ్రీన్ఫీల్డ్నే తీసుకోవాలని అధికారులు ఇటీవల నిర్ణయించారు. వాస్తవానికి షాద్నగర్ నుంచి తూప్రాన్–భువనగిరి మార్గంలో ఇప్పటికే ఓ రోడ్డు అందుబాటులో ఉంది. తొలుత ఈ రోడ్డును విస్తరిస్తారని, చౌటుప్పల్ నుంచి షాద్నగర్ వరకు మాత్రమే గ్రీన్ఫీల్డ్ సేకరిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఉన్న రోడ్డు విస్తరణలో పలు సాంకేతిక, న్యాయ సంబంధ చిక్కులు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రెండు రహదారులకు గ్రీన్ఫీల్డ్నే ఎంచుకోవాలని సూచించింది. దీంతో గ్రీన్ఫీల్డ్నే సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మండలాల గుండా వెళ్లే అవకాశం! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రీజినల్ రింగ్ రోడ్ తూప్రాన్, దౌలతాబాద్, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, యాచారం, కడ్తాల్, కేశంపేట, షాద్నగర్, కొందుర్గ్, పరిగి, పూడూరు, చేవెళ్ల, శంకర్పల్లితోపాటు కంది, దొంతి తదితర ప్రాంతాల గుండా వెళ్లవచ్చని తెలుస్తోంది. వీటితోపాటు దాదాపు 150 గ్రామాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. డీపీఆర్ పనులు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇక భూసేకరణపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా భూమిని సేకరించి, ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తే వారు రోడ్డు నిర్మాణం మొదలు పెట్టనున్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో! రెండు దశల్లో నిర్మించనున్న ఈ రహదారిని ఏకంగా 334 కి.మీల విస్తరణలో ఉండనుంది. మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల (మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్)కు చెందిన దాదాపు 22 మండలాలు, సుమారు 150 గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 4,500 హెక్టార్లు లేదా 11,000 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం అయ్యే రూ.3,000 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.1,500 కోట్లు భరించనుంది. -
‘రింగు’తో నగరానికి హంగు..
సాక్షి: ఆర్ఆర్ఆర్ పనులు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అధికారిక ఆదేశాలు ఎప్పుడు రానున్నాయి? గణపతిరెడ్డి: రెండు వారాల్లో కేంద్రం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రానున్నాయి. రీజినల్ రింగ్ నేపథ్యం వివరిస్తారా? గ్రేటర్ హైదరాబాద్కు భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో రింగ్ రోడ్ అవసరమన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఆయన 2016లోనే ఈ ప్రతిపాదనను మాముందు ఉంచారు. రోజురోజుకు వేలాది కొత్తవాహనాలు రోడ్డు మీదకు వస్తున్న దరిమిలా.. ఇపుడున్న ఔటర్ రింగ్రోడ్ సామర్థ్యం సరిపోదని, భారీ వాహనాల రవాణాకు మరో కొత్త రింగు రోడ్డు (రీజినల్ రింగ్ రోడ్) కావాలని ఆయనే ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డుతో మారనున్న తెలంగాణ ముఖచిత్రం రోడ్డు ఆవశ్యకత ఏంటి? నగరం నుంచి ఉన్న జాతీయ రహదారులపై వాహనభారం తీర్చేందుకు ఔటర్ రింగ్రోడ్డుకు అంకురార్పణ జరిగింది. కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తుండటంతో రాబోయే ఐదేళ్లలో ఓఆర్ఆర్ కేవలం నగర అవసరాలకే పరిమితమవనుంది. అపుడు ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. రోజురోజుకు పెరిగే అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులపై నిరాటంకమైన రవాణా ఉండాలంటే మరో రింగు రోడ్డు అనివార్యమైంది. అదే విషయాన్ని కేంద్రానికి వివరించి ఒప్పించగలిగాం. డీపీఆర్ పనులు ఎంతవరకు వచ్చాయి? డీపీఆర్ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి.మరో 10 రోజుల్లో నివేదిక రావొచ్చని అంచనా వేస్తున్నాం. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. భూసేకరణ మొదలు పెట్టవచ్చని కేంద్రం చెప్పింది కదా? ఎంత భూమిని సేకరిస్తారు? మొత్తం 338 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు కోసం 11,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. ఇందుకోసం ప్రాజెక్టు వ్యయంలో రూ.2,500 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ మార్గంలో ఇప్పటికే రోడ్డు అందుబాటులో ఉంది కదా? దాన్ని విస్తరిస్తారా? గణపతిరెడ్డి: ఉన్న రోడ్డును విస్తరించడం సవాలుతో కూడుకున్నది.పైగా అనేక వంపులు, మలుపులు ఎదురై ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది.పైగా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింపులు, కోర్టు కేసులు, స్టేలు పనులకు ఆటంకంగా మారతాయి. న్యాయపరంగా, ఆర్థికంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. అందుకే, మేం పూర్తిగా గ్రీన్ఫీల్డ్నే ఎంచుకోబోతున్నాం. ఇలాగైతే వంపులు లేని సాఫీ రోడ్డును నిర్మించగలం. భవిష్యత్లో నగర వాసులకు ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకే రీజినల్ రింగ్రోడ్ ప్రతిపాదన తెచ్చామని, 2016లోనే సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, నగరం కాలుష్యరహితంగా కూడా మారుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు మరో హారంగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్పై గణపతిరెడ్డి తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మరో10 రోజుల్లో పూర్తికానున్న డీపీఆర్ ఈ రోడ్డు అధ్యయనానికి మోడల్గా మలేసియానే ఎందుకు ఎంచుకున్నారు? మలేసియాకు అధికారుల పర్యటన ఎపుడు?ఆ దేశంలో ఆర్థికాభివృద్ధిలో ఎక్స్ప్రెస్ హైవేల పాత్ర అద్భుతంగా ఉంది. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే, ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాలని సూచించారు. ఇటీవల ఎన్నికల కోడ్ కారణంగా వీరి పర్యటన ఆగిపోయింది. జనవరిలో పర్యటన ఖరారవుతుంది. అత్యాధునిక సదుపాయాలతో ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవేపై ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి నిర్మాణం కానుంది. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా రోడ్డు సామర్థ్యం ఉంటుంది. రహదారిపై ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం ఉండదు. పెట్రోల్, అంబులెన్స్, పికప్ క్రేన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. టోల్గేట్లకు అత్యాధునిక టచ్ అండ్ గో సిస్టంతో టోల్ వసూలు చేసేందుకు స్మార్ట్ కార్డులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రీజినల్ను కలుపుతూ రేడియల్రోడ్లు ఎన్ని వస్తాయి? ఇప్పటికే 10 రేడియల్ రోడ్లు ఉన్నాయి.దానికి లింకు రోడ్లు వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రమే ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రాజెక్టు పూర్తికాగానే నగరం నుంచి పరిశ్రమలు తరలింపు ఈ రోడ్డుతో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల పరిశ్రమల చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి.ఈ హానికారక పరిశ్రమలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు వీలుంది. ఫలితంగా నగరంలో వాయుకాలుష్యం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నగరంలో పలు పరిశ్రమలు హానికారక రసాయనాలను మూసీలో వదులుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల తరలింపు వల్ల మూసీ ప్రక్షాళన సులభతరమవుతుంది. అంతర్జాతీయ స్థాయి రోడ్డు సదుపాయాలు ఉండటం వల్ల ఐటీ, ఎగుమతులు, డ్రై పోర్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల ఆర్థిక ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. -
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం
-
హైటెక్ హైవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన దరమిలా పనులు ముమ్మరం చేసింది. ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించనున్న ఈ రోడ్డును ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. దీనికోసం ప్రస్తుతం మలేసియాలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవేలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆరుగురు ఇంజనీర్ల బృందం త్వరలోనే మలేసియాకు వెళ్లి అక్కడి ఎక్స్ప్రెస్వే నిర్మాణం, దీనిపై అందిస్తున్న వివిధ రకాల సౌకర్యాలు, సేవలు తదితర విషయాలపై అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం ఈ రోడ్ డీపీఆర్ రూపొందించడంలో సాయపడుతున్న మలేసియాకు చెందిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్ (సీఐడీబీ) ప్రతినిధులు ఇప్పటికే మంత్రిని కలిసిన విషయం తెలిసిందే. మలేసియానే ఎందుకు... మూడు దశాబ్దాల(1980) కిందే మలేసియా ఎక్స్ప్రెస్వేల నిర్మాణానికి పూనుకుంది. అందుకే మలేసియా హైవే అథారిటీ (ఎంహెచ్ఏ)ని స్థాపించి ప్రపంచ స్థాయి అత్యున్నత ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించింది. మలేసియాలో 1,821 కి.మీ.లకుపైగా విస్తరించి ఉన్నాయి. ఇవి వివిధ కీలక నగరాల కనెక్టివిటీకి, ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి. పొరుగున ఉన్న సింగపూర్తోనూ రోడ్డు రవాణాను అభివృద్ధి చేసుకోగలిగింది. ఆగ్నేయాసియా దేశాల్లో మలేసియా ఎక్స్ప్రెస్ హైవేలు అత్యున్నతమైనవి అనడంలో సందేహం లేదు. సదుపాయాలు ఇలా.. - ఎక్స్ప్రెస్ హైవేలు అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తారు. వీటిపై రవాణా పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. - ఈ హైవేపై పక్కన ఏర్పాటు చేసే కంచె కారణంగా జంతువులు ప్రవేశించలేవు. - ప్రతీ టోల్ గేట్ వద్ద ఆగి డబ్బులు చెల్లించే ఇబ్బంది లేకుండా.. టచ్ అండ్ గో కార్డులు (క్రెడిట్ కార్డు తరహాలో) అందుబాటులో ఉంటాయి. - రోడ్డుపై నిత్యం పోలీసింగ్ ఉంటుంది. ట్రాఫిక్ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. - వాహన వేగాన్ని లెక్కిండానికి స్పీడ్ గన్ కెమెరాలు ఉంటాయి. - సైన్బోర్డులు, వార్నింగ్ బోర్డులు, సులువుగా అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తారు. - డ్రైవర్లు రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలు ఉంటాయి. - ఫుడ్ కోర్డులు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఏటీఎం కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. - రోడ్డుపై వాహనాలు నిలిచిపోతే వాటిని పక్కన నిలపడానికి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. -
ఆర్ఆర్ఆర్కు వైఎస్ హయాంలోనే రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను అభివృద్ధి ప్రణాళికలో భాగంగా తామే ఏర్పాటు చేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీజినల్ రింగు రోడ్డు ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిదని అన్నారు. వైఎస్ హయాంలోనే సంగారెడ్డి–షాద్నగర్, షాద్నగర్–చౌటుప్పల్, చౌటుప్పల్–భువనగిరి, భువనగిరి–తూప్రాన్, తూప్రాన్–సంగారెడ్డి వరకు జైకా నిధులతో ఐదు దశల్లో ఈ రోడ్డుకు అనుమతులు వచ్చాయన్నారు. సంగారెడ్డి–షాద్నగర్ వరకు రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల జరిగితే, తామేదో ఉద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం బడాయికి పోవడం విడ్డూరమన్నారు. -
6 నెలల్లో..రీజనల్ రింగ్ రోడ్డు!
♦ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు ♦ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తప్పనిసరి.. ♦ అనుమతి కోసం రోడ్లు భవనాల శాఖ నిరీక్షణ ♦ 285 కి.మీ. మార్గంలో రూ.5 వేల కోట్లతో నిర్మాణం అలైన్మెంట్ ఖరారు: ఆర్అండ్బీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల మరో మణిహారం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పనులపై కదలిక వచ్చింది. సుమారు 285 కి.మీ. మార్గంలో నాలుగు వరుసల్లో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి అవసరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆ శాఖ అనుమతి, మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆర్అండ్బీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చౌటుప్పల్, సంగారెడ్డి, షాద్నగర్, కంది తదితర ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రీజినల్ రింగ్ రోడ్డు.. ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయనుంది. ఆర్ఆర్ఆర్తో ఆయా ప్రాంతాల్లో రవాణా, వాణిజ్య, విద్య, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో నగరంలోని పది ప్రధాన రహదారులు అనుసంధానం కానుండటం విశేషం. ఇదీ రీజినల్ రింగ్రోడ్డు ప్రతిపాదన.. 152 కి.మీ. సంగారెడ్డి–నర్సాపూర్–తూ్రప్రాన్– గజ్వేల్–జగదేవ్పూర్– భువనగిరి–చౌటుప్పల్ 133 కి.మీ. చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం– ఆమన్గల్–షాద్నగర్–చేవెళ్ల– శంకర్పల్లి–కంది అలైన్మెంట్, భూసేకరణే కీలకం.. రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలంటే తుది అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ కోట్లకు చేరుకోవడంతో నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించడం వ్యయ ప్రయాసలతో కూడినదని రోడ్లు, భవనాల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పక్షంలో కన్సల్టెన్సీని నియమించి డీపీఆర్ను సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులను త్వరితగతిన చేపడతామని పేర్కొంటున్నాయి. తుది అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెపుతున్నాయి. షాద్నగర్–కంది మార్గంలో ఇప్పటికే నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉందని.. ఈ మార్గంలో రహదారిని మరింత విస్తరించాలా? వద్దా? అన్న అంశాలపైనా కసరత్తు చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రాష్ట్ర రహదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి. ఇప్పటికే సంగారెడ్డి–చౌటుప్పల్ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు వివరించాయి. -
రెండేళ్లలో రీజినల్ 'రింగ్'
-
రెండేళ్లలో రీజినల్ 'రింగ్'
⇒ భూసేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం ⇒ ‘ఔటర్’ అవతల 330 కి.మీ. మేర నిర్మాణం ⇒ డీపీఆర్లలో జాప్యం లేకుండా చూడండి ⇒ రహదారులపై ప్రాణనష్టం కలచివేస్తోంది ⇒ రోడ్ల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం అవసరం ⇒ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ఎలా ఉండాలో ⇒ విజన్ డాక్యుమెంట్ రూపొందించండి ⇒ యూరప్, అమెరికాలోని రోడ్లను పరిశీలించాలని ఆదేశం ⇒ జాతీయ రహదారులపై గడ్కారీని కలవాలని నిర్ణయం 40 నుంచి 50 కి.మీ. దూరంలో నగరం చుట్టూ వివిధ రహదారులపై ఉన్న ఈ పట్టణాలను అనుసంధానిస్తూ రీజినల్ రింగ్రోడ్డును ప్రతిపాదించారు. 1. చౌటుప్పల్ 2. భువనగిరి 3. ములుగు 4. తూప్రాన్ 5. నర్సాపూర్ 6. సంగారెడ్డి 7. శంకర్పల్లి 8. చేవెళ్ల 9. షాబాద్ 10. షాద్నగర్ 11. కందుకూరు 12. గున్గల్ సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 330 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. డీపీఆర్ల తయారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చాలా పనుల్లో డీపీఆర్ల పేరుతో ఎడతెగని జాప్యం జరుగుతోందని, అవసరమైతే పనులను ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి సత్వరమే డీపీఆర్లు రూపొందించాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, ఆ శాఖ ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది చనిపోవటం కలచివేస్తోందని, దీన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ‘‘భవిష్యత్తులో మన రోడ్లు ప్రమాదరహితంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పదేళ్ల తర్వాత తెలంగాణ రోడ్ నెట్వర్క్ ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిందేంటి? తదితర వివరాలతో ఓ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయండి. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే నెంబర్ వన్ రోడ్నెట్వర్క్ తెలంగాణలో ఉండాలి’’ అని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చే పదేళ్ల తర్వాత ఎలా ఉండాలన్న అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. రోడ్లు పది కాలాలపాటు మన్నేలా ఉండాలి భారీ వర్షాలకు రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయని, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని పదికాలాల పాటు మన్నేలా రహదారులు ఉండేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇది యావత్ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, విస్తరణ, మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కేంద్రం నుంచి కూడా 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని చెప్పారు. వర్షం వస్తే రోడ్లు ఎక్కువగా పాడవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక విధానాలు అనుసరించాలన్నారు. ఇందుకు ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అమెరికా, యూరప్ దేశాల్లో రోడ్లు బాగుంటాయని, ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఎక్కడెక్కడ ఆర్వోబీలు, ఆర్యూబీలు, అండర్పాస్లు అవసరం? నదులు, వాగులపై ఎక్కడ వంతెనలు, కాజ్వేలు అవసరమో కూడా విజన్ డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు. రోడ్లపై మలుపులు తక్కువగా ఉండాలి ప్రమాదాల నివారణకు రోడ్లపై మలుపులు తక్కువగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పట్టణాలు, పెద్ద గ్రామాల మీదుగా జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లు సాగకుండా బైపాస్లు నిర్మించాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన ప్రాంతాల్లో ఐలాండ్స్ నిర్మించి పక్కాగా నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై గడ్కరీతో మాట్లాడదాం ఇటీవలే తెలంగాణకు కేంద్రం 2500 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ మేరకు అధికారిక పత్రాలు అందలేదు. రెండుమూడు పర్యాయాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ అధికారులతో మాట్లాడినా ఫలితం లేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్... వెంటనే ఢిల్లీకి వెళ్లి స్వయంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవాలని నిర్ణయించారు. దానిపై చర్చించేందుకే మంగళవారం ఈ సమీక్ష ఏర్పాటు చేయటం విశేషం. వీలైతే వచ్చేనెల మొదటివారంలో ఢిల్లీ పర్యటన ఉంటుందని, ఆ లోపు గడ్కరీతో మాట్లాడి భేటీకి ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్య కార్యదర్శి నర్సింగరావును సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన కేంద్రమంత్రి కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి డబుల్ రోడ్లను సుందరంగా నిర్మిస్తుంటే.. జాతీయ రహదారులు నెలల తరబడి గుంతలో ఉండాల్సిన పరిస్థితి సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంజూరైన జాతీయ రహదారులను వెంటనే అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆ దిశగా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. అలాగే ఇతర పథకాల కింద రోడ్ల కోసం కేంద్రం నుంచి ఈ సంవత్సరం అదనంగా రూ.వెయ్యి కోట్లు సాధించాలన్నారు. -
300 కి.మీ. మేర రీజినల్ రింగ్రోడ్డు
రూ. 6 వేల కోట్లతో ‘ఔటర్’ వెలుపల నిర్మాణం - జాతీయ రహదారిగా నిర్మాణానికి కేంద్రం అంగీకారం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)... రూ. 6,696 కోట్ల వ్యయంతో 158 కిలోమీటర్ల మేర రూపుదిద్దుకున్న దేశంలోనే అతి పొడవైన తొలి ఎనిమిది వరుసల ఎక్స్ప్రెస్వే. తాజాగా దీని వెలుపల భారీ రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. దాదాపు 300 కిలోమీటర్ల మేర నాలుగు వరసలతో నిర్మితమయ్యే దీని నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించనున్న ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల విభాగం నిర్మించనుండటం విశేషం. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో సిద్ధం చేసి కేంద్రానికి పంపనుంది. దాని ఆధారంగా జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేపట్టి రోడ్డు డిజైన్ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చిక్కులకు చెక్... హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ చిక్కులూ అంతే వేగంగా పెరుగుతున్నాయి. నగరం వెలుపల కూడా రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుండటంతో వాహనాల వేగం మందగిస్తోంది. దీనికి పరిష్కారంగా రీజినల్ రింగురోడ్డు నిర్మాణం కానుంది. పైగా ఇది జాతీయ రహదారి కానున్నందున జాతీయ రోడ్ కాంగ్రెస్ విధానాలతో రూపుదిద్దుకోనుంది. ప్రమాదాలను వీలైనంత తగ్గించేలా డిజైన్ ఉండనుండటంతోపాటు నగరం వెలుపల ఉన్న 12 పట్టణాలను అనుసంధానిస్తూనే వాహనాలు వేగంగా వెళ్లేలా రూపుదిద్దుకోనుంది. దీంతో ఔటర్ రింగురోడ్డు వరకు రావాల్సిన అవసరం లేకుండానే ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు రీజినల్ రింగురోడ్డు మీదుగా గమ్యం వైపు దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. అనుసంధానమయ్యే ప్రాంతాలివే... నల్లగొండ జిల్లాలోని భువనగిరి-చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం-మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్-షాద్నగర్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల-మెదక్ జిల్లా కంది-సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-జగదేవ్పూర్ నుంచి తిరిగి భువనగిరికి అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం జరగనుంది. నిర్మాణం, నిర్వహణ కేంద్రానిదే... ఔటర్ రింగురోడ్డు వెలుపల రీజినల్ రింగురోడ్డు అవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ బాధ్యతను కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు. దీనిపై వారం క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఫోన్లో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కిలోమీటర్కు దాదాపు రూ. 15 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొదలు, భూసేకరణకు అవసరమయ్యే దాదాపు రూ. 1,500 కోట్ల ఖర్చు సహా భవిష్యత్తులో రోడ్డు నిర్వహణ వ్యయమంతా కేంద్రమే చూసుకోనుంది. ఈ అంశంపై రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ వినోద్ కుమార్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై చర్చించారు. వెంటనే ఆయన పచ్చజెండా ఊపటంతో తెలంగాణకు భారీ ప్రాజెక్టు మంజూరైనట్టయింది. మరో 650 కి.మీ. జాతీయ రహదారులకు కేంద్రం ఓకే సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మరో 650 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదన లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. మంత్రి తుమ్మల, ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం గడ్కరీతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని తుమ్మల మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన హరిత రహదారుల పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి రూ. 1,153 కోట్లతో ప్రతిపాదనలు సమర్పిం చినట్టు తుమ్మల చెప్పారు. కేంద్ర రహదారుల నిధుల కింద రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయడానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా అదుకుంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలివే.. - సంగారెడ్డి-నరసాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగ్దేవ్పూర్-భువనగిరి-చౌటుప్పల్లను కలుపుతూ 140 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారిగా విస్తరణ. - చౌటుప్పల్-ఇబ్రహీంపట్నం-ఆమన్గల్-షాద్నగర్- శంకర్పల్లి-కందీలను కలుపుతూ 160 కి.మీ, విస్తరణ. - మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తిలను కలుపుతూ 130 కి.మీ. - హైదరాబాద్ ఓఆర్ఆర్-వలిగొండ- తొర్రూరు-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లందు- కొత్తగూడెంలను కలుపుతూ 220 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా విస్తరణ. -
ఔటర్ చుట్టూ ఆర్ఆర్ఆర్
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ అదనంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. దీనిపై హెచ్ఎండీఏ చేసిన ప్రతిపాదనలకు సంస్థ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం హెచ్ఎండీఏ ఆరో బోర్డు సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. భేటీలో బోర్డు తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో మంత్రి ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుకు ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో త్వరలో జరిగే బోర్డు భేటీలో నిర్ణయిస్తామన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో శాశ్వత మాస్టర్ప్లాన్ను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తామని, ఇందుకోసం శాటిలైట్ ఇమేజ్ని వాడుకుంటామని చెప్పారు. పలురకాలుగా ఉన్న ఎంసీహెచ్, హుడా, హడా, సీడీఏ మాస్టర్ప్లాన్లతో గందరగోళం నెలకొన్నందున ఈ ఐదు ప్లాన్లను కలిపి కొత్త మాస్టర్ప్లాన్ తీసుకొస్తామన్నారు. దీనిపై అధ్యయనం చేసి వచ్చే బోర్డు సమావేశంలో స్పష్టమైన ఆలోచనలు తెలపాలని అధికార్లకు సూచించామన్నారు. కంటోన్మెంట్ భూభాగాన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి చెప్పారు. అయితే బోర్డును మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘నగరం నడి బొడ్డునున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ పరిధిలో లేకపోవడం వెలితిగా ఉంది. అందుకే సీఎం సూచనల మేరకు కంటోన్మెంట్, ఆ బోర్డు పరిధిలో ప్రణాళికలు రూపొందించి సౌకర్యాలు కల్పిం చాల్సిన అవసరముంది. ఇందుకు బోర్డు సహకారాన్ని కోరతాం’’ అని వివరించారు. 30 రోజుల్లో హెచ్ఎండీఏ అనుమతులు హెచ్ఎండీఏ పరిధిలో త్వరలో ఆన్లైన్ అనుమతుల విధానం తెస్తామని కేటీఆర్ వెల్లడించారు. ‘‘కేవలం 30 రోజుల్లో అనుమతులిస్తాం. అప్పట్లోగా అనుమతి రాకుంటే, 31వ రోజు అనుమతి లభించినట్టే భావించాలి. ప్రజలు లంచాలివ్వకుండా అనుమతులు పొందాలన్న సీఎం నిర్దేశం మేరకు ఈ ఆన్లైన్ అనుమతులను తేనున్నాం. ఇందుకు ప్రజలు అలవాటు పడేలా పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అవసరమైతే మీ సేవ కేంద్రాలను కూడా భాగస్వాములను చేస్తాం’’ అని వివరించారు. ఔటర్ చుట్టూ 13 గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏకు మంత్రి సూచించారు. వాటినిప్పటికే గుర్తించామన్నా రు. ఆ కారిడార్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుంటుం దని, వాటికి అపారమైన పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. శాటిలైట్ టౌన్షిప్ల మాదిరిగా నగరాన్ని విస్తరించాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు జియోట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు. ఇష్టారాజ్యపు లే ఔట్లకు అడ్డుకట్ట హెచ్ఎండీఏ పరిధిలోని మణికొండ, నిజాంపేట, పుప్పాల్గూడ తదితర గ్రామ పంచాయతీల్లో ఇష్టారీతిన జరుగుతున్న లే ఔట్లు, బిల్డింగ్ అనుమతులకు అడ్డుకట్ట వేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఆయా గ్రామాల్లో లే ఔట్, బిల్డింగ్ అనుమతులిచ్చే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగిస్తాం. అయితే అనుమతుల ద్వారా వచ్చే ఆదాయ విషయంలో పంచాయతీలకు ఎలాంటి నష్టమూ కలిగించబోం. దాన్ని వాటికేబదలాయిస్తాం’’ అని చెప్పారు. 3,000 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే ఔట్లు ప్రైవేటు డెవలపర్లకు దీటుగా ఇక హెచ్ఎండీఏ కూడా లే ఔట్లు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. త్వరలో పారదర్శకంగా 2 వేల నుంచి 3 వేల ఎకరాల్లో లే ఔట్లు వేస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు ఆదాయపు పన్ను చెల్లించాలనడంలో అర్థం లేదన్నారు. హెచ్ఎండీఏ ఐటీ పన్నులు చెల్లించాల్సి రావడంపై సీఎం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మే కల్లా పూర్తవుతుందన్నారు. -
మాస్టర్ ప్లాన్ ఫ్లాప్
మహా బృహత్ ప్రణాళిక (మాస్టర్ప్లాన్) అమల్లోకి వచ్చి ఏడాది గడచినా... అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అరచేతిలో వైకుంఠం చూపిన సర్కార్.. అసలు దాని గురించే పట్టించుకోక పోవడం శివారు ప్రాంతాలకు శాపంగా మారింది. నగరం చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో పలు ప్రాంతాలను మాస్టర్ప్లాన్ పరిధిలో చేర్చడం వల్ల అక్కడి భూములు అమ్ముకోవాలన్నా... కొనాలన్నా నిబంధనలు అడ్డు వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు కనీసం మార్కింగ్ కూడా చేయకపోవడంతో ఆ రోడ్డులో తమ భూములు, ఇళ్లు ఏ మేరకు పోతున్నాయో కూడా గ్రామీణులకు తెలియని పరిస్థితి. రైల్ టెర్మినళ్లకు ఇంతవరకు రైల్వే శాఖ అసలు చర్యలే తీసుకోలేదు. మొత్తంగా మాస్టర్ ప్లాన్ కాస్త ఫ్లాప్గా మారింది. ఈ ప్లాన్ అమల్లోకి రావడంతో తమ ఆస్తులు తమకు కాకుండా పోయాయంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ప్రణాళిక పేరుతో కొత్త ఆంక్షలు విధించి తమను బికారులుగా మార్చారని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల వేళ నాయకులు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారో... చూస్తామంటూ శివారు ప్రాంత ప్రజలు శివాలెత్తుతున్నారు. అదిగో అభివృద్ధి... ఇదిగో ఉపాధి అంటూ ఆశలు రేకెత్తించిన అభివృద్ధి ప్రణాళికే (మాస్టర్ప్లాన్) ఇప్పుడు ‘ప్రజా ఎజెండా’గా మారింది. హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంత మాస్టర్ప్లాన్ పరిస్థితి ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది. దేశంలోనే ఇది అతిపెద్దబృహత్ ప్రణాళికగా చెప్పుకోవడం మినహా ఇంతవరకు దీని వల్ల ఒరిగిందేమీ లేదు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని 35 మండలాల్లో 849 గ్రామాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల 5985 చ.కి.మీ. మేర మహా నగరాభివద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి విస్తరించింది. ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించి ప్లాన్లో పొందుపర్చారు. అయితే... భవిష్యత్ నగరానికి దిక్సూచిగా నిలవాల్సిన మాస్టర్ప్లాన్ పాలకుల చేతగానితనం వల్ల ఇప్పుడు పేపర్ ప్లాన్గా మారింది. రేపటి తరానికి భవిష్యత్నేప్రశ్నార్థకం చేస్తూ మౌలిక వసతుల్లో మరింత సమస్యలు పెరిగేందుకు హేతువుగా మారింది. అభివృద్ధి జాడేదీ? భవిష్యత్ అభివృద్ధి ప్రాంతంగా గుర్తిస్తూ ఔటర్ రింగ్రోడ్డు గ్రోత్ కారిడార్కు, దానికి ఆనుకొని ఉన్న వివిధ ప్రాంతాలను కలుపుకొని రెసిడెన్షియల్ జోన్-1 కేటగిరీగా ప్రణాళికలో పొందుపర్చారు. అయితే... ఇంతవరకు అక్కడ అభివద్ధి ఛాయలు కన్పించట్లేదు. అలాగే మాస్టర్ప్లాన్లో శాటిలైట్ టౌన్షిప్లుగా 13 అర్బన్ నోడ్స్ను రెసిడెన్షియల్ జోన్-2 కేటగిరీ కింద గుర్తించారు. వాటి అభివద్ధికి సంబంధించి అతీగతీ లేదు. ఇక్కడ అంతర్గత రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సరఫరా వ్యవస్థ, పార్కులు, ప్లే గ్రౌండ్స్ వంటి వాటి అభివృద్ధికి ఇప్పటికే బీజం పడాలి. కానీ సర్కార్ నిధులివ్వక పోవడంతో వీటి గురించి కనీసం అధ్యయనం కూడా సాగలేదు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 46 అర్బన్ సెంటర్స్ను గుర్తించారు. ప్రస్తుతం గ్రామ ప్రాంతాలుగా ఉన్న వీటిని అభివృద్ధి చేసి జనాభా కోర్ ఏరియాకు వలసలు పోకుండా చేయాలని భావించారు. అదీ జరగలేదు. మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించిన పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోవడంతో నగరంలోని పరిశ్రమలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఔటర్ బయటకు వెళ్లలేదు. ఈ పారిశ్రామిక వాడల అభివృద్ధి బాధ్యతను ఏపీఐఐసీ తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నిధుల కోసం ఏపీఐఐసీ కూడా సర్కార్ వైపు చూస్తుండటంతో పరిశ్రమలు నగరం వెలుపలికి తరలించే అంశం కార్యరూపం దాల్చలేదు. నరంలో కాలుష్య భూతం ఎప్పటిలాగే కరవాలాన్ని తిప్పుతూ ప్రజా ఆరోగ్యాన్ని హరిస్తోంది. ఆ రోడ్డు పేపర్ల పైనే... ఔటర్ రింగ్రోడ్డుకు అవతల ప్రతిపాదించిన రీజినల్ రింగ్రోడ్డు ఫైళ్లకే పరిమితమైంది. జాతీయ రహదారి తరహాలో 90 మీటర్ల వెడల్పు, 285 కి.మీ. నిడివితో రీజనల్ రింగ్రోడ్డును నిర్మించాలన్న యోచన కాగితాల్లోనే మగ్గుతోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆర్ అండ్ బి రోడ్లనే ఒకదానికొకటి లింక్ కలుపుతూ రీజనల్ రింగ్రోడ్డు నిర్మించాలనుకున్నారు. కానీ ఈ విషయమై కనీసం సర్వే కూడా జరిపించక పోవడం సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రోడ్డు కోసం కనీసం మార్కింగ్ చేసినా... ఆయా ప్రాంతాల్లో భూములు అమ్మేవారికి , కొనేవారికి కొంత స్పష్టత ఉండేది. ఇప్పుడు ఎటూ కాకుండా పోయామంటూ గ్రామీణులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే భారీ వాహనాలకు పార్కింగ్ ఇతర సదుపాయాల కోసం పన్నెండు ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి కనీసంగానైనా స్పందన లేదు. ఫలితంగా నగరంపై ఒత్తిడి యథావిధిగానే ఉంది. నిధుల్లేని ప్రణాళిక మహా ప్రణాళిక అమలుకు సుమారు రూ. లక్ష కోట్ల నిధులు అవసరమని నిపుణుల ప్రాథమిక అంచనా. కానీ సర్కార్ దీని కోసం రూపాయి కూడా విదల్చలేదు. మాస్టర్ప్లాన్ అమలుకు ఏటా రూ.30వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం అవసరం. నిజానికి ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయా..? లేక ఆర్ అండ్ బి భరిస్తుందా? హెచ్ఎండీఏ లేదా స్థానిక సంస్థలు సర్దుబాటు చేసుకొంటాయా? అన్నది నేటికీ స్పష్టత లేదు. మాస్టర్ప్లాన్ అమలుకు వివిధ శాఖల సమన్వయం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ లేకపోవడంతో నిధుల సేకరణ జరగట్లేదు. రోడ్లు-భవనాలు, పురపాలక, పంచాయతీరాజ్, రవాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో సాగితేనే మాస్టర్ప్లాన్ అమలు సాధ్యం. అయితే.. రాష్ట్ర విభజన జరగడంతో ఇక మొత్తం ప్రణాళికను పక్కన పడేసినట్లేనన్న వాదనలు విన్పిస్తున్నాయి.