Agriculture Market Committee
-
మార్కెట్ కమిటీలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పోస్టింగులు, బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సమర్థులైన అధికారులను ప్రభుత్వమే గుర్తించి అవసరమైనచోట వారి సేవలు ఉపయోగించుకుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా నిఘా యంత్రాంగం దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలని మంత్రులు,ఎమ్మెల్యేలతో అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని హితవు పలికారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. నిధుల ప్రాథమ్యాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు. -
పొలం నుంచి మార్కెట్కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నేటితో ‘వరంగల్’ పదవీకాలం ముగింపు! తదుపరి మరెవరికీ?
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్ల పదవీ కాలాన్ని నిర్ణయించారు. రిజర్వేషన్ ఇలా.. మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్కు చెందిన మంద వినోద్కుమార్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్గా పని చేశారు. మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్పర్సన్గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్పర్సన్గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు. మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్పర్సన్గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారైనా దక్కేనా? వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు. అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి. -
అద్దెకు మార్కెటింగ్ శాఖ గోడౌన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు. మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మార్కెట్ కమిటీలు కళకళ
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్తో గతేడాది ఆగస్టు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం తిరిగి మొదలయ్యా యి. దీంతో 8 నెలల పాటు ఆర్థిక ఇబ్బందులు పడి న మార్కెట్ కమిటీలు గాడిలో పడ్డాయి. మార్కెటింగ్ శాఖ అదీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 815 మంది రెగ్యులర్, 2,628 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతభత్యాల కింద ఏటా రూ.1. 22 కోట్లు ఖర్చవుతోంది. 2,478 మంది పింఛన్దారులు ఉండగా, వారికి ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ కమిటీలకు ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన నిధులతో మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 శాతం సెస్ వసూలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఆయా ఉత్పత్తుల విలువపై ఒక శాతం మొత్తాన్ని సెస్ రూపంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి. 2019–20లో రికార్డు స్థాయిలో 10,18,235.76 మెట్రిక్ టన్నుల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు మార్కెట్లోకి రాగా.. వాటి క్రయ విక్రయ లావాదేవీలపై మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.551.22 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ కారణంగా గతేడాది ఆగస్టు 20వ తేదీ నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 2019– 20తో పోల్చితే 2020–21లో ఏకంగా రూ.433.52 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ కోల్పోవాల్సి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం సాగడం తో సుప్రీంకోర్టు ఆ చట్టాల అమలుపై స్టే విధించిం ది. దీంతో సెస్ వసూళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 25నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు పునఃప్రారంభం కావడంతో రూ.వంద కోట్లకు పైగా సెస్ వసూలయినట్లు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తెరపడింది దాదాపు 8 నెలల పాటు మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం సెస్ వసూళ్లు ప్రారంభించారు. సీజన్ మొదలవడంతో మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
వ్యవసాయ మార్కెట్లోని సభలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
-
ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి. రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. సబ్సిడీతో ఊరట ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు షాక్ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది. -
మార్కెట్ ఇంటెలిజెన్స్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్తో.. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అగ్రికల్చర్ మిషన్ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం అగ్రిమిషన్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతు భరోసా ద్వారా వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు చెందిన రైతులు రైతు భరోసా కింద లబ్ధి పొందారని తెలిపారు. సుమారు రూ.5,185.35 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్షాపుల ఏర్పాటుపై సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వర్క్షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భూసార పరీక్షలు వర్క్షాపులోనే పెడుతున్నామని ఆయన తెలిపారు. నేచురల్ ఫార్మింగ్పై రైతులకు అవగాహన కల్పించి.. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ల సేవలను బాగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయదలచిన వర్క్షాపుల్లో వారి సేవలను వాడుకోవాలన్నారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్పై సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి జగన్మోహన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేరుశెనగ, మొక్కొజొన్నల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరలేని చిరుధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవడానికి.. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటింస్తుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల ధరల ప్రకటన త్వరలోనే చేయానున్నట్టు తెలిపారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా చూడటానికి అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని తెలిపారు. పంటలకు వణ్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని పాల్గొన్నారు. -
ఆదోని మార్కెట్కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
రైతుకు సెస్ పోటు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది. అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు, వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు. ఆర్ధిక సంవత్సరం వసూలు చేసిన ఫీజు 2014–15 రూ.27.42 కోట్లు 2015–16 రూ.21.07 కోట్లు 2016–17 రూ.21.00 కోట్లు 2017–18 రూ.18.76 కోట్లు 2018–19 రూ.19.71 కోట్లు ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్ ఫీజు మార్కెట్ కమిటీలు వసూలు చేసిన ఫీజు ఒంగోలు రూ.1.62 కోట్లు కందుకూరు రూ.1.42 కోట్లు మార్టూరు రూ.1.32 కోట్లు పర్చూరు రూ.2.30 కోట్లు దర్శి రూ.1.01 కోట్లు అద్దంకి రూ.1.76 కోట్లు చీరాల రూ.2.00 కోట్లు కొండపి రూ.3.24 కోట్లు మద్దిపాడు రూ.1.42 కోట్లు మార్కాపురం రూ.0.68 కోట్లు గిద్దలూరు రూ.0.76 కోట్లు పొదిలి రూ.0.21 కోట్లు ఎర్రగొండపాలెం రూ.0.98 కోట్లు కంభం రూ.0.54 కోట్లు -
ఇదేం చిత్రం సారూ..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు. ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
అక్టోబర్ 1 నాటికే సిద్ధం చేయండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను గతేడాదిలానే కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని, అక్టోబర్ 1 నాటికి వాటిని సిద్ధంగా ఉంచాలని అధికారులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పా రు. పత్తి మద్దతు ధరను కేంద్రం రూ.5,450గా ప్రకటించిన దృష్ట్యా బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదిలానే జిల్లా కలెక్టర్లు ప్రకటిం చిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర రూ.5,450గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మడానికి ఇష్టపడతారని చెప్పారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ లీజు విషయంలో ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి మిల్లుల అభ్యర్థనను లోతుగా పరిశీలించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మార్కెటింగ్ శాఖ తరçఫున ఎంఎస్పీ ఆపరేషన్కు అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి పాల్గొన్నారు. -
వ్యాపారులపై క్రిమినల్ కేసులు
ఖమ్మంవ్యవసాయం : ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా, ‘కమీషన్ వ్యాపారులు’గా, ‘ఖరీదుదారులు’గా చలామణవుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫిర్యాదుతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంతకాలం నుంచి అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మార్కెట్కు వచ్చిన రైతులకు మాయమాటలు చెప్పి, అధిక ధర పెట్టిస్తామంటూ బోల్తా కొట్టిస్తున్నారు. వారి పంటను కమీషన్ వ్యాపారుల ద్వారా ఖరీదుదారులకు చూపిస్తున్నారు. అడ్డగోలుగా కమీషన్లు దండుకుంటున్నారు. పంట విక్రయంలో వాస్తవానికి కమీషన్ వ్యాపారి మాత్రమే కమీషన్ తీసుకోవాలి. వీరు మాత్రం కమీషన్ వ్యాపారుల నుంచి, కొన్నిసార్లు ఖరీదుదారుల నుంచి కూడా (కమీషన్) దండుకుంటున్నారు. సాధారణంగా కమీషన్ రూపాయిన్నర నుంచి రెండ్రూపాయల వరకు ఉంది. వీరు మాత్రం రైతుల నుంచి ఐదారు రూపాయల కమీషన్ గుంజుతున్నారు. పంటను చూసినప్పుడు ఓ ధర నిర్ణయిస్తారు. కాంటాల సమయంలో తిరకాసు పెడతారు. సరుకు బాగా లేదంటారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటారు. తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ఒప్పుకోకపోతే.. తమకు అసలు ఆ సరుకు అవసరమే లేదంటూ మధ్యలోనే వెళ్లిపోయేవారు. మరో వ్యాపారి అటువైపు రాకుండా, ఆ సురుకును చూడకుండా ప్రయత్నించేవారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రైతులు... గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు అడిగిన రేటు/కమీషన్ ఇచ్చేవారు. రైతుల అనైకక్యత, వ్యాపారుల ఐక్యత/సిండికేట్ కారణంగా అధికారులు కూడా ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. గత ఏడాది ఈ మార్కెట్కు పర్సన్ ఇన్చార్జిగా అప్పటి జాయింట్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (ప్రస్తుతం, జనగాం కలెక్టర్) బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ అమలయింది. తమ అక్రమాలకు ఇది అడ్డుగా ఉండడంతో కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు. ఆ తరువాత, ఇందులోని లొసుగులను పట్టేసుకున్నారు. వాటి ద్వారా తమ అక్రమాలను కొనసాగించారు. మార్కెట్ ఫీజు చెల్లించని వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. వినయ్కృష్ణారెడ్డి బదిలీతో పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ నియమితులయ్యారు. మార్కెట్లో అక్రమాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కూడా సీరియస్గానే దృష్టి పెట్టింది. మార్కెట్కు దాదాపుగా 15లక్షల రూపాయల ఫీజు చెల్లించని ఇద్దరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిని గుర్తించే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే, లైసెన్సులకు సంబంధించి ఎటువంటి తాడు–బొంగరం లేని ఏడుగురు ‘వ్యాపారులు/ఖరీదుదారులు’ను గుర్తించారు. మార్కెట్ పర్సన్ ఇన్చార్జ్ (కలెక్టర్) లోకేష్కుమార్ ఆదేశాలతో ఆ ఏడుగురిపై ఖమ్మం మూడవ అదనపు మొదటి తరగతి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్కుమార్ తెలిపారు. వీరికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. మార్కెట్లో రైతులను మోసగించే, పంట దొంగలపై నిఘా పెంచినట్టు చెప్పారు. -
వ్యవసాయ మార్కెట్లలో ఈ–సేవలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్లలో ఇక నుంచి ఆన్లైన్ ద్వారా ఈ–సేవలను అందించేందుకు మార్కెటింగ్శాఖ నడుం బిగించింది. మార్కెట్లలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం, వేగం పెంచేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు మార్కెటింగ్శాఖ వర్గాలు తెలిపాయి. ఈ–సేవలకు సంబంధించి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందికి హైదరాబాద్లో శిక్షణ ఇచ్చా రు. వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. యాప్ ద్వారానే లైసెన్స్... వ్యాపారులకు లైసెన్స్లు, ఎగుమతుల పర్మిట్ల జారీ కోసం మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా ‘ఈ–సర్వీసెస్’ పేరుతో మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా రూ. 100 చెల్లిస్తే లైసెన్సు దరఖాస్తు తెరుచుకుంటుంది. దరఖాస్తును నింపి తిరిగి అప్లోడ్ చేసిన తర్వాత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈ దరఖాస్తు సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శి వద్దకు వెళుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్కు పంపుతారు. డైరెక్టర్ ఆమోదంతో మార్కెట్ కార్యదర్శి డిజిటల్ సంతకంతో కూడిన లైసెన్స్ సర్టిఫికేట్ను మంజూరు చేస్తారు. ఇలా ఆన్లైన్లోనే దరఖాస్తు ఆమోదం పొందటంతో సమయం, వ్యయం తగ్గుతుంది. అన్నీ ఆన్లైన్లోనే... కేవలం లైసెన్సులే కాకుండా కమీషన్ ఏజెంట్ లైసెన్సులు, మార్కెట్ ఫీజు వసూళ్లు, ఎగుమతుల పర్మిట్లు, రాస్తామాల్ వసూళ్లన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసే వీలుంటుంది. వ్యాపారి ఖరీదులు ఎంతుంటాయో అంత సరుకుకే ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ లభిస్తుంది. ఈ సేవలు అమలైతే చెక్పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. అలాగే క్యూఆర్ కోడ్తో కూడిన ఎగుమతుల పర్మిట్లు, చెక్పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. దీని వల్ల నకిలీ రశీదులను సృష్టించే అవకాశమే ఉండదు. మార్కెట్లో నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ తక్పట్టీల ద్వారా ఈ–సేవల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ఫీజు లెక్కిస్తారు. ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా ఖరీదులు చేసే వీలుంది. ఏ మార్కెట్లో ఖరీదు చేసినా ఆన్లైన్లో ఎక్కడ ఫీజు చెల్లించినా సదరు వ్యాపారి పేరిట మార్కెట్ ఫీజు ఆయా మార్కెట్ కమిటీలకే వెళుతుంది. మార్కెట్లలో ఈ–సేవలు ప్రారంభమైతే పారదర్శకత పెరుగుతుందని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక పంటల వారీ మార్కెట్ యార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో పచ్చిమిర్చి మార్కెట్ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్లోని గడ్డి అన్నారం మార్కెట్కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డ్ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్లో నిమ్మ మార్కెట్ను 9 ఎకరాల్లో మార్కెటింగ్శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్ ప్లా్లట్ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో పచ్చిమిర్చి మార్కెట్ను నెలకొల్పారు. జగిత్యాలలో మామిడి మార్కెట్కు ఏర్పాట్లు జగిత్యాలలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
చిరుద్యోగులపై వేటు
పులివెందుల : తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చేమాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను పెరికేసి వారి కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారు. పులివెందుల మార్కెట్ మార్డులో పదేళ్ల నుంచి పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ను ఉన్న పళంగా తొలగించారు. వీరందరూ గత పదేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ జీతాలు పొందుతూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ బంధువులను, అనుచరులను నియమించుకునేందుకు మార్కెట్ యార్డు చైర్మన్ పావులు కదిపారు. అందులో భాగంగా సెక్యూరిటీ గార్డులు రైతులతో కుమ్మక్కై మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారని.. అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీకి సక్రమంగా హాజరు కావడంలేదని సాకు చూపి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి 5మందిని తొలగించమని చైర్మన్ లేఖ రాశారు. మరుసటి రోజే వారి స్థానంలో తమ బంధువుల పేర్లు, అనుచరుల పేర్లు పెట్టి వారి స్థానంలో వీరిని నియమించాలని మరో లేఖ ఏజెన్సీకి రాసి వారి స్థానంలో తమ అనుచరులకు పోస్టింగ్లు ఇప్పించాడు. ఇంతకాలం పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. కోర్టును ఆశ్రయించిన బాధితులు తాము ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, కేవలం చైర్మన్ తన అనుచరులకు పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు చేయని తప్పులను సాకుగా చూపి తమను తొలగించారని కంప్యూటర్ ఆపరేటర్ పవన్కుమార్, సెక్యూరిటీ గార్డులు మహేశ్వరరెడ్డి, మహబూబ్ బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆవేదనను విన్న కోర్టు వెంటనే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని కొనసాగించాలని అగ్రికల్చర్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్కు, పులివెందుల మార్కెట్ కమిటీ సెక్రటరీకి, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు బేఖాతర్.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మార్కెట్ కమిటీ చైర్మన్ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు. బాధితులు కోర్టు ఆర్డర్ను తీసుకుని మార్కెట్ కమిటీ సెక్రటరీని కలవగా.. నా చేతుల్లో ఏమీ లేదన్నారు. మీరు ఏదైనా ఉంటే చైర్మన్తో చూసుకోండని సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ను బాధితులు కలవగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హుకుం జారీ చేశారని బాధితులు వాపోతున్నారు. మాజీ ఎంపీని కలిసిన బాధితులు :తమను అన్యాయంగా తొలగించడంపై బాధితులు గురువారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఉన్న ఫళంగా ఐదుగురిని తొలగించడం అన్యాయమన్నారు. వీరిని తొలగించడంతో వారి కుటుంబాల పోషణ కష్టతరమైందన్నారు. తన అనుచరులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు వీరి కుటుంబాలకు అన్యాయం చేయడం తగదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా ఇచ్చారు. సిబ్బంది తొలగింపుతో మాకు సంబంధంలేదు: మార్కెట్ కమిటీ సెక్రటరీ మార్కెట్ యార్డులో సిబ్బంది తొలగింపు విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నంరాజును వివరణ కోరగా వారి ఉద్యోగాల విషయంలో తమకు సంబంధం ఉండదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం పొందడంతో వారి వద్దే ఏదైనా ఉంటే చూసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తమ శాఖ తరపున హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. -
ధర తగ్గించడంపై భగ్గుమన్న రైతు
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట పసుపును పోసి నిప్పంటించారు. మార్కెట్లో ఈ–నామ్ అమలవుతుండగా పుసుపునకు ఆన్లైన్లో టెండర్ల తర్వాత అధికారులు రైతులకు ధర తెలియజేయలేదు. ఆన్లైన్ టెండర్ వేసిన వ్యాపారుల్లో కొందరు కాంటాలు పెట్టుకోవడానికి వెళ్లలేదు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపుకాశారు. ఆ తర్వాత ఓ వ్యాపారి పసుపురాశుల వద్దకు వెళ్లి క్వింటాల్కు రూ.5 వేలు ధర పెడతానంటూ కొంతమంది రైతుల లాట్ నంబర్ చీటీలపై రాశాడు. ఆన్లైన్లో రూ.6 వేలు ధర పడగా రూ.వెయ్యి తగ్గించడంతో ఆగ్రహించారు. దీంతో వారు కొంత పసుపును మార్కెట్ ఎదుట పోసి నిప్పంటించి కాలబెట్టారు. -
మధుర ఫలంపై విష పంజా
నక్కపల్లి(పాయకరావుపేట): మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచే విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ సీఎం నాయడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వేంపాడు, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మామిడి యార్డుల్లో మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిళ్లు సేకరించిన అధికారులు చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్ ఫ్రూట్స్, వీఈఆర్ అండ్ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు. 24 గంటల్లోనేమగ్గించేసి... ఏటా మార్చి నుంచి జూన్ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇలా నిబందనలకు విరుద్దంగా రసాయానాలను స్ప్రేచేసి మామిడి పండ్లను మగ్గిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అ«ధికారులు దాడులు నిర్వహించారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం. రోజూ వంద టన్నులకుపైనే ఎగుమతి నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్గేట్ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. -
మార్క్ ఫెడ్ అధికారుల తీరుపై శిల్పాచక్రపాణి ఆగ్రహం
-
నాకు చావే గతి
కేసముద్రం (మహబూబాబాద్): మార్కెట్లో 10 రోజులుగా పడిగాపులు పడుతున్న ఓ మక్క రైతు ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు రాజ్యానాయక్ తను పండించిన 170 బస్తాల మక్కలను మార్కెట్కు తీసుకొచ్చాడు. 10 రోజులు గడుస్తున్నా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం బలరాం నాయక్, జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం మార్కెట్ను సందర్శించింది. యార్డులో రాశులను పరిశీలిస్తూ రైతు రాజ్యానాయక్ వద్దకు రాగా, అతడు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యాడు. తనకు చావే గతి అంటూ కండువాను మెడకు బిగించుకోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా స్పృహతప్పి మక్కలరాశిపైనే పడిపోయాడు. కంగుతిన్న కాంగ్రెస్ నేతలు, సిబ్బంది అతడి మెడకున్న కండువాను తొలగించి.. నీళ్లు చల్లి లేపారు. ఆ తర్వాత సీఈవో మల్లారెడ్డిని పిలిపించి ప్రశ్నించడంతో, ఆ మక్కలను ఎంపిక చేసి చిట్టీ ఇచ్చాడు. -
రాష్ట్రంలో ప్రచండ గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: పట్టపగలే కారుమబ్బులు.. వందల ఏళ్లనాటి వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేసే ప్రచండ గాలులు.. ఉరుము లేని పిడుగులా కాలం కాని కాలంలో కుండపోత! గురువారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైంది. చాలాచోట్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి నేలరాలింది. గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం, పిడుగుల ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు, నాగర్కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ అతలాకుతలం వర్షానికి వరంగల్ అతలాకుతలమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలుమార్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. 163 జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో కరెంటు వైర్లపై గాలికి కొట్టుకువచ్చిన రేకులు, ఫ్లెక్సీలు పడ్డాయి. దీంతో నిప్పులు చెలరేగాయి. చెట్టు కూలి పడడంతో స్టేషన్లో సిగ్నలింగ్ గది కూలిపోయింది. దీంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో సుమారు ఐదు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో టూరిస్టు బస్సుపై పిడుగు పడటంతో బస్సు అద్దాలు పగిలాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలో రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైతుల కష్టం వర్షార్పణం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, జీసీసీ కేంద్రాలకు తెచ్చారు. కొనుగోలు ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడంతో అన్నిచోట్ల ఆరు బయటే ధాన్యం ఆరబోశారు. చాలినన్ని టార్ఫాలిన్ కవర్లు లేవు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. చాలాచోట్ల వరదలో కొట్టుకుపోయింది. ఏనుమాముల మార్కెట్లో భారీ షెడ్డు కూలిపోవడంతో ఆరబోసిన మక్కలు తడిశాయి. పైకప్పు కూలే సమయంలో రైతులు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్క ఈ మార్కెట్లోనే పది వేల మిర్చి బస్తాలు తడిశాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో మక్కలు, వడ్లు కలిపి సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, మాడ్గుల, షాబాద్ తదితర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల, మోమిన్పేట, దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3,500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో ఆరపోసిన 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల వరి ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లిలో మామిడి రైతులు నష్టపోయారు. నల్లగొండ మార్కెట్లో కాంటా వేసిన ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 55,000 వరి ధాన్యం బస్తాలు తడిశాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో గాలివాన ధాటికి కూలిన షెడ్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్ఫెడ్, వేర్హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
వందల క్వింటాళ్లు వర్షార్పణం
బూర్గంపాడు/ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడ/సంగెం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిశాయి. 100 లారీ ల ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు తేగా.. వర్షం కురిసే సమయంలో రైతులు కొంతమేర పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మిగతా 60 లారీల లోడ్లకు సరిపోయే ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడిన కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 బస్తాల ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని, వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కొత్తగూడ, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, సంగెం మండలాల్లో వర్షం కురిసింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన మక్కలు, పసుపు మార్కెట్లలో తడిసిపోయాయి. -
ఇదేం బంగారు తెలంగాణ ?
సత్తుపల్లి: ‘రైతే రాజు అంటారు.. రైతు లేనిదే ప్రభుత్వం లేదంటారు.. రైతు పంటలను కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.. ఇదెక్కడి బంగారు తెలంగాణ’ అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు రాజుల కాలం తరహాలో మారువేషాలతో తిరిగితే రైతుల బాధలు ఏంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లు ఖర్చు పెట్టి గోదాంలు నిర్మించింది రైతుల కోసం కాదా..? రైతుల పంటలను ఆరుబయట నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.. పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మొక్కజొన్న అమ్మిన తర్వాత కూడా బస్తాలకు కాపలా రైతులే ఉండాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి కాంటా వేయకపోతే రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని.. మంచినీరు, భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రైతులను అవమానించే రీతిలో మట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డు దుస్థితిని మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీఎం, సీఎండీకి ధన్యవాదాలు.. సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పలు ఇళ్లకు బాంబ్ బ్లాస్టింగ్తో పగుళ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చర్యలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సుధాకర్రెడ్డి అన్నారు. సింగరేణి నిధులను బాధిత గ్రామాలలో ఖర్చు చేయాలని, డిస్పెన్సరీ, సీసీరోడ్లు, మంచినీరు ఇవ్వాలని, పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు పెంచాలని కోరారు. ఆయన వెంట కట్ల రంగారావు, రామిశెట్టి సుబ్బారావు ఉన్నారు. కడియం.. నీ బాగోతం బయటపెడతాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. కడియం ఆ మాటలు చెప్పిన బహిరంగ సభలోనే.. అదే మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు చేసిన పనికి సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వెళితే ఖర్చు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో అక్రమాలు, కార్పొరేట్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తానే స్వయంగా వచ్చి అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, మంత్రి కడియం శ్రీహరి బాగోతాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో మూడు శాతం పర్సంటేజీలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ చెప్పినట్లు స్వయంగా మున్సిపల్ చైర్మన్ చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దందా చేస్తోందని, పినపాకలో గోదావరిలోనే రోడ్డు వేశారంటే ఇసుక మాఫియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. -
పదవులు.. అలకలు
జిల్లా టీడీపీలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సీనియర్లకు తగిన గుర్తింపు రావడం లేదని ఆయా వర్గాలు రగిలిపోతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జిల్లాలో మార్కెట్ యార్డు పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఛాన్స్ దక్కకపోవడంతో టీడీపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీడీ చైర్మన్ పదవిని ఆశించగా కేవలం మెంబర్తో సరిపెట్టడం ఆ వర్గాన్ని తీవ్ర అసహనానికి గురి చేసింది. సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వ్యవధిలో జిల్లాలో సీనియర్ తలకు పదవులు ఇవ్వకుండా విస్మరించడంపై వారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. కొందరు తూతూమంత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మరి కొందరు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి పదవులను ఆశించిన అనేక మంది ద్వితీయ శ్రేణి సీనియర్ టీడీపీ నేతలు తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ ముఖ్యనేతల వద్ద ప్రస్తావించి తమ ఆవేదనను వెళ్ళగక్కగా మరికొందరు తమ వర్గీయులతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం జిల్లా టీడీపీలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సీనియర్లను సైతం పక్కన పెడుతున్నారని ఇతర సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఐదు సార్లు లోక్సభకు, ఒక సారి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు టీటీడీ చైర్మన్ పోస్టు కావాలని అడగ్గా.. కేవలం బోర్డు మెంబర్గా నియమించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా ఉన్న మన్నవ సుబ్బారావు పదవీ కాలం ముగిసినప్పటికీ రెండు సార్లు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారే తప్ప.. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వెన్నా సాంబశివారెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకుని కుటుంబ పరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన సాంబశివారెడ్డిని అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం తగదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులను నిలదీస్తున్న వైనం మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవిని నిలదీసిన విషయం తెలిసిందే. అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని నియమించి కోడెల తనయుడు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటూ ఆ పార్టీ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డితోపాటు పలువురు అసమ్మతి నేతలు నిరాహార దీక్షకు దిగారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై పార్టీలో అసమ్మతి పెరిగిపోతుందనే సంకేతాలు వస్తుండటంతో ఆ పార్టీ ముఖ్యనేతల గుండెల్లో కలవరం మొదలైంది. -
టీడీపీ నేతల హల్చల్
విజయవాడ : గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతించకున్నా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై రామవరప్పాడు రింగ్ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నగరంలోని బెంజి సర్కిల్, ఐదో నంబర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహన చోదకులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేకున్నా ప్రజలకు ఇబ్బంది కల్గించే విధంగా టీడీపీ కార్యకర్తలు ఎన్హెచ్పై నానా హంగామా చేశారు. బైక్లకు సైలైన్సర్లు ఊడపీకి ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపై స్వైర విహారం చేశారు. ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు మీదుగా సాగిన ర్యాలీలో యువకులు బైక్లపై భీతావహం సృష్టించారు. రోడ్లపై వెళ్లే ఇతర వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా పోలీసు ఉన్నతాధికారులు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. కలకలం రేపిన పోస్టర్లు.. గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) కబ్జాలు చేశారని కరపత్రాలు ముద్రించి గోడలకు అంటించారు. ఆయన ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం సాయంత్రం తరలి వెళుతుండగా ఉదయం పూట ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడులో కరపత్రాలు గోడలకు అంటించి ఉన్నాయి. కరపత్రాలు, పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కబ్జాకోరుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇవ్వటం దురదృష్టకరమని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కరపత్రాలపై కోట్లుపై నమోదైన క్రిమినల్ కేసులు క్రైమ్ నంబర్లతో సహా ప్రచురించి అవి విచారణలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై 6 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నట్లు అందులో వివరించారు. ♦ విజయవాడ 8వ నెంబర్ కోర్టులో కోట్లుపై క్రిమినల్ కేసు రివిజన్ పిటీషన్ నెం.85/2015లో విచారణ ఎదుర్కొంటున్నారు. ♦ రామవరప్పాడులో పాపయ్య డొంక రోడ్డులో సర్వే నెంబర్93/1, 93/సిలోని 1.56 ఎకరాల స్థలం తన అనుచరులతో దౌర్జన్యంగా కబ్జా చేసినట్లు ఆరోపించారు. ♦ కోట్లు అనుచరులు నున్న, సూరంపల్లి, ఆగిరపల్లి, మర్లపాలెం, ప్రసాదంపాడులో కబ్జాలకు పాల్పడినట్లు ఆ కరపత్రంలో పేర్కొన్నారు. -
కందుల కొనుగోళ్లతో వెయ్యి కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. బుధ వారం శాసన మండలి ఆవరణలో ఆయన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. కందుల సేకరణలో కేంద్ర వైఖరి తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టకరమని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాసినా.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. రూ.410 కోట్ల విలువ చేసే 75,300 టన్నుల కంది సేకరణకే కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.5,450 చొప్పున 1.84 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడిందని చెప్పారు. రైతులకు నాఫెడ్ నుంచి రూ.183.86 కోట్లు, మార్క్ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ.52.46 కోట్లు రావాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనగ కొనుగోళ్లు ముమ్మరం.. శనగ కొనుగోళ్లు, చెల్లింపులపైనా హరీశ్రావు సమీక్షించారు. 50 వేల టన్నుల శనగ సేకరణకు కేంద్రం అనుమతించిందని.. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల టన్నుల శనగలను నాఫెడ్ కొనుగోలు చేసిం దన్నారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డు లేక రైతుల విలవిల
ఆళ్లపల్లి : ప్రవేట్ దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో పండించిన పంటలకు మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తుందనుకుంటే అతి తక్కువ రోజులు మార్కెట్ యార్డులను కేటాయించి, రైతులకు సమాచారం అందే లోపే మార్కెట్ యార్డులను మూసివేయడం ద్వారా మండలానికి సంబంధించిన కందులను పండించిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఎంతో కష్టంతో ఆరుగాలం పండించిన పంట అటు మార్కెట్ యార్డులు మూసివేయడంతో ఇంట్లో నిల్వ ఉన్న కందులను ప్రవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట అతి తక్కువ ధరలకు దళారులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని,ఎలాగైనా ప్రభుత్వం మార్కెట్ యార్డులను తెరిపించి మమ్ములను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. –గొగ్గెల రమేష్,మైళారం మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలి మాకు సమాచారం అందేలోపే ప్రభుత్వం కేటాయించిన గడువు పూర్తి కావడంతో చాలా మనోవేధనకు గురయ్యానని,ఎలాగైనా మార్కెట్ యార్డులను పునఃప్రారంబించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. –గొగ్గెల సత్యనారాయణ,మైళారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..మండల వ్యవసాయాధికారి ఆర్.శంకర్ రైతుల సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్ యార్డును పునః ప్రారంభించాలాఆ కృషి చేస్తానని అన్నారు.పై అధికారుల నుంచిఆడర్ లేకుండా నేనేమీ చేయలేనని ఆయన అన్నారు. -
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డ్రైవర్ ఆత్మహత్య
గద్వాల క్రైం: పురుగు మందు తాగి ఓ కారు డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చోటుచేసుకుంది. గద్వాల సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం కొండూరుకు చెందిన చుక్క రామన్గౌడ్ కుమారుడు కుర్మయ్యగౌడ్(26) గత నాలుగేళ్ల నుంచి గద్వాలలోని పత్తి మిల్లు యజమాని చంద్రశేఖర్రెడ్డి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల చంద్రశేఖర్రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కావడంతో ఆమె కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలోని ఓ గదిలో పురుగు మందు తాగాడు. అనంతరం గదిలో నుంచి బయటికి వస్తున్న క్రమంలో కార్యాలయం ముందు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆరా తీయగా పురుగుమందు తాగినట్లు వివరించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తె లుసుకున్న చంద్రశేఖర్రెడ్డి, చైర్మన్ లక్ష్మీదేవ మ్మ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ యన ఆత్మహత్యకు గల కారణాలు తెలి యాల్సి ఉంది.ఈ ఘటనపై కుర్మయ్యగౌడ్ తండ్రి రామన్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గద్వాలలో కలకలం.. మార్కెట్ చైర్మన్ డ్రైవర్ కుర్మయ్యగౌడ్ మార్కెట్ కార్యాలయంలో పురుగు మందు తాగి మృతి చెందడంతో గద్వాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు మార్కెట్ కమీషన్దారులు, కూలీలు, సిబ్బంది కలత చెందారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
హిందూపురం వ్యవసాయ మార్కెట్యార్డ్లో రైతు మృతి
-
కందుల కొనుగోలు కేంద్రాలు మూత
భువనగిరి/ఆలేరు : జిల్లాలో హాకా సంస్థ ఆ« ద్వర్యంలో ఏర్పాటు చేసి న రెండు కందుల కొనుగోలు కేంద్రాలను శని వారం నుంచి మూసివేయనున్నారు. ఇప్పటికే అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు కేంద్రాలు మూసివేత జిల్లాలో కందులను కొనుగోలు చేసేందుకు హాకా సంస్థ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆలేరులో జనవరి 17, భువనగిరిలో 18వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆలేరులో ఇప్పటి వరకు 2,106మంది రైతుల నుంచి 19,844క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయగా భువనగిరిలో 2,557రైతుల నుంచి 20,927క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు భువనగిరిలో 374మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,110క్వింటాళ్లకుగాను రూ.1.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇంకా రూ.10కోట్లు రావాల్సి ఉంది. ఆలేరులో 400మంది రైతులకు సంబంధించిన 1,411క్వింటాళ్లకుగాను జనవరి 30నాటికి రూ.85లక్షలను రైతుల ఖాతాల్లో వేశారు. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం జిల్లా మార్కెట్ శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నాం. రైతులు ఈవిషయాన్ని గమనించి రైతులు గమనించి సహకరించాలని కోరుతున్నాం.– వేణుగోపాల్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి,భువనగరి -
రైతన్న కన్నెర్ర
హుస్నాబాద్ : కందుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కారు. గంటల తరబడి ధర్నా చేశారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై దాస సుధాకర్ రైతుల సమస్యను తెలుసుకొని, అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభింప చేస్తామని హామీనిచ్చినా రైతులు ససేమేరా అన్నారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో రైతులు తిరిగి మార్కెట్ యార్డు ఎదుట ధర్నాకు దిగారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులకు రెవెన్యూ, పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన తీవ్రం కావడంతో తహసీల్దార్ విజయసాగర్, ఎస్సై సుధాకర్ మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడి కొనుగోళ్ల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు ఆందో«ళన విరమించారు. అంతకుముందు రైతులు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి కంది గింజను కొంటామని చెప్పిన అధికారులు అర్ధంతరంగా కొనుగోళ్లు బంద్ చేయడమేమిటని నిలదీశారు. ఆదివారం దళారుల నుంచి క్వింటాళ్ల కొద్దీ కందులను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5,450 ఉంటే, కొనుగోళ్లు బంద్ చేశారని, బయట అమ్మడానికి వెళ్తే వ్యా పారులు క్వింటాలుకు రూ.3,000 ఇస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. రైతుల ధర్నాకు అఖిల పక్షనాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కవ్వ వేణుగోపాల్రెడ్డి, అయిలేని శంకర్రెడ్డి, ఆకుల వెం కట్, హన్మి రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వాల నవీన్, రైతు ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మార్కెట్లో రైతును బలిగొన్న డీసీఎం
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు పత్తిని తీసుకొచ్చిన రైతును డీసీఎం వ్యాను బలిగొంది. యార్డు ఆవరణలో ఆరబెట్టుకుని నిద్రిస్తుండగా బుధవారంరాత్రి మిర్చి లోడుతో ఉన్న డీసీఎం వాహనం అతడి కాళ్లపై నుంచి వెళ్లింది. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం దేవునిగుట్ట తండాకు చెందిన బానోతు రవి(40), తండ్రి మంజ్య, ఇద్దరు సోదరులతో కలసి 150 బస్తాల పత్తిని బుధవారం ఉదయం పవన్ ట్రేడర్స్ అడ్తికి అమ్మకానికి తీసుకొచ్చారు. పత్తిలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో పత్తిని ఆరబెట్టిన రవి, తండ్రి, సోదరులతో కలసి అక్కడే నిద్రపోయాడు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి మార్కెట్కు మిర్చిలోడుతో వచ్చిన డీసీఎం రవి కాళ్లపై నుంచి వాహనం వెళ్లింది. దీంతో రవి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు, అధికారులు, సెక్యూరిటీ గార్డులు బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గురువారం ఉద యం రవి మృతి చెందాడు. రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మార్కెట్కు వచ్చి నిరసన తెలిపారు. రైతు మృతికి కారకులైన మార్కెట్ పాలక వర్గం, మంత్రి హరీశ్రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దయాకర్రావు ఎంజీఎంకు వచ్చి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా, సొం తంగా రూ.30 వేలు అందజేశారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
నకిలీ రైతులపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ‘నకిలీ రైతుల’ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అర్హులే లబ్ధిపొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ కార్యకలాపాలు, కందులు, శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాల అమలుతీరుపై మంత్రి హరీశ్రావు గురువారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కందుల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన సొసైటీల కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్ కమిటీతో వెంటనే అనుసంధానించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో ధ్రువీకరణపత్రం పొందిన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలపై నిఘా పెట్టి పారదర్శకతతో గుర్తింపు ఇచ్చేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి.. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురాకముందే నాణ్యతాప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్ సూచించారు. కందుల కొనుగోళ్లపై కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీల్లో జరిగే క్రయవిక్రయాలపై నిఘా పెట్టాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ పరిమాణంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. ఎంత విస్తీర్ణంలో సాగుచేశారో తనిఖీ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి రైతులు ధ్రువీకరణపత్రం పొందాలని కోరారు. కొనుగోలు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు మద్ధతుధర కల్పించే విషయంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని, రైతుల పేరుతో ప్రభుత్వానికి నష్టం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. -
పాత కమిటీలకే మళ్లీ పట్టం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల కొత్త చట్టం ఏడాదికే అభాసు పాలైంది. పాత చట్టానికి చేసిన సవరణల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తే సింది. మూడేళ్లపాటు ఉన్న కమిటీల పదవీకాలాన్ని తెలంగాణ నూతన మార్కెటింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం ఏడాదికి కుదించింది. ఏడాది పూర్తయిన మార్కెట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవోలు జారీ చేస్తోంది. దీంతో కొత్త చట్టానికి ఏడాది లోనే తూట్లు పడ్డట్లయింది. తొలుత ఏడాదికి కుదింపు: రాష్ట్రంలో మొత్తం 180 మార్కెట్ కమిటీలున్నాయి. కొత్త మార్కెట్ కమిటీల చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి పలు దఫాలుగా 160 మార్కెట్లకు పాలక వర్గాలను నియమించింది. తొలి సారిగా లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేయటం, మహిళలకు 33 శాతం పదవులు రిజర్వు చేయటంతో మార్కెట్ కమిటీల నియామకాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. మూడేళ్లున్న పాలకవర్గం పదవీకాలాన్ని కొత్త చట్టంలో ఏడాదికి కుదించటం, ఏడాదికోసారి రిజర్వేషన్ను రొటేషన్ చేసేలా చట్టం ఉండ టంతో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టు కుంది. ఈ అంశాలనే ప్రభుత్వం విస్మరించటంతో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో గందరగోళం నెలకొంది. జూలైలోనే ముగిసిన పదవీకాలం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించిన 160 మార్కెట్ కమిటీల్లో దాదాపు వందకుపైగా కమిటీల పదవీ కాలం గత జూలైలో ముగిసిపో యింది. ఆ వెంటనే సంబంధిత మార్కెట్ల కు కొత్త పాలకవర్గాలను నియమించాలి. రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లను మార్చి ఇతర సామాజిక వర్గాలకు కమిటీ పదవులు దక్కేలా అమలు చేయాలి. ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. పదవీకాలం ముగిసిన మార్కెట్ పాలక వర్గాలకు గడువు పొడిగించే పాత ఎత్తుగడను అను సరించింది. వంద కమిటీలకు 6 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో పదవీ కాలం ముగిసిన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమనే మళ్లీ కొనసాగిం చాలని, పదవీ కాలాన్ని పొడిగించాలని ఒత్తిళ్లు తెస్తున్నా రు. ఇప్పటికే పొడిగింపు వెసులుబాటు పొందిన కమిటీలు మళ్లీ పొడిగింపునకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల రొటేషన్తో తమకూ అవకాశం వస్తుందని ఏడాదిగా ఎదురుచూసిన ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. -
లక్షన్నర టన్నుల కందిని కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి మం గళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర వ్యవ సాయశాఖ కార్యదర్శిని కలసి లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కోరతారు. రాష్ట్రంలో కేవలం 53,600 మెట్రిక్ టన్నుల కందిని మాత్రమే కొనుగో లు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించిం ది. కంది ఉత్పత్తి గణనీయంగా ఉన్నందు న పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో కేవలం 33,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతుధరకు కొనుగో లు చేస్తానని ప్రకటించింది. ఒత్తిడి పెంచ డంతో ఇటీవల మరో 20 వేల టన్నులు కొనుగోలు చేస్తామని అంగీకరించింది. ఇలాగైతే, రైతులు కంది పంటను వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల చెల్లిం పుల్లో ఆలస్యంపై మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు అధికారులపై మండిపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము పెండింగ్లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.145 కోట్లు కందుల రైతులకు, రూ.21 కోట్లు మొక్కజొన్న రైతులకు చెల్లించాలని.. వీటిని వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై తాను జిల్లాలు పర్యటించినపుడు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను సందర్శిస్తానని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాత రైతులకు చెల్లింపులో జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానన్నారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో కంది దిగుబడి 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రానుందని అంచనా వేశామన్నారు. 33 వేల మెట్రిక్ టన్నులు కొనేందుకే కేంద్రం సుముఖత చూపిందన్నారు. ఇప్పటివరకు 26,200 మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్కు వచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో పెండింగులో ఉన్న చెల్లింపులను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గడ్డిఅన్నారం మార్కెట్ను కోహెడకు తరలించనున్నందున.. అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఏర్పాటుకోసం 3 ప్రైవేటు సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు. 15 రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించాలని ఆయా సంస్థలను కోరారు. ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్రావు లేఖ రాజోలిబండ ఆధునీకరణ పనులపై చర్చి ద్దామని, అందుకు సమయమివ్వాలని ఏపీ జల వనరుల మంత్రి దేవినేని ఉమామహే శ్వర్రావుకు మంత్రి హరీశ్ లేఖ రాశారు. ఈ నెల 14న రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఆధునీకరణ పనులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసేందుకు కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్ ఒప్పుకున్నారని, ఈ అంశంలో ఏపీ సహకారం కీలకం అయినందున మూడు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ‘కాకతీయ’ నాలుగో దశ ప్రారంభానికి ఫిబ్రవరి 3 డెడ్లైన్ మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను ఫిబ్రవరి 3 లోగా ప్రారంభించాలని హరీశ్రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈసారి మిషన్ కాకతీయలో ఫీడర్ చానల్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కాకతీయ 4వ దశ పనులపై మంగళవారం సచివాలయం నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలాఖరులోగా పనుల గ్రౌండింగ్ జరగాలని, ఏ రోజుకారోజు పనుల ఫొటోలను వాట్సాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
ప్రతి అడుగూ.. రైతు సంక్షేమానికే
దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలం గా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్య మైన ఉచిత విద్యుత్తో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ ట న్నుల గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రెండు నా ల్కల ధోరణిని మానుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చందంపేటలో ఓపెన్ జైల్కు సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిండి ఎత్తిపోతలకు రూ.6,500 కోట్లు : ఎంపీ డిండి ఎత్తిపోతల పనులకు రూ. 6,500 కోట్లు కేటా యించి ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు ఎంపీ గు త్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో దేవరకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ముంపుబాధితులకు సహకారం అందించాలి : జెడ్పీ చైర్మన్ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సహకారం అందించాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని బెండల్రావు చెరువుకు మంజూరి ఇచ్చి తద్వారా సాగు, తాగునీరు అందించేందుకు సహకరించాలని ఆయన మంత్రి హరీశ్రావును కోరారు. సాగునీటికి ప్రణాళికలు : ఎమ్మెల్యే డిండి రిజర్వాయర్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్లో సాగు నీరందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపా రు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ యా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, ఆర్డీఓ లింగ్యానాయక్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీటీసీలు శేరిపల్లి కైలాసం, వస్కుల తిరుపతమ్మ, మూఢావత్ ప్రమీల, సర్పంచ్ అందుగుల ముత్యాలు, తహసీల్దార్ కిరణ్మయి, వైస్ ఎంపీపీప వేణుధర్రెడ్డి, హరినాయక్, నట్వ గిరిధర్, జాన్యాదవ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి చందంపేట (దేవరకొండ) : నిర్దేశించిన గడువులోగా నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని మంత్రి తన్నీరు హరిశ్రావు అన్నారు. గురువారం చందంపేట మంలంలోని తెల్దేవర్పల్లిలో చేపడుతున్న నక్కలగండి బండ్ నిర్మాణ పనులను ఇతర మంత్రులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహించొద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 7.50టీఎంసీలు కాగా మొదటి ఏడాది వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సెల్బీసి టన్నెల్–1లో 43 కి.మీ. సొ రంగ మార్గంలో 30 కి.మీ ఇప్పటికేటి పూర్తయ్యింది. మరో 13 కి.మీ. పనులను వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఏజెన్సిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. టన్నెల్–2ను సొరంగ మార్గ పనులు వంద శాతం పూర్తి కా గా 50 శాతం లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డిండిబ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. -
ఉప్పల్ మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మార్కెట్ యార్డులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్కెట్ లోని పలు దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. వ్యాపారులు అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దుకాణాలను తగలబెట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో తరుచు దొంగతనాలు, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని.. రక్షణ కల్పించాలన్నారు. మార్కెట్ యార్డును స్దానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిశీలించారు. -
ధర కోసం పత్తి రైతుల ఆందోళన
ఆదిలాబాద్: పత్తికి ఓ వ్యాపారి పెట్టిన ధరను మిగిలినవారు సైతం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర పెరుగడంతో ఆది లాబాద్ మార్కెట్యార్డ్కు పెద్దఎత్తున రైతులు పత్తి తీసుకొచ్చారు. ఉదయం నిర్వహించిన వేలంపాటల్లో ఓ వ్యాపారి క్వింటా పత్తికి రూ. 4,800 ధర పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో రైతులు తమ పత్తికి అంతే ధర పెట్టాలని కోరగా మిగిలిన వ్యాపారులు అంగీకరించలేదు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తి కొనుగోళ్లు జరగలేదు. నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులకు నచ్చజెప్పడంతో చివరకు రూ.4,800కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు బుధవారం 10 వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అన్నెల అడెల్లు తెలిపారు. -
మిర్చి ధరపై అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మిర్చి ధర మార్కెట్లో రూ. 12 వేలు పలికింది. ఈ ఏడాది జనవరి 10న రూ. 11,500, ఫిబ్రవరి 6న రూ. 9,100కు చేరింది. ఇలా ఏప్రిల్ 27 నాటికి క్వింటాల్ మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయింది. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతన్నలు అక్కడి వ్యవసాయ మార్కెట్పై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్వింటాల్ మిర్చి ధర రూ. 4,700 – రూ. 9,600 ఉందంటే రానురాను పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వ్యవసాయ మార్కెటింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లకు మిర్చి పెద్ద ఎత్తున తరలివస్తే, ధరలు మరింత పడిపోవచ్చనే భావన అధికారులను వెంటాడుతోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారుల వద్ద నగదు లేక కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఈ ఖరీఫ్లో 1.71 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఈ సారి 87,220 మెట్రిక్ ట న్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య పంట కావడంతో మిర్చికి ఎటువంటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని, ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. నిల్వకు అవకాశం లేక... మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో రైతులు మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక, ఉన్న కొన్ని స్టోరేజీలు వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్శాఖ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
11 నుంచి కంది కొనుగోలు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అవసరమైనచోట ఈ నెల 11వ తేదీ నుంచి కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి తెలిపారు. ‘కందుల ధర ఢమాల్’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పార్థసారథి నేతృత్వంలో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాఫెడ్, మార్క్ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులు హాజర య్యారు. సమావేశం నిర్ణయాలను పార్థ సారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కెట్లో కంది కనీస మద్ధతు ధర రూ. 5,450 కన్నా తక్కువగా ఉన్నందున ఈ విషయమై చర్చించామని పేర్కొన్నారు. కందుల ఉత్పత్తి ఈసారి 1.65 మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా వేసినందున అందుకు తగినట్లు 95 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హాకా ఆధ్వర్యంలో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, సూర్యా పేట్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందన్నారు. మిగి లిన 23 జిల్లాలలో మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా నాఫెడ్ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు 12% తేమ మించ కుండా కందులను తీసుకొని వచ్చేవిధంగా ఆయా మార్కెట్ యార్డుల తరపున అవ సరమైన ప్రచారాన్ని, అవగాహనను కల్పిం చాలని సూచించారు. శుభ్రపర్చే యంత్రా లను రైతులకు సరిపడా చేకూర్చాలన్నారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు తగ్గినందున వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని అధికారులు పార్థసారథికి వివరించారు. మినుముల సేకరణ నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఆయనకు వివ రించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: కందికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కంది ధర ఢమాల్’కథనంపై ఆయన స్పందించారు. కందికి మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించారు. అలాగే ఈ మేరకు సోమవారం అత్యవసరంగా సమావేశమై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఓ ప్రకటనలో హరీశ్ వెల్లడించారు. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. -
ఆదిలాబాద్లో పత్తి రైతుల ఆందోళన
సాక్షి,ఆదిలాబాద్/ఖమ్మం వ్యవసాయం: ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆందో ళన బాట పట్టారు. తేమ పేరిట ధరను అడ్డగోలుగా తగ్గించడంపై బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మార్కెట్యార్డులో బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగినా వ్యాపారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యార్డు నుంచి రోడ్డుపైకి వచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. తేమ విషయంతో మొదలు.. ఆదిలాబాద్ మార్కెట్లో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర కోసం వేలం నిర్వహించారు. 8 శాతం తేమ ఉన్న పత్తి క్వింటాలుకు రూ.4,570 ధర నిర్ణయించారు. యార్డు నుంచి జిన్నింగ్కు వెళ్లిన తర్వాత మళ్లీ తేమ శాతాన్ని చూస్తూ క్వింటాలుకు రూ.3,800 వరకే ఇస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. 8 శాతం నుంచి కాకుండా 12 శాతం నుంచి తేమను పరిగణన లోకి తీసుకోవాలని, ఆపై అదనంగా వచ్చే తేమ శాతానికి ధర కోత విధించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జేసీ కృష్ణారెడ్డి మంత్రి జోగురామన్నతో సమస్యపై వివరించగా, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 25వేల క్వింటాళ్ల వరకు పత్తిని రైతులు వాహనాల్లో తీసుకొచ్చారు. ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఖమ్మం మార్కెట్కు బుధవారం సుమారు 30వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చింది. 24,700 బస్తాల పత్తి విక్రయానికి వచ్చినట్లు రికార్డు అయింది. బాగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసి విక్రయానికి తెచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ క్వింటాల్కు సగటున రూ. 2,500 నుంచి రూ.3 వేలకు మించి ధర పెట్టడం లేదు. -
రెక్కల కష్టం నీటిపాలు..
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో విక్రయించేందుకు తీసు కొచ్చిన 5 వేల బస్తాల మొక్క జొన్నలు బుధవారం వర్షపునీటిలో కొట్టుకు పోయాయి. వనపర్తి మార్కెట్కు కొద్దిరోజులుగా మొక్కజొన్న విక్రయానికి వస్తోంది. ఈ సీజన్లో బుధవారం అత్య ధికంగా విక్రయానికి వచ్చింది. ఉదయం ఎండగా ఉండడంతో రైతులు మొక్క జొన్నను ఆరబెట్టారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి కొనుగోలు చేసేందుకు టెండర్లు దాఖలు చేసే సమయంలో భారీ వర్షం కురిసింది. రైతులు తేరుకునే సమయానికే మొక్కజొన్న కళ్లముందే వర్షపునీటిలో కొట్టుకుపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
మూడు మార్కెట్ల ఆదాయం పతనం
- నాలుగు నెలలైనా 10 శాతం లోపు వసూళ్లు - కమిషనర్ శామ్యూల్ ఆనంద్ సీరియస్ హెచ్చరిక అనంతపురం అగ్రికల్చర్: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మార్కెట్ యార్డుల ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తోంది. అందులోనూ మూడు యార్డుల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు పూర్తయినా నిర్దేశిత లక్ష్యంలో తనకల్లు కేవలం 8.40 శాతం సాధించి చివరి స్థానంలో ఉండగా ఆ తర్వాత 9.45 శాతం సాధనతో ధర్మవరం, 9.60 శాతంతో రాయదుర్గం యార్డులు పూర్తిగా వెనుకబడ్డాయి. 10 శాతం లోపు వసూళ్లు: ఐదు నెలలు పూర్తయినా ఈ యార్డుల్లో 10 శాతం కూడా వసూళ్లు కాకపోవడంతో మిగతా 90 శాతం ఎలా సాధించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం లక్ష్యం రూ.1.17 కోట్లు కాగా కేవలం రూ.11.23 లక్షలు, ధర్మవరంలో రూ.60 లక్షలకు గానూ రూ.5.67 లక్షలు, తనకల్లులో రూ.58 లక్షలకు గానూ కేవలం రూ.4.88 లక్షలు మాత్రమే వసూలు కావడం విశేషం. ఈ మూడింట ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఆ శాఖ కమిషనర్, ఆర్జేడీలు సీరియస్గా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 13 మార్కెట్యార్డుల ద్వారా వివిధ రూపాల్లో మార్కెటింగ్ ఫీజు రూ.14.61 కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నాలుగు నెలల కాలంలో 26.30 శాతంతో రూ.3.84 కోట్లు సాధించారు. వసూళ్లలో 36.22 శాతంతో అనంతపురం యార్డు ప్రథమ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో గుంతకల్లు 35.84 శాతం, హిందూపురం 34.90 శాతం వసూళ్లలో ముందంజలో కొనసాగుతున్నాయి. మిగతా వాటిలో తాడిపత్రి 27.69 శాతం, మడకశిర 24.33 శాతం, కదిరి 23.31 శాతం, గుత్తి 22.76 శాతం, ఉరవకొండ 22.35 శాతం, పెనుకొండ 19.77 శాతం, కళ్యాణదుర్గం 14.77 శాతం వసూళ్లలో వెనుకడ్డాయి. ముందంజలో మూడు మార్కెట్లు, మరో మూడు యార్డులు పూర్తిగా వెనుకబడిపోయాయి. మిగతా ఏడు మార్కెట్యార్డుల ఆదాయం మధ్యస్థంగా ఉన్నాయి. మార్కెట్శాఖ కమిషనరు ఆగ్రహం : వారం రోజుల కిందట జిల్లాకు వచ్చిన ఆశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్, ఆర్జేడీ సి.సుధాకర్ మార్కెట్ ఫీజు వసూళ్లపై ఆరాతీయగా... వెనుకబడిన యార్డుల సెక్రటరీ, సూపర్వైజర్లపై సీరియస్ అయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గడువులోపు లక్ష్యం సాధించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్షలు, పర్యవేక్షణతో అన్ని మార్కెట్యార్డులు వంద శాతం లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఏడీ బి.హిమశైలను కమిషనర్ ఆదేశించినట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. -
కార్మికుల పీఎఫ్ మాయం!
- కార్మికులకు చేరని రూ.80 లక్షలు - ఓ మార్కెట్ చైర్మన్ నిర్వాకం సాక్షి, పెద్దపల్లి: ఆయనో అధికార పార్టీ నాయకుడు. పైగా జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షుడు. మంథని ప్రాంతంలోని ఓ సోలార్ పవర్ ప్లాంట్లో లేబర్ కాంట్రాక్టర్ కూడా. కార్మికులను మోసం చేసి పీఎఫ్ స్వాహా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మంథనికి సమీపంలోని ఓ సొలార్ ఎక్స్ప్లోజివ్ ప్లాంట్లో పనిచేస్తున్న 132 మంది కాంట్రాక్ట్ కార్మికులకు, సోలార్ ప్లాంట్ యాజమాన్యం సదరు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తోంది. దీనికోసం దాదాపు 12.5 శాతం కమీషన్ ఆయనకు వస్తుంది. ఒక్కో కార్మికుడికి రూ.1017 చొప్పున సదరు కాంట్రాక్టర్ పీఎఫ్ కోసం చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1017 లను జమ చేస్తుంది. ఇటీవల పీఎఫ్ తీసుకుందామని కార్మికులు అధికారులను కలిస్తే జమ కాలేదని తేలింది. సుమారు రూ.80 లక్షల వరకు పీఎఫ్ బకాయిలు కార్మికులకు చెల్లించాలి. కార్మికులు మూడురోజుల క్రితం ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు. గోదావరిఖని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులకు రావా ల్సిన పీఎఫ్ను 9వ తేదీలోగా లెక్కించి ఇస్తానని కాంట్రాక్టర్ ‘ఒప్పంద పత్రం’ రాసిచ్చారు. కానీ, మళ్లీ రాజకీయ ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
వచ్చే సీజన్కల్లా మిర్చి కోల్డ్ స్టోరేజ్లు
► మార్కెట్ యార్డుల్లో ఏర్పాటుకు మంత్రి హరీశ్ ఆదేశం ► ఖరీఫ్ దిగుబడులపై మార్కెట్ కార్యాచరణ ప్రణాళిక ► మార్కెటింగ్ శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాబోయే మిర్చి సీజన్ కల్లా మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశిం చారు. వచ్చే ఖరీఫ్ పంట దిగుబడులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్రావు మంగ ళవారం ఈ–నామ్, గోదాముల నిర్మాణం, రైతుబజార్లు, కోల్డ్ స్టోరేజ్లు, మన కూర గాయల పథకం వంటి అంశాలపై 4 గంట లకుపైగా సమీక్షించారు. హరీశ్రావు మాట్లా డుతూ ఏయే నెలల్లో పంటలు తగ్గి ఇరుగు పొరుగు రాష్ట్రాల దిగుమతులపై ఆధారపడి ధరలు పెరుగుతున్నాయో సమగ్ర అధ్యయ నం చేయాలని అధికారులను ఆదేశించారు. దిగుమతుల వల్ల ధరలు పెరిగి వినియోగదా రులకు ఇబ్బందులు వస్తున్నందున నిరంతర సమీక్ష అవసరమన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్ల దిగుమతిపై ఆధారపడకుండా పకడ్బం దీగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలో జిల్లా ఉద్యాన, మార్కెటింగ్, రైతు బజార్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్పేట దగ్గరున్న వెనికతల గ్రామాన్ని సందర్శించి ఉల్లిగడ్డలు పండించే విధానం, వాటిని నిల్వ చేస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని కోరారు. మార్కెటింగ్ అధికారులు సృజనాత్మక విధానాలు ప్రవేశపెట్టే దిశగా ప్రయ త్నాలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లుగా 18.55 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 355 గోడౌన్లు నిర్మిస్తున్నామని, వీటిల్లో 300 గోదాముల నిర్మాణం పూర్తయిందని చెప్పా రు. ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉండాల న్నారు. హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
కట్టుదిట్టంగా కాంట్రాక్టు వ్యవసాయం
- కనీస మద్దతు ధరకు మించి కొనాలన్నది ప్రధాన షరతు - ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు, చేర్పులు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు వ్యవసాయవిధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మార్కెటింగ్శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్శాఖ కార్యదర్శి సి.పార్థసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం... వ్యవసాయ ఆధారిత కంపెనీలు రైతు వద్దకు వెళ్లి తమకు అవసరమైన పంటలను పండించాలి. ఆయా పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు తామే కొనుగోలు చేస్తానని రైతుతో చేసుకునే ఒప్పందమే కాంట్రాక్టు వ్యవసాయం. తాజా ఉత్తర్వుల్లో కనీస మద్దతు ధరకు మించి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కంపెనీలు కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాలి. పంట కొనుగోలు చేసిన మరుసటి రోజే రైతు ఖాతాలో సొమ్ము జమ చేయాలి. అందుకోసం సీజన్కు ముందే రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకోవాలి. నాణ్యత లేదంటూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిరాకరించకూడదు. వాటి నాణ్యతను ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ఆయా కంపెనీలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. అందుకోసం సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. మొత్తం కాంట్రాక్టు వ్యవసాయం చేయిస్తున్న వాటి విలువలో 20 శాతం చెల్లించాలి. ఒక పంట సీజన్కే రైతులతో ఒప్పందం చేసుకోవాలి. గోదాములు, కోల్డ్స్టోరేజీలను మార్కెట్లుగా మార్చుకునే సదుపాయం వ్యవసాయ మార్కెట్ నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చేసింది. ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మార్కెట్లు వేలల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, కోల్డ్స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు జరిగే చోట్లన్నీ కూడా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే మార్కెట్లుగా మారనున్నాయి. అవన్నీ కూడా ఈ–నామ్తో అనుసంధానం కానున్నాయి. ప్రైవేటు మార్కెట్ల నిబంధనలు సరళతరం: గతంలో ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 10 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రైవేటు మార్కెట్ ఏర్పాటైంది. ఇక ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేయాలంటే రూ. 3 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపారస్థులు పంట ఉత్పత్తులను రవాణా చేయాలంటే ప్రతీ మార్కెట్ కమిటీ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లోనే రవాణా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తులు ఇప్పటివరకు ఒక్కో మార్కెట్ యార్డుల్లో ఒక్కో లైసెన్సు కలిగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యాపారస్తులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకటే లైసెన్సు జారీచేస్తారు. ప్రస్తుతం వ్యాపారస్తులకు, ఏజెంట్లకు ప్రతీ ఒక్కరికీ ఒకటే లైసెన్సు, ఒకటే ఫీజు ఉండేది. దాన్ని మార్చేశారు. వేర్వేరు లైసెన్సులు, వేర్వేరు ఫీజులుంటాయి. -
పసుపు దళారులకు కాసుల పంట
► నేతల ఒత్తిళ్లతో నాసిరకం కొనుగోళ్లు ► ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం ఉదయగిరి ప్రాంతంలో రైతులు సాగుచేసిన పసుపును గతేడాది వరకు వైఎస్సార్, గుంటూరు జిల్లా దుగ్గిరాల ప్రాంతాల్లో కష్టపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో రైతుల కష్టాలను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదయగిరిలో ఈ ఏడాది పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి బయట జిల్లాల్లో తక్కువ ధరకు నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో అమ్ముకొని రూ.లక్షల్లో లాభాలు గడించారు. మార్క్ఫెడ్ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నేతలకు బాసటగా నిలిచారు. ఉదయగిరి : ఉదయగిరిలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో నాణ్యతలేని సరుకును మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వచ్చింది. జూన్ 30వ తేదీలోపు సుమారు రూ.195 కోట్ల విలువ కలిగిన 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో రూ.50 కోట్లు పైగా నాసిరకం, పుచ్చిన, తడిసిన, ఎందుకూ పనికిరాని సరుకును ఈ కేంద్రంలో దళారులు నుంచి కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జూన్ 5వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎ–గ్రేడ్ రకానికి రూ.6,500, బి–గ్రేడ్కు రూ.6 వేలు వంతున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ కేంద్రం పరిధిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగుచేసినట్లుగా వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేంద్రానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు కూడా తాము పండించిన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ కేంద్రం పరిధిలో 700 టన్నులు పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులు మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు కడప, దుగ్గిరాల ప్రాంతాల్లో నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో విక్రయించి 20 టన్నుల లారీల సరుకుకు సుమారు రూ.3 లక్షల మేర లాభాలు గడించారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి కడప, దుగ్గిరాల ప్రాంతాలలోని ట్రేడర్ల వద్దనున్న నాసిరకమైన సరుకును తక్కువ ధరకు కొనుగోలుచేసి ఈ కేంద్రంలో విక్రయించి కాసుల పంట పండించారు. జూన్ 10 నుంచి 30వ తేదీ వరకు సుమారు రెండు వేల టన్నుల సరుకును దళారులు ఈ కేంద్రంలో విక్రయించినట్లు సమాచారం. జూన్ 30వ తేదీ నాటికి ఈ కేంద్రం నుంచి 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కువ భాగం దళారుల ద్వారా కొనుగోలు చేసిందే. నాసిరకం సరుకు కొనుగోలుకు ఒత్తిళ్లు పసుపు కొనుగోలు కేంద్రాన్ని జూన్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తున్నట్లు మార్క్ఫెడ్ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. అయినా ఆ రోజు సాయంత్రం వరకు రాజకీయ నాయకులకు చెందిన సుమారు పది లారీల నాసిరకం సరుకు కొనుగోలు కేంద్రం ఆవరణలో ఉంది. దీనిని కొనుగోలు చేయాలని ఆ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు వాటిని కొనుగోలు చేయకపోవడంతో లారీలు అక్కడే ఉన్నాయి. ఈ సరుకు కడప ప్రాంతంలో ట్రేడర్ల వద్ద ఉన్న అత్యంత నాసిరకమైన సరుకు. దీనిని కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ సిబ్బందిపై ఈ సరుకుకు సంబంధించిన రాజకీయనేతలు తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేరు చెప్పి అధికారులను బెదిరించి ఈ సరుకును విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే గోదాములో నిల్వ ఉన్న సరుకులో సింహభాగం నాసిరకమైన సరుకని అందులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది స్వయంగా చెబుతున్నారు. ఏది ఏమైనా రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రం దళారుల అవతారమెత్తిన రాజకీయ నేతలకు కాసుల పంట కురిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పలుకుబడిని ఉపయోగించుకొని లబ్ధిపొందారని విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలుచేసి నాణ్యతను పరిశీలిస్తే అసలు గుట్టు రట్టవుతుందనడంలో సందేహం లేదు. -
వడ దెబ్బతో హమాలి మృతి
ఆదోని టౌన్: పట్టణంలోని బావూజీ పేటలో నివాసముంటున్న హమాలి బుడ్డ వీరప్ప (46) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వీరప్ప మార్కెట్ యార్డులో హమాలిగా పని చేసే ఇతను మార్కెట్ యార్డుకు అన్ సీజన్ కావడంతో కట్టెల తెచ్చేందుకు కొండకు వెళ్లాడు. కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేస్తూనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య శంకుతల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నిజామాబాద్ మార్కెట్ యార్డులో విషాదం
నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం విషాదం చోటచేసుకుంది. చిన్న గంగారామ్ అనే పసుపు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం మార్కెట్ యార్డుకు పసుపు తెచ్చిన రైతు రాత్రి అక్కడే నిద్రపోయాడు. అయితే ఉదయం లేచిన కాసేపటికే గంగారామ్ గుండెపోటు రావడంతో మార్కెట్ యార్డులోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు గంగారామ్ను కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. కొద్ది సమయంలోనే అతడు మృతిచెందాడని తోటి రైతులు చెబుతున్నారు. మృతిచెందిన రైతు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఎద్దండి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగని ‘మిర్చి’ సెగలు
సాక్షి, ఖమ్మం/లీగల్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, కల్లూరు మండలం లక్ష్మీపురంతండాకు చెందిన ఇస్రాల బాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన భుక్యా అశోక్, ఏన్కూరు మండలం శ్రీరామపురంతండాకు చెందిన భుక్యా నర్సింహారావు, తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాకు చెందిన భూక్యాశ్రీను, బానోతు సైదులు, కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజావత్ భావ్సింగ్, నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బానోతు ఉపేందర్లను ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్. అమరావతి ఎదుట హాజరు పరచగా, వారికి మే 11 వరకు రిమాండ్ విధించారు. వీరిలో ఏ–2ముద్దాయి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పరారీలో ఉన్నట్లు చూపించారు. కాగా, రైతులపై సెక్షన్లు 147(దాడి చేయటానికి వెళ్లడం), 148(మారణ ఆయుధాలతో దాడి చేయటం), 353(ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం), 427(ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట), 446, 448( అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించుట) 120(బి)(నేరం చేయటానికి ముందస్తు ప్రణాళిక, llనేరపూరిత కుట్ర) రెడ్విత్ 149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట) కింద రిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతోనే కేసు : సండ్ర రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతుధర అందకనే రైతులే ఆవేశంగా మార్కెట్ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన శుక్రవారం రోజు రైతులు మార్కెట్లో ఉదయం 7.30 గంటల నుంచే ధర విషయంలో ఆందోళన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులను పరామర్శించేందుకు, చైర్మన్తో మాట్లాడదామని మార్కెట్కు ఉదయం 10.30 గంటలకు వెళ్లానని, అప్పటికే రైతులు మార్కెట్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్తో ఆయన చాంబర్లో ధర విషయమై మాట్లాడానని చెప్పారు. అప్పుడు చాంబర్లో చైర్మన్తోపాటు ఇద్దరు సీఐలు కూడా ఉన్నారన్నారు. ఆందోళన అంతకు ముందు జరుగుతున్నట్లు వాళ్లకు తెలిసినా, తాను వచ్చినప్పుడే రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారని, తానే ఈ విధ్వంసానికి కారకుడినని ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనని అన్నారు. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ కూడా రైతుల వద్దకు వెళ్లిందని, అప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలకు కూడా ఆ పార్టీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తాము రైతులు, ప్రజల కష్టాలను చూస్తామని, ఇలాంటి కేసులకు భయపడబోమని అన్నారు. మార్కెట్కు పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులపై ఖమ్మం మార్కెట్ నుంచే కేసులు పెట్టడం హేయమైనచర్య అని పేర్కొన్నారు. -
పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్
-
పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్
ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో మిర్చియార్డ్ చుట్టూ పోలీసుల వలయాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంకు వచ్చే అన్ని రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ కు వెళ్తున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి.మధుసూదనారెడ్డిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు ఆయనను కూసుమంచి మండల కేంద్రం వద్ద అడ్డుకున్నారు. మిర్చి మార్కెట్ను సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిని సైతం అనుమతి లేదని పోలీసులు తిప్పి పంపారు. -
రేపు సీపీఐ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ యార్డుల ఎదుట ధర్నాలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి మొద లైన నేపథ్యంలో ఉపాధి కూలీలకు ప్రభు త్వం తాగునీరు సరఫరా చేయాలని, పని కల్పించాలని, ఎండలు ముదిరిన పుడు ఉచితంగా బియ్యం, పప్పులు అం దించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇబ్బందు ల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలబడేలా ఈ నిరసనలు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. నిధుల కొరత తో మిర్చి, కందుల కొనుగోలు చేయలేక పోతున్నామని, సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుందన్నారు. -
అమ్మకానికి వస్తే... మళ్లీ వెనక్కే
మార్కెట్ గేట్లకు తాళాలు, కాపలాగా గార్డులు కోల్డ్ స్టోరీజీల వద్ద మిర్చి వాహనాలు వరంగల్సిటీ : లారీల సమ్మెతో నిరవధిక బంద్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్కు అమ్మకోవడానికి రైతులు పంట సరుకులతో వస్తే మళ్లీ వచ్చిన దారిన పోవాల్సిందే. సోమవా రం బంద్ విషయం తెలిసినా కొందరు రైతులు అనుకోకుండా మార్కెట్కు రా గా చైర్మన్, కార్యదర్శి ఏదో విధంగా అడ్తి, వ్యాపారులకు నచ్చచెప్పి అమ్మకా నికి వచ్చిన సరుకులను కొనుగోళ్లు ని ర్వహించిన విషయం తెలిసిందే. అయితే చైర్మన్, కార్యదర్శి వెంటనే అడ్తి, వ్యా పారులను సమావేశపరిచి, పంట సరుకులతో రైతులు మార్కెట్కు వస్తే బాధ్యత మీదేనని వివరించి మైక్లో బంద్ గురించి అనౌన్స్ చేయించడంతో పాటు రెండు వైపులా గేట్లను మూసేసి, సె క్యూరిటీ గార్డులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మంగళవారం గేట్లు పూర్తిగా మూసేసి, ఎలాంటి వాహనాలు మార్కెట్లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం అమ్మకానికి వచ్చిన దేశి(దొడ్డురకం) రకం మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు రాకపోవడంతో సుమారు వెయ్యి బస్తా ల వరకు పల్లియార్డులోనే మిగిలిపోయి ఉన్నాయి. కనీసం కోల్డ్స్టోరేజిల్లో నిల్వ కోసం వెళ్తామన్నా అడ్తి వ్యాపారులు సహకరించడం లేదని వారు రైతులు వాపోయారు. బారులు తీరిన వాహనాలు చాలా మంది రైతులు వాహనాల్లో మిర్చిని మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చి బంద్ విషయం తెలుసుకొని కోల్డ్స్టోరేజిల వద్దకు తీసుకెళ్లడంతో అక్కడ వాహనాలు బారులు తీరిపోయాయి. కొత్తపేట క్రాస్రోడ్డు నుంచి నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజిల వరకు వాహనాలు లైన్గా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సరైన ధరలేక అటు మార్కెట్ లేక, అమ్ముకోలేక, ఇటు దాచుకోలేక, చేతికొచ్చిన పంటను ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజులు మిర్చి సీజన్ ముందే ఉండడంతో వరంగల్ మార్కెట్ ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అంతపట్టని పరిస్థితి నెలకొంది. -
వసూళ్లు అంతంతే
ఉరవకొండ 100 శాతం రాయదుర్గం 41 శాతమే – నిరాశాజనక ఫలితాలు వెల్లడించిన మార్కెటింగ్శాఖ అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది మార్కెటింగ్శాఖకు కలిసిరాలేదు. ఓ వైపు కరువు పరిస్థితులు మరోవైపు ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, చేతివాటం వల్ల లక్ష్య సాధనలో విఫలమయ్యారు. 13 మార్కెట్యార్డులు, వాటి పరిధిలో ఉన్న సబ్యార్డులు, 26 చెక్పోస్టుల ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.17.11 కోట్లు మేర వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 59 శాతం అంటే రూ. 10.14 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేశారు. వంద శాతం లక్ష్య సాధనలో రూ.6.97 కోట్లు వసూళ్లు చేయడంలో చతికిలపడ్డారు. అయితే కొన్ని మార్కెట్యార్డుల పరిస్థితి బాగానే ఉన్నా, మరికొన్నింటిలో పూర్తిగా నిరాశాజనకంగా ఫలితాలు రావడంతో ఆర్జేడీ, ఏడీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడీ బి.హిమశైల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఉరవకొండ మార్కెట్యార్డు 100 శాతం సాధించగా, వసూళ్లకు బాగా అవకాశం ఉన్న రాయదుర్గం యార్డు 41 శాతం వసూళ్లలో ఆఖరి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక తాడిపత్రిలో కూడా 48 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. మిగతా వాటిలో అనంతపురం 61 శాతం, ధర్మవరం 50 శాతం, గుత్తి 77 శాతం, గుంతకల్లు 67 శాతం, హిందూపురం 69 శాతం, కదిరి 52 శాతం, కళ్యాణదుర్గం 56 శాతం, మడకశిర 56 శాతం, పెనుకొండ 60 శాతం, తనకల్లు 60 శాతం వసూళ్లు సాధించాయి. మొత్తమ్మీద అనుకున్న ఫలితాలు రాకపోవడంతో మార్కెటింగ్ శాఖ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఈనెల 4న మార్కెట్యార్డు సెక్రటరీలు, సూపర్వైజర్లతో మార్కెటింగ్శాఖ ఏడీ ‘క్రిటికల్ రివ్యూ’ పేరుతో సమగ్ర సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్యార్డుల లక్ష్యం, సాధించిన వసూళ్లు ఇలా... –––––––––––––––––––––––––––––––––––––––––– మార్కెట్యార్డు లక్ష్యం వసూలైంది ––––––––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం 03.67 కోట్లు 02.24 కోట్లు హిందూపురం 02.71 ,, 01.85 ,, తాడిపత్రి 02.88 ,, 01.37 ,, రాయదుర్గం 01.66 ,, 68.42 లక్షలు ధర్మవరం 70.00 లక్షలు 35.17 ,, గుత్తి 55.00 ,, 42.26 ,, గుంతకల్లు 60.00 ,, 40.07 ,, కదిరి 93.00 ,, 48.80 ,, కళ్యాణదుర్గం 99.00 ,, 55.60 ,, మడకశిర 38.00 ,, 21.11 ,, పెనుకొండ 50.00 ,, 30.09 ,, తనకల్లు 73.00 ,, 43.70 ,, ఉరవకొండ 81.00 ,, 81.01 ,, ––––––––––––––––––––––––––––– మొత్తం 13 17.11 కోట్లు 10.14 కోట్లు ––––––––––––––––––––––––––––– -
దళారుల్లో దడ..
► చండూరు కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు బిగుస్తున్న ఉచ్చు ► ఇటు రెవెన్యూ.. అటు విజిలెన్స్ శాఖలు సమన్వయంతో ముందుకు.. ► 20 క్వింటాళ్ల పైబడి అమ్మిన వారి వివరాలు సేకరించే పనిలో అధికార యంత్రాంగం ► ఇప్పటికే జిల్లాలోని తహసీల్దార్లకు వెళ్లిన మెయిల్ చండూరు: చండూరు వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు ఉచ్చు బిగుస్తోంది. మరో వారంలో దళారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అటు రెవెన్యూ.. ఇటూ విజిలెన్స్.. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జేసీ నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు దళారుల లిస్టు తయారు చేసి తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గత శుక్రవారం విజిలెన్స్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఓ బృందం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్లకు పైగా విక్రయించిన వారి వివరాలను స్థానిక తహసీల్దార్కు అందించాలని ఆయన మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో జరిగిన తతంగంపై రైతుల çనుంచి సమాచారం తీసుకున్నారు. కేంద్రంలో ఏ మండలం నుంచి ఎంత మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించారో వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు చండూరు తహసీల్దార్ వెంకట్రెడ్డి మెయిల్ పంపిం చారు. కందులు విక్రయిం చిన రైతులకు భూమి ఉందా.. ఉంటే కందులు పండించారా.. ఎంత పంట పండింది.. అనే కోణంలో విచారించి కలెక్టర్కు నివేదిక అందించనున్నారు. 147 మంది సమాచారం కోసం.. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 37,559 క్వింటాళ్ల కందులను 4505 మంది రైతుల ద్వారా కొనుగోలు జరిపారు. ఇందులో 158 మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించినవారున్నారు. ఇందులో చండూరు మండలానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. 11 మందిలో కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, భార్యతో కలిసి భూమి లేకుండానే కందులను అమ్మినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. మిగిలిన 147 మంది దళారుల సమాచారం కోసం రెవెన్యూ సిబ్బంది వేట సాగిస్తోంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని చండూరు మార్కెట్లో జనవరి 23 తేదీన హాకా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు 1994 మంది రైతులకు రూ.8 కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించారు. ఇంకా రూ.5.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. -
మార్కెట్యార్డులో రూ.10కే భోజనం ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో రూ.10 కే భోజనవసతి కార్యక్రమాన్ని చైర్మన్ తలారి ఆదినారాయణ ప్రారంభించారు. బుధవారం యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పనుల నిమిత్తం మార్కెట్కు వచ్చిన రైతులకు రూ.25 విలువ చేసే భోజనం ఇస్కాన్ సహకారంతో రూ.10కే అందజేస్తామని చైర్మన్ తెలిపారు. తొలిరోజు 150 మంది వరకు రైతులు, చిరు వ్యాపారులకు ఉచితంగా భోజనం అందజేశారు. గురువారం నుంచి మార్కెట్కు వచ్చే రైతులు తొలుత టోకెన్ తీసుకోవాలన్నారు. శని, ఆదివారాల్లో కూడా భోజన వసతి కల్పించడంమై ఆలోచిస్తున్నామని తెలిపారు. కరువు జిల్లాను దృష్టిలో పెట్టుకుని మార్కెట్యార్డుకు వచ్చే రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గత ఏడాదిగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత సబ్సిడీతో భోజనం అందజేయాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పామురాయి వెంకటేశులు, సెలక్షన్గ్రేడ్–1 సెక్రటరీ ఏ.నూరుద్ధీన్, గ్రేడ్–2 సెక్రటరీ జి.ఆదినారాయణ, కమిటీ సభ్యులు, యార్డు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అకాల వర్షం.. పంట ఉత్పత్తులకు నష్టం
- జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం - ఆదోని మార్కెట్ యార్డులోతడిసి ముద్దయిన దిగుబడులు జిల్లా పశ్చిమన ఉన్న ఆదోని, ఆలూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదోని పట్టణంలో వర్షం తీవ్రత అధికంగా ఉండడంతో మురుగు కాల్వలు రోడ్డెక్కి పారాయి. మార్కెట్ యార్డుకు తెచ్చిన పంట ఉత్పత్తులు తడిచిపోయాయి. మిగతా ప్రాంతల్లో కూడా కల్లాల్లో ఉన్న ఆరబోసిన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఆదోని అగ్రికల్చర్/టౌన్: ఆదోనిలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మురుగు కాలువలు పొంగి పారాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని మొదలైన వర్షం అరగంటకుపైగా కురిసింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలతో కూడిన వర్షం కావడంతో పట్టణంతోపాటు శివారు జనం భీతిల్లిపోయారు. వర్షం కారణంగా మార్కెట్యార్డులో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులు తడిసిపోయాయి. వేసవి కాలం కావడంతో రైతులు వర్షం గురించి పెద్ద జాగ్రత్తలు తీసుకోలేదు. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి కురిసిన వర్షం పంట ఉత్పత్తులను ముంచేసింది. పత్తి, వేరుశెనగ దిగుబడులు పూర్తిగా తడిచిపోయాయి. మంగళవారం మార్కెట్ యార్డుకు 7664 క్వింటాళ్ల పత్తి, 1061 క్వింటాళ్ల వేరుశెనగ, 141 క్వింటాళ్ల ఆముదం దిగుబడులను రైతులు విక్రయానికి ఉంచారు. పత్తి క్వింటాల్కు రూ.6,111, వేరుశెనగ రూ.6,310, ఆముదం రూ.3633 వరకు కొనుగోళ్లు జరిగాయి. సాయంత్రం అకాలంగా వర్షం రావడంతో ఉత్పత్తుల నిల్వలు అలాగే నిలిచిపోయాయి. టెండర్లు, తూకాలు ముగిసిన అనంతరం వర్షం కురిసింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం లేదని కమీషన్ ఏజెంట్లు తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులు నష్టం చవిచూడాల్సి వచ్చింది. కౌతాళంలో వర్షం కౌతాళం: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతూ జనం బెంబేలెత్తిపోతున్న క్రమంలో మంగళవారం అనుకోకుండా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షం ఏకధాటిగా కురిసింది. -
దళారీ వ్యవస్థకు మంగళం!
⇒ రాష్ట్ర కొత్త మార్కెటింగ్ చట్టంలో కీలక అంశాలు ⇒ నల్సార్ వర్సిటీ ద్వారా ముసాయిదా బిల్లు సిద్ధం ⇒ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులను పీల్చి పిప్పి చేస్తున్న దళారీ వ్యవస్థకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతుల పంటలకు తగిన ధర దక్కేలా, మార్కెట్లో వివిధ రకాల దోపిడీలకు చెక్ పెట్టేలా కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రూపొం దిస్తోంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో రూపుదిద్దిన కొత్త చట్టంలోని అం శాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికా రులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తుది మెరు గులతో ముసాయిదా బిల్లు తయారు చేసి, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టను న్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త చట్టం ప్రకారమే మార్కెట్లో కార్యకలా పాలు జరిగేలా చూడాలని నిర్ణ యించారు. మార్కెట్ రుసుము నుంచి రైతులకు విముక్తి ఇప్పటివరకు మార్కెట్లో వివిధ రకాల రుసుములన్నీ రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కొత్త చట్టంతో దీనికి చరమగీతం పాడనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చే వరకు అయ్యే ఖర్చులనే భరిస్తారు. మార్కెట్లోకి ప్రవేశించాక ఎటువంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం ఉండకుండా కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రైతుల నుంచే కమీషన్ వసూలు చేస్తున్నారు. కొత్త చట్టంతో దీన్ని రద్దు చేస్తారు. వ్యాపారులే కమీషన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో అమల్లో ఉన్న తరహాలో రివాల్వింగ్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించనప్పుడు ఈ రివాల్వింగ్ ఫండ్ రైతులకు చేయూతనిస్తుంది. అలాగే కేంద్ర మార్కెట్ ఫండ్కు బదులుగా రాష్ట్ర మార్కెట్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ యార్డుల్లోనూ, చెక్పోస్టుల వద్ద రైతులు తీసుకొచ్చే పండ్లు, కూరగాయలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుమును కూడా రద్దు చేస్తారు. -
రాజమండ్రి మార్కెట్ యార్డులో సమస్యలు
-
గుంటూరు మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
గుంటూరు: గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో కొనుగోలుదారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయడంతో మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. వేలాది మంది రైతులు రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. కొంతకాలంగా అధిక దిగుబడులతో మిర్చియార్డు కిక్కిరిసిపోతుండగా.. కొనుగోళ్లు మాత్రం మందగించి ధరలు పడిపోయాయి. క్వింటారు ధర రూ. 4 నుంచి రూ.5 వేలు వరకూ మాత్రమే పలికేది. ఈ ధరతో తమకు కూలీరేట్లు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ధరలో ప్రస్తుతం సగం కూడా లేకపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది. రైతుల రాస్తారోకోతో యార్డ్ రహదారితో పాటు జాతీయ రహదారిపైనా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
వరాల వాన
► గజ్వేల్లో పత్తి, తూప్రాన్లో సాధారణ మార్కెట్యార్డులు ► మండల కేంద్రాల్లో మౌలిక వసతులకు రూ.కోటి ► పంచాయతీలకు రూ. 50 లక్షలు మదిరలకు రూ. 20 లక్షలు ► ప్రగతి భవన్ వేదికగా సీఎం కీలక నిర్ణయాలు గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్పై మరోసారి వరాల జల్లు కురిపించా రు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. మంత్రి హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి.... ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల వినతులపై సానుకూలంగా స్పం దించారు. పత్తి క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే ప్రముఖ మార్కెట్గా గుర్తింపు సాధించిన గజ్వేల్లో కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తూప్రాన్లో సాధారణ మార్కెట్యార్డు నిర్మించనున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. నిధుల వెల్లువ.. మండల కేంద్రాలు, ఐదు వేల జనాభా కలిగిన పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు రూ. కోటి, సాధారణ గ్రామ పంచా యతీలకు రూ. 50 లక్షలు, మధిరలకు రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ కో సం ప్రత్యేకంగా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 750 జనాభా కలిగిన ప్రతి గ్రా మాన్ని ఇక నుంచి గ్రామ పంచాయతీగా పరిగణిస్తామన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్ నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంప్యార్డుల నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి దళిత వాడలనుంచే ప్రారంభం కావాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి గ్రామాల్లో పాడుబడిన బావులు, వదిలేయడంతో పాడుబడిన ఇండ్లు కూల్చేయడంతోపాటు గ్రామాల్లో అపారిశుద్ధ్యాన్ని తొలగిం చడానికి ఉద్యమస్థాయిలో ప్రయత్నం జరగాలని సీఎం తెలిపారు. హరిత హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే గాకుండా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికీ అభివృద్ధి చేయకుండా మిగిలిపోయిన రోడ్లను వెంటనే ‘డబుల్’గా మార్చాలని, ఇందుకోసం నిధులు ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధమ ని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను, వేలాడుతున్న విద్యుత్ వైర్లను రెండు నెలల్లోపు సరిచేయాలని, అవసరమైతే పవర్డే నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. గజ్వేల్లోని ప్రభుత్వాసుపత్రికి మరో రెండు అంబులెన్సులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 11న గజ్వేల్లో మరోసారి సమీక్ష ప్రగతిభవన్లో మిగిలిపోయిన అంశాలకు సంబంధించి మరోసారి ఈ నెల 11న గజ్వేల్లో సమీక్ష నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీ క్షలో మంత్రి హరీష్రావుతోపాటు, ఎంపీ ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావు ఉంటారని పేర్కొన్నారు. మరోసారి విస్తృతంగా చర్చ జరిపి నివేదికలను తనకు అందజేయాలని ఆదేశించారు. ఇంకా ఈ సమీక్షలో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి భూంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, వంటిమామిడి మార్కె ట్ కమిటీ చైర్మన్ జహంగీర్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
కందుల కథ కంచికే!
నారాయణపేట : గత నెల 11న నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ కేంద్రంలో ఓ హమాలీ రైతు అవతారమెత్తాడు. 58బస్తాల కందులను అక్రమ మార్గంలో విక్రయించేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో సరుకు సంబంధించిన పట్టదారు పుస్తకం వివరాలను యార్డు అధికారులు ప్రశ్నించగా సదరు హమాలీ ఆ సరుకును అక్కడే వదిలి చిత్తగించారు. అ తర్వాత తమ సరుకు అని పేర్కొంటూ యార్డు అధికారులను సంప్రదిస్తే నీ పూర్తిస్థాయి భూమి ఎంత సర్వే నెంబర్ వివరాలను సమర్పించాల్సిందిగా సూచించారు. ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు కమిషన్ ఏజెంట్కు యార్డు అధికారులు నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పట్టుబడిన రోజేమో ఆ కందులు సంబంధిత యార్డు కమిషన్ ఏజెంట్వేనని పేర్కొంటూ వచ్చిన మార్కెట్ అధికారులు, తీరా నెలరోజుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. మరో విధంగా సమాధానం ఇస్తుండటం మరిన్నీ అనుమానాలకు దారితీస్తోంది. ఇదండీ మార్కెట్ అధికారుల పనితీరు ఈ నెలరోజుల వ్యవధిలో సరుకును న్యాయబద్ధంగా విక్రయిస్తున్నట్లు అటు యార్డు అధికారులు, ఇటు సంబంధిత కమిషన్ ఏజెంట్ తెర వెనుక పావులు కదిపి ఆలస్యంగా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిచే ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, మార్కెట్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంబంధిత రైతుకు సంబంధించిన సరుకు ఉన్నట్లయితే ఇన్ని రోజులు తమ సరుకుయార్డులో ఉంచరు. నెల రోజుల వ్యవధిలో కేవలం రెవెన్యూ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా మార్కెట్ అధికారులు మొత్తం 58 బస్తాల్లో 50 బస్తాలు ఇద్దరు రైతులకు సంబంధించినవిగా మిగతా 8 బస్తాలు కమిషన్ ఏజెంట్గా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ వ్యవహరం నడిచేందుకు నెలరోజుల సమయం ఎందుకు పట్టిందనే విషయంపై ఆ అధికారులే స్పష్టం చేయాలి. మరో విషయమేమిటంటే ఆ రోజున మొత్తం 58బస్తాలు రైతులవి కావని.. ఇప్పుడేమో 50బస్తాలు రైతులవని, 8 బస్తాలు కమిషన్ ఏజెంట్వని పేర్కొనడం గమనార్హం. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ 58బస్తాల కందుల వ్యవహారంపై పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న 50 బస్తాలు సంబంధిత రైతులకు, 8 బస్తాలను కమిషన్ ఏజెంట్కు తిరిగి ఇచ్చేశామని మార్కెట్ కార్యదర్శి గోపాల్ చల్లగా సమాధానం దాటవేశారు. సంతకం చేశాను.. నాకేం తెలియదు నేను ఎక్లాస్పూర్లో పనిఒత్తిడిలో ఉన్న సమయంలో ఏమరుపాటు చేసి గ్రామస్తులు కొందరు ఆ కాగితాలపై సంతకం తీసుకున్నారు. గంజ్లో జరిగిన వ్యవహారం గురించి నాకు తెలియదు. గ్రామంలో రైతులకు పంట వేసే సమయంలో తాము ఏవిధంగా అయితే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామో అలాగే సంతకం చేశా. ఇందులో నా ప్రమేయం ఏమిలేదు. – అనంత్రెడ్డి, ఎక్లాస్పూర్ వీఆరోఓ -
వ్యవసాయ మర్కెట్ ఎదుట రైతుల ఆందోళన
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కందులు కొనకుండా అధికారులు మార్కెట్కు తాళం వేయడంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆందోళన చేస్తూ.. మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మార్కెట్ అధికారులను సంప్రదించగా.. గన్నీబ్యాగుల కొరత ఉండటంతోనే కొనుగోళ్లు నిలిపివేసామని తెలిపారు. సుదూరప్రాంతాల నుంచి పంటతో మార్కెట్ కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. -
పత్తి ధర మళ్లీ పతనం
- కనిష్టం రూ. 4,100 - గరిష్టం రూ.5,930 - రూ.20 లక్షలు నష్టపోయిన రైతులు ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర మళ్లీ పతనమైంది. మూడు రోజుల్లో క్వింటా ధర రూ.300 వరకు తగ్గింది. గత పక్షం రోజులుగా క్వింటా రూ. 6 వేలకు పైగా పలుకుతూ స్థిరంగా కొనసాగింది. ధర తగ్గు ముఖం పట్టడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. శనివారం వరకు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ వారం ప్రారంభం రోజు సోమవారం యార్డుకు 11,641 క్వింటాళ్లు, మంగళవారం..13,088 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటా ధర కనిష్టం రూ.4,100, గరిష్టం రూ. 5,930 పలికడంతో బుధవారం 6,344 క్విటాళ్లు మాత్రమే తీసుకొచ్చారు. ధర తగ్గడంతో ఒక్క రోజే రైతులు దాదాపు రూ.20 లక్షలు నష్టపోయారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కొంత మేర తగ్గడంతో ఆ ప్రభావం ఆదోని యార్డుపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వేరుశనగ రైతుకు ఊరట ఆదోని మార్కెట్లో వేరుశనగ ధర స్వల్పంగా పెరిగింది. వారం క్రితం క్వింటా కనిష్టం రూ.3,186, గరిష్టం రూ. 5,263 పలుకగా బుధవారం కనిష్టం రూ.3,059, గరిష్టం రూ.5,759 పలికింది. అయితే రైతుల వద్ద దిగుబడులు పెద్దగా లేవు. తమ వద్ద నిల్వలు లేనప్పుడు ధర పెరిగితే తమకేమి ప్రయోజనమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన ధరకు అమ్ముకున్న రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యార్డుకు 841 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. రబీలో సీజన్లో భాగంగా నవంబరులో బోరు బావుల కింద వేరుశనగ సాగు చేసిన రైతులు పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్లో ధర బాగుండడంతో చేతికి అందిన దిగుబడులను వెంటనే మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. కనిపించని పప్పుశనగ ఆదోని మార్కెట్ యార్డులో పప్పు శనగ దిగుబడులు కనిపించడంలేదు. మూడేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాళ్ల పప్పు శనగలు యార్డుకు అమ్మకానికి వచ్చేవి. ఈ ఏడు కూడా డివిజన్లో 20 వేల హెక్టార్లకు పైగా పంట సాగు చేశారు. అయితే నవంబరు నుంచి వాన చినుకు లేకపోవడంతో విత్తనం మొలకెత్తలేదు. మొలకెత్తిన పొలాల్లో మొక్కలు ఎండి పోయాయి. కనీసం విత్తనం ఖర్చు కూడా రైతులకు గిట్టుబాటు కాలేదు. దీంతో యార్డులో ఎక్కడా ఒక్క కిలో కూడా పప్పు శనగ అమ్మకానికి రాలేదు. -
మార్కెట్ యార్డులో మాయాజాలం
డీపీసీలో తక్కువ ధర కోట్ చేసిన వ్యాపారులు పంట విక్రయించబోమన్న అన్నదాతలు అసిస్టెంట్ కలెక్టర్ వాహనం అడ్డగింత కలెక్టర్ చెంతకు చేరిన వివాదం అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన వ్యాపారులు రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకారం సుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మాయజాలం కొనసాగుతోంది. నేరుగా కొనుగోలు కేంద్రం (డీపీసీ)లో కొనుగోలుదారులు నాణ్యమైన పంటకు తక్కువ ధర కోట్ చేయడంపై అన్నదాతలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ ఏజెంట్ల వద్ద మామూలు సరుకుకు ఎక్కువ ధర పలకడం, డీపీసీలో మేలైన సరుకుకు తక్కువ ధర కోట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరుకు అమ్మబోమంటూ భీష్మించారు. ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ కొనుగోలుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన వ్యాపారులు తాము కోట్ చేసిన ధర కంటే రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 14 మంది రైతులు సోమవారం దాదాపు 200 పసుపు బస్తాలను డైరెక్ట్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కమీషన్ ఏజెంట్లు.. డీపీసీలోకి వచ్చిన పసుపునకు ధర తక్కువగా కోట్ చేయాలని కొనుగోలుదారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో, బయట మామూలు పసుపునకే మంచి రేటు పలగా, డీపీసీలో నాణ్యమైన పంటకు రూ.6,600 పలకడంపై రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య దృష్టికి తీసుకెళ్లి, ఇదే ధరకైతే అమ్మేది లేదని రైతులు భీష్మించారు. దీంతో సంగయ్య అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్కు సమాచారమివ్వగా, ఆయన వచ్చి తక్కువ ధర కోట్ చేసిన దుకాణం వద్దకు వెళ్లి పసుపును పరిశీలించారు. ఎంతో కష్టపడి పండిస్తున్నామని, తమ శ్రమను దోచుకోవడంపై రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారు. లైసెన్సులు రద్దు చేస్తాం.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, వారిని మోసం చేస్తే సహించబోమని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ ఖరీదుదారులను హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖరీదుదారులతో ఆయన మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు కుట్ర పన్నుతున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల లైసెన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కొనుగోలుదారులందరూ డీపీసీకి వచ్చి ధరలు కోట్ చేయాలని ఆదేశించారు. ధర ఎందుకు తక్కువగా కోట్ చేశారని కొనుగోలుదారులను ప్రశ్నించగా, డబ్బులు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, నాణ్యత లేదని చెప్పడంతో అసిస్టెంట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రకాల పసుపును తీసుకొచ్చి వారికి చూయించండంతో వారు నోరెళ్లబెట్టారు. డీఎంవో రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీలు నరేందర్, వజీరుద్దీన్, డీపీసీ ఇన్చార్జీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం, మార్కెట్లో జరుగుతున్న మోసాన్ని గ్రహించిన అసిస్టెంట్ కలెక్టర్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన తర్వాతే వెళ్లాలని, లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దిగొచ్చిన వ్యాపారులు తాజాగా మార్కెట్లో జరిగిన మోసాలపై అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ కలెక్టర్ యోగితారాణాకు వివరించారు. ఎలాగైనా రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెట్ అధికారులను ఆదేశించారు. ధరలో ఇంత వ్యత్యాసం ఉంటే మీరేం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారు హుటాహుటీన మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకొని ఖరీదుదారులను పిలిపించారు. కమీషన్ ఏజెంట్ల వద్ద ఉన్న పసుపునకు ధర కోట్ చేసి, డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీసీకి వచ్చిన పసుపులో దాదాపు 120 క్వింటాళ్లకు రూ.7800 ధర చెల్లించి తీసుకోవాలని ఖరీదుదారులను ఆదేశించారు. డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులకు నోటీసులు జారీ చేస్తామని సెక్రటరీ సంగయ్య తెలిపారు. త్వరలో కలెక్టర్తో వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మార్కెట్లోనే మద్దతు ధర
► జేసీ యాస్మిన్ బాషా ► సిరిసిల మార్కెట్లో కందుల కొనుగోళ్లు ప్రారంభం సిరిసిల్ల : రైతులు తాము పండించిన కందులను మార్కెట్ యార్డుల్లో విక్రయిస్తేనే మద్దతు ధర లభిస్తుందని జేసీ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ఉత్పత్తులను దళారులు, ప్రైవేట్ బ్రోకర్లకు విక్రయించకుండా మార్కెట్కు తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తూకంలోనూ మోసాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కిందుల మద్దతు ధర రూ.4,625 ప్రకటించిందని, రాష్ట్రప్రభుత్వం రూ.425 బోనస్ ఇస్తోందన్నారు. తద్వారా రైతుకు క్వింటాలుపై రూ.5050 ధర లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సేవలు అందిస్తామని ఏఎంసీచైర్మన్ జిందం చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిల్కుమార్, ఏఎంసీ కార్యదర్శి రాజశేఖర్, ఏఈవో తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తు రాంరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి
నిర్మల్టౌన్ : కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సీజన్ లో రైతులు ఎక్కువగా కంది పంటను వేశారని తెలిపారు. గత ఏడాది కందులకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు మద్ధతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాగా ఈ యేడాది కేవలం రూ.5050 మద్దతు ధరను కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3,667 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేశారని తెలిపారు. మద్ధతు ధర పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కిషన్ కుమార్, జగన్ మోహన్, ఎస్ఎన్ రెడ్డి, శంకర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అందని ‘కూల్’ వాటర్
► బయట పడేసిన వాటర్కూలర్ పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్యార్డులో పంట దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చే అన్నదాతల దాహర్తిని తీర్చేందుకు కొనుగోలు చేసిన వాటర్కూలర్ను నిర్లక్ష్యంగా బయట పడేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకుంటున్న పాలకవర్గ ప్రతినిధులు రైతాంగానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో మరోకూలర్ను ఏర్పాటు చేసుకుని కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం చల్లని నీళ్లు తాగుతూ తమను విస్మరించడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్కమిటీ పాలకవర్గం యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
గ్రీన్ మార్కెట్ యార్డుగా అభివృద్ధి
- శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు - శరవేగంగా ర్యాంపులు, షెడ్ల నిర్మాణం - వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు కర్నూలు (వైఎస్ఆర్సర్కిల్): పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కర్నూలు మార్కెట్ యార్డును..రెండు నెలల్లో పచ్చదనంతో నింపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం ఉదయం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర యార్డులను పరిశీలించిన అనంతరం సాయంత్రం ఆయన కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని కూలేందుకు సిద్ధంగా ఉన్న షెడ్లతో పాటు శిథిలావస్థలోని గోదాములను పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జంబో గోదామును తనిఖీ చేసి మార్చిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపించిన మరుగుదొడ్లను, షెడ్ల వద్ద ఉన్న అపరిశుభ్రతను గమనించి.. అధికారులకు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ పథకం కింద యార్డుల్లో పచ్చదనం వెల్లవిరిసేలా బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంగవైకల్యం కల్గిన రైతులు గోదాములోకి వెళ్లేలార్యాంపుల నిర్మాణం శరవేగంగా జరగాలని ఆదేశించారు.మార్కెట్ల శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కూలిని పెంచాలని హమాలీలు.. కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. వ్యాపారులు, రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి కమిషనర్ భరోసానిచ్చారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు సుధాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): కర్నూలు మార్కెట్యార్డు వచ్చే నాలుగు రోజులు మూత పడనుంది. వరుస సెలవు దినాలు రావడంతో రైతులు కలవరపడుతున్నారు. 26న గురువారం గణతంత్రదినోత్సవం, 27న శుక్రవారం అమావాస్య(సెంటిమెంట్తో రైతులు, వ్యాపారాలు ఎలాంటి లావాదేవీలు జరపరు), 28న శనివారం (నగదు బదిలీతో రెండు నెలలుగా శనివారాలు యార్డు కార్యకలాపాలు స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు). 29న ఆదివారం. దీంతో మార్కెట్లో నాలుగు రోజులపాటు క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఖుషీఖుషీగా అధికారులు మార్కెట్ అధికారులు, సిబ్బంది ధాన్యం కొలిచేటప్పుడు దుమ్ము..«ధూళితో అవస్థలు పడుతున్నా.. విధులను మాత్రం నిర్విరామంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు కావడంతో వారు ఉపశమనంగా భావిస్తూ ఖుషీ..ఖుఫీగా ఫీలవుతున్నారు. -
పత్తి రికార్డు ధర.. క్వింటాలు రూ. 5,725
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాలుకు రూ. 5,725 ధర పలికింది. మార్కెట్కు 6434 క్వింటాళ్ల పత్తి రాగా, కనిష్ట ధర క్వింటాల్కు రూ.5,205, మోడల్ ధర క్వింటాల్కు రూ. 5,555, మ్యాగ్జిమం ధర క్వింటాల్కు రూ. 5,725 పలికింది. కేసముద్రం మార్కెట్లో కనిష్టంగా రూ. 5,150, గరిష్ఠంగా రూ. 5,605 ధర పలికింది. వరంగల్ రూరల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డ్లో గరిష్ఠంగా రూ. 5,475, కనిష్ఠంగా రూ. 5,250 ధర పలికింది. ఈ ఏడాది పత్తి సీజన్లో ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతుండడంతో రైతులు తమ ఇళ్లలో దాచుకున్న పత్తికి మరింత ధర వస్తుందన్న ఆశగా ఎదురుచూస్తున్నారు. -
చివరి బస్తాలో చేతివాటం
– మార్కెట్ యార్డులో వెలుగు చూసిన కొత్త మోసం – ఆందోళనకు దిగిన రైతులు – కార్యదర్శి చొరవతో బాధిత రైతులకు పరిహారం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): మార్కెట్యార్డు కేంద్రంలో వ్యాపారులు రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. గురువారం కొందరు రైతులు గమనించి ఆందోళనకు దిగడంతో మార్కెట్ కార్యదర్శి జోక్యం చేసుకుని దుకాణంపై కేసు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. పూర్తి వివరాలు.. ఆలూరు మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన జగదీష్, మల్లేష్తో పాటు మరో పది మంది రైతులు వామును కర్నూలు మార్కెట్యార్డుకు గురువారం తీసుకొచ్చారు. ఉదయం నుంచి వారు వేచి ఉండి మార్కెట్యార్డులోని ఉమామహేశ్వర ట్రేడర్స్ (షాపు నెం.40బి)లో విక్రయించారు. తొలుత సుమారు 15 బస్తాలను కాటా వేసిన వ్యాపారులు ఆఖరి బస్తాలో 22 కేజీల వాము ఉండగా, 15 కేజీలే ఉన్నట్లు రసీదులు ఇవ్వడంతో రైతులు అవాక్కయ్యారు. తాము తెచ్చింది 22 కేజీలు అయితే, 15 కేజీలు ఎలా వస్తాయని వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే మరికొంతమంది రైతులు తమకు కూడా ఇదే తరహా మోసం జరిగిందనీ, న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని వ్యాపారులకు నిరసనగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి నారాయణ మూర్తి సంబంధిత దుకాణాన్ని తనిఖీ చేసి విచారించారు. విచారణలో మోసం వెలుగు చూడటంతో సంబంధిత వ్యాపారులపై కేసు నమోదు చేసి చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్బంగా సెక్రటరీ నారాయణ మూర్తి మాట్లాడుతూ మోసపోయిన రైతులకు సంబంధిత వ్యాపారుల నుంచి 10 కేజీల వాము విలువను చెల్లించాలని ఆదేశించారు. దీంతో రైతుల వివాదం సద్దుమణిగింది. -
మార్కెట్ యార్డులకు స్వైప్ మిషన్లు
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్యార్డులలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్వైప్ మిషన్లను అందజేసింది. మార్కెట్యార్డుల్లో క్రయ, విక్రయాలకు సంబంధించిన చెల్లింపులు అప్పటికప్పుడే స్వైప్ మిషన్ల ద్వార జరుపుకునేందుకు ఈ పద్ధతిన అవకాశం ఉంటుందని పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య తెలిపారు. పెద్దపల్లి యార్డుకు కేటాయించిన స్వైప్ మిషన్ ను సోమవారం ఆయన పరిశీలించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు తన సొంత నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలు జరపడంలో ముందుంచినట్టే మార్కెటింగ్శాఖలోనూ ఆ దిశగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మొదలైన ‘నామ్’ సేవలు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్యార్డులలో ఆన్ లైన్ పద్ధతిన పంట దిగుబడుల లావాదేవీలు నిర్వహించేందుకు నామ్ సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి మార్కెట్యార్డులో సోమవారం తొలిసారిగా క్రయ, విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. మార్కెట్ యార్డుకు 51మంది రైతులు సోమవారం తెచ్చిన 218 క్వింటాళ్ల పత్తిని ఆన్ లైన్ పద్ధతిన విక్రయించారు. ఈ మేరకు రైతులకు ఆన్ లై న్ కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలయ్య, సూపర్వైజర్ శంకరయ్య తెలిపారు. పెద్దపల్లి మార్కెట్యార్డులో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవలు, నగదురహిత లావాదేవీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 218 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం 218 క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. 51 మంది రైతుల ద్వార యార్డుకు వచ్చిన పత్తికి క్వింటాలు ధర రూ.5460 అత్యధికంగా నమోదు కాగ, కనిష్టంగా రూ.5050 గా నమోదైందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. సరాసరి ధరను రూ.5350గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
16 నుంచి వాము క్రయ, విక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్):కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 16 నుంచి వాము క్రయ, విక్రయాలు జరుగునున్నాయి. మార్కెట్కు వచ్చే వామును టెండర్ పద్ధతిలో కొనుగోలు చేస్తారని మార్కెట్ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి తెలిపారు. వాము పండించిన రైతులు పంటను మార్కెట్కు తీసుకవచ్చి గిట్టుబాటు ధరకు అమ్మకోవాలని ఆయన కోరారు. -
రైతు బంధు.. దూరబంధువు!
∙వినియోగించుకుంటే ప్రయోజనాలెన్నో ∙రూ.2 లక్షలకు పెరిగిన రుణ పరిమితి ∙అన్నదాతలకు తెలియ కుండా పోయిన వైనం! ∙అవగాహన కల్పించని శాఖ అధికారులు మంచిర్యాల అగ్రికల్చర్ : అన్నదాత ఆత్మబంధువుగా నిలవాల్సిన రైతుబంధు పథకం.. వారికి దూర బంధువు అవుతుంది. కష్టకాలంలో కడదాకా తోడుండాల్సిన ఈ ఆర్థిక తోడ్పాటు అవకాశం.. వారి దరి చేరకుండానే ఉంటోంది. ధర ఉండి పంట చేతికి రాని సమయంలోనైనా.. దిగుబడి వచ్చి ధర లేని పరిస్థితుల్లో అయినా ఆదుకునే రైతుబంధు పథకం.. అవగాహన లేమి కారణంగా రైతులకు వినియోగంలో ఉండడం లేదు. ఈ విషయంలో రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వంద మందిలోపే రైతులు రైతు బంధు పథకంలో చేరారంటే.. ఈ పథకంపై ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ద్వారా రైతులకు లబ్ధి వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో పండించిన పంటలకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పడు పంటలను అమ్ముకుని నష్టపోకుండా.. కొంత కాలం ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచి ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందుటకు రైతుబంధు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్ యార్డుల్లో అమ్ముకునే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన ధీమా ఇవ్వడానికి బీమా సౌకర్యం సైతం ఉంది. ఇలాంటి బృహత్తర పథకం అమలు బాధ్యత మార్కెట్ కమిటీలపైన ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభింపచేయడంలో మార్కెట్ కమిటీల కార్యదర్శులు, ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ప్రాంతీయ అధికారులపై ఉంటుంది. ఈ పథకం కోసం పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. రైతులు మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచినా సరుకుల విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. గతంలో గరిష్టంగా లక్ష పరిమితి ఉన్న రుణ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పెంచింది. సరుకులు నిల్వ ఉంచుకొని, ఇలా రుణాలను తీసుకున్నా రైతులకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు. కొత్తగా రూపొందించినా విధి విధానాల్లో భాగంగా రైతుబంధు కార్డు 5 సంవత్సరాలకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఈ పథకం ద్వారా లాభాలు వరి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న తదితర ఉత్పత్తులు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది. రైతు రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు. ►రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించిన సమయంలో సరైన ధర లేదని భావిస్తే తొమ్మిది నెలల పాటు గోదాములో నిల్వ చేసుకోవచ్చు. ►డివిజన్ కేంద్రాల్లో ఉండే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో కూడా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. ►రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రతతో పాటు బీమా సౌకర్యం కలదు. ► అయితే ఇక్కడ నిల్వ ఉంచే ధాన్యానికి నామమాత్రపు ఫీజు వసూలు చేసి వివరాలతో కూడిన గేట్ పాస్ అందజేస్తారు. ► మార్కెట్ యార్డుల పరిధిలోని గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ ఉంచుకున్న మూడు నెలల కాలానికి గానూ ఎలాంటి రుసుము తీసుకోరు. ►180 రోజుల నుంచి 270 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనికి గానూ రైతు నుంచి 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ► 270 రోజులు దాటితే రైతులకు నోటీసు ద్వారా తెలియజేసి నిల్వ ఉంచినా సరుకుల్ని, వేలం ద్వారా అమ్మి, వచ్చినా మొత్తం నుంచి గోదాము అద్దె, బీమా రుసుము, చెల్లించవలసినా వడ్డీ మినహాయించుకొని మిగతా మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. ►వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో తగినా నిల్వ సదుపాయాలు లేనప్పడు, సరుకులతో నిండినప్పుడు ఎక్రిడేషన్ చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, లేదా రాష్ట్ర గిడ్డంగులు, లేదా సెంట్రల్ వేర్ హౌసింగ్ సంస్థల గోదాములు, శీతల గిడ్డంగులలో కూడా నిల్వ చేసుకొన్నా వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా మారకం చేయగల గిడ్డంగి రశీదులు తీసుకొని రుణాలను పొందవచ్చు. ►రైతు నిల్వ ఉంచిన ధాన్యానికి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకు 75 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. లేదా రూ.2 లక్షల వరకు గరిష్ట పరిమితికి లోబడి ఏది తక్కువైతే దానిని ఎలాంటి భూమికి సంబంధించి దస్తావేజులు తనఖా పెట్టకుండానే రుణం పొందవచ్చు. ►మూడు నెలల్లోపు ఎప్పుడైనా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. బీమా సౌకర్యం ►రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలిస్తున్న క్రమంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మార్కెట్ కమిటీ నుంచి రూ.లక్ష ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. రైతుతో పాటు హమాలీలు, దడువాయి(ధాన్యం తూకం వేసే వ్యక్తుల)లకు ప్రమాదం జరిగి మరణిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సౌకర్యం ఉంది. ఈ బీమా 18 నుంచి 60 ఏళ్ల రైతులకు వర్తిస్తుంది. ►మార్కెట్ తీసుకువచ్చిన సమయంలో ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం పొందిన రైతుకు రూ.75 వేల వరకు బీమా వర్తిస్తుంది. ►ప్రమాదంతో పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.25 వేల వరకు పొందవచ్చు. ►రైతు పండించిన అన్ని రకాల పంటల(సోయా, వేరుశనగ, «శనగ, వడ్లు, పెసర, బబ్బెర, కందులు, పొద్దుతిరుగుడు, ఆముదం, మొక్కజొన్న, ఉలవలు)కు బీమా సౌకర్యం వర్తిస్తుంది. ►రైతు ధాన్యాన్ని వరసుగా మూడు సార్లు ఆయా మార్కెట్ యార్డుల్లో అమ్మినట్లు తక్పట్టి కలిగి ఉండాలి. ►ఒక క్వింటాలు నుంచి ఎంత ధాన్యం అమ్మినా పథకం వర్తిస్తుంది. ►రైతు తాను పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తుండగా, తరలించిన తర్వాత, మార్కెట్ ప్రాంతంలో మరణించినా బీమా డబ్బులు చెల్లిస్తారు. ►ప్రమాదం జరిగిన రోజే రైతు కుంటంబానికి రూ.లక్ష నగ అందజేస్తారు. -
ఆ..కందుల కథేంటీ?
• దొరికిన కందులను ఏమి చేద్దాం • వ్యాపారస్తుల్లో గుబుల్...రహస్య సమావేశం • నావేనంటూ కార్యదర్శి వద్దకు వచ్చిన ఓ రైతు • పట్టాపాస్బుక్...ఆధార్కార్డు తీసుకురావాలని సూచన • ఖంగుతిన్న రైతు...మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన వైనం నారాయణపేట : పదులు కాదు.. ఇరువైలు కాదు ఏకంగా రూ.లక్షన్నర విలువ చేసే కందులను అక్రమంగా మార్క్ఫెడ్లో విక్రయించేందుకు వ్యాపారులే రైతుల అవతారం ఎత్తుతున్నారు. ఈ నెల 11న ఓ హామీలీ 58 సంచుల కందులను స్థానిక మార్క్ఫెడ్ కేంద్రంలో రైతు పేరిటా విక్రయిస్తూ మార్కెటింగ్ అధికారులకు పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. రైతుల పేరిట దొంగ సరుకును విక్రయిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పేట వ్యవసాయ మార్కెట్లో వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కొక్క రీతిలో సరుకును విక్రయించేందుకు యత్నిస్తూ చివరి సమయంలో పట్టుబడుతున్నారు. ఓవైపు జిల్లాలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ముమ్మరం కానుండడంతో ఆ గాలి నారాయణపేట మార్కెట్ యార్డుపై పడే అవకాశాలు లేకపోలేవనే చర్చ కొనసాగుతుంది. 58 బస్తాల కందులు దాదాపు 29 క్వింటాళ్ల తూకం అవుతుందని ఒక క్వింటా ధర రూ.5,050 మార్క్ఫెడ్ కేంద్రంలో విక్రయిస్తే మొత్తం రూ.1,46,450 అవుతుంది. అయితే గతంలో స్థానిక వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కందులను కొనుగోలు చేసి ప్రస్తుతం వాటిని అధిక ధరలకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ మార్కెట్లో పనిచేసే ఓ హమాలీ రైతు అవతారమెత్తించి కందులను విక్రయించేందుకు మార్క్ఫెడ్ యార్డుకు తరలించి పట్టుబడిన వైనం వ్యాపార వర్గాల్లో గుబులురేపుతోంది. జీరో వ్యాపారానికి అలవాటుపడిన నారాయణపేట వ్యాపారులకు మార్క్ఫెడ్ కేంద్రం గుదిబండలా మారినట్లు ఈ సంఘటనను బట్టీ స్పష్టమవుతుంది. అంతేకాకుండా పాలకవర్గ చైర్మన్ రైతులకు అండగా నిలుస్తూ ఎక్కడ అన్యాయం జరగకుండా యార్డులో పర్యవేక్షణ చేపడుతూ సమస్యలు పరిష్కరిస్తుండడంతో వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా పోతుంది. పట్టుబడిన కందులు గంజిలోని ఓ కమీషన్ ఏజెంట్కు సంబంధించినట్లుగా తెలుస్తోంది. దొంగ సరుకును ఎలాగైనా రైతు సరుకుగా చూపించేందుకు తెరవెనుక గురువారం యార్డులో రాజకీయ బేరసారాలు మొదలుపెట్టారు. ఆ సరుకును అక్కడి నుంచి కనిపించకుండా చేయడమా..? రైతుల పాసుపుస్తకాలను పెట్టి చూపించడమా అనే దానిపై యత్నాలు మొదలయ్యాయి. వ్యాపారుల ప్రత్యేక సమావేశం.. పట్టుబడిన కందులను ఏం చేద్దాం.. మా ర్కెట్ చైర్మన్ ఎంత పనిచేస్తాడో.. ఇలాగైతే వ్యాపారాలు యార్డులో చేయడం కష్టం.. అంటూ వ్యాపారులు రహస్య సమావేశంలో చర్చించుకున్నట్లు సమాచారం. మార్క్ఫెడ్లో పట్టుబడిన కందులు ఎవరివి.. ఆ కందులకు సంబంధించిన కమీషన్ ఏజెంట్ ఎవరా అనే విషయమై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అసలు ఆ కందులు కమీషన్ ఏజెంట్వా.. లేక రైతువా అని చర్చించారు. తనవే నని ఎవరైనా ముందుకు వస్తే ఏదో ఒకటి చేస్తామని వ్యాపారులు సదరు కమీషన్ ఏజెంట్కు భరోసానిచ్చినట్లు వినికిడి. అధికారులు, పాలకవర్గాన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలంటే సగం సగం ఖర్చు అయినా ఫర్వాలేదు.. ఇందుకు సిద్ధంగా ఉండాలని చర్చించుకున్నట్లు సమాచారం. కంగుతిన్న రైతు..మళ్లీ వస్తానని మాయం.. పట్టుబడిన కంది బస్తాలు తనవేనంటూ ఓ రైతు గురువారం మార్కెట్ కార్యదర్శి ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే బుధవారం ఎందుకు చెప్పకుండా వెళ్లావని ప్రశ్నిస్తే.. హడావుడిలో ఏం చెప్పాలో తోచక వెళ్లానని కార్యదర్శితో చెప్పుకొచ్చారు. అయితే పట్టా పాసుపుస్తకం, ఆధార్కార్డు తీసుకురావాలని ఆ రైతుకు కార్యదర్శి సూచించడంతో పాలుపోలేని రైతు తడబడుతూ సార్ మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కందులను చూయించేందుకు అనాసక్తి.. పట్టుబడిన 58 కంది బస్తాలను మార్క్ఫెడ్ కార్యాలయం నుంచి మార్కెట్ పాత కార్యాలయంలోకి మార్చారు. కంది బస్తాలు ఎక్కడ పెట్టారని మార్కెట్ అధికారులను అడగగా అవి మార్క్ఫెడ్ వారి ఆధీనంలో ఉన్నాయని ఒకరు.. వారిని అడిగితే అవి మార్కెట్ అధికారుల పరిధిలో ఉన్నాయంటూ మరొకరు చెప్పుకొచ్చారు. మార్కెట్ కార్యాలయంలో ఉన్న కంది బస్తాల ఫొటోలను చిత్రీకరించేందుకు ‘సాక్షి’ విలేకరి అక్కడికి వెళ్లగా మార్క్ఫెడ్ అధికారి మాత్రం తనకు సంబంధం లేదంటూ తాళం వేసుకొని వెళ్లిపోయారు. -
రైతు ‘బంద్’
ఒంగోలు టూటౌన్ : రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యంలో నీరుగారుతోంది. ప్రచార లోపంతో అన్నదాత దరిచేరడంలేదు. గత ఆరు సంవత్సరాలలో ఈ పథకం కింద కొద్ది మంది రైతులే రుణాలు పొందారంటే ఈ పథకంపై ప్రచారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్నా రైతుల చెంతకు నేటికి చేరనేలేదు. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం అమల తీరుపై సాక్షి కథనం.. మార్కెట్ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది. రైతు రూ. లక్ష వరకు బీమా పొందవచ్చు. నిల్వ చేసిన పంట ఉత్పత్తులకు 75 శాతం వరకు రుణం అందజేస్తారు. మూడు నెలల వరకు ఎలాంటి రుణం వసూలు చేయరు. మార్కెట్ యార్డులలో పెట్టిన పంట ఉత్పత్తులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. పథకంపై కొరవడిన అవగాహన: ఏతలు నాడు ఉన్న ఉత్పత్తి ధరలు కోతల నాటికి తగ్గిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కాలం గాని కాలంలో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నా.. రైతులకు మాత్రం దక్కడం లేదు. ఇళ్లలో నిల్వ చేసుకునే సామర్ధ్యం లేక చాలా మంది రైతులు పంట ఉత్పత్తులను తెగనమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ యార్డు సౌకర్యం, రైతుబంధు పథకం లాభాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పథకాన్ని ఉపయోగించుకుంటారు. కానీ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ప్రచారాన్ని కరపత్రాలకే పరిమితం చేస్తున్నారు. ఏదోఒక సందర్భంలో రైతులతో జరిగే సమీక్షలలో ఒకటి, రెండు మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అన్నదాత దరి చేరటంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రచారం కల్పిస్తున్నాం: రైతు బంధు పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.86.40 లక్షలను రైతులకు స్వల్పకాలిక రుణాలుగా అందించాం. పంట కోతల అనంతరం గిట్టుబాటు ధర లేనిపక్షంలో పథకం ఉపయోగించుకునేలా రైతులను చైతన్యవంతం చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ సయ్యద్ రఫీ అహ్మద్ తెలిపారు. పథకం ఉద్దేశం: రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని, రుణం మంజూరు చేసి వారిని ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశం. ముందుగా రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డులలో నిల్వ చేసుకోవాలి. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఉంచుకోవచ్చు. మార్కెట్ కమిటీలలో తనఖా ఉంచిన ధాన్యం విలువలో 75 శాతం వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు. గతంలో లక్ష రుణం మంజూరు చేసేవారు. రెండేళ్ల క్రితం రుణ సదుపాయం దాదాపు రూ.2 లక్షల వరకు పెంచారు. ఏఎంసీల ద్వారా స్వల్పకాలిక రుణాలుగా ఇస్తారు. ఇటువంటి రుణాలకు 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ ఉండదు. అనంతరం 181వ రోజు నుంచి 270వ రోజు వరకు స్వల్పంగా 12 శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం పథకం అమలుపరిస్థితి: ఆరేళ్లుగా ఈ పథకం ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరలేదు. 2010–11లో 103 మంది మాత్రమే వినియోగించుకున్నారు. 2011–12 లో కేవలం 78 మాత్రమే ఉపయోగించుకోగా.. 2012–13 లో 70 మంది లబ్ధిపొందారు. 2013–14లో 97 మంది రైతులు వినియోగించుకోగా..2014–15 ఆర్ధిక సంవత్సరంలో 117 మంది రైతులు ఈ పథకం కింద రుణాలు పొందారు. 2015–16లో 91 మంది రైతులకే పరిమితమైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కేవలం 61 మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. మొత్తం మీద గడిచిన ఆరేళ్లలో కేవలం 600 మందికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడింది. జిల్లాలో ఆరు లక్షల వరకు రైతులు ఉంటే ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం ఏ కొద్ది మందికో ఉపయోగపడిందంటే పథకం ఏ స్థాయిలో నీరుగారుతోందో తెలుస్తోంది. రైతుకు ఎన్నో లాభాలు: వరి, మొక్కజొన్న, పెసర, ఆముదం, పొద్దుతిరుగుడు, ఉలవలు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను -
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మార్క్పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మార్క్పెడ్ మద్దతు, బోనస్తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్పెడ్ జిల్లా మేనేజర్ పరిమల మాట్లాడుతూ... రైతులు కందులను తగిన నాణ్యతా ప్రమాణాలతో తీసుకవస్తే రూ.5050 ధర లభిస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి త్వరలో మరో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి, మార్క్ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
వేసే గడువు ముగిసె..!
జిల్లాలో రూ.600 కోట్లు డిపాజిట్ తీరని కరెన్సీ, చిల్లర కష్టాలు ఏళ్ల పోరాటాలు ఫలించాయి.. కొత్త జిల్లా కల నెరవేరింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరును సొంతం చేసుకుంది.. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు.. సహజ వనరులు.. ముఖ్యమైన పరిశ్రమలు, దట్టమైన అడవులు జిల్లా పరిధిలోకి చేరాయి. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. భద్రాద్రి ఆలయ ట్రస్టు బోర్డును ఇంకా నియమించలేదు. సింగరేణి ఆవిర్భావోత్సవాలను కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవుల్లో జిల్లా నేతలకు అవకాశం దక్కకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు. – సాక్షి కొత్తగూడెం -
కొత్త మార్కెట్ చట్టాన్ని తీసుకువస్తున్నాం
శాసన మండలిలో మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డు బయట కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా నూతన చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని, నల్సార్ యూనివర్సిటీ నిపుణుల సాయంతో ఈ చట్టాన్ని రూపొందిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మార్కెటింగ్ శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన రూ 920 కోట్ల నగదును వారి అకౌంట్లలోకి బదిలీ చేశామని మంత్రి వెల్లడించారు. కాగా, షాదీ ముబారక్ పథకం కింద 1.60 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, హరీశ్రావు స్పందిస్తూ....ఈ పథకం కింద అర్హులైన వారందరికి డబ్బు అందిస్తామని, ఒకవేళ కేటాయించిన బడ్జెట్ సరిపోకపోతే అదనపు బడ్జెట్ కేటాయించైనా వారికి సాయం చేస్తామని చెప్పారు. -
త్వరలో కొత్త మార్కెట్ చట్టం: హరీష్రావు
హైదరాబాద్: మార్కెట్యార్డుకు బయట కొనుగోలుచేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా నూతన చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని సాగునీటి, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరిష్రావు ప్రకటించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మార్కెటింగ్ శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ రైతులు విక్రయించిన ధాన్యానికి వచ్చిన రూ.920 కోట్లు నగదును రైతుల అకౌంట్లలోకి బదిలీ చేశామని చెప్పారు. హమాలీ, దడ్వాయి, చేట కూలీలతో కలిపి మార్కెట్లలో 15399 మంది కూలీలు పనిచేస్తున్నారని వారికి కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. -
‘నగదు రహిత’ ఏర్పాట్లు చేసుకోండి
- రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించండి - మార్కెట్ యార్డు సెక్రటరీలకు ఆర్జేడీ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్ : నోట్ల రద్దు నేపథ్యంలో ఇక నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలు నగదు రహితంగా నిర్వహించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సి.సుధాకర్ ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక మార్కెట్యార్డులో ఏడీ బి.హిమశైలతో కలిసి 13 మార్కెట్యార్డు కమిటీ సెక్రటరీలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా నగదు రహితంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని, యార్డులు, చెక్పోస్టులలో స్వైప్మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ ఫీజు వసూళ్లలో అనుకున్నదానికన్నా ఈ సారి రూ.కోటి వరకు వెనుకబడ్డారని, ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి సారించాలని చెప్పారు. యార్డులు, చెక్పోస్టులపై దృష్టి సారించి మార్చి నెలాఖరుకు రూ.17.11 కోట్లు రాబడి సాధించాలని ఆదేశించారు. ఏడీ హిమశైలజ మాట్లాడుతూ 60 స్వైప్మిషన్లు అవసరమని ఇప్పటికే దరఖాస్తు చేశామని, రెండు మూడు రోజుల్లో కొన్నింటిని బిగిస్తామని చెప్పారు. -
మిర్చి రైతుల ఆందోళన
మలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం హైదరాబాద్: రాజధానిలోని మలక్పేట వ్యవసాయ మార్కెట్లో గురువారం రైతులు, వ్యాపారులు, కమీషన్దార్లు మిర్చిఆన్లైన్ (ఇనామ్) కొనుగోలు పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ పి.రవికుమార్ చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుల్తాన్బజార్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదరగొట్టారు. రవికుమార్ మాట్లాడుతూ.. ఏడు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇనామ్ ద్వారా మిర్చి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇది వ్యాపారులు, కమీషన్దారులకు మిం గుడుపడటం లేదన్నారు. అందుకే కొందరు కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు... గుమ స్తాలు, రైతులను ఉసిగొల్పి ఆందోళన చేరుుంచారన్నారు. రైతులను రెచ్చగొట్టిన వారిపై కేసులు నమోదు చేరుుస్తామని ఎస్జీఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పారు. బాధ్యులైన గుమస్తాలు, కమీషన్దార్ల లెసైన్సలను రద్దు చేస్తామన్నారు. ‘మిర్చి అసోసియేషన్కు సంబంధం లేదు’... మలక్పేట వ్యవసాయ మార్కెట్లో జరిగిన గొడవ మిర్చి వ్యాపారులకు సంబంధం లేదని తెలంగాణ మిర్చి అసోసియేషన్ అధ్యక్షుడు వంజరి వినోద్ స్పష్టం చేశారు. అమ్మకాలలో రైతులకు జరుగుతున్న జాప్యంతో ఆందోళనకు దిగారు తప్ప అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
చెక్కులు వద్దంటూ రైతుల నిరసన
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు అడ్తిదారులు చెక్కులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ చెల్లింపులు జరపడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ మార్కెట్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు కొనుగోళ్లు నిలిచిపోయారుు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో చాలాకాలం తర్వాత రైతులు మార్కెట్కు సరుకులను తీసుకొస్తున్నారు. మార్కెట్కు సరుకులను తీసుకొచ్చిన రైతులకు నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలని మార్కెట్ కమిటీ నిర్ణరుుంచింది. దీంతో కొంతమంది రైతులు గేటుకు తాళం వేసే ప్రయత్నించగా, వారిని చైర్మన్ అడ్డుకుని నచ్చజెప్పారు. ధర విషయంలో కూడా అత్యధికంగా రూ. 5,100లతో కొనుగోళ్లు చేరుుంచారు. -
ఆర్టీసీ బస్సుల్లో డ్వాక్రా మహిళల తరలింపు
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ, ప్రైవేట్, ఇతర వాహనాల్లో జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. కడప మార్కెట్ యార్డ్కు జిల్లా నలుమూలల నుంచి అక్కడకు తీసుకుని వచ్చి వదిలిపెట్టారు. బస్సులన్నీ మార్కెట్ యార్డ్లో పార్కింగ్ చేశారు. కడప రీజనల్ పరిధిలో వివిధ డిపోలనుంచి 28 ఆర్టీసీ బస్సులను నడిపారు. ఈ బస్సులలో కేవలం డ్వాక్రా మహిళలను తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను తీసుకుని వచ్చిన తర్వాత రొటేషన్ పద్ధతిలో ఆర్టీసీ సంస్థకు సదరు బస్సుల అద్దెలను ప్రభుత్వం నుంచి వస్తాయి. అప్పటికపుడు ఛార్జీల ప్రకారం ఇవ్వక పోవడం గమనార్హం. కడప మార్కెట్ యార్డు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ షౌకత్ అలీ, డీటీసీ ఎస్ఐ ఆర్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
బోసిపోతున్న మార్కెట్యార్డు రోడ్డు
చొప్పదండి: మండల కేంద్రంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన మార్కెట్యార్డు రోడ్డు బోసిపోతోంది. నిత్యం నిత్యం వందలాది వాహనాల్లో మార్కెట్కు ధాన్యం, ప్రత్తి, మొక్కజొన్న నిలువలు తరలిస్తూ కళకళలాడే యార్డు రోడ్డు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో వెలవెల బోతోంది. కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు లేక మార్కెట్ పరిసరాలు, బీటీ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. ఈ రోడ్డులో అడ్తి వ్యాపారుల దుకాణాలు, విత్తనాలు, మందుల దుకాణాలు రైతుల హడావిడి కనిపించడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేందుకు వస్తున్నా రద్దు చేసిన నోట్లను వ్యాపారులు స్వీకరించక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల చలామణి పెరిగితే తప్ప మార్కెట్ రోడ్డుకు పూర్వ వైభవం వచ్చేలా లేదు. -
ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
- కిలో ఉల్లి రూ.8కి కొని రూ.10కి అమ్మాలని మంత్రి హరీశ్ ఆదేశం - పత్తి ధర తగ్గకుండా చూడాలని మార్కెటింగ్ అధికారులకు సూచన సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్, ఆలంపూర్ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని మలక్పేట మార్కెట్లోనూ, రైతు బజార్లలోనూ అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కిలో రూ.ఎనిమిదికి కొని వినియోగదారులకు రూ.10కి అమ్మాలని కోరారు. రైతుల నుంచి ఉల్లి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అరుుతే మలక్పేట ఉల్లి మార్కెట్ ఇరుకుగా ఉన్నందున పటాన్ చెరుకు ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుకు ఉల్లి మార్కెట్ను తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ ఏర్పాటుకు గాను పుణే ఉల్లి మార్కెట్ను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపాలని హరీశ్రావు వివరించారు. పాత 500, 1,000 నోట్లతో మార్కెటింగ్ కార్యకలాపాల స్తంభనపై మంత్రి హరీశ్రావు మంగళవారం మూడు గంటలకు పైగా సమీక్షించారు. ముందుగా ఉల్లి వ్యాపారులతో పరిస్థితిని సమీక్షించారు. రూ. 500, 1,000 నోట్ల రద్దు వల్ల వ్యాపార లావాదేవీలు జరపలేమని వారన్నారు. ఏదిఏమైనా వినియోగదారులకు ఉల్లి కొరత లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. త్వరలో కొత్త వ్యవసాయ మార్కెట్ చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టంలో సంస్కరణలు తీసుకువచ్చి కొత్త చట్టం రూపొందించేందుకు ‘నల్సార్ ’వర్సిటీ ప్రతినిధులతో మరో వారంలో సమావేశం జరపాలని మంత్రి నిర్ణరుుంచారు. పత్తి ధర క్వింటాలుకు ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5,000 లభిస్తున్నదని.. ఈ ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిన్నింగ్ మిల్లులపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి, ట్రేడర్లతో సమావేశాలు జరిపి సమస్య పరిష్కరించాలని మంత్రి కోరారు. అలాగే కమిషన్ ఏజెంట్లకు లెసైన్సుల జారీ వ్యవహారంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వెళ్లాలని మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబారుుని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండలో తలపెట్టిన బత్తారుు మార్కెట్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరారు. -
వ్యవసాయ మార్కెట్ బంద్
కల్లూరు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం బంద్ చేశారు.ఈ బంద్ నాలుగు రోజులు వరకు కొనసాగుతుందని మార్కెట్ యార్డు కమిటీ ప్రకటించింది. ఈ పక్రటన ఉల్లి రైతులకు శాపంగా మారింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృత మవుతుంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టార్ఫాలిన్ల కింద ఉల్లిరి ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. -
మిగిలిన ఉల్లి కొనుగోలు
–పెరిగిన ధరలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన ఉల్లిని ఎట్టకేలకు శనివారం కొనుగోలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, కార్యదర్శి నారాయమూర్తిలు చొరవ తీసుకొని తాత్కాలికంగా నగదు కొరతను పరిష్కరించడంతో వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. శనివారం ఉల్లి ధరలు మరింత పెరిగాయి. క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1080 పలికింది. మొన్నటి వరకు కనిష్ట ధర రూ.50 వరకే ఉండగా.. ఇపుడు రూ.400 పలికింది. పెద్ద నోట్లు రద్దుతో ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మార్కెట్లో కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక నగదు కొరత పరిష్కారం అయ్యే వరకు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. -
త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ఆదోని : ఆదోని మార్కెట్ యార్డులో త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయిల్ఫెడ్ ఎండీ ఫణికిశోర్ తెలిపారు. శనివారం ఆయన ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ దిగుబడులను పరిశీలించారు. ధరలు ఎలా ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరికి మాత్రమే ఆశించిన ధర లభిస్తోందని, చాలామంది క్వింటాలు రూ.4వేల లోపే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి రాగానే క్వింటాలు మద్దతు ధర రూ.4220 కు కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు తెలిపారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ మేనేజర్ రమేష్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డు అధికారులతో సమావేశమై వేరుశనగ దిగుబడి, ధరలపై చర్చించారు. -
బద్వేలు ‘దేశం’లో మార్కెట్ చిచ్చు
• జయరాములు, విజయమ్మలకు ప్రిస్టేజీగా మారిన కమిటీ ఎంపిక వ్యవహారం • పరస్పరం మద్దతుదారులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు • ఎమ్మెల్యే సూచించిన ప్యానల్కు మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం • విజయమ్మ శైలిపై సీఎంకు ఫిర్యాదు ? బద్వేలు అర్బన్: అధికారపార్టీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డారుు. టీడీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలపై జరిగిన రచ్చ మరవకముందే తాజాగా మార్కెట్యార్డు చైర్మన్ పదవి ఆ పార్టీలో మరో చిచ్చు లేపినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలో చేరిన జయరాములుకు, మాజీ ఎమ్మె ల్యే విజయమ్మలకు ఈ వ్యవహారం ప్రతిష్టగా మారింది. దీంతో ఇరువురు ఎదుటి వారి మద్దతుదారులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఒకానొక దశలో ఎమ్మెల్యే జయరాములు సూచించిన వ్యక్తికి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు అధిష్టానం ఒప్పుకుని సంబంధిత శాఖాధికారులకు సూచించిన సమయంలో విజయమ్మ రంగప్రవేశం చేసి తన అనుచరవర్గంతో కూడిన ప్యానల్ను ప్రకటించాలని సంబంధిత అధికారులకు నివేదిక ఇవ్వడంతో విభేదాలు తారాస్థారుుకి చేరారుు. విషయం తెలుసుకున్న జయరాములుతో పాటు ఆయన అనుచరులు విజయమ్మ వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మార్కెట్యార్డు చైర్మన్ ఎంపికను తాత్కాలికంగా నిలిపేసినట్లు సమాచారం. పట్టుకోసం ఎవరికి వారే.. బద్వేలు మార్కెట్యార్డు చైర్మన్ ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు ప్రిస్టేజిగా మారింది. గతంలో విజయజ్యోతి అనుచరుడిగా ఉంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే జయరాములుతో తిరుగుతున్న పోరుమామిళ్లకు చెందిన కలవకూరి నడిపి వెంకటసుబ్బయ్యకు మార్కెట్యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానానికి ఎమ్మెల్యే సిఫారసు చేశారు. దీనికి అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించి వెంకటసుబ్బయ్య పేరునే ఖరారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వెంకటసుబ్బయ్య అనుచరులు పోరుమామిళ్లలో బాణాసంచా పేల్చి సంబరాలు కూడా జరుపుకొన్నారు. ఇంతలో విషయం తెలుసుకున్న విజయమ్మ పోరుమామిళ్లకు చెందిన తన అనుచరుడైన రంతుకు చైర్మన్ పదవిని , మరో ముఖ్య అనుచరుడైన బద్వేలుకు చెందిన కేవి.సుబ్బారెడ్డిని వైస్చైర్మన్గా నియమించాలని 14 మంది డెరైక్టర్లతో కూడిన ఓ ప్యానల్ను తయారుచేసి పార్టీకి చెందిన ఓ జిల్లా ముఖ్యనేత ద్వారా అధికారులకు పంపినట్లు తెలిసింది. దీంతో సంబంధిత అధికారులు ఎవరి ప్యానల్ను ప్రకటించాలో తెలి యక గందరగోళానికి గురవుతున్నట్లు తెలిసింది. సీఎం కార్యాలయంలోనే తారుమారు! మార్కెట్యార్డు చైర్మన్ ఎంపికలో తాను సూచించిన అభ్యర్థిని కాదని విజయమ్మ తన అనుచరవర్గాన్ని ప్రతిపాదిస్తూ అందుకు సంబంధించిన నివేదికను సీఎం క్యాంపు కార్యాలయంలోనే తారుమారు చేసినట్లు ఆరోపిస్తూ గురువారం ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి సైతం తాను సూచించిన నివేదికను కాదని వేరే నివేదికను అధికారులకు ఎవరు పంపారని కార్యాలయ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద బద్వేలు టీడీపీలో చిచ్చురేపుతున్న మార్కెట్యార్డు చైర్మన్ పదవి ఎవరి వర్గీయులను వరించనుందో వేచిచూడాలి. -
నీళ్లు లేవు..తిండి లేదు
-
దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి
ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం అఖిలపక్షాల నాయకులతో కలిసి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. పత్తికి డిమాండ్ తగ్గిందంటూ దళారులు, వ్యాపారులు కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పత్తి క్వింటాలుకు రూ.7,500 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. -
రూ.7 కోట్లతో మార్కెట్ యార్డుల అభివృద్ధి
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా మార్కెట్యార్డుల్లో రూ.7 కోట్ల బడ్జెట్తో వివిధ అభివద్ధి పనులు, నిర్మాణాలు జరుగుతున్నాయని మార్కెటింగ్శాఖ రాయలసీమ జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.జయశేఖర్ అన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక మార్కెట్యార్డు ప్రాంగణంలో నిర్మిస్తున్న కవర్షెడ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. పనులు నత్తనకడన సాగుతుండటంపై అసంతప్తి వ్యక్తం చేస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్ర, శనివారం కళ్యాణదుర్గం, రాయదుర్గం, కనేకల్లు, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర యార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గోదాములు, రైపనింగ్ చాంబర్లు, కవర్షెడ్డు, షాపింగ్ క్లాంపెక్స్ నిర్మాణాలకు రూ.7.02 కోట్లు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి అనంతపురం మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు ఈ–మార్కెటింగ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఏడీ బి.హిమశైల తెలిపారు. అందుకు సంబంధించి కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి, పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ జి.నాగభూషణం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం'
నల్లగొండ: నల్లగొండ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం పర్యటించారు. మార్కెట్ లో ఉన్న ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచడం అవసరమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ప్రమాణ స్వీకారం ఎప్పుడో?
40 రోజుల క్రితమే మార్కెట్ కమిటీ కార్యవర్గం ఎంపిక రెండుసార్లు వాయిదా పడిన కార్యక్రమం అధికార పార్టీ నాయకుల్లో నైరాశ్యం అచ్చంపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటుచేసి 40రోజులవుతున్నా ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగలేదు. వాస్తవానికి గత నెల 7న అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పోశం జయంతి గణేష్ను నియమించినట్టు రాష్ట్ర మార్కెటింగ్శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట అదే నెల 14న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనా వర్షం కారణంగా వాయిదా పడింది. తిరిగి ఈనెల7న ప్రమాణ స్వీకారం జరుగుతుందని అందరూ భావించారు. అయితే రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు జ్వరం రావడంతో రెండోసారి వాయిదా వేశారు. దీంతో అధికార పార్టీ నేతల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. రిజర్వేషన్లో బీసీ మహిళకు అవకాశం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లతో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈ పదవిపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎమెల్యే గువ్వల బాలరాజు అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పోశం గణేష్ భార్య జయంతికి అవకాశం కల్పించారు. ఇక వైస్చైర్మన్ పదవి బల్మూర్ మండలం రామాజీపల్లికి చెందిన మల్లిరెడ్డి Ðð ంకట్రెడ్డిని వరించింది. వీరితోపాటు డైరెక్టర్లుగా అచ్చంపేటకు చెందిన గాలిముడి రత్నమ్మ, ఎం.డి.అమీనొద్దీన్, ఉప్పునుంతల మండలం మర్రిపల్లి మాజీ సర్పంచ్ బాలీశ్వరయ్య, వెల్టూర్ మాజీ సర్పంచ్ లింగం, అమ్రాబాద్కు చెందిన రాజలింగం, లింగాలకు చెందిన వెంకటగిరి ఎంపికయ్యారు. అనుచరులకు సముచిత స్థానం పోశం జయంతీగణెష్ అమ్రాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడిగా ఉన్న గణేష్కు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆమెకు ఇటీవల మార్కెట్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అమ్రాబాద్ మండలానికి ఈ పదవి దక్కడం ఇదే మొదటిసారి. ఇక వైస్ చైర్మన్ ఎం.వెంకట్రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి పనిచేస్తూ గువ్వల అనుచరునిగా ఉన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం ఏడాది మాత్రమే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 40రోజులు గడిచిపోవడంతో ఈ పదవిలో పదిన్నర నెలలు మాత్రమే కొనసాగుతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లుగడిచిపోయింది. ప్రభుత్వం సకాలంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసి ఉంటే ఇప్పటి వరకు ముగ్గురు చైర్మన్లు ఎంపికయ్యేవారు. పదవులు ఆశిస్తున్న వారిలో ఒకింత నిరాశే మిగిలింది. -
‘ధర తెగ్గోత’పై అన్నదాత ఆగ్రహం
-మార్కెట్ యార్డు ముట్టడి సుభాష్నగర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) సర్వర్ డౌన్ ఉందనే నెపంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు వచ్చిన సరుకులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని సోమవారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజురోజుకూ మొక్కజొన్న, సోయా ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెంది అధికారులు, వ్యాపారులను నిలదీశారు. ధర ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సుమారు 500 మందిపైగా రైతులు మార్కెట్కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ-ట్రేడింగ్ పనిచేయడం లేదని వ్యాపారులు ఇష్టానుసారంగా ఓపెన్యాక్షన్ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామ్ సర్వర్ డౌన్ ఉండటంతో రైతులకు సరుకుకు సంబంధించిన లాట్ నెంబర్లు ఇవ్వలేదు. ఉదయం సర్వర్ పనిచేయడంతో కొంతమందికి మాత్రమే ఇచ్చారు. దీంతో మిగతా వారికి సరుకును ఓపెన్ యాక్షన్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇందులో మక్కలకు రూ.1250, సోయాకు రూ.2500 లోపే ధర పలుకుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓపెన్యాక్షన్ ద్వారా తక్కువ ధర వస్తుందని రైతులు అధికారులను నిలదీశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులంతా కలిసి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు తరలివచ్చి మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్కమిటీ సెక్రటరీ సంగయ్య రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు విన్పించుకోలేదు. నామ్ సర్వర్ సక్రమంగా లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతుందని, ఈ-ట్రేడింగ్ను రద్దు చేయాలన్నారు. మొక్కజొన్న, సోయా గురువారం నాటి ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. దీంతో అధికారులు, కమీషన్ ఏజెంట్లను పిలిపించి కొంతమంది రైతులతో కలిసి చర్చలు జరిపారు. చివరకు సోయా ఎ గ్రేడ్ రకానికి రూ.2675, మొక్కజొన్నను రూ.1435 లకు కొనుగోలు చేస్తామని ట్రేడర్లు హామీనివ్వడంతో రైతులు శాంతించారు. విషయం తెలుసుకున్న నగర సీఐ, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. -
త్వరలో కొత్త మార్కెట్ చట్టం:హరీష్రావు
హైదరాబాద్: ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి త్వరలో కొత్త మార్కెట్ చట్టం తీసుకొస్తామని మార్కెటింగ్శాఖ మంత్రి టి.హరీష్రావు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ల కారణంగా 56 మంది మహిళలు ఛైర్మన్లుగా ఎంపికయ్యారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాన్ని మార్కెట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదట జనగాం మార్కెట్లో ఏర్పాటు చేస్తామని... దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామని... మరో 10 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. రైతు బంధు పథకం వల్ల గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఉచితంగా మార్కెట్ యార్డులకు చెందిన గోదాముల్లో దాచుకోవచ్చని... ఆ సమయంలో ఎలాంటి షరతులు లేకుండా వారికి ధాన్యం విలువలో 70 శాతం సొమ్ము ఇస్తామన్నారు. ఆరు నెలల్లో ఎప్పుడు ధర వచ్చినా వారు వచ్చి వాటిని విక్రయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 30 వేల చెరువులు పొంగి పొర్లాయని... 10 వేల చెరువుల్లో 50 నుంచి 70 శాతం నిండాయన్నారు. రైతుకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 4,600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు, రైతు ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిపై బడ్జెట్లో ప్రభుత్వం రూ. 41 వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు. మరిన్ని రైతు బజార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు తెల్లవారుజామునే మార్కెట్లకు వెళ్లి సాయంత్రం వరకు ఉండాలని అప్పుడు సమస్యలు రావన్నారు. నామ్’ అమలులో ఇంకా సర్వర్ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడర్లతోనూ త్వరలో సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని కోరుతామన్నారు. గోదాములు, షెడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దన్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉల్లి, టమాట పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తున్నామన్నారు. టాప్-3 అవార్డులు బాగా పనిచేసే మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులకు టాప్-3 అవార్డులు ఇస్తామన్నారు. కనీస మద్దతు ధర కల్పించడం, మార్కెట్ యార్డుల్లో చిన్న గొడవ కూడా రాకుండా చూడడం వంటి వాటిని అమలు చేసే వారికి ఈ అవార్డులు దక్కుతాయన్నారు. ప్రతీ రబీ, ఖరీఫ్ సీజన్లలో ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మార్కెట్లలో ఫర్నీచర్ కోసం వాటి స్థాయిని బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఇస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మార్కెట్లను పరిశీలించేందుకు రెండు విడతలుగా మార్కెట్ కమిటీ ఛైర్మన్లను పంపిస్తామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మంచిగా పనిచేస్తే భవిష్యత్తులో రైతులను ఓటర్లుగా మార్చుకునే వీలుంటుందని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో అందరూ చప్పట్లు చరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, సీసీఐ ప్రతినిధి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయటంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. యార్డులో విధ్వంసం సృష్టించారు. వివరాలివీ.. యీనాం విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఉదయం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. అప్పటికే వందలాది మంది రైతులు, పత్తి వాహనాల రాకతో యార్డు నిండిపోయింది. ఈ సమయంలో వ్యాపారులు ససేమిరా అనటం రైతులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.వెంటనే వారు అధికారుల కార్యాలయంతోపాటు యార్డులోని కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మార్కెట్ యార్డులో వందలాది మంది రైతులు ధర్నాకు దిగారు. వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. -
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆరే రాజన్న
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆరే రాజన్నను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి ఎట్టకేలకు ప్రభుత్వం కార్యవర్గాన్ని ప్రకటించింది. కొద్దిరోజుల్లో పత్తి మార్కెట్ ప్రారంభం కానుండడంతో రైతులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా అప్కాం గంగయ్య, సభ్యులుగా ముసుకు గోవర్ధన్ రెడ్డి, కుమ్ర జంగు, షేక్షరీఫ్ కీమా సదానందం, పెగ్గర్ల సుదర్శన్, కట్కం పుష్పలత, జవాజీ ప్రకాశ్, మారే గోవర్ధన్రెడ్డి ఉంటారు. వీరితోపాటు తాంసి కోఆపరేటీవ్ సొసైటీ చైర్మన్, ఏడీఏ, ఏడీఎం, మున్సిపల్ చైర్పర్సన్లు మిగతా సభ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొంది. నూతన కమిటీ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. -
‘పత్తి’పై స్పష్టతేది!
మద్దతు ధరపై ప్రస్తావనే కరువు కొనుగోళ్లు ప్రారంభమెప్పుడో చెప్పనేలేదు కొలిక్కిరాని ‘పత్తికి ఈ-నామ్’ అమలు అంశం పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం తీరిదీ.. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలకు రూ.8 కోట్లు ఆదిలాబాద్ అర్బన్ : ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, మార్కెట్ యార్డుల ద్వారా పత్తి కొనుగోళ్ల ప్రారంభం ఎప్పుడో తేల్చడం వంటి వాటిపై స్పష్టత ఇవ్వకుండానే అఖిలపక్ష సమావేశం ముగిసింది. రైతులు పత్తి ని అమ్మడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి సలహాలు, సూచనలు, మార్కెట్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, పత్తికి ఈ-నామ్ అమలుకు ఏం చర్యలు తీసుకోవాలి.. కొనుగోళ్లు ఎప్పుడనేది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సి ఉంది. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ మంత్రి రామన్న అధ్యక్షతన పత్తి కొనుగోళ్లపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్ ఈ ఏ డాది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(ఈ-నామ్) విధానంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. మార్కెటింగ్పై అవగాహన కల్పించండి మంత్రి రామన్న మాట్లాడుతూ, ఆన్లైన్ మార్కెటింగ్పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, దాని నిబంధనలు రైతులకు తెలిసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అందరూ మాట్లాడే విధంగా అఖిలపక్షం నాయకులు సహకరించాలని మంత్రి కోరారు. కొన్ని చోట్ల సోయా పంటకు మొలకలు వచ్చాయని, మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహావిష్కరణకు మంత్రి సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయూరు. జేసీ సుందర్ అబ్నార్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్, నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య సమావేశాన్ని ఉన్నవారితోనే కొనసాగించారు. తేమశాతం, దళారీలు, వ్యాట్, మార్కెట్ పని చేసే సమయాలు, మార్కెట్ యార్డుల్లో ఖాళీ పోస్టుల భర్తీ, ఈ-నామ్ ల్యాబ్ ఏర్పాటు, మైయిశ్చర్ మీటర్లు, రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యంపై జేసీతో మాట్లాడారు. చర్చలో ఇవి ప్రస్తావించారు.. అఖిలపక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతి నిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు మాట్లాడారు. జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో ప్రారంభించిన ఈ-నా మ్ భైంసాలో నడవడం లేద ని, నామ్కే వాస్తేగా.. ఉంద ని రైతు సోలంగి భీంరావు స మావేశం దృష్టికి తీసుకురా గా, కేవలం మినుముల కొ నుగోలుకు మాత్రమే ఈనా మ్ అమలు చేస్తున్నామని అధికారులు చెప్పా రు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి నిఘా ఉంచాలని, రైతులు కట్టిన బీ మా డబ్బులు వచ్చేట్లు చూడాలని రైతు భూ మారెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం నుంచి రూ.8 కోట్లు విడుదలయ్యాయని, ఈ ఏడాది నుంచే సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. తేమ విషయంలో, పత్తి అమ్మిన రైతులకు డబ్బుల చెల్లిం పు విషయంలో చాలా జాప్యం జరుగుతోందని, మార్కెట్కు తీసుకువచ్చిన పత్తిని గోదాముల్లో పెట్టుకునేలా సౌకర్యాలు కల్పించాలని రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి స మావేశంలో ప్రస్తావించగా, తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్నా పత్తికి మద్దతు ధర ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మార్కె ట్ యార్డుల్లో రైతులకు ఏ అపాయం జరిగినా ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఈనామ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలపాలని నాయకుడు గోవర్ధన్ యాదవ్ కోరారు. జిల్లాలో రెండు చోట్ల ఈ-నామ్ ప్రారంభించామని, ఈ ఏడాది పత్తికి అమలు చేయనున్నట్లు అధికారులు వివరించారు. మార్కెట్లో సీసీఐ అధికారులు తప్పకుండా ఉండాలని, ఆదిలాబాద్ మార్కెట్ గోదాముల పక్కన కొందరు ఇళ్లు ఎందుకు కట్టుకొని ఉన్నారో తెలపాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి కోరారు. రైతులు తీసుకువచ్చిన పత్తికి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. మార్కెట్యార్డుకు వచ్చే రోడ్లు బాగాలేవని, మార్కెట్లో రైతులను నిలుపు దోపిడీకి గురి చేస్తున్నారని, తాగునీరు, అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, తేమ నిర్ధారణ నిష్పక్షపాతంగా జరగాలని, అందుకు సీనియర్ అధికారిని నియమించాలని పలువురు నాయకులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా, పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారు.. పత్తికి ఈ-నామ్ అమలు చేస్తారా.. లేదా అన్నది కొలిక్కి రాలేదు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రాంతీయ ఉప సంచాలకుడు శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు సురేశ్జోషి, గణపత్తి, లోకా భూమారెడ్డి, యూనుస్ అక్బానీ, బండి దత్తాత్రి, ప్రభాకర్రెడ్డి, అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
ఏఎంసీ.. సేవలు నాస్తి
చింతలపూడి: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) పనితీరు నానాటికీ దిగజారుతోంది. కమిటీలకు ఆదాయం మెండుగా వస్తున్నా అదే స్థాయిలో సేవలు మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుండి సెస్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం మార్కెట్ కమిటీలకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో రైతులకు గిట్టుబాటు ధర, యార్డుల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంది. వీటితో పాటు మార్కెట్ కమిటీల ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, వాటిని రైతులకు చేరువ చేయాలి. ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా రైతులు పండించిన పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పాటు నిల్వ చేసుకున్న పంటలపై రైతులకు 75 శాతం రుణాలు అందించడం మార్కెట్ కమిటీల పని. దీనిపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత గోడౌన్లలో పంట భద్రపరుచుకునేందుకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. ఈలోపు ధర పెరిగితే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అయితే ఈ పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెస్ వసూలుకే పరిమితం సిబ్బంది కొరత కారణంగా కమిటీలు కేవలం సెస్ వసూలుకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి రైతులు పండించిన ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ కమిటీల ద్వారానే జరగాలి. ఇందుకోసమే కోట్లాది రూపాయలను వెచ్చించి కమిటీల పరిధిలో యార్డులను నిర్మిస్తున్నారు. ఎన్ని గిడ్డంగులు నిర్మిస్తున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంది మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఖాళీ పోస్టుల విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – పి.ఛాయాదేవి, ఏడీ, జిల్లా మార్కెటింగ్ శాఖ పోస్టులు భర్తీ కోరుతున్నాం మార్కెట్ కమిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందితోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం సమస్యగా మారింది. – టీటీఎస్వీవీ నారాయణ, అధ్యక్షుడు, జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శుల సంఘం -
మార్కెట్యార్డుల్లో ‘ఈ– నామ్’
* రాష్ట్రంలో తొలి దశగా 12 యార్డుల్లో అమలు * ఇప్పటికే గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్తో వ్యాపారం * అక్టోబర్లో తెనాలి యార్డులో ఈ– నామ్ ప్రారంభానికి చర్యలు తెనాలి టౌన్: దేశ వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్యార్డులలో ఆన్లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా 585 మార్కెట్ యార్డులలో ఈ–నామ్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్లో 12 మార్కెట్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో గుంటూరు జిల్లాలో తెనాలి, పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, గోపాలపురం, అనంతపురం జిల్లాలో ప్రత్తికొండ, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పొదలకూరు, కలికిరి, గుర్రంకొండ, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు యార్డులు ఉన్నాయి. ఈ యార్డులో ఈ– నామ్ సిస్టమ్ను అమలు చేసేందుకు ప్రతి యార్డుకు రూ.30 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ద్వారా మిర్చి, పసుపు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్యార్డులలో వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకునే వారు. రైతుకు లాభం చేకూర్చాలనే లక్ష్యంతో ఆన్లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మార్కెటింగ్ శాఖాధికారులు తెలిపారు. ఈ వ్యవస్థలో సీక్రెట్ టెండర్లు ఉంటాయని, దీని ద్వారా ఎక్కువ రేటు వస్తుందని అంటున్నారు. రైతు ఒప్పుకుంటే వ్యవసాయ ఉత్పత్తులను కాటా వేసి నగదు వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే 22 మార్కెట్ యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పారు. అక్టోబర్ను నుంచి తెనాలిలో.. తెనాలిలో ఈ– నామ్ వ్యవస్థను అక్టోబర్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీని గురించి రైతులు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి యార్డులో ఎనిమిది ఆన్లైన్ సిస్టమ్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్) కంపెనీ దేశ వ్యాప్తంగా ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెట్టే మార్కెట్ యార్డులకు సాఫ్ట్వేర్ సరఫరా చేయనున్నట్లు ఎన్ఎఫ్సీఎల్ మార్కెటింగ్ ప్రతినిధి స్వామి తెలిపారు. ప్రాజెక్టు రూపకల్పన చేసిన అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాపారులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన అనంతరం దీనిపై అవగాహన కల్పించి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే విధానంపై శిక్షణ ప్రారంభిస్తారు. ఈ విధానం పూర్తిగా అమలైతే రైతుకు కొంత మేరకు లాభం చేకూరే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
'ఆయన ఆరడుగుల బుల్లెట్'
జగిత్యాల (కరీంనగర్): మార్కెట్శాఖలో వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్రావు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పంట ఉత్పత్తుల అమ్మకంలో రైతులకు, నిధుల మంజూరులో మార్కెట్ కమిటీలకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలకవర్గం సభ్యులు మంత్రి హరీశ్రావు వెంటపడి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండి, యార్డులను దేవాలయాలుగా మార్చాలని కోరారు. ఉద్యమం సమయంలో పనిచేసిన వారికి పదవులు దక్కాయని, మరికొంత మందికి పదవులు రావాల్సి ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేసిన వారికి టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘పీసా’ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: పీసా చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ మార్కె ట్ కమిటీల చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టం ప్రకారం కేటాయించిన 11 కమిటీల్లో నాలుగింటిని మంగళవారం లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్ఛోడ, ఖమ్మం జిల్లా బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఎస్టీ మహిళలకు రిజర్వు అయ్యాయి. ములుగు (వరంగల్), ఇంద్రవెళ్లి, జైనూరు (ఆదిలాబాద్), ఎల్లందు, కొత్తగూడెం, ఎన్కూరు, నూగూరుచర్ల మార్కెట్ కమిటీలను ఎస్టీ జనరల్గా ఎంపిక చేశారు. రాష్ట్రంలో 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ ప్రకారం ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున కమిటీ చైర్మన్ పదవులు కేటాయిస్తూ గతేడాది సెప్టెంబర్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు రాష్ట్రంలోని రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్గా దాసరి గీత, వైస్ చైర్మన్గా బర్మవత్ మోతీరాంను నియమించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పత్తి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్గా ధర్మనగారి వెంకట్రెడ్డి నామినేట్ అయ్యారు. -
జగిత్యాల మార్కెట్ కమిటీచైర్మన్గా శీలం ప్రియాంక
జగిత్యాల రూరల్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్గా శీలం ప్రియాంక, వైస్చైర్మన్గా ఖాజా లియాకత్అలీ మొసిన్ ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా బోనగిరి నారాయణ(అంతర్గాం), బోడుగం మహేందర్రెడ్డి(లక్ష్మీపూర్), గడ్డం రమణారెడ్డి (తక్కళ్లపల్లి), పునుగోటి కమలాకర్రావు (మోరపల్లి), నాడెం శంకర్ (తాటిపల్లి), కచ్చు లత, దేవరశెట్టి జనార్దన్, రంగు వేణుగోపాల్(జగిత్యాల)ను నియమించారు. -
ఆసక్తికరంగా పాల పోటీలు
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాలపోటీల్లో భాగంగా శుక్రవారం పాల సేకరణను నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో వివిధ జాతుల గోవులు, గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటల పాల ఉత్పత్తులను సేకరించారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ దాదాపు గంటసేపు సాగింది. సేకరణ అనంతరం పాల ఉత్పత్తులను అధికారుల సమక్షంలో రైతులు తూకం వేయించి, నమోదు చేయించారు. అలాగే శనివారం ఉదయం సైతం ఇదే తరహాలో పాలను సేకరించి మూడుపూటల లభించిన ఉత్పత్తుల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. ఉదయం మార్కెట్యార్డులో ఉన్న గో జాతులను ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు సందర్శించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్ర«థమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తతీయ బహుమతిగా రూ. 20 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తతీయ బహుమతిగా రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నామన్నారు. శనివారం మద్యాహ్నం నుంచి జరిగే అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. విజేతలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. -
గోవుల పోటీలకు పటిష్ట ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: రాష్ట్రస్థాయి గోవుల పాల, అందాల పోటీల నిర్వహణకు స్థానిక మార్కెట్ యార్డును ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పోటీల్లో పాల్గొనే పలు జాతిగోవులు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. జిల్లా పశు సంవర్ధకశాఖ ఏలూరు డివిజన్ ఏడీ ఎస్టీజీ సత్యగోవింద్, అధికారులు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పాలపోటీలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభిస్తారని, కలెక్టర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పాల పోటీల రిజిస్ట్రేషన్తో ప్రారంభం అవుతుందన్నారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు పశువుల పొదుగులను ఖాళీ చేస్తారన్నారు. 16 ఉదయం, సాయంత్రం అలాగే 17న ఉదయం మూడుపూటలా పాల ఉత్పత్తిని సేకరిస్తామని చెప్పారు. అదేవిధంగా 17న ఉదయం 8 గంటల నుంచి అందాల పోటీలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోటీలు ప్రారంభిస్తామన్నారు. పోటీల్లో విజేతలకు 17న సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని చెప్పారు. 200 గోవులు వస్తాయని అంచనా పాల పోటీలకు 100, అందాల పోటీలకు మరో 100 గోవులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గోవులు వాతావరణ మార్పు కారణంగా పాల దిగుబడి తగ్గుతుందన్న ఉద్దేశంతో వాతావరణం అలవాటయ్యేందుకు గాను పలువురు రైతులు ముందుగానే గోవులతో ఇక్కడకు చేరుకున్నారు. గోవులకు దాణా, వసతులను అధికారులు కల్పిస్తున్నారు. బహుమతులు ఇలా.. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ రూ.5 లక్షలు, పశుసంవర్ధకశాఖ రూ.2 లక్షల నిధులతో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. అందాల పోటీల్లో విజేతలకూ బహుమతులు అందిస్తామని చెప్పారు. -
మార్కెట్ యార్డుల్లో సకల వసతులు
- రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు గజ్వేల్ యార్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గజ్వేల్: రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో గోదాములు, ఇతర వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి టి.హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో రూ.5.85కోట్లతో చేపట్టిన రెండు 2,500 మెట్రిక్ టన్నుల గోదాములు, కవర్ షెడ్లు, రైతు విశ్రాంతి, సమావేశ భవనం, సీసీ రోడ్లు, ఆర్చ్ తదితర పనులను ప్రారంభించారు. అలాగే ములుగు మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగా రూ.4కోట్లతో కొండపాక మార్కెట్యార్డు అభివృద్ధికి సంకల్పించామన్నారు. ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. వర్గల్ మండలం పాతూరు రోడ్డు వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల కోసం షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం స్థల సేకరణ చేపట్టాలని ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు. ములుగు మండలం దామరకుంటలో 33/11కేవీ సబ్స్టేషన్ను, ములుగులోని గురుకుల పాఠశాలలో డార్మెటరీ, ల్యాబ్లను మంత్రి ప్రారంభించారు. పాఠశాల ప్రహరీకి రూ.36లక్షలు, మరమ్మతులు, రంగులు వేయడానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి హరీశ్ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు
– కిలో రూ. 6 ప్రకారం ధర – రూ. కోటితో గిడ్డంగుల నిర్మాణం – ఆర్డీ వెంకట సుబ్బన్న కోవెలకుంట్ల : కర్నూలు, ఆదోని మార్కెట్యార్డుల్లో రైతుల వద్ద నుంచి కిలో రూ. 6 ప్రకారం ఉల్లి కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్యార్డు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటసుబ్బన్న తెలిపారు. కోవెలకుంట్ల మార్కెట్యార్డును మంగళవారం ఆయన తనిఖీ చే శారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం మార్కెట్యార్డుల ద్వారా ఉల్లి కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. కోవెలకుంట్ల మార్కెట్యార్డు ఆవరణలో పాత గోదాముల స్థా«నంలో రూ. కోటితో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గిడ్డంగి ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. గత ఏడాది యార్డుకు రూ. 69 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ. 83 లక్షలకు చేరిందన్నారు. కార్యక్రమంలో జేడీ సుధాకర్, మార్కెట్యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి, సెక్రటరీ శివశంకర్రెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో సమీకృత చెక్పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెంపు లక్ష్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో సమీకృత చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్కెటింగ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు, మార్కెట్ యార్డుల పరిధిలో చెక్పోస్టులను నిర్వహిస్తున్నా.. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సరిపడినంత సిబ్బంది, పర్యవేక్షణకు అవసరమైన మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో కలిసి సమీకృత చెక్పోస్టుల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్పోస్టులను నిర్వహిస్తుండగా.. ఇతర శాఖలతో కలిసి సమీకృత చెక్పోస్టుల సంఖ్యను 16కు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై మార్కెటింగ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. చెక్పోస్టుల వద్ద రవాణా వాహనాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను తరలించే వాహనాల వివరాల నమోదుకు కామన్ ఎంట్రీ పాయింట్ ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. కామన్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. మూడు షిఫ్టుల్లో వాహనాల తనిఖీ, వివరాల నమోదుకు.. షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. ఈ ఇద్దరిలో ఒకరు సహాయ కార్యదర్శి, మరొకరు సూపర్వైజర్ ఉంటారు. వాహనాల బరువును తూకం వేసేందుకు చెక్పోస్టుల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వాహనాల బరువును తూకం వేసేందుకు ప్రత్యేక వరుసలను ఏర్పాటు చేయాలని.. సీజ్ చేసే వాహనాలను నిలిపేందుకు షెడ్ను నిర్మించాలని ప్రతిపాదించారు. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకే! రాష్ట్రంలో ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. చెక్పోస్టుల ద్వారా లభించే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా రూ.358.57 కోట్లను మార్కెట్ ఫీజు లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావంతో సాగు విస్తీర్ణంపై ప్రభావం, పత్తి విత్తనాలు, బియ్యంపై మార్కెట్ ఫీజు వసూలు విషయంలో అస్పష్టత నేపథ్యంలో మార్కెట్ ఫీజు వసూలుపై ప్రభావం పడుతోంది. వరి ధాన్యం, వేరుశనగ, ఇతర పప్పుధాన్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటకుండా చూడటం ద్వారా మార్కెట్ ఫీజు వసూలును పెంచాలని భావిస్తున్నారు. అయితే సొంతంగా చెక్పోస్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక సౌకర్యాలు మార్కెటింగ్ శాఖకు లేకపోవడంతో.. తనిఖీలు, ఆదాయంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అలంపూర్ క్రాస్ రోడ్డు వంటి జాతీయ రహదారులపై సొంతంగా చెక్పోస్టుల ఏర్పాటు, నిర్వహణ కష్టసాధ్యమని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. రవాణా, వాణిజ్య, ఎక్సైజ్ శాఖలు సమీకృత చెక్పోస్టుల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయా శాఖలతో కలిసి వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ భారం తగ్గించుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. -
కర్రగడ
– రెండుసార్లు రైతుసంఘాల ప్రతినిధులతో యాంటీ రూమ్లో సమావేశం – ఒకసారి మార్కెటింగ్ అధికారులతో, ఇంకోసారి పేపర్ మిల్లుల ప్రతినిధులతో.. – ఐదుగురు మాట్లాడే రైతులు రావాలంటూ మార్కెటింగ్ శాఖ ఏడీ వినతి, రైతుల ఆగ్రహం – ఆ తరువాత జాయింట్ కలెక్టర్ స్వయంగా వచ్చి విజ్ఞప్తి చేసినా పట్టుపీడని రైతులు – అధికారుల తీరుపై మండిపడ్డ మార్కెట్ కమిటీల చైర్మన్లు – కలెక్టర్ కోసం మూడు గంటలపాటు రైతులు ఎదురుచూపు ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులతో కలెక్టర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశం రగడకు దారితీసింది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉదయం 10.30 గంటలకు స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ కోసం ఎదురు చూశారు. ఆమె కలెక్టర్ బంగ్లా నుంచి వచ్చిన వెంటనే సీపీఓ కాన్ఫరెన్స్ హాలు ఎదురుగా ఉన్న యాంటీ రూమ్కు చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్తో సుబాబుల్, జామాయిల్ కర్ర ధరల గురించి కొద్దిసేపు యాంటీ రూమ్లోనే చర్చించారు. అనంతరం రైతు సంఘాల ప్రతినిధులను యాంటీ రూమ్లోకి పిలిపించారు. వారితో మాట్లాడిన తర్వాత, మార్కెటింగ్ శాఖ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం పేపర్ మిల్లుల ప్రతినిధులను పిలిపించి చర్చించారు. సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతులు మాత్రం కలెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మార్కెటింగ్ శాఖ ఏడీ రఫీ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి బాగా మాట్లాడే ఐదుగురు రైతులు యాంటీ రూమ్లోకి రావాలని చెప్పడంతో అప్పటికే అసహనంతో ఉన్న రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం అక్కడకు రాము, ఏమున్నా ఇక్కడే తేల్చాలి’ అని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీలేక మార్కెటింగ్ ఏడీ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు వివరించారు. కొన్ని నిముషాలకు జాయింట్ కలెక్టర్ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి ‘జిల్లా కలెక్టర్ మాట్లాడాలని అంటున్నారు, కొంతమంది రైతులు రావాలని కోరగా, తాము వచ్చేది లేద’ని స్పష్టం చేశారు. అదే సమయంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పందంపై ఆరు నెలల నుంచి చర్చిస్తున్నారు. అయినా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. అధికారులు ఉంటారు వెళ్తారు. రైతులతో ఉండేది మేమే. ముందు ఔట్ పుట్ ప్రకటించాల’ని పట్టుబట్టారు. అంతకుముందు కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దారపునేని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘సుబాబుల్, జామాయిల్ ధర ఒప్పందంపై మాట్లాడాలని తమను పిలిపించారు. పదిన్నర గంటలకు ఇక్కడకు వచ్చాం. యాంటీ రూమ్లో మీరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మీరు అక్కడే కూర్చొని మాట్లాడే పనైతే మమ్మల్ని ఎందుకు పిలిచార’ని అధికారులను నిలదీశారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకుని తిరగాల్సి ఉంటుంది సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పందం ధర అమలు చేయకుండా తమను దోచుకుంటున్నారని సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన రైతు నత్తల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వల్ల ఎలాంటి ఫలితం రాలేదని, జిల్లా కలెక్టర్తో నిర్వహించే సమావేశం ద్వారానైనా మేలు జరుగుతుందనుకుంటే గంటలకొద్దీ తమను కూర్చోపెట్టారన్నారు. కలెక్టర్ ఇక్కడకు వచ్చి మాట్లాడతారని ఎదురుచూస్తే పక్కన ఉన్న రూమ్లోకి ఐదుగురు రైతులు రావాలని కబురు పంపడమేంటని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారులు, ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే తాము పురుగుల మందు డబ్బాలు పట్టుకుని తిరగాల్సి ఉంటుందని వాపోయారు. ధరల విషయంలో న్యాయం చేయకుంటే రైతుల ఆత్మహత్యలు తప్పవని హెచ్చరించారు. మీడియాను బయటకు పంపిన కలెక్టర్ సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పంద ధర అమలు విషయమై రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు భంగపాటు ఎదురైంది. సమావేశం ప్రారంభమవుతుందని రైతులతో కలిసి మీడియా ప్రతినిధులు కూడా సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో ఎదురు చూశారు. అయితే, అప్పటికే యాంటీ రూమ్లో రెండు మూడుసార్లు సమావేశాలు నిర్వహించి ఒక కొలిక్కి రాకపోవడం, ఐదుగురితో మాట్లాడతామంటే రైతులు ఒప్పుకోకపోవడం, కలెక్టర్ తమ వద్దకు వచ్చి మాట్లాడాలని రైతులు తెగేసి చెప్పడంతో కలెక్టర్ సుజాతశర్మ తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్.. సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెడుతూనే అక్కడ ఉన్న మీడియాను బయటకు వెళ్లాలంటూ ఆదేశించారు. అంతటితో ఆగకుండా పోలీసులను పురమాయించి మీడియాను బయటకు పంపించారు. మీడియా ప్రతినిధులంతా సీపీఓ కాన్ఫరెన్స్ హాలు నుంచి బయటకు వచ్చే వరకు కలెక్టర్ బయటే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ చర్యను మీడియా ప్రతినిధులు ఖండించారు. మీరు మంత్రితో మాట్లాడుకోండి.. మీడియా ప్రతినిధులను బయటకు పంపించిన తర్వాత కలెక్టర్ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చారు. ‘మీరంతా సంబంధిత మంత్రిని కలిసి మాట్లాడండి. నేను కూడా జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులతో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయిస్తాను. ధర కోసం కాంక్రీట్ అగ్రిమెంట్(సంతకాలతో) చేయిస్తా’ అని చెప్పి కలెక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
మార్కెట్ కమిటీపై వీడిన సస్పెన్స్
కరీంనగర్అగ్రికల్చర్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై నాలుగు నెలల సస్పెన్స్ వీడింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ఎంపీటీసీ సబ్యుడు గోగూరి నర్సింహారెడ్డిని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారది ఉత్తర్వులు జారీ చేసారు. చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మరో 8 మంది డైరెక్టర్లు, అందులో ఇద్దరు ట్రేడర్లు, ఒకరు సింగిల్విండో చైర్మన్లుండగా మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యుల పాలకవర్గ కమిటీని ఏడాది కాలం పాటు నియమించారు. వైస్ చైర్మన్గా జువ్వాడి రాజేశ్వర్రావు(ఇరుకుల్ల), డైరెక్టర్లుగా నాయక్ పాషా(నగునూర్), దామెరపల్లి అంజిరెడ్డి(ముగ్దుంపూర్), తిప్పర్తి లక్ష్మయ్య(చామనపల్లి), గుర్రాల చంద్రమౌళి(ఎలగందుల), గొర్రె రవీందర్(నాగుల మల్యాల), ఉప్పు మల్లేశం(బద్దిపల్లి), వ్యాపార వర్గాల ప్రతినిధులుగా విజయ్కుమార్ ముందడ, ఉప్పుల శ్రీధర్, సింగిల్ విండో చైర్మన్ ప్రతినిదిగా మంద రాజమల్లు (దుర్శేడ్ సింగిల్విండో చైర్మన్), ఎక్స్ అఫిషియో సభ్యులుగా నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్, ఏడీ అగ్రికల్చర్ రణధీర్(ఇన్చార్జి), ఏడీ మార్కెటింగ్ పద్మావతిలను నియమించారు. చైర్మన్ పదవి అనూహ్యం.. రిజర్వేషన్లలో భాగంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనరల్కు కేటాయించారు. మార్కెట్పరిధిలోS కరీంనగర్తోపాటు తిమ్మాపూర్ మండలం ఉండటంతో రెండు మండలాలకు చెందిన నాయకులు చైర్మన్ పదవికోసం తీవ్రస్ధాయిలో ప్రయత్నించారు. ప్రధానంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ మండలానికి చెందిన అనుచరులకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని పట్టుమీద ఉండడంతో కమిటీ నియామకంలోనూ ఆలస్యం జరిగిందని తెలిసింది.అనూహ్యంగా తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ ఎంపీటీసీ సభ్యుడు గోగూరి నర్సింహరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో చురుకుగా పాల్గొన్న నర్సింహరెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగింది. అందుకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంగుల అనుచరులు కరీంనగర్ మండలానికి చెందిన వారికే వూర్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని పట్టుబట్టారు. పోటీలో చింతకుంట మాజీ సర్పంచు పిట్టల రవీందర్ పోటీ పడగా అనూహ్యంగా చైర్మన్ పదవి మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్కు దక్కడం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ కమిటీ కరీంనగర్లో ఉండడంతో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన వారికే చైర్మన్ పదవి ఉండాలని స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టగా అధిష్టానం గోగూరి నర్సింహారెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వూర్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జోక్యంతో చివరి ఆఖరికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుమతితో గోగూరి నర్సింహారెడ్డినే చైర్మన్ పదవి వరించగా మిగిలిన డైరెక్టర్లంతా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినవారినే ఎన్నుకున్నారు. -
దర్జాగా కబ్జా
→ 29 సెంట్ల మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించిన కదిరి మార్కెట్యార్డు చైర్మన్ → స్థలం విలువ రూ.3 కోట్లు → చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న మునిసిపల్ అధికారులు → కోర్టును ఆశ్రయిస్తామంటున్న వార్డు కౌన్సిలర్ కదిరి : కదిరి ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భూదందాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. కదిరి వ్యవసాయ మార్కెట్యార్డు చైర్మన్గా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించిన టీడీపీ తలుపుల మండల కన్వీనర్ గరికపల్లి రామకృష్ణారెడ్డి 29 సెంట్ల మునిసిపల్ రిజర్వ్ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. ఆ స్థలం విలువ అక్షరాలా రూ.3 కోట్లు. అయితే.. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ తప్పుడు డాక్యుమెంట్లు చూపుతున్నారు. మరి.. అక్కడున్న మునిసిపల్ స్థలం ఏమైందని స్థానికులు ప్రశ్నిస్తే.. ‘ఏమో నాకేం తెలుసు?..ఈ ప్రశ్న మునిసిపాలిటీ వాళ్లను అడగండి’ అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు. కొందరు ట్రాన్స్కో ఉద్యోగులు ‘ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ గా ఏర్పడి 1984లో కదిరి మునిసిపాలిటీæ పరిధిలోని మూడో వార్డులో సైదాపురానికి ఆనుకొని స్థలాన్ని కొనుగోలు చేశారు. సర్వే నంబర్ –197లోని 2.08 ఎకరాల ఈ స్థలానికి అప్పట్లో లే అవుట్ అప్రూవల్ కూడా చేయించుకున్నారు. మునిసిపల్ నిబంధనల ప్రకారం గుడి, బడి లేదా పార్కు లాంటివి ఏర్పాటు చేయడం కోసం వారు అప్పట్లో 29 సెంట్ల స్థలాన్ని రిజర్వ్ స్థలంగా వదిలేసి మునిసిపాలిటీకి అప్పగించారు. మునిసిపాలిటీ వారు ఆ స్థలానికి ఎల్పీ నెం.232/84 కేటాయించారు. దాన్ని అప్పట్లోనే స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. కాకపోతే మునిసిపాలిటీలో మొదటిసారి టీడీపీ అధికారంలోకి రావడంతో మునిసిపల్ స్థలాలు కబ్జా చేయడం ఆ పార్టీ నాయకులకు సులువైంది. ప్రస్తుతం కబ్జా చేసిన ఆ స్థలంతో పాటు పక్కనే రోడ్డు కోసం వదిలేసిన మూడు సెంట్ల ఖాళీ జాగాను కూడా కలిపేసుకున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బయటపడింది. ఈ కబ్జా వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తం కూడా ఉన్నట్లు వినబడుతోంది. మునిసిపల్ రిజర్వ్ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలియజేస్తూ కదిరి మునిసిపల్ కార్యాలయం గోడపై అధికారులు పట్టిక వేయించారు. ఇందులో కూడా వరుస నంబర్ 3లో 29 సెంట్ల స్థలాన్ని చూపడం గమనించవచ్చు. -
వ్యవసాయ మార్కెట్లో హరితహారం మొక్కల పరిశీలన
వరంగల్సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఇప్పటివరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంపై బుధవారం ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటి డైరెక్టర్, హరితహారం ప్రత్యేక అధికారి, అబ్జర్వర్ రాజశేఖర్రెడ్డి మార్కెట్లో నాటిన మొక్కలను స్వ యంగా పరిశీలించారు. చాలా మొక్కలకు ట్రీగార్డులు లేకపోవడంతో త్వర గా ఏర్పాటు చేయాల్సింది గా మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించా రు. అలాగే పక్కనే ఉన్న మార్కెట్కు సంబంధించిన ముసలమ్మకుంటలో నిర్మిస్తున్న నూతన గోదాంను, సమీపంలో పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలను పరిశీ లించారు. మొత్తంగా మా ర్కెట్లో హరితహారం కార్యక్రమం విజయవంతంగా భావించి, మొక్కలు ఎదిగే వరకు ఇదే రకమైన శ్రద్ధను కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ ముఖ్య అధికారులు రామ్మోహన్రెడ్డి, జగన్మోహన్, వెంకటేశ్వర్లు, కనకశేఖర్, రమేష్, వెంకన్న, కుమారస్వామి, రాజేందర్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, అశోక్, సంజీవ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం
కదిరి: అధికారం ఉంటే చాలు .. తమ స్వలాభం కోసం నడిరోడ్డులో వాహనరాకపోకల్ని కూడా అడ్డుకోవచ్చుంటున్నారు.. తెలుగుదేశం నాయకులు. గురువారం జరగనున్న మార్కెట్యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఒక రోజు ముందే ఆ దారి గుండా వాహన రాకపోకలు బంద్ చేశారు. ‘మా రోడ్డు–మా ఇష్టం’ అంటూ అక్కడ కొందరు టీడీపీ నాయకులు నిలబడి బహిరంగంగా అంటున్నారని కొందరు పట్టణ ప్రజలు ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ బుధవారం మీడియా ముందే పట్టణ ఎస్ఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ‘అది అధికార పార్టీ కార్యక్రమం. మేం ఏం చేయలేం’ అన్న సమాధానం వచ్చింది. దీనిపై తాను కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేస్తానని మాజీ మంత్రి విలేకరులకు తెలిపారు. -
చెరకు సాగుకు చక్కని యంత్ర పరికరాలు!
సంప్రదాయ చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. మారిన పరిస్థితుల్లో కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కూలీ రే ట్లు రైతుకు గుదిబండగా మారి చెరకు సాగు నష్టాల చేదును పంచుతోంది. చెరకు రైతు లాభాల బాట పట్టేందుకు అదును వెంబడి ఆధునిక యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పీవీకే జగన్నాథం, శ్రీదేవి ముందడుగు వేశారు. విత్తనం నాటే దగ్గరి నుంచి పంటను చక్కెర కర్మాగారాలకు పంపేవరకు వివిధ దశల్లో పనులను సులువుగా చేసుకునేందుకు ఆరు యంత్ర పరికరాలను వారు రూపొందించారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఇటీవల ఢిల్లీలో జరిగిన నూతన ఆవిష్కరణల సదస్సులో వీటికి ప్రశంసలు లభించడం విశేషం. ఆ యంత్ర పరికరాల వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. విత్తన చెరకు నాటే యంత్ర పరికరం... విత్తన చెరకును నాటటం, విత్తనశుద్ధి వంటి పనులను ఈ యంత్ర పరికరం (షుగర్కేన్ కట్టర్ ప్లాంటర్)తో ఒకేసారి పూర్తి చేయవచ్చు. బోదెలలో అడుగు లోతులో విత్తనాన్ని ఉంచి, శుద్ధి చేసిన ద్రావణాన్ని పిచికారీ చేసి, ఆపైన మట్టితో కప్పుతుంది. ఒకేసారి రెండు సాళ్లలో విత్తనాన్ని నాటుతుంది. సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు టన్ను దిగుబడి పెరుగుతుంది. విత్తే సమయం 6 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుంది. రూ. 1,500 ఖర్చు ఆదా అవుతుంది. 4 టన్నులకు బదులు 1.25 టన్నుల విత్తనం సరిపోతుంది. దీనితో నాటిన చెరకు మొక్క వేర్లు ఎక్కువ దూరం విస్తరిస్తాయి. దీనివల్ల చెరకు గడ లావు, పొడవు, బరువు పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీని ఖరీదు రూ. 1. 97 లక్షలు. ఒంటికన్ను కణుపులను వరుసల్లో నాటే యంత్ర పరికరం.. బడ్చిప్ ప్లాంటర్ అనే యంత్ర పరికరాన్ని ట్రాక్టర్కు జోడించి ఉపయోగించాలి. కత్తిరించిన చెరకు కణుపులను నర్సరీ ట్రేలలో పెంచి, 20-30 రోజుల వయస్సులో నాటుకుంటారు. ట్రేలను యంత్రంపై పెట్టుకొని కూలీలు మొక్కలను నాళికల్లో వేస్తే ఏకకాలంలో రెండు సాళ్లలో మొక్కలను నాటుతుంది. గంటకు 4 వేల మొక్కలను నాటుతుంది. మొక్కల మధ్య దూరం 30-70 సెం.మీ, సాళ్ల మధ్య 120-150 సెం.మీ. దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. సాళ్లు, మొక్కల మధ్య దూరాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవటం, పెంచుకోవటం చేయవచ్చు. సంప్రదాయ పద్ధతితో పోల్చితే ఎకరాకు రూ.3,600 వరకు ఖర్చు ఆదా అవుతుంది. విత్తనం నాలుగు టన్నులకు బదులు ఒక టన్ను సరిపోతుంది. విత్తే సమయం సగానికి త గ్గుతుంది. ఈ యంత్ర పరికరం ధర రూ. 2.13 లక్షలు. చెరకులో అంతర కృషి యంత్ర పరికరం... చెరకు పంట కాలం పూర్తయ్యే సరికి నాలుగు సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. చిన్న ట్రాక్టర్కు రోటావేటర్ను బిగించి సాళ్ల మధ్య అంతరకృషి చేయటం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. చెరకులో కలుపు నిర్మూలనకు రోటావేటర్ బిగించిన మినీ ట్రాక్టర్ను వాడతారు. రైతువారీ పద్ధతిలో కూలీల ఖర్చు రూ. ఐదు వేలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగిస్తే రూ. వెయ్యి మాత్రమే ఖర్చవుతుంది. సాళ్ల మధ్య నేల గుల్ల బారుతుంది. మూడొంతుల సమయం ఆదా అవుతుంది. ఎకరాకు రూ. నాలుగు వేల వరకు రైతుకు ఆదా అవుతుంది. చెరకు గడల నుంచి ఆకులు రెలిచే యంత్రం... మిల్లులకు రవాణా చేసేముందు చెరకుపైన ఉండే ఆకులు, వ్యర్థాలను రైతులు తొలగిస్తారు. సంప్రదాయ పద్ధతిలో ఒక పూట చేసే పనిని ఈ యంత్రం గంటలోనే చేస్తుంది. 3.6 హెచ్పీ డీజిల్ ఇంజిన్తో ఇది పనిచేస్తుంది. ఇద్దరు కూలీలు సరిపోతారు. టన్ను చెరకు ఆకులను గంటలో తొలగిస్తుంది. చెరకును యంత్రంలో పెడుతుంటే ఆకులను తొలగిస్తుంది. మూడొంతుల సమయం సగం ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. లక్ష. చెత్తను భూమి మీద పరిచే యంత్ర పరికరం.. సాధారణంగా కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వ్యర్థాలను రైతులు తగులబెడతారు. దానికి బదులు ఈ యంత్రం సహాయంతో మూడు, నాలుగు సెం. మీ. పొడవు ముక్కలుగా చేయటం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ఈ వ్యర్థాలు పొలంలోనే కుళ్లి నేల సారవంతం అవుతుంది. ఆచ్ఛాదనగా వాడితే సాగునీటిలో మూడోవంతు ఆదా అవుతుంది. ఈ యంత్రం 45 హెచ్పీ ట్రాక్టర్ట్తో పనిచేస్తుంది. గంటకు రెండున్నర ఎకరాల్లో చెరకు వ్యర్థాలను ఇది ముక్కలు చేస్తుంది. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 2 లక్షల 87 వేలు. కార్శి తోట నిర్వహణ యంత్ర పరికరం... ట్రాక్టర్కు జోడించి వాడుకునే యంత్ర పరికరం ఇది. కార్శి తోటలోని చెరకు దుబ్బులను నేలకు సమాంతరంగా కత్తిరిస్తుంది. ఈయంత్రంలోని బ్లేడ్ అంచులు పదునుగా ఉండి దుబ్బులను కోస్తుంది. ఒక ఎకరాలో దుబ్బులను గంటన్నరలో కత్తిరిస్తుంది. కూలీలతో ఆరుగంటలు పట్టే పనిని ఈ యంత్రం సహాయంతో గంటన్నరలో పూర్తి చేయవచ్చు. ఖర్చు మూడొంతులు తగ్గుతుంది. నేలలోకి గాలి ప్రసరణ ం పెరిగి కొత్త వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. మూడొంతుల సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతాయి. ఈ యంత్ర పరికరం ఖరీదు రూ. 90 వేలు. - దాడి కృష్ణ వెంకటరావు, సాక్షి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా యాంత్రీకరణతోనే చెరకు రైతుకు లాభాలు చెరకు సాగులో యంత్రాల వినియోగం ఇప్పటివరకు దుక్కిదున్నటానికే పరిమితం. మిగిలిన పనులకు కూలీలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగి నష్టాలు రావటంతో చెరకు సాగును రైతులు మానుకుంటున్నారు. యంత్రాల వాడకం వల్ల ఖర్చు త గ్గుతుంది. అదును వెంబడి పనులు పూర్తవడం వల్ల మంచి దిగుబడులతోపాటు లాభాలు వస్తాయి. ఇవి కావలసిన రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. వీటి కొనుగోలుకు ప్రభుత్వ రాయితీలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. - డాక్టర్ పీవీకే జగన్నాథం (94419 44640), పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధిపతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి -
స్వయం పాలనలో సమస్యలు పరిష్కారం
మార్కెట్ కమిటీ ఉద్యోగ నేతలు నర్సింహారెడ్డి, ముఖరం ఖమ్మం వ్యవసాయం : తెలంగాణ ఏర్పడి స్వయంపాలన వచ్చిన తర్వాత సమస్యలను దశలవారీగా పరిష్కారమవుతాయని రాష్ట్ర మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చిలక నర్సింహారెడ్డి, ఎండీ ముఖరం అన్నారు. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చిన వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెటింగ్ శాఖలో పనిచేసే 234 మంది ఉద్యోగులకు మంత్రి తన్నీరు హరీష్రావు, కమిషనర్ డాక్టర్ శరత్ కృషి ఫలితంగా పదోన్నతులు లభించాయన్నారు. 649 ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అయితే ఈ శాఖలో మొత్తం 2 వేల పోస్టులకు గాను వెయ్యి ఖాళీలున్నాయని చెప్పారు. 20 ఏళ్లకు పైగా సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారని, సెక్యూరిటీ ఏజెన్సీలు మారినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. హరితహారం కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో ముందంజలో ఉందని, మార్కెట్ యార్డుల్లో, గోదాముల వద్ద, మార్కెట్ స్థలాల్లో, కార్యాలయాల వద్ద ఇప్పటికే 8 లక్షల మొక్కలు నాటామన్నారు. -
రికార్డుస్థాయిలో పలికిన పత్తిధర
కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. -
ధూమ్‘నామ్’..
♦ ధాన్యం కొనుగోళ్లలో కొత్త విధానం ♦ ఐదు వ్యవసాయ మార్కెట్లలో అమలు ♦ రైతన్నకు మేలు.. ‘జీరో’కు చెక్ ♦ గిట్టుబాటు ధరకు అవకాశం ♦ ఏ వ్యాపారైనా.. ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చు జహీరాబాద్ : వ్యవసాయ మార్కెట్లలో జాతీయ మార్కెటింగ్ విధానం (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్.. నామ్) అమల్లోకి వచ్చింది. సోమవారం ఈ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ‘నామ్’ విధానం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు దోహద పడుతుంది. ఈ విధానాన్ని జిల్లాలోని జహీరాబాద్, సిద్దిపేట, సదాశివపేట, గజ్వేల్, జోగిపేట మార్కెట్ యార్డులలో అమలు పరుస్తున్నారు. ఈ విధానంలో దేశంలోని ఏ ప్రాంతంలోని లెసైన్స్ వ్యాపారి అయినా కొనుగోలు చేసుకోవచ్చు. మార్కెట్కు విక్రయం నిమిత్తం రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని ముందుగా గేటు వద్ద ఆన్లైన్లో పూర్తి వివరాలను ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతుకు లాట్ కోడ్ నెంబర్ ఇస్తారు. గేట్ ఎంట్రీ పాసును అందజేస్తారు. సదరు రైతు తీసుకువచ్చిన ధాన్యం పేరు, ఏయే ధాన్యం ఎన్ని బస్తాల్లో తీసుకువచ్చారు, సుమారు ఎంత తూకం ఉంటుందనే వివరాలను గేటు వద్దే న మోదు చేస్తారు. అనంతరం రైతు విక్రయించే కమిషన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రైతు సరఫరా చేసే ధాన్యానికి సంబంధించిన పేరు, తండ్రి పేరు, గ్రామం, మొబాయిల్ నెంబరు, విక్రయించే కమిషన్ ఏజెంట్ పేరును నమోదు చేస్తారు. అంతే కాకుండా ఎలాంటి వాహనంలో ధాన్యం తీసుకువచ్చారనే వివరాలను కూడా లాట్ ప్రొఫార్మలో పొందు పరుస్తారు. వాహనం తిరిగి గేటు బయలకు వెళ్లే ముందు కూడా ఏమైన సరుకులను వాపసు తీసుకెళుతున్నదీ లేనిదీ నమోదు చేస్తారు. రైతులకు ఉపయోగకరం జాతీయ మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు లబ్ధిచేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారులకు అవకాశం ఉండదు. రైతులు మార్కెట్కు విక్రయం నిమిత్తం తీసుకువచ్చిన ధాన్యం నాణ్యతను నిర్ణయిస్తారు. తేమ శాతం, మట్టి శాతం ఏ మేరకు ఉందనేది ప్రత్యేక విభాగం ద్వారా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో ఉంచుతారు. అనంతరం ఆన్లైన్లో వ్యాపారులు తాము కొనుగోలు చేసే ధాన్యానికి సంబంధించి ధర నిర్ణయిస్తారు. రైతు అంగీకారం ఉంటేనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే రైతు స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులకు సమాచారం ఇచ్చి రద్దు చేసుకోవచ్చు. ఈ విధానంలో రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ఉపయోగపడుతుంది. జీరో వ్యాపారానికి చెక్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ మార్కెటింగ్ విధానం మూలంగా జీరో వ్యాపారానికి చెక్ పడుతుంది. వ్యవసాయ మార్కెట్లలో జీరో వ్యాపారం సైతం సాగుతున్నదనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా తీసుకున్న విధానంతో జీరో వ్యాపారానికి కూడా తెరపడుతుంది. జీరో వ్యాపారం మూలంగానే వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పడిపోతుందనే ఆరోపణలు ఉన్నందున ఈ విధానంలో చెక్పడనుంది. ట్రయల్ రన్గా నామ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నామ్ విధానం ట్రయల్ రన్గా పరిమిత వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే చేపట్టారు. ఈ విధానం విజయవంతమవుతే మిగతా మార్కెట్లకు విస్తరిస్తారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు గాను మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుల వద్ద ఇన్గేట్లను నిర్మించాల్సి ఉంది. అంతే కాకుండా ధాన్యం నాణ్యతను పరిశీలించేందుకు కూడా తగిన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. నామ్ విధానాన్ని అమలు చేస్తున్న వ్యవసాయ మార్కెట్లలో ముందస్తుగాానే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. -
నామిలేటెడ్..!
♦ మార్కెట్ కమిటీల నియామకం ఇంకెప్పుడో..? ♦ ఖమ్మంలో పరిశీలనతోనే సరి, కోర్టు పరిధిలో ‘ఏజెన్సీ’ ♦ ప్రతిపాదనలే లేని 5 కమిటీలు, తప్పని ఎదురుచూపులు ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో ఏడు ఏజెన్సీలో, మిగతావి మైదాన ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క మార్కెట్కు కూడా కమిటీని నియమించలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా..ఇంకా ఆచరణకు నోచకపోవడంతో ఆశావహులో నిరాశ నెలకొంది. ఈసారి అధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఉపాధ్యక్షులు, మిగిలిన సభ్యుల పదవులకు రిజర్వేషన్ ఉండదు. ప్రక్రియే మొదలు కాలే.. జిల్లాలోని మైదాన ప్రాంతంలో ఆరు మార్కెట్ కమిటీల్లో కేవలం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సంబంధించే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మిగతా సత్తుపల్లి, వైరా, కల్లూరు, నేలకొండపల్లి, మధిర మార్కెట్లకు సంబంధించి ప్రక్రియనే మొదలు కాలేదు. ప్రతిపాదనలు అందితే..రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వారు పరిశీలించి, ఆ పదవులను అలంకరించే వారు అర్హులా..? కాదా..? నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పంపిస్తారు. కమిటీ సభ్యులు మార్కెట్ పరిధిలోని వారేనా..? అనే విషయాలను రెవెన్యూ శాఖ ద్వారా ధ్రువీకరించుకుంటారు. తుది జాబితా పేర్లను ప్రభుత్వానికి పంపుతారు. ఖమ్మం మినహా మిగతా మార్కెట్లలో ఈ ప్రక్రియకు శ్రీకారమే చుట్టలేదు. ఏజెన్సీలో ‘ఏడు’పే.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏడు మార్కెట్లు ఉండగా..కోర్టు పరిధిలో వ్యవహారం ఉండడంతో వీటికి నామినేటెడ్ పదవుల నియామకం నిర్వహించే అవకాశం లేదు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, ఏన్కూరు, చర్ల, దమ్మపేట మార్కెట్లకు నామినేటెడ్ యోగ్యం లేదు. ఇక్కడి కమిటీలన్నీ తమకే కేటాయించాలని గిరిజనులు కోర్టును ఆశ్రయించడంతో నియామకం నిలిచి పదేళ్లు దాటుతోంది. జాప్యంతో నైరాశ్యం.. వ్యవసాయ కమిటీ అధ్యక్షులను నామినేటెడ్ పద్ధతిలో నియమించే విషయంలో నెలకొన్న తీవ్ర జాప్యంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం విషయంలో శ్రద్ధ చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం స్థానికంగా వర్గపోరు కూడా కొనసాగుతోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితన్నీరు హరీష్రావుల చేతుల్లోనే ఈ పదవుల నియామకం ఉందని, వారు సూచించిన వారికే పీఠం దక్కుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. -
ఖమ్మం మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు
ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కొనుగోలు నిలిచిపోయాయి. లారీ ఓనర్లకు వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తడంతో లావాదేవీలు ఆగిపోయాయి. వ్యాపారులు తెలంగాణాకు సంబంధించిన వాహనాలను మాత్రమే కిరాయికి తీసుకోవాలని తెలంగాణా లారీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమకు తెలంగాణా లారీలైనా, ఆంధ్రా లారీలైన ఒకటేనని ఎవరు కిరాయి తక్కువ తీసుకుంటే వారికే ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఆందోళన కొనసాగుతోంది. -
రూ. కోటితో కొత్త మార్కెట్ల అభివృద్ధి
♦ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి ♦ పాలమూరు -రంగారెడ్డి ద్వారా పరిగికి నీళ్లు ♦ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు కుల్కచర్ల: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి మార్కెట్కు మొదటి విడతగా రూ. కోటి కేటాయించి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవా ణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి చెప్పారు. శుక్రవారం కుల్కచర్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు కుల్కచర్లలో రూ.30లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మార్కెట్ కమిటీ సభ్యులను సన్మానించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాల ని.. పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకూడదని నూతన వ్యవసాయ మార్కెట్లు ఏర్పా టు చేశామని.. వీటిని రూ.50 కోట్లతో అబివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి మండల కేంద్రం నుం చి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు తారురోడ్డు ఏర్పాటు చేయలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి నియోజకవర్గం సశ్యశామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కుల్కచర్ల మండలంలో ఏర్పాటు కావడం మండల రైతుల అదృష్టమని మంత్రి చెప్పారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతులు పరిగి నియోజకవర్గంలో ఎక్కువమంది ఆత్మహత్య చేసుకున్నారని.. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీఆర్ఎస్ పొలిట్బూర్యో సభ్యుడు హరీశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తప్ప ఇతర సమయాల్లో రాజకీయం చేయరాదని, రాజకీయం పేరుతో అబివృద్ధి అడ్డుకోకూడదని అన్నారు. అనంతరం లంబాడీ హక్కుల పోరాట సమితి, ట్రేడర్స్ యూనియన్ ఆద్వర్యంలో మంత్రిని సన్మానించా రు. అంతకుముందు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో జిల్లా మార్కెట్ అధికారి ఛాయాదేవి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు మంజుల, గండేడ్ ఎంపీపీ శాంతి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, వైస్ ఎంపీపీ పాండు, కుల్కచర్ల సర్పంచ్ జానకిరాం, ఎంపీటీసీ సభ్యుడు మాలే కృష్ణగౌడ్, ఆంజనేయులు, రాంచందర్రెడ్డి, మార్కె ట్ కమిటీ జిల్లా అధికారి రాంచందర్, పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, హరికృష్ణ, వెంకట్, బుడ్డ మ్మ, రాములు, నాగరాజు, రాజప్ప, రాజు, పులి రాములు, రాందాస్, మొగులయ్య పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి ముజాహిద్పూర్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పం చ్ సునీత, శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ బుధవారం క్వింటాల్ పత్తికి కు గరిష్టంగా రూ.6,021 పలికింది. జమ్మికుంట మార్కెట్కు కరీంనగర్, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు 1,210 క్వింటాళ్ల పత్తిని బుధవారం తీసుకురాగా, వ్యాపారులు మోడల్ ధర రూ.5,500, కనిష్ట ధర రూ.4,500 చెల్లించారు. మూడేళ్ల క్రితం పలికిన ధర మళ్లీ ఈ సీజన్ చివరలో పలుకడంతో రైతుల్లో అనందం వెల్ల్లివిరిసింది. రాష్ట్ర స్థాయిలోనే జమ్మికుంట మార్కెట్లో పలికిన ధర ఈ సీజన్లో రికార్డుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లకు, గింజలకు ఉహించని విధంగా డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీ పడి పత్తికి ధరలు చెల్లిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి సాగు మొదలవుతున్న సమయంలో పత్తికి ధర పైపైకి పాకుతుండడంతో రైతుల్లో ఉత్సాహన్ని కలిగిస్తోంది. ఇదే మార్కెట్లో 2013 మార్కెట్ సీజన్లో పత్తి ధర రూ.6,000-6,800 వరకు పలికింది. వరంగల్లో 6వేలకు చేరువలో.. వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటా పత్తి రూ.5,915 ధర పలికింది. మూడేళ్లలో ఇదే రికార్డు ధర. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ అనే రైతు ఇంతకాలం పత్తి నిల్వ చేసి, ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో 250 బస్తాల పత్తిని మమత ట్రేడర్స్ వారి వద్దకు అమ్మకానికి తెచ్చాడు. మొదటి వేలం పాటలోనే జమ్మికుంటకు చెందిన నర్సింహ ఇండస్ట్రీస్ వ్యాపారి రూ.5,915 అత్యధిక ధరతో కొనుగోలు చేశాడు. నిల్వ చేసిన పత్తి మొత్తం 108 క్వింటాళ్లు అయిందని, మార్కెట్ ఖర్చులన్నీ పోను రూ.6.40 లక్షల వచ్చాయని ఎల్లగౌడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజంటూ మిఠాయిలు కొనుగోలు చేసి మార్కెట్లో పంపిణీ చేశాడు. -
ఎమ్మెల్యే పులపర్తి ఘెరావ్
► మార్కెట్యార్డును ముట్టడించిన కాపులు ► అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ అంబాజీపేట : తుని ఘటనల నేపథ్యంలో పెట్టిన కేసుల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనిన్న డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమసారథి ముద్రగడకు మద్దతుగా కాపు ఉద్యమకారులు సోమవారం అంబాజీపేటలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని ఘెరావ్ చేశారు. మార్కెట్ యార్డులో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పులపర్తిని వందలాదిమంది కాపులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు వ్యంగ్యంగా మాట్లాడుతూ కాపు జాతిని కించపరుస్తున్నారని మండిపడుతూ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ముద్రగడ ఆమరణ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ నాయకుడు చావుబతుకుల మధ్య ఉంటే సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఎంతవరకూ సబబని నిలదీశారు. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో భారీగా పోలీసులను మోహరించారు. తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తి వేయాలని, కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. కాపు నాయకుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు అసెంబ్లీ సమావేశంలో చర్చించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
'రూ.50 కోట్లతో వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి'
-తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లకు జాతీయస్థాయి గుర్తింపు -ధారూరు మార్కెట్ అభివృద్ధికి రూ. 2 కోట్లు -రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి ధారూరు : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కేటాయించామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని స్టార్ పంక్షన్హాలులో జరిగిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో కొత్తగా కోట్పల్లి, బషిరాబాద్, కులకచర్ల, మహేశ్వరం వ్యవసాయ మార్కెట్లను మంజూరు చేసినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయించామని, ధారూరు మార్కెట్కు కూడ రూ. 2 కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలోని తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్లు జాతీయ స్థాయి మార్కెట్లుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని 1146 చెరువులకు రూ. 385 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అలాగే బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణ పనులకు రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మంజూరు అవుతేన్నాయని అన్నారు. అలాగే తాండూర్-వికారాబాద్ వయా ధారూరు మీదుగా ఉన్న డబుల్ లైన్ రోడ్డును ఫ ఓర్లైన్స్ రోడ్డుగా మార్చడానికి రూ. 40 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుగా చేసి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ధారూరు మండలానికి ఎస్సీ, ఎస్టీలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేయిస్తామని మంత్రి హామి ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అంశం తన పరిధిలో లేదని డిప్యూటి సీఎంను కలసి కళాశాల మంజూరు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. -
గుంటూరు మార్కెట్ యార్డులో లావాదేవీలు బంద్
గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో దిగుమతి, ఎగుమతి గుమాస్తాలు, హమాలీలు వ్యాపార లావాదేవీలను నిలిపివేసి పరిపాలన కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. యార్డు అధికారుల నిబంధనలతో తమకు పనిభారం పెరిగిపోతోందని, నిబంధనలు సడలించాలని వారు కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు యార్డులో లావాదేవీలు జరపబోమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకొన్న నల్లపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో మిర్చి యార్డు వద్దకు చేరుకొని పూర్తి బందోబస్తు ఏర్పాటుచేశారు. -
మరో ఆరు మార్కెట్ కమిటీలు
ఇప్పటివరకు 51 కమిటీలకు నియామకం సాక్షి, హైదరాబాద్: ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (పాశం విజయ), ఆలేరు (కాలే సుమలత), కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట (గుండ సరోజన), మానకొండూరు (మల్లగల్ల నగేశ్) కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేశారు. రంగారెడ్డి జిల్లా సర్దార్నగర్ కమిటీ చైర్మన్గా శేరిగూడెం వెంకటయ్య, మెదక్ జిల్లా నంగునూరు కమిటీ చైర్మన్గా సంగు పురేందర్ నియమితులయ్యారు. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 11 కమిటీలకు పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించారు. మిగిలిన 168 కమిటీలకుగాను 51 కమిటీలకు పాలక మండళ్లను నియమించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 21 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు ఒక్క కమిటీని కూడా నియమించలేదు. మార్కెట్ కమిటీల్లో చోటు కల్పించాలంటూ టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీల కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రతిపాదనలపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు తమకు అనుకూలంగా ఉండే వారిని రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా ప్రతిపాదిస్తున్నారు.పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ఏడాదిగా నిర్ణయించడంతో తర్వాతి పాలక మండలిలో చోటు కల్పిస్తామంటూ సర్దిచెప్తున్నారు. నెలాఖరులోగా భర్తీ: మంత్రి హరీశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలుపుతున్నాం. మిగతా కమిటీలకు సంబంధించి నియామక ప్రక్రియపై కసరత్తు సాగుతోంది. నెలాఖరులోగా కమిటీలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఉన్నాం. సమర్థులను ఎంపిక చేయడం ద్వారా మార్కెట్ యార్డుల కార్యకలాపాలను రైతులకు మరింత చేరువ చేస్తాం. దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకూ పెద్దపీట వేస్తున్నాం. -
విశ్రాంతి.. పెద్ద భ్రాంతి!
పంట తీసుకొచ్చే రైతులకు నిలువనీడ కరువు రూ.2000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నా.. ఫలితం సున్నా బస్తాలపై, చెట్ల నీడలో సేదతీరుతున్న అన్నదాతలు ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్లో విశ్రాంతి భవనాల లేమి వరంగల్ సిటీ: ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అది. దేశంలోనే ఏకైక రెగ్యులేటరీ మార్కెట్ కూడా అదే. అధికారిక లెక్కల ప్రకారం.. సంవత్సరానికి రూ.2000 కోట్ల వ్యాపార లావాదేవీలకు నెలవు. అనధికారికంగా మరో రూ.2000 కోట్ల వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటారుు. ఇంత గొప్ప ‘ఘణా’ంకాలు, ఘన కీర్తి ఉన్నా.. వరంగల్ మార్కెట్లో అన్నదాతలకు మండుటెండల్లో నిలువ నీడ దొరకడం లేదు. దీంతో దాని పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయూరైంది. అభివృద్ధి పనులకు ఎన్నో నిధులు వెచ్చించినా.. ఇప్పటిదాకా మార్కెట్లో రైతుల కోసం విశ్రాంతి భవనాలను నిర్మించలేదు. ఈ కారణంగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ తాము మార్కెట్కు తీసుకొచ్చే పంట బస్తాలపైన, చెట్ల నీడన రైతులు సేదతీరుతున్నారు. అందరికీ కూడుపెట్టే అన్నదాతల సౌకర్యార్ధం విశ్రాంతి భవనాలను నిర్మించాల్సిన అవసరముందని రైతులోకం అభిప్రాయపడుతోంది. గౌరవించే సంస్కారం లేదు రైతులతో అటు ప్రభుత్వానికి, ఇటు మార్కెట్ అధికారులకు ఏం అవసరం ? మా పంట వ్యాపారులకు కావాలి. అందులో అందరికీ వాటాలు కావాలి. అంతే తప్ప రైతులను గౌరవించే సంస్కారం మార్కెటింగ్ శాఖలో లేదు. అందుకే మార్కెట్లో విశ్రాంతి భవనాలు కట్టడం లేదు. - అరికాల రాజలింగం, పత్తి రైతు నీళ్లు కొనుక్కోవాలి.. నీడ వెతుక్కోవాలి అందరికి అన్నం పెట్టే రైతులం వరంగల్ వ్యవసాయ మార్కెట్కు పంట తీసుకొచ్చినప్పుడు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నీరు కొని తాగాల్సి వస్తోంది. ఈ మండుటెండల్లో నీడనిచ్చే ప్రదేశం మార్కెట్లో లేదు. దీంతో చెట్లు ఎక్కడున్నాయూ అంటూ వెతుక్కోవాల్సి వస్తోంది. చెట్ల నీడనే సేదతీరుతున్నాం. విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. - ఎలకంటి సుదర్శన్రెడ్డి, మక్క రైతు వారిది స్వార్ధం.. మాది నిస్వార్ధం మేం తెచ్చిన పంట కొని వ్యాపారులు లాభపడుతారు. వ్యవసాయ మార్కెట్లో పనిచేసే అధికారులకు వేలాది రూపాయల జీతాలు వస్తారుు. మేం మట్టిని నమ్ముకొని.. రాత్రనక, పగలనక కష్టపడి, నిద్రాహారాలు మాని పండించిన పంట మాత్రం వాళ్లకు కావాలి. మా సంక్షేమం అక్కర్లేదు. వాళ్లది కచ్చితంగా స్వార్ధమే. మాది నిస్వార్ధం. - ముదిరి మల్లయ్య, వేరుశనగ రైతు విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మాణానికి ప్రయత్నాలు వరంగల్ మార్కెట్లోని అన్ని యార్డుల్లో రైతులకు విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. మరుగుదొడ్లు, మంచినీటి వసతిని త్వరలో అందుబాటులోకి తెస్తాం. - అజ్మీరా రాజు, మార్కెట్ కార్యదర్శి ప్రజాప్రతినిధులు చొరవచూపాలి మా చెమట చుక్కలతోనే వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయూన్ని విస్మరించి అధికారులు,వ్యాపారులు ప్రవర్తిస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైనా చొరవ చూపి రైతుల కోసం వరంగల్ మార్కెట్లో విశ్రాంతి భవనం నిర్మాణం జరిగేలా చూడాలి. - ఆర్.శంకర్రావు, పత్తి రైతు -
16 నుంచి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు బంద్
సుభాష్నగర్ (నిజామాబాద్) : ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలను నిలిపేస్తున్నట్లు మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంప శ్రీనివాస్గుప్త తెలిపారు. కమీషన్ ఏజెంట్లు వ్యాట్ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బంద్కు వెళ్లనున్నట్టు చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డులో మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు తీర్మానం చేశారు. ధాన్యం కొనుగోలుదారులు ఇప్పటికే 4 శాతం వ్యాట్ను వాణిజ్యపన్నుల శాఖకు చెల్లిస్తున్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా కమీషన్ ఏజెంట్లు సైతం వ్యాట్ చెల్లించాలనడం హాస్యాస్పదమని శ్రీనివాస్ గుప్తా అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను నిలిపేయాలని రాష్ట్ర కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. -
‘సత్తు’కే అవకాశం
♦ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్గా వెంకటరమణారెడ్డి ♦ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడికే దక్కిన చైర్మన్ గిరీ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్గా దండికార్ రవి, సభ్యులుగా పొన్నాల జగదీశ్, ఎండీ జహీర్, చీమల జంగయ్య, జంబుల కిషన్రెడ్డి, సపవాట్ అనసూయ, ఓరుగంటి యాదయ్యగౌడ్, మచ్చ లక్ష్మయ్య, ఏనుగు బుచ్చిరెడ్డిలను నియమించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి సత్తు వెంకటరమణారెడ్డి ముఖ్యఅనుచరుడు. -
పదవి కోసమే టీడీపీలో కుమ్ములాటలు
= గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం ఎత్తుకు పైఎత్తులు = టీడీపీలో కుమ్ములాటలు.. ముఖ్య నేతలకు పరస్పర ఫిర్యాదులు = కొన్ని పేర్లతో జాబితా ఇచ్చిన టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు = అదేం కుదరదని అధికారులతో చెప్పిన పాత నాయకులు = మార్కెట్ యూర్డు కమిటీ ఎంపిక మళ్లీ వాయిదా? జిల్లాలో టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులపై కన్నుపడింది. వరుసగా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నేతలు ఎలాగైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ఇప్పుడు పదవుల కోసం ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పార్టీలో పాత.. కొత్త నేతలుగా విడిపోయి కుమ్ములాటలకు దిగుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. అక్కడి మార్కెట్ యూర్డ్ చైర్మన్గిరి కోసం తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గ్రూపు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. గిద్దలూరు : గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం టీడీపీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి రాంబాబు మార్కెట్ యార్డు కమిటీకి కొన్ని పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ అందజేశారు. అందులో డెరైక్టర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రాంబాబు అనుచరులే. ఆ జాబితాలో ఇటీవల పార్టీలోకి వచ్చిన వారు కొందరైతే.. రాంబాబు అడుగుల్లో అడుగులు వేసేవారు మరికొందరు. దీంతో ఆ జాబితాను పాత టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ మార్కెట్ యార్డుకు కమిటీని నియమించడంలో ఆ పార్టీ ముఖ్య నేతలు విఫలమయ్యూరు. నియోజకవర్గంలోనే కంభం మార్కెట్ యార్డుకు కమిటీని నియమించిన ప్రభుత్వం.. గిద్దలూరు విషయంలో మాత్రం వెనుకంజ వేస్తోంది. పాత, కొత్త నేతల మధ్య వార్ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపుల మధ్య చిచ్చు రేపేలా తయారైంది. రెండు నెలల క్రితం వరకు యాదవులకు చైర్మన్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరగడంతో ముగ్గురు నాయకులు ఇన్చార్జి చుట్టూ తిరిగారు. వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ పదవి ముగ్గురిలో ఎవరికీ దక్కకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఇన్చార్జి ఒక నిర్ణయూనికి వచ్చారు. కాలక్రమంలో వారిలోనూ పోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 నెలల పాటు చైర్మన్గా పనిచేసిన ఆర్డీ రామకృష్ణ, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన కుప్పా రంగనాయకులు, టీడీపీ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు సిరిగిరి లింగయ్యలు పోటీ పడ్డారు. వీరిలో ఇద్దరు నాయకులు రాంబాబుతో పాటు టీడీపీలో చేరిన వారు కావడంతో వారి మధ్య సమోధ్య కుదుర్చి కుప్పాకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న లింగయ్యను మాత్రం ఆర్థిక స్థోమత లేదంటూ పక్కకు నెట్టేశారు. లింగయ్యతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తమను కాదని సొంత అనుచరులకు పదవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నా రాంబాబుపై పాత టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తోళ్లకే అందలం పదేళ్లు పార్టీ కష్టకాలంలో ఉంటే తాము పార్టీని వెన్నంటి ఉన్నామని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ టీడీపీలో ముందు నుంచీ ఉన్న నేతలు కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీని వెన్నంటి ఉన్న వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారని గుర్తు చేశారు. గిద్దలూరులో తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు వ్యవసాయం గురించి తెలియని వారిని ఎలా నియమిస్తున్నారని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మార్కెట్యార్డు కమిటీ ప్రకటన జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్లు ఉన్న వారికే పదవి ఇస్తామంటున్నారు: సిరిగిరి లింగయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ముందు రెండు, వెనకాల రెండు కార్లు ఉన్న వారికే ఇస్తామని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు చెబుతున్నాడు. కార్లలో తిరిగే వారు రైతులకు ఎలా సేవలందిస్తారు? అలాంటి వారికి రైతుల కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి? నేను 20 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను. ఇన్చార్జి తన సొంత వర్గానికి పదవులు కట్టబెట్టి పార్టీ కోసం కృషి చేసిన మాకు మొండి చేయి చూపాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కష్టపడే వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలి. -
రైతు శ్రేయస్సుకు పాటుపడండి
మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల సిబ్బంది రైతు శ్రేయస్సుకు పాటుపడాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మార్కెటింగ్ విభాగంలో వివిధ గ్రేడ్లలో పనిచేస్తున్న 76 మందికి పదోన్నతులు ఇచ్చిన సందర్భంగా మంగళవారం ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించే సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీల్లో ఇంకుడు గుంతలు నిర్మించి జల సంరక్షణ చేపట్టాలని చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు ైడె రెక్టర్ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, కార్యదర్శి ఎండీ ముకరం తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు
సాక్షి, హైదరాబాద్: మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తొలి విడతలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాలో నిజామాబా ద్ జిల్లా కమ్మర్పల్లి, వేల్పూరుతో పాటు మెదక్ జిల్లా సంగారెడ్డి మార్కెట్ కమిటీలకు చోటు దక్కింది. ఒక్కో కమిటీలో చైర్మన్, వైస్చైర్మన్, మరో 12 మందిని సభ్యులుగా నామినేట్ చేశా రు. బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు చేసిన కమ్మర్పల్లి కమిటీ చైర్మన్గా దొనకంటి నర్సయ్య, వైస్ చైర్మన్గా గడ్డం స్వామి, ఎస్టీ మహిళ కేటగి రీలో వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పుట్ట లలిత, వైస్చైర్మన్గా ఏలేటి రమేశ్, మెదక్ జిల్లా సంగారెడ్డి కమిటీకి ఓసీ జనరల్ కేటగిరీలో చైర్మన్గా తేర్పల్లి కొండల్రెడ్డి, వైస్చైర్మన్గా ఎంఏ సుభాన్ను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. -
మళ్లీ.. మళ్లీ దర్యాప్తు!
సాక్షి, విజయవాడ : మార్కెటింగ్ శాఖలో ఒకే ఘటనపై పదే పదే దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆసియాలోకెల్లా అతి పెద్ద రెండో మార్కెట్ యార్డుగా పేరున్న గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో మిర్చి కమీషన్ ఏజెంట్ల లెసైన్స్లో భాగస్వాముల మార్పుపై మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై గత రెండేళ్లుగా విచారణపర్వం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం గొల్లపూడిలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో జాయింట్ డెరైక్టర్ రామాంజనేయులు విచారణ నిర్వహించారు. విచారణకు గతంలో గుంటూరు మార్కెట్ కమిటీ యార్డులో పనిచేసిన 13 మంది ఉద్యోగులు హాజరయ్యారు. 2008 నుంచి 2013 వరకు వరకు మొత్తం 293 కమీషన్ ఏజెంట్ల లెసైన్స్ల్లో భాగస్వాముల పేరు మార్పు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాల నిబంధనలకు లోబడి అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో భాగస్వాముల పేర్లు మార్పు వ్యవహారం జరిగింది. ఈక్రమంలో కె.కోటిరెడ్డి అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్ల భాగస్వాముల పేర్లు మార్పులు చేస్తున్నారని మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 మార్చిలో రెన్యూవల్స్ కావాల్సిన 293 లెసైన్స్లను అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోటిరెడ్డి ఫిర్యాదును విచారించాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ కడప జిల్లా జేడీ ఆర్.అక్ష్మణుడును విచారణాధికారిగా నియమించింది. దీంతో భాగస్వాముల లెసైన్స్ల మార్పు, ఫైల్ ప్రాసెస్ చేసిన మార్కెట్ కమిటీ ఉద్యోగులు 23 మందిని బాధ్యులుగా నిర్ధారించారు. వీరిలో సర్వీసులో ఉన్న 13 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మిగిలిన 9 మంది రిటైర్ అయ్యారు. వారిలో ఐదుగురుకి ఆర్టికల్ ఆఫ్ చార్జ్స్ కింద మోమోలు ఇవ్వగా మిగిలిన నలుగురు రిటైరై నాలుగేళ్లు దాటడంతో కేసు నుంచి మినహాయించారు. ఈ క్రమంలో లక్ష్మణుడు విచారణ నిర్వహించి ఉద్యోగులు రూల్ ప్రకామే చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మార్కెట్ యార్డులో లెసైన్స్ల వ్యవహారం హడావుడి జరగుతున్న క్రమంలో అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి తాను రెన్యూవల్స్ చేస్తానని వ్యాపారుల నుంచి సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు దీనిపై లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ దీనిని విచారణ నిర్వహిస్తోంది. దీనికి కూడా రామాంజనేయులే విచారణాధికారి వ్యవహరిస్తున్నారు. లక్ష్మణుడు నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ రైతుబాజార్ సీఈవో ఎంకె సింగ్ను విచారణాధికారిగా నియమించి రెండోసారి విచారణ నిర్వహించారు. ఆ అధికారి గుంటూరు యార్డుకు రాకుండానే ఉన్నతస్థాయి వ్యక్తుల సూచనలతో నివేదికను సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం మళ్లీ రెగ్యులర్ ఎంక్వైయిరీ ఆఫీసర్గా గతేడాది ఫిబ్రవరి 2న రామాంజనేయుల్ని విచారణాధికారిగా నియమించి ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. గత ఏడాది నిర్వహించాల్సిన విచారణ ఎట్టకేలకు మంగళవారం జరగడంతో 13 మంది ఉద్యోగులు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. చట్టాలకు లోబడి, ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో పనిచేసే తమను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఈ ఘటనతో పూర్తి ప్రయేయం ఉన్న వ్యక్తుల్ని విచారించాలని వారు కోరారు. -
మహిళలకే మార్కెట్ పీఠాలు
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్ ఖంగుతిన్న ఆశావహులు, అధికార పార్టీ నేతలు చేవెళ్ల స్థానం బీసీ మహిళకు సర్ధార్నగర్, శంకర్పల్లి బీసీలకు కేటాయింపు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది సర్కార్. చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకూ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు తమకే దక్కుతాయని ఆశించిన పలువురు అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. మార్కెట్ కమిటీలకు మహిళలను నియమించనున్నారనే విషయం తెలుసుకుని నిరాశ చెందారు. మేలోపు పాలకమండళ్లను కొలువుదీర్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మంత్రి హరీశ్రావు ప్రకటించడం, మహిళా రిజర్వేషన్లు ఖరారు కావడంతో.. పైరవీలు జోరందుకున్నాయి. చేవెళ్ల : తాజా సవరణమేరకు తెలంగాణ రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో.. మహిళలకు 55 స్థానాలు దక్కనున్నాయి. వీరికి కేటాయించే స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, సర్ధార్నగర్, శంకర్పల్లి, వికారాబాద్, ధారూరు, పరిగి, తాండూరు, మర్పల్లి, ఇబ్రహీంపట్నం, నార్సింగి, మేడ్చల్ను కలిపి 11 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. తాజా సవరణల మేరకు 33 శాతంతో నాలుగు కమిటీలకు మహిళలే చైర్పర్సన్లుగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతమున్న కమిటీల పదవీకాలం ముగియకున్నా 2014 ఆగస్టులో ఆర్డినెన్స్ద్వారా ఈ పాలకమండళ్లను రద్దుచేసింది. రైతుల సమస్యలపై దృష్టిసారించి, వారికి మేలు చేయాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రాజకీయ నాయకులు తిష్టవేశారని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా వ్యవసాయం తెలిసి.. రైతులై ఉన్నవారినే ఈ కమిటీల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేవెళ్ల బీసీ మహిళలకు కేటాయింపు... నియోజకవర్గం పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, సర్దార్నగర్ మార్కెట్ కమిటీలున్నాయి. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేవెళ్ల మండలం, శంకర్పల్లి మార్కెట్ పరిధిలోని శంకర్పల్లి మండలం, సర్ధార్నగర్ మార్కెట్ పరిధిలోని షాబాద్, మొయినాబాద్ మండలాలు వస్తాయి. నవాబుపేట మండలం మాత్రం వికారాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తుంది. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని బీసీ మహిళలకు, సర్ధార్నగర్, శంకర్పల్లి బీసీలకు కేటాయించారు. పైరవీలు షురూ.. నామినేటెడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఈనెలాఖరులోగా నియమించేందుకు సీఎం అంగీకరించడం, మహిళా రిజర్వేషన్లు కూడా అధికారికంగా ప్రకటించడంతో ఆశవహులు ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. చేవెళ్ల మార్కెట్ కమిటీని బీసీ మహిళలకు కేటాయించడంతో పదవిని ఆశిస్తున్న పలువురు నాయకులు సోమవారం మంత్రి మహేందర్రెడ్డిని కలిశారు. జెడ్పీటీసీ ఎం.బాల్రాజ్, పార్టీ మండల అధ్యక్షుడు సామ మాణిక్రెడ్డి తదితరులు ఫలానా వారికే చైర్మన్గిరీ ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మార్కెట్ ఉపాధ్యక్ష పదవి మాత్రం మంత్రి అనుచరుడు, టీఆర్ఎస్ నాయకులు మాసన్నగారి మాణిక్రెడ్డికే దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. షాబాద్ మార్కెట్ కమిటీ పదవికి నాగరకుంట పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకటయ్యకే దక్కనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శంకర్పల్లి మార్కెట్ పదవి బొమ్మ నగారి కృష్ణకుగాని, మీర్జాగూడకు చెందిన ఒగ్గు మల్లేశ్కుగానీ దక్కవచ్చని తెలుస్తోంది. -
ఊరు వెళ్లి వచ్చేసరికి.. ఇల్లు ఖాళీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో దొంగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా నివాసం ఉండే రమణి అనే మహిళ శనివారం పనిమీద వేరే ఊరికి వెళ్లి ఆదివారం తిరిగి రాగా, చోరీ జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉంచిన సుమారు రూ.1లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆమె పేర్కొన్నారు. రమణి ఇంటి పక్కనే ఉన్న సాయిబాబ అనే వ్యక్తి ఇంట్లోనూ దొంగలు చోరీకి ప్రయత్నించారు. తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించి సఫలం కాకపోవడంతో వెళ్లిపోయారు. -
మలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ షురూ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానానికి ఎంపికైన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో గురువారం వ్యవసాయ శాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ ఆన్లైన్ ట్రేడింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు దేశంలో ఎక్కడ నుంచైనా ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చన్నారు. గిట్టుబాటు ధర ఎక్కడ అధికంగా ఉంటే అక్కడ అమ్ముకునే విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులు దళారుల బారినపడి మోసాలు, నష్టాలకు గురికాకుండా నేరుగా రైతే వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రధాని ఉపన్యాసాన్ని మార్కెట్లోని రైతులు, వ్యాపారులు, అధికారులు విన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎల్లయ్య, వెంకట్ రెడ్డి, వ్యాపారులు వంజరి వినోద్, రాజేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
మార్కెట్ పీఠంపై మహిళ!
వ్యవసాయ మార్కెట్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్లలో దాదాపు నాలిగింట్లో మహిళలు చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఇద్దరు, ఏజెన్సీలో ఇద్దరికి ఈ అవకాశం లభించవచ్చు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తూ ఎప్పటి నుంచో అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్న పలువురు ఆశావహుల్లో ఈ పరిణామంతో ఆందోళన నెలకొంది. ఖమ్మం: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చట్టం మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్ను నామినేటెడ్ పదవుల భర్తీలో అమలు చేయాలని భావిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదలు నామినేటెడ్ పదవుల్లోనూ స్త్రీలకు పెద్దపీట వేసే దిశగా చర్యలు చేపట్టింది. గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులకు గత ఏడాది ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. అంతటితో ఆగని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకూ రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసింది. మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలపడంతో మార్కెటింగ్శాఖ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈమేరకు 33 శాతం మహిళలు చైర్పర్సన్లుగా ఎంపికవుతారు. రాష్ట్రవ్యాప్తంగా 179 వ్యవసాయ మార్కెట్లు ఉండగా 59 మంది మహిళలు చైర్పర్సన్లయ్యే అవకాశం ఉంది. వీటిలో 11 వ్యవసాయ మార్కెట్లు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఇందులోనూ ఎక్కువ మార్కెట్లు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు ఏజెన్సీలో ఉన్నాయి. 1996 పెసా చట్టం ప్రకారం ఈ వ్యవసాయ మార్కెట్ పదవులను ఎస్టీలకు కేటాయించారు. 13 మార్కెట్లలో నలుగురు చైర్పర్సన్లు.. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 7 వ్యవసాయ మార్కెట్లు ఏజెన్సీలో, 6 మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఏన్కూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, దమ్మపేట, చర్ల వ్యవసాయ మార్కెట్లు ఏజెన్సీలో ఉన్నాయి. ఈ మార్కెట్ల కమిటీలను ఎస్టీలకే కేటాయించారు. మైదాన ప్రాంతంలో ఖమ్మం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఖమ్మం, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను బీసీలకు, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి మార్కెట్లను ఓసీలకు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించారు. ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఈ పదవులపై ఆశపెట్టుకున్న నేతల్లో ఆందోళన నెలకొంది. నలుగురికి చాన్స్? జిల్లాలో మొత్తం వ్యవసాయ మార్కెట్లను పరిగణలోకి తీసుకొని వాటిలోనూ 33 శాతం కమిటీ చైర్మన్ పదవులను మహిళలకే కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఖాయమైతే జిల్లాలోని మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లలో 33 శాతం మహిళలకు కేటాయిస్తే నలుగురు మహిళలకు చైర్పర్సన్ పదవులు దక్కే అవకాశం ఉంది. దీనిలో రెండు ఏజెన్సీలో, రెండు మైదాన ప్రాంతంలో ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కులాల వారీగా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటే మహిళా రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంది. ఆశావహుల్లో అయోమయం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది వ్యవసాయ మార్కెట్ పదవులకు రిజర్వేషన్లు కల్పించింది. పలువురు ఆశావహులు ఈ పదవులను దక్కించుకోవడం కోసం ఏడాదిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నాయకులు ఈ పదవుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రూ.1500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని గతంలో బీసీకి కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన పలువురు నాయకులు ఆ పదవి కోసం వెంపర్లాడుతున్నారు. మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి చైర్మన్ పదవులను ఓసీలకు రిజర్వ్ చేశారు. వైరా చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి..కాబట్టి ఈ రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తమ కేటగిరీకి కేటాయించిన మార్కెట్లు మహిళలకు రిజర్వేషన్ కాకుండా చూడాలని ఆయా వర్గాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం ఒకవేళ తమకు పదవి దక్కకపోతే తమ భార్యలకైనా చైర్పర్సన్ పదవి ఇప్పించాలని పలువురు పావులు కదుపుతున్నట్లు సమాచారం. వారం రోజుల్లో మహిళలకు కేటాయించే స్థానాలను నిర్ణయించి, నెల రోజుల్లో మార్కెట్ కమిటీలను భర్తీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
ఎర్ర బంగారులోకం..
♦ మార్కెట్కు పోటెత్తిన మిర్చి ♦ శుక్రవారం 80వేల బస్తాలు రాక ♦ నిండిన యార్డులు, రహదారులు ♦ వరుస సెలవులే కారణం ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ శుక్రవారం ఎర్రబంగారంతో నిండిపోయింది. దాదాపు 80వేల మిర్చి బస్తాలను రైతులు మార్కెట్కు తరలించడంతో కళకళలాడింది. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మార్కెట్ యార్డును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్, కౌంటింగ్ తదితర ప్రక్రియను యార్డులోనే నిర్వహించారు. శని, ఆదివారం సెలవులు, అమావాస్య కావడంతో ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో గురు, శుక్రవారా ల్లో మిర్చి భారీగా అమ్మకానికి వచ్చింది. 12, 13 తేదీలు కూడా సెలవు దినాలు కావటంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. గురువారం కూడా దాదాపు 80 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. యార్డుల్లో సరుకు కొనుగోళ్లు, కాంటా లు పూర్తయినా వ్యాపారులు సరుకును కేంద్రాలకు తరలించలేకపోయారు. వాహనాల్లో లోడ్ చేయటం.. వాటిని తరలించటానికి సమయం పడుతోంది. శుక్రవారం కూడా 80వేల బస్తాల మిర్చి అమ్మకానికి రావటంతో యార్డులు, రహదారులపై రైతులు సరుకును దించక తప్పలేదు. మిర్చి, అపరాల యార్డు రహదారుల్లో బస్తాలను దించుకున్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ కార్యాలయానికి దారికూడా మూసుకుపోయింది. ఓ వైపు ఎండ.. మరో వైపు ఘాటు ఉండటం తో కార్మికులు పంట ఉత్పత్తిని కాంటా పెట్టడానికి.. సరుకును వాహనాల్లో ఎత్తటానికి ఇబ్బంది పడ్డారు. మిర్చి గరిష్టధర రూ.12,300 పలికింది. ధర కూడా కొంత మేర ఆశాజనకంగా ఉండటంతో జిల్లా రైతులేకాక నల్లగొండ, వరంగల్, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన రైతులు సరుకును ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయకుండా నేరుగా మార్కెట్లో అమ్ముతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో యార్డులు, రహదారుల్లో ఉన్న సరుకునంతా బయటకు పంపించి.. సోమవారానికి యార్డులను సిద్ధం చేస్తామని మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు. -
‘మార్కెట్’ రిజర్వేషన్లకు చట్టబద్ధత!
♦ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి కసరత్తు ♦ మార్కెట్ ఫీజు,లెసైన్సింగ్లో నూతన విధానం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. నూతన విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పిస్తూ.. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. 1966 నాటి వ్యవసాయ మార్కెట్ చట్టానికి సవరణలు చేయనున్నారని సమాచారం. గతంలో వ్యవసాయ మార్కెట్ చట్టం 1966లోని సెక్షన్ 5(1) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల కేటగిరీ నుంచి పాలక మండలిలో ఐదుగురు సభ్యులను నియమించుకునే అధికారం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల్లో కేటగిరీల వారీగా రిజర్వేషన్లకు వీలు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 15న జీవో 87ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో 50 శాతం కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున చైర్మన్ పదవులు కేటాయిస్తూ.. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను.. పీసా (పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా) నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను పూర్తిగా గిరిజనులకు కేటాయించారు. మిగిలిన 168 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గత ఏడాది సెప్టెంబర్ 22న రిజర్వేషన్లు ఖరారు చేశారు. జీఓ 87ను అసెంబ్లీలో ఆమోదించి.. చట్టబద్ధత కల్పించడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చూడటమే ప్రధాన ఉద్దేశమని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో ఆమోదం తర్వాత.. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్, పాలక మండలి సభ్యుల నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ‘నామ్’ అమలుకు వీలుగా సవరణలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) పథకంలో భాగంగా.. రాష్ర్టంలోని 44 వ్యవసాయ మార్కెట్లను జాతీయ వ్యవసాయ మార్కెట్లతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఆన్లైన్ మార్కెటింగ్ విధానంలో వ్యాపారులు.. నామ్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ వ్యవసాయ మార్కెట్ నుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. సెప్టెంబర్ 16 నాటికి ఎంపిక చేసిన 44 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కంప్యూటరీకరించి.. లావాదేవీలు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం మార్కెట్ కమిటీల్లో అమల్లో వున్న లెసైన్సింగ్, మార్కెట్ ఫీజు వసూలు విధానంలోనూ మార్పులు చేస్తే తప్ప ‘నామ్’లో చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నామ్ పథకం అమలుకు వీలుగా 1966 నాటి వ్యవసాయ మార్కెట్ చట్టం నిబంధనల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఖేడ్ మళ్లీ ‘నామినేటెడ్’ పైరవీలు షురూ!
♦ ‘బుగ్గ కారు’ రేసులో ఆరుగురు ఎమ్మెల్యేలు ♦ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గం ♦ సీఎం ప్రకటనతో ఆశావహుల్లో సందడి ♦ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నామినేటెడ్ పోస్టులపై ఆశావహుల్లో సందడి మొదలైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం రంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నారుు. నామినేటెడ్ పోస్టుల్లో ఎంపికలకు సంబంధించి పరిశీలన తరువాయిగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అనుచరులకు పోస్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలోనే కొత్త పాలకవర్గాలను నియమించనున్నారు. గతేడాది సెప్టెంబర్లో విజయదశమి సందర్భంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగినా.. వరంగల్ పార్లమెంట్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, నారాయణ్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగడంలో ఆల స్యం అరుుంది. తాజాగా కేసీఆర్ ప్రకటనతో మళ్లీ పైరవీలు మొదలయ్యూరుు. జిల్లా అధ్యక్షు లు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పదవులను కట్టబెట్టనుం డగా.. ఆయా పదవుల కోసం పోటీ పడుతున్న నాయకుల వివరాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రస్థాయి చైర్మన్ రేసులో ఆరుగురు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ సారి ఖాయమన్న సంకేతాలు బలంగా రావడంతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కాగా 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులతోపాటు, అప్పుడు టికెట్ కోసం ప్రయత్నించి.. అధిష్టానం బుజ్జగింపులతో వైదొలగిన నేతలు ఇప్పుడు రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ కోసం కూడా పోటీపడి రాజీపడిన నాయకులు పోటీ పడుతుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇంతకు ముందున్న ఆర్టీసీ, ఆగ్రోస్లకు తోడు ఈ సారి మిషన్ భగీరథ తదితర పథకాలకు రాష్ర్టస్థాయిలో శాసనసభ్యులను చైర్మన్లుగా నియమించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించిన నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, బాల్కొండ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన, ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేష్ గుప్త, హన్మంత్షింథే, వేముల ప్రశాంత్రెడ్డి, ఏనుగు రవిందర్రెడ్డిలు రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన అయిత చండీయాగం ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేరు మిషన్ భగీరథ(వాటర్గ్రిడ్) చైర్మన్గా ఇప్పటికే ఖరారయ్యిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఎవరికీ తోచిన విధంగా వారు ప్రయత్నాలు చేస్తుండగా.. రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు జిల్లాకు రెండు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రెండిస్తారా? ఒకటిస్తారా? అనే చర్చ పక్కన బెడితే ఈ సారి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ‘బుగ్గకారు’ ఎవరెవరిని వరిస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మాజీ మార్కఫెడ్ డెరైక్టర్ మునిపెల్లి సాయరెడ్డి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అనేక పదవులు చేపట్టిన ఈయన ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డి.శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీస్సులతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్లు, డెరైక్టర్లు, మార్కెట్ కమిటీలు కావేవీ అనర్హం.. మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలు ఆర్టీసీ, ఆగ్రోస్, గ్రంథాలయ తదితర రాష్ర్టస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్, డైరక్టర్ పదవులు.. మార్కెట్ కమిటీ చైర్మన్లు తమకు కావేవీ అనర్హం అంటున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కోసం పలువురు సీనియర్లకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ల నుంచి టికెట్ ఆశించిన డాక్టర్ భూపతిరెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పొలిట్బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బోధన్కు చెందిన గిర్దావర్ గంగారెడ్డి, వేముల సురేందర్రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు. కాగా జిల్లాలో ఇదివరకు 12 ఉన్న మార్కెట్ కమిటీల సంఖ్య 17కు చేరగా.. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, పిట్లం, గాంధారి తదితర వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లుగా, డైరక్టర్ల కోసం ప్రతిపాదనల తయారీలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఇదివరకే ప్రతిపాదించినా... తాజాగా మరోసారి జాబితాను పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏ మార్కెట్ కమిటీకి ఎవరెవరు పోటీ ♦ జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్లు ఉండగా ఆయా ప్రాంతాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల కోసం స్థానిక నేతలు పోటీ పడుతున్నారు. ♦ జిల్లా కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ అ తి పెద్దది దీనికి నిజామాబాద్ అర్బన్లోని టీఆర్ఎస్ సీనియర్, పొలిట్బ్యూరో సభ్యు డు ఎ.ఎస్.పోశెట్టి, మరో కార్యకర్త ఆదె ప్రవీ ణ్ పోటీపడుతుండగా, ప్రస్తుత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కూడా మా ర్కెట్ కమిటీని ఆశిస్తున్నారు. అంతేకాకుం డా ఎంపీ కవిత వియ్యంకుడు రాంకిషన్రా వు పోటీలో ఉండగా ఈ మార్కెట్ కమిటీ రి జర్వేషన్ బీసీకి రావడంతో వీరు తప్పుకున్నారు. మరోవైపు మానిక్భండార్కు చెంది న ఆకుల రజినేష్కు మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కట్టబెట్టే ప్రయత్నం పూర్తి అయినట్లు సమాచారం. ♦ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ రేసులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మిట్టప ల్లి గంగారెడ్డి, యామాద్రి భాస్కర్, మోహన్ ఉన్నారు. మిట్టపల్లి గంగారెడ్డి టీఆర్ఎస్ పా ర్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షునిగా, యా మాద్రి భాస్కర్ ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారాల ఇన్చార్జీగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోహన్ టీఆర్ఎస్ పార్టీ గ్రా మ స్థాయి నాయకునిగా ఉన్నాడు. ఎన్నికల సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం ఆశించి పార్టీలో చేరిన వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రస్తుతం తెరపైన ప్రధానంగా ఈ ముగ్గురు మాత్రమే చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ♦ బోధన్ నియోజకవర్గంలోని మార్కెట్ కమి టీ రేసులో సీఎం కేసీఆర్ వియ్యంకుడు రాంకిషన్రావు, ఎంపీ కవితలకు సన్నిహితుడిగా ఉన్న జి.శ్యాంరావు, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకున్న అబ్దుల్ కరీం, ఎమ్మెల్యే షకీల్ అతి స న్నిహితుడు, బోధన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో డెరైక్టర్ శరత్రెడ్డిలు పోటీ పడుతున్నారు. ♦ బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ పరిధిలో కమ్మర్పల్లి, మో ర్తాడ్, భీమ్గల్ మండలాలు ఉన్నాయి. ఈ కమిటీ చైర్మన్ పదవిని బీసీలకు రిజర్వు చే శారు. కమ్మర్పల్లి మండలానికి చెందిన టీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లుక్క గంగాధర్తోపాటు ఉప్లూర్ సర్పంచ్ భూదేవి భర్త రేగుం ట దేవెందర్, భీమ్గల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్యలు చై ర్మన్ పదవి రేసులో ఉన్నారు. ♦ కామారెడ్డి మార్కెట్ కమిటీ బీసీలకు రిజ ర్వు అయ్యింది. నిట్టు వేణుగోపాల్రావ్, పు న్న రాజేశ్వర్, జి.గోపిగౌడ్ పోటీలో ఉన్నా రు. భిక్కనూరు మార్కెట్ కమిటీ జనరల్ రి జర్వుడ్ అయింది. అందె మహేందర్రెడ్డి, మల్లేశ్ మల్లారెడ్డి, నాగర్తి భూంరెడ్డి, అమృతారెడ్డి పోటీలో ఉన్నారు. ♦ జుక్కల్ నియోజకవర్గంలో మూడు మార్కె ట్ కమిటీలు ఉన్నాయి. ఒకటి బిచ్కుంద, పి ట్లం, కొత్తగా జుక్కల్లో ఏర్పాటు చేశారు. బిచ్కుంద మార్కెట్ కమిటీ రేసులో టీఆర్ఎ స్ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీహరి, పిట్లం మార్కెట్ కమిటీ ఆశిస్తున్న వారిలో టీఆర్ఎ స్ జిల్లా నాయకుడు అన్నారం వెంకటరామ్రెడ్డి, కొత్తగా ఏర్పడిన జుక్కల్ మార్కెట్ క మిటీలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు టీఆర్ఎస్ మండల నాయకుడు సాయగౌడ్ బరి లో ఉన్నారు. వీరు హన్మంత్ సింధే ముఖ్య అనుచరులు. ♦ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ జనరల్కు రిజర్వ్ చేశారు. చైర్మన్ పదవిని ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయపల్లికి చెందిన వెంకట్రెడ్డితోపాటు ఇదే మండలానికి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణగౌడ్, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలానికి చెం దిన పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆశి స్తున్నారు. కానీ, ఎమ్మెల్యే రవీందర్రెడ్డి చైర్మ న్ పదవికి వెంకట్రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. గాంధారి మార్కెట్ కమిటీకి బెజుగం సంతోష్, సీతాయిపల్లి పంచాయతీ పరిధిలోని చెన్నపూర్కు చెందిన శ్రీకాంత్రెడ్డి, గౌరారం పంచాయతీ పరిధి లో గల సర్వాపూర్కు చెందిన సత్యం పోటీ పడుతున్నారు. నూతనంగా సదాశివనగర్ లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సదాశివనగర్లో మార్కెట్ కమిటీ కార్యాల యాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో చైర్మన్ పదవిని తాడ్వాయి మండల వాసులకు కే టాయిస్తున్నట్లు తెలిసింది. వైస్ చైర్మన్ పదవిని సదాశివనగర్ మండలానికి కేటాయిస్తారని సమాచారం. కాగా చైర్మన్ పదవికి తా డ్వాయి మండలానికి చెందిన శ్యాంరావుతోపాటు కృష్ణమూర్తి, సాగర్, గోపాల్రావు రే సులో ఉన్నారు. వీరిలో ఒకరి పేరును ఎమ్మె ల్యే రవీందర్రెడ్డి ఖరారు చేయనున్నారు. ♦ బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ మార్కెట్ కమిటీకి నార్ల సురేష్, బీర్కూర్కు పెర్క శ్రీనివాస్, కోటగిరికి శంకర్పటేల్, వర్నికి నారోజీ గంగారాం పోటీలో ఉన్నారు. -
మార్కెట్ యూర్డు గోదాంకు తాళాలు
లావేరు: ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ గోదాంలో కళాసీ పను ల కోసం టీడీపీ నాయకుల మధ్యనే వివాదం నెలకొంది. బెజ్జిపురం గ్రామస్థులకే గోదాంలో కళాసీ పనులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బె జ్జిపురం టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీలు ఇజ్జాడ శ్రీనివాసరావు, దన్నాన అజాద్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులుతో పాటు గ్రామస్థులు పలువురు వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తోటయ్యదొరపై బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీ యార్డులో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ గోదాంలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు సరఫరా చేయడం కోసం పౌర సరఫరాల బియ్యా న్ని నిల్వ చేస్తున్నారు. అయితే గోదాంకు వచ్చిన బియ్యా న్ని దించడం కోసం కళాసీలుగా లావేరు గ్రామానికి చెందిన వారికి మార్కెట్ కమీటీ చైర్మన్ పనులు అప్పగించారు. అయితే, బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న గోదాంలో కళాసీ పనులను బెజ్జిపురం గ్రామానికి చెంది న వారికే ఇవ్వాలని, లావేరుకు చెందిన కళాసీలకు ఎలా ఇస్తారని నాలుగు రోజుల క్రితమే బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద అభ్యంతరం చెప్పారు. అయినా పట్టించుకోకుండా లావేరుకు చెందిన కళాసీలతోనే గోదాంలో బియ్యం బస్తాలు దించడం చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన బెజ్జిపురం సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ దన్నాన అజార్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులతో పాటు గ్రామస్థులు పలువురు ఆదివారం ఉదయం వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు వచ్చి తాళాలు వేసిన వారు తలుపులకు అడ్డంగా కూర్చోని మధ్యాహ్నం 12 గంటల వర కూ ఉన్నారు. గోదాంలో కళాసీ పనులు బెజ్జిపురం గ్రామస్థులుకే ఇవ్వాలని వారంతా నినాదాలు చేశారు. దీంతో బియ్యం లోడులతో వచ్చిన లారీలు మార్కెట్ యార్డులో బారులు తీరాయి. గోదాంకు తాళాలు వేసి పనులు అడ్డుకున్న వారు చైర్మన్ రావాలని డిమాండ్ చేసినా మధ్యాహ్నం 12 గంటలయినా ఏఎంసీ చైర్మన్ అక్కడకు రాకపోవడంతో సర్పంచ్, ఎంపీటీసీలు వెళ్లిపోయారు. -
మార్కెట్లలో సోలార్ వెలుగులు
చౌటుప్పల్: వ్యవసాయ మార్కెట్ల లో ఇక సోలార్ విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డులో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందు కు మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,024.50 కోట్ల అంచనా వ్యయంతో 330 గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చౌటుప్పల్ యార్డు ఆవరణలో రూ.33 కోట్ల వ్యయంతో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించారు. సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా గోదాముల పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. 9 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో మార్కెట్ వెలుపల, గోదాములలో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. గురువారంరాత్రి సోలార్ లైట్లను ట్రయల్ రన్ చేశారు. విద్యుత్ కాంతుల్లో మార్కెట్యార్డు మిరిమిట్లు గొలుపుతోంది. ఇక నుంచి మార్కెట్కు కరెంటు బిల్లుల భారం తప్పనుంది.