Agriculture Market Committee
-
మార్కెట్ కమిటీలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పోస్టింగులు, బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సమర్థులైన అధికారులను ప్రభుత్వమే గుర్తించి అవసరమైనచోట వారి సేవలు ఉపయోగించుకుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా నిఘా యంత్రాంగం దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలని మంత్రులు,ఎమ్మెల్యేలతో అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని హితవు పలికారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. నిధుల ప్రాథమ్యాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు. -
పొలం నుంచి మార్కెట్కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నేటితో ‘వరంగల్’ పదవీకాలం ముగింపు! తదుపరి మరెవరికీ?
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్ల పదవీ కాలాన్ని నిర్ణయించారు. రిజర్వేషన్ ఇలా.. మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్కు చెందిన మంద వినోద్కుమార్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్గా పని చేశారు. మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్పర్సన్గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్పర్సన్గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు. మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్పర్సన్గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారైనా దక్కేనా? వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు. అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి. -
అద్దెకు మార్కెటింగ్ శాఖ గోడౌన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు. మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మార్కెట్ కమిటీలు కళకళ
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్తో గతేడాది ఆగస్టు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం తిరిగి మొదలయ్యా యి. దీంతో 8 నెలల పాటు ఆర్థిక ఇబ్బందులు పడి న మార్కెట్ కమిటీలు గాడిలో పడ్డాయి. మార్కెటింగ్ శాఖ అదీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 815 మంది రెగ్యులర్, 2,628 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతభత్యాల కింద ఏటా రూ.1. 22 కోట్లు ఖర్చవుతోంది. 2,478 మంది పింఛన్దారులు ఉండగా, వారికి ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ కమిటీలకు ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన నిధులతో మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 శాతం సెస్ వసూలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఆయా ఉత్పత్తుల విలువపై ఒక శాతం మొత్తాన్ని సెస్ రూపంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి. 2019–20లో రికార్డు స్థాయిలో 10,18,235.76 మెట్రిక్ టన్నుల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు మార్కెట్లోకి రాగా.. వాటి క్రయ విక్రయ లావాదేవీలపై మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.551.22 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ కారణంగా గతేడాది ఆగస్టు 20వ తేదీ నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 2019– 20తో పోల్చితే 2020–21లో ఏకంగా రూ.433.52 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ కోల్పోవాల్సి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం సాగడం తో సుప్రీంకోర్టు ఆ చట్టాల అమలుపై స్టే విధించిం ది. దీంతో సెస్ వసూళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 25నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు పునఃప్రారంభం కావడంతో రూ.వంద కోట్లకు పైగా సెస్ వసూలయినట్లు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తెరపడింది దాదాపు 8 నెలల పాటు మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం సెస్ వసూళ్లు ప్రారంభించారు. సీజన్ మొదలవడంతో మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
వ్యవసాయ మార్కెట్లోని సభలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
-
ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి. రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. సబ్సిడీతో ఊరట ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు షాక్ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది. -
మార్కెట్ ఇంటెలిజెన్స్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్తో.. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అగ్రికల్చర్ మిషన్ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం అగ్రిమిషన్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతు భరోసా ద్వారా వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు చెందిన రైతులు రైతు భరోసా కింద లబ్ధి పొందారని తెలిపారు. సుమారు రూ.5,185.35 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్షాపుల ఏర్పాటుపై సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వర్క్షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భూసార పరీక్షలు వర్క్షాపులోనే పెడుతున్నామని ఆయన తెలిపారు. నేచురల్ ఫార్మింగ్పై రైతులకు అవగాహన కల్పించి.. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ల సేవలను బాగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయదలచిన వర్క్షాపుల్లో వారి సేవలను వాడుకోవాలన్నారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్పై సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి జగన్మోహన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేరుశెనగ, మొక్కొజొన్నల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరలేని చిరుధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవడానికి.. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటింస్తుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల ధరల ప్రకటన త్వరలోనే చేయానున్నట్టు తెలిపారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా చూడటానికి అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని తెలిపారు. పంటలకు వణ్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని పాల్గొన్నారు. -
ఆదోని మార్కెట్కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
రైతుకు సెస్ పోటు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది. అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు, వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు. ఆర్ధిక సంవత్సరం వసూలు చేసిన ఫీజు 2014–15 రూ.27.42 కోట్లు 2015–16 రూ.21.07 కోట్లు 2016–17 రూ.21.00 కోట్లు 2017–18 రూ.18.76 కోట్లు 2018–19 రూ.19.71 కోట్లు ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్ ఫీజు మార్కెట్ కమిటీలు వసూలు చేసిన ఫీజు ఒంగోలు రూ.1.62 కోట్లు కందుకూరు రూ.1.42 కోట్లు మార్టూరు రూ.1.32 కోట్లు పర్చూరు రూ.2.30 కోట్లు దర్శి రూ.1.01 కోట్లు అద్దంకి రూ.1.76 కోట్లు చీరాల రూ.2.00 కోట్లు కొండపి రూ.3.24 కోట్లు మద్దిపాడు రూ.1.42 కోట్లు మార్కాపురం రూ.0.68 కోట్లు గిద్దలూరు రూ.0.76 కోట్లు పొదిలి రూ.0.21 కోట్లు ఎర్రగొండపాలెం రూ.0.98 కోట్లు కంభం రూ.0.54 కోట్లు -
ఇదేం చిత్రం సారూ..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు. ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
అక్టోబర్ 1 నాటికే సిద్ధం చేయండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను గతేడాదిలానే కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని, అక్టోబర్ 1 నాటికి వాటిని సిద్ధంగా ఉంచాలని అధికారులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పా రు. పత్తి మద్దతు ధరను కేంద్రం రూ.5,450గా ప్రకటించిన దృష్ట్యా బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదిలానే జిల్లా కలెక్టర్లు ప్రకటిం చిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర రూ.5,450గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మడానికి ఇష్టపడతారని చెప్పారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ లీజు విషయంలో ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి మిల్లుల అభ్యర్థనను లోతుగా పరిశీలించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మార్కెటింగ్ శాఖ తరçఫున ఎంఎస్పీ ఆపరేషన్కు అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి పాల్గొన్నారు. -
వ్యాపారులపై క్రిమినల్ కేసులు
ఖమ్మంవ్యవసాయం : ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా, ‘కమీషన్ వ్యాపారులు’గా, ‘ఖరీదుదారులు’గా చలామణవుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫిర్యాదుతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంతకాలం నుంచి అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మార్కెట్కు వచ్చిన రైతులకు మాయమాటలు చెప్పి, అధిక ధర పెట్టిస్తామంటూ బోల్తా కొట్టిస్తున్నారు. వారి పంటను కమీషన్ వ్యాపారుల ద్వారా ఖరీదుదారులకు చూపిస్తున్నారు. అడ్డగోలుగా కమీషన్లు దండుకుంటున్నారు. పంట విక్రయంలో వాస్తవానికి కమీషన్ వ్యాపారి మాత్రమే కమీషన్ తీసుకోవాలి. వీరు మాత్రం కమీషన్ వ్యాపారుల నుంచి, కొన్నిసార్లు ఖరీదుదారుల నుంచి కూడా (కమీషన్) దండుకుంటున్నారు. సాధారణంగా కమీషన్ రూపాయిన్నర నుంచి రెండ్రూపాయల వరకు ఉంది. వీరు మాత్రం రైతుల నుంచి ఐదారు రూపాయల కమీషన్ గుంజుతున్నారు. పంటను చూసినప్పుడు ఓ ధర నిర్ణయిస్తారు. కాంటాల సమయంలో తిరకాసు పెడతారు. సరుకు బాగా లేదంటారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటారు. తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ఒప్పుకోకపోతే.. తమకు అసలు ఆ సరుకు అవసరమే లేదంటూ మధ్యలోనే వెళ్లిపోయేవారు. మరో వ్యాపారి అటువైపు రాకుండా, ఆ సురుకును చూడకుండా ప్రయత్నించేవారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రైతులు... గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు అడిగిన రేటు/కమీషన్ ఇచ్చేవారు. రైతుల అనైకక్యత, వ్యాపారుల ఐక్యత/సిండికేట్ కారణంగా అధికారులు కూడా ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. గత ఏడాది ఈ మార్కెట్కు పర్సన్ ఇన్చార్జిగా అప్పటి జాయింట్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (ప్రస్తుతం, జనగాం కలెక్టర్) బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ అమలయింది. తమ అక్రమాలకు ఇది అడ్డుగా ఉండడంతో కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు. ఆ తరువాత, ఇందులోని లొసుగులను పట్టేసుకున్నారు. వాటి ద్వారా తమ అక్రమాలను కొనసాగించారు. మార్కెట్ ఫీజు చెల్లించని వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. వినయ్కృష్ణారెడ్డి బదిలీతో పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ నియమితులయ్యారు. మార్కెట్లో అక్రమాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కూడా సీరియస్గానే దృష్టి పెట్టింది. మార్కెట్కు దాదాపుగా 15లక్షల రూపాయల ఫీజు చెల్లించని ఇద్దరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిని గుర్తించే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే, లైసెన్సులకు సంబంధించి ఎటువంటి తాడు–బొంగరం లేని ఏడుగురు ‘వ్యాపారులు/ఖరీదుదారులు’ను గుర్తించారు. మార్కెట్ పర్సన్ ఇన్చార్జ్ (కలెక్టర్) లోకేష్కుమార్ ఆదేశాలతో ఆ ఏడుగురిపై ఖమ్మం మూడవ అదనపు మొదటి తరగతి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్కుమార్ తెలిపారు. వీరికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. మార్కెట్లో రైతులను మోసగించే, పంట దొంగలపై నిఘా పెంచినట్టు చెప్పారు. -
వ్యవసాయ మార్కెట్లలో ఈ–సేవలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్లలో ఇక నుంచి ఆన్లైన్ ద్వారా ఈ–సేవలను అందించేందుకు మార్కెటింగ్శాఖ నడుం బిగించింది. మార్కెట్లలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం, వేగం పెంచేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు మార్కెటింగ్శాఖ వర్గాలు తెలిపాయి. ఈ–సేవలకు సంబంధించి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందికి హైదరాబాద్లో శిక్షణ ఇచ్చా రు. వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. యాప్ ద్వారానే లైసెన్స్... వ్యాపారులకు లైసెన్స్లు, ఎగుమతుల పర్మిట్ల జారీ కోసం మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా ‘ఈ–సర్వీసెస్’ పేరుతో మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా రూ. 100 చెల్లిస్తే లైసెన్సు దరఖాస్తు తెరుచుకుంటుంది. దరఖాస్తును నింపి తిరిగి అప్లోడ్ చేసిన తర్వాత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈ దరఖాస్తు సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శి వద్దకు వెళుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్కు పంపుతారు. డైరెక్టర్ ఆమోదంతో మార్కెట్ కార్యదర్శి డిజిటల్ సంతకంతో కూడిన లైసెన్స్ సర్టిఫికేట్ను మంజూరు చేస్తారు. ఇలా ఆన్లైన్లోనే దరఖాస్తు ఆమోదం పొందటంతో సమయం, వ్యయం తగ్గుతుంది. అన్నీ ఆన్లైన్లోనే... కేవలం లైసెన్సులే కాకుండా కమీషన్ ఏజెంట్ లైసెన్సులు, మార్కెట్ ఫీజు వసూళ్లు, ఎగుమతుల పర్మిట్లు, రాస్తామాల్ వసూళ్లన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసే వీలుంటుంది. వ్యాపారి ఖరీదులు ఎంతుంటాయో అంత సరుకుకే ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ లభిస్తుంది. ఈ సేవలు అమలైతే చెక్పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. అలాగే క్యూఆర్ కోడ్తో కూడిన ఎగుమతుల పర్మిట్లు, చెక్పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. దీని వల్ల నకిలీ రశీదులను సృష్టించే అవకాశమే ఉండదు. మార్కెట్లో నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ తక్పట్టీల ద్వారా ఈ–సేవల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ఫీజు లెక్కిస్తారు. ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా ఖరీదులు చేసే వీలుంది. ఏ మార్కెట్లో ఖరీదు చేసినా ఆన్లైన్లో ఎక్కడ ఫీజు చెల్లించినా సదరు వ్యాపారి పేరిట మార్కెట్ ఫీజు ఆయా మార్కెట్ కమిటీలకే వెళుతుంది. మార్కెట్లలో ఈ–సేవలు ప్రారంభమైతే పారదర్శకత పెరుగుతుందని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక పంటల వారీ మార్కెట్ యార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో పచ్చిమిర్చి మార్కెట్ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్లోని గడ్డి అన్నారం మార్కెట్కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డ్ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్లో నిమ్మ మార్కెట్ను 9 ఎకరాల్లో మార్కెటింగ్శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్ ప్లా్లట్ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో పచ్చిమిర్చి మార్కెట్ను నెలకొల్పారు. జగిత్యాలలో మామిడి మార్కెట్కు ఏర్పాట్లు జగిత్యాలలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
చిరుద్యోగులపై వేటు
పులివెందుల : తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చేమాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను పెరికేసి వారి కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారు. పులివెందుల మార్కెట్ మార్డులో పదేళ్ల నుంచి పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ను ఉన్న పళంగా తొలగించారు. వీరందరూ గత పదేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ జీతాలు పొందుతూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ బంధువులను, అనుచరులను నియమించుకునేందుకు మార్కెట్ యార్డు చైర్మన్ పావులు కదిపారు. అందులో భాగంగా సెక్యూరిటీ గార్డులు రైతులతో కుమ్మక్కై మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారని.. అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీకి సక్రమంగా హాజరు కావడంలేదని సాకు చూపి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి 5మందిని తొలగించమని చైర్మన్ లేఖ రాశారు. మరుసటి రోజే వారి స్థానంలో తమ బంధువుల పేర్లు, అనుచరుల పేర్లు పెట్టి వారి స్థానంలో వీరిని నియమించాలని మరో లేఖ ఏజెన్సీకి రాసి వారి స్థానంలో తమ అనుచరులకు పోస్టింగ్లు ఇప్పించాడు. ఇంతకాలం పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. కోర్టును ఆశ్రయించిన బాధితులు తాము ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, కేవలం చైర్మన్ తన అనుచరులకు పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు చేయని తప్పులను సాకుగా చూపి తమను తొలగించారని కంప్యూటర్ ఆపరేటర్ పవన్కుమార్, సెక్యూరిటీ గార్డులు మహేశ్వరరెడ్డి, మహబూబ్ బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆవేదనను విన్న కోర్టు వెంటనే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని కొనసాగించాలని అగ్రికల్చర్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్కు, పులివెందుల మార్కెట్ కమిటీ సెక్రటరీకి, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు బేఖాతర్.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మార్కెట్ కమిటీ చైర్మన్ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు. బాధితులు కోర్టు ఆర్డర్ను తీసుకుని మార్కెట్ కమిటీ సెక్రటరీని కలవగా.. నా చేతుల్లో ఏమీ లేదన్నారు. మీరు ఏదైనా ఉంటే చైర్మన్తో చూసుకోండని సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ను బాధితులు కలవగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హుకుం జారీ చేశారని బాధితులు వాపోతున్నారు. మాజీ ఎంపీని కలిసిన బాధితులు :తమను అన్యాయంగా తొలగించడంపై బాధితులు గురువారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఉన్న ఫళంగా ఐదుగురిని తొలగించడం అన్యాయమన్నారు. వీరిని తొలగించడంతో వారి కుటుంబాల పోషణ కష్టతరమైందన్నారు. తన అనుచరులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు వీరి కుటుంబాలకు అన్యాయం చేయడం తగదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా ఇచ్చారు. సిబ్బంది తొలగింపుతో మాకు సంబంధంలేదు: మార్కెట్ కమిటీ సెక్రటరీ మార్కెట్ యార్డులో సిబ్బంది తొలగింపు విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నంరాజును వివరణ కోరగా వారి ఉద్యోగాల విషయంలో తమకు సంబంధం ఉండదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం పొందడంతో వారి వద్దే ఏదైనా ఉంటే చూసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తమ శాఖ తరపున హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. -
ధర తగ్గించడంపై భగ్గుమన్న రైతు
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట పసుపును పోసి నిప్పంటించారు. మార్కెట్లో ఈ–నామ్ అమలవుతుండగా పుసుపునకు ఆన్లైన్లో టెండర్ల తర్వాత అధికారులు రైతులకు ధర తెలియజేయలేదు. ఆన్లైన్ టెండర్ వేసిన వ్యాపారుల్లో కొందరు కాంటాలు పెట్టుకోవడానికి వెళ్లలేదు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపుకాశారు. ఆ తర్వాత ఓ వ్యాపారి పసుపురాశుల వద్దకు వెళ్లి క్వింటాల్కు రూ.5 వేలు ధర పెడతానంటూ కొంతమంది రైతుల లాట్ నంబర్ చీటీలపై రాశాడు. ఆన్లైన్లో రూ.6 వేలు ధర పడగా రూ.వెయ్యి తగ్గించడంతో ఆగ్రహించారు. దీంతో వారు కొంత పసుపును మార్కెట్ ఎదుట పోసి నిప్పంటించి కాలబెట్టారు. -
మధుర ఫలంపై విష పంజా
నక్కపల్లి(పాయకరావుపేట): మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచే విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ సీఎం నాయడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వేంపాడు, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మామిడి యార్డుల్లో మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిళ్లు సేకరించిన అధికారులు చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్ ఫ్రూట్స్, వీఈఆర్ అండ్ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు. 24 గంటల్లోనేమగ్గించేసి... ఏటా మార్చి నుంచి జూన్ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇలా నిబందనలకు విరుద్దంగా రసాయానాలను స్ప్రేచేసి మామిడి పండ్లను మగ్గిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అ«ధికారులు దాడులు నిర్వహించారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం. రోజూ వంద టన్నులకుపైనే ఎగుమతి నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్గేట్ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. -
మార్క్ ఫెడ్ అధికారుల తీరుపై శిల్పాచక్రపాణి ఆగ్రహం
-
నాకు చావే గతి
కేసముద్రం (మహబూబాబాద్): మార్కెట్లో 10 రోజులుగా పడిగాపులు పడుతున్న ఓ మక్క రైతు ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు రాజ్యానాయక్ తను పండించిన 170 బస్తాల మక్కలను మార్కెట్కు తీసుకొచ్చాడు. 10 రోజులు గడుస్తున్నా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం బలరాం నాయక్, జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం మార్కెట్ను సందర్శించింది. యార్డులో రాశులను పరిశీలిస్తూ రైతు రాజ్యానాయక్ వద్దకు రాగా, అతడు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యాడు. తనకు చావే గతి అంటూ కండువాను మెడకు బిగించుకోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా స్పృహతప్పి మక్కలరాశిపైనే పడిపోయాడు. కంగుతిన్న కాంగ్రెస్ నేతలు, సిబ్బంది అతడి మెడకున్న కండువాను తొలగించి.. నీళ్లు చల్లి లేపారు. ఆ తర్వాత సీఈవో మల్లారెడ్డిని పిలిపించి ప్రశ్నించడంతో, ఆ మక్కలను ఎంపిక చేసి చిట్టీ ఇచ్చాడు. -
రాష్ట్రంలో ప్రచండ గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: పట్టపగలే కారుమబ్బులు.. వందల ఏళ్లనాటి వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేసే ప్రచండ గాలులు.. ఉరుము లేని పిడుగులా కాలం కాని కాలంలో కుండపోత! గురువారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైంది. చాలాచోట్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి నేలరాలింది. గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం, పిడుగుల ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు, నాగర్కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ అతలాకుతలం వర్షానికి వరంగల్ అతలాకుతలమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలుమార్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. 163 జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో కరెంటు వైర్లపై గాలికి కొట్టుకువచ్చిన రేకులు, ఫ్లెక్సీలు పడ్డాయి. దీంతో నిప్పులు చెలరేగాయి. చెట్టు కూలి పడడంతో స్టేషన్లో సిగ్నలింగ్ గది కూలిపోయింది. దీంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో సుమారు ఐదు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో టూరిస్టు బస్సుపై పిడుగు పడటంతో బస్సు అద్దాలు పగిలాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలో రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైతుల కష్టం వర్షార్పణం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, జీసీసీ కేంద్రాలకు తెచ్చారు. కొనుగోలు ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడంతో అన్నిచోట్ల ఆరు బయటే ధాన్యం ఆరబోశారు. చాలినన్ని టార్ఫాలిన్ కవర్లు లేవు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. చాలాచోట్ల వరదలో కొట్టుకుపోయింది. ఏనుమాముల మార్కెట్లో భారీ షెడ్డు కూలిపోవడంతో ఆరబోసిన మక్కలు తడిశాయి. పైకప్పు కూలే సమయంలో రైతులు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్క ఈ మార్కెట్లోనే పది వేల మిర్చి బస్తాలు తడిశాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో మక్కలు, వడ్లు కలిపి సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, మాడ్గుల, షాబాద్ తదితర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల, మోమిన్పేట, దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3,500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో ఆరపోసిన 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల వరి ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లిలో మామిడి రైతులు నష్టపోయారు. నల్లగొండ మార్కెట్లో కాంటా వేసిన ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 55,000 వరి ధాన్యం బస్తాలు తడిశాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో గాలివాన ధాటికి కూలిన షెడ్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్ఫెడ్, వేర్హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
వందల క్వింటాళ్లు వర్షార్పణం
బూర్గంపాడు/ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడ/సంగెం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిశాయి. 100 లారీ ల ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు తేగా.. వర్షం కురిసే సమయంలో రైతులు కొంతమేర పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మిగతా 60 లారీల లోడ్లకు సరిపోయే ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడిన కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 బస్తాల ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని, వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కొత్తగూడ, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, సంగెం మండలాల్లో వర్షం కురిసింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన మక్కలు, పసుపు మార్కెట్లలో తడిసిపోయాయి. -
ఇదేం బంగారు తెలంగాణ ?
సత్తుపల్లి: ‘రైతే రాజు అంటారు.. రైతు లేనిదే ప్రభుత్వం లేదంటారు.. రైతు పంటలను కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.. ఇదెక్కడి బంగారు తెలంగాణ’ అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు రాజుల కాలం తరహాలో మారువేషాలతో తిరిగితే రైతుల బాధలు ఏంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లు ఖర్చు పెట్టి గోదాంలు నిర్మించింది రైతుల కోసం కాదా..? రైతుల పంటలను ఆరుబయట నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.. పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మొక్కజొన్న అమ్మిన తర్వాత కూడా బస్తాలకు కాపలా రైతులే ఉండాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి కాంటా వేయకపోతే రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని.. మంచినీరు, భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రైతులను అవమానించే రీతిలో మట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డు దుస్థితిని మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీఎం, సీఎండీకి ధన్యవాదాలు.. సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పలు ఇళ్లకు బాంబ్ బ్లాస్టింగ్తో పగుళ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చర్యలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సుధాకర్రెడ్డి అన్నారు. సింగరేణి నిధులను బాధిత గ్రామాలలో ఖర్చు చేయాలని, డిస్పెన్సరీ, సీసీరోడ్లు, మంచినీరు ఇవ్వాలని, పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు పెంచాలని కోరారు. ఆయన వెంట కట్ల రంగారావు, రామిశెట్టి సుబ్బారావు ఉన్నారు. కడియం.. నీ బాగోతం బయటపెడతాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. కడియం ఆ మాటలు చెప్పిన బహిరంగ సభలోనే.. అదే మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు చేసిన పనికి సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వెళితే ఖర్చు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో అక్రమాలు, కార్పొరేట్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తానే స్వయంగా వచ్చి అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, మంత్రి కడియం శ్రీహరి బాగోతాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో మూడు శాతం పర్సంటేజీలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ చెప్పినట్లు స్వయంగా మున్సిపల్ చైర్మన్ చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దందా చేస్తోందని, పినపాకలో గోదావరిలోనే రోడ్డు వేశారంటే ఇసుక మాఫియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. -
పదవులు.. అలకలు
జిల్లా టీడీపీలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సీనియర్లకు తగిన గుర్తింపు రావడం లేదని ఆయా వర్గాలు రగిలిపోతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జిల్లాలో మార్కెట్ యార్డు పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఛాన్స్ దక్కకపోవడంతో టీడీపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీడీ చైర్మన్ పదవిని ఆశించగా కేవలం మెంబర్తో సరిపెట్టడం ఆ వర్గాన్ని తీవ్ర అసహనానికి గురి చేసింది. సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వ్యవధిలో జిల్లాలో సీనియర్ తలకు పదవులు ఇవ్వకుండా విస్మరించడంపై వారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. కొందరు తూతూమంత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మరి కొందరు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి పదవులను ఆశించిన అనేక మంది ద్వితీయ శ్రేణి సీనియర్ టీడీపీ నేతలు తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ ముఖ్యనేతల వద్ద ప్రస్తావించి తమ ఆవేదనను వెళ్ళగక్కగా మరికొందరు తమ వర్గీయులతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం జిల్లా టీడీపీలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సీనియర్లను సైతం పక్కన పెడుతున్నారని ఇతర సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఐదు సార్లు లోక్సభకు, ఒక సారి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు టీటీడీ చైర్మన్ పోస్టు కావాలని అడగ్గా.. కేవలం బోర్డు మెంబర్గా నియమించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా ఉన్న మన్నవ సుబ్బారావు పదవీ కాలం ముగిసినప్పటికీ రెండు సార్లు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారే తప్ప.. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వెన్నా సాంబశివారెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకుని కుటుంబ పరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన సాంబశివారెడ్డిని అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం తగదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులను నిలదీస్తున్న వైనం మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవిని నిలదీసిన విషయం తెలిసిందే. అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని నియమించి కోడెల తనయుడు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటూ ఆ పార్టీ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డితోపాటు పలువురు అసమ్మతి నేతలు నిరాహార దీక్షకు దిగారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై పార్టీలో అసమ్మతి పెరిగిపోతుందనే సంకేతాలు వస్తుండటంతో ఆ పార్టీ ముఖ్యనేతల గుండెల్లో కలవరం మొదలైంది. -
టీడీపీ నేతల హల్చల్
విజయవాడ : గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతించకున్నా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై రామవరప్పాడు రింగ్ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో నగరంలోని బెంజి సర్కిల్, ఐదో నంబర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహన చోదకులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేకున్నా ప్రజలకు ఇబ్బంది కల్గించే విధంగా టీడీపీ కార్యకర్తలు ఎన్హెచ్పై నానా హంగామా చేశారు. బైక్లకు సైలైన్సర్లు ఊడపీకి ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపై స్వైర విహారం చేశారు. ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు మీదుగా సాగిన ర్యాలీలో యువకులు బైక్లపై భీతావహం సృష్టించారు. రోడ్లపై వెళ్లే ఇతర వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా పోలీసు ఉన్నతాధికారులు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. కలకలం రేపిన పోస్టర్లు.. గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) కబ్జాలు చేశారని కరపత్రాలు ముద్రించి గోడలకు అంటించారు. ఆయన ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం సాయంత్రం తరలి వెళుతుండగా ఉదయం పూట ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడులో కరపత్రాలు గోడలకు అంటించి ఉన్నాయి. కరపత్రాలు, పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కబ్జాకోరుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇవ్వటం దురదృష్టకరమని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కరపత్రాలపై కోట్లుపై నమోదైన క్రిమినల్ కేసులు క్రైమ్ నంబర్లతో సహా ప్రచురించి అవి విచారణలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై 6 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నట్లు అందులో వివరించారు. ♦ విజయవాడ 8వ నెంబర్ కోర్టులో కోట్లుపై క్రిమినల్ కేసు రివిజన్ పిటీషన్ నెం.85/2015లో విచారణ ఎదుర్కొంటున్నారు. ♦ రామవరప్పాడులో పాపయ్య డొంక రోడ్డులో సర్వే నెంబర్93/1, 93/సిలోని 1.56 ఎకరాల స్థలం తన అనుచరులతో దౌర్జన్యంగా కబ్జా చేసినట్లు ఆరోపించారు. ♦ కోట్లు అనుచరులు నున్న, సూరంపల్లి, ఆగిరపల్లి, మర్లపాలెం, ప్రసాదంపాడులో కబ్జాలకు పాల్పడినట్లు ఆ కరపత్రంలో పేర్కొన్నారు. -
కందుల కొనుగోళ్లతో వెయ్యి కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. బుధ వారం శాసన మండలి ఆవరణలో ఆయన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. కందుల సేకరణలో కేంద్ర వైఖరి తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టకరమని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాసినా.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. రూ.410 కోట్ల విలువ చేసే 75,300 టన్నుల కంది సేకరణకే కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.5,450 చొప్పున 1.84 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడిందని చెప్పారు. రైతులకు నాఫెడ్ నుంచి రూ.183.86 కోట్లు, మార్క్ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ.52.46 కోట్లు రావాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనగ కొనుగోళ్లు ముమ్మరం.. శనగ కొనుగోళ్లు, చెల్లింపులపైనా హరీశ్రావు సమీక్షించారు. 50 వేల టన్నుల శనగ సేకరణకు కేంద్రం అనుమతించిందని.. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల టన్నుల శనగలను నాఫెడ్ కొనుగోలు చేసిం దన్నారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డు లేక రైతుల విలవిల
ఆళ్లపల్లి : ప్రవేట్ దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో పండించిన పంటలకు మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తుందనుకుంటే అతి తక్కువ రోజులు మార్కెట్ యార్డులను కేటాయించి, రైతులకు సమాచారం అందే లోపే మార్కెట్ యార్డులను మూసివేయడం ద్వారా మండలానికి సంబంధించిన కందులను పండించిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఎంతో కష్టంతో ఆరుగాలం పండించిన పంట అటు మార్కెట్ యార్డులు మూసివేయడంతో ఇంట్లో నిల్వ ఉన్న కందులను ప్రవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట అతి తక్కువ ధరలకు దళారులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని,ఎలాగైనా ప్రభుత్వం మార్కెట్ యార్డులను తెరిపించి మమ్ములను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. –గొగ్గెల రమేష్,మైళారం మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలి మాకు సమాచారం అందేలోపే ప్రభుత్వం కేటాయించిన గడువు పూర్తి కావడంతో చాలా మనోవేధనకు గురయ్యానని,ఎలాగైనా మార్కెట్ యార్డులను పునఃప్రారంబించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. –గొగ్గెల సత్యనారాయణ,మైళారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..మండల వ్యవసాయాధికారి ఆర్.శంకర్ రైతుల సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్ యార్డును పునః ప్రారంభించాలాఆ కృషి చేస్తానని అన్నారు.పై అధికారుల నుంచిఆడర్ లేకుండా నేనేమీ చేయలేనని ఆయన అన్నారు. -
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డ్రైవర్ ఆత్మహత్య
గద్వాల క్రైం: పురుగు మందు తాగి ఓ కారు డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చోటుచేసుకుంది. గద్వాల సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం కొండూరుకు చెందిన చుక్క రామన్గౌడ్ కుమారుడు కుర్మయ్యగౌడ్(26) గత నాలుగేళ్ల నుంచి గద్వాలలోని పత్తి మిల్లు యజమాని చంద్రశేఖర్రెడ్డి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల చంద్రశేఖర్రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కావడంతో ఆమె కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలోని ఓ గదిలో పురుగు మందు తాగాడు. అనంతరం గదిలో నుంచి బయటికి వస్తున్న క్రమంలో కార్యాలయం ముందు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆరా తీయగా పురుగుమందు తాగినట్లు వివరించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తె లుసుకున్న చంద్రశేఖర్రెడ్డి, చైర్మన్ లక్ష్మీదేవ మ్మ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ యన ఆత్మహత్యకు గల కారణాలు తెలి యాల్సి ఉంది.ఈ ఘటనపై కుర్మయ్యగౌడ్ తండ్రి రామన్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గద్వాలలో కలకలం.. మార్కెట్ చైర్మన్ డ్రైవర్ కుర్మయ్యగౌడ్ మార్కెట్ కార్యాలయంలో పురుగు మందు తాగి మృతి చెందడంతో గద్వాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు మార్కెట్ కమీషన్దారులు, కూలీలు, సిబ్బంది కలత చెందారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
హిందూపురం వ్యవసాయ మార్కెట్యార్డ్లో రైతు మృతి
-
కందుల కొనుగోలు కేంద్రాలు మూత
భువనగిరి/ఆలేరు : జిల్లాలో హాకా సంస్థ ఆ« ద్వర్యంలో ఏర్పాటు చేసి న రెండు కందుల కొనుగోలు కేంద్రాలను శని వారం నుంచి మూసివేయనున్నారు. ఇప్పటికే అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు కేంద్రాలు మూసివేత జిల్లాలో కందులను కొనుగోలు చేసేందుకు హాకా సంస్థ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆలేరులో జనవరి 17, భువనగిరిలో 18వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆలేరులో ఇప్పటి వరకు 2,106మంది రైతుల నుంచి 19,844క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయగా భువనగిరిలో 2,557రైతుల నుంచి 20,927క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు భువనగిరిలో 374మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,110క్వింటాళ్లకుగాను రూ.1.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇంకా రూ.10కోట్లు రావాల్సి ఉంది. ఆలేరులో 400మంది రైతులకు సంబంధించిన 1,411క్వింటాళ్లకుగాను జనవరి 30నాటికి రూ.85లక్షలను రైతుల ఖాతాల్లో వేశారు. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం జిల్లా మార్కెట్ శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నాం. రైతులు ఈవిషయాన్ని గమనించి రైతులు గమనించి సహకరించాలని కోరుతున్నాం.– వేణుగోపాల్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి,భువనగరి -
రైతన్న కన్నెర్ర
హుస్నాబాద్ : కందుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కారు. గంటల తరబడి ధర్నా చేశారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై దాస సుధాకర్ రైతుల సమస్యను తెలుసుకొని, అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభింప చేస్తామని హామీనిచ్చినా రైతులు ససేమేరా అన్నారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో రైతులు తిరిగి మార్కెట్ యార్డు ఎదుట ధర్నాకు దిగారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులకు రెవెన్యూ, పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన తీవ్రం కావడంతో తహసీల్దార్ విజయసాగర్, ఎస్సై సుధాకర్ మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడి కొనుగోళ్ల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు ఆందో«ళన విరమించారు. అంతకుముందు రైతులు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి కంది గింజను కొంటామని చెప్పిన అధికారులు అర్ధంతరంగా కొనుగోళ్లు బంద్ చేయడమేమిటని నిలదీశారు. ఆదివారం దళారుల నుంచి క్వింటాళ్ల కొద్దీ కందులను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5,450 ఉంటే, కొనుగోళ్లు బంద్ చేశారని, బయట అమ్మడానికి వెళ్తే వ్యా పారులు క్వింటాలుకు రూ.3,000 ఇస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. రైతుల ధర్నాకు అఖిల పక్షనాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కవ్వ వేణుగోపాల్రెడ్డి, అయిలేని శంకర్రెడ్డి, ఆకుల వెం కట్, హన్మి రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వాల నవీన్, రైతు ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మార్కెట్లో రైతును బలిగొన్న డీసీఎం
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు పత్తిని తీసుకొచ్చిన రైతును డీసీఎం వ్యాను బలిగొంది. యార్డు ఆవరణలో ఆరబెట్టుకుని నిద్రిస్తుండగా బుధవారంరాత్రి మిర్చి లోడుతో ఉన్న డీసీఎం వాహనం అతడి కాళ్లపై నుంచి వెళ్లింది. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం దేవునిగుట్ట తండాకు చెందిన బానోతు రవి(40), తండ్రి మంజ్య, ఇద్దరు సోదరులతో కలసి 150 బస్తాల పత్తిని బుధవారం ఉదయం పవన్ ట్రేడర్స్ అడ్తికి అమ్మకానికి తీసుకొచ్చారు. పత్తిలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో పత్తిని ఆరబెట్టిన రవి, తండ్రి, సోదరులతో కలసి అక్కడే నిద్రపోయాడు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి మార్కెట్కు మిర్చిలోడుతో వచ్చిన డీసీఎం రవి కాళ్లపై నుంచి వాహనం వెళ్లింది. దీంతో రవి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు, అధికారులు, సెక్యూరిటీ గార్డులు బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గురువారం ఉద యం రవి మృతి చెందాడు. రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మార్కెట్కు వచ్చి నిరసన తెలిపారు. రైతు మృతికి కారకులైన మార్కెట్ పాలక వర్గం, మంత్రి హరీశ్రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దయాకర్రావు ఎంజీఎంకు వచ్చి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా, సొం తంగా రూ.30 వేలు అందజేశారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
నకిలీ రైతులపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ‘నకిలీ రైతుల’ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అర్హులే లబ్ధిపొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ కార్యకలాపాలు, కందులు, శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాల అమలుతీరుపై మంత్రి హరీశ్రావు గురువారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కందుల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన సొసైటీల కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్ కమిటీతో వెంటనే అనుసంధానించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో ధ్రువీకరణపత్రం పొందిన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలపై నిఘా పెట్టి పారదర్శకతతో గుర్తింపు ఇచ్చేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి.. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురాకముందే నాణ్యతాప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్ సూచించారు. కందుల కొనుగోళ్లపై కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీల్లో జరిగే క్రయవిక్రయాలపై నిఘా పెట్టాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ పరిమాణంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. ఎంత విస్తీర్ణంలో సాగుచేశారో తనిఖీ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి రైతులు ధ్రువీకరణపత్రం పొందాలని కోరారు. కొనుగోలు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు మద్ధతుధర కల్పించే విషయంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని, రైతుల పేరుతో ప్రభుత్వానికి నష్టం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. -
పాత కమిటీలకే మళ్లీ పట్టం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల కొత్త చట్టం ఏడాదికే అభాసు పాలైంది. పాత చట్టానికి చేసిన సవరణల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తే సింది. మూడేళ్లపాటు ఉన్న కమిటీల పదవీకాలాన్ని తెలంగాణ నూతన మార్కెటింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం ఏడాదికి కుదించింది. ఏడాది పూర్తయిన మార్కెట్ కమిటీ పాలక వర్గాలకు 6 నెలలపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ జీవోలు జారీ చేస్తోంది. దీంతో కొత్త చట్టానికి ఏడాది లోనే తూట్లు పడ్డట్లయింది. తొలుత ఏడాదికి కుదింపు: రాష్ట్రంలో మొత్తం 180 మార్కెట్ కమిటీలున్నాయి. కొత్త మార్కెట్ కమిటీల చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి పలు దఫాలుగా 160 మార్కెట్లకు పాలక వర్గాలను నియమించింది. తొలి సారిగా లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేయటం, మహిళలకు 33 శాతం పదవులు రిజర్వు చేయటంతో మార్కెట్ కమిటీల నియామకాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. మూడేళ్లున్న పాలకవర్గం పదవీకాలాన్ని కొత్త చట్టంలో ఏడాదికి కుదించటం, ఏడాదికోసారి రిజర్వేషన్ను రొటేషన్ చేసేలా చట్టం ఉండ టంతో అన్ని సామాజిక వర్గాలను ఆకట్టు కుంది. ఈ అంశాలనే ప్రభుత్వం విస్మరించటంతో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో గందరగోళం నెలకొంది. జూలైలోనే ముగిసిన పదవీకాలం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించిన 160 మార్కెట్ కమిటీల్లో దాదాపు వందకుపైగా కమిటీల పదవీ కాలం గత జూలైలో ముగిసిపో యింది. ఆ వెంటనే సంబంధిత మార్కెట్ల కు కొత్త పాలకవర్గాలను నియమించాలి. రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లను మార్చి ఇతర సామాజిక వర్గాలకు కమిటీ పదవులు దక్కేలా అమలు చేయాలి. ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. పదవీకాలం ముగిసిన మార్కెట్ పాలక వర్గాలకు గడువు పొడిగించే పాత ఎత్తుగడను అను సరించింది. వంద కమిటీలకు 6 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో పదవీ కాలం ముగిసిన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమనే మళ్లీ కొనసాగిం చాలని, పదవీ కాలాన్ని పొడిగించాలని ఒత్తిళ్లు తెస్తున్నా రు. ఇప్పటికే పొడిగింపు వెసులుబాటు పొందిన కమిటీలు మళ్లీ పొడిగింపునకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల రొటేషన్తో తమకూ అవకాశం వస్తుందని ఏడాదిగా ఎదురుచూసిన ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. -
లక్షన్నర టన్నుల కందిని కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి మం గళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర వ్యవ సాయశాఖ కార్యదర్శిని కలసి లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కోరతారు. రాష్ట్రంలో కేవలం 53,600 మెట్రిక్ టన్నుల కందిని మాత్రమే కొనుగో లు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించిం ది. కంది ఉత్పత్తి గణనీయంగా ఉన్నందు న పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో కేవలం 33,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతుధరకు కొనుగో లు చేస్తానని ప్రకటించింది. ఒత్తిడి పెంచ డంతో ఇటీవల మరో 20 వేల టన్నులు కొనుగోలు చేస్తామని అంగీకరించింది. ఇలాగైతే, రైతులు కంది పంటను వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల చెల్లిం పుల్లో ఆలస్యంపై మార్కెటింగ్ మంత్రి హరీశ్రావు అధికారులపై మండిపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము పెండింగ్లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.145 కోట్లు కందుల రైతులకు, రూ.21 కోట్లు మొక్కజొన్న రైతులకు చెల్లించాలని.. వీటిని వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై తాను జిల్లాలు పర్యటించినపుడు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను సందర్శిస్తానని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాత రైతులకు చెల్లింపులో జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానన్నారు. మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో కంది దిగుబడి 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రానుందని అంచనా వేశామన్నారు. 33 వేల మెట్రిక్ టన్నులు కొనేందుకే కేంద్రం సుముఖత చూపిందన్నారు. ఇప్పటివరకు 26,200 మెట్రిక్ టన్నుల కందులు మార్కెట్కు వచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో పెండింగులో ఉన్న చెల్లింపులను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గడ్డిఅన్నారం మార్కెట్ను కోహెడకు తరలించనున్నందున.. అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఏర్పాటుకోసం 3 ప్రైవేటు సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు. 15 రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించాలని ఆయా సంస్థలను కోరారు. ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్రావు లేఖ రాజోలిబండ ఆధునీకరణ పనులపై చర్చి ద్దామని, అందుకు సమయమివ్వాలని ఏపీ జల వనరుల మంత్రి దేవినేని ఉమామహే శ్వర్రావుకు మంత్రి హరీశ్ లేఖ రాశారు. ఈ నెల 14న రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఆధునీకరణ పనులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసేందుకు కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్ ఒప్పుకున్నారని, ఈ అంశంలో ఏపీ సహకారం కీలకం అయినందున మూడు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ‘కాకతీయ’ నాలుగో దశ ప్రారంభానికి ఫిబ్రవరి 3 డెడ్లైన్ మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను ఫిబ్రవరి 3 లోగా ప్రారంభించాలని హరీశ్రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈసారి మిషన్ కాకతీయలో ఫీడర్ చానల్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కాకతీయ 4వ దశ పనులపై మంగళవారం సచివాలయం నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలాఖరులోగా పనుల గ్రౌండింగ్ జరగాలని, ఏ రోజుకారోజు పనుల ఫొటోలను వాట్సాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. -
ప్రతి అడుగూ.. రైతు సంక్షేమానికే
దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలం గా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్య మైన ఉచిత విద్యుత్తో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ ట న్నుల గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రెండు నా ల్కల ధోరణిని మానుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చందంపేటలో ఓపెన్ జైల్కు సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిండి ఎత్తిపోతలకు రూ.6,500 కోట్లు : ఎంపీ డిండి ఎత్తిపోతల పనులకు రూ. 6,500 కోట్లు కేటా యించి ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు ఎంపీ గు త్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో దేవరకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ముంపుబాధితులకు సహకారం అందించాలి : జెడ్పీ చైర్మన్ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సహకారం అందించాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని బెండల్రావు చెరువుకు మంజూరి ఇచ్చి తద్వారా సాగు, తాగునీరు అందించేందుకు సహకరించాలని ఆయన మంత్రి హరీశ్రావును కోరారు. సాగునీటికి ప్రణాళికలు : ఎమ్మెల్యే డిండి రిజర్వాయర్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్లో సాగు నీరందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపా రు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ యా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, ఆర్డీఓ లింగ్యానాయక్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీటీసీలు శేరిపల్లి కైలాసం, వస్కుల తిరుపతమ్మ, మూఢావత్ ప్రమీల, సర్పంచ్ అందుగుల ముత్యాలు, తహసీల్దార్ కిరణ్మయి, వైస్ ఎంపీపీప వేణుధర్రెడ్డి, హరినాయక్, నట్వ గిరిధర్, జాన్యాదవ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి చందంపేట (దేవరకొండ) : నిర్దేశించిన గడువులోగా నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని మంత్రి తన్నీరు హరిశ్రావు అన్నారు. గురువారం చందంపేట మంలంలోని తెల్దేవర్పల్లిలో చేపడుతున్న నక్కలగండి బండ్ నిర్మాణ పనులను ఇతర మంత్రులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహించొద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 7.50టీఎంసీలు కాగా మొదటి ఏడాది వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సెల్బీసి టన్నెల్–1లో 43 కి.మీ. సొ రంగ మార్గంలో 30 కి.మీ ఇప్పటికేటి పూర్తయ్యింది. మరో 13 కి.మీ. పనులను వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఏజెన్సిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. టన్నెల్–2ను సొరంగ మార్గ పనులు వంద శాతం పూర్తి కా గా 50 శాతం లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డిండిబ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. -
ఉప్పల్ మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మార్కెట్ యార్డులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్కెట్ లోని పలు దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. వ్యాపారులు అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దుకాణాలను తగలబెట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో తరుచు దొంగతనాలు, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని.. రక్షణ కల్పించాలన్నారు. మార్కెట్ యార్డును స్దానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిశీలించారు. -
ధర కోసం పత్తి రైతుల ఆందోళన
ఆదిలాబాద్: పత్తికి ఓ వ్యాపారి పెట్టిన ధరను మిగిలినవారు సైతం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర పెరుగడంతో ఆది లాబాద్ మార్కెట్యార్డ్కు పెద్దఎత్తున రైతులు పత్తి తీసుకొచ్చారు. ఉదయం నిర్వహించిన వేలంపాటల్లో ఓ వ్యాపారి క్వింటా పత్తికి రూ. 4,800 ధర పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో రైతులు తమ పత్తికి అంతే ధర పెట్టాలని కోరగా మిగిలిన వ్యాపారులు అంగీకరించలేదు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తి కొనుగోళ్లు జరగలేదు. నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులకు నచ్చజెప్పడంతో చివరకు రూ.4,800కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు బుధవారం 10 వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అన్నెల అడెల్లు తెలిపారు. -
మిర్చి ధరపై అనిశ్చితి
సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మిర్చి ధర మార్కెట్లో రూ. 12 వేలు పలికింది. ఈ ఏడాది జనవరి 10న రూ. 11,500, ఫిబ్రవరి 6న రూ. 9,100కు చేరింది. ఇలా ఏప్రిల్ 27 నాటికి క్వింటాల్ మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయింది. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతన్నలు అక్కడి వ్యవసాయ మార్కెట్పై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్వింటాల్ మిర్చి ధర రూ. 4,700 – రూ. 9,600 ఉందంటే రానురాను పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వ్యవసాయ మార్కెటింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మార్కెట్లకు మిర్చి పెద్ద ఎత్తున తరలివస్తే, ధరలు మరింత పడిపోవచ్చనే భావన అధికారులను వెంటాడుతోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపారుల వద్ద నగదు లేక కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఈ ఖరీఫ్లో 1.71 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో అధికంగా సాగు చేశారు. దీంతో ఈ సారి 87,220 మెట్రిక్ ట న్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాణిజ్య పంట కావడంతో మిర్చికి ఎటువంటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని, ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. నిల్వకు అవకాశం లేక... మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలాంటి సమయంలో రైతులు మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక, ఉన్న కొన్ని స్టోరేజీలు వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్శాఖ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
11 నుంచి కంది కొనుగోలు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అవసరమైనచోట ఈ నెల 11వ తేదీ నుంచి కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి తెలిపారు. ‘కందుల ధర ఢమాల్’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పార్థసారథి నేతృత్వంలో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాఫెడ్, మార్క్ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులు హాజర య్యారు. సమావేశం నిర్ణయాలను పార్థ సారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కెట్లో కంది కనీస మద్ధతు ధర రూ. 5,450 కన్నా తక్కువగా ఉన్నందున ఈ విషయమై చర్చించామని పేర్కొన్నారు. కందుల ఉత్పత్తి ఈసారి 1.65 మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా వేసినందున అందుకు తగినట్లు 95 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హాకా ఆధ్వర్యంలో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, సూర్యా పేట్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందన్నారు. మిగి లిన 23 జిల్లాలలో మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా నాఫెడ్ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు 12% తేమ మించ కుండా కందులను తీసుకొని వచ్చేవిధంగా ఆయా మార్కెట్ యార్డుల తరపున అవ సరమైన ప్రచారాన్ని, అవగాహనను కల్పిం చాలని సూచించారు. శుభ్రపర్చే యంత్రా లను రైతులకు సరిపడా చేకూర్చాలన్నారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు తగ్గినందున వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని అధికారులు పార్థసారథికి వివరించారు. మినుముల సేకరణ నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఆయనకు వివ రించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: కందికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కంది ధర ఢమాల్’కథనంపై ఆయన స్పందించారు. కందికి మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని ఆదేశించారు. అలాగే ఈ మేరకు సోమవారం అత్యవసరంగా సమావేశమై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని ఓ ప్రకటనలో హరీశ్ వెల్లడించారు. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద కందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. -
ఆదిలాబాద్లో పత్తి రైతుల ఆందోళన
సాక్షి,ఆదిలాబాద్/ఖమ్మం వ్యవసాయం: ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆందో ళన బాట పట్టారు. తేమ పేరిట ధరను అడ్డగోలుగా తగ్గించడంపై బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మార్కెట్యార్డులో బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగినా వ్యాపారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యార్డు నుంచి రోడ్డుపైకి వచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. తేమ విషయంతో మొదలు.. ఆదిలాబాద్ మార్కెట్లో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర కోసం వేలం నిర్వహించారు. 8 శాతం తేమ ఉన్న పత్తి క్వింటాలుకు రూ.4,570 ధర నిర్ణయించారు. యార్డు నుంచి జిన్నింగ్కు వెళ్లిన తర్వాత మళ్లీ తేమ శాతాన్ని చూస్తూ క్వింటాలుకు రూ.3,800 వరకే ఇస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. 8 శాతం నుంచి కాకుండా 12 శాతం నుంచి తేమను పరిగణన లోకి తీసుకోవాలని, ఆపై అదనంగా వచ్చే తేమ శాతానికి ధర కోత విధించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జేసీ కృష్ణారెడ్డి మంత్రి జోగురామన్నతో సమస్యపై వివరించగా, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 25వేల క్వింటాళ్ల వరకు పత్తిని రైతులు వాహనాల్లో తీసుకొచ్చారు. ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఖమ్మం మార్కెట్కు బుధవారం సుమారు 30వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చింది. 24,700 బస్తాల పత్తి విక్రయానికి వచ్చినట్లు రికార్డు అయింది. బాగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసి విక్రయానికి తెచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ క్వింటాల్కు సగటున రూ. 2,500 నుంచి రూ.3 వేలకు మించి ధర పెట్టడం లేదు. -
రెక్కల కష్టం నీటిపాలు..
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో విక్రయించేందుకు తీసు కొచ్చిన 5 వేల బస్తాల మొక్క జొన్నలు బుధవారం వర్షపునీటిలో కొట్టుకు పోయాయి. వనపర్తి మార్కెట్కు కొద్దిరోజులుగా మొక్కజొన్న విక్రయానికి వస్తోంది. ఈ సీజన్లో బుధవారం అత్య ధికంగా విక్రయానికి వచ్చింది. ఉదయం ఎండగా ఉండడంతో రైతులు మొక్క జొన్నను ఆరబెట్టారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి కొనుగోలు చేసేందుకు టెండర్లు దాఖలు చేసే సమయంలో భారీ వర్షం కురిసింది. రైతులు తేరుకునే సమయానికే మొక్కజొన్న కళ్లముందే వర్షపునీటిలో కొట్టుకుపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
మూడు మార్కెట్ల ఆదాయం పతనం
- నాలుగు నెలలైనా 10 శాతం లోపు వసూళ్లు - కమిషనర్ శామ్యూల్ ఆనంద్ సీరియస్ హెచ్చరిక అనంతపురం అగ్రికల్చర్: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మార్కెట్ యార్డుల ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తోంది. అందులోనూ మూడు యార్డుల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు పూర్తయినా నిర్దేశిత లక్ష్యంలో తనకల్లు కేవలం 8.40 శాతం సాధించి చివరి స్థానంలో ఉండగా ఆ తర్వాత 9.45 శాతం సాధనతో ధర్మవరం, 9.60 శాతంతో రాయదుర్గం యార్డులు పూర్తిగా వెనుకబడ్డాయి. 10 శాతం లోపు వసూళ్లు: ఐదు నెలలు పూర్తయినా ఈ యార్డుల్లో 10 శాతం కూడా వసూళ్లు కాకపోవడంతో మిగతా 90 శాతం ఎలా సాధించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం లక్ష్యం రూ.1.17 కోట్లు కాగా కేవలం రూ.11.23 లక్షలు, ధర్మవరంలో రూ.60 లక్షలకు గానూ రూ.5.67 లక్షలు, తనకల్లులో రూ.58 లక్షలకు గానూ కేవలం రూ.4.88 లక్షలు మాత్రమే వసూలు కావడం విశేషం. ఈ మూడింట ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఆ శాఖ కమిషనర్, ఆర్జేడీలు సీరియస్గా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 13 మార్కెట్యార్డుల ద్వారా వివిధ రూపాల్లో మార్కెటింగ్ ఫీజు రూ.14.61 కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నాలుగు నెలల కాలంలో 26.30 శాతంతో రూ.3.84 కోట్లు సాధించారు. వసూళ్లలో 36.22 శాతంతో అనంతపురం యార్డు ప్రథమ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో గుంతకల్లు 35.84 శాతం, హిందూపురం 34.90 శాతం వసూళ్లలో ముందంజలో కొనసాగుతున్నాయి. మిగతా వాటిలో తాడిపత్రి 27.69 శాతం, మడకశిర 24.33 శాతం, కదిరి 23.31 శాతం, గుత్తి 22.76 శాతం, ఉరవకొండ 22.35 శాతం, పెనుకొండ 19.77 శాతం, కళ్యాణదుర్గం 14.77 శాతం వసూళ్లలో వెనుకడ్డాయి. ముందంజలో మూడు మార్కెట్లు, మరో మూడు యార్డులు పూర్తిగా వెనుకబడిపోయాయి. మిగతా ఏడు మార్కెట్యార్డుల ఆదాయం మధ్యస్థంగా ఉన్నాయి. మార్కెట్శాఖ కమిషనరు ఆగ్రహం : వారం రోజుల కిందట జిల్లాకు వచ్చిన ఆశాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్, ఆర్జేడీ సి.సుధాకర్ మార్కెట్ ఫీజు వసూళ్లపై ఆరాతీయగా... వెనుకబడిన యార్డుల సెక్రటరీ, సూపర్వైజర్లపై సీరియస్ అయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గడువులోపు లక్ష్యం సాధించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్షలు, పర్యవేక్షణతో అన్ని మార్కెట్యార్డులు వంద శాతం లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఏడీ బి.హిమశైలను కమిషనర్ ఆదేశించినట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. -
కార్మికుల పీఎఫ్ మాయం!
- కార్మికులకు చేరని రూ.80 లక్షలు - ఓ మార్కెట్ చైర్మన్ నిర్వాకం సాక్షి, పెద్దపల్లి: ఆయనో అధికార పార్టీ నాయకుడు. పైగా జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షుడు. మంథని ప్రాంతంలోని ఓ సోలార్ పవర్ ప్లాంట్లో లేబర్ కాంట్రాక్టర్ కూడా. కార్మికులను మోసం చేసి పీఎఫ్ స్వాహా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మంథనికి సమీపంలోని ఓ సొలార్ ఎక్స్ప్లోజివ్ ప్లాంట్లో పనిచేస్తున్న 132 మంది కాంట్రాక్ట్ కార్మికులకు, సోలార్ ప్లాంట్ యాజమాన్యం సదరు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తోంది. దీనికోసం దాదాపు 12.5 శాతం కమీషన్ ఆయనకు వస్తుంది. ఒక్కో కార్మికుడికి రూ.1017 చొప్పున సదరు కాంట్రాక్టర్ పీఎఫ్ కోసం చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1017 లను జమ చేస్తుంది. ఇటీవల పీఎఫ్ తీసుకుందామని కార్మికులు అధికారులను కలిస్తే జమ కాలేదని తేలింది. సుమారు రూ.80 లక్షల వరకు పీఎఫ్ బకాయిలు కార్మికులకు చెల్లించాలి. కార్మికులు మూడురోజుల క్రితం ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు. గోదావరిఖని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులకు రావా ల్సిన పీఎఫ్ను 9వ తేదీలోగా లెక్కించి ఇస్తానని కాంట్రాక్టర్ ‘ఒప్పంద పత్రం’ రాసిచ్చారు. కానీ, మళ్లీ రాజకీయ ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
వచ్చే సీజన్కల్లా మిర్చి కోల్డ్ స్టోరేజ్లు
► మార్కెట్ యార్డుల్లో ఏర్పాటుకు మంత్రి హరీశ్ ఆదేశం ► ఖరీఫ్ దిగుబడులపై మార్కెట్ కార్యాచరణ ప్రణాళిక ► మార్కెటింగ్ శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాబోయే మిర్చి సీజన్ కల్లా మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులను ఆదేశిం చారు. వచ్చే ఖరీఫ్ పంట దిగుబడులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్రావు మంగ ళవారం ఈ–నామ్, గోదాముల నిర్మాణం, రైతుబజార్లు, కోల్డ్ స్టోరేజ్లు, మన కూర గాయల పథకం వంటి అంశాలపై 4 గంట లకుపైగా సమీక్షించారు. హరీశ్రావు మాట్లా డుతూ ఏయే నెలల్లో పంటలు తగ్గి ఇరుగు పొరుగు రాష్ట్రాల దిగుమతులపై ఆధారపడి ధరలు పెరుగుతున్నాయో సమగ్ర అధ్యయ నం చేయాలని అధికారులను ఆదేశించారు. దిగుమతుల వల్ల ధరలు పెరిగి వినియోగదా రులకు ఇబ్బందులు వస్తున్నందున నిరంతర సమీక్ష అవసరమన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్ల దిగుమతిపై ఆధారపడకుండా పకడ్బం దీగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కోరారు. ఈ మేరకు త్వరలో జిల్లా ఉద్యాన, మార్కెటింగ్, రైతు బజార్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్పేట దగ్గరున్న వెనికతల గ్రామాన్ని సందర్శించి ఉల్లిగడ్డలు పండించే విధానం, వాటిని నిల్వ చేస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని కోరారు. మార్కెటింగ్ అధికారులు సృజనాత్మక విధానాలు ప్రవేశపెట్టే దిశగా ప్రయ త్నాలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లుగా 18.55 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 355 గోడౌన్లు నిర్మిస్తున్నామని, వీటిల్లో 300 గోదాముల నిర్మాణం పూర్తయిందని చెప్పా రు. ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉండాల న్నారు. హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
కట్టుదిట్టంగా కాంట్రాక్టు వ్యవసాయం
- కనీస మద్దతు ధరకు మించి కొనాలన్నది ప్రధాన షరతు - ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు, చేర్పులు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు వ్యవసాయవిధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మార్కెటింగ్శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్శాఖ కార్యదర్శి సి.పార్థసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం... వ్యవసాయ ఆధారిత కంపెనీలు రైతు వద్దకు వెళ్లి తమకు అవసరమైన పంటలను పండించాలి. ఆయా పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు తామే కొనుగోలు చేస్తానని రైతుతో చేసుకునే ఒప్పందమే కాంట్రాక్టు వ్యవసాయం. తాజా ఉత్తర్వుల్లో కనీస మద్దతు ధరకు మించి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కంపెనీలు కొనుగోలు చేయాలి. రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనాలి. పంట కొనుగోలు చేసిన మరుసటి రోజే రైతు ఖాతాలో సొమ్ము జమ చేయాలి. అందుకోసం సీజన్కు ముందే రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకోవాలి. నాణ్యత లేదంటూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిరాకరించకూడదు. వాటి నాణ్యతను ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ఆయా కంపెనీలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. అందుకోసం సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. మొత్తం కాంట్రాక్టు వ్యవసాయం చేయిస్తున్న వాటి విలువలో 20 శాతం చెల్లించాలి. ఒక పంట సీజన్కే రైతులతో ఒప్పందం చేసుకోవాలి. గోదాములు, కోల్డ్స్టోరేజీలను మార్కెట్లుగా మార్చుకునే సదుపాయం వ్యవసాయ మార్కెట్ నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చేసింది. ప్రస్తుతం 180 వ్యవసాయ మార్కెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మార్కెట్లు వేలల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, కోల్డ్స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు జరిగే చోట్లన్నీ కూడా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే మార్కెట్లుగా మారనున్నాయి. అవన్నీ కూడా ఈ–నామ్తో అనుసంధానం కానున్నాయి. ప్రైవేటు మార్కెట్ల నిబంధనలు సరళతరం: గతంలో ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 10 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రైవేటు మార్కెట్ ఏర్పాటైంది. ఇక ప్రైవేటు మార్కెట్ ఏర్పాటు చేయాలంటే రూ. 3 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపారస్థులు పంట ఉత్పత్తులను రవాణా చేయాలంటే ప్రతీ మార్కెట్ కమిటీ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లోనే రవాణా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తులు ఇప్పటివరకు ఒక్కో మార్కెట్ యార్డుల్లో ఒక్కో లైసెన్సు కలిగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యాపారస్తులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకటే లైసెన్సు జారీచేస్తారు. ప్రస్తుతం వ్యాపారస్తులకు, ఏజెంట్లకు ప్రతీ ఒక్కరికీ ఒకటే లైసెన్సు, ఒకటే ఫీజు ఉండేది. దాన్ని మార్చేశారు. వేర్వేరు లైసెన్సులు, వేర్వేరు ఫీజులుంటాయి. -
పసుపు దళారులకు కాసుల పంట
► నేతల ఒత్తిళ్లతో నాసిరకం కొనుగోళ్లు ► ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం ఉదయగిరి ప్రాంతంలో రైతులు సాగుచేసిన పసుపును గతేడాది వరకు వైఎస్సార్, గుంటూరు జిల్లా దుగ్గిరాల ప్రాంతాల్లో కష్టపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో రైతుల కష్టాలను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదయగిరిలో ఈ ఏడాది పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి బయట జిల్లాల్లో తక్కువ ధరకు నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో అమ్ముకొని రూ.లక్షల్లో లాభాలు గడించారు. మార్క్ఫెడ్ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నేతలకు బాసటగా నిలిచారు. ఉదయగిరి : ఉదయగిరిలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో నాణ్యతలేని సరుకును మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వచ్చింది. జూన్ 30వ తేదీలోపు సుమారు రూ.195 కోట్ల విలువ కలిగిన 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో రూ.50 కోట్లు పైగా నాసిరకం, పుచ్చిన, తడిసిన, ఎందుకూ పనికిరాని సరుకును ఈ కేంద్రంలో దళారులు నుంచి కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జూన్ 5వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎ–గ్రేడ్ రకానికి రూ.6,500, బి–గ్రేడ్కు రూ.6 వేలు వంతున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ కేంద్రం పరిధిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగుచేసినట్లుగా వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేంద్రానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు కూడా తాము పండించిన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ కేంద్రం పరిధిలో 700 టన్నులు పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులు మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు కడప, దుగ్గిరాల ప్రాంతాల్లో నాసిరకం సరుకు కొనుగోలు చేసి ఈ కేంద్రంలో విక్రయించి 20 టన్నుల లారీల సరుకుకు సుమారు రూ.3 లక్షల మేర లాభాలు గడించారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి కడప, దుగ్గిరాల ప్రాంతాలలోని ట్రేడర్ల వద్దనున్న నాసిరకమైన సరుకును తక్కువ ధరకు కొనుగోలుచేసి ఈ కేంద్రంలో విక్రయించి కాసుల పంట పండించారు. జూన్ 10 నుంచి 30వ తేదీ వరకు సుమారు రెండు వేల టన్నుల సరుకును దళారులు ఈ కేంద్రంలో విక్రయించినట్లు సమాచారం. జూన్ 30వ తేదీ నాటికి ఈ కేంద్రం నుంచి 3,200 టన్నుల సరుకును కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కువ భాగం దళారుల ద్వారా కొనుగోలు చేసిందే. నాసిరకం సరుకు కొనుగోలుకు ఒత్తిళ్లు పసుపు కొనుగోలు కేంద్రాన్ని జూన్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తున్నట్లు మార్క్ఫెడ్ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. అయినా ఆ రోజు సాయంత్రం వరకు రాజకీయ నాయకులకు చెందిన సుమారు పది లారీల నాసిరకం సరుకు కొనుగోలు కేంద్రం ఆవరణలో ఉంది. దీనిని కొనుగోలు చేయాలని ఆ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు వాటిని కొనుగోలు చేయకపోవడంతో లారీలు అక్కడే ఉన్నాయి. ఈ సరుకు కడప ప్రాంతంలో ట్రేడర్ల వద్ద ఉన్న అత్యంత నాసిరకమైన సరుకు. దీనిని కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ సిబ్బందిపై ఈ సరుకుకు సంబంధించిన రాజకీయనేతలు తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేరు చెప్పి అధికారులను బెదిరించి ఈ సరుకును విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే గోదాములో నిల్వ ఉన్న సరుకులో సింహభాగం నాసిరకమైన సరుకని అందులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది స్వయంగా చెబుతున్నారు. ఏది ఏమైనా రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రం దళారుల అవతారమెత్తిన రాజకీయ నేతలకు కాసుల పంట కురిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పలుకుబడిని ఉపయోగించుకొని లబ్ధిపొందారని విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలుచేసి నాణ్యతను పరిశీలిస్తే అసలు గుట్టు రట్టవుతుందనడంలో సందేహం లేదు. -
వడ దెబ్బతో హమాలి మృతి
ఆదోని టౌన్: పట్టణంలోని బావూజీ పేటలో నివాసముంటున్న హమాలి బుడ్డ వీరప్ప (46) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వీరప్ప మార్కెట్ యార్డులో హమాలిగా పని చేసే ఇతను మార్కెట్ యార్డుకు అన్ సీజన్ కావడంతో కట్టెల తెచ్చేందుకు కొండకు వెళ్లాడు. కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేస్తూనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య శంకుతల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నిజామాబాద్ మార్కెట్ యార్డులో విషాదం
నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం విషాదం చోటచేసుకుంది. చిన్న గంగారామ్ అనే పసుపు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం మార్కెట్ యార్డుకు పసుపు తెచ్చిన రైతు రాత్రి అక్కడే నిద్రపోయాడు. అయితే ఉదయం లేచిన కాసేపటికే గంగారామ్ గుండెపోటు రావడంతో మార్కెట్ యార్డులోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు గంగారామ్ను కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. కొద్ది సమయంలోనే అతడు మృతిచెందాడని తోటి రైతులు చెబుతున్నారు. మృతిచెందిన రైతు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఎద్దండి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగని ‘మిర్చి’ సెగలు
సాక్షి, ఖమ్మం/లీగల్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, కల్లూరు మండలం లక్ష్మీపురంతండాకు చెందిన ఇస్రాల బాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన భుక్యా అశోక్, ఏన్కూరు మండలం శ్రీరామపురంతండాకు చెందిన భుక్యా నర్సింహారావు, తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాకు చెందిన భూక్యాశ్రీను, బానోతు సైదులు, కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజావత్ భావ్సింగ్, నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బానోతు ఉపేందర్లను ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్. అమరావతి ఎదుట హాజరు పరచగా, వారికి మే 11 వరకు రిమాండ్ విధించారు. వీరిలో ఏ–2ముద్దాయి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పరారీలో ఉన్నట్లు చూపించారు. కాగా, రైతులపై సెక్షన్లు 147(దాడి చేయటానికి వెళ్లడం), 148(మారణ ఆయుధాలతో దాడి చేయటం), 353(ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం), 427(ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట), 446, 448( అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించుట) 120(బి)(నేరం చేయటానికి ముందస్తు ప్రణాళిక, llనేరపూరిత కుట్ర) రెడ్విత్ 149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట) కింద రిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతోనే కేసు : సండ్ర రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లో మిర్చికి మద్దతుధర అందకనే రైతులే ఆవేశంగా మార్కెట్ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన శుక్రవారం రోజు రైతులు మార్కెట్లో ఉదయం 7.30 గంటల నుంచే ధర విషయంలో ఆందోళన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులను పరామర్శించేందుకు, చైర్మన్తో మాట్లాడదామని మార్కెట్కు ఉదయం 10.30 గంటలకు వెళ్లానని, అప్పటికే రైతులు మార్కెట్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్తో ఆయన చాంబర్లో ధర విషయమై మాట్లాడానని చెప్పారు. అప్పుడు చాంబర్లో చైర్మన్తోపాటు ఇద్దరు సీఐలు కూడా ఉన్నారన్నారు. ఆందోళన అంతకు ముందు జరుగుతున్నట్లు వాళ్లకు తెలిసినా, తాను వచ్చినప్పుడే రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారని, తానే ఈ విధ్వంసానికి కారకుడినని ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనని అన్నారు. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ కూడా రైతుల వద్దకు వెళ్లిందని, అప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలకు కూడా ఆ పార్టీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తాము రైతులు, ప్రజల కష్టాలను చూస్తామని, ఇలాంటి కేసులకు భయపడబోమని అన్నారు. మార్కెట్కు పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులపై ఖమ్మం మార్కెట్ నుంచే కేసులు పెట్టడం హేయమైనచర్య అని పేర్కొన్నారు. -
పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్
-
పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్
ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో మిర్చియార్డ్ చుట్టూ పోలీసుల వలయాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంకు వచ్చే అన్ని రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ కు వెళ్తున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి.మధుసూదనారెడ్డిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు ఆయనను కూసుమంచి మండల కేంద్రం వద్ద అడ్డుకున్నారు. మిర్చి మార్కెట్ను సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిని సైతం అనుమతి లేదని పోలీసులు తిప్పి పంపారు. -
రేపు సీపీఐ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ యార్డుల ఎదుట ధర్నాలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి మొద లైన నేపథ్యంలో ఉపాధి కూలీలకు ప్రభు త్వం తాగునీరు సరఫరా చేయాలని, పని కల్పించాలని, ఎండలు ముదిరిన పుడు ఉచితంగా బియ్యం, పప్పులు అం దించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇబ్బందు ల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలబడేలా ఈ నిరసనలు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. నిధుల కొరత తో మిర్చి, కందుల కొనుగోలు చేయలేక పోతున్నామని, సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుందన్నారు. -
అమ్మకానికి వస్తే... మళ్లీ వెనక్కే
మార్కెట్ గేట్లకు తాళాలు, కాపలాగా గార్డులు కోల్డ్ స్టోరీజీల వద్ద మిర్చి వాహనాలు వరంగల్సిటీ : లారీల సమ్మెతో నిరవధిక బంద్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్కు అమ్మకోవడానికి రైతులు పంట సరుకులతో వస్తే మళ్లీ వచ్చిన దారిన పోవాల్సిందే. సోమవా రం బంద్ విషయం తెలిసినా కొందరు రైతులు అనుకోకుండా మార్కెట్కు రా గా చైర్మన్, కార్యదర్శి ఏదో విధంగా అడ్తి, వ్యాపారులకు నచ్చచెప్పి అమ్మకా నికి వచ్చిన సరుకులను కొనుగోళ్లు ని ర్వహించిన విషయం తెలిసిందే. అయితే చైర్మన్, కార్యదర్శి వెంటనే అడ్తి, వ్యా పారులను సమావేశపరిచి, పంట సరుకులతో రైతులు మార్కెట్కు వస్తే బాధ్యత మీదేనని వివరించి మైక్లో బంద్ గురించి అనౌన్స్ చేయించడంతో పాటు రెండు వైపులా గేట్లను మూసేసి, సె క్యూరిటీ గార్డులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మంగళవారం గేట్లు పూర్తిగా మూసేసి, ఎలాంటి వాహనాలు మార్కెట్లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం అమ్మకానికి వచ్చిన దేశి(దొడ్డురకం) రకం మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు రాకపోవడంతో సుమారు వెయ్యి బస్తా ల వరకు పల్లియార్డులోనే మిగిలిపోయి ఉన్నాయి. కనీసం కోల్డ్స్టోరేజిల్లో నిల్వ కోసం వెళ్తామన్నా అడ్తి వ్యాపారులు సహకరించడం లేదని వారు రైతులు వాపోయారు. బారులు తీరిన వాహనాలు చాలా మంది రైతులు వాహనాల్లో మిర్చిని మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చి బంద్ విషయం తెలుసుకొని కోల్డ్స్టోరేజిల వద్దకు తీసుకెళ్లడంతో అక్కడ వాహనాలు బారులు తీరిపోయాయి. కొత్తపేట క్రాస్రోడ్డు నుంచి నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజిల వరకు వాహనాలు లైన్గా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సరైన ధరలేక అటు మార్కెట్ లేక, అమ్ముకోలేక, ఇటు దాచుకోలేక, చేతికొచ్చిన పంటను ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజులు మిర్చి సీజన్ ముందే ఉండడంతో వరంగల్ మార్కెట్ ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అంతపట్టని పరిస్థితి నెలకొంది. -
వసూళ్లు అంతంతే
ఉరవకొండ 100 శాతం రాయదుర్గం 41 శాతమే – నిరాశాజనక ఫలితాలు వెల్లడించిన మార్కెటింగ్శాఖ అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది మార్కెటింగ్శాఖకు కలిసిరాలేదు. ఓ వైపు కరువు పరిస్థితులు మరోవైపు ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, చేతివాటం వల్ల లక్ష్య సాధనలో విఫలమయ్యారు. 13 మార్కెట్యార్డులు, వాటి పరిధిలో ఉన్న సబ్యార్డులు, 26 చెక్పోస్టుల ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.17.11 కోట్లు మేర వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 59 శాతం అంటే రూ. 10.14 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేశారు. వంద శాతం లక్ష్య సాధనలో రూ.6.97 కోట్లు వసూళ్లు చేయడంలో చతికిలపడ్డారు. అయితే కొన్ని మార్కెట్యార్డుల పరిస్థితి బాగానే ఉన్నా, మరికొన్నింటిలో పూర్తిగా నిరాశాజనకంగా ఫలితాలు రావడంతో ఆర్జేడీ, ఏడీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడీ బి.హిమశైల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఉరవకొండ మార్కెట్యార్డు 100 శాతం సాధించగా, వసూళ్లకు బాగా అవకాశం ఉన్న రాయదుర్గం యార్డు 41 శాతం వసూళ్లలో ఆఖరి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక తాడిపత్రిలో కూడా 48 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. మిగతా వాటిలో అనంతపురం 61 శాతం, ధర్మవరం 50 శాతం, గుత్తి 77 శాతం, గుంతకల్లు 67 శాతం, హిందూపురం 69 శాతం, కదిరి 52 శాతం, కళ్యాణదుర్గం 56 శాతం, మడకశిర 56 శాతం, పెనుకొండ 60 శాతం, తనకల్లు 60 శాతం వసూళ్లు సాధించాయి. మొత్తమ్మీద అనుకున్న ఫలితాలు రాకపోవడంతో మార్కెటింగ్ శాఖ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఈనెల 4న మార్కెట్యార్డు సెక్రటరీలు, సూపర్వైజర్లతో మార్కెటింగ్శాఖ ఏడీ ‘క్రిటికల్ రివ్యూ’ పేరుతో సమగ్ర సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్యార్డుల లక్ష్యం, సాధించిన వసూళ్లు ఇలా... –––––––––––––––––––––––––––––––––––––––––– మార్కెట్యార్డు లక్ష్యం వసూలైంది ––––––––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం 03.67 కోట్లు 02.24 కోట్లు హిందూపురం 02.71 ,, 01.85 ,, తాడిపత్రి 02.88 ,, 01.37 ,, రాయదుర్గం 01.66 ,, 68.42 లక్షలు ధర్మవరం 70.00 లక్షలు 35.17 ,, గుత్తి 55.00 ,, 42.26 ,, గుంతకల్లు 60.00 ,, 40.07 ,, కదిరి 93.00 ,, 48.80 ,, కళ్యాణదుర్గం 99.00 ,, 55.60 ,, మడకశిర 38.00 ,, 21.11 ,, పెనుకొండ 50.00 ,, 30.09 ,, తనకల్లు 73.00 ,, 43.70 ,, ఉరవకొండ 81.00 ,, 81.01 ,, ––––––––––––––––––––––––––––– మొత్తం 13 17.11 కోట్లు 10.14 కోట్లు ––––––––––––––––––––––––––––– -
దళారుల్లో దడ..
► చండూరు కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు బిగుస్తున్న ఉచ్చు ► ఇటు రెవెన్యూ.. అటు విజిలెన్స్ శాఖలు సమన్వయంతో ముందుకు.. ► 20 క్వింటాళ్ల పైబడి అమ్మిన వారి వివరాలు సేకరించే పనిలో అధికార యంత్రాంగం ► ఇప్పటికే జిల్లాలోని తహసీల్దార్లకు వెళ్లిన మెయిల్ చండూరు: చండూరు వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు ఉచ్చు బిగుస్తోంది. మరో వారంలో దళారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అటు రెవెన్యూ.. ఇటూ విజిలెన్స్.. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జేసీ నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు దళారుల లిస్టు తయారు చేసి తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గత శుక్రవారం విజిలెన్స్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఓ బృందం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్లకు పైగా విక్రయించిన వారి వివరాలను స్థానిక తహసీల్దార్కు అందించాలని ఆయన మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో జరిగిన తతంగంపై రైతుల çనుంచి సమాచారం తీసుకున్నారు. కేంద్రంలో ఏ మండలం నుంచి ఎంత మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించారో వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు చండూరు తహసీల్దార్ వెంకట్రెడ్డి మెయిల్ పంపిం చారు. కందులు విక్రయిం చిన రైతులకు భూమి ఉందా.. ఉంటే కందులు పండించారా.. ఎంత పంట పండింది.. అనే కోణంలో విచారించి కలెక్టర్కు నివేదిక అందించనున్నారు. 147 మంది సమాచారం కోసం.. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 37,559 క్వింటాళ్ల కందులను 4505 మంది రైతుల ద్వారా కొనుగోలు జరిపారు. ఇందులో 158 మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించినవారున్నారు. ఇందులో చండూరు మండలానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. 11 మందిలో కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, భార్యతో కలిసి భూమి లేకుండానే కందులను అమ్మినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. మిగిలిన 147 మంది దళారుల సమాచారం కోసం రెవెన్యూ సిబ్బంది వేట సాగిస్తోంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని చండూరు మార్కెట్లో జనవరి 23 తేదీన హాకా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు 1994 మంది రైతులకు రూ.8 కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించారు. ఇంకా రూ.5.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. -
మార్కెట్యార్డులో రూ.10కే భోజనం ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో రూ.10 కే భోజనవసతి కార్యక్రమాన్ని చైర్మన్ తలారి ఆదినారాయణ ప్రారంభించారు. బుధవారం యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పనుల నిమిత్తం మార్కెట్కు వచ్చిన రైతులకు రూ.25 విలువ చేసే భోజనం ఇస్కాన్ సహకారంతో రూ.10కే అందజేస్తామని చైర్మన్ తెలిపారు. తొలిరోజు 150 మంది వరకు రైతులు, చిరు వ్యాపారులకు ఉచితంగా భోజనం అందజేశారు. గురువారం నుంచి మార్కెట్కు వచ్చే రైతులు తొలుత టోకెన్ తీసుకోవాలన్నారు. శని, ఆదివారాల్లో కూడా భోజన వసతి కల్పించడంమై ఆలోచిస్తున్నామని తెలిపారు. కరువు జిల్లాను దృష్టిలో పెట్టుకుని మార్కెట్యార్డుకు వచ్చే రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని గత ఏడాదిగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత సబ్సిడీతో భోజనం అందజేయాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పామురాయి వెంకటేశులు, సెలక్షన్గ్రేడ్–1 సెక్రటరీ ఏ.నూరుద్ధీన్, గ్రేడ్–2 సెక్రటరీ జి.ఆదినారాయణ, కమిటీ సభ్యులు, యార్డు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అకాల వర్షం.. పంట ఉత్పత్తులకు నష్టం
- జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం - ఆదోని మార్కెట్ యార్డులోతడిసి ముద్దయిన దిగుబడులు జిల్లా పశ్చిమన ఉన్న ఆదోని, ఆలూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదోని పట్టణంలో వర్షం తీవ్రత అధికంగా ఉండడంతో మురుగు కాల్వలు రోడ్డెక్కి పారాయి. మార్కెట్ యార్డుకు తెచ్చిన పంట ఉత్పత్తులు తడిచిపోయాయి. మిగతా ప్రాంతల్లో కూడా కల్లాల్లో ఉన్న ఆరబోసిన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఆదోని అగ్రికల్చర్/టౌన్: ఆదోనిలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మురుగు కాలువలు పొంగి పారాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని మొదలైన వర్షం అరగంటకుపైగా కురిసింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలతో కూడిన వర్షం కావడంతో పట్టణంతోపాటు శివారు జనం భీతిల్లిపోయారు. వర్షం కారణంగా మార్కెట్యార్డులో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులు తడిసిపోయాయి. వేసవి కాలం కావడంతో రైతులు వర్షం గురించి పెద్ద జాగ్రత్తలు తీసుకోలేదు. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి కురిసిన వర్షం పంట ఉత్పత్తులను ముంచేసింది. పత్తి, వేరుశెనగ దిగుబడులు పూర్తిగా తడిచిపోయాయి. మంగళవారం మార్కెట్ యార్డుకు 7664 క్వింటాళ్ల పత్తి, 1061 క్వింటాళ్ల వేరుశెనగ, 141 క్వింటాళ్ల ఆముదం దిగుబడులను రైతులు విక్రయానికి ఉంచారు. పత్తి క్వింటాల్కు రూ.6,111, వేరుశెనగ రూ.6,310, ఆముదం రూ.3633 వరకు కొనుగోళ్లు జరిగాయి. సాయంత్రం అకాలంగా వర్షం రావడంతో ఉత్పత్తుల నిల్వలు అలాగే నిలిచిపోయాయి. టెండర్లు, తూకాలు ముగిసిన అనంతరం వర్షం కురిసింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం లేదని కమీషన్ ఏజెంట్లు తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులు నష్టం చవిచూడాల్సి వచ్చింది. కౌతాళంలో వర్షం కౌతాళం: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతూ జనం బెంబేలెత్తిపోతున్న క్రమంలో మంగళవారం అనుకోకుండా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షం ఏకధాటిగా కురిసింది. -
దళారీ వ్యవస్థకు మంగళం!
⇒ రాష్ట్ర కొత్త మార్కెటింగ్ చట్టంలో కీలక అంశాలు ⇒ నల్సార్ వర్సిటీ ద్వారా ముసాయిదా బిల్లు సిద్ధం ⇒ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులను పీల్చి పిప్పి చేస్తున్న దళారీ వ్యవస్థకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతుల పంటలకు తగిన ధర దక్కేలా, మార్కెట్లో వివిధ రకాల దోపిడీలకు చెక్ పెట్టేలా కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రూపొం దిస్తోంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో రూపుదిద్దిన కొత్త చట్టంలోని అం శాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికా రులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తుది మెరు గులతో ముసాయిదా బిల్లు తయారు చేసి, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టను న్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త చట్టం ప్రకారమే మార్కెట్లో కార్యకలా పాలు జరిగేలా చూడాలని నిర్ణ యించారు. మార్కెట్ రుసుము నుంచి రైతులకు విముక్తి ఇప్పటివరకు మార్కెట్లో వివిధ రకాల రుసుములన్నీ రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కొత్త చట్టంతో దీనికి చరమగీతం పాడనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చే వరకు అయ్యే ఖర్చులనే భరిస్తారు. మార్కెట్లోకి ప్రవేశించాక ఎటువంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం ఉండకుండా కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రైతుల నుంచే కమీషన్ వసూలు చేస్తున్నారు. కొత్త చట్టంతో దీన్ని రద్దు చేస్తారు. వ్యాపారులే కమీషన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో అమల్లో ఉన్న తరహాలో రివాల్వింగ్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించనప్పుడు ఈ రివాల్వింగ్ ఫండ్ రైతులకు చేయూతనిస్తుంది. అలాగే కేంద్ర మార్కెట్ ఫండ్కు బదులుగా రాష్ట్ర మార్కెట్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ యార్డుల్లోనూ, చెక్పోస్టుల వద్ద రైతులు తీసుకొచ్చే పండ్లు, కూరగాయలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుమును కూడా రద్దు చేస్తారు. -
రాజమండ్రి మార్కెట్ యార్డులో సమస్యలు
-
గుంటూరు మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన
గుంటూరు: గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో కొనుగోలుదారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయడంతో మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. వేలాది మంది రైతులు రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. కొంతకాలంగా అధిక దిగుబడులతో మిర్చియార్డు కిక్కిరిసిపోతుండగా.. కొనుగోళ్లు మాత్రం మందగించి ధరలు పడిపోయాయి. క్వింటారు ధర రూ. 4 నుంచి రూ.5 వేలు వరకూ మాత్రమే పలికేది. ఈ ధరతో తమకు కూలీరేట్లు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ధరలో ప్రస్తుతం సగం కూడా లేకపోవడం రైతుల ఆందోళనకు కారణమైంది. రైతుల రాస్తారోకోతో యార్డ్ రహదారితో పాటు జాతీయ రహదారిపైనా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
వరాల వాన
► గజ్వేల్లో పత్తి, తూప్రాన్లో సాధారణ మార్కెట్యార్డులు ► మండల కేంద్రాల్లో మౌలిక వసతులకు రూ.కోటి ► పంచాయతీలకు రూ. 50 లక్షలు మదిరలకు రూ. 20 లక్షలు ► ప్రగతి భవన్ వేదికగా సీఎం కీలక నిర్ణయాలు గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్పై మరోసారి వరాల జల్లు కురిపించా రు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. మంత్రి హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి.... ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల వినతులపై సానుకూలంగా స్పం దించారు. పత్తి క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే ప్రముఖ మార్కెట్గా గుర్తింపు సాధించిన గజ్వేల్లో కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తూప్రాన్లో సాధారణ మార్కెట్యార్డు నిర్మించనున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తామన్నారు. నిధుల వెల్లువ.. మండల కేంద్రాలు, ఐదు వేల జనాభా కలిగిన పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు రూ. కోటి, సాధారణ గ్రామ పంచా యతీలకు రూ. 50 లక్షలు, మధిరలకు రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ కో సం ప్రత్యేకంగా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 750 జనాభా కలిగిన ప్రతి గ్రా మాన్ని ఇక నుంచి గ్రామ పంచాయతీగా పరిగణిస్తామన్నారు. ఈ ప్రక్రియను గజ్వేల్ నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంప్యార్డుల నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి దళిత వాడలనుంచే ప్రారంభం కావాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి గ్రామాల్లో పాడుబడిన బావులు, వదిలేయడంతో పాడుబడిన ఇండ్లు కూల్చేయడంతోపాటు గ్రామాల్లో అపారిశుద్ధ్యాన్ని తొలగిం చడానికి ఉద్యమస్థాయిలో ప్రయత్నం జరగాలని సీఎం తెలిపారు. హరిత హారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే గాకుండా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికీ అభివృద్ధి చేయకుండా మిగిలిపోయిన రోడ్లను వెంటనే ‘డబుల్’గా మార్చాలని, ఇందుకోసం నిధులు ఎన్నైనా ఇవ్వడానికి సిద్ధమ ని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇండ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను, వేలాడుతున్న విద్యుత్ వైర్లను రెండు నెలల్లోపు సరిచేయాలని, అవసరమైతే పవర్డే నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. గజ్వేల్లోని ప్రభుత్వాసుపత్రికి మరో రెండు అంబులెన్సులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 11న గజ్వేల్లో మరోసారి సమీక్ష ప్రగతిభవన్లో మిగిలిపోయిన అంశాలకు సంబంధించి మరోసారి ఈ నెల 11న గజ్వేల్లో సమీక్ష నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీ క్షలో మంత్రి హరీష్రావుతోపాటు, ఎంపీ ప్రభాకర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మంతరావు ఉంటారని పేర్కొన్నారు. మరోసారి విస్తృతంగా చర్చ జరిపి నివేదికలను తనకు అందజేయాలని ఆదేశించారు. ఇంకా ఈ సమీక్షలో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి భూంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, వంటిమామిడి మార్కె ట్ కమిటీ చైర్మన్ జహంగీర్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
కందుల కథ కంచికే!
నారాయణపేట : గత నెల 11న నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ కేంద్రంలో ఓ హమాలీ రైతు అవతారమెత్తాడు. 58బస్తాల కందులను అక్రమ మార్గంలో విక్రయించేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో సరుకు సంబంధించిన పట్టదారు పుస్తకం వివరాలను యార్డు అధికారులు ప్రశ్నించగా సదరు హమాలీ ఆ సరుకును అక్కడే వదిలి చిత్తగించారు. అ తర్వాత తమ సరుకు అని పేర్కొంటూ యార్డు అధికారులను సంప్రదిస్తే నీ పూర్తిస్థాయి భూమి ఎంత సర్వే నెంబర్ వివరాలను సమర్పించాల్సిందిగా సూచించారు. ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు కమిషన్ ఏజెంట్కు యార్డు అధికారులు నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పట్టుబడిన రోజేమో ఆ కందులు సంబంధిత యార్డు కమిషన్ ఏజెంట్వేనని పేర్కొంటూ వచ్చిన మార్కెట్ అధికారులు, తీరా నెలరోజుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. మరో విధంగా సమాధానం ఇస్తుండటం మరిన్నీ అనుమానాలకు దారితీస్తోంది. ఇదండీ మార్కెట్ అధికారుల పనితీరు ఈ నెలరోజుల వ్యవధిలో సరుకును న్యాయబద్ధంగా విక్రయిస్తున్నట్లు అటు యార్డు అధికారులు, ఇటు సంబంధిత కమిషన్ ఏజెంట్ తెర వెనుక పావులు కదిపి ఆలస్యంగా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిచే ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, మార్కెట్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంబంధిత రైతుకు సంబంధించిన సరుకు ఉన్నట్లయితే ఇన్ని రోజులు తమ సరుకుయార్డులో ఉంచరు. నెల రోజుల వ్యవధిలో కేవలం రెవెన్యూ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా మార్కెట్ అధికారులు మొత్తం 58 బస్తాల్లో 50 బస్తాలు ఇద్దరు రైతులకు సంబంధించినవిగా మిగతా 8 బస్తాలు కమిషన్ ఏజెంట్గా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ వ్యవహరం నడిచేందుకు నెలరోజుల సమయం ఎందుకు పట్టిందనే విషయంపై ఆ అధికారులే స్పష్టం చేయాలి. మరో విషయమేమిటంటే ఆ రోజున మొత్తం 58బస్తాలు రైతులవి కావని.. ఇప్పుడేమో 50బస్తాలు రైతులవని, 8 బస్తాలు కమిషన్ ఏజెంట్వని పేర్కొనడం గమనార్హం. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ 58బస్తాల కందుల వ్యవహారంపై పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న 50 బస్తాలు సంబంధిత రైతులకు, 8 బస్తాలను కమిషన్ ఏజెంట్కు తిరిగి ఇచ్చేశామని మార్కెట్ కార్యదర్శి గోపాల్ చల్లగా సమాధానం దాటవేశారు. సంతకం చేశాను.. నాకేం తెలియదు నేను ఎక్లాస్పూర్లో పనిఒత్తిడిలో ఉన్న సమయంలో ఏమరుపాటు చేసి గ్రామస్తులు కొందరు ఆ కాగితాలపై సంతకం తీసుకున్నారు. గంజ్లో జరిగిన వ్యవహారం గురించి నాకు తెలియదు. గ్రామంలో రైతులకు పంట వేసే సమయంలో తాము ఏవిధంగా అయితే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామో అలాగే సంతకం చేశా. ఇందులో నా ప్రమేయం ఏమిలేదు. – అనంత్రెడ్డి, ఎక్లాస్పూర్ వీఆరోఓ -
వ్యవసాయ మర్కెట్ ఎదుట రైతుల ఆందోళన
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కందులు కొనకుండా అధికారులు మార్కెట్కు తాళం వేయడంతో పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆందోళన చేస్తూ.. మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ అంశంపై మార్కెట్ అధికారులను సంప్రదించగా.. గన్నీబ్యాగుల కొరత ఉండటంతోనే కొనుగోళ్లు నిలిపివేసామని తెలిపారు. సుదూరప్రాంతాల నుంచి పంటతో మార్కెట్ కు వచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. -
పత్తి ధర మళ్లీ పతనం
- కనిష్టం రూ. 4,100 - గరిష్టం రూ.5,930 - రూ.20 లక్షలు నష్టపోయిన రైతులు ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర మళ్లీ పతనమైంది. మూడు రోజుల్లో క్వింటా ధర రూ.300 వరకు తగ్గింది. గత పక్షం రోజులుగా క్వింటా రూ. 6 వేలకు పైగా పలుకుతూ స్థిరంగా కొనసాగింది. ధర తగ్గు ముఖం పట్టడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. శనివారం వరకు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ వారం ప్రారంభం రోజు సోమవారం యార్డుకు 11,641 క్వింటాళ్లు, మంగళవారం..13,088 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటా ధర కనిష్టం రూ.4,100, గరిష్టం రూ. 5,930 పలికడంతో బుధవారం 6,344 క్విటాళ్లు మాత్రమే తీసుకొచ్చారు. ధర తగ్గడంతో ఒక్క రోజే రైతులు దాదాపు రూ.20 లక్షలు నష్టపోయారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కొంత మేర తగ్గడంతో ఆ ప్రభావం ఆదోని యార్డుపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వేరుశనగ రైతుకు ఊరట ఆదోని మార్కెట్లో వేరుశనగ ధర స్వల్పంగా పెరిగింది. వారం క్రితం క్వింటా కనిష్టం రూ.3,186, గరిష్టం రూ. 5,263 పలుకగా బుధవారం కనిష్టం రూ.3,059, గరిష్టం రూ.5,759 పలికింది. అయితే రైతుల వద్ద దిగుబడులు పెద్దగా లేవు. తమ వద్ద నిల్వలు లేనప్పుడు ధర పెరిగితే తమకేమి ప్రయోజనమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన ధరకు అమ్ముకున్న రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యార్డుకు 841 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. రబీలో సీజన్లో భాగంగా నవంబరులో బోరు బావుల కింద వేరుశనగ సాగు చేసిన రైతులు పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్లో ధర బాగుండడంతో చేతికి అందిన దిగుబడులను వెంటనే మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. కనిపించని పప్పుశనగ ఆదోని మార్కెట్ యార్డులో పప్పు శనగ దిగుబడులు కనిపించడంలేదు. మూడేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాళ్ల పప్పు శనగలు యార్డుకు అమ్మకానికి వచ్చేవి. ఈ ఏడు కూడా డివిజన్లో 20 వేల హెక్టార్లకు పైగా పంట సాగు చేశారు. అయితే నవంబరు నుంచి వాన చినుకు లేకపోవడంతో విత్తనం మొలకెత్తలేదు. మొలకెత్తిన పొలాల్లో మొక్కలు ఎండి పోయాయి. కనీసం విత్తనం ఖర్చు కూడా రైతులకు గిట్టుబాటు కాలేదు. దీంతో యార్డులో ఎక్కడా ఒక్క కిలో కూడా పప్పు శనగ అమ్మకానికి రాలేదు. -
మార్కెట్ యార్డులో మాయాజాలం
డీపీసీలో తక్కువ ధర కోట్ చేసిన వ్యాపారులు పంట విక్రయించబోమన్న అన్నదాతలు అసిస్టెంట్ కలెక్టర్ వాహనం అడ్డగింత కలెక్టర్ చెంతకు చేరిన వివాదం అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన వ్యాపారులు రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకారం సుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మాయజాలం కొనసాగుతోంది. నేరుగా కొనుగోలు కేంద్రం (డీపీసీ)లో కొనుగోలుదారులు నాణ్యమైన పంటకు తక్కువ ధర కోట్ చేయడంపై అన్నదాతలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ ఏజెంట్ల వద్ద మామూలు సరుకుకు ఎక్కువ ధర పలకడం, డీపీసీలో మేలైన సరుకుకు తక్కువ ధర కోట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సరుకు అమ్మబోమంటూ భీష్మించారు. ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ కొనుగోలుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన వ్యాపారులు తాము కోట్ చేసిన ధర కంటే రూ.1200 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 14 మంది రైతులు సోమవారం దాదాపు 200 పసుపు బస్తాలను డైరెక్ట్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కమీషన్ ఏజెంట్లు.. డీపీసీలోకి వచ్చిన పసుపునకు ధర తక్కువగా కోట్ చేయాలని కొనుగోలుదారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో, బయట మామూలు పసుపునకే మంచి రేటు పలగా, డీపీసీలో నాణ్యమైన పంటకు రూ.6,600 పలకడంపై రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ సంగయ్య దృష్టికి తీసుకెళ్లి, ఇదే ధరకైతే అమ్మేది లేదని రైతులు భీష్మించారు. దీంతో సంగయ్య అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్కు సమాచారమివ్వగా, ఆయన వచ్చి తక్కువ ధర కోట్ చేసిన దుకాణం వద్దకు వెళ్లి పసుపును పరిశీలించారు. ఎంతో కష్టపడి పండిస్తున్నామని, తమ శ్రమను దోచుకోవడంపై రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారు. లైసెన్సులు రద్దు చేస్తాం.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, వారిని మోసం చేస్తే సహించబోమని అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ ఖరీదుదారులను హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖరీదుదారులతో ఆయన మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వీర్యం చేసేందుకు కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు కుట్ర పన్నుతున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల లైసెన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కొనుగోలుదారులందరూ డీపీసీకి వచ్చి ధరలు కోట్ చేయాలని ఆదేశించారు. ధర ఎందుకు తక్కువగా కోట్ చేశారని కొనుగోలుదారులను ప్రశ్నించగా, డబ్బులు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, నాణ్యత లేదని చెప్పడంతో అసిస్టెంట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రకాల పసుపును తీసుకొచ్చి వారికి చూయించండంతో వారు నోరెళ్లబెట్టారు. డీఎంవో రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీలు నరేందర్, వజీరుద్దీన్, డీపీసీ ఇన్చార్జీలు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం, మార్కెట్లో జరుగుతున్న మోసాన్ని గ్రహించిన అసిస్టెంట్ కలెక్టర్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన తర్వాతే వెళ్లాలని, లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దిగొచ్చిన వ్యాపారులు తాజాగా మార్కెట్లో జరిగిన మోసాలపై అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్రాజ్ కలెక్టర్ యోగితారాణాకు వివరించారు. ఎలాగైనా రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెట్ అధికారులను ఆదేశించారు. ధరలో ఇంత వ్యత్యాసం ఉంటే మీరేం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారు హుటాహుటీన మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకొని ఖరీదుదారులను పిలిపించారు. కమీషన్ ఏజెంట్ల వద్ద ఉన్న పసుపునకు ధర కోట్ చేసి, డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీసీకి వచ్చిన పసుపులో దాదాపు 120 క్వింటాళ్లకు రూ.7800 ధర చెల్లించి తీసుకోవాలని ఖరీదుదారులను ఆదేశించారు. డీపీసీలో కోట్ చేయని ఖరీదుదారులకు నోటీసులు జారీ చేస్తామని సెక్రటరీ సంగయ్య తెలిపారు. త్వరలో కలెక్టర్తో వ్యాపారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మార్కెట్లోనే మద్దతు ధర
► జేసీ యాస్మిన్ బాషా ► సిరిసిల మార్కెట్లో కందుల కొనుగోళ్లు ప్రారంభం సిరిసిల్ల : రైతులు తాము పండించిన కందులను మార్కెట్ యార్డుల్లో విక్రయిస్తేనే మద్దతు ధర లభిస్తుందని జేసీ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ఉత్పత్తులను దళారులు, ప్రైవేట్ బ్రోకర్లకు విక్రయించకుండా మార్కెట్కు తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తూకంలోనూ మోసాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కిందుల మద్దతు ధర రూ.4,625 ప్రకటించిందని, రాష్ట్రప్రభుత్వం రూ.425 బోనస్ ఇస్తోందన్నారు. తద్వారా రైతుకు క్వింటాలుపై రూ.5050 ధర లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సేవలు అందిస్తామని ఏఎంసీచైర్మన్ జిందం చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిల్కుమార్, ఏఎంసీ కార్యదర్శి రాజశేఖర్, ఏఈవో తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తు రాంరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి
నిర్మల్టౌన్ : కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సీజన్ లో రైతులు ఎక్కువగా కంది పంటను వేశారని తెలిపారు. గత ఏడాది కందులకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు మద్ధతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాగా ఈ యేడాది కేవలం రూ.5050 మద్దతు ధరను కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3,667 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేశారని తెలిపారు. మద్ధతు ధర పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కిషన్ కుమార్, జగన్ మోహన్, ఎస్ఎన్ రెడ్డి, శంకర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అందని ‘కూల్’ వాటర్
► బయట పడేసిన వాటర్కూలర్ పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్యార్డులో పంట దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చే అన్నదాతల దాహర్తిని తీర్చేందుకు కొనుగోలు చేసిన వాటర్కూలర్ను నిర్లక్ష్యంగా బయట పడేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకుంటున్న పాలకవర్గ ప్రతినిధులు రైతాంగానికి కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో మరోకూలర్ను ఏర్పాటు చేసుకుని కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం చల్లని నీళ్లు తాగుతూ తమను విస్మరించడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్కమిటీ పాలకవర్గం యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
గ్రీన్ మార్కెట్ యార్డుగా అభివృద్ధి
- శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు - శరవేగంగా ర్యాంపులు, షెడ్ల నిర్మాణం - వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు కర్నూలు (వైఎస్ఆర్సర్కిల్): పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కర్నూలు మార్కెట్ యార్డును..రెండు నెలల్లో పచ్చదనంతో నింపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం ఉదయం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర యార్డులను పరిశీలించిన అనంతరం సాయంత్రం ఆయన కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని కూలేందుకు సిద్ధంగా ఉన్న షెడ్లతో పాటు శిథిలావస్థలోని గోదాములను పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జంబో గోదామును తనిఖీ చేసి మార్చిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపించిన మరుగుదొడ్లను, షెడ్ల వద్ద ఉన్న అపరిశుభ్రతను గమనించి.. అధికారులకు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ పథకం కింద యార్డుల్లో పచ్చదనం వెల్లవిరిసేలా బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంగవైకల్యం కల్గిన రైతులు గోదాములోకి వెళ్లేలార్యాంపుల నిర్మాణం శరవేగంగా జరగాలని ఆదేశించారు.మార్కెట్ల శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కూలిని పెంచాలని హమాలీలు.. కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. వ్యాపారులు, రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి కమిషనర్ భరోసానిచ్చారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు సుధాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): కర్నూలు మార్కెట్యార్డు వచ్చే నాలుగు రోజులు మూత పడనుంది. వరుస సెలవు దినాలు రావడంతో రైతులు కలవరపడుతున్నారు. 26న గురువారం గణతంత్రదినోత్సవం, 27న శుక్రవారం అమావాస్య(సెంటిమెంట్తో రైతులు, వ్యాపారాలు ఎలాంటి లావాదేవీలు జరపరు), 28న శనివారం (నగదు బదిలీతో రెండు నెలలుగా శనివారాలు యార్డు కార్యకలాపాలు స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు). 29న ఆదివారం. దీంతో మార్కెట్లో నాలుగు రోజులపాటు క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఖుషీఖుషీగా అధికారులు మార్కెట్ అధికారులు, సిబ్బంది ధాన్యం కొలిచేటప్పుడు దుమ్ము..«ధూళితో అవస్థలు పడుతున్నా.. విధులను మాత్రం నిర్విరామంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు కావడంతో వారు ఉపశమనంగా భావిస్తూ ఖుషీ..ఖుఫీగా ఫీలవుతున్నారు. -
పత్తి రికార్డు ధర.. క్వింటాలు రూ. 5,725
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాలుకు రూ. 5,725 ధర పలికింది. మార్కెట్కు 6434 క్వింటాళ్ల పత్తి రాగా, కనిష్ట ధర క్వింటాల్కు రూ.5,205, మోడల్ ధర క్వింటాల్కు రూ. 5,555, మ్యాగ్జిమం ధర క్వింటాల్కు రూ. 5,725 పలికింది. కేసముద్రం మార్కెట్లో కనిష్టంగా రూ. 5,150, గరిష్ఠంగా రూ. 5,605 ధర పలికింది. వరంగల్ రూరల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డ్లో గరిష్ఠంగా రూ. 5,475, కనిష్ఠంగా రూ. 5,250 ధర పలికింది. ఈ ఏడాది పత్తి సీజన్లో ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతుండడంతో రైతులు తమ ఇళ్లలో దాచుకున్న పత్తికి మరింత ధర వస్తుందన్న ఆశగా ఎదురుచూస్తున్నారు. -
చివరి బస్తాలో చేతివాటం
– మార్కెట్ యార్డులో వెలుగు చూసిన కొత్త మోసం – ఆందోళనకు దిగిన రైతులు – కార్యదర్శి చొరవతో బాధిత రైతులకు పరిహారం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): మార్కెట్యార్డు కేంద్రంలో వ్యాపారులు రైతులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. గురువారం కొందరు రైతులు గమనించి ఆందోళనకు దిగడంతో మార్కెట్ కార్యదర్శి జోక్యం చేసుకుని దుకాణంపై కేసు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. పూర్తి వివరాలు.. ఆలూరు మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన జగదీష్, మల్లేష్తో పాటు మరో పది మంది రైతులు వామును కర్నూలు మార్కెట్యార్డుకు గురువారం తీసుకొచ్చారు. ఉదయం నుంచి వారు వేచి ఉండి మార్కెట్యార్డులోని ఉమామహేశ్వర ట్రేడర్స్ (షాపు నెం.40బి)లో విక్రయించారు. తొలుత సుమారు 15 బస్తాలను కాటా వేసిన వ్యాపారులు ఆఖరి బస్తాలో 22 కేజీల వాము ఉండగా, 15 కేజీలే ఉన్నట్లు రసీదులు ఇవ్వడంతో రైతులు అవాక్కయ్యారు. తాము తెచ్చింది 22 కేజీలు అయితే, 15 కేజీలు ఎలా వస్తాయని వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే మరికొంతమంది రైతులు తమకు కూడా ఇదే తరహా మోసం జరిగిందనీ, న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని వ్యాపారులకు నిరసనగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి నారాయణ మూర్తి సంబంధిత దుకాణాన్ని తనిఖీ చేసి విచారించారు. విచారణలో మోసం వెలుగు చూడటంతో సంబంధిత వ్యాపారులపై కేసు నమోదు చేసి చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ సందర్బంగా సెక్రటరీ నారాయణ మూర్తి మాట్లాడుతూ మోసపోయిన రైతులకు సంబంధిత వ్యాపారుల నుంచి 10 కేజీల వాము విలువను చెల్లించాలని ఆదేశించారు. దీంతో రైతుల వివాదం సద్దుమణిగింది. -
మార్కెట్ యార్డులకు స్వైప్ మిషన్లు
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్యార్డులలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్వైప్ మిషన్లను అందజేసింది. మార్కెట్యార్డుల్లో క్రయ, విక్రయాలకు సంబంధించిన చెల్లింపులు అప్పటికప్పుడే స్వైప్ మిషన్ల ద్వార జరుపుకునేందుకు ఈ పద్ధతిన అవకాశం ఉంటుందని పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య తెలిపారు. పెద్దపల్లి యార్డుకు కేటాయించిన స్వైప్ మిషన్ ను సోమవారం ఆయన పరిశీలించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు తన సొంత నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలు జరపడంలో ముందుంచినట్టే మార్కెటింగ్శాఖలోనూ ఆ దిశగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మొదలైన ‘నామ్’ సేవలు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్యార్డులలో ఆన్ లైన్ పద్ధతిన పంట దిగుబడుల లావాదేవీలు నిర్వహించేందుకు నామ్ సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి మార్కెట్యార్డులో సోమవారం తొలిసారిగా క్రయ, విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. మార్కెట్ యార్డుకు 51మంది రైతులు సోమవారం తెచ్చిన 218 క్వింటాళ్ల పత్తిని ఆన్ లైన్ పద్ధతిన విక్రయించారు. ఈ మేరకు రైతులకు ఆన్ లై న్ కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలయ్య, సూపర్వైజర్ శంకరయ్య తెలిపారు. పెద్దపల్లి మార్కెట్యార్డులో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవలు, నగదురహిత లావాదేవీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 218 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం 218 క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. 51 మంది రైతుల ద్వార యార్డుకు వచ్చిన పత్తికి క్వింటాలు ధర రూ.5460 అత్యధికంగా నమోదు కాగ, కనిష్టంగా రూ.5050 గా నమోదైందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. సరాసరి ధరను రూ.5350గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
16 నుంచి వాము క్రయ, విక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్):కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 16 నుంచి వాము క్రయ, విక్రయాలు జరుగునున్నాయి. మార్కెట్కు వచ్చే వామును టెండర్ పద్ధతిలో కొనుగోలు చేస్తారని మార్కెట్ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి తెలిపారు. వాము పండించిన రైతులు పంటను మార్కెట్కు తీసుకవచ్చి గిట్టుబాటు ధరకు అమ్మకోవాలని ఆయన కోరారు. -
రైతు బంధు.. దూరబంధువు!
∙వినియోగించుకుంటే ప్రయోజనాలెన్నో ∙రూ.2 లక్షలకు పెరిగిన రుణ పరిమితి ∙అన్నదాతలకు తెలియ కుండా పోయిన వైనం! ∙అవగాహన కల్పించని శాఖ అధికారులు మంచిర్యాల అగ్రికల్చర్ : అన్నదాత ఆత్మబంధువుగా నిలవాల్సిన రైతుబంధు పథకం.. వారికి దూర బంధువు అవుతుంది. కష్టకాలంలో కడదాకా తోడుండాల్సిన ఈ ఆర్థిక తోడ్పాటు అవకాశం.. వారి దరి చేరకుండానే ఉంటోంది. ధర ఉండి పంట చేతికి రాని సమయంలోనైనా.. దిగుబడి వచ్చి ధర లేని పరిస్థితుల్లో అయినా ఆదుకునే రైతుబంధు పథకం.. అవగాహన లేమి కారణంగా రైతులకు వినియోగంలో ఉండడం లేదు. ఈ విషయంలో రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వంద మందిలోపే రైతులు రైతు బంధు పథకంలో చేరారంటే.. ఈ పథకంపై ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ద్వారా రైతులకు లబ్ధి వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో పండించిన పంటలకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పడు పంటలను అమ్ముకుని నష్టపోకుండా.. కొంత కాలం ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచి ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందుటకు రైతుబంధు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్ యార్డుల్లో అమ్ముకునే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన ధీమా ఇవ్వడానికి బీమా సౌకర్యం సైతం ఉంది. ఇలాంటి బృహత్తర పథకం అమలు బాధ్యత మార్కెట్ కమిటీలపైన ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభింపచేయడంలో మార్కెట్ కమిటీల కార్యదర్శులు, ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ప్రాంతీయ అధికారులపై ఉంటుంది. ఈ పథకం కోసం పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. రైతులు మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచినా సరుకుల విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. గతంలో గరిష్టంగా లక్ష పరిమితి ఉన్న రుణ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పెంచింది. సరుకులు నిల్వ ఉంచుకొని, ఇలా రుణాలను తీసుకున్నా రైతులకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు. కొత్తగా రూపొందించినా విధి విధానాల్లో భాగంగా రైతుబంధు కార్డు 5 సంవత్సరాలకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఈ పథకం ద్వారా లాభాలు వరి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న తదితర ఉత్పత్తులు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది. రైతు రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు. ►రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించిన సమయంలో సరైన ధర లేదని భావిస్తే తొమ్మిది నెలల పాటు గోదాములో నిల్వ చేసుకోవచ్చు. ►డివిజన్ కేంద్రాల్లో ఉండే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో కూడా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. ►రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రతతో పాటు బీమా సౌకర్యం కలదు. ► అయితే ఇక్కడ నిల్వ ఉంచే ధాన్యానికి నామమాత్రపు ఫీజు వసూలు చేసి వివరాలతో కూడిన గేట్ పాస్ అందజేస్తారు. ► మార్కెట్ యార్డుల పరిధిలోని గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ ఉంచుకున్న మూడు నెలల కాలానికి గానూ ఎలాంటి రుసుము తీసుకోరు. ►180 రోజుల నుంచి 270 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనికి గానూ రైతు నుంచి 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ► 270 రోజులు దాటితే రైతులకు నోటీసు ద్వారా తెలియజేసి నిల్వ ఉంచినా సరుకుల్ని, వేలం ద్వారా అమ్మి, వచ్చినా మొత్తం నుంచి గోదాము అద్దె, బీమా రుసుము, చెల్లించవలసినా వడ్డీ మినహాయించుకొని మిగతా మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. ►వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో తగినా నిల్వ సదుపాయాలు లేనప్పడు, సరుకులతో నిండినప్పుడు ఎక్రిడేషన్ చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, లేదా రాష్ట్ర గిడ్డంగులు, లేదా సెంట్రల్ వేర్ హౌసింగ్ సంస్థల గోదాములు, శీతల గిడ్డంగులలో కూడా నిల్వ చేసుకొన్నా వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా మారకం చేయగల గిడ్డంగి రశీదులు తీసుకొని రుణాలను పొందవచ్చు. ►రైతు నిల్వ ఉంచిన ధాన్యానికి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకు 75 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. లేదా రూ.2 లక్షల వరకు గరిష్ట పరిమితికి లోబడి ఏది తక్కువైతే దానిని ఎలాంటి భూమికి సంబంధించి దస్తావేజులు తనఖా పెట్టకుండానే రుణం పొందవచ్చు. ►మూడు నెలల్లోపు ఎప్పుడైనా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. బీమా సౌకర్యం ►రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలిస్తున్న క్రమంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మార్కెట్ కమిటీ నుంచి రూ.లక్ష ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. రైతుతో పాటు హమాలీలు, దడువాయి(ధాన్యం తూకం వేసే వ్యక్తుల)లకు ప్రమాదం జరిగి మరణిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సౌకర్యం ఉంది. ఈ బీమా 18 నుంచి 60 ఏళ్ల రైతులకు వర్తిస్తుంది. ►మార్కెట్ తీసుకువచ్చిన సమయంలో ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం పొందిన రైతుకు రూ.75 వేల వరకు బీమా వర్తిస్తుంది. ►ప్రమాదంతో పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.25 వేల వరకు పొందవచ్చు. ►రైతు పండించిన అన్ని రకాల పంటల(సోయా, వేరుశనగ, «శనగ, వడ్లు, పెసర, బబ్బెర, కందులు, పొద్దుతిరుగుడు, ఆముదం, మొక్కజొన్న, ఉలవలు)కు బీమా సౌకర్యం వర్తిస్తుంది. ►రైతు ధాన్యాన్ని వరసుగా మూడు సార్లు ఆయా మార్కెట్ యార్డుల్లో అమ్మినట్లు తక్పట్టి కలిగి ఉండాలి. ►ఒక క్వింటాలు నుంచి ఎంత ధాన్యం అమ్మినా పథకం వర్తిస్తుంది. ►రైతు తాను పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తుండగా, తరలించిన తర్వాత, మార్కెట్ ప్రాంతంలో మరణించినా బీమా డబ్బులు చెల్లిస్తారు. ►ప్రమాదం జరిగిన రోజే రైతు కుంటంబానికి రూ.లక్ష నగ అందజేస్తారు.