UP Assembly Election 2022
-
యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు కలిశారు. యోగి అసెంబ్లీలోకి రాగానే.. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేష్ కూడా తన సీటులోంచి లేచి యోగికి విష్ చేశారు. ఒకరినొకరు షేక్ హ్యండ్ ఇచ్చుకొని అత్మీయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న అఖిలేష్, యోగి.. ఇలా నవ్వుకుంటూ పలకరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రమాణం చేశారు. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ #WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022 ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు కైవసం చేసుకొని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్వాదీ పార్టీ 111 స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా అందుకుంది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్ అర్భన్ స్థానం నుంచి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్ అజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రెండోసారి యోగి ఆదిత్యనాథ్ పట్టాభిషేకం
-
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి పట్టాభిషేకం
-
భారీ జనసందోహం మధ్య సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలో శుక్రవారం యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే 52 మంది మంత్రులతో యోగి జంబో కేబినెట్ను ఏర్పాటు చేశారు. వీరిలో 18 మందికి కేబినెట్ హోదా, 14 మందికి స్వతంత్ర హోదాను కల్పించారు. తన మంత్రి వర్గంలో మరో 20 మంది సహాయ మంత్రులకు సీఎం చోటు కల్పించారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్లకు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ సీఎం యోగి ఆయనకు కీలక బాధ్యతను అప్పగించడం విశేషం. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. భార జనసందోహం మధ్య సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. Lucknow | BJP's Yogi Adityanath takes oath as the Chief Minister of Uttar Pradesh for the second consecutive term. pic.twitter.com/ubAZ5nHTB4 — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022 Prime Minister Narendra Modi arrives at Atal Bihari Vajpayee Ekana Cricket Stadium in Lucknow where UP CM-designate Yogi Adityanath will take oath for the second consecutive term. pic.twitter.com/tD9sk4g0KH — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022 -
యూపీలో బీజేపీ విజయ రహస్యం
దేశ ప్రజల్లో ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ 117 సీట్లకు 92 సీట్లు సాధించి, దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించాలనుకున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు చతికిల పడ్డాయి. బీజేపీ కూటమి 403 సీట్లకుగానూ 273 సీట్లు సాధించడం ఆషామాషీ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ పన్నిన యాదవులు ప్లస్ ముస్లింలు ప్లస్ జాట్లు వ్యూహం వికటించింది. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో జాట్ తెగ హిందువులు నరేంద్ర మోదీపై గుర్రుగా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణ విషయంలో బీజేపీ వైపు నిలబడాలని దృఢ నిశ్చయానికి వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక జాట్లు, కొంతమంది ముస్లింలు బీజేపీ వైపు నిలబడడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలేనని చెప్పాలి. పైగా సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో యోగి దృఢనిశ్చయంతో ఉంటాడని 54 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. సమాజ్వాదీ ముస్లింల పార్టీ కాదు. అయినప్పటికీ దాదాపు 80 శాతం ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేశారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ పార్టీ చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం అభ్యర్థులను నిలిపి, హిందూ సమాజంలోని యాదవులను చీల్చి ముస్లిం అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అయింది. అందుకే ఆ పార్టీ తరఫున 31 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ముస్లిం ఓటు బీఎస్పీకి, కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీలకు చీలి పోకుండా ముస్లిం మత పెద్దలు చేసిన ప్రయత్నాలు కొంత సఫలమైనట్లే. మొత్తం మీద యూపీలో ప్రజలు యోగీ చేసిన సుపరిపాలనకు, ఆయన అందించిన శాంతి భద్రతలకు ఓటేశారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. (క్లిక్: ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
మోదీ పవర్ఫుల్ లీడర్ అంటూ ప్రశంసించిన శశిథరూర్.. టెన్షన్లో కాంగ్రెస్..!
జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ శక్తివంతమైనా నాయకుడు అంటూ ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. శశిథరూర్ సోమవారం జైపూర్లో లిచరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై శశిథరూర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ క్రమంలోనే మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రియాశీల నేత అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపరంగా ఆయన చేసిన పనులు అభివర్ణించదగ్గవని అన్నారు. బీజేపీ విజయాన్ని మేము ఊహించలేదన్నారు. అంతలోనే తనదైన స్టైల్లో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ శక్తివంతమైన నాయకుడే కానీ.. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు దేశ ప్రజలను మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని సంచలన ఆరోపణలు గుప్పించారు. అది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించింది కానీ.. రానున్న రోజుల్లో మళ్లీ యూపీ ప్రజలే బీజేపీకి షాకిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిందని కితాబిచ్చారు. అలాగే, యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రియాంక గాంధీ తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు. కానీ, చివరకు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం యోగి భేటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సీఎం యోగి మొదటిసారిగా దేశ రాజధానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరపాటు వారి భేటీ కొనసాగింది. ముఖ్యంగా యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రానున్న సంవత్సరాల్లో యోగి హయాంలో యూపీలో అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం యోగి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్లతో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్లతోనూ సమావేశమయ్యారు. -
బీజేపీకే 54% హిందూ ఓట్లు
లక్నో: తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)–లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్వాదీకి ఓటేసినట్టు వివరించింది. అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్ యాదవ్ పలు హిందూ దేవాలయాలను సందర్శించడం తెలిసిందే. బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం ద్వారా హిందూ–ముస్లిం భావోద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. సమగ్రమైన శాంపిల్స్ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్డీఎస్ రీసెర్చ్ విభాగమైన లోక్నీతి కో డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. ► హిందూ ఓటర్లలో 54 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 2017లో ఇది 47 శాతమే. ► బీఎస్పీకి 14 శాతం, కాంగ్రెస్కు 2 శాతం హిందూ ఓట్లు దక్కాయి. ► ముస్లిం ఓటర్లలో ఏకంగా 79 శాతం మంది సమాజ్వాదీకే ఓటేశారు. 2017లో ఇది 46 శాతం మాత్రమే! ► బీజేపీకి 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. 2017లో ఇది 5 శాతమే. ► బీజేపీ కూటమి నుంచి గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం కూడా లేరు. ► బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెటివ్వలేదు. మిత్రపక్షం అప్నాదళ్ ఒకరికి అవకాశమిచ్చింది. ► బీఎస్పీకి 6 శాతం ముస్లిం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2017లో ఇది 19 శాతం ► 2017 కంటే 10 మంది ఎక్కువగా ఈసారి 34 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ► వీరిలో 31 మంది ఎస్పీ అభ్యర్థులే. మిగతా ముగ్గురు కూడా ఎస్పీ మిత్రపక్షాలు ఆరెల్డీ, ఎస్బీఎస్పీ తరఫున పోటీ చేశారు. -
కాంగ్రెస్ కు శత్రువు కాంగ్రెసే: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
-
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పంజాబ్లో ఎందుకు ఓడిపోయారు? నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్.. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ, ఎంఐఎం బీ టీమ్ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
యూపీలో బీజేపీ వ్యూహాలన్నీ సక్సెస్
-
మోదీ చేతికి వజ్రాయుధం.. తెరపైకి రాష్ట్రపతి ఎన్నికలు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్గా మారిందని లోక్సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 83,824, పంజాబ్లో 13,527, ఉత్తరాఖండ్లో 4,480, గోవాలో 800, మణిపూర్లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
యూపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టెన్షన్లో రాజకీయ పార్టీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్సైట్లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్జేపీ(ఆర్వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్బీ, ఐయూఎంఎల్, ఎల్జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్దళ్కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. -
యూపీలో మరోసారి ‘కమల’ వికాసం (ఫోటోలు)
-
యూపీలో బీజేపీ భారీ విక్టరీ.. సీఎం యోగి కామెంట్స్ ఇవే..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషించబోతున్నారు. యూపీ ప్రజలు యోగి సర్కార్పై నమ్మకంతో మరోసారి కాషాయ పార్టీకి అనూహ్య మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. యూపీలో ఎన్నికలు తొలిసారి ప్రశాంతంగా జరిగాయని ప్రశంసించారు. పార్టీలోని ప్రతీ ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పుతో యూపీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. దేశంలోనే యూపీని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు. -
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు. బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే.. 1. రామ మందిర నిర్మాణం.. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్తో ముందుకు సాగింది. 2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు.. యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్గా మారింది. 3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్.. ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి. 4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది. 5. ఫలించిన గో సంరక్షణ మంత్రం.. యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు.. 1. స్టార్ క్యాంపెయినర్లు కరువు.. ఎన్నికల ప్రచారంలో సమాజ్వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్గా మారింది. 2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. 3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర.. యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. 4. బీజేపీ వైపే జాట్, బ్రహ్మణ వర్గాలు.. యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది. 5. ఫలించని మేనిఫెస్టో.. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు. -
యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు చుక్కానిగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ నాయకత్వానికి మరింత దన్నుగా ఈ ఫలితాలు నిలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మరింత పెరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు తాజా ఫలితాలను జీర్ణించుకోవడం కష్టమే. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి. బీజేపీకి దీటుగా ఆప్ అయితే బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండటం ఆసక్తికర పరిణామం. పంజాబ్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన ఆప్.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి. భవిష్యత్తులో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి అవుతారని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇంచార్జి రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకుని సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
యూపీలో బీజేపీ జైత్రయాత్రకు ఈ రెండు అంశాలు కీలకం
-
భారీ ఆధిక్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్
-
‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినికాంత్ సింగ్ను సస్పెండ్ చేశారు. అయితే.. యూపీ పోలింగ్లో వాడిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తరలిస్తున్నారంటూ ఒక వీడియోను ఎస్పీ బహిర్గతం చేయడం తెల్సిందే. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు గురువారం స్పష్టతనిచ్చారు. ‘ అవి పోలింగ్లో వాడినవి కాదు. బుధవారం శిక్షణ కోసం వాడటం కోసం తీసుకెళ్తున్నారు. బుధవారం ఉదయం తరలించాల్సి ఉండగా ముందస్తు అనుమతిలేకుండా మంగళవారం రాత్రే తరలించారు. తరలింపులో నిర్లక్ష్యం వహించిన నళినికాంత్ సింగ్ను సస్పెండ్చేశాం’ అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ గురువారం చెప్పారు. ఈ అంశంలో ఈసీకి ఫిర్యాదుచేస్తామని, కోర్టుకెళ్తామని ఎస్పీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిని మీరట్లో ప్రత్యేకాధికారిగా, బిహార్ ముఖ్య ఎన్నికల అధికారిని వారణాసిలో ప్రత్యేకాధికారిగా ఈసీ నియమించింది. సొంత వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్ పేపర్లు లభించడంతో సోన్భద్ర జిల్లా రిటర్నింగ్ అధికారి రమేశ్ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రి లభించడంతో బరేలీ జిల్లా అదనపు ఎలక్షన్ ఆఫీసర్ వీకే సింగ్ను సస్పెండ్ చేశారు. చదవండి: పంచ తంత్రం.. గెలుపు ఎవరిదో? -
యూపీలో బీజేపీ భారీ విజయం: తాజా ఎగ్జిట్పోల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు కొత్త పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని.. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey UP AC 70 Locations 280 Sample size nearly 7000 (exact number awaited as some data yet to be added) Vote Share Estimate BJP+ 43% SP+ 35% BSP 15% Cong 3% Oth 4% Big win for BJP Margin of error 3%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరప్రదేశ్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 43 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ 15 శాతం, కాంగ్రెస్ 3 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సంపాదిస్తారని తెలిపింది. తాము అంచనా వేసిన దానికి 3 శాతం అటుఇటుగా ఫలితాలు రావొచ్చని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey findings PUNJAB No of AC 45 Locations 180 all sampled randomly, Sample size 4668, voters sampled randomly from voters list Vote share Estimate AAP 40% Cong 26% SAD+20% BJP+ 7% Oth 7% Big victory for AAP Margin of error 4%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి 29 శాతం, శిరోమణి అకాలీదళ్కు 20 శాతం, బీజేపీ, ఇతరులకు 7 శాతం చొప్పున ఓట్లు వస్తాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనా కట్టింది. తుది ఫలితాలు, ఎగ్జిట్పోల్కు మధ్య 4 శాతం వ్యత్యాసం ఉండొచ్చని తెలిపింది. (క్లిక్: ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్) Finding from Lokniti-CSDS Post Poll survey UTTARAKHAND No of AC 26 Locations 104, Sample size 2738, All sampled randomly Estimated Vote Share BJP 43% Cong 38% AAP 3% BSP 4% Oth 12% Should give a comfortable majority to BJP Margin of error 3%.@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కనుందని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్లో తేలిందని రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది గురువారం(మార్చి 10న) తేలనుంది. (క్లిక్: వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం) Lokniti-CSDS Post Poll survey GOA AC 20 location 80 sample size 2066 sampled from voters list Vote share estimate BJP 32% Cong 29% AITC+ 14% AAP 7% RG 8% Oth 10% Hung Assembly possible Margin of error 6% due to smaller sample & multi corner contest@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 -
సర్వేశ్వరుడికే తెలుసా ?
-
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
UP Exit Polls 2022: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?
ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీకి భారీగా తగ్గనున్న సీట్లు గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. సీఎంగా మళ్లీ ఆయనే కావాలి.. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య్నాధ్పై ఎక్కువ మంది యూపీ ప్రజలు మొగ్గు చూపారు. 38 శాతం మంది యోగి అనుకూలంగా ఉండగా, అఖిలేశ్ యాదవ్ కావాలని 33 శాతం మంది కోరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎంగా చూడాలని 16 శాతం మంది కోరుకోగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి అనుకూలంగా 6 శాతం మంది ఉన్నారు. (క్లిక్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు) ఎన్నికల ప్రధానాంశాలు ఇవే ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, లఖింపూర్ ఖేరీ ఘటన, కోవిడ్ వంటివి ఎన్నికల ప్రధానాంశాలుగా నిలిచాయి. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల బకాయిల అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని సర్వే వెల్లడించింది. పశువుల నుంచి పంటలను కాపాడే విషయాన్ని కూడా ఓటర్లు సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగి పాలనపై సంతృప్తి తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి. ఎవరెవరికి ఎన్ని ఓట్లు బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్పీకి 16 శాతం, కాంగ్రెస్ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అంచనా వేసిన కంటే 5 శాతం అటుఇటు ఉండొచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్జిట్పోల్స్ ప్రకారం.. బీజేపీ 138 నుంచి 140, సమాజ్వాదీ పార్టీ 235 నుంచి 240, బీఎస్పీ 19 నుంచి 23, కాంగ్రెస్ 12 నుంచి 16, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వస్తాయి. -
ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల పోలింగ్
-
పెట్రోల్ ట్యాంక్లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది’
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్ ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కూడా యూపీ చివర విడుత పోలింగ్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్కు రెండు రోజు ముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో రెండు రోజుల్లో యూపీ చివరి దశ పోలింగ్ ముగిస్తుందని ఈ క్రమంలో ముందస్తుగా పెట్రోల్ ట్యాంక్ను నింపుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం మళ్లీ పెట్రోలు రేట్లు అమాంతం పెరుగుతాయని సెటైర్లు వేశారు. ‘త్వరగా పెట్రోల్ ఫుల్ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లాక్ చేశాయని తెలిపారు. వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు. फटाफट Petrol टैंक फुल करवा लीजिए। मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU — Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడవ దశ(చివరి) పోలింగ్ సోమవారం ముగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధాపడి ఉంటుంది. ఎందుకంటే సుమారు 85 శాతం చమురు అవసరాలను భారత్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 118 రోజులు నుంచి భారత్లో ఇందన ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం వల్లనే చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. -
అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి బిగ్ షాక్
బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. గురువారం ఆయన ఎన్డీ టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్పూర్ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ అన్న విషయం తెలిసిందే. -
యూపీలో ఆరో విడత పోలింగ్
-
యోగి కోటలో హోరాహోరీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆరు, ఏడు దశల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇప్పటికే 292 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా సాగింది. గురువారం మరో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఏడో దశతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దేశ రాజకీయాలకు దిక్సూచి గా భావించే ఉత్తర ప్రదేశ్లో పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ చానళ్లు సహా దాదాపు 87 మీడియా, రీసెర్చ్ సంస్థలు ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ‘ఒకవైపు మాకు ఎన్నికల హడావుడి. ఇంకో వైపు సర్వే సంస్థల దరఖాస్తుల పరిశీలన. నా సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో సర్వేలు చేయడం ముందెన్నడూ చూడలేదు’ అని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీశ్ గుప్తా అన్నారు. బెట్టింగు సంస్థలు సైతం సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో యూపీ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయంటున్నారు. నేడు యోగి కోటలో పోలింగ్ నేడు ఎన్నికలు జరగనున్న 57 నియోజకవర్గాలు అంబేడ్కర్ నగర్ (5), బలరాంపూర్ (4), సిద్ధార్థ్ నగర్ (5), బస్తీ (5), సంత్ కబీర్ నగర్ (3), మహరాజ్గంజ్ (5), గోరఖ్పూర్ (9), ఖుషీనగర్ (7), దియోరియా (7), బలియా (7) జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అంబేడ్కర్ నగర్, బలియా మినహా మిగతా జిల్లాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బలమైన కోటలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ‘గతంలో గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన తరువాత యోగి వైఖరిలో చాలా మార్పు కన్పించింది. గోరఖ్పూర్, దాని సమీప జిల్లాల్లో అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని మోదీ సహకారం కూడా తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం యోగి బాబాకు మద్దతు పలుకుతోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఎస్పీ కూడా గణనీయంగా ఓట్లు పెంచుకుంటుందని మా అంచనాలో వెల్లడైంది’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.కె.శర్మ చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం తనకు హాబీ అని సుల్తాన్పూర్లో సాక్షి ప్రతినిధులకు తారసపడిన సందర్భంగా శర్మ తన అనుభవాలను నెమరేసుకున్నారు. ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో నిన్నటిదాకా సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్, యోగి విస్తృతంగా పర్యటించారు. ‘మా సభలకు విస్తృతంగా జనాలు వస్తున్నారు. అనూహ్య స్పందన కూడా ఉంది. కచ్చితంగా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. రాష్ట్ర నలు దిక్కులా మా తడాఖా ఏమిటో చూపించబోతున్నాం’ అని ఎస్పీ సీనియర్ నేత డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్ సభలకే కాదు, మోదీ, యోగి సభలకు కూడా భారీగా జనం వస్తున్నారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ అనూహ్య విజయాలు నమోదు చేసుకోబోతున్నదన్నదే రాజకీయ పండితులంతా చెపుతున్న మాట. ‘ఏమాత్రం అనుమానం లేదు. ఎస్పీ బాగా పుంజుకుంది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు. మరోసారి ప్రజలు యోగికే పట్టం కట్టబోతున్నారు’ అని సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆర్ ఈ వర్మ చెప్పారు. కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అసెంబ్లీ స్థానాలవారీగా ఓటర్ల సామాజిక గణనను పరిగణనలోకి తీసుకున్నాయి. నిర్దిష్ట కులం/మతానికి చెందిన అభ్యర్థి తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా, పొరుగు నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కూడా కుల, సామాజిక వర్గ ఓట్లు రాబట్టగలడని భావించి ఆ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెట్టాయి. కుల ప్రాతిపదికన సరైన అభ్యర్థులను నామినేట్ చేయడానికి యూపీలో పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కుల గణన ఆధారంగా ఓటర్ల పర్యవేక్షణకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్న కులాల ఆధారంగా టికెట్లు కేటాయించింది. ‘యూపీలో కులాల ప్రభావం ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏజంట్ల నియామకం ఆ ప్రాతిపదికనే జరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల కుల, మత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితాను ప్రచురించదు గనుక పార్టీలు దీని కోసం ప్రత్యేక కసరత్తు చేశాయి’ అని ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. సుల్తాన్ పూర్ (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: -
ఉత్తర ప్రదేశ్లో ముగిసిన ఆరో దశ పోలింగ్
-
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ను ఓడించిన తేజ్నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
బీజేపీని ఆపే సత్తా లేదు: ఒవైసీ
బలియా: బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్కు లేదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్తో జతకట్టారని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు. అయినా రెండు మార్లు బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. మైనార్టీలు తమ కూటమి (బీఎస్ఎం)కి మద్దతు ఇవ్వాలని, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఫుట్బాల్లాగా మారవద్దని కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడం తమ కూటమి వల్ల మాత్రమే సాధ్యమన్నారు. -
చిల్లూపార్పైనే అందరి దృష్టి.. 37 ఏళ్లుగా వారిదే ఆధిపత్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన చిల్లూపార్ విధానసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 37 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గం చేతి నుంచి బయటికి వెళ్లని ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కమలదళం విజయం సాధించలేదు. దీంతో చిల్లూపార్లో కాషాయ జెండా ఎగరవేయాలని సీఎం యోగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోరఖ్పూర్ జిల్లాలోని కీలకమైన ఈ నియోజకర్గంలో సీనియర్ నేత హరిశంకర్ తివారీ హవా కొనసాగుతుండడం, బ్రాహ్మణుల ఓట్లు చీలడంతో ఫలితం ఆసక్తికరంగా మారనుంది. ఆధిపత్యం కొనసాగేనా..? చిల్లూపార్ అసెంబ్లీ స్థానానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1985 నుంచి 2007 వరకు వరసగా 22 ఏళ్లు హరిశంకర్ తివారీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజేష్ త్రిపాఠి చేతిలో హరిశంకర్ ఓడిపోయారు. ఆ తర్వాత హరిశంకర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వినయ్ శంకర్ సమాజ్వాదీ పార్టీ టికెట్పై బరిలో దిగారు. 2017లో తొలిసారిగా చిల్లూపార్ నుంచి బీఎస్పీ టికెట్పై వినయ్ శంకర్ తివారీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎస్పీ తరఫున వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ త్రిపాఠి బీజేపీ తరపున, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్ పెహల్వాన్, కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనియా శుక్లా బరిలో దిగారు. చిల్లూపార్ అసెంబ్లీ స్థానంలోని 4.31 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు 1.05 లక్షలు. దళిత, నిషాద్ ఓటర్లు కూడా నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. దీంతో బ్రాహ్మణ, దళిత, యాదవ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంది. -
గాంధీల అడ్డాలో కాంగ్రెస్కు కష్టమే!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, గాంధీ కుటుంబం దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న రాయ్బరేలీ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాయ్బరేలీలో నాలుగో విడతలో భాగంగా ఫిబ్రవరి 23న పోలింగ్ పూర్తవగా వారణాసిలో ఆరు, ఏడు విడతల్లో మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండుచోట్లా భిన్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోదీ ప్రాతినిధ్యంలో గత ఎనిమిదేళ్లలో వారణాసి అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తే అంతకుముందు పదేళ్ల యూపీఏ హయాంలో రాయబరేలిలో సాధించిన అభివృద్ధి శూన్యమనే అభిప్రా యం స్థానికుల్లో బాగా ఉంది. అభివృద్ధి నినాదం తోనే వారణాసిలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మరో రెండు విడతలు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్కు కష్టకాలం గత బుధవారం పోలింగ్ ముగిసిన రాయ్బరేలీలో ప్రస్తుతమున్న రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాంగ్రెస్ కోల్పోవచ్చంటున్నారు. ‘‘గాంధీ కుటుంబంపై మాకిప్పటికీ ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ కుటుంబం రాయ్బరేలీ ప్రజలకు చేసిందేమీ లేదు. 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉండి కూడా మాకు కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు’ అని కిషన్ సింగ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడి ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఈసారి ఒక్కటైనా గెలిచే పరిస్థితి లేదని రాయబరేలీ బస్టాండ్ సమీపంలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుస్తున్న మొహియుద్దీన్ అన్నాడు. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతమేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇందిరాగాంధీ పోటీ చేసిన నాటి నుంచి మొన్నటి 2017 అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్కే ఓటేస్తూ వచ్చా. ఈసారి మాత్రం విధిలేక వేరే పార్టీకి వేశా’’ అని చెప్పాడు. 70 ఏళ్లుగా పార్టీనే గెలిపిస్తూ వచ్చిన ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. యువ గాంధీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం స్థానికంగా కనిపిస్తోంది. ‘కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ కుటుంబం మమ్మల్ని చూసింది. ఇక మేము మా పంథా మార్చుకోక తప్పలేదు’ అని కిరాణ వ్యాపారి రాంగోపాల్ గుప్తా చెప్పారు. పోటీ నామమాత్రమే రాయ్బరేలీ లోక్సభ స్థానం పరిధిలోని రాయ్బరేలీ సదర్, బచ్రావన్, హర్చంద్పూర్, సరేనీ, ఉంచహర్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గత వారం పోలింగ్కు ముందు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా పెద్దగా లాభించలేదని పోలింగ్ అనంతర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై తాను ఇక్కడి నుంచి పోటీ చేసేదీ లేనిదీ భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి. రాయ్బరేలీ ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందన్న భరోసా కల్పించలేకపోయారన్న భావన వ్యక్తమైంది. ఇక్కడ బీజేపీ నుంచి అమిత్షా, ఎస్పీ నుంచి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రచారానికి రాగా రాహుల్గాంధీ మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. ‘ఇందిర హయాంలో రాయ్బరేలీ వాసులు ఢిల్లీ వెళ్లినా బాగా చూసుకునేవారు. సోనియా వచ్చాక పరిస్థితులు మారాయి. రాహుల్, ప్రియాంకల తరం వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు’ అని రఘునాథ్ మిశ్రా అనే స్థానిక వ్యాపారి అన్నాడు. రాయ్బరేలీ సదర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదితీసింగ్పై స్థానిక కేడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాశీ.. మోదీ సహవాసి ఈశాన్య యూపీ పరిధిలోని వారణాసి లోక్సభ స్థానంలో 8 అసెంబ్లీ సీట్లున్నాయి. ఆరింట బీజేపీ, రెండింట్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. వీటిల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2 నుంచి 5 దాకా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. వారణాసి పరిధిలో ఆయన ప్రచారం ఈశాన్య యూపీలోని 111 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని అంచనా. రాయ్బరేలి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి -
యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
‘యుద్ధాన్ని ఆపేందుకు ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీ సాయాన్ని కోరారు’
Everyone Wants PM Modi's Help: ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుల్లియా ప్రచార ర్యాలీలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ హేమా మాలిని ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతి ఒక్కరూ మోదీ జీ మీరు జోక్యం చేసుకోండి అని కోరారు అని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభ్యర్థించారంటేనే నిజంగా ప్రపంచం ఆయనకు ఎంతగా గౌరవం ఇస్తుందో తెలుస్తోందన్నారు. పైగా ఇది మనకు చాలా గర్వకారణం అని ప్రశంసించారు. ఆయన తనకంటూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దేశాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. అంతేకాదు ఆ ప్రచారా ర్యాలీ మొత్తం డబుల్ ఇంజన్కి సర్కార్ నినాదం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ను మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నాయకత్వాన్ని సైతం ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ చేసిన సోషల్ మీడియా ప్రచారాల్లో ప్రపంచ నాయకుడిగా పీఎం మోదీ ఔన్యత్యాన్ని గురించి చాటి చెప్పిందన్నారు. ఈ మేరకు మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి డయల్ చేసి, "తక్షణ హింసను నిలిపివేయాలని" విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి తమ పౌరులు సురక్షితంగా వచ్చేందుకే భారత్ అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుందని కూడా నొక్కి చెప్పారని అన్నారు. రష్యా, నాటో సమూహం మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయన్న తన దీర్ఘకాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం) -
UP Election: ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన తల్లి గురించి మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..?
లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలపై పరోక్షంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాను, ఆయన తల్లి (హీరాబెన్ మోదీ) వ్యాక్సిన్ తీసుకున్నామన్నారు. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని చెప్పారు. ఆమె వంతు వచ్చినప్పుడే వాక్సిన్ తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజవంశీకులతో పోల్చి.. వారైతే నిబంధనలు పాటించుకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా అందించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీలో ఫిబ్రవరి 27న ఐదో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం
లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన పాజిటివ్ మూడ్ను యూపీ విజయం సెట్ చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2024 రోడ్మ్యాప్’ పేరిట బీజేపీ కేంద్ర కమిటీకి రెండు నెలల క్రితం ఆర్ఎస్ఎస్ సమర్పించిన విధాన పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని ఆ పత్రంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. నాలుగు విడతలపై జోరుగా అంచనాలు 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో నాలుగు మూడు విడతల్లో ఇప్పటిదాకా 231 చోట్ల పోలింగ్ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్వాదీ–ఆర్ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు తేలుతోంది. పోలింగ్ జరిగిన 172 స్థానాలను అవి సగానికి కాస్త అటు ఇటుగా పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. మొత్తమ్మీద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సమీకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని అమర్ ఉజాలా దినపత్రిక లక్నో అసోసియేట్ ఎడిటర్ సుమంత్ పాండే అన్నారు. ‘‘బీజేపీ, ఎస్పీ–ఆర్ఎల్డీ మధ్య హోరాహోరీ సాగుతోంది. మా అంచనా ప్రకారం బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముంది’’ అని పాండే వివరించారు. మూడో పార్టీ గానీ, ఇతరులు గానీ సాధించే 10, 15 సీట్లు మెజారిటీకి కీలకమైనా ఆశ్చర్యం లేదన్నారాయన! చదవండి: (ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!) పశ్చిమ యూపీలో ఎస్పీ ఆధిక్యం అంతంతే! మొదటి రెండు దశల పోలింగ్పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్ఎల్డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్ సామాజిక వర్గం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. అది 20–25 స్థానాలకు దాటకుండా చూడటంలో బీజేపీ సఫలమైందని విశ్లేషకుల అభిప్రాయం. మూడో విడత పోలింగ్ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్ నడిచిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా. కాయ్ రాజా కాయ్! యూపీ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారం ఎవరిదన్న అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, ముంబయి, నోయిడా, అహ్మదాబాద్ కేంద్రాలుగా రూ.3 వేల కోట్ల మేరకు ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగులు సాగినట్లు యూపీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్ను ఛేదించేందుకు సహకరించాలంటూ మహారాష్ట్ర పోలీసుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రతి దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నదానిపై బెట్టింగ్లు నడుస్తున్నాయి. పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 50 శాతంలోపు సీట్లు వస్తాయని బెట్టింగులు పెడితే రూపాయికి రెండు రూపాయలు, అంతకు మించి వస్తాయన్న వారికి రూపాయికి రూపాయిన్నర లెక్కన బెట్టింగులు సాగుతున్నాయి. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కాస్తున్న వారికి రూపాయికి రూపాయి, ఎస్పీ గెలుస్తుందన్న వారికి రూపాయిన్నర బెట్టింగు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. -
Sakshi Cartoon: ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు...
ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు... -
మళ్లీ తళుక్కున మెరిసిన ‘పోలింగ్’ బ్యూటీ.. ఆమె ఫాలోయింగ్ మామూలుగా లేదు!
లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో పోలింగ్ బూత్కు వచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన రీనా ద్వివేది గుర్తుందా? తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్గా ఉన్న రీనా ఈ సారి టాప్లో విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం రీనా ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత జరుగుతున్న సందర్భంగా పోలింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె స్లీవ్లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ బూత్కు విధుల నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. తన తోటి ఉద్యోగులు ఆమె ఫోలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీర ధరించి విధులకు హాజరైన రీనా తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరిని ఆకట్టుకున్నారు.ఆ సమయంలో ఆమె ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సోషల్మీడియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం రీనా ద్వివేదికి ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లఖ్నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా రీనా పని చేస్తోంది. -
Live Blog: ఉత్తర్ ప్రదేశ్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
అనూహ్య సంఘటన.. బీజేపీ నేత పాదాలు మొక్కిన మోదీ.. ఎందుకంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత అవదేశ్ ప్రధాని పాదాలను తాకేందుకు కిందికి వంగారు. మోదీ వెంటనే ఆయనను వారించారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన రాజాసింగ్పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. చదవండి: (రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే) అయితే గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈసీ షాక్
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతే కాదు 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని రాజాసింగ్పై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులుపై జవాబు చెప్పేందుకు సమయం కావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి ఓటు వేయకుంటే జేసీబీలు, బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే రాజా సింగ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. -
పశ్చిమ యూపీ... కాషాయానికి కీలకం!
ఉత్తరప్రదేశ్లో అప్పుడే తమ విజయావకాశాల మీద పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలైన పరీక్ష అవి ఇంకా దాటాల్సే ఉంది. ఏడు దశలుగా జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 10, 14 తేదీల్లో రెండు దశలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ 20న జరగనుంది. ఈ దశ బరిలో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 70 ఏళ్ల ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన ముఖ్యమంత్రులు లేరు. మరి ఆ రికార్డును యోగి ఆదిత్యనాథ్ బద్దలుకొడతారా? ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఢిల్లీ ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలిప్పుడు దేశా ద్యంతం హాట్ టాపిక్! సాధారణ ఎన్నికల సెమీఫైనల్స్గా పరిగణిస్తారు వీటిని. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయాల తీరు తెన్నులను నిర్దేశిస్తాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఏకంగా పది హేను కోట్ల ఓటర్లు, 1.70 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 403 మంది ఎమ్మె ల్యేలను ఎన్నుకునేందుకు ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు ముగిశాయి. మూడో దశ ఓటింగ్కూ సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమైనవి అనడంలో సందేహం ఏమీ లేదు కానీ... యూపీలో గెలుపు ఢిల్లీ పీఠాన్ని సులువు చేస్తుందన్న మీడియా కథనాల్లో కొంత అతిశయోక్తి ఉందేమో! యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్కు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలేవీ లేని విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2022 యూపీ ఎన్నికల నగారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాటల యుద్ధంతోనే మొదలైందనవచ్చు. ఫిరాయింపులు, మతోన్మాదంతో కూడిన ప్రకట నలు, రాజకీయ ఆధిపత్యం కోసం పోటాపోటీ ఈ తాజా ఎన్నికల తీరు. కుల, కూటమి రాజకీయాలకు ప్రాధాన్యం దక్కే ఉత్తరప్రదేశ్లో ప్రతి పార్టీ తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అధికా రాన్ని అందుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కాషాయ సునామీలో భారతీయ జనతా పార్టీ మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుంది. బీజేపీ కూటమి సభ్యులైన అప్నా దళ్ (సోనోలాల్) తొమ్మిది స్థానాలు, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నాలుగు స్థానాలు దక్కించు కున్నాయి. సమాజ్వాదీ పార్టీ 22 స్థానాలు, కూటమి భాగస్వామి కాంగ్రెస్ ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 22 శాతం ఓట్లతో 19 సీట్లు దక్కించుకుంది. అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా సాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి చరిత్ర సృష్టిం చాయనడంలో సందేహం లేదు. ఓపీనియన్ పోల్స్ చెబుతున్నదేమిటి? ఉత్తరప్రదేశ్లో ఈసారి ఎన్నికలు భిన్న పరిస్థితుల్లో జరుగుతున్నా యని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం బరిలోకి దిగు తూండటం ఒక ప్రత్యేకత కాగా... కూటమి సమీకరణల్లోనూ మార్పులు వచ్చాయి. పోటీ బహుముఖంగానే కనిపిస్తోంది కానీ... తరచి చూస్తే ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల కూటమి మధ్యే అన్నది అర్థమవుతుంది. నిర్బన్ ఇండియన్ సోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్), అప్నాదళ్ (సోనేలాల్)లతో బీజేపీ పొత్తు పెట్టుకోగా... ఆర్ఎల్డీ, ఎస్బీఎస్సీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ (లోహియా)లతో కలిసి ఎస్పీ బరిలోకి దిగింది. బీఎస్పీ కూడా చిన్న, చితక పార్టీలతో కలిసి పోటీ చేస్తూండగా, కాంగ్రెస్ మాత్రం ఒంటరి పోటీకి సిద్ధమైంది. ఓటింగ్ మొదలు కాకముందు నిర్వహిం చిన అనేక ఓపీనియన్ పోల్స్ బీజేపీ 225–267 సీట్లతో విజయం సాధిస్తుందని అంచనా కట్టాయి. ఎస్పీ 111–160 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమవుతుందనీ, బీఎస్పీ, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తాయనీ లెక్కకట్టాయి. అయితే చరిత్రను ఒకసారి పరి శీలిస్తే ఉత్తరప్రదేశ్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఫలించిన సందర్భాలు తక్కువే. 2007, 2012లలో ఒపీనియన్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా బీఎస్పీ, ఎస్పీలు స్పష్టమైన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయాన్ని ఒపీనియన్ పోల్స్ కరెక్టుగానే అంచనా వేశాయి. కానీ మోదీ వేవ్ను మాత్రం స్పష్టంగా చూడలేకపోయాయి. మూడు వందలకు పైగా సీట్లు సాధి స్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కుల, మత, కూటమి రాజకీయాలు... ఉత్తరప్రదేశ్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా రాష్ట్రంలోని కుల, మత సమీకరణలు, భావసారూప్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసు కునే కూటమి మిత్రులను ఎంచుకుంటాయి. యూపీ ఓటర్లలో 41% మంది ఓబీసీలు, 21% మంది దళితులు ఉండగా... ముస్లింలు, అగ్ర వర్ణాల వారు 19% చొప్పున ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలో పేతం కాకమునుపు వరకూ ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలు, దళిత, ముస్లిం వర్గాల సాయంతో కాంగ్రెస్ పెత్తనమే చలాయించింది. బీఎస్సీ, ఎస్పీల రాకతో ఈ కుల సమీకరణకు గండి పడింది. సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. దళితుల్లో అధికులు బీఎస్పీ వైపు వెళ్లిపోగా, జనాభాలో తొమ్మిది శాతమున్న యాదవులు ఎస్పీకి ప్రధాన ఓట్బ్యాంక్గా మారారు. ముస్లింలలో అధికశాతం మంది ఎన్నికల వాతావరణానికి అనుగుణంగా బీఎస్పీ, ఎస్పీలకు మద్ద తిచ్చారు. గెలుపునకు కావాల్సిన సరైన కుల సమీకరణలు చేపట్టిన ప్రాంతీయ పార్టీలకు 2014 సాధారణ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. అగ్రవర్ణాలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలు, ఎస్సీలను కలుపుకొని బీజేపీ అత్యధిక శాతం లోక్సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి సంస్థా గతమైన బలం చేకూరడం, కులాల ఆధారంగా కూటములు ఏర్పాటు చేసుకోవడం, హిందుత్వ రాజకీయాలన్నీ కలిపి ఆ పార్టీకి 2017లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించాయి. రెండేళ్ల తరువాత జరి గిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ అగ్రవర్ణాలు, యాదవులు, జాటేతర దళితులను మినహాయించి ఓబీసీల్లోని కొన్ని ఉపకులాలను తనవైపు తిప్పుకుంది. హిందుత్వ వాదనతో ఈ ఎన్నికలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీ కూడా యాదవుల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు చెందిన పార్టీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కాషాయ పార్టీ పాలనలో బ్రాహ్మణ వర్గం ఒంటరి అయ్యిందన్న వాదనను తన విజయావకాశాలను మెరుగుపరచు కునేందుకు ఉపయోగిస్తోంది. ఆర్ఎల్డీతో పొత్తుతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో ఆధిపత్యం చలాయించే జాట్ల ఓట్లు తమకు దక్కుతాయని ఎస్పీ భావిస్తోంది. 2013 మతఘర్షణల తరువాత జాట్లు బీజేపీ వైపు మొగ్గిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆందోళనల నేపథ్యంలో బీజేపీ–జాట్ల బంధం బలహీనమైందన్న వాదనలు ఉన్నాయి. రాజ ధాని ఢిల్లీకి సమీపంలోని 113 యూపీ అసెంబ్లీ స్థానాల్లో జాట్లు, ముస్లింలు తమ విజయానికి దోహద పడతారని ఎస్పీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహిస్తున్నారు. నలభై శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 70 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా? ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ప్రభా వితం చేయగల అంశాల్లో పాలనకు సంబంధించినది ప్రధానమైంది కాగా... నేతృత్వం, ఎన్నికల మ్యాని ఫెస్టోలు తమ వంతు ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందనీ, నేరాలు తగ్గాయనీ, మహిళలకు భద్రత లభిస్తోందనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. మౌలిక సదుపాయాల వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తక్షణ అమలు, పెట్టుబడులు పెరగడం, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పూర్తి కావడం తమకు విజయం తెచ్చి పెడతాయని బీజేపీ అంచనా. అయితే ఈ అంశాలతో ఏకీభవించని పార్టీలు దళితులు, మహిళలు, మైనారిటీలపై పెరుగుతున్న అత్యాచారాలను ఓటర్ల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రెండో దశ కోవిడ్ నిర్వహణలో వైఫల్యం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వంటివి ప్రతిపక్షాల ఆయుధాలుగా మారాయి. ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండుసార్లు గెలి చిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ ఎవరూ లేరు. బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఈ రికార్డును బద్దలు కొట్టగలరా? చెప్ప లేము. ఎందుకంటే తమిళనాడు, కేరళల్లోనూ దశాబ్దాల పోకడలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీ అధి కారంలో ఉండటం ఆ పార్టీకి కొంతవరకూ కలిసి రావచ్చు. బీజేపీ యేతల పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో ఎస్పీ తది తర పార్టీలు విఫలం కావడమూ కాషాయ పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎస్పీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అనేందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది బీజేపీ కుల సమీకరణలు, హిందుత్వ అజెండాకు సెంట్రల్, తూర్పు ఉత్తర ప్రదేశ్లో ఆదరణ తగ్గకపోవడం. పశ్చిమ యూపీలోనూ జాట్ల కోపాన్ని తగ్గించేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను ఇంటింటి ప్రచారం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మోదీ ప్రభావం కొంత ఉండవచ్చు. పశ్చిమ యూపీలో ఎస్సీ తదితర పార్టీలు ఆశిస్తున్నట్లుగా జాట్– ముస్లిం ఓట్ల ఏకీకరణ ఎంతవరకూ జరుగుతుందన్నది ఇంకో ప్రశ్న. జాట్ల ప్రతినిధిగా నిలవాలని అను కుంటున్న ఆర్ఎల్డీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది. మొత్తమ్మీద చూస్తే... ఈ సారి ఎన్నికల్లోనూ ఓటర్ల మద్దతు కాషాయ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ గూండారాజ్ను అంతమొందించగలిగామన్న బీజేపీ వాదనకు ఓటర్లు జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికలు బీజేపీ పాలనకు ఒక రిఫరెండమ్ అనుకుంటే రెండు రకాల ఫలితాలు వచ్చే సంభావ్యత ఉంది. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి పశ్చిమ యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే నిజమైతే, బీజేపీ కూటమికి దక్కే సీట్ల సంఖ్య 250 కంటే దిగువకు చేరుతుంది. బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రగతి‘ని ఓటర్లు చూడగలిగి, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి ఓటర్లను తమవైపు మళ్లించుకోవడంలో విఫలమైతే బీజేపీకి 250 కంటే ఎక్కువ సీట్లు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. అయితే యూపీ రాజకీయాలను కచ్చితంగా అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా రావచ్చు! వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
సొంతపిచ్పై...అఖిలేశ్కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్సింగ్ బఘేల్ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
సీఎం కావాలా.. రెండవ కిమ్ కావాలా?
లఖింపూర్: ముఖ్యమంత్రి కావాలో, రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యతిరేకంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని టికాయిత్ అన్నారు. తన స్వస్థలమైన ముజఫర్నగర్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవు. ముజఫర్నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్లకు స్టేడియం కాద’ని టికాయిత్ ట్వీట్ చేశారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, జిన్నా గురించి మాత్రమే కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ‘పీటీఐ’తో అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకునేలా ఉద్యమించడంలో టికాయిత్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. (క్లిక్: పంజాబ్ లో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ) -
రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందేని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. ‘యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు. చదవండి: (అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!) -
యూపీ రెండో దశ ఎన్నికల పోలింగ్
-
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
-
పంజాబ్లో ఆప్... ఉత్తరాఖండ్లో బీజేపీ?
ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్(ఫిబ్రవరి 20), ఉత్తరాఖండ్(నేడు)లలో ఒకే విడతలో జరగనున్న ఓటింగ్లో పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగిన రైతుల ఉద్యమం ఎటూ కీలకపాత్ర పోషించనుంది. పంజాబ్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పలేం. ఇక ఉత్తరాఖండ్లో బీజేపీ గెలిచే అవకాశం కనబడుతున్నా, ఆమ్ ఆద్మీ ఇక్కడా కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యేకం. భారతదేశ రాజకీయాల్లో పంజాబ్, ఉత్తరా ఖండ్ కొంత ప్రత్యేకం. సామాజిక వర్గాల ఆధిపత్యం పార్టీల తీరుతెన్నులపైనా ప్రభావం చూపే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి. చరిత్రను తరచిచూస్తే పంజాబ్ జనాభాలో 58 శాతం ఉన్న సిక్కులు రాజకీయంగానూ బలవంతు లన్న విషయం స్పష్టం. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే... అరవై శాత మున్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ వర్గాల వారే. ఉత్తరాఖండ్లో నేడు, పంజాబ్లో ఫిబ్రవరి 20న జరిగే ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగే అవకాశాలు మెండు. భారత రాజకీయాల్లో కుల, మతాధిపత్యాల ఆధారంగా వివక్ష చాలాకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమీప భవి ష్యత్తులో అంతమవుతుందని కూడా అశించలేము. పంజాబ్, ఉత్తరా ఖండ్ రెండింటిలోనూ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రు లనూ మార్చాల్సి వచ్చింది. కాంగ్రెస్ పంజాబ్లో ఒకసారి ముఖ్య మంత్రిని మారిస్తే, ఉత్తరాఖండ్లో బీజేపీ రెండుసార్లు ఈ పని చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఎక్కువగా పాల్గొ న్నారు) కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఇప్పుడు ఈ అంశం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అంశంగానూ మారింది. ఈ ఉద్యమం సందర్భంగా రాజధానిలో జరిగిన ఘటనలు కొన్ని పంజాబ్లో దళితులందరూ (32 శాతం జనాభా) ఒకవైపునకు కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడింది. ముఖాముఖి నుంచి బహుముఖానికి... పంజాబ్లో చాలావరకూ ముఖాముఖి పోటీలే జరిగేవి. శిరో మణి అకాలీదళ్–బీజేపీల కూటమి ఒకవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు నిలబడగా సాగిన పోటీలకు 2017లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో తెరపడినట్లు అయ్యింది. పోటీ త్రిముఖమైంది. రావి, బియాస్ నదుల మధ్యలో ఉండే మాఝా ప్రాంతంలో గురు ద్వారాలు, డేరాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూంటాయి. దోబా విషయానికి వస్తే ఇది ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే ప్రాంతం. బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత జనాభాలో దళితులు (37 శాతం), చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. సట్లెజ్కు ఆవల ఉండే మాల్వా ప్రాంతం జమీందార్లు, పెద్ద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 2017లో కాంగ్రెస్ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 77 గెలుచుకుని విజయం సాధించగా... వచ్చిన ఓట్లు దాదాపు 39 శాతం. మాల్వా ప్రాంతంలోని 69 స్థానాల్లో కాంగ్రెస్ 40 చేజిక్కించుకుంది. అలాగే మాజాలోని 25 స్థానాల్లో 22, దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో 15 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో 20 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసక్తి కరంగా ఈ పార్టీ మాల్వా ప్రాంతంలో 18, దోబాలో 2 స్థానాలు గెలు చుకోవడమే కాకుండా... మొత్తమ్మీద 23 శాతం ఓట్లు సాధించ గలిగింది. అప్పట్లో అధికార పక్షం శిరోమణి–బీజేపీ కూటమికి 31 శాతం ఓట్లు దక్కినా... సాధించిన సీట్లు మాత్రం 18 మాత్రమే. ఇప్పుడు పోటీ త్రిముఖ స్థాయి నుంచి బహుముఖానికి మార డంతో రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ మార్పునకు రంగం సిద్ధమవు తోంది. ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్న అంశాలు కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, ఇసుక, మద్యం, కేబుల్ మాఫియా సమస్య, నిరుద్యోగం, రైతు సంక్షోభం, అవినీతి, పెరిగిపోతున్న ప్రభుత్వ రుణాల వంటివి ప్రధానాంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో అంశం గురుద్వారాలో మతగ్రం«థాలకు జరిగిన అవమానం. నాయ కత్వ స్థాయిలో కుమ్ములాటల వంటి సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నిన్నమొన్నటివరకూ చెల్లాచెదురుగా ఉన్నా... పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రకటనతో ఈ కుమ్ములాటకు కొంతవరకూ తెరపడింది. కానీ పాలనపరమైన వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చన్నీ, సిద్దూలతో కులాలు, మతాల ఆధారంగా రాజకీయ సమీకరణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీ అవకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. రాష్ట్రంలో దళితులు 32 శాతం వరకూ ఉండగా... జాట్లు 20 శాతం వరకూ ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు పైనున్నా ఇది జాట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం కాంగ్రెస్ వెన్నంటే ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ద్వారా కాంగ్రెస్ను నేరుగా ఢీకొంటోంది. మాన్, కేజ్రీవాల్లు ప్రకటించిన పది అంశాల అభివృద్ధి ప్రణాళిక మాల్వా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో లాభాలు తెచ్చి పెట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బీజేపీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)తో కలసి ఈసారి బరిలోకి దిగు తోంది. శిరోమణి నుంచి వేరుపడ్డ వర్గపు పార్టీ శిరోమణి (సంయుక్త) కూడా కాషాయ పార్టీ కూటమిలో భాగంగా ఉంది. బీజేపీ ఈ సారి 65 స్థానాల్లో పోటీ చేస్తూండగా పీఎల్సీ 38 స్థానాల్లో, శిరోమణి (సంయుక్త) 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. హిందూ, సిక్కు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ కూటమి ప్రయత్ని స్తోంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, బోర్డర్ సెక్యూరిటీ అంశాల ఆధారంగా మాజా ప్రాంతంలో పట్టు సాధించే దిశగా అడుగు లేస్తోంది. సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి ఎన్డీయే నుంచి వేరుపడ్డ తరువాత ఈసారి ఎన్నికల కోసం బీఎస్పీతో జట్టు కట్టింది. రైతు ఉద్యమంలో భాగమైన 22 యూనియన్లతో ఏర్పాటైన సంయుక్త సమాజ్ మోర్చా బి.ఎస్.రాజేవాలా నేతృత్వంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం పంజాబ్లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకా శాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకా శాలు తక్కువ. కాకపోతే బహుముఖ పోటీ నేపథ్యంలో ఓట్లు ఎలా చీలతాయో చెప్పడం కొంత కష్టమే. 1972 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎల్లప్పుడూ ఒక పార్టీ లేదా కూటమి వైపే మొగ్గారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. దేవభూమిలో రసవత్తర రాజకీయం... ఉత్తరప్రదేశ్ నుంచి వేరు చేయగా ఏర్పడ్డ పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేడు ఓటింగ్ జరగనున్న ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2017లో మోదీ హవా కారణంగా బీజేపీ 47 శాతం ఓట్లతో మొత్తం 57 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ట్ర నాయకత్వం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీ విశ్వసనీయతను కొంతవరకూ దెబ్బతీశాయి. ఐదు నెలల కాలంలోనే మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, కుంభమేళా సందర్భంగా కోవిడ్ నిర్వ హణలో వైఫల్యాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం, పర్వతప్రాంతాల నుంచి ప్రజల వలసలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే యువ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ యువ ఓటర్లను ఆకర్శించగలడనీ, మోదీ–యోగీ వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించవచ్చుననీ బీజేపీ ఆశలు పెట్టుకుని ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో కొంతవరకూ కోలుకుందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ఉత్తరాఖండ్ ఎన్నికల చరిత్ర తమకు అవకాశం కల్పిస్తాయన్న ఆశతో కాంగ్రెస్ ఉంది. ఒక పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టే చరిత్ర ఇక్కడ లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందా అన్నది ఒక ప్రశ్న. పార్టీలో వర్గాలు, అంతర్గత కుమ్ములాటలు ఇందుకు కారణం. ఓట్షేర్ విషయంలో బీజేపీతో ఉన్న 13 శాతం అంతరాన్ని అధిగమిం చడం కాంగ్రెస్కు ఈసారి కొంత కష్టమే కావచ్చు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రచారం, రైతు ఉద్యమం కారణంగా రైతుల్లో నెలకొన్న అసం తృప్తి వంటి అంశాలు రాష్ట్రంలోని టెరాయి ప్రాంతంలోని తొమ్మిది స్థానాల్లో తమకు ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ రైతులు, సిక్కులు అధిక సంఖ్యలో ఉంటారు. రెండు జాతీయ పార్టీల హోరాహోరీ పోరు మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ తరహాలోనే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, యువతకు నెలకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పద్ధెనిమిదేళ్ళు పైబడ్డ మహిళలకు నెలకు రూ.1000 పంపిణీ వంటి హామీలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. సీఎం అభ్యర్థిగా ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన అజయ్ కొతియాల్ను ఎంపిక చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నిర్వహించిన సర్వేల ప్రకారం... ఈసారి ఉత్తరాఖండ్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాత్రమే. కాకపోతే ప్రధాన పార్టీలు రెండూ తగినంత మెజార్టీ సాధిం చలేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
ప్రచార సమయం పెంపు.. పాదయాత్రలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రచార సమయాన్ని రోజుకు నాలుగు గంటలు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ఈ ప్రచార వేళలను ఈసీ ఉదయం 6 నుంచి రాత్రి పది గంటలకు వరకు పొడిగించింది. ఫలితంగా అభ్యర్థులు, పార్టీలకు రోజుకు నాలుగు గంటలపాటు అదనంగా ప్రచార సమయం లభించనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జనవరి 8న షెడ్యూల్ను ప్రకటిస్తూ కోవిడ్–19 కారణంగా ఈసీ పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ర్యాలీలు, రోడ్షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఈసీ క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. యాభై శాతం సామర్థ్యానికి పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈసీ శనివారం తెలిపింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆంక్షలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, బహిరంగ వేదికల్లో సమావేశస్థలి సామర్థ్యంలో ఎంత శాతం మందిని అనుమతించాలనే విషయంలో ఈసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు పెట్టిన పరిమితుల్లో ఏది తక్కువగా ఉంటే.. అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ఇక్కడ గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమట..!
కస్గంజ్: ఉత్తరప్రదేశ్లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్గంజ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్గంజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్పాల్ సింగ్ కస్గంజ్లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది. -
వాళ్లకు బెయిలు.. మాకు జైలు
ఓటమి భయంతో సాకులు.. ఉత్తరప్రదేశ్లో కాషాయ జెండా ఎగురుతుందని గురువారం నాటి తొలి దశ పోలింగ్ తర్వాత అందరికీ అర్థమైంది. అందుకే కుటుంబ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది. తమ పని అయిపోయిందన్న భయంతోనే ఎన్నికల కమిషన్ను, ఓటింగ్ మిషన్లను తప్పు పడుతున్నారు. – ప్రధాని నరేంద్ర మోదీ (కస్గంజ్, ఉత్తరప్రదేశ్) మోదీకి చరిత్ర తెలియదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చరిత్రపై అవగాహన లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలీదు. అందుకే పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తికి 15 ఏళ్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్ను ఆడిపోసుకున్నారు.స్వాతంత్య్ర సమరయోధులు, విద్యావేత్తల కంటే ప్రధానికి ఎక్కువ తెలుసా? పర్యావరణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి గోవా ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. – కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (మార్గోవా, గోవా ) మేం గన్నా అంటే.. వారు జిన్నా అంటారు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ తమ కుటుంబాల కోసమే జీవిస్తున్నాయి. మేము జాతీయవాదం మాట్లాడితే వాళ్లు కులాల ప్రస్తావన తెస్తారు. మేము అభివృద్ధి అంటే మతం ఊసెత్తుతారు. నేను గన్నా (చెరుకు)పై మాట్లాడితే జిన్నా గురించి మాట్లాడతారు. – యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(షాజహన్పూర్, ఉత్తరప్రదేశ్) వాళ్లకు బెయిలు.. మాకు జైలు ఈ రాష్ట్రంలో రైతుల మీదకి కారు పోనిచ్చి నిండు ప్రాణాలు తీసిన వారికి బెయిల్ వస్తుంది. కానీ మా పార్టీలో చిన్న చిన్న నేరాలు చేసిన వారు కూడా జైల్లోనే ఉంటారు. మా పార్టీ ఎంపీ ఆజమ్ ఖాన్ను గేదెలు, మేకలు, పుస్తకాల చోరి ఆరోపణలపై జైల్లో పెట్టి ఇంకా బెయిలివ్వలేదు. – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (రామ్పూర్, ఉత్తరప్రదేశ్) -
సాక్షి కార్టూన్ 12-02-2022
-
కుటుంబ పార్టీలకు ఓటేయొద్దు
ఖాస్గంజ్ : సమాజ్వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారన్నారు. యూపీలోని ఖాస్గంజ్లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటం పేరిట విడదీసేందుకు సమాజ్వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు. ఈసారీ అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలి దశ ఓటింగ్లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటినుంచే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు మొదలు పెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయి’’ అని ఎద్దేవా చేశారు. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. రేషన్ మాఫియాను రూపుమాపారని, కేంద్రం పంపుతున్న ప్రతి గింజా హక్కుదారులకే అందేలా చూస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయలేరన్నారు. అంబేడ్కర్వాదులంతా సమాజ్వాదీలో చేరాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు. విభజించడమే కాంగ్రెస్ పని కులం, ప్రాంతం, మతం ఆధారంగా ప్రజలను విడదీయడం, దోచుకోవడమే కాంగ్రెస్ పనంటూ మోదీ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ బీజేపీకే ఓటేస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క కుమాయున్ ప్రాంతంలోనే ఏకంగా రూ.17 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన పర్వతమాల, వైబ్రంట్ విలేజీ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయాలు మరింత విస్తరించి, టూరిజం పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. -
మేజిస్ట్రేట్ స్టిక్కర్తో ఉన్న కారులో ఈవీఎం!
లక్నో : యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, ఓటింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం నంబర్ ప్లేట్ లేని ఓ కారులో ఈవీఎం యంత్రం కనిపించడం వివాదాస్పదంగా మారింది. యూపీలోని కైరానా వద్ద షామ్లీ-పానిపట్ హైవేపై నంబర్ ప్లేట్ లేని కారులో ఈవీఎం యంత్రాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలు గుర్తించారు. సదరు కారు కైరానా జోనల్ మేజిస్ట్రేట్ స్టిక్కర్తో ఉండటంతో ఎస్పీ నేతలు ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ కారులోని ఈవీఎంను తెరిచి పరిశీలించారు. ఈ క్రమంలో ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ అంగీకరించారు. దీంతో ఎస్పీ నేతలు ఈ పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షామిలీ జిల్లా మేజిస్ట్రేట్ జస్మీత్ కౌర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జోనల్ మేజిస్ట్రేట్ కారులో ఈవీఎం యంత్రం ఉండటం నిజమేనన్నారు. అయితే కారు డ్రైవర్ భోజనం చేయడానికి వెళ్లిన సమయంలోనే ఈవీఎంను కారులో పెడుతున్న విషయాన్ని తాము గమనించామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. UP के कैराना में सपा-रालोद प्रत्याशी नाहिद हसन की बहन इकरा ने आधी रात को बिना नम्बर की गाड़ी में जा रहीं कुछ EVM पकड़ीं, प्रशासन ने कहा- ये रिजर्व EVM थीं. पहले चरण में कैराना में सबसे ज्यादा 75% वोट पड़े हैं. Video: @sachingupta787pic.twitter.com/ElEFUFsOJ9 — Swati Mishra (@swati_mishr) February 11, 2022 -
యూపీలో సంచలనం.. ఆయన ఫామ్ హౌస్ వద్ద యువతి మృతదేహం..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో గురువారం నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాన్పూర్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బును అధికారులు సీజ్ చేసిన ఘటన మరువక ముందే మరో వార్త దుమారం రేపుతోంది. యూపీ మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం దగ్గరలో గురువారం కుళ్లిపోయిన స్థితిలో మెడ కోసి ఉన్న ఓ యువతి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఉన్నావ్ ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్లో యువతి(22) కనిపించడంలేదంటూ డిసెంబర్ 8వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిసెంబర్ 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఓ వ్యక్తి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ను జనవరి 24న అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు అయితే తాజాగా యువతి మృతదేహాన్ని రాజోల్ సింగ్ ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం యువతి మెడ భాగంగా కట్ చేసి ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలి తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి పాతిపెట్టాడని ఆరోపించారు. వారిపై అనుమానంతోనే తాను ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంత స్థలం తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో తనకు పోలీసులు సహకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తన కుమార్తె బతికుండేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు -
భర్త ఉండగా ఇల్లు దాటలేదు.. ఇప్పుడేమో ఏకంగా సీఎంతో ఢీ.. ఎవరీ సుభావతి?
లక్నో: ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ప్రాంతం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి కంచుకోట. గోరఖ్పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ ఉంటే, సమాజ్వాదీ పార్టీ ఆయనపై ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఒకప్పుడు బీజేపీ సహా వివిధ పార్టీలు మారిన దివంగత నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లాను వ్యూహాత్మకంగా సీఎంపైనే పోటీకి నిలిపింది. ఉపేంద్ర 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గోరఖ్పూర్లో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకి యోగి ఆదిత్యనాథ్కి తరచూ తగాదాలు జరిగేవి. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నా ఎన్నికలు ఆయనకి కలిసి రాలేదు. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఉపేంద్ర గుండెపోటుతో 2020లో మరణించారు. ఆయన భార్య సుభావతి తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్పూర్లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే బీజేపీ నిరాకరించింది. దీంతో సుభావతి కుమారుడితో కలిసి ఎస్పీలో చేరారు. (చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు) ఉపేంద్ర జీవించి ఉండగా సుభావతి ఎప్పుడూ ఇల్లు కదిలి బయటకు రాలేదు. ప్రచారంలో కూడా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుభావతిని యోగి ఆదిత్యనాథ్ వంటి బలమైన అభ్యర్థిపై దింపడానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కి కూడా కొన్ని లెక్కలున్నాయి. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగిపై యూపీలో బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు. గోరఖ్పూర్లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడు ఉపేంద్ర. ఆయన మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సానుభూతి ఓట్లు, ఓబీసీల అండతో పాటుగా బ్రాహ్మణ ఓట్లను కూడా దక్కించుకోవాలన్న వ్యూహంతో అఖిలేశ్ ఆమెను రంగంలోకి దింపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (చదవండి: లతా మంగేష్కర్ మెమోరియల్ రగడ: సేన సెంటిమెంట్ను కెలుకుతున్న బీజేపీ.. లతాజీ సోదరుడి ఫైర్) -
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్పూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి.. పెళ్లి కొడుకు ఏమన్నాడంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాలోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో శామ్లీ, మీరట్, హాపూర్, ముజఫర్ నగర్, ఘజియాబాద్, అలీగడ్, ఆగ్రా, బాఘ్పత్, గౌతమ్ బుద్ధానగర్, మథుర, బులంద్ షహర్ జిల్లాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని ముజ్ఫర్ నగర్లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగింది. అంకుర్ బాల్యన్ అనే వ్యక్తి పెళ్లి నేడు. కొద్ది గంటల్లో తన పెళ్లి ఉన్నప్పటికీ.. ఓటు వేయడం బాధ్యతగా భావించి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందు ఓటు వేయడం ముఖ్యమని తెలిపారు. ఓటు తరువాతే పెళ్లి, భార్య, ఇంకే పనైనా అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి! #WATCH | "Pehle matdaan, uske baad bahu, uske baad sab kaam," says Ankur Balyan, a bridegroom who had come to cast his vote at a polling booth in Muzaffarnagar ahead of his wedding today.#UttarPradeshElections2022 pic.twitter.com/KaYsv5s2Bb — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022 -
యూపీ..కేరళలా మారితే?.. యోగీ వ్యాఖ్యలపై పినరయి విజయన్ గట్టి కౌంటర్
తిరువనంతపురం: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. యూపీ కేరళలాగా మారిపోతుందని యోగి భయపడుతున్నాడని యూపీ సీఎంకు పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా ఉత్తరరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనాలని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే ఉత్తరప్రదేశ్ కూడా మరో కశ్మీర్, బెంగాల్, కేరళల మారుతుందని హెచ్చరించారు. చదవండి: యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్ తాజాగా యోగి వ్యాఖ్యలపై కేరళ సీఎం తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ‘ఒక వేళ యూపీ కేరళలాగా మారితే మంచి విద్య యూపీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని, కులాలు, మతాల పేరుతో హత్యలు జరగవని అన్నారు. ఈ మేరకు ట్విటర్ల్ ‘యూపీ ఒకవేళ కేరళగా మారుతుందని యోగి భయపడుతున్నారు. మంచి విద్య ప్రజలకు దక్కుతుంది. మంచి వైద్యం, సాంఘిక సంక్షేమం అందుబాటులోకి వస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరగవుతాయి. మత సామరస్యం పెరుగుతుంది. ఒకరినొకరు మతాల పేరుతో చంపుకోరు. ఇదే యూపీ ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ సీఎం పినరయ్ విజయన్ ట్వీట్ చేశారు. చదవండి: ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ -
యోగి ఆదిత్యనాథ్పై మహిళ పోటీ.. ఆమే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరీ శుభావతి? దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్పూర్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్పూర్లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్వాదీ పార్టీలో చేరారు. బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ) సానుభూతి పనిచేస్తుందా? సీఎం యోగిపై శుభావతిని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్పూర్లోనే కాకుండా పూర్వాంచల్లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆసక్తికర పోటీ చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్లో సమాజ్వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్కు గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు) -
యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. కాగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ 3న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్ మిశ్రా తన కారును పొనిచ్చాడని ఇటీవలే కమిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్పటికీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఓటర్లు జాగ్రత్తా! ఐదేళ్ల శ్రమకు మీ ఓటే దీవెన!
న్యూఢిల్లీ: 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన పశ్చిమ ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆదిత్యానాథ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ....ఓటర్లను ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఈ ఐదేళ్లో చాలా అద్భుతాలు జరిగాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ ఐదేళ్ల శ్రమ వృద్ధా అయిపోతుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్గా మారిపోతుందన్నారు. అంతేకాదు ఈ ఐదేళ్ల శ్రమకు మీ ఓటు తనకు దీవెన మాత్రమే కాక మీ నిర్భయ జీవితానికి భరోసాగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు మీరు అతిపెద్ద నిర్ణయం తీసుకునే సయం ఆసన్నమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అంకితభావం, నిబద్ధతో పనిచేసిన విధానాన్ని మీరు కళ్లరా చూశారని అన్నారు. ఈ మేరకు యోగిఆదిత్యానాథ్ యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చే నిమిత్తం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్న సంగతి తెలిసిందే. मतदान करें, अवश्य करें ! आपका एक वोट उत्तर प्रदेश का भविष्य तय करेगा। नहीं तो उत्तर प्रदेश को कश्मीर, केरल और बंगाल बनते देर नहीं लगेगी: मुख्यमंत्री श्री @myogiadityanath pic.twitter.com/03VUlXOY35 — BJP Uttar Pradesh (@BJP4UP) February 9, 2022 (చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!) -
యూపీ: 25 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండో దశలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 584 మంది పోటీపడుతుండగా... వీరిలో 25 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా యని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్సు తెలిపింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా.. వీరిలో 35 మందిపై (67 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. కాంగ్రెస్ తరఫున రంగంలో నిలిచిన 54 మందిలో 23 మందిపై కేసులున్నాయని, బీఎస్పీ నిలబెట్టిన 55 మంది అభ్యర్థుల్లో 20 మంది కేసులను ఎదుర్కొంటున్నారని వివరించింది. -
కమలానికి కఠిన పరీక్ష.. దేశంలో తగ్గుతున్న బీజేపీ పట్టు!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్.. అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది. పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 19 రాజ్యసభ స్థానాలపై.. ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్లో 7, ఉత్తరాఖండ్లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది. రాష్ట్రపతి ఎన్నికలపై .. ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్గానే మారాయి. వచ్చే లోక్సభ ఎన్నికలపై .. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ –ఆర్ఎల్డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు. తదుపరి నాయకత్వం పైనా... బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. 2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా.. రాష్ట్రాలపై పట్టు ... 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది. ఆ ప్రభావం 2019 లోక్సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ ఆరుగురు మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
UP Assembly Elections 2022: 2013 ముజఫర్నగర్ హింసాత్మక ఘటనలతో జాట్లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి.. 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్ విక్టరీ సాధించింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఓటమి ఆందోళనకు కారణాలు.. ►పశ్చిమ యూపీ రీజియన్.. చెరుకు పంటకు ఫేమస్. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ►జాట్ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. ►జాట్లలో పట్టున్న రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం. ►గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది. ►కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి. ►సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్నగర్, బాగ్పత్, మేరఠ్, గాజియాబాద్, హాపుఢ్, గౌతమబుద్ధనగర్, బులంద్షెహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంబంధిత వార్త: నామినేషన్లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై.. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ పూర్తి
-
వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే... యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు... గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు... వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్కుమార్ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు. హెడ్లైన్ల కోసం పాకులాడట్లేదు... నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో! దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం... దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి. నెహ్రూపై విమర్శలు సబబే... నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో! దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు.. నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం. ఎన్నికలు మాకు నిత్య పాఠాలు.. ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం. -
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు, దాంతో
అమేథీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అమేథీ బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్పై ఆయన మొదటి భార్య, ఆ పార్టికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్ బుధవారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు! ఏమనో తెలుసా? ఎన్నికల అఫిడవిట్లో భార్యగా తన పేరు రాయలేదని! రెండో భార్య అమితా సింగ్ పేరు రాశారని! దీనిపై ఆర్వోకు రాతపూర్వకంగా అభ్యంతరం వెలిబుచ్చినట్టు చెప్పారామె. తన హక్కు కోసం పోరాడేందుకే భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అని అడగ్గా, ‘‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా’’ అని చెప్పారు. సంజయ్సింగ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అమేథీ టికెట్ కోసం ఆయన భార్యలిద్దరూ పోటీ పడగా వారిని కాదని సంజయ్కి పార్టీ అవకాశమిచ్చింది. -
మొదట రైతులం! తర్వాతే హిందువులం!!
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నేడు జరగనుంది. ఏడు విడతల ఎన్నికల్లో మొదట 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కీలకం కానుంది. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని అన్ని కులాల, మతాల రైతులను దగ్గర చేసింది. మొదట రైతులం, తర్వాతే ఇంకేదైనా అనేట్టుగా చేయగలిగింది. ఆర్థికంగా మెరుగవ్వడం అన్న ఒక్క ఆలోచన మీదే వారి ఐక్యత సాగుతోంది. మూడు సాగు చట్టాల రద్దు తర్వాత కూడా సంయుక్త కిసాన్ మోర్చా తన ఆందోళనను కొనసాగిస్తోంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది వీరి డిమాండ్లలో ప్రధానమైనది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతులు తమకు ఏ విధంగా ఓటు వేస్తారు? భారతీయ జనతాపార్టీని ప్రస్తుతం అమితంగా వ్యాకులతకు గురిచేస్తున్న అంతర్లోచన ఇది. సంకేతాలేమీ బాగోలేవు. తాజా బడ్జెట్ కూడా ఆ సంకేతాలను మెరుగుపరిచేదేమీ కాదు. రైతుల ఆగ్రహ జ్వాలలూ ఇప్పట్లో చల్లారేలా లేవు. దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందనే విషయాన్ని ఎత్తిచూపేందుకు గానూ ఇటీవల వారు ‘విశ్వాస ఘాతుక దినం’ కూడా పాటించారు. బహుశా బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్టాల్లో మరీ ఎక్కువ సీట్లు కోల్పోకూడదన్నంత వరకే తన ఆశను పరిమితం చేసుకుని ఉండాలి. రైతులు తీవ్ర నిరసనతో తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రద్దు చేశాం కాబట్టి తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మవచ్చు. కానీ ఆ లెక్క తప్పేలా ఉంది. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని మోదీ కానుకగా ముద్రవేయడానికి బీజేపీ ప్రయత్నిం చింది. అయితే ఇందులో మోదీ తమకు చేసిందేమీ లేదని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి దీర్ఘకాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న ‘ట్రోఫీ’గా మాత్రమే ఈ రద్దును రైతులు పరిగణిస్తున్నారు. నలభైకి పైగా రైతు సంఘాల సమష్టి నాయకత్వంతో రైతుల ఉద్యమాన్ని నడిపించిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేయం) సాగు చట్టాల రద్దు తర్వాత కూడా నేటికింకా ఆందోళనను కొనసా గిస్తూనే ఉంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది ఎస్కేయం డిమాండ్లలో ప్రధానమైనది. ‘ఏ పార్టీకైనా ఓటు వెయ్యండి కానీ, బీజేపీకి మాత్రం వేయకం’డని అది ప్రజలను కోరుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ విజయం సాధిస్తే కనుక రద్దు చేసిన సాగు చట్టాలను వేరే రూపంలో తిరిగి పునరుద్ధరిస్తారన్న భయం రైతులలో స్పష్టంగా కనిపిస్తోంది. మోదీని వారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన వ్యక్తిగా మాత్రమే చూడగలుగుతున్నారు. ఈ పరిస్థితి మోదీ, బీజేపీల స్వయంకృతమే. ఎండనక, వాననక, చలికి వణుకుతూ, కరోనా బారిన పడుతూ ఏడాది పాటు నిర్విరా మంగా రైతులు ఢిల్లీ శివారు వీధులలో సాగు చట్టాలకు నిరసనగా ఏకబిగిన ప్రదర్శనలు జరిపారు. వీధుల్లోనే వండుకున్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు వీధుల్లోనే పడకేశారు. ఈ మహోద్యమ కాలంలో 700 మంది వరకు అనారోగ్యంతో, వాతావరణ అననుకూలతతో కన్ను మూశారు. వాళ్లను ఆందోళన జీవులనీ, అలవాటుగా ఆందోళన చేస్తు న్నవారనీ, వాళ్లది ధిక్కార ప్రదర్శన కనుక ఏ విధంగానూ పట్టించు కోనవసరం లేదనీ మోదీ విమర్శించారు. ఆ చేదు అలా రైతుల గుండెల్లో ఉండిపోయింది. జనవరి 5న పంజాబ్లోని ఫిరోజ్పూర్ పర్యటనలో భద్రత లోపాలను చూపి ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా పాలకులకు, రైతులకు మధ్య సంబంధాలను మరింతగా క్షీణింపజేసింది. గత అక్టోబరులో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలోని టికూనియా వద్ద నిరసనకారులపైకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని నడిపి నలుగురు రైతుల దుర్మరణానికి కారణం అవడం కూడా రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తోంది. యూపీలో తనకు మాత్రమే ప్రత్యేకమనుకున్న హిందుత్వను అస్త్రంగా చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం జాట్లకూ, ముస్లింలకూ మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్ని తవ్వి బయటికి తీస్తోంది. నాటి మత కలహాలలో 60 మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది 29న హోంశాఖ మంత్రి అమిత్షా ముజఫర్నగర్లో జాట్లు ఉండే ప్రాంతాలలో ఇల్లిల్లూ తిరిగి... ‘ఆనాటి అల్లర్లను మీరు మర్చిపోయారా?’ అని జాట్ ఓటర్లను ప్రశ్నించి పాత గాయాలను గుర్తు చేశారు. దీనిని బట్టి ఓటర్లకు బీజేపీ ఏం చెప్పదలచుకుందో స్పష్టంగానే అర్థమౌతోంది. ‘మొదట మీరు హిందువులు. ఆ తర్వాతే రైతులు’ అని చెప్పడం ఆ పార్టీ ఉద్దేశం. ఆ మాటతో కొంతమంది జాట్ల పట్టును సాధించగలిగింది కానీ... ఉద్యమంలో ఉన్న జాట్ రైతులు మాత్రం... ‘మొదట మేము రైతులం. ఆ తర్వాతే జాట్లం’ అంటున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి.) అధ్యక్షుడు జయంత్ చౌధురి మాటల్లో కూడా ఇదే అర్థం ధ్వనించింది. ఆర్.ఎల్.డి. రైతు ఉద్యమా నికి సంఘీభావం ప్రకటించడంతో పశ్చిమ యూపీలోని జాట్లు జయంత్ చౌధురితో ఉన్నారు. ఆయన పార్టీకి సమాజ్వాది పార్టీతో పొత్తు ఉంది. ఆ పొత్తును రద్దు చేసుకుని తమతో చేయి కలపమని బీజేపీ కోరినప్పుడు జాట్లను తను జాట్లుగా కాక రైతులుగా మాత్రమే చూస్తున్నానని జయంత్ చౌధురి అన్నారు. ఢిల్లీలో జనవరి 26న అమిత్ షా కొంతమంది జాట్ నాయకులతో సమావేశ మైనప్పుడు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జయంత్ చౌధురిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. కానీ ఆయన తగని ఇంటిని ఎంచుకున్నారు. అయితే ఆయన కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి’’ అని అన్నారు. చౌధురి అందుకు స్పందిస్తూ.. ‘‘నన్ను మీ ఇంటికి రమ్మని అడగటం కాదు... మీరు కూల్చేసిన 700 మందికి పైగా రైతుల కుటుంబాల వాళ్లను రమ్మని ఆహ్వానించండి’’ అని ట్వీట్ చేశారు. పశ్చిమ యూపీలో బీజేపీపై అసంతృప్తి, ఆగ్రహం ఉన్న జాట్ కులస్థులు, ఇతర కులాల్లోని రైతులు చౌధురికి మద్దతుగా ఉన్నారు. ‘మొదట రైతులం, తర్వాతే హిందువులం’ అని ఇప్పుడు చెబుతున్న వీళ్లంతా 2014, 2017, 2019 ఎన్నికల్లో ‘మొదట హిందువులం, తర్వాతే రైతులం’ అని బీజేపీకి ఓటు వేసినవారే. కానీ 2022లో మత విశ్వాసాలకన్నా, ఆర్థిక అవసరాలే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కారణంతోనే ముస్లిం రైతులు కూడా రాష్ట్రీయ లోక్ దళ్కు మద్దతు ఇస్తున్నారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని హిందూ, ముస్లిం రైతులను దగ్గర చేసింది. ముజఫర్నగర్లో ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన మహాపంచాయత్కు రెండు మతాల రైతులూ హాజరయ్యారు. ‘హర హర మహాదేవ్’, ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలతో మతసామరస్యం మిన్నంటింది. రైతు ఉద్యమంలో హిందూ, ముస్లింలు కలిసికట్టుగా పాల్గొనడం 2013 నాటి గాయాల్ని మాన్పగలిగింది. ఇప్పుడు వాళ్ల ఆలోచన ఒక్కటే. ఆర్థికంగా మెరుగవ్వాలి. ఈ ఆలోచనే తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితా లను ఇవ్వబోతోంది. రైతుల ఆర్థిక ఇబ్బందులు హిందువుల మత విశ్వాసాలను కూడా రెండోస్థానంలోకి తీసుకెళ్లాయి. హిందువులు గోవును మాతగా పూజిస్తారని అంటూ యోగి ప్రభుత్వం గోవిక్రయా లను, గోవధను నిషేధించింది. అయితే రాష్ట్రంలోని రైతులు, వాళ్లలో హిందువులు అయినవాళ్లు కూడా పోషణ లేక ఆకలితో అలమటిస్తున్న ఆవులు, ఎద్దులు తమ పంటలను తినేస్తుండటంలో ప్రభుత్వ నిషేధ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతు ఉద్యమంలో భాగస్వాములైన రైతు సంఘాలలో కొన్ని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో తలపడుతుండటం వెనుక ఉన్నవి కేవలం రైతు ప్రయోజనాలే తప్ప వేరొకటి కాదు. పంజాబ్లో బీజేపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో హిందూవాదాన్ని కాకుండా, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఈసారి పంజాబ్ ఎన్నికలు రైతుల చుట్టూనే తిరుగుతాయి తప్ప జాతీయ భద్రత అనేది ఒక విషయమే కాదు. అందుకే బీజేపీతో తన రెండు దశాబ్దాల పొత్తును కూడా శిరోమణి అకాలీ దళ్ తెంపేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు తగ్గిపోవడమే అందుకు కారణం. – అరుణ్ సిన్హా జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు -
యూపీ ప్రజలు ఎప్పుడో వాటిని దూరంగా విసిరేశారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునేలా పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్పైనే దృష్టి పెట్టాయని, బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్తో ముందుకెళ్తోందన్నారు. ఇక లఖీంపూర్ ఘటనపై స్పందించిన మోదీ.. యూపీ ప్రభుత్వం విచారణకు సహకరిస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు చదవండి: Hijab Row: ముస్లిం విద్యార్థులకు ప్రియాంక మద్దతు.. బికినీ, జీన్స్, హిజాబ్ ఏదైనా అంటూ.. ‘బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తాం. పాత సిద్ధాంతాలను యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే మా నినాదం.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు.. -
హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ
నిజమే! సామన్యులు ఇప్పడు గళం విప్పడమే గగనమైపోతోంది. పాలకులను పల్లెత్తు మాటన్నామా నిర్బంధమే. మరి ఇప్పుడెలా? రాజ్యం ప్రజలపై బలవంతంగా మోపే బలవంతపు ఫర్మానాలను ప్రశ్నించేవారే లేరా? ఎందుకు లేరు ఉన్నారు? సదాఫ్ జాఫర్, పూజా శుక్లా లాంటి సామాన్య మహిళలు ప్రభుత్వ నిరంకుశ ధోరణులను నిర్భయంగా నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం కారాగార వాసం చేయాల్సి వచ్చినా జంకలేదు, జావగారిపోలేదు! ఆ ధైర్యమే వారికి ఇప్పుడు శాసనకర్తలయ్యే అవకాశాన్ని కల్పించింది. భారతావనిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్టాఫిక్. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తాయనేది సర్వత్రా ఆసక్తికరం. తలపండిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వందిమాగధులకు అవకాశాలే అధికమన్నది కళ్లెదుటే కనబడుతున్న చరిత్ర. ఇంతటి పోటీలోనూ ఇద్దరు (అ)సామాన్య మహిళలు పెద్ద పార్టీల టిక్కెట్లు దక్కించుకోవడం వర్తమాన రాజకీయాల్లో అరుదైన దృశ్యం. ఇంతకీ ఎవరా ఇద్దరు..? సదాఫ్.. శభాష్! ప్రతిష్టాత్మక లక్నో సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశాన్ని నటి, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ దక్కించుకున్నారు. ఆషామాషీగా ఆమెకు ఈ అవకాశం రాలేదు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 2019, డిసెంబర్లో గళమెత్తినందుకు మదమెక్కిన మగ పోలీసు దురహంకారంతో కాలితో ఆమె పొట్టలో తన్నాడు. లక్నోలోని పరివర్తన్ చౌక్ వద్ద ఫేస్బుక్ లైవ్ సెషన్ నిర్వహించిన సదాఫ్ను అవమానవీయ రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నం కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. అంతేకాదు ఆమె ఫోటోలతో పోస్టర్లు వేసి అవమానానికి గురిచేశారు. సదాఫ్ పోరాటం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను విడుదల చేయాలని యూపీ బీజేపీ సర్కారును డిమాండ్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2020, జనవరిలో సదాఫ్కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్తో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. తలపండిన అధికార పార్టీ నాయకుడిని ఢీ కొట్టడానికి భయం లేదా అని అడిగితే.. ‘ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మొదటిసారి పోటీకి దిగినప్పుడు అనామకుడే కదా’అని బదులిచ్చారు సదాఫ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అసలు బలం ప్రజలదేనని, తమకు పాలకులుగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) నల్లజెండా తెచ్చిన అవకాశం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు నల్లజెండాలతో నిరసన తెలిపి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు పూజా శుక్లా. లక్నో నార్త్ నియోజక వర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారామె. 25 ఏళ్ల పూజా శుక్లా.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కులైన అభ్యర్థుల్లో ఒకరు. 2017, జూన్ 7వ తేదీ ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్. హిందీ స్వరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో యూనివర్సిటీ క్యాంపస్కు వెళుతున్న సీఎం యోగికి నల్లజెండాలతో నిరసన తెలపడంతో పూజా శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 20 రోజుల తర్వాత బయటికి వచ్చిన ఆమె సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ను కలిశారు. ఆమె పోరాటానికి ముగ్దుడైన పెద్దాయన పార్టీ విద్యార్థి విభాగం అయిన ‘సమాజ్వాదీ చత్ర సభ’లో శుక్లాకు ప్రముఖ స్థానం కల్పించారు. అయితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపి తనతో పాటు జైలుకెళ్లొచ్చిన వారికి లక్నో యూనివర్శిటీ 2018లో ప్రవేశం నిరాకరించడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి విశ్వవిద్యాలయ పాలకవర్గాన్ని దిగొచ్చేలా చేశారు. (క్లిక్: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు) ఈ పరిస్థితి మారాలి నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్నోలోని క్లాక్టవర్ వద్ద 2020, జనవరిలో మహిళలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలోనూ శుక్లా కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘విద్య పేరుతో యువతను, ముఖ్యంగా విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. రాజకీయంగా అవగాహన ఉన్న విద్యార్థి మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలడు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి, ప్రగతిపథంలో తీసుకెళ్లే సత్తా యువతకు ఉంద’ని శుక్లా అన్నారు. రాజకీయ నాయకురాలిగా కూడా యువత, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్నో నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నీరజ్ బోరాతో పూజా శుక్లా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను యువత, స్థానికుల అండదండలతో విజయం సాధిస్తానని దీమాగా చెబుతున్నారామె. పోరాట నేపథ్యం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సదాఫ్ జాఫర్, పూజా శుక్లాలను యూపీ ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హక్కుల కోసం నిర్భయంగా నినదించిన వీరిద్దరి పోరు పంథా సామాన్యులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు! (చదవండి: ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!) -
బీజేపీ యూపీ ఎన్నికల మేనిఫెస్టో.. వాళ్లకు ఉచిత బస్ పాస్.. విద్యార్థినులకు స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్ పేరుతో ఉన్న ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. రైతులు, యువత, బాలికల సంక్షేమమే ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది. ఐదేళ్లపాటు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని.. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చింది. 15 రోజుల్లో చెరకు బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడతామని, లేకుంటే మిల్లుల నుంచి వడ్డీ వసూలు చేస్తామని తెలిపింది. (చదవండి: హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్) రూ.1500 పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడంతోపాటు వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రాణి లక్ష్మీబాయి యోజన కింద కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువ శశక్తీకరణ్ యోజన కింద యువతకు 2కోట్ల ట్యాబ్లు ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్, మా అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా రాయితీ భోజనం, హోలీ, దిపావళికి పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. లవ్ జిహాద్ చట్టంలో నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పింది. 10 ఏళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తథ్యమని స్పష్టం చేసింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాగా, ఫిబ్రవరి 6నే మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉండగా.. లతా మంగేష్కర్ మృతి చెందడంతో వాయిదా పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. (చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు) -
వాళ్లు వృద్ధి నిరోధకులు
బిజ్నూర్: అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచారని ప్రత్యర్ధులపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అలాంటివారంతా రైతు నేత చౌదరీ చరణ్సింగ్కు వారసులమని తప్పుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆన్లైన్ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా తమ గ్రామాలకు ఎంత మేర విద్యుత్ను అందించారో సమాజ్వాదీ నేతలను ప్రశ్నించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. వీరంతా నకిలీ సమాజ్వాదీలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. యూపీ ఎన్నికల్లో ఆర్ఎల్డీ, ఎస్పీ కూటమి చరణ్ సింగ్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, రైతుల ప్రధాని చరణ్సింగ్కు తామే వారసులమని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకే తమ ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని మోదీ చెప్పారు. ఐదేళ్లలో పంచదార రైతులకు సుమారు 1.5 లక్షలకోట్ల బకాయిలు చెల్లించామని, గత రెండు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాల హయంలో యూరియా బ్లాక్మార్కెట్లో దొరికేదని, తాము అధికారంలోకి వచ్చాక గోరఖ్పూర్ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాల కన్నా రెట్టింపు మోతాదులో యోగి ప్రభుత్వం గోధుమలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో రైతుల జనాభా, అందునా చెరుకు రైతుల హవా అధికం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ప్రధాని తమ ప్రభుత్వాలు చేసిన రైతు ఉపయోగ పనులను గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు సమస్యలను సృష్టించి సానుభూతి రాజకీయాలు చేసేవని, వారి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మోదీ విమర్శించారు. ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. -
ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!
అమేథీ: యూపీలో ఒకప్పటి తమ కంచుకోట అయిన అమేథీ అసెంబ్లీ టికెట్ను బీజేపీ ఫిరాయింపుదారు ఆశిష్ శుక్లాకు ఇచ్చింది కాంగ్రెస్! శుక్లా సోమవారం ఉదయం బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ ఖరారైంది. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజయ్సింగ్ను ఆదివారం ప్రకటించింది! నిజానికి ఆయన భార్యలు అమితా సింగ్, గరిమా సింగ్ ఇద్దరూ బీజేపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరినీ కాదని భర్తకు చాన్స్ దక్కింది. గరిమా సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా అమితా కాంగ్రెస్ తరఫున ఆమెపై పోటీ చేసి ఓడిపోయారు. సంజయ్ 2019లో రాజ్యసభ సీటు వదులుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగా అమితా కూడా ఆయనను అనుసరించారు. ఇక సమాజ్వాదీ తరఫున గ్యాంగ్ రేప్ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, బీఎస్పీ నుంచి రాగిణీ తివారీ బరిలో ఉన్నారు. అమేథీలో ఫిబ్రవరిలో 27న పోలింగ్ జరగనుంది.